వెల్దండ: మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్రావు అన్నారు. శనివారం వెల్దండ రైతువేదికలో వాటర్మేన్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ సిబ్బంది, పంచాయతీ కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మంచినీటి సహాయకులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం వాటర్మేన్లకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యపాల్రెడ్డి, గ్రిడ్ ఈఈ సుధాకర్సింగ్, ఏఈలు లలిత, రోహిత్, ప్రతిభ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment