విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి

Published Fri, Sep 27 2024 1:34 AM | Last Updated on Fri, Sep 27 2024 1:34 AM

విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి

నల్లగొండ టూటౌన్‌: ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్‌ చేశారు. విద్యారంగం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం నల్లగొండలోని కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన పోరు దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గాడి తప్పిన విద్యారంగంలో మార్పులు తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన కూడా గాడి తప్పిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల పాఠశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో తగిన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పేదలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్‌, ఖమ్మంపాటి శంకర్‌, కుంచం కావ్య, స్పందన, కుర్ర సైదానాయక్‌, రవీందర్‌, చందు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement