బైక్ను ఢీకొనడంతో ప్రమాదం
తల్లిదండ్రులకు తీవ్రగాయాలు
మైసూరు: ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో దంపతులు, చిన్నపిల్లాడు కిందపడిపోయారు, పిల్లవాడు మరణించగా, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడిన ఘటన మైసూరు ఇలవాల వద్ద జరిగింది. వివరాలు..అభిషేక్, దివ్య దంపతులు మంగళూరు జిల్లా పుత్తూరులో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. కుమారుడు లిఖేష్ (1)ను ఇలవాలలోని అవ్వతాతల వద్ద ఉంచారు. ప్రతి వారాంతంలో నగరానికి వచ్చి బాలుడిని చూసివెళ్లేవారు.
సోమవారం వారు బాలున్ని తీసుకుని బైక్పై బయటకు వెళ్తుండగా వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీకొంది. దీంతో తీవ్ర రక్తస్రావమై బాలుడు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాద దృశ్యం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద అమర్చిన సీసీ టీవీ కెమెరాలో నమోదైంది. ఈ ఘటనపై మైసూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment