బందరు అభివృద్ధితి కృషి | - | Sakshi
Sakshi News home page

బందరు అభివృద్ధితి కృషి

Published Tue, Oct 15 2024 2:30 AM | Last Updated on Tue, Oct 15 2024 8:50 PM

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

మంత్రి కొల్లు రవీంద్ర

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం రాత్రి ఆర్‌ అండ్‌బీ అతిథి గృహంలో ఉపాధి హామీ, మునిసిపల్‌, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో మంత్రి వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. 

బందరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు వచ్చాయన్నారు. మునిసిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ. 10.5 కోట్లు రాగా.. ఆ నిధులను ఎలా ఖర్చు చేయాలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పల్లె పండుగ కింద రహదారుల నిర్మాణానికి రూ. 21 కోట్లు మేరకు పనులు మొదలయ్యాయన్నారు. మరో రూ. 10.5 కోట్లతో గ్రామాల్లో సిమెంటు రహదారులు, గుంతల రహదారులను పూడ్చి అభివృద్ధి పరుస్తామన్నారు. 

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయని వీటిని ఎలా వినియోగించాలనే విషయంలో ఎంపీడీవోకు దిశా నిర్ధేశం చేశామన్నారు. ఇది కాక జిల్లా ఖనిజాల నిధులు (డీఎంఎఫ్‌)దాదాపు రూ. 20 కోట్లు ఉందని ఆ నిధుల వినియోగానికి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పామన్నారు. సమావేశంలో డ్వామా పీడీ శివప్రసాద్‌, మునిసిపల్‌ కమిషనర్‌ బాపిరాజు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ లోకేష్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రమణరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement