రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
శంకర్పల్లి: ఓ వాహనం అతివేగం.. విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మరో విద్యార్థిని ఆస్పత్రి పాలు చేసింది. రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం శేరిగూడ గ్రామానికి చెందిన భరత్ కుమార్ (15), చరణ్ శంకర్పల్లి పట్టణంలోని శ్రీ వివేకానంద పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. శనివారం ప్రత్యేక తరగతులు ముగించుకోని బైక్ మీద ఇంటికి వెళ్తున్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్ శివారులో ఉండగా.. ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న విద్యార్థుల బైక్ అదుపు తప్పింది. దీంతో వారు కారుని బలంగా ఢీ కొట్టడంతో బైక్ నడుపుతున్న భరత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న చరణ్కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో విద్యార్థికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment