కొండాపూర్(సంగారెడ్డి): ఫ్రాన్స్లోని లియాన్లో జరిగిన వరల్డ్ స్కిల్స్లో సంగారెడ్డి జిల్లా మెరిసింది. కొండాపూర్ మండలం గిర్మాపూర్కు చెందిన అశ్విత బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డుతో పాటు కాంస్య పతకం గెలుచుకున్నారు. మంగళవారం తన స్వగ్రామమైన గిర్మాపూర్కు రావడంతో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మారుమూల గ్రామం నుంచి ప్రపంచ స్థాయిలో ప్రాతినిథ్యం వహించడమే కాకుండా అవా ర్డు సాధించడం సంతోషంగా ఉందన్నారు. విజేత అశ్విత మాట్లాడుతూ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యానికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. తనకు స్వీట్లు అంటే ఎంతో ఇష్టమని, ఆ ఇష్టమే నన్ను పాక శాస్త్రం వైపు మళ్లించేందుకు దోహదపడిందన్నారు. క్రమంగా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు బెంగళూరులో మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అశ్విత భారతదేశం నుంచి అత్యుత్తమ పోటీదారిగా పాక శాస్త్రంలో నైపుణ్యాన్ని ప్రదర్శించి బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డు గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment