డీఈఓల గైర్హాజరుపై ఎమ్మెల్సీ పర్వతనేని ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

డీఈఓల గైర్హాజరుపై ఎమ్మెల్సీ పర్వతనేని ఆగ్రహం

Published Sat, Sep 7 2024 1:56 AM | Last Updated on Sat, Sep 7 2024 1:56 AM

డీఈఓల గైర్హాజరుపై ఎమ్మెల్సీ పర్వతనేని ఆగ్రహం

మూడు జిల్లాలకు సంబంధించి చర్చ జరుగుతుంటే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల విద్యాశాఖాధికారులు సమావేశానికి రాకపోవడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో టీచర్ల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా సర్దుబాటు చేయడం సరికాదని ఆక్షేపించారు. అంతేకాకుండా స్టూడెంట్స్‌ నమోదు డేటాను తప్పుగా చూపి వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో అధికారులు కొందరికి మేలు కలిగేలా చక్రం తిప్పారని ఆరోపించారు. అలాగే, బైజుస్‌ ట్యాబుల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలోని స్కూళ్లలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లలో 144 ప్లాంట్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement