చెంచయ్య మృతిపై పోస్టుమార్టం నివేదిక ఇవ్వండి
● సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నాయుడుపేటటౌన్: పెళ్లకూరు మండలం చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన బండి చెంచయ్య అనుమానాస్పద మృతిపై వైద్యుల బృందంతో పరిశీలన చేసి, పక్కాగా పోస్టుమార్టం నివేదికను ఇవ్వాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళతో సంజీవయ్య మాట్లాడారు. మృతుని కుటుంబ సభ్యులు చెంచయ్యను కక్షపూరితంగానే హత్య చేసినట్లు చెబుతున్నట్లు తెలిపారు. చెంచయ్య మృతికి సంబంధించిన కారణాలను క్షుణంగా తెలుసుకోవాలని వైద్యులకు సూచించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోస్టుమార్టంలో మృతికి గల కాణాలను తెలుసుకుని నిగ్గు తేల్చాలన్నారు. అలాగే పోలీసులు కూడా పక్కాగా దర్యాప్తు చేసి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నాలుగు రోజులు కిందట కామిరెడ్డి సత్యనారాయణ ఇంటి వద్దకు రాత్రి సమయాల్లో మారణాయుధాలతో వచ్చి దుర్మార్గంగా వ్యవహరించి, చంపేందుకు వచ్చిన టీడీపీ వారిపై హత్య నేరం కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును సంజీవయ్య తీవ్రంగా ఖండించారు. తమ పార్టీకి చెందిన వ్యక్తి మృతికి సంబంధించి నిజాలను వెలికితీయాలని సంజీవయ్య డిమాండ్ చేశారు. నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల వద్ద మాజీ ఎమ్మెల్యేతో పా టు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్రెడ్డి, ఎంపీపీలు ధనలక్ష్మి, శేఖర్రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు ఒట్టూరు కిషోర్ యాదవ్, బైనా మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి, చదలవాడ కుమార్, పాదర్తి హరినాథ్ రెడ్డి, కింగ్స్వే జిలానీ, పేర్నాటి రాహుల్, మీజూరు బాల, నిడిగింటి చిట్టిబాబు, ముత్యాలరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment