-
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్పై కోటంరెడ్డి దాడి చేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని ప్రొఫెసర్ వసుంధర అన్నారు. డోలేంద్రపై దాడి చేసిన అనంతరం తనను, మరో మహిళను కోటంరెడ్డి కారులో ఎత్తుకెళ్లాడని తెలిపారు.సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మోసానికి, కపటానికి ప్యాంటు, షర్టు వేసి చేతిలో బీరు బాటిల్ పెడితే అతడే కోటంరెడ్డి అని.. కోటంరెడ్డి పైకి మాత్రం వేదాలు వల్లిస్తాడంటూ మండిపడ్డారు.‘‘కోటంరెడ్డి సోదరులు నియోజకవర్గంలో అనేక దందాలకు, అరాచకాలకు పాల్పడ్డారు. ఎంపీడీఓ సరళపై దాడికి పాల్పడి, ఆ దాడి నేనే చేయించానని కోటంరెడ్డి ఫోన్ చేసి మరీ ఆమెకు చెప్పారు. తిరుమల నాయుడు సహా అనేక మందిపై దాడులు జరిపారు. కోటంరెడ్డి లాంటి నీచుడికి ఓటు వేయొద్దు’’ అని వసుంధర పేర్కొన్నారు.‘‘రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దుకాణాల వరకూ మామూళ్లు వసూలు చేశారు. మహిళల జీవితాలను నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు ఉంది. నెల్లూరు రూరల్ ప్రజలంతా ఆదాలకు ఓటు వేయాలి’ అని వసుంధర విజ్ఞప్తి చేశారు. -
AP: డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రైతులు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డీబీటీలపై వాదనలు ముగియగా, తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.కాగా, నిధుల విడుదలకు నిరాకరించిన ఈసీ.. పోలింగ్ తర్వాత నిధుల విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. కోడ్ వచ్చాక కొనసాగుతున్న పథకాలైనా, కొత్త పథకాలైన ఒక్కటే.. కోడ్ వచ్చాక నిధులు విడుదల చేస్తే ఓటర్లపై ప్రభావం ఉంటుందని ఈసీ తెలిపింది.అయితే, ఇప్పటివరకు వేర్వేరు రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ కంటే ముందు అమల్లో ఉన్న అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయన్న పిటిషనర్లు.. ఒక్క ఆంధ్రప్రదేశ్లో విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. -
AP: భారీగా మద్యం స్వాధీనం.. టీడీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీ ఎన్నికల వేళ టీడీపీ పార్టీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, భారీగా మద్యం పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల నుంచి సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సెబ్ అధికారులు. తిరువూరు జిల్లాలో 21 సంచుల్లో 4200 మద్యం బాటిల్స్ను పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నేతలు తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మోదుగు వెంకటేశ్వరరావు, షేక్ షాహిన్ పాషా, జీనుగు అశోక్ను అరెస్ట్ చేశారు. -
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలశౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలశౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
జి.కొండూరు: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ సహనం కోల్పోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి సౌమ్యుడిగా కలరింగ్ ఇచ్చే వసంత, తన అసలు నైజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో వసంత తన ఎన్నికల ప్రచారాల్లో బూతు పురాణం అందుకుంటున్నారు. గత ఐదేళ్ల పాటు తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై సగటు మనిషి వినలేని భాషలో బూతు పురాణాన్ని వండివార్చిన వసంత, నేడు మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వసంత మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.బ్లేడు బ్యాచ్ అంటూ...వసంత వెంకటకృష్ణప్రసాద్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా వైఎస్సార్ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి నైతికంగా మద్దతిచ్చేందుకు వచ్చిన నాయకులను బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సర్నాల తిరుపతిరావుని ఉద్దేశించి గంగిరెద్దు, కుక్కిన పేను అంటూ వసంత చేసిన అవమానకర వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్నే రేపాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో రంగులు మార్చే ఊసరవెల్లిలా మీరు పార్టీలు మారుస్తున్నట్ల బయట చర్చ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వసంత మాట్లాడిన బూతు పురాణం విని పక్కనే ఉన్న ఆయన అనుచరులే విస్తుపోయారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ తిరుపతిరావుకి పెరుగుతున్న గ్రాఫ్తో పాటు సొంత పార్టీలో ఉన్న వర్గపోరు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డంపు చేసిన మద్యం, నగదు పట్టబడడంతో ఓటమి ఖాయమని భావించి సహనం కోల్పోతున్నాడు.ఏం చేస్తాడో స్పష్టత లేదు...మైలవరం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. ఐదేళ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వసంత, నేడు మరలా పార్టీ మార్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నియోజకవర్గానికి తానేమి చేస్తాడో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం వైఎస్సార్ సీపీ నాయకులు, సర్నాల తిరుపతిరావు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడటం మినహా ఎటువంటి హామీలను ఇవ్వలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వసంత మాట్లాడుతున్న బూతు పురాణం వింటున్న స్థానిక ప్రజలే కాకుండా ఆయన పక్కన ఉంటున్న సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైనం గంగిరెద్దు, కుక్కినపేను అంటూ సర్నాలపై ఇప్పటికే అవమానకర వ్యాఖ్యలు ఐదేళ్లు దేవినేని ఉమాపై వినలేని భాషలో బూతు పురాణం ఓటమి ఖాయమనే భావనతో వసంత సహనం కోల్పోతున్నారని చర్చ -
జగన్ను గెలిపించేందుకు నాయీ బ్రాహ్మణులు సిద్ధం
నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రాకర్ల వేణుబాబు పామర్రు: ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల పూర్తి మద్దతు జగన్మోహన్రెడ్డికే అని ఆయన్ని మళ్లీ సీఎంను చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రాకర్ల వేణుబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పామర్రులోని వైఎస్సార్ సీపీ ఎన్నికల కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా సమాజంలో గుర్తింపు ఇచ్చిన జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటారన్నారు. టీటీడీ బోర్డు డైరెక్టర్ పదవి ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో నాయీ బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చే విధంగా జీవో నం. 50ను విడుదల చేసి సామాజిక భద్రతను కల్పిస్తూ మా గౌరవాన్ని పెంచారన్నారు. దేవాలయాల్లో క్షరకులను ఎండోమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్, మార్కెట్ యార్డు చైర్మన్లు, డైరెక్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీ ఇలా అనేక నామినేటెడ్ పదవుల్లో నాయీ బ్రాహ్మణులకు జగన్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు తోకను కత్తిరిస్తాం.. గతంలో చంద్రబాబు నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి తోకలు కత్తిరిస్తామని అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనికి ప్రతి నాయీ బ్రాహ్మణుడు రానున్న ఎన్నికల్లో బాబు తోకను కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రవేశపెట్టింది మానిఫెస్టో కాదు, మనీ ఫెస్టో అని ఇది ఆమోద యోగ్యం కాకపోవడంతో పీఎం మోదీ దాన్ని అంగీకరించలేదని పేర్కొన్నారు. బీసీలకు మంచి చేసింది జగన్మోహన్రెడ్డి మాత్రమే అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావును, పామర్రు అసెంబ్లీ అభ్యర్తి కై లే అనిల్కుమార్ను గెలిపించాలని, దానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కోరిమిల్లి నాగమురళి, బయవరపు దుర్గా ప్రసాద్, ఆముదాలపల్లి సుబ్రమణ్యం, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. -
యార్డులో 70 ,776 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 57,850 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 70,776 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ. 18,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 42,624 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. -
తొలిరోజు 90 శాతం హోం ఓటింగ్ పూర్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో హోం ఓటింగ్ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు 90 శాతం పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దే అధికారులు పోలింగ్ నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పట మట పీఅండ్టీ కాలనీలో హోం ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ బి.హెచ్.భవానీశంకర్తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం 85 ఏళ్లు నిండిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు హోం ఓటింగ్ సదుపాయం కల్పించిందన్నారు. హోం ఓటింగ్కు జిల్లాలో 1,052 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 651 మంది వృద్ధులు, 401 మంది దివ్యాంగులు ఉన్నారని వివరించారు. సెక్టోరల్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వర్, పోలింగ్ బూత్ అధికారి, ఆర్మ్డ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్తో కూడిన బృందం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకే వెళ్లి ఓటు వేయించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 32 బృందాలు హోం ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయని, తొలి రోజు 90 శాతం హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పది శాతాన్ని ఈ నెల తొమ్మిదో తేదీన పూర్తి చేస్తామని తెలిపారు. పోలింగ్ అధికారి వి.నాగేశ్వరరావు, సహాయ పోలింగ్ అధికారి రత్నబాబు, ఓపీఓ బి.రవితేజ, మైక్రో అబ్జర్వర్ ఎ.శివతేజ, బీఎల్వో ఎం.సురేష్తో కూడిన బృందం పటమటలో నిర్వహించిన హోం ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించింది. -
శాంతించిన భానుడు
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా వ్యాప్తంగా ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వడగాడ్పులు, ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోయారు. మంగళవారం భానుడు శాంతించాడు. జిల్లాలోని పలు చోట్ల చిరు జల్లుల నుంచి భారీ వర్షం నమోదైంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో మంగళవారం వాతావరణం చల్లబడింది. విజయవాడ నగరంలో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడ్డాయి. నందిగామలో ఈదురు గాలులతో భారీ వర్షం నమోదైంది. మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. జాతీయ రహదారితో పాటు అంతర్గత రహదారులు నీట మునిగి చెరువులను తలపించాయి. వర్షాకాలం అన్నట్లుగా వాతావరణం మారిపోయింది. నందిగామ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోనూ వర్షం కురిసింది. ఈ వర్షానికి, ఈదురు గాలులకు అక్కడక్కడా మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. తిరువూరు నియోజకవర్గంలో ఈదురు గాలులు వీచాయి. రోలుపడి, చింతలపాడు, తిరువూరులో పిడుగులు పడ్డాయి. 15 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులకు మామిడి కాయలు నేలరా లాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలో స్వల్పంగా గాలులు వీచాయి. జగ్గయ్యపేట నియోజకవ ర్గంలో భారీ గాలులు వీచాయి. చిరు జల్లులు కురిశాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పట్టణంతో పాటు పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నగరంలో ఓ మోస్తరు వర్షం పడింది. ఈ వర్షానికి నగర ప్రజలు సేదతీరారు. ద్రోణి ప్రభావంతో పిడుగులు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నందిగామలో భారీ వర్షం తిరువూరులో పిడుగులతో వర్షం ఈదురు గాలులకు దెబ్బతిన్న మామిడి -
యువత.. నవ జనత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సార్వత్రిక ఎన్నికల్లో నవ ఓటర్లు జోరు చూపడానికి సిద్ధమవుతు న్నారు. యువత బంగరు భవితను లిఖించడానికి మే 13న ఓటు అనే వజ్రాయుధం సంధించడానికి సమా యత్తమవుతున్నారు. సమాజాన్ని మార్చే శక్తి ఓటుకు, దేశాన్ని మార్చే బలం యువతకు ఉంది. నవభారత నిర్మాణం యువత చేతిలోని వజ్రాయుధంతోనే సాధ్యమవుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తొలి ఓటు వేయడానికి నవ ఓటర్లు రెడీగా ఉన్నారు. ఏడు నెలల ముందు నుంచే.. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలతో ఏడు నెలల ముందు నుంచే ఓటరు నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న యువత బీఎల్వోలు, ఆన్లైన్ ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఇప్పటికే తుది జాబితా విడుద లైంది. అనేక మందికి ఓటరు కార్డులు ఇప్పటికే జారీ అయ్యాయి. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత మే 13వ తేదీన జరిగే పోలింగ్లో తమ వజ్రాయుధంతో తీర్పును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి చేసిన, చేస్తాడనే నమ్మకం ఉన్న నాయకుడినే ఎన్నుకుంటామని, మాయమాటలతో హామీలు ఇచ్చి మోసాలు చేసే నేతలకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. 18 నుంచి 19 ఏళ్లలోపు ఓటర్లు.. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఈ ఏప్రిల్ 27న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 17,04,077 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 8,30,499, మహిళలు 8,73,427 మంది, ఇతరులు 151 మంది ఉన్నారు. తొలి సారిగా ఓటు హక్కు దక్కించుకున్న 18 నుంచి 19 ఏళ్ల మధ్య యువత 43,053 మంది ఉన్నారు. ఇందులో యువకులు 23,127 మంది, యువతులు 19,926 మంది ఉన్నారు. మోసకారి నేతలకు బుద్ధి చెప్పాలని.. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించే నాయకులను వద్దంటోంది యువత. ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలనెలా నిరుద్యోగ భృతి పేరుతో నమ్మించి వంచించిన ఆ నాయకుడు వస్తే తమ బతుకులు మళ్లీ అంధకారంలోకి వెళ్తాయని ఆందోళన చెందుతోంది. వారసులు, అయిన వారికి రాజకీయ ఉపాధి కల్పించి అడ్డదారిలో అసెంబ్లీకి తీసుకెళ్తారు తప్ప తమ బతుకుల గురించి ఆలోచించని వారెందుకని అంటోంది. బంగారు భవితకు బాటలు వేసిన నాయకుడే మళ్లీ రావాలని కోరుకుంటోంది. నియోజకవర్గం యువకులు యువతులు తిరువూరు 2,824 2,286 విజయవాడ వెస్ట్ 2,870 2,495 విజయవాడ సెంట్రల్ 3,535 3,290 విజయవాడ తూర్పు 3,517 3,222 మైలవరం 4,219 3,613 నందిగామ 2,938 2,383 జగ్గయ్యపేట 3,224 2,637 మొత్తం 23,127 19,926 మొదటి సారి ఓటుహక్కు పొందిన యువతలో ఉత్సాహం ఎన్టీఆర్ జిల్లాలో 18–19 ఏళ్లలోపు వయసున్న ఓటర్లు 43,053 మంది 13న కొత్తగా ఓటు వేయనున్న కుర్రకారు 18–19 ఏళ్లలోపు ఓటర్ల వివరాలు -
విధులకు హాజరు కాకపోతే క్రమశిక్షణ చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగులు హాజరుకాకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి డి.కె.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వివిధ కారణాలతో కొంత మంది ఉద్యోగులు ఉత్తర్వులను తీసుకోవటం లేదని తెలిపారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలుగా నియమి తులైన వారు తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొన్నారు. వారికి ఎటువంటి మినహాయింపులు ఉండ వని స్పష్టంచేశారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆదేశించారు. -
కలసిన చేతులు.. కలవని మనసులు
జి.కొండూరు: వారిద్దరూ ఐదేళ్లుగా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. సభ్యత మరిచి నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీ నాయకుల య్యారు. వారే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ ఇద్దరూ ఇప్పుడు చేతులు కలిపారు. తమ వర్గం నాయకులను కూడా కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వసంత నామినేషన్ కార్యక్రమంలోనూ కలసి చేతులు ఊపారు. అందరం కలసి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తామంటూ గొప్పలు చెప్పారు. ఇదంతా పైకి కనిపిస్తున్న వ్యవహారం. అంతర్గతంగా మాత్రం రెండు వర్గాలు కలసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. కలసి పనిచేయడం అన్న మాట అటుంచి ఒకరిపై మరొకరు నమ్మకమే ఉంచలేకపోతున్నారు.వెంటాడుతున్న వెన్నుపోటు భయంమైలవరం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి వసంత వెంకటకృష్ణప్రసాద్, టీడీపీ నుంచి దేవినేని ఉమా పోటీ చేశారు. ఉమా ఓటమిపాలవగా వసంత ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత ఎన్నికలు వచ్చేసరికి వసంత కృష్ణప్రసాద్ టీడీపీ గూటికి చేరారు. అతను టీడీపీలో చేరడాన్ని, ఎమ్మెల్యే టికెట్ పొందడాన్ని దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతర పరిణామాల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారిద్దరూ చేతులు కలిపారు. అయితే క్షేత్రస్థాయిలో ఉమా వర్గం, వసంత వర్గం కలసి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. ఉమా వర్గాన్ని వసంత వర్గమే కాదు టీడీపీ కేడర్ కూడా నమ్మలేకపోతోందని సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు కలసి పనిచేస్తున్నట్లు నటిస్తున్నా ఓటు వేసే సమయానికి ఉమా వర్గీయులు వెన్నుపోటు పొడుస్తారనే అనుమానం వసంతను వెంటాడుతోందని పార్టీలో చర్చ జరుగుతోంది.ఉమా వర్గీయులపై నిఘాఉమా వర్గీయులపై నమ్మకం ఉంచలేని వసంత కృష్ణప్రసాద్ తన కంపెనీల్లో పని చేసే రెండు వేల మంది ఉద్యోగులను రంగంలోకి దింపారు. వారితో ఉమా వర్గంపై నిఘా ఉంచారని, అంతటితో ఆగకుండా ప్రచారం నుంచి డబ్బు పంపిణీ వరకు అన్ని పనులు ఆ ఉద్యోగులే చక్కబెట్టేందుకు సిద్ధమ య్యారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. వసంత తీరును జీర్ణించుకోలేని ఉమా వర్గీయులు అతనితో కలిసి పనిచేయలేమని తమ నాయకుడి వద్ద వాపోతున్నారని సమాచారం.మళ్లీ ఇన్చార్జులే దిక్కా?వసంత వెంకటకృష్ణప్రసాద్ స్థానికుడు కాదు. వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. దీంతో మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అస్తిత్వం గందరగోళంలో పడింది. ఒక వైపు ఉమా వర్గీయులు, మరో వైపు ఆయన వ్యతిరేకులు, ఇంకో వైపు వైఎస్సార్ సీపీ నుంచి వసంతతోపాటు టీడీపీలో చేరిన చిన్నాచితకా నాయకుల వర్గంగా టీడీపీ విడిపోయింది. ఈ మూడు వర్గాల పోరుతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎవరిని నమ్మాలో తెలియక, ఎవరికి బాధ్యతలు ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనన్న భయంతో వసంత కృష్ణప్రసాద్ తన కంపెనీల నుంచి ఉద్యోగులను దింపి పెత్తనమంతా వారికే అప్పజెప్పారు. వైఎస్సార్ సీపీలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వసంత, స్థానికులను కాదని మండలానికి ఒక ఇన్చార్జ్ని నియమించి పార్టీలో వర్గ పోరుకు కారణమయ్యారు. ఇప్పుడు టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో వసంత తీరును చూసిన టీడీపీ కేడర్, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మళ్లీ ఇన్చార్జులతోనే పాలన చేస్తాడేమోనని ఆందోళనచెందుతోంది.మద్యం కేసులో ఉమా వర్గీయులు‘సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు కష్టం మాది, కేసులు మాకు, పెత్తనం మీకా?’ అంటూ ఉమా వర్గీయులు కుమిలిపోతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెలంగాణ నుంచి భారీగా మద్యం తరలిస్తూ పట్టుబడిన చేబ్రోలు రాజు, మరో నలుగురు నిందితులు సైతం ఉమా వర్గానికి చెందిన నాయకులే. పట్టుబడిన మద్యంతో తనకు ఎటువంటి సంబంధంలేదని వసంత తప్పుకోవడంతో ఉమా వర్గీయులు మరింత ఆవేదన చెందుతున్నారని సమాచారం. కావాలనే మద్యం రవాణా, పంపిణీ వంటి అసాంఘిక కార్యకాలపాలను తమకు అప్పజెప్పి పెత్తనం మాత్రం వసంత అనుచరులు, ఆయన కంపెనీల ఉద్యోగులు చేస్తున్నారని ఉమా వర్గీయులు రగిలిపోతున్నారు. ఐదేళ్లు తమ నాయకుడికి జరిగిన అవమానంతో పాటు తమకు నియోజకవర్గంలో ఎదురవుతున్న క్షోభకు తగిన బుద్దిచెప్పాలని ఉమా వర్గీయుల్లో చర్చ జరుగుతోందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. -
శిక్షణలో నేర్పించే అంశాలు
● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● బ్రైడల్ మేకప్స్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటీ యేజింగ్ థర్మో హెర్బ్ ఫేషియల్స్ ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ -
చరిత్రహీనుడు చంద్రబాబు
ఉయ్యూరు: చరిత్రహీనుడు చంద్రబాబు అని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఉయ్యూరులో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని 20 వార్డుల్లో వేలాది మందితో రోడ్ షో చేశారు. పార్టీ శ్రేణులు ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేసి అభిమానాన్ని చాటారు. జోహార్ వైఎస్సార్, జై జగన్, జోగి రమేష్ నాయకత్వం వర్థిల్లాలి నినాదాలతో ఉయ్యూరు పట్టణం మార్మోగింది. రోడ్షో దారి పొడవునా గజమాలలు, పూల వర్షం, హారతులతో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లూ వేయాలని మంత్రి జోగి రమేష్ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన సభల్లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి కుట్రలు ఎవరూ నమ్మరని తెలిపారు. మంచి చేసే జగనన్నపై విషం చిమ్మాలని చూస్తే తరిమికొడతారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించిన చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటుదారుడు చంద్రబాబును నమ్మి ఎవరు నడిచినా నట్టేట మునిగిపోవటమేనని తెలిపారు. తప్పుడు మేనిఫెస్టోతో మరోసారి కూటమి పేరుతో మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వర్షంలోనూ ప్రచార జోరు.... వర్షం లోనూ మంత్రి జోగి రమేష్ ప్రచారం సాగించారు. చల్లనిగాలులు, మోస్తరు వర్షం పడుతున్నా కార్యకర్తల ఉత్సాహం నడుమ చిరునవ్వుతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి జగనన్నకు అండగా నిలవాలంటూ ప్రచారం సాగించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలూ, వ్యాపార రంగాలూ, అగ్రకులాల్లో పేదలు ఆలోచన చేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు. వెన్నుపోటు ద్రోహులకు గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జోగి రమేష్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నేత చలసాని స్మిత గౌతమ్, సీడీసీ చైర్మన్ రాజులపాటి రామచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వరరావు, ఎంపీపీ చీలి కల్పన, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ అబుకలాం, మండల అధ్యక్షుడు దాసే రవి, మున్సిపల్ వైస్ చైర్మన్లు సోలే సురేష్బాబు, అర్షతున్నీసాబేగం, ప్రభుత్వాసుపత్రి చైర్మన్ జంపాన కొండలరావు, షాదీఖానీ చైర్మన్ అహ్మద్ఖాన్, కౌన్సిలర్లు డాక్టర్ జంపాన పూర్ణిమ, ముడావత్ లక్ష్మి, ఊర శ్రీవాణి, గోన మదన్, గుంజా సుధాకర్, రాజులపాటి చిన్ని, ఎండీ బేగ్, కో ఆప్షన్ సభ్యుడు షేక్ ఖలీల్, నాయకులు అబ్దుల్సద్దాం, సలీం బేగ్, కళాధర్, ఉయ్యూరు సుధాకర్, వెంట్రప్రగడ బాబ్జీ, పెనుమూడి సంజయ్, కొండపల్లి రమేష్, దిరిశం జ్యోతిర్మయి, దిరిశం ఇందిరా ప్రియదర్శిని, బాలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ ఉయ్యూరులో భారీ ర్యాలీ ప్రచారానికి అడుగడుగునా నీరాజనం -
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
నగరంపాలెం: ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయవాడలో రోడ్ షో సందర్భంగా గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీస్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలు బుడంపాడు అండర్ పాస్ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, చందోలు చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని జాతీయ రహదారి –16 వైపు వెళ్లాలని తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. దేవస్ధానానికి రూ.లక్ష విరాళం తాడేపల్లిరూరల్: దుగ్గిరాల మండల పరిధిలోని కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసియున్న మహంకాళీ అమ్మవారి దేవస్థానానికి దాత మంగళవారం రూ.1,01,116లు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చినవెంకటరెడ్డి మాట్లాడుతూ చేబ్రోలు వాస్తవ్యులు చిన్నంశెట్టి పోతురాజు, పార్వతి దంపతులు ఆలయ అభివృద్ధి నిమిత్తం ఈ విరాళాన్ని అందజేశారని వెల్లడించారు. అనంతరం దాతలు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీ మెంబర్లు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్, స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహింపట్నం జూపూడిలోని నోవ, నిమ్రా కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలల్లోని కౌంటింగ్, స్ట్రాంగ్ రూములను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు పరిశీలించారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ అనంతరం ఈవీఎంలను నోవా, నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలల్లో భద్రపరచనున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత తదితర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్, భద్రత ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రత పటిష్టంగా ఉండాలని, అలాగే బందోబస్తు కూడా పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపునకు అనువైన సౌకర్యాలను పరిశీలించి, స్ట్రాంగ్ రూముల పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. లెక్కింపు టేబుల్స్, పోలింగ్ ఏజెంట్లు వచ్చే మార్గం చుట్టు పక్కల శాంతి భద్రతల చర్యలను పరిశీలించారు. ఆయన వెంట మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి.సంపత్కుమార్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉన్నారు. యార్డుకు 70,843 బస్తాల మిర్చి రాకకొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 70,843 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా ,776 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ. 18,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 55,550 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పోచంపల్లి(జగ్గయ్యపేట):పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పారా శ్రీను (48) సమీపంలోని పంట పొలంలో పురుగుల మందు తాగి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుటుంబ సభ్యులు అంటున్నారు. చిల్లకల్లు ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న లారీ.. మహిళ మృతి మరో ముగ్గురికి గాయాలు జగ్గయ్యపేట:ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైన ఘటన పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని రెడ్డినాయక్తండ, బూదవాడ గ్రామాలకు చెందిన గుగులోతు విజయ, కూరపాటి సుధారాణి, బాణావత్ సక్కు, సాల్విలు ఆటోలో వారి గ్రామానికి జగ్గయ్యపేట నుంచి బలుసుపాడు రోడ్డు మీదుగా బయలుదేరారు. ఈ క్రమంలో బలుసుపాడు నుంచి జగ్గయ్యపేటకు వస్తున్న లారీ ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ (25) తలకు ఇనుప రాడ్డు బలంగా తగలటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రాకు ఏం చేశారని వస్తున్నారు మోదీజీ?
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్ భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రధాని నరేంద్ర మోదీ తమ పదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారని ఇక్కడకి వస్తున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా, విభజన హామీలను నెరవేర్చారా అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అమలుకాని హామీలతో మరోమారు ఆంధ్రులను మభ్యపెట్టేందుకే వస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్ల ఎన్డీఎ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కు ఏం వెలగపెట్టారో చెప్పిన తరువాతే రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఐదేళ్లు ఇస్తామని ప్రకటిస్తే, కాదు..పదేళ్లు ఇవ్వాలని అప్పటి ప్రతిపక్ష నేత వెంకయ్య నాయుడు నిండు సభలో మాట్లాడారని గుర్తు చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ పదేళ్లలో ఆంధ్రాకు కేవలం ఎన్నికల ముందే వస్తారని ఎద్దేవా చేశారు. విభజన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమయ్యిందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మార్గదర్శకాలను దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, నీతి అయోగ్ ప్రవేశపెట్టాయని గుర్తు చేశారు. ఆ యాక్ట్పై ఎన్డీఎ కూటమికి చెందిన చంద్రబాబు దుష్ప్రచారం చేయడమే కాకుండా టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఆ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇవ్వడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. -
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆటో ఢీకొని మహిళ దుర్మరణం చెందిన ఘటన కెనాల్రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తుంగని దొంబూరు అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి తిరుపతి దేవస్థానానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆ క్రమంలో కెనాల్రోడ్డులో రోడ్డు దాటుతుండగా దొంబూరు తల్లి సావిత్రమ్మ (57)ను ఆటో ఢీకొట్టింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. 108 వాహనం ద్వారా హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్భయంగా ఓటు హక్కు వినియోగం
విజయవాడస్పోర్ట్స్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని.. నిర్భయంగా ఓటు హక్కును వినియోగంచుకోవాలని పౌరులకు పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది లా అండ్ ఆర్డర్, ఏఆర్ పోలీసులను, పది ఫ్లటూన్లు, 12 కంపెనీల పారామిలటరీ బలగాలు, 1,250 ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు విధులు కేటాయించామని వెల్లడించారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్లాగ్ మార్చ్లను నిర్వహించామని చెప్పారు. గత ఎన్నికల్లో అల్లర్లుకు పాల్పడిన 787 మందిని, ఇబ్బందులకు గురిచేసిన 2,023 మందిని, 373 మంది రౌడీషీటర్లను, 490 మంది లా – ఆర్డర్ సస్పెక్ట్లను, 890 మంది ఇతర చెడునడత కలిగిన వ్యక్తులను మొత్తం 4,533 మందిపై 3,776 కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరందరినీ న్యాయమూర్తి వద్ద బైండోవర్ చేశామని పేర్కొన్నారు. చెక్పోస్ట్ల వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ. 7.40 కోట్లను స్వాధీనం చేసుకుని, 282 కేసులు నమోదు చేశామని, రూ.5.76 కోట్ల విలువైన 8.58 కేజీల బంగారం, 33.15 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని 10 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.1.15 కోట్ల విలువైన 24 వేల లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 2,146 మందిని అరెస్ట్ చేసి వారిపై 1,847 కేసులు నమోదు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.91 లక్షల విలువైన 12 వేల లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 592 మందిని అరెస్ట్ చేసి వారిపై 521 కేసులు నమోదు చేశామని వివరించారు. 362 కేసుల్లో 85 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ.43 లక్షల విలువైన 28 వేల లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.40 లక్షల విలువైన 1.13 లక్ష లీటర్ల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న రూ.24 లక్షల విలువైన 510 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 87 మందిని అరెస్ట్ చేసి వారిపై 52 కేసులు నమోదు చేశామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువులు పంపిణీ చేయుటకు తరలిస్తున్న సుమారు రూ. 5.5 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లఘించిన వారిపై మోడల్ కోడ్ అఫ్ కాండక్ట్ కింద 75 కేసులు నమోదు చేసి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ రామకృష్ణ -
మహిమాన్వితుడు మల్లేశ్వరుడు
ఎలకుర్రు(పామర్రు): కోరుకున్న వారికి కొంగు బంగారమై భక్తుల పాలిట కల్పవృక్షంగా విలసిల్లుతున్నారు శ్రీభ్రమరాంబ సమేత చెన్న మల్లేశ్వరస్వామి. కృష్ణాజిల్లా పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో ఉన్న శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయానికి 264 ఏళ్ల పైబడి చరిత్ర ఉంది. ఆలయ చరిత్ర సంక్షిప్తంగా ... శివదీక్షాపరుడు, చల్లపల్లి, గురజ జమీందారీ ఆస్థ్ధానాల్లో ఆగమ సలహాదారులుగా ఉంటూ జమీందారులకు గురువుగా శివదీక్షను ప్రసాదించి వారిచే ఎలకుర్రు, శోభనాద్రిపురం, మల్లేశ్వరం గ్రామాలను బహుమతిగా పొందారు కాశీనాథుని వంశస్తులైన కాశీనాథుని చిన వీర నారాధ్యులు. ఈయన ఆధ్వర్యంలో 1760వ సంవత్సరంలో ఎలకుర్రు గ్రామంలో భ్రమరాంబ సమేత చెన్న మల్లేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి కాశీనాథుని వంశస్తులచే ఆలయంలో ధూప దీప నైవేద్యాలతో ఆలయం విరాజిల్లుతోంది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ కోరిన వారికి కొంగు బంగారమైన స్వామి భక్తులకు ఇలవేల్పుగా ఉన్నారు. వీరి వంశంలో జన్మించిన వారు విశ్వదాత, దివంగత దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు. వీరితో పాటు ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు దివంగత కాశీనాధుని విశ్వనాథ్ (కె.విశ్వనాథ్) ఈ వంశానికి చెందిన వారే. ప్రతి సంవత్సరం వైశాఖ మాస ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ గ్రామంలోని ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు ఆలయ 264వ వార్షిక కల్యాణ మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక కుటుంబ ధర్మకర్త కాశీనాథుని నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ నెల 18 వ తేదీన ధ్వజారోహణం, చిన్నాపురం వాస్తవ్యుడు జన్ను నారాయణరావు సమర్పించు సిద్ధు ఆదంబి సంవాదం నాటకం ఉంటుందన్నారు. 19 న వేద పఠనం, సహస్ర నామార్చన, హరికథా కాలక్షేపం, రాత్రి 9 గంటలకు వేదాంతం రాధేశ్యామ్ బృందం వారి భక్త ప్రహ్లాద నాటకం ఉంటుందన్నారు. మే 20 న హరికథా కాలక్షేపం, రాత్రి 7 గంటలకు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ వారిచే విశ్వదాత అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. 21న వేద పఠనం, రాత్రి 7గంటలకు జగజ్జ్యోతి, రాత్రి 9 గంటలకు భ్రమరాంబ చెన్న మల్లేశ్వర నాట్యమండలి, మాచిరాజు రాధాకృష్ణ సమర్పించు సత్య హరిశ్చంద్ర నాటకం ఉంటుందని, రాత్రి 2 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. మే 22 ఉదయం హరికథా కాలక్షేపాలు, రాత్రి 9 గంటలకు వీరభద్రస్వామి వీధిపళ్లెం కార్యక్రమం, 10 గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుందన్నారు. మే 23న స్వామివారి త్రిశూల స్నానం, రాత్రికి ఏకాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ అనంతరం మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు అందరూ పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని నాగేశ్వరరావు కోరారు. రెండున్నర శతాబ్దాల చరిత ఎలకుర్రు ఆలయ ఘనత ఈ నెల 18 నుంచి 23 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు -
ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు
పోలీస్ కమిషనర్ రామకృష్ణ విజయవాడస్పోర్ట్స్/గన్నవరం: ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఆంధ్రా లయోల కాలేజీలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ దిశానిర్దేశం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, పాత పీసీఆర్ జంక్షన్ నుంచి బెంజిసర్కిల్ వరకు రెడ్జోన్గా ప్రకటిస్తున్నామని సీపీ రామకృష్ణ తెలిపారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్లు, బెలూన్లను ఎగురవేయడం నిషిద్ధమని హెచ్చరించారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఏరియా డామినేషన్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, కట్ ఆఫ్ పార్టీస్, రూఫ్ టాప్స్, రోప్ పార్టీస్, యాంటీ సబ్ టేజ్ చెక్ తదితర బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆరుగురు పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో ఏడుగురు డీసీపీలు/ఎస్పీ, 22 మంది ఏడీసీపీలు, 50 మంది ఏసీపీలు, 136 మంది సీఐలు, 250 మంది ఎస్ఐలతో పాటు ఐదు వేల మంది పోలీస్ సిబ్బందికి విధులు కేటాయించామని తెలిపారు. వారు నిర్దేశించిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని, అనుమానితులు తారసపడితే వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. రోడ్ షో జరిగే ప్రాతంలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోదీ రోడ్షోలో ప్రజలు పాల్గొనేలా ఐరన్ బారిగేడ్లు ఏర్పాటుచేశామని వివరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ ఎంజీ రోడ్డు వరకు పూర్తి పోలీస్ నిఘా ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అమలులో ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో ఐజీపీ కె.వి.మోహన్రావు డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఏఐజీలు ఎం.రవీంద్రనాథ్బాబు, వకుల్ జిందాల్, మల్లికా గార్గ్, ఏ.ఆర్.దామోదర్, డీసీపీలు కె.శ్రీనివాసరావు, అధిరాజ్సింగ్ రాణా, ఉదయరాణి, కరీముల్లా షరీఫ్, కె.చక్రవర్తి, టి.హరికృష్ణ, బి.రామకృష్ణ పాల్గొన్నారు. ఎస్ఎస్జీ దళాల ఆధీనంలో విమానాశ్రయం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన విజయవాడలో జరిగే రోడ్షోలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎస్జీ దళాలు విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. బాంబ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రోడ్షో అనంతరం ప్రధాన మంత్రి తిరిగి విమానాశ్రయానికి చేరుకుని న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. ● బుధవారం మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజిసర్కిల్ వరకు ఎంజీ రోడ్డుపై ఎలాంటి వాహనాలనూ అనుమతించరు. ● ఆటోనగర్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు ఆటోనగర్ గేటు, పటమట, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా ప్రయాణించాలి. ● ఎంజీ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను ఏలూరు రోడ్డు, ఐదో నంబర్ రూట్కు మళ్లిస్తారు. ● మచిలీపట్నం – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు ఆటోనగర్ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్, ఏటూరు రోడ్డు, పడవల రేవు, బీఆర్టీఎస్ రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత గవర్నమెంట్ ఆసుపత్రి మార్గాన్ని అనుసరించాలి. ● ఏలూరు–విజయవాడ మధ్య ప్రయాణించే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్, పడవలరేవు, బీఆర్టీఎస్ రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాతగవర్నమెంట్ ఆసుపత్రి మార్గంలో రాకపోకలు సాగించాలి. ● విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే భారీ వాహనాలు హనుమాన్జంక్షన్, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం మార్గాన్ని అనుసరించాలి. ● విశాఖపట్నం – చెన్నయ్ మధ్య ప్రయాణించే భారీ వాహనాలు హనుమాన్జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, పులిగడ్డ, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట మార్గాన్ని అనురించాలి. -
10 నుంచి కళాపీఠంలో వేసవి శిక్షణ తరగతులు
కూచిపూడి(మొవ్వ): నాట్యక్షేత్రం కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మే 10వ తేదీ నుంచి వేసవి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు కళాపీఠం ప్రిన్సిపాల్ వేదాంతం రామలింగ శాస్త్రి తెలిపారు. రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మీ ద రూ.3,500 డీడీ చెల్లించి ప్రవేశం పొందవచ్చునని ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమేష్ నుంచి ఉత్తర్వులు అందినట్లు వెల్ల డించారు. పూర్తి వివరాలకు మొబైల్ నంబరు 94404 70753కి సంప్రదించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆధారాలు లేని రూ.10లక్షల నగదు స్వాధీనం ఇబ్రహీంపట్నం:ఎటువంటి ఆధారం లేకుండా కారులో తరలిస్తున్న రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎం.సత్యన్నారాయణ తెలిపారు. పట్టుబడిన నగదుతో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. గుంటుపల్లి చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కంచికచర్లకు చెందిన కొమర నాగేంద్రబాబు అనే వ్యక్తి కారులో నుంచి దిగి బ్యాగుతో పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. బ్యాగులో రూ.10లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. కారులో ఉన్న జొన్నాల రాంబాబు, పిడక అచ్యుతరామయ్యలను అదుపులోకి తీసుకుని విచారించారు. జొన్నాల రాంబాబు తన హౌసింగ్ లోన్ విజయవాడలో చెల్లించేందుకు నగదు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. అయితే నగదుకు తగిన పత్రాలు ఏమీ లేకపోవడంతో స్వాధీనం చేసుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఎస్ఐ అనూష తదితరులు పాల్గొన్నారు. సంతోష్ హోండా లక్కీ డ్రాలో బహుమతులు అందజేత భవానీపురం(విజయవాడపశ్చిమ): నగరంలోని సంతోష్ హోండా పది సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భంగా సోమవారం తమ షోరూమ్లో కస్టమర్లకు లక్కీ డ్రా నిర్వహించింది. సంతోష్ హోండా మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి శ్రీకాంత్, చైర్మన్ చుక్కపల్లి జగన్మోహన్రావు విజేతలకు అద్భుతమైన అనేక బహుమతులను అందజేశారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో బంపర్ ప్రైజులుగా మారుతి ఆల్టో కారు, రిఫ్రిజిరేటర్, ఏసీ, ల్యాప్టాప్, టీవీ బహూకరించారు. -
ఘనంగా జాతీయ నృత్య కళా పోటీలు
గుడివాడటౌన్: స్థానిక బంటుమిల్లి రోడ్డులోని అలంకృత ఫంక్షన్ హాలులో శివజ్యోతి నృత్యాలయ నృత్య పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం జాతీయస్థాయి నృత్య పోటీలు ఘనంగా ప్రారంభమయ్యా యి. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 250 మంది పైబడి నృత్య కళాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రముఖ కళాకారిణి రేవతీ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారని, ప్రతి ఒక్కరికీ పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు అన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే బ్రాహ్మణుల అభివృద్ధి
విజయవాడస్పోర్ట్స్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో బ్రాహ్మణుల అభివృద్ధి జరిగిందని దేవదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. పలువురు బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులతో కలిసి విజయవాడలోని కేశినేని భవన్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎమ్మెల్యే సీట్లతో పాటు అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారని, వంశపారంపర్య అర్చకత్వ హక్కులు కల్పించారని, కార్పొరేషన్కు నిధులు కేటాయించి ఆదుకున్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు బ్రాహ్మణులకు ఎలాంటి సాయం చేయలేదని, రాజకీయంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా ఎంతో మంది బ్రాహ్మణుల ఆత్మహత్యలకు కారణమయ్యాడని దుయ్యబట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బ్రాహ్మణుల ఓట్ల కోసం చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను బ్రాహ్మణ సామాజిక వర్గం గుర్తించిందని, ఓటుతో బుద్ధి చెప్పేందుకు బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో నలుగురు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. నలుగురిలో ఓడిపోయిన ఇద్దరికి విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. గడిచిన 58 నెలల కాలంలో ఆరుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడంతో పాటు, 18 మందికి కార్పొరేటర్ పదవులు, అనేక మందిని డైరక్టర్లుగా నియమించి బ్రాహ్మణ సామాజిక వర్గానికి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. వంశపారంపర్య అర్చకత్వ హక్కులు కల్పించడంతో పాటు వయో పరిమితితో సంబంధం లేకుండా శరీరంలో శక్తి ఉన్నంత వరకు దేవుడిని పూజించుకునే హక్కును జీవో నంబర్ 76 ద్వారా కల్పించిన సీఎం జగన్కు బ్రాహ్మణ సామాజిక వర్గం ఎంతో రుణపడి ఉంటుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఐవైఆర్ కృష్ణారావును ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా అసభ్యకరంగా చిత్రీకరించిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలోనే దేవాలయ సదావత్ భూములను కొల్లగొట్టారని, విజయవాడలో 30 దేవాలయాలను కూల్చి అనేక బ్రాహ్మణ కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. సత్రాల భూముల కబ్జా చేసింది టీడీపీ నాయకులేనని, ధార్మిక పరిషత్ను తీసేసి దేవదాయ శాఖ అభివృద్ధిని కుంటుపర్చారన్నారు. ఒంటిమిట్టలో వెయ్యి కాళ్లమండపం కడతానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆ పాపం చేయడం వల్లే అలిపిరిలో చంద్రబాబుకు ఆ గతి పట్టిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్ల కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకాలను నమ్మొద్దని బ్రాహ్మణులకు హితవు పలికారు. వైఎస్సార్సీపీకి అండగా ఉండేందుకు అందరూ ఏకీకృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరశర్మ మాట్లాడుతూ సీఎం జగన్ బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ.750 కోట్లు కేటాయించి ఆదుకున్నారని చెప్పారు. సమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు కృత్తివెంటి చంద్రశేఖర్, గండూరి మహేష్, చల్లా సుధాకర్, ఎల్లాప్రగడ విజయలక్ష్మి పాల్గొన్నారు. జీవో నంబర్ 76తో బ్రాహ్మణుల అభివృద్ధికి బాటలు వేసిన జగన్ ఎమ్మెల్యే సీట్లతో పాటు పలు నామినేటెడ్ పదవుల కల్పన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బ్రాహ్మణులను పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు ఎన్నికల సమయంలో చంద్రబాబు బూటకపు నాటకాలు నమ్మొద్దు దేవదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement