-
40 వేల ఎకరాల్లో సాగు
జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల హెక్టార్లలో సాధారణ సాగు ఉండగా, అందులో 40 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో కేవలం 10 పంచాయతీల్లో, పదిహేను ఎకరాల్లో ప్రారంభమైన సాగు ఈ రబీ నాటికి 40 వేల ఎకరాలకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 160 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. 35 వేల మంది రైతులు ఈ సాగులో భాగస్వామ్యంగా ఉన్నారు. గత ఖరీఫ్లో 100 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి చేశారు. 390 మంది ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ఈ విధానాన్ని అమలుచేసేందుకు రైతులకు సహకరిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
ఆర్గానిక్ సాగు
మంచి ఫలసాయం మేం కూరగాయల పంటలకు ఎక్కువగా సేంద్రియ ఎరువు, జీవామృతాలు వినియోగిస్తున్నాం. మంచి దిగుబడి వస్తోంది. ఈ పంటలకు స్థానికంగానే డిమాండ్ అధికంగా ఉంటోంది. –సిల్లా రమేష్, పొగిరి, రాజాం మండలం రాజాం: పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆహార ఉత్పత్తులు పెంచేందుకు, అఽధిక దిగుబడుల నిమిత్తం రైతులు రసాయనిక ఎరువులు చాలా ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. ఫలితంగా ఆహార ఉత్పత్తుల్లో ప్రమాదకర ఫలితాలు ఏర్పడి మనిషి రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యవసాయశాఖ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం ఫలితాలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా ఇటీవల సేంద్రియ సాగు విస్తరిస్తూ ఆరోగ్యకర పంటలను అందిస్తోంది. గతప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, సంపదతయారీ కేంద్రాల వ్యవస్థలు ప్రకృతి వ్యవసాయ సాగుకు సాయం అందిస్తుండడంతో జిల్లాలో సేంద్రియ సాగు బాగా పెరిగింది. కూరగాయలు, చిరుధాన్యాల సాగు ప్రకృతి సాగు విధానాన్ని మహిళా రైతుఉత్పత్తి సంఘాలు ముందుగా అందుకుంటున్నాయి. ఇంటిపెరడుల్లోనూ, చిన్నచిన్న కమతాల్లో కూరగాయల సాగుకు ఈ వ్యవసాయాన్ని అమలు చేస్తున్నాయి. రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న, చెరకు సాగుకు ప్రకృతి వ్యవసాయాన్ని వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండుతున్న కూరగాయలకు ఆయా గ్రామాల్లోనే డిమాండ్ కనిపిస్తుంది. ఈ సాగుద్వారా వచ్చిన చెరకు ద్వారా తయారీ చేస్తున్న బెల్లానికి విపరీతమైన డిమాండ్ మార్కెట్లో ఉంది. ఇవే కాకుండా రబీలో మినుములు, పెసర, ఆముదం, బొబ్బర్లు, నువ్వులు, వేరుశనగ, ధనియాలు, మెంతులు, ఆవాలు, రాగులు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల పంటలు సాగుచేస్తున్నారు. తక్కువ నీటి వనరులున్న ప్రాంతాల్లో మండు వేసవిలో కూడా ప్రకృతి వ్యవసాయంతో ఇవి సాగులోకి వస్తున్నాయి. ఎరువు తయారీ చాలా సులభం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ ఎరువు తయారీ చాలా సులభంగా ఉంటుంది. ఆవుపేడ, వేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవుమూత్రం ప్రధానమైన ముడిసరుకులు. వాటిని తగిన మోతా దులో ప్రకృతి వ్యవసాయ అధికారులు, సిబ్బంది సలహాలతో ఒక రోజు వ్యవధిలో ఎరువుల తయారీ చేయవచ్చు. అగ్ని అస్త్రం, ఘన, ద్రవ జీవామృతాలు, బీజామృతాలు, కషాయాలు తయారు చేసి వరి, మొక్కజొన్న, చెరకు వంటి పంటలతో పాటు చిరుధాన్యాలు, కూరగాయల సాగులో వినియోగించవచ్చు. వీటి వల్ల పంటలో వైవిధ్యం కనిపించడంతో పాటు పంటపొలాలు సారవంతంగా మారి నేలల్లో ఆర్గాన్, కార్బన్ ఉత్పత్తులు పెరుగుతాయి. వీటి ఫలితంగా వచ్చే దిగుబడితో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు. ఈ క్రమంలో రైతులు సేంద్రియ సాగుపై దృష్టిసారిస్తుండగా, ఈ పంటల నుంచి దిగుబడి పెరగడంతో పాటు మార్కెట్లో కూడా డిమాండ్ కనిపిస్తోంది. పెరుగుతున్న ప్రకృతి వ్యవసాయం ఆసక్తి చూపుతున్న రైతులు ఆరేళ్లలో 40 వేల ఎకరాలకు పెరిగిన సాగు ఆరోగ్యకర ఉత్పత్తులు లభ్యం రసాయనక ఎరువులు తగ్గించాం వరి, మొక్కజొన్నకు గతంలో ఎక్కువగా యూ రియా, డీఏపీలు వినియోగించేవారం. ఇప్పుడు పచ్చిగత్తం, ఆవుపేడ, కషాయాలు, పచ్చిరొట్ట ఎరువులు వినియోగిస్తున్నాం. పంటలో చీడపీడలు తగ్గి, దిగుబడి పెరుగుతోంది. పొలాల గట్లపై కూరగాయలు సాగుచేసి ఆదాయం పొందుతున్నాం. వాటికి మంచి డిమాండ్ ఉంది. –టి. అప్పలనాయుడు, లక్ష్మీపురం, రాజాం మండలం విస్తృతంగా అవగాహన గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు, సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన కల్పిస్తున్నాం. రైతుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆరోగ్యకర ఉత్పత్తులకు ఈ విధానం నాందిగా మారుతుంది. –పి.రమాదేవి, ప్రకృతి వ్యవసాయం అఽధికారిణి, రాజాం. -
‘ప్రియ’మైన టమాటో
పార్వతీపురం: టమాటో ధరపైపెకి ఎగబాకుతోంది. ప్రస్తుతం కిలో టమాటో హోల్సేల్గా రూ.80కు లభిస్తుండగా, రిటైల్గా రూ.100కు విక్రయిస్తున్నారు. పల్లెల్లో రూ.110నుంచి రూ.120 వరకూ వర్తకులు అమ్ముతున్నారు. కొద్ది రోజుల నుంచి టమాటో ధర కిలో రూ.40లోపు ఉండగా ఒక్కసారిగా పెరిగింది. దీంతో సాధారణ కుటుంబాలు ప్రస్తుతం టమాటోను కొనలేని పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే ఆస్కారముందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి తీవ్రత దృష్ట్యా పంట దిగుబడులు తీవ్రంగా తగ్గిపోవడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కాకపోవడంవల్ల ధరలు పెరుగుతున్నాయని వర్తకులు చెబుతున్నారు. -
ఐఐహెచ్టీలో స్పాట్ అడ్మిషన్లు
గుర్ల: రాష్ట్రంలోని తిరుపతి జిల్లా వెంకటగిరిలో ని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియ న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీలో ఐఐహెచ్టీకి స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు జిల్లా చేనేత, జౌళిశాఖ ఎ.డి మురళికృష్ణ ఆదివారం తెలిపారు. ఈనెల 20న స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనునట్లు చెప్పారు. ఈకోర్సులో మొదటి ఏడాది పూర్తయిన వారు బీటెక్ రెండవ ఏడాదిలో ప్రవేశించడానికి అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ 9441795408, 9866169908, 9010243054 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కేజీన్నర గంజాయి పట్టివేతరామభద్రపురం: మండలకేంద్రంలో పోలీసులు ఆదివారం కేజీన్నర గంజాయి పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు గంజాయితో వస్తున్నారన్న సమాచారం మేరకు తహసీల్దార్తో పాటు ఎస్సై జ్ఞానప్రసాద్, పోలీసు సిబ్బంది స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మాటు వేశారు. గంజాయితో వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిని కృష్ణాజిల్లా నాగాయలంక గ్రామానికి చెందిన పెనుమల పూర్ణకిశోర్, విజయవాడ సిటీకి చెందిన చీపురుపల్లి ప్రేమ్కుమార్గా గుర్తించారు. వారు ఒడిశాలోని కొరాపుట్ పరిసర ప్రాంతాలలో గంజాయి కొనుగోలు చేసి విజయవాడకు అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు. సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జలకళ సంతకవిటి: మండలంలోని రంగరాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్ట జలకళను సంతరించుకుంది. గడిచిన రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎత్తైన ప్రాంతాల నుంచి ఆనకట్టలోకి పెద్దఎత్తున నీరు వచ్చి, చేరుకుంది. ఆదివారం నాటికి ఆనకట్టలో నీటిమట్టం పెరిగిందనిఅధికారులు చెబుతున్నారు. ఘనంగా ఆలయ వార్షికోత్సవం రాజాం సిటీ: పట్టణ పరిధిలోని తెలగవీధి సత్యనారాయణపురం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ దశమ వార్షికోత్స వం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉద యం ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకా లు, ఉత్సవ సంకలనం, అంకురారోహణ, మండపారాధన, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమా లు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రేగిడి: మండలంలోని ఉంగరాడమెట్ట, సంకిలి, బూరాడ కూడళ్లలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఆదివారం చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా వస్తున్న వాహనాలను ఆపి, వాహనదారులు మద్యం తాగినదీ లేనిదీ బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించారు. అనంతరం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన పలువురిపై కేసులు నమోదు చేశారు. మద్యం మత్తు లో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ ని, ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగానికి ప్రతీక బక్రీద్పార్వతీపురంటౌన్: ముస్లింలు పవిత్రంగా నిర్వహించుకునే పండగల్లో బక్రీద్ ఒకటి. ఈ పండగను త్యాగానికి ప్రతీకగా చెబుతారు. ఈద్– ఉల్–జుహా అని కూడా ఈ పండగను పిలుస్తా రు. ఇస్లాం క్యాలెం డర్ ప్రకారం చివరి నెల జిల్ హిజ్జ. ఈ నెల 10వ రోజున బక్రీద్ను ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. అల్లాహ్ ఆజ్ఞను తు.చ తప్పకుండా పాటించడమే ఈ పండగ అర్థం. నేడు బక్రీద్ జరుపుకోవాలని మత పెద్దలు ప్రకటించారు. -
అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి
విజయనగరం: అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమ్ల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కూట మి ప్రభుత్వంలో మంత్రిగా నియామకమైన అనంతరం మొదటిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ ఆది వారం మాట్లాడుతూ మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన యువతరానికి అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పదవికి పెద్ద వాడినే కానీ మీ అందరికీ మాత్రం చిన్న వాడినేనన్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కలిసికట్టుగా పని చేశారని, ఫలితంగా అన్ని సీట్లు గెలుచుకోగలిగామని చెప్పారు. కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా పని చేసి నియోజకవర్గాలను, జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన తమ ప్రభుత్వం హయాంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపా రు. తనకు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధితో పాటు స్వయం సహాయక సంఘాల్లో మహిళల అభివృద్ధి, ఇతర దేశాల్లో పని చేసిన అనుభవం ఉండడంతో ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ బాధ్యతను అప్పగించారని చెప్పారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలతో చర్చించి స్థానిక పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్చలు జరిపి అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో విజయనగరం జిల్లాను మొదటి స్థాయిలోకి తెలుసుకు వెళ్లేందు కు శ్రమిస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితివిజయలక్ష్మిగజపతి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్ విజయనగరం: విజయనగరం ప్రజల ఇలవే ల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర ఎంఎస్ ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆది వారం సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు అధికారిక లాంచనాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజా నంతరం అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటా న్ని బహూకరించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ కార్తీక్, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, ఆర్డీవో ఎంవీ సూర్యకళ, తహసీల్దార్ పీవీ రత్నం, దేవాదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.అన్నపూర్ణ, ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు, పూజారి వెంకటరావు, వేద పండితులు, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కొండపల్లి కొండలరావు, పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్ తది తరులు పాల్గొన్నారు. -
వచ్చేశామోచ్..!
● కనువిందుచేస్తున్న సైబీరియా పక్షులు ● ఏటా జూన్ నెలలో వచ్చి డిసెంబరు వరకు విడిది ● కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా రాక బొండపల్లి: వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వివిధ దేశాలు దాటి క్రమం తప్పకుండా జిల్లాలోని బొండపల్లి ప్రాంతానికి వలస వస్తున్న విదేశీ సైబీరియా దేశ వలస పక్షులు ఈఏడాది కూడా తిరిగి వచ్చి సందర్శకులకు కనువిందు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. పొడవాటి ముక్కు, కాళ్లు, భారీ ఆకారంతో పాటు, శరీరమంతా తెల్లని వెంట్రుకలు, మెడ దగ్గర మాత్రం తెల్లని వెంట్రుకలతో పాటు ఎరుపు రంగు వెంట్రుకలు కలిసి చూడగానే ఇట్టే ఆకట్టుకునే సైబీరియా దేశానికి చెందిన పక్షులు కొ న్ని సంవత్సరాలుగా బొండపల్లి మండలానికి చేరుకుని విడిది ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ పక్షులు సైబీరియా దేశం నుంచి ఏటా జూన్ నెలలో వల స వచ్చి వేసవి కాలంతో పాటు వర్షాకాలం ఇక్కడే ఉండి తిరిగి తమ సొంత దేశానికి వలస వెళిపో తుంటాయి.ఇది క్రమం తప్పకుండా జరుగుతోంది. చెరువుల్లో ఆహారం సేకరణ సైబీరియా పక్షులు మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న రామన్న సాగరం చెరువులో లభించే చిన్న,చిన్న చేపలతో పాటు ఇతర ఆహారాన్ని సేకరించుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సాయంత్రం గజపతినగరం మండలంలోని లోగిశ గ్రామంలో గల చింత చెట్లను ఆవాసంగా చేసుకుని రాత్రంతా అక్కడే ఉంటాయి. తిరిగి ఆహారం కోసం ఉదయాన్నే చెరువు వద్దకు రావడం ఆరు నెలల పాటు జరుగుతుంటుంది. పిల్లలు పెద్దవయ్యాక వలస ఇక్కడికి ఈ పక్షులు జూన్ నెలలో వచ్చి సెప్టెంబర్ కల్లా గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి, అవి పెద్దవై ఎగిరే అవకాశం ఉన్నంత వరకు అంటే డిసెంబరు వరకు ఒక్కడే ఉండి తిరిగి పిల్లలతో సహా వాటి సొంత దేశం సైబీరియాకు వలస వెళ్లిపోతాయి. ఈ పక్షులు వచ్చాయంటే తమకు మంచి జరుగుతుందని ఈ ప్రాంత వాసులు భావిస్తుంటారు. హాని చేస్తే జరిమానా విధింపు ఈ పక్షులకు లోగిశ గ్రామం, చుట్టుపక్కల గ్రామాల వారితో పాటు బొండపల్లి చుట్టు పక్కల గ్రామాల వారు ఎటువంటి హాని తలపెట్టరు. అలాగే వాటికి ఎవరూ హాని చేసినా, వాటిని పట్టుకున్నా జరిమానా విధించాలని ఇక్కడి వారే కట్టుబాటు పెట్టుకుని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇక్కడ జూన్ నెల నుంచి ఎండల తీవ్రతతో పాటు,ఆ తర్వాత వర్షాలు పడడం వల్ల సైబీరియా పక్షులకు ఇక్కడి వాతావరణం గుడ్లు పెట్టి పిల్లలు పోదిగేందుకు అనువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే క్రమం తప్పకుండా ఈ పక్షులు ఏటా వలస వస్తున్నాయని భావిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. -
No Headline
గలక్కవరపుకోట : నేలబావిలో ట్రాక్టర్ పడిపోవడంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని రేగ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకేడ అప్పలరాజుకు చెందిన ట్రాక్టర్కు అదే గ్రామానికి చెందిన కోన సూర్యనారాయణ (43) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రేగ గ్రామ సమీపంలోని మామిటి తోటల్లో దుక్కు చేపట్టేందుకు సూర్యనారాయణ ఆదివారం ఉదయం వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో దుక్కు చేపడుతుండగా.. వెనక్కి మళ్లే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి వెనుకనే గల నేలబావిలో పడిపోయింది. అక్కడున్న వారు వెంటనే స్పందించి గట్టిగా కేకలు వేయడంతో పాటు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. దీంతో రేగ, కళ్లేపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి బావిలోనుంచి ట్రాక్టర్ తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొత్తవలస నుంచి భారీ క్రేన్ను తీసుకువచ్చి అతి కష్టంమ్మీద ట్రాక్టర్ను బయటకు తీశారు. డ్రైవర్ సూర్యనారాయణ అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లలకు వివాహాలు జరిగాయి. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హెచ్సీ త్రిమూర్తులు సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. మృతుడి భార్య మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. డ్రైవర్ మృతి -
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
గంట్యాడ : మండలంలోని తాటిపూడి జలాశయంలో పడి ఒకరు మృతి చెందారు. అయితే ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన జలగడుగుల నాగేశ్వరరావుకు ఎస్.కోటకు చెందిన వరలక్ష్మితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ నెల 14న భార్యతో కలిసి అత్తవారింటికి వచ్చిన నాగేశ్వరరావు తాటిపూడి జలాశయానికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో నాగేశ్వరరావు భార్య ఎస్.కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం తాటిపూడి జలాశయంలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి చూడగా.. నాగేశ్వరరావు మృతదేహంగా గుర్తించారు. అయితే ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సురేంద్రనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒరిగిన ఆర్టీసీ బస్సు
● తప్పిన ప్రమాదం రాజాం : రాజాం నుంచి సంతకవిటి వైపు ఆదివారం ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పొనుగుటివలస దాటిన వెంటనే రోడ్డుపక్కన ఉన్న గుంతలో ఒరిగిపోయింది. వారం రోజుల కిందట టెలిఫోన్ లైన్ల నిమిత్తం తవ్విన గోతులు సక్రమంగా పూడ్చకపోవడంతో వర్షాలకు నీరు చేరి గోతులు పెద్దవిగా మారాయి. ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో ప్రమాదవశాత్తూ గోతిలో ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇదిలా ఉంటే ఒరిగిన బస్సును బయటకు తీయడంలో అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో రాజాం – సంతకవిటి రోడ్డులో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. చేపల వర్తకులపై కేసు నమోదువిజయనగరం: పట్టణంలోని పలు కూడళ్ల వద్ద నిర్వహిస్తున్న చికెన్, మాటన్, చేపల దుకాణాలపై లీగల్ మెట్రాలజీ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. తూనిక రాళ్లు వినియోగించి వినియోగదారులను మోసగిస్తున్న ముగ్గురు చేపల వర్తకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా వినియోగదారులు కూడా మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని.. ఇందులోభాగంగా నెలలో రెండు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. తూకంలో మోసాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎం. దామోధరనాయుడు, తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిసాలూరు రూరల్: మండలంలోని చీపురువలస వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. స్థానిక పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అన్నంరాజువలస పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన రొంపల్లి ఆదినారాయణ శనివారం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి చీపురువలస వైపు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆదినారాయణను మామిడిపల్లి పీహెచ్సీకి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం సాలూరు సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి, అనంతరం తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుడు పాచిపెంట మండలం గురువునాయుడుపేట పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విత్తన చట్టం గురించి తెలుసా..
టెక్కలి: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో విత్తనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే రైతు అవసరాన్ని ఆసరాగా చేసుకుని రైతులను మోసగించే చర్యలకు కళ్లెం వేసేందుకు విత్తన చట్టం ఒకటి ఉందని పూర్తి స్థాయిలో రైతులకు తెలియదు. విత్తనాలు కొనుగోలు చేసే రైతుకు ఎలాంటి అన్యాయం జరి గినా ఈ చట్టం ద్వారా సంబంధిత విత్తనాల డీల ర్లపై కఠినతరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. విత్తన చట్టం 1966, విత్తన నిబంధనలు 1968, విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 తదితర చట్టా లు పొందు పరచి విత్తనపరమైన అతిక్రమణలు, ఉల్లంఘనలు వర్తించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. విత్తన విక్రయాల్లో మోసాలకు పాల్పడిన వారిపై విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 3 అతిక్రమించినందుకు ఆయా దుకాణాల్లో విత్తనాలను జప్తు చేయడంతో పాటు అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్ ఏ ప్రకారం జరిమానాకు గురవుతారు. వీటిలో కొన్ని చట్టాలను గమనిస్తే... విత్తన లైసెన్సు ప్రదర్శన తప్పనిసరి ప్రైవేట్ విత్తనాల విక్రయ దుకాణాల్లో తప్పనిసరిగా విత్తన లైసెన్సును ప్రదర్శించాలి. విత్తన లైసెన్సు లేకుంటే ఆయా దుకాణాల్లో విత్తనాల అమ్మకాలను నిలిపివేయవచ్చు. అంతే కాక నోటీసు ఇస్తూ దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 5 ప్రకారం డీలర్ లైసెన్సు సస్పెండ్, రద్దు చేయవచ్చు. ధరల బోర్డు, స్టాకు బోర్డు ఏర్పాటు చేయాలి విత్తనాలు విక్రయించే దుకాణాల్లో కచ్చితంగా ధర లు, స్టాకు బోర్డులను ఏర్పాటు చేయాలి. అలా లేకుంటే విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 8 ప్రకారం ఆయా దుకాణాల్లో విత్తనాల అమ్మకాలు నిలుపుదల చేయవచ్చు. అంతే కాకుండా అధికారులు ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే లైసెన్సు సస్పెండ్, రద్దు చేయవచ్చు. అమ్మకాల రశీదు ఇవ్వాల్సిందే విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు ఆయా దుకాణదారుడు కచ్చితంగా రశీదు ఇవ్వాలి. రశీదు ఇవ్వని పక్షంలో విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 9 ప్రకారం ఆయా దుకాణదారునికి ముందుగా నోటీ సు జారీ చేసి దానికి సరైన సమా ధానం ఇవ్వకపోతే ఆయా డీలర్ లైసెన్సును సస్పెండ్, రద్దు చేయవచ్చు. విత్తనాల బస్తాలపై లేబుల్ లేకపోతే.. ప్రైవేట్ విత్తనాల అమ్మకందారుడి వద్ద కొనుగోలు చేసిన విత్తనాల బస్తాలకు లేబుల్ లేకపోతే విత్తన చట్టం–1966 సెక్షన్ 7 ప్రకారం చర్యలు చేపట్టవ చ్చు. అంతే కాకుండా ఆయా విత్తనాలను జప్తు చేసే అధికారం ఉంది. అత్యవసర సరుకుల చట్టం–1955 సెక్షన్ 7 ప్రకారం జరిమానా విధిస్తారు. కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం –1966 సెక్షన్ 7 ప్రకారం విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 8 ను అనుసరిస్తూ డీలర్ లైసెన్సు సస్పెండ్, రద్దు చేయవచ్చు. జిల్లాలో ఇలా.. జిల్లాలో సుమారు 495 ప్రైవేట్ డీలర్ల దుకాణాలు ఉన్నాయి. వాటిలో సుమారు 132 మంది విత్తనాల విక్రయాల డీలర్లు, 196 మంది ఎరువుల విక్రయా ల డీలర్లు, 167 మంది పురుగు మందు విక్రయాల డీలర్లు ఉన్నారు. నిబంధనలు పాటించాలి ప్రభుత్వం పొందు పరిచిన విత్తన చట్టానికి అనుగుణంగా ప్రైవేట్ విత్తనాల డీలర్లు విత్తనాలను విక్రయించాలి. ఈ విషయంలో ఆయా డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాతో పాటు దుకాణాల లైసెన్సును పొగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. – బీవీ తిరుమలరావు, ఏడీ, వ్యవసాయ శాఖ, టెక్కలి ప్రతి ప్రైవేటు విత్తనాల దుకాణంలో లైసెన్సు ప్రదర్శించాలి కొనుగోలుదారునికి రశీదు తప్పనిసరి -
టీకాలతో వ్యాధులు దూరం..
● ప్రతి సోమ, గురువారాల్లో ఉచితంగా టీకాలు ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా నిల్వలు పూసపాటిరేగ : వ్యాధుల నుంచి జీవితాంతం రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. గర్భం దాల్చినప్పటి నుంచి అప్పుటే పుట్టిన చిన్నారులకు ప్రభుత్వం సూచించిన సమయాలలో ఆయా టీకాలు, వ్యాక్సిన్లు వేయిస్తే వ్యాధులు దరి చేరకుండా జీవితాంతం ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజలకు టీకాలపై సరైన అవగాహన లేక వివిధ రకాల వ్యాధులకు గురవుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న ఉచిత టీకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోమ, గురువారాల్లో గర్భిణులు, చిన్నారులు, వయోజనులకు ఉచితంగా వ్యాధినిరోధక టీకాలు వేస్తారు. వాక్సిన్లు వేసేదిలా.. ● గర్భిణిగా నిర్ధారైన మూడు నెలలు నిండిన తర్వాత టీటీ ఇంజిక్షన్ వేయాలి. నెల రోజుల వ్యవధిలో మరో టీటీ ఇంజిక్షన్ వేయాలి. వీటితో పాటు ఐరన్, ఫోలిక్, కాల్షియం టాబ్లెట్లు వేసుకోవాలి. ● అప్పుడే పుట్టిన చిన్నారికి 24 గంటల వ్యవధిలో పోలియో చుక్కలు, హెపటైటిస్–బి డోసు వేయాలి. వీటి వల్ల పోలియో, పచ్చకామెర్ల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ● 14 రోజుల వ్యవధిలో క్షయ రాకుండా బీసీజీ టీకా వేయించాలి. ● ఆరు, 14 వారాలలో ఐవీపీ చుక్కలు వేయించాలి. వీటితో పాటు 6, 10, 14 వారాల వ్యవధిలో పోలియో చుక్కలు, పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేయించాలి. ● తొమ్మిది నెలలు నిండి 12 నెలల వ్యవధిలో తట్టు వ్యాధి రాకుండా మీజిల్స్, కంటి, చర్మ వ్యాధులు రాకుండా విటమిన్ –ఎ చుక్కలు వేయించాలి. ● 16 నెలలు నిండి 24 నెలల వ్యవధిలో బూస్టర్ డోసు డీపీటీ, మీజిల్స్ విటమిన్– ఏ వేయించాలి. ● ఐదేళ్లు పూర్తయిన తర్వాత డీపీటీ డోసు వేయించాలి. ● 10, 16 సంవత్సరాలు పూర్తయితే టెట్నాస్ (టీటీ) వేయించాలి ● తొమ్మిది నెలల నుంచి ఐదేళ్ల వయసు వరకు ప్రతి ఆరు నెలలకోసారి విటమిన్–ఎ చుక్కలు మొత్తం తొమ్మిది డోసులు వేయించాలి. ● 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు బీసీజీ టీకాలు వేయించాలి. టీకాలు తప్పనిసరి గర్భిణులు, చిన్నారులకు నిర్దేశించిన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలి. వీటి వల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుకోవచ్చు. తాజాగా వచ్చిన బీసీజీ టీకాలను క్షవ్యాధి ఉన్నా, 60 సంవత్సరాలు పైబడినా వేయించుకోవాలి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ టీకాలపై అవగాహన కల్పిస్తున్నాం. – రాజేష్వర్మ, వైద్యాధికారి, పూసపాటిరేగ పీహెచ్సీ -
నిబంధనలు బేఖాతరు
● ఎన్ఓసీ లేకుండానే కొనసాగుతున్న పెట్రోల్ బంకులు, కోల్డ్ స్టోరేజీలు ● ఇష్టారాజ్యంగా నిర్వహణ ● నోటీసులకు స్పందించని యాజమాన్యాలు ● పెట్రోల్ బంకుల్లో కనిపించని సౌకర్యాలు, సేవలు ● కానరాని అధికారుల తనిఖీలురామభద్రపురం: పరిశ్రమలు, గిండ్డంగులు, సా మిల్లులు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు, దుస్తుల దుకాణాలు, సినిమా థియేటర్లు, హోమ్నీడ్స్, పాఠశాలలు ఇలా ప్రజలతో ముడిపడి ఉన్న సంస్థలేవైనా స్థాపించి కొనసాగించాలంటే సంబంధిత యాజమాన్యాలు ముందుగా అగ్నిమాపక శాఖ నుంచి తప్పనిసరిగా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సిందే. అలాగే ఆయా విభాగాల అనుమతులు కూడా తీసుకోవాలి. ఒకవేళ అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకుంటే ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాలి. అయితే ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండా మండలంలో కొన్ని సంస్థలు కొనసాగుతున్నాయి. రెండేళ్ల కిందట సాలూరు రూట్లో ఏర్పాటు చేసిన పెంట్రోల్ బంకులు మొదట్లో అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకున్నారు. అయితే ఆ అనుమతులు ముగిసిపోయి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ రెన్యువల్ చేసుకోలేదు. సదరు యాజమాన్యాలకు అగ్నిమాపక శాఖాధికారులు నోటీసులిచ్చినా స్పందించలేదని సమాచారం. పెట్రోల్ బంకుల్లో ప్రమాదాలేమైనా జరిగితే ఎవరు బాధ్యులవుతారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలన ఊసేలేదు... వాస్తవానికి బంకుల వద్ద ఏ రోజుకారోజు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రదర్శించాలి.పెట్రోల్, డీజిల్లో నాణ్యత కొరవడితే ఏ అధికారికి ఫిర్యాదు చేయాలి..? ఎవరిని సంప్రదించాలి..? వారి పేర్లు, హోదా తెలియజేస్తూ ఫోన్ నంబర్లు నోటీసు బోర్డులో పొందుపరచాలి. కానీ కొద్ది బంకుల్లో మాత్రమే ఇటువంటివి కనిపిస్తుంటాయి. తూనికలు, కొలతల శాఖాధికారులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు బంకులను తనిఖీ చేయాలి. సంబంధిత ఆయిల్ కంపెనీ ప్రతినిధి సైతం సందర్శించి పెట్రోల్, డీజిల్ నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇవేమీ జరగడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. అలాగే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేటప్పుడు అన్ని సదుపాయాలు ఉంటేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారులు ఇవేవీ చూడకుండానే అనుమతి పత్రాలు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద కల్పించాల్సిన సౌకర్యాలు.. పెట్రోల్ బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీరు సదుపాయం కల్పించాలి. దీనికోసం బంకు యజమాని ఆర్ఓ మెషీన్, వాటర్ కూలర్, వాటర్ కనెక్షన్ ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఏ పెట్రోల్ బంకులోనైనా తాగునీటి సౌకర్యం లేకపోతే వినియోగదారుడు చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారులు అత్యవసర, అనారోగ్య సమయాల్లో ఫోన్ చేసుకునేందుకు పెట్రోల్ బంకుల వద్ద ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించాలి. వాహనదారులు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే ఆ సమయంలో వాహన చోదకుడు వద్ద మొబైల్ ఫోన్ లేకపోతే..సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న ఉచిత టెలీఫోన్ ద్వారా వినియోగదారుడు కాల్స్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్లు లేకుంటే సంబంధిత చమురు కంపెనీకి లేదా పౌరసరఫరాల అధికారులు, తహసీల్దార్లకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరిగా ఉండాలి. వినియోగదారులు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. యాజమాన్యం ప్రథమ చికిత్స కిట్టు ఇవ్వడానికి నిరాకరిస్తే రాత పూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చు. పెట్రోల్, డీజిల్కి సంబంధించి బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎయిర్ మెషీన్ ఏర్పాటు చేసి అవసరమైన వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపాలి. అలాగే ఫిర్యాదు బాక్స్ లేదా రిజిస్టర్ ఉంచాలి. ఇందులో వినియోగదారులు తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. లేదంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ను సందర్శించి ఫిర్యాదు చేయవచ్చు.నోటీసులిచ్చాం.. సామూహిక ప్రజలతో ముడిపడి ఉన్న సంస్థలేవైనా అగ్నిమాపక శాఖ నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాలి. బాడంగి అగ్నిమాకకేంద్రం పరిధిలో ఎన్ఓసీ లేని పరిశ్రమలకు నోటీసులిచ్చాం. అలాగే సాలూరు రూట్లో ఉన్న పెట్రోల్ బంకులు ఎన్ఓసీ రెన్యువల్ చేసుకోవాలని నోటీసులిచ్చాం. ఇంతవవరకు వారి నుంచి స్పందన లేదు. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – బీఆర్ నాయుడు, అగ్నిమాపకశాఖాధికారి, బాడంగి నిబంధనలు పాటించాల్సిందే... పెట్రోల్ బంకు యాజమాన్యాలు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. తాగునీరు, మరుగుదొడ్లు, ఉచితంగా గాలి వంటివి తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. అధికారులు ఎప్పటికప్పుడు బంకులను పరిశీలిస్తున్నారు. కనీస సౌకర్యాలతో పాటు వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునే హక్కు కూడా ఉంది. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. – ఎ. సులోచనారాణి, తహసీల్దార్, రామభద్రపురంకానరాని నిబంధనలు.. పెట్రోల్ బంకుల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. సగానికి పైగా బంకుల్లో ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించవు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారే తప్ప కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరగా గమ్యం చేరాలనే వినియోగదారుడి ఆరాటం, అవగాన లోపం బంకుల యాజమాన్యాలకు కలిసివస్తోంది. -
గంజాయితో ఒకరి అరెస్ట్
గంట్యాడ: గంజాయి తరలిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ పోలీస్స్టేషన్లో సీఐ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్రనాయుడు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం శెట్టిబంద గ్రామానికి చెందిన వంతలు డంబుతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి నుంచి 49 కిలోల గంజాయిని తీసుకువచ్చి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఓ వ్యక్తికి అప్పగించేందుకు బేరం కుదుర్చుకున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నిందితులు ఆటోలో గంజాయి తీసుకువస్తూ కొఠారుబిల్లి జంక్షన్ వద్దకే వచ్చేసరికి సరుకు అప్పగించాల్సిన వ్యక్తికి ఫోన్ చేశారు. ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్కు రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పడంతో నిందితులు బుడతానపల్లి రోడ్డులో ఉన్న ప్రభుత్వ కళాశాల వద్దకు చేరుకున్నారు. ప్రధాన నిందితుడు డంబును అక్కడే ఉంచి మిగిలిన నలుగురు బయటకు వెళ్లారు. గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి దాడిచేసి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో ఉన్న ఆటోను సీజ్ చేశారు. డంబును కోర్టులో హాజరుపరచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు సబ్జైల్కు తరలించారు. మిగిలిన నలుగురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు. -
చేపల వేట ఆరంభం
తొలిరోజు చింతపల్లి తీరంలో వేట ముగించి బోటులో ఒడ్డుకు చేరుకుంటున్న మత్స్యకారులు పూసపాటిరేగ: సముద్రంలో వేట నిషేధం గడువు ముగిసింది. మత్స్యకారులు శనివారం తెల్లవారు జామున వేటకు శ్రీకారం చుట్టారు. పూసపాటిరేగ, భోగాపురం తీరప్రాంతంలోని మత్స్యకారులు తొలుత గంగమ్మతల్లికి పూజలు చేశారు. అనంతరం 420 బోట్లలో సముద్రంలో వేటకు బయలుదేరారు. చింతపల్లి, పతివాడ బర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, పులిగెడ్డపేట, ముక్కాం, చేపలుకంచేరు, కొండ్రాజుపాలెం రేవుల నుంచి వేట సాగించారు. సాధారణ వలకు ముగ్గురు, ఇంజిన్బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు సుమారు 5 నుంచి 20 కిలో మీటర్ల దూరం వరకు సంద్రంలోకి వెళ్లారు. వలకు చేపలు చిక్కిన వారు మధ్యా హ్నం 12 గంటలకు ఒడ్డుకు చేరుకున్నారు. ఒక్కో బోటుకు రూ.6వేలు నుంచి రూ.15వేలు విలువచేసే మత్స్యసంపద దొరకడంతో సంతో షం వ్యక్తంచేశారు. తీరంలోనే చేపలను విక్రయించారు. వేట నిషేధ భృతి అందజేయాలి గత నాలుగేళ్లుగా ఏటా చేపలవేట నిషేధ సమయంలో ఠంచన్గా రూ.10వేలు చొప్పున పరిహారం బ్యాంకు ఖాతాకు జమయ్యేది. ఈ ఏడాది ఎన్నికల కోడ్ అని ఆలస్యం చేశారు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వేటనిషేధ భృతిని రూ.20వేలకు పెంచి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారో తెలియడం లేదు. ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్నాం. త్వరితగతిన భృతిచెల్లించి మత్స్యకారులను ఆదుకోవాలి. – చిన్నిపిల్లి నీలయ్య, మత్స్యకారుడు, చింతపల్లిబర్రిపేటతొలిరోజు వేట బాగుంది రెండు నెలలు వేట విరామం తరువాత ఇష్ట దైవానికి పూజలు చేసి శనివారం వేకువ జామున సముద్రంలో వేటకు బయలుదేరాం. మత్స్య సంపద వలకు చిక్కిన తరువాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒడ్డుకు చేరాం. మొదటిరోజు వేట సంతృప్తికరంగానే సాగింది. – మైలపల్లి కొండ, మత్స్యకారుడు చింతపల్లి 61 రోజుల విరామం తరువాత ఉత్సాహంగా వేటకు వెళ్లిన మత్స్యకారులు జిల్లాలో మొదటిరోజు 420 బోట్లపై వేటకు.. తొలుత గంగమ్మతల్లికి పూజలు మత్స్యసంపదతో తిరిగి ఒడ్డుకు.. -
రక్తదానం సామాజిక బాధ్యత
విజయనగరం ఫోర్ట్: రక్తదానం సామాజిక బాధ్యత అని గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దె చిరంజీవి అన్నారు. స్థానిక రెడ్క్రాస్ సొసైటీలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక రోజున రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. రక్తదాతలే ప్రాణదాతలని తెలిపారు. ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ ఏడాదికి ఒక సారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్యం దరిచేరదన్నారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అబ్దుల్ రవూఫ్, రెడ్ క్రాస్ కార్యదర్శి సత్యం పాల్గొన్నారు. గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దె చిరంజీవి -
జంతు సంక్షేమ చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు
● జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వరరావు విజయనగరం ఫోర్ట్: బక్రీద్ పండగ (ఈ నెల 17) సందర్భంగా జంతు సంక్షేమ చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అక్రమ పశువధ, జంతు రవాణా నేరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రిజర్వేషన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్లాటర్ యాక్ట్–1977, ట్రాన్సఫోర్ట్ ఆఫ్ యానిమల్ రూల్స్–1978, 2001 జంతు సంక్షేమ చట్టాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై జిల్లాలో పశు సంవర్థక శాఖ అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు దృష్టిసారించాలని ఆదేశించారు. గోమాతకు సీమంతం గుర్ల: మండల కేంద్రంలోని శివాలయంలో పుంగనూరు గోవుకు భక్తులు శనివారం సీమంతం చేశారు. శివాలయంలో గోమాతకు శ్రీమంతం చేయడం ఇదే మొదటిసారి అని ఆలయ అర్చకుడు సురేష్ శర్మ తెలిపారు. మహిళలకు తాంబులాలు ఇచ్చారు. గోవుల పరిరక్షణకు అందరు కృషి చేయాలని భక్తులు పిలుపునిచ్చారు. జాబ్మేళాకు 89 మంది హాజరు విజయనగరం పూల్బాగ్: జాబ్ డీలర్స్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి జిల్లా ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఐటీఐలో శనివారం నిర్వహించిన జాబ్మేళాకు 89 మంది హాజరయ్యారు. వీరిలో 42 మందిని తదుపరి రౌండ్కు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ మాట్లాడుతూ ఉపాధి కల్పన కోసం ఏర్పాటుచేస్తున్న జాబ్మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంలు కె.రామచంద్రరావు, కె.లక్ష్మణరావు, హెచ్ఆర్ సందీప్, యంగ్ ప్రొఫెషన్ ఎం.యశ్వంత్ బాబు, తదితరులు పాల్గొన్నారు. స్పందన పేరు మార్పు విజయనగరం అర్బన్: ప్రజల నుంచి ఫిర్యా దుల స్వీకరణ, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమం పేరు మారింది. ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసిల్ సిస్టమ్గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆకట్టుకున్న నటరాజ బృందం భజన కీర్తనలు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సన్నిధిలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం గ్రామానికి చెందిన నటరాజ భజన బృందం 25 మంది సభ్యులు అమ్మవారిని స్తుతిస్తూ శనివారం భజనలు చేశారు. భక్తి కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు భజన బృంద సభ్యులను దుశ్శాలువల తో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపర్ వైజర్ ఏడుకొండలు, పైడితల్లి అమ్మవారి దీక్షా పీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
ఈదురు గాలులబీభత్సం
సంతకవిటి: గోళ్లవలస రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు విజయనగరం పట్టణంపై కమ్ముకున్న మేఘాలువంగర: కోనంగిపాడులో ట్రాక్టర్పై కూలిన చెట్టు రైతు ప్రాణం తీసిన విద్యుత్ తీగలు నెల్లిమర్ల రూరల్: తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అలుగోలు గ్రామానికి చెందిన కెల్ల అప్పలనాయుడు(65) శనివారం వేకువ జామున ఆవుల పాలు తీసేందుకు కల్లాం వద్దకు వెళ్తుండగా, సమీపంలోని రామప్పుడు కల్లాల వద్ద శుక్రవారం రాత్రి గాలి, వానకు తెగిపడిన విద్యుత్ వైర్లు ఆయన ఛాతికి తగలడంతో షాక్కు గురయ్యాడు. అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడు కుమారుడు రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామగణేష్ తెలిపారు. సాక్షి నెట్వర్క్: విజయనగరం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఆ శాఖ సిబ్బంది వర్షంలోనే పరుగులు తీశారు. ● సంతకవిటి మండలంలోని అన్ని గ్రామాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. సంతకవిటిలో ఇంటి పైకప్పులు, షాపుల పైకప్పులు ఎగిరిపోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. ● వంగర మండలం కోనంగిపాడులో చందక కృష్ణమూర్తికి చెందిన ట్రాక్టర్పై చెట్టు కూలిపోయింది. స్థానికుల సాయంతో చెట్ల కొమ్మలు తొలిగించి ట్రాక్టర్ను బయటకు తీశారు. ● వేపాడ మండలంలోని వేపాడ, వల్లంపూడి గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వల్లంపూడి నుంచి చామలాపల్లి వెళ్లే రహదారిలో దబ్బిరాజుచెరువు గట్టు, చామలాపల్లి సమీపంలో చెట్లు, స్తంభాలు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వేపాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద చెట్టుతో పాటు ఓ వైపు గోడ పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. రెడ్డివీధిలో ఒకటి, రాజవీధిలో ఒకటి, పోలీస్ స్టేషన్ సమీపంలో ఒకటి, శానాపతి వీధిలో ఒక విద్యుత్ స్తంభం విరిగిపో యాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ● బాడంగి మండలం వీరసాగరంలో ఎల్టీ లైన్కు చెందిన మూడు స్తంభాలు, గొల్లాదిలో వ్యవసాయ పంపు సెట్కు చెందిన రెండు స్తంభాలు, గజరాయునివలస గ్రామాల్లో చింతకొమ్మలు, టేకు చెట్లు పడిపోవడంతో మరో స్తంభం విరిగిపోయినట్టు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు చెప్పారు. ఈదురుగాలులకు మండలంలో విద్యుత్శాఖకు సుమారు లక్షా50వేల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ● రాజాం పట్టణంతో పాటు మండలంలో ఈదుర గాలులు బీభత్సం సృష్టించాయి. రాజాం, సంతకవిటి మండలాల ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే చెట్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. డోలపేట పెద్దవీధిలో ఓ పశువులపాకకు ఆనుకుని ఉన్న చెట్టుపై పిడుగుపడింది. దీంతో పశువులపాకలో ఉన్న డోల గాంధీకి చెందిన రూ.40వేలు విలువైన ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు రాకపోకలకు అంతరాయం నిలిచిన విద్యుత్ సరఫరా పిడుగుల వానతో జనం బెంబేలు -
ఇదేమి చోద్యం..!
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో నిరుపేదలకు ఇచ్చిన స్థలాల్లో తోటపల్లి ప్రాజెక్ట్ పిల్ల కాలువ తవ్వకాలు చేపడుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమరసింగి వెళ్లే రహదారిలో సర్వే నంబర్ 45/1లో సుమారు 16 మంది నిరుపేదలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే స్థానిక టీడీపీ నాయకులు కావాలనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తోటపల్లి కెనాల్ కాలువ నుంచి ఇళ్ల స్థలాల మీదుగా అక్రమంగా పిల్ల కాలువను తవ్విస్తున్నారు. ఇదిలా ఉంటే ఇళ్ల స్థలాలకు ఆనుకుని పూర్వం కాలువ ఉండేదని, మట్టితో కప్పేయడంతో పాత కాలువనే తిరిగి తీస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఈ వ్యవహరంపై తహసీల్ధార్ ధర్మరాజు వివరణ కోరగా.. ఫిర్యాదు అందితే పరిశీలిస్తామని, ఇళ్ల స్థలాల మధ్యలో కాలువ నిర్మాణం చేపడితే తొలగిస్తామన్నారు. తోటపల్లి జేఈ సంతోషి స్పందిస్తూ ఇళ్ల స్థలాలు తోటపల్లి కాలువ పరిధిలో లేవని, పూర్వం నుంచి ఉన్న కాలువనే తవ్వుతున్నట్లు అక్కడి రైతులు తమకి చెప్పారని బదులిచ్చారు. నిరుపేదల ఇళ్ల స్థలాల్లో ‘తోటపల్లి’ పిల్ల కాలువ తవ్వకాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు -
వ్యక్తి ఆత్మహత్య
రాజాం సిటీ: మండల పరిధి గడిముడిదాం గ్రామానికి చెందిన ముడిదాన గురయ్య (42) శనివారం ఉరివే సుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గురయ్య తన భార్యాపిల్లలతో కలిసి విశాఖపట్నం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరగడంతో స్వగ్రామానికి వచ్చి మళ్లీ విశాఖ వెళ్లిపోయాడు. వారం రోజుల కిందట టీవీ తీసుకువచ్చి ఇంటిలో ఒక్కడే ఉంటున్నాడు. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. ఇదిలా ఉంటే శనివారం మధ్యాహ్నం ఇంటిలో నుంచి మాడు వాసన రావడంతో స్థానికులు చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై. రవికిరణ్ తెలిపారు. -
రోగులను రక్షించడమే సర్జన్ల లక్ష్యం
విజయనగరం ఫోర్ట్: రోగులను రక్షించడం కోసం సర్జన్లు పరితపిస్తారని, ఈ క్రమంలో ఎంతో మంది సర్జన్లు తమ జీవితాన్ని అంకితం చేశారని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె. తిరుమల ప్రసాద్ అన్నారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా డే సందర్భంగా రోటరీ, విజయ బ్లడ్ బ్యాంక్ల్లో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సర్జికల్ అసోసియేషన్ ప్రపంచంలోని అతి పెద్ద అసోసియేషన్గా పేర్కొన్నారు. రోగుల ప్రాణాలు కాపాడే సమష్టి ప్రయత్నంలో సర్జిన్లు భాగస్వాములని చెప్పారు. సర్జన్లందరూ సమాజంలో ఆదర్శంగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ ఎ.రమణి, కోశాధికారి ఎ.గోపినాథ్, తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు తిరుమలప్రసాద్ -
పిడుగు పాటుకు గేదె మృతి
శృంగవరపుకోట: పిడుగు పాటుకు గేదె మృతి చెందిన సంఘటన మండలంలోని సీతారాంపురంలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగులు కూడా పడడంతో సీతారాంపురంలో ఆర్. శంకరరావుకు చెందిన గేదె మృతి చెందింది. సుమారు లక్షా యాభై వేల రూపాయల విలువైన గేదె చనిపోవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. కొండపేటలో.. రాజాం సిటీ: మున్సిపాలిటీ పరిధి కొండంపేటలో పిడుగులు పడి పలువురి ఇళ్లల్లో గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో గ్రామానికి చెందిన అయ్యప్పస్వామి ఆలయ ధర్మకర్త ముద్దన సత్యారావు ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఇంటి గోడ కూలిపోవడంతో పాటు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, ఫ్యాన్ పాడయ్యాయి. అలాగే అదే వీధికి చెందిన చిప్పాడ సూర్యనారాయణ, రావి రాంబాబులతో పాటు మరికొంత మందికి చెందిన సుమారు 20 వరకు సీలింగ్ ఫ్యాన్లు, 10 వరకు టీవీలు కాలిపోయాయి. -
జిందాల్ కర్మాగారాన్ని తెరిపించేందుకు కృషి చేస్తా
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారాన్ని తెరిపించేందుకు కృషి చేస్తానని విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్ తెలిపారు. కర్మాగారం గత నెల 17వ తేదీన ముడిసరుకు కొరత కారణంగా మూసివేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి కర్మాగారం గేటువద్ద కార్మికులు వంటా వార్పుతో ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి ఎంపీ శ్రీభరత్ కార్మికుల దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించారు. కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువుదీరిన అనంతరం కర్మాగారానికి ముడిసరుకు కేటాయింపులపై చర్చిస్తామని, కర్మాగారం తెరిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అర్ధాంతరంగా లే ఆఫ్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు. అనంతరం కొత్తవలసలో విద్యుత్ షార్టు సర్క్యూట్తో ఇళ్లు కాలిపోయిన ఇద్దరు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున సాయం అందించాలని చంద్రశేఖర్కు సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజేష్ పాల్గొన్నారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మక్కువ: మండలంలోని వెంకట బైరిపురం గ్రామానికి చెందిన మరడ ఈశ్వరరావు (37) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈశ్వరరావు మద్యానికి బానిసై భార్యా, పిల్లలను సక్రమంగా పట్టించుకోవడం లేదు. ఈ నెల 8వ తేదీన మద్యం తాగేందుకు డబ్బులు కావాలని భార్య కృష్ణవేణిని అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో చచ్చిపోతానని బెదిరించాడు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో గడ్డి మంది తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడ్ని మక్కువ పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 14వ తేదీ రాత్రి మృతి చెందాడు. భార్య కృష్ణవేణి శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం
కొత్తవలస: కొత్తవలస నుంచి విజయనగరం వైపు వెళ్లే రైల్వేలైన్లో నిమ్మలపాలెం గ్రామ సమీపంలో గల రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. ఈ మేరకు రైల్వే పోలీసులకు సమచారం అందించగా ఎస్సై రవివర్మ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుందని.. నీలం రంగు షర్ట్ ధరించాడాని ఎస్సై చెప్పారు. మృతుడి వద్ద తాపీపని చేసే సామగ్రి ఉన్నట్లు గుర్తించారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని విజయనగరం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. -
మనస్తాపంతో మరొకరు..
భామిని: భార్య మాట వినడం లేదని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... మండలంలోని బిల్లుమడ కాలనీలో గంగాధర పద్మనాభం చిన్న హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శుక్రవారం ఉదయం హోటల్ తీసే సమయానికి అతని భార్య రాకపోవడంతో మందలించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన పద్మనాభం పురుగు మందు తాగాడు. వెంటనే భార్య, స్థానికులు గమనించి 108 వాహనంలో భామిని పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పి. కాంతారావు తెలిపారు.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
కారుపై పెద్దపులి దాడి..
టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్..?
హనీరోజ్ 'రాహేలు' టీజర్ విడుదల
సీరియస్గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
ఇద్దరూ టెకీలే: క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా 'రా రాజా'.. టీజర్తోనే భయపెట్టారు!
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
Advertisement