Bus accident
-
గచ్చిబౌలి: ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి చెందింది. టెన్త్ పరీక్ష రాయించి చెల్లిని అన్న బైక్పై తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అన్నకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీకి చెందిన విద్యార్థిని టెలికాం నగర్లో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. నిన్నటి (శుక్రవారం) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవ్వగా, ఇవాళ రెండో రోజైన శనివారం తన అన్న బైక్ పై పరీక్షకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడింది. ఈ ఘటనలో బైక్పై వెనుక కూర్చున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డారు. -
హైదరాబాద్లో విషాదం.. మార్నింగ్ వాక్కు వెళ్లి అడిషనల్ ఎస్పీ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ రోడ్డు దాటుతున్న సమయంలో అతడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ క్రమంలో ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. -
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోగా.. ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఓ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో భారీ సంఖ్యలోప్రాణనష్టం వాటిల్లింది. రాజస్థాన్లోని దుడు రీజియన్లజజైపూర్-అజ్మీర్ హైవేపై మౌంఖపూరాకు అతి దగ్గర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయ్యాలయ్యాయి.బస్సు ముందు టైర్ పేలిపోవడంతో అది కాస్తా అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సును కంట్రోల్ చేయడానికి యత్నించిన డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దాంతో కారులో ఉన్న వారు పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
నాలుగు రోజులు మృత్యువుతో పోరాడిన దీక్షిత..
పెందుర్తి: రాజమండ్రిలో బుధవారం జరిగిన కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈల్లా దీక్షిత(22) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సుజాతనగర్కు చెందిన దీక్షిత, మర్రిపాలెనికి చెందిన ఆమె బంధువు కల్యాణి ఇంటర్వ్యూ నిమి త్తం విశాఖ నుంచి హైదరాబాద్కు కావేరి ట్రావెల్స్ బస్లో ఈ నెల 22న బయలుదేరారు. రాజమండ్రి వద్దకు వెళ్లేసరికి బస్ బోల్తా పడడంతో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో గాయపడిన దీక్షితను నగరంలోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి చికిత్స నిమి త్తం తీసుకువచ్చారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దీక్షిత కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. మరోవైపు ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కావేరి ట్రావెల్స్ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ కనీసం స్పందించకపోవడం పట్ల బంధువులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. -
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
-
రోడ్డు ప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(Bus Accident) బుధవారం అర్థరాత్రి 12.30 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు కావేరి ట్రావెల్స్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు– కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది(Road Accident). రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేవరకూ గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు బస్సు తిప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి (20) అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గుర్ని కాకినాడ ఆస్పత్రికి, ఇద్దర్ని రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో 13 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. -
కారు ప్రమాదంలో దంపతుల మృతి: Tirupati
-
సూర్యాపేటలో రెండు బస్సులు ఢీ.. ఇద్దరు మృతి
-
చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం
చిత్తూరు, సాక్షి: జిల్లా శివారు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.చిత్తూరు శివారులో గంగాసాగరం(Gangasagaram) వద్ద అర్ధరాత్రి 2 గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus).. ఆ టిప్పర్ను తప్పించబోయి డివైడర్ను ఢీ కొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. సీఎంసీ వేలూరు ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.గంగసాగరం సమీపంలోని గాజుల పల్లి ఫ్లై ఓవర్ వద్ద టిప్పర్ లారీ వేగంగా ప్రవేట్ బస్సు ఢీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకు వెళ్తోంది. రంగనాధన్ ఇన్ ట్రావెల్స్ బస్సు ఇది. నలుగురు స్పాట్లో చనిపోయారు. విషమంగా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సి.ఏం.సి ఆసుపత్రి కు తలించాం. మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. :::శ్రీనివాసరావు, చిత్తూరు రూరల్ సీఐ -
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం
తిరుపతి: తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్రోడ్లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు . ఈ ఘటనలో పలువురు భక్తులకు(Several Devotees) గాయాలయ్యాయి. ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య అడ్డంకిగా మారి జాప్యం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి వరకూ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంఈరోజు తిరుమల(Tirumala) లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.అయితే ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం -
Bus Accident: నలుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. పౌరీ గర్వాల్ జిల్లాలో ఓ బస్సు(Bus Accident) అదుపుతప్పి కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో నలుగురు మృత్యవాత పడ్డారు. ఈ ఘటనలో 15 మంది వరకూ గాయాలయ్యాయి,. బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త తెలుసుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాంతో పాటు స్థానికంగా ఉన్నవారు కూడా ఆ ప్రాంతానికి తమ సాయం అందిస్తున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, 17 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
శబరిమలలో హైదరాబాద్ స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి
తిరువనంతపురం: హైదరాబాద్ నుండి కేరళ వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. పంబా వెళ్తున్న క్రమంలో ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడిపోవడంతో ప్రమాదం జరిగింది. పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప స్వాములను ఉప్పర్గూడకు చెందిన వారిగా గుర్తించారు. -
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయపడిన బస్సు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు 1500 అడుగుల లోయలో పడింది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాకు చెందిన ఓ బస్సు 27మంది ప్రయాణికులతో భీమ్టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తుంది. అయితే నైనిటాల్ జిల్లా భీమ్తాల్లోని అమ్దాలి సమీపంలో బస్సు అదుపు తప్పింది. పక్కన ఉన్న 1500అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదం ముగ్గురు మృతి చెందారు. పదిమంది గాయపడ్డారు. ప్రమాదంతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. నైనిటాల్ నుండి ఎస్డీఆర్ఎఫ్,అగ్నిమాపక శాఖ బృందాలను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. Uttarakhand | A team of SDRF team is carrying out a rescue operation at Bhimtal bus accident site along with local police, local people and Fire Department pic.twitter.com/Adlbmb4F9E— ANI (@ANI) December 25, 2024కాగా, రోడ్డు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు ప్రమాద బాధితులకు తక్షణమే సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉండాలని కేదార్ బాబాను కోరుకున్నారుभीमताल के निकट बस के दुर्घटनाग्रस्त होने का समाचार अत्यंत दुःखद है। स्थानीय प्रशासन को त्वरित राहत एवं बचाव कार्य के लिए निर्देशित किया है। बाबा केदार से सभी यात्रियों के सकुशल होने की कामना करता हूं।— Pushkar Singh Dhami (@pushkardhami) December 25, 2024 -
ట్రక్కును ఢీకొన్న బస్సు.. 38 మంది మృతి
బ్రెసీలియా: బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో దాదాపు 38 మంది మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బ్రెజిల్లోని మినాస్గైరస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 38 మంది మృతిచెందారు. బస్సు ప్రయాణంలో ఉండగా టైర్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బ్రెజిల్ దేశ మీడియా తెలిపింది. అయితే, టైర్ ఉడిపోవడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసే సమయంలో వేగంగా ట్రక్కు ఢీకొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.MG: acidente com ônibus, carreta e carro deixa 38 mortosÔnibus vinha de São Paulo com 45 passageiros. O acidente ocorreu quando um pneu do coletivo estourou, em Teófilo Otoni, Minas Gerais pic.twitter.com/JAzdqjOol5— Regresso Nacional (@RegressoNaciona) December 22, 2024 -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో బస్సు ప్రమాదం
-
రాళ్ల గుట్టను ఢీకొన్ని కావేరి ట్రావెల్స్ బస్సు..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల గుట్టను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. -
Mumbai : ఆర్టీసీ బస్సు ప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్కి ఎలక్ట్రిక్ బస్సు నడపడం రాదని, ఈవీ బస్సుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తేలింది. పోలీస్ కస్టడీలో ఉన్న పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ పలు కీలక విషయాల్ని వెల్లడించాడు. ఎలక్ట్రిక్ బస్సు నడపడంలో తనకు అనుభవం లేదని, కేవలం ఒక్క రోజు ఈవీ బస్సును డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ ఒక్క రోజు కేవలం మూడుసార్లు నడిపిట్లు చేసినట్లు, అనంతరం విధులకు హజరైనట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.కాబట్టే 60 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న ఈవీ బస్సును ఎలా కంట్రోల్ చేయాలో తనకు అర్ధం కాలేదని, కాబట్టే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులకు చెప్పాడు. అనుభవం లేకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కిటికి అద్దాలు పగులగొట్టి, తన క్యాబిన్లో ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ముంబై ఆర్టీసీ విభాగంపై విమర్శలుముంబై ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. ఆరు వారాల పాటు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ మోరాకు ఈవీ బస్సులో విధులు అప్పగించడంపై ముంబై ఆర్టీసీ అధికారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్టీసీ బస్సు బీభత్సంగత సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 42మందికి తీవ్ర గాయాలయ్యాయి. 20కి పైగా వాహనాలు ధ్వంస మయ్యాయి. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధారించారు. 👉చదవండి : ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి.. -
ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదం
19 ఏళ్ల అఫ్రీన్ షా ఎంతో హుషారుగా తన జీవితంలో తొలి రోజు ఉద్యోగానికి వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. అఫ్రీన్ షా కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు. మొదటి రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆటోలు దొరక్కపోవడంతో తండ్రి అబ్దుల్ సలీంకు అఫ్రీన్ ఫోన్ చేసింది. కుర్లా స్టేషన్కు వెళ్లమని కూతురికి ఆయన సలహా ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు మరోసారి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని ఫోన్ చేశారు. అతడు ఆస్పత్రికి వచ్చే చూసేసరికి కూతురు నిర్జీవంగా కనిపించడంతో సలీం కుప్పకూలిపోయారు. అపురూపంగా పెంచుకున్న తన కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు.కన్నిస్ అన్సారీ(55) అనే నర్సు నైట్ షిప్ట్ డ్యూటీ చేసేందుకు బయలుదేరి అనూహ్యంగా పప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముంబై మహానగరంలోని కుర్లా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదం ఏడుగురిని బలిగొంది. 42 మందిని గాయాలపాల్జేసింది. కుర్లా రైల్వే స్టేషన్ - అంధేరి మధ్య నడిచే రూట్ నంబర్ 332 బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించడంతో ఈ ఘోరం జరిగింది. కుర్లా వెస్ట్లోని అంజుమన్-ఇ-ఇస్లాం స్కూల్ సమీపంలో నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.డ్రైవర్ తప్పిదం వల్లే..బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43) తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు.. పోలీసు వ్యాను, కార్లు, టూవీలర్లు, తోపుడు బండ్లతో సహా 22 వాహనాలను ఢీకొట్టింది. చివరకు గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రమాద తీవ్రత చూసిన వారంతా ఉగ్రదాడిగా భయపడి పరుగులు తీశారు. ‘ప్రమాదానికి గురైన వాహనాల జాబితాను సిద్ధం చేశాం. 22 వాహనాలను బస్సు ఢీకొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ మరిన్ని వాహనాలను ఢీకొట్టాడో, లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామ’ని ముంబై జోన్ 5 పోలీస్ డిప్యూటీ కమిషనర్ గణేష్ గవాడే మీడియాతో చెప్పారు.బస్సు కండిషన్లోనే ఉందిబస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్న వార్తలను గవాడే తోసిపుచ్చారు. బస్సు మంచి కండిషన్లో ఉందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. డిసెంబర్ 1 నుంచి డ్రైవర్ సంజయ్ మోర్ బెస్ట్ బస్సు నడుపతున్నాడని, గతంలో అతడు మాన్యువల్ మినీ బస్సు నడిపేవాడని వెల్లడించారు. ప్రయాణికులతో కూడిన బస్సును నడిపేందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడా, లేదా విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కాగా, డ్రైవర్ను డిసెంబర్ 21 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కుర్లా కోర్టు ఆదేశాలిచ్చింది.చదవండి: 150 అడుగుల బోరుబావిలో బాలుడు..‘ప్రమాదానికి కారణమైన బస్సులో ఎటువంటి సాంకేతిక లోపం లేదు. యాక్సిలరేట్ ఇచ్చిన తర్వాత వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. భయాందోళనకు గురై బ్రేక్కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. అతడు మొదట ఆటోరిక్షాను ఢీకొట్టాడు. ఆ తర్వాత పోలీసు వాహనం, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లను ఢీకొట్టాడు. గోడను ఢీకొట్టిన తర్వాత మాత్రమే బస్సు ఆగింద’ని డీసీపీ గణేష్ గవాడే తెలిపారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, సంబంధిత శాఖలు విచారించి నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. సంజయ్ మోర్ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అన్నది నిర్ధారించేందుకు అతడికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ప్రమాదంపై విచారణకు జరిపేందుకు ఫోరెన్సిక్, రీజినల్ ట్రాన్స్ఫోర్ట్ కార్యాలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?బస్సు ప్రమాదాన్ని చూసి ప్రత్యక్ష సాక్షులు భయాందోళన చెంతారు. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో సాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి జైద్ అహ్మద్ (26) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తాను. పాదచారులతో పాటు ఆటోరిక్షా, మూడు కార్లు, ఇతర వాహనాలను బస్సు ఢీకొట్టింది. నా కళ్ల ముందు కొన్ని మృతదేహాలను చూశాను. ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులను రక్షించి బాబా ఆసుపత్రికి తీసుకెళ్లాం. మరో మూడు చక్రాల వాహనం కూడా క్షతగాత్రులకు సహాయం అందించింద’ని తెలిపాడు.సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతిముంబై బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) భరిస్తుందన్నారు. -
Mumbai: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది
-
ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..
ముంబై: కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులను శివమ్ కశ్యప్ (18), కనీజ్ ఫాతిమా (55), అఫీల్ షా (19), అనమ్ షేక్ (20)లు మరణించారు. 29మంది గాయపడ్డారు. ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన కుర్లా- అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో జరిగిన ప్రమాద తీవ్రతను చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణ భయంతో పారిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్లో డ్రైవర్ను విచారించారు. సంజయ్ మోర్ను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇదీ చదవండి : నా డెత్ లేఖ సుప్రీం కోర్టుకు చేరాలి -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
ముంబై : మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు బోల్తాపడి 10 ప్రయాణికులు మరణించారు. పలువురి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మహరాష్ట్ర స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పేషన్(ఎంఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం భండారా నుండి సకోలి మీదుగా గోండియా అనే ప్రాంతానికి వెళ్తుంది.ఆ సమయంలో ఓ మలుపు వద్ద ఆర్టీసీ బస్సుకు అకస్మాత్తుగా ఓ ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చాడు. ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రమాదం జరగకుండా బస్సును పక్కకి తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికుల్లో 10 మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణ భయంతో బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. బస్సు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, తోటి వాహనదారులు ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియాబస్సు ప్రమాదంపై మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తక్షణమే రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..‘గోండియా జిల్లాలోని సడక్ అర్జున్ సమీపంలో శివషాహి ఆర్టీసీ బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మరణం నన్ను కలచి వేస్తుంది. మరణించిన వారికి నా నివాళి’అని తెలిపారు. ‘ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ఫడ్నవీస్ ట్వీట్లో పేర్కొన్నారు. गोंदिया जिल्ह्यातील सडकअर्जुनीनजीक शिवशाही बसचा दुर्दैवी अपघात होऊन काही प्रवाशांचा मृत्यू झाल्याची घटना अतिशय दुर्दैवी आहे. मृतांना मी भावपूर्ण श्रद्धांजली अर्पण करतो. त्यांच्या कुटुंबीयांच्या दु:खात आम्ही सहभागी आहोत.या घटनेत जे लोक जखमी झाले, त्यांना खाजगी रुग्णालयात उपचार…— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 29, 2024 -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం
-
కల్వర్టును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సికార్లో మంగళవారం మధ్యాహ్నం బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సలాసర్ నుంచి వెళ్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్గఢ్ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్గఢ్లోని ప్రభుత్వ సంక్షేమ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేంద్ర ఖిచాడ్ తెలిపారు. #Sikar: #लक्ष्मणगढ़ पुलिया के पास भीषण हादसामृतकों की संख्या पहुंची12, एक और घायल ने तोड़ा दम, 35 से अधिक लोग हुए थे घायल, सीकर अस्पताल में पांच मृतकों के शव, सात शव रखे है लक्ष्मणगढ़ अस्पताल की मोर्चरी में, घायलों का जारी है इलाज, सुजानगढ़ से नवलगढ़ आ रही थी बस #RajasthanNews pic.twitter.com/LHZCnSpscb— Manoj Bisu Sikar (@manoj_bisu) October 29, 2024 -
విజ్ఞాన యాత్రలో విషాదం
విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి జైపూర్ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్పూర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. నేటి తరుణీతరంగాలు, సేఫ్ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకువచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. -
కేరళలో బస్సు ప్రమాదం.. ఇద్దరి మృతి
తిరువనంతపురం: కేరళలోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోజికోడ్ తిరువంబాడి ప్రాంతంలో కర్టాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని కాళియంబుజ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.#Kerala: A tragic accident occurred in Thiruvambadi, Kozhikode, on Tuesday when a KSRTC bus veered off course, hitting a culvert and plunging into the Kaliyambuzha River.The incident, which took place around 1:40 p.m., claimed the life of 63-year-old Rajeswari from… pic.twitter.com/sPyFzhmyAW— South First (@TheSouthfirst) October 8, 2024 నదిలో పడేముందు బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కోజికోడ్ మెడికల్ కాలేజీ, ఓమసేరీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారిలో అనక్కంపోయిల్కు చెందిన 63 ఏళ్ల రాజేశ్వరి వృద్దురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. -
జమ్ముకశ్మీర్లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. ఈ క్రమంలో బ్రెల్ గ్రామం వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు, సాయుధ బలగాలు అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారుఘటనా స్థలంలో స్థానికులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలిదశ పోలింగ్ పూర్తికాగా.. రెండో దశ సెప్టెంబర్ 25న జరగనుంది. -
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొగిలిఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నాం ఈ ప్రమాదం జరిగింది. అయితే, బస్సు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ల సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్ రోడ్లో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇక, లారీ చిత్తూరు నుంచి ఐరన్ లోడ్తో బెంగళూరు వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మనోహర్తో పాటు బస్సులో ప్రయాణీకులు మృతి చెందారు. -
విశాఖ కైలాసగిరి వద్ద టూరిస్ట్ బస్సుకి ప్రమాదం
విశాఖపట్నం, సాక్షి: కైలాసగిరి వద్ద సోమవారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో మలుపు వద్ద కొండను బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వీళ్లంతా పశ్చిమ బెంగాల్కు చెందిన టూరిస్టులు అని తెలుస్తోంది. వీళ్లలో 18 మందికి 18 మందికి స్వల్ప గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. 16 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేయగా.. మరో ఇద్దరికి మాత్రం కేజీహెచ్ వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. -
లోయలో పడిన బస్సులు 44 మంది దుర్మరణం
పాకిస్థాన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (ఆగస్ట్ 25) జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 44 మంది మరణించారు.పాకిస్థాన్లో జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో కనీసం 44 మంది మరణించారని, వీరిలో 12 మంది యాత్రికులు ఇరాన్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని రెస్క్యూ అధికారులు తెలిపారు.పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య సరిహద్దులోని ఆజాద్ పట్టాన్ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22మంది మరిణించారు. ప్రమాదంపై అత్యవసర సేవల ప్రతినిధి ఫరూక్ అహ్మద్ మాట్లాడుతూ..15 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఒక బిడ్డతో సహా ఇప్పటి వరకు 22 మంది మరణించారని తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరో దుర్ఘటనలో బలూచిస్తాన్లోని మక్రాన్ కోస్టల్ హైవేపై పాకిస్థాన్ పౌరులు ఇరాన్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదకరమైన రహదారిలో పోలీసుల నుంచి తప్పించుకుని ఇరాన్లోకి ప్రవేశించే క్రమంలో డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు మరణించినట్లు పోలీసు అధికారి అస్లాం బంగూల్జాయ్ చెప్పారు. -
నేపాల్ లో ఘోర ప్రమాదం.. బస్సులో 40 మంది భారతీయులు
-
ఘోర బస్సు ప్రమాదం.. పది మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్షహర్ జిల్లాలోని సేలంపూర్ వద్ద ఓ వ్యాన్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. #Bulandshahr #बुलंदशहर: बस और पिकअप की टक्कर में 9 लोगों की #मौत, 16 #घायल #गाजियाबाद की एक कंपनी से मैक्स में सवार सभी लोग अपने घर अलीगढ़ रक्षाबंधन का त्यौहार मनाने जा रहे थे#Accident #ghaziabad #RoadAccident @bulandshahrpol @myogioffice @dmbulandshahr @Uppolice @UPGovt pic.twitter.com/TLETZCCwMw— Goldy Srivastav (@GoldySrivastav) August 18, 2024 ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా అలీగఢ్ జిల్లా రాయ్ పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, మృతులను అలీఘర్ జిల్లా అత్రౌలీ తహసీల్లోని రాయ్పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. -
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. నడిరోడ్డుపై టైర్లు ఊడిపోయి..
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.కాగా, జగిత్యాల నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు ప్రమాదానికి గురైంది. అయితే, బస్సులో దాదాపు 150 మంది ప్రయాణీకులు ఎక్కారు. దీంతో, బస్సు కొంత దూరం వెళ్లగానే అధిక లోడ్ కారణంగా టైర్లు ఊడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన పరిణామంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బస్సును నిలిపాడు.మరోవైపు.. ఈ ప్రమాదం కారణంగా ఊడిపోయిన బస్సు వెనుక భాగంలోని రెండు చక్రాలు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాయి. కాగా, ఈ ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, వరుస సెలవుల కారణంగా ప్రయాణీకులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. -
వీడియో: ట్రాఫిక్లో ఓల్వో బస్సు బీభత్సం.. వాహనాలు నుజ్జునుజ్జు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై ఓల్వో బస్సు ఒకటి అదుపు తప్పడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్పై ఓ ఓల్వో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు ముందుకు సాగుతుండటంతో సెకన్ల కాలంలోనే ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందుగా బైక్లను ఢీకొట్టిన బస్సు.. ఆపై రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది.ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, వీడియో బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించాడో చూడవచ్చు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. CCTV footage shows a Volvo bus going out of control and crashing into several vehicles. The incident, involving a BMTC AC Volvo bus, occurred at Hebbal in #Bengaluru. In this accident, two people were injured, and four cars and four bikes were damaged. pic.twitter.com/3AIMyhYVLK— Neelima Eaty (@NeelimaEaty) August 13, 2024 -
ఏలూరులో బస్సు ప్రమాదం, వేగంగా లారీని ఢీ కొట్టి..
ఏలూరు, సాక్షి: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. అయితే ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ వేకువజామున బస్సు ఢీ కొట్టింది. వేగానికి బస్సు ముందు భాగంగా.. లారీలోకి చొచ్చుకుపోయింది. బస్సులోనే ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోగా.. ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే.. తన క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన ప్రయాణికుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందించాల్సి ఉంది. -
ఒడిశాలో బస్సు ప్రమాదం.. హైదరాబాద్ టూరిస్టులు మృతి
సాక్షి,హైదరాబాద్: తీర్థ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక నుంచి 23 మంది కలిసి ఒక ట్రావెల్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఒడిశాలోని బరంపురం సమీపంలో ప్రమాదానికి గురైంది. హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మృతులను ఉదయ్సింగ్,క్రాంతిభాయ్, ఉప్పలయ్యగా గుర్తించారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మొత్తం 20 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నేపాల్ బస్సు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల మృతి
నేపాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నారాయణఘాట్-ముగ్లింగ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. దీంతో దాదాపు 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.వారిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. తాజాగా ఆ ఏడుగురు భారతీయులు మరణించినట్లు తేలింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చిట్వాన్ జిల్లాలోని నారాయణ్ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు.రెండు బస్సుల్లో దాదాపు 65 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. బస్సు ప్రమాదం, భారతీయులు మృతి, కొండచరియలు, భారీ వర్షాలుఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. మహారాష్ట్ర నాసిక్లో దుర్ఘటన
ముంబై: మహారాష్ట్ర నాసిక్లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయ పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు కాగా.. వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సత్పురా ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేశాడు. ఆ ప్రయత్నంలో ముందు మలుపు ఉండడంతో వేగంగా వెళ్తున్న బస్సును నియంత్రించలేకపోయాడు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.బస్సులోని ఓ ప్రయాణికుడు.. ఆ జర్నీని లైవ్ టెలికాస్ట్ కోసం చిత్రీకరించాడు. బస్సు ప్రమాదం తర్వాత కూడా ఆ వీడియో రికార్డయ్యింది. ప్రయాణికుల ఆర్తనాదాలు ఆ వీడియోలో వినిపించాయి. ఆపై ప్రమాద ఘటన తాలుకా వీడియో నెట్టింటకు చేరింది.Nashik: A bus fell into a valley in Nashik, LIVE video of the accident has surfaced#BusAccident #Nashik #Satpura #ViralVideo pic.twitter.com/bSidD45caK— Siraj Noorani (@sirajnoorani) July 9, 2024 -
ఘోర రోడ్డు ప్రమాదం! ఆగి ఉన్న లారీని..
ఆదిలాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 28 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 34 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు బయలుదేరింది.మంగళవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో కామారెడ్డి సమీపంలోకి రాగానే క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆదిలాబాద్లోని అంబేడ్కర్నగర్ కాలనీకి చెందిన అఫ్సర్ఖాన్ (25) మృతి చెందగా, మరో 28 మందికి గాయాలయ్యాయి.స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ షేక్ రఫీక్తోపాటు మరో ప్రయాణికుడు మోబీన్కు తీవ్ర గాయాలుకాగా వైద్యులు నిజామాబాద్కు రిఫర్ చేశారు. గాయాలపాలైన వారంతా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన వారే. అఫ్సర్ఖాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. -
ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు నార్సింగ్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బస్సు ప్రమాదం 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎన్ఐఏ చేతికి ‘బస్సుపై ఉగ్రదాడి’ కేసు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఇటీవల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తును కేంద్రం హోంశాఖ... జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై వరుస సమీక్షా సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసి జిల్లాలో జూన్ 9న ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. డ్రైవర్కు బుల్లెట్ తగలడంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. -
లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు మహిళలు మృతి, 24 మందికి గాయాలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ రహదారిపై ఉన్న గంంగగనాని సమీపంలో బస్సు లోయలో పడింది. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి.గంగనానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కంట్రోల్ తప్పిన డ్రైవర్.. వాహనాన్ని క్రాష్ బారియర్లకు ఢీకొట్టాడు. లోయలో పడి ఓ చెట్టుపై ఆగిపోయింది. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. సరైన సమయంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిని ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రి, భట్వాడి హెల్త్ సెంటర్కు తరలించారు. -
అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది దుర్మరణం చెందారు.బలూచిస్థాన్ ప్రావిన్స్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు... 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్థాన్లోని టర్బాట్ నగరం నుంచి ఉత్తరాన 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలో కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 మంది వరకు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -
అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
ఖమ్మం: ఆర్టీసీ బస్సులో తలుపు వద్ద నిలుచున్న వివాహిత ప్రమాదవశాత్తు జారి వెనుక టైరు కింద పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మంలోని డీమార్ట్లో పనిచేస్తోంది. శనివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కొణిజర్లలో ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కింది. అప్పటికే ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆమె ఫుట్బోర్డ్పై నిలబడింది. బస్సు ఎంపీడీఓ కార్యాలయం సమీపానికి రాగానే మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ యత్నించాడు. ఇంతలోనే ఎదురుగా ద్విచక్రవాహనం రాగా డ్రైవర్ బ్రేక్ వేయడంతో తలుపు వద్ద నిలబడిన అనూష జారి రోడ్డుపై పడింది. అప్పటికే బస్సు కదలడంతో వెనుక టైరు ఆమె పైనుంచి వెళ్లగా నడుము భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతి చెందింది. మృతురాలికి భర్త అశోక్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న ఆమె మృతి చెందిందనే సమాచారంతో కుటుంబీకులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, అనూష మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు. -
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం జగన్ చెప్పారు. కాగా, పల్నాడులో బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, పల్నాడులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారికిలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ప్రయాణీకులు ఉన్నారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హైస్పీడ్లో ఉన్న సమయంలో టిప్పర్ను ఢీకొట్టింది. -
పీవోకేలో బస్సు ప్రమాదం.. 20 మంది దుర్మరణం
పెషావర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిట్–బల్టిస్తాన్లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 20 మంది మృత్యువాతపడ్డారు. రావల్పిండి నుంచి గిల్గిట్ వైపు 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దియామెర్ జిల్లాలో కారకోరం హైవేపైని పర్వత ప్రాంతంలో అదుపు తప్పి నది ఒడ్డున పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా మరో 21 మంది గాయపడ్డారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని విచారం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భారీ గుంతలో బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతిచెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు బోల్తాపడింది. కాగా, ఓ డిస్టిలర్లీ సంస్థకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక, రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 12మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. President Droupadi Murmu tweets, "The news of many people getting killed in a bus accident in Durg district of Chhattisgarh is very sad. My deepest condolences to all the bereaved families! I wish for the speedy recovery of the injured." pic.twitter.com/bkqAVvKGNR — ANI (@ANI) April 9, 2024 మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఇక, ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. छत्तीसगढ़ के दुर्ग में हुआ बस हादसा अत्यंत दुखद है। इसमें जिन्होंने अपने प्रियजनों को खोया है, उनके प्रति मेरी संवेदनाएं। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की निगरानी में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है। — Narendra Modi (@narendramodi) April 9, 2024 ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దుర్గ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందించడంలో నిమగ్నమై ఉందన్నారు. ఛత్తీస్గఢ్ సీఎం బస్సు ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ సందర్బంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. #WATCH | Chhattisgarh: On Durg bus accident, SP Jitendra Shukla says, "Today around 8.30 pm, workers of a distillery were leaving after their shift ended... All the people were rescued and admitted to various hospitals. As per data so far, 12 people have died... * people who were… pic.twitter.com/MPPa3rrIhl — ANI (@ANI) April 9, 2024 -
బస్సు లోయలో పడి 45 మంది మృతి
కేప్ టౌన్: ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని బస్సు ప్రమాదం కబళించింది. దక్షిణాఫ్రికాలోని లింపొపొ ప్రావిన్స్లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క చిన్నారి గాయాలతో సజీవంగా బయటపడింది. బోట్స్వానాకు చెందిన వీరంతా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈస్టర్ ఉత్సవాలకు వెళ్తున్నారు. అదుపు తప్పిన బస్సు కొండప్రాంతంలోని ఎంమట్లకలా వద్ద వంతెన బారియర్లను ఢీకొట్టింది. ఆ పక్కనే ఉన్న 164 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ముక్కలైన బస్సులో భారీగా మంటలు చెలరేగి కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు దూరంగా పడిపోయారు. ఘటనలో డ్రైవర్ సహా మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే సజీవంగా బయటపడింది. మంటల్లో కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో నుజ్జయిన బస్సులో ఇరుక్కుపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొరుగు దేశం బొట్స్వానాకు చెందిన బాధితులంతా దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఘనంగా జరిగే ‘జియోన్ క్రిస్టియన్ చర్చి’ ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫొసా బొట్స్వానా అధ్యక్షుడు మసిసితో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈస్టర్ పండుగ రద్దీ సమయంలో రోడ్డు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టినప్పటికీ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. #BREAKING : Bus Accident Kills 45 In South Africa At least 45 people were killed as a result of a bus accident, South Africa's Department of Transportation said. An 8-year-old girl is reportedly the only survivor. The crash occurred near Mamatlakala in the northern province of… pic.twitter.com/15tGAbdAM0 — upuknews (@upuknews1) March 29, 2024 బ్రిడ్జి పై నుంచి కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. కొన్ని మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి.. ప్రముఖ సైకాలజిస్ట్ కన్నుమూత -
ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్లోని మహావీర్ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్హెడ్ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘాజీపూర్ విషాద ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిజేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, గాయపడిన వారందరికీ ఉచిత వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. यूपी के गाजीपुर में हाइटेंशन तार की चपेट में आने से बस में आग लग गई! बस में करीब 50 बाराती सवार थे , कई लोगों के जिंदा जलने की खबर है! ग्रामीणों ने दो थाने की पुलिस को भगा दिया है! एक महिला के अनुसार पुलिस ने रूट डायवर्ट किया था!#Ghazipur #accident pic.twitter.com/FsCDegtzdw — ShivRaj Yadav (@shivayadav87_) March 11, 2024 -
Bamako: మాలిలో ఘోర బస్సు ప్రమాదం
బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 31 మంది మరణించారు. మంగళవారం రాత్రి కెనీబా పట్టణంలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బుర్కినా ఫాసోకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారిలో మాలి పౌరులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రజా రవాణాలో ఏ మాత్రం ప్రమాణాలు ఉండవు. బస్సులు, రైళ్లు కిక్కిరిసి వెళుతుంటాయి. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఇదీ చదవండి.. రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు -
రెయిలింగ్ను ఢీకొని బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి!
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు రోడ్డుపైనున్న రెయిలింగ్ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందనున్న ప్రదేశంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఖేడా జిల్లాలోని నడియాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎస్పీ సహా పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ రాజేష్ గధియా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్ నుంచి పూణె వెళుతోందని తెలిపారు. బస్సులో దాదాపు 23 మంది ప్రయాణికులు ఉన్నారు. హైవేపై అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదు చేశామన్నారు. #WATCH | Nadiad: SP Rajesh Gadhiya says, "...The bus was going from Ahmedabad to Pune in which there were about 23 passengers. The driver of a cement tanker suddenly turned left and hit the bus...Two people have died & several people have been injured...A case will be filed… https://t.co/B9DKPMKTf5 pic.twitter.com/LrSFa3AepN — ANI (@ANI) February 23, 2024 -
నెల్లూరులో బస్సు ప్రమాదానికి కారణాలు
-
నెల్లూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం
-
వికారాబాద్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్, సాక్షి: అనంతగిరి అడవుల్లో శనివారం మధ్యాహ్నాం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. అడవుల్లోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులను వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతగిరి గుట్ట దిగుతుండగా కెరెల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బస్సులో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. -
గద్వాల్ జిల్లాలో బస్సు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్
-
సంక్రాంతి ప్రయాణం..మధ్యలోనే ఊహించని దారుణం
-
Gadwal Bus Fire Accident: బస్సులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం
సాక్షి, గద్వాల జిల్లా: బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో వాల్వో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటల్లో చిక్కుకుని మహిళ సజీవదహనం అయ్యింది.. 10 మందికి గాయపడ్డగా, వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా ఆ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు అద్దాలగొట్టి బయటపడ్డారు. -
గద్వాల్ జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం
-
రెండేళ్ల పాప మృతి : హైదరాబాద్
-
మధ్యప్రదేశ్లో బస్సు ప్రమాదం..
-
Guna: బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం
బోఫాల్: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును(డంపర్) ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగగా.. 12 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు కాగా.. జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంటున్నారు. గుణ నుంచి ఆరోన్ వెళ్తుండగా రాత్రి 9గం. సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు అతివేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో నలుగురు ప్రమాదం నుంచి బయటపడి.. వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై గుణ కలెక్టర్ తరుణ్ రతి దర్యాప్తునకు ఆదేశించారు. గుణ బస్సు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు ఘటనపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సైతం స్పందిస్తూ.. బాధించిందన్నారు. ఘటనపై స్థానిక అధికారులతో తాను మాట్లాడినట్లు.. అలాగే మృతుల కుటుంబాలకు తన సంతాపం చెబుతూ ఎక్స్లో ఓ సందేశం ఉంచారు. बिग ब्रेकिंग गुना से आरोन जा रही एक यात्री चलती बस में दुहाई मंदिर के पास लगी भीषण आग। मौके पर लोगों की मची चीख पुकार। जिंदा जल रहे बस में बैठे यात्री। हादसे का कारण बस अनफिट होना बताया जा रहा है। @CMMadhyaPradesh @BJP4MP @PMOIndia @HMOIndia #guna pic.twitter.com/eM2NjmIuPd — Akhand Awaaj (@akhandawaaj1) December 27, 2023 -
బస్సు వెళ్తుండగా విడిపోయిన చక్రాలు
తమిళనాడు: సేలం సమీపంలో రోడ్డుపై వెళ్తున్న బస్సు వెనుక చక్రాలు లేకుండా పరుగులు తీయడంతో కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సేలం ఎడప్పాడి సమీపంలోని వెల్లండి వలసకు చెందిన విజయన్ ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను గురువారం సాయంత్రం సేలం కొత్త బస్ స్టేషన్ నుంచి ఎడప్పాడికి ప్రయాణికులను తీసుకెళ్తుండగా బస్సులో కండక్టర్ కదిర్తో సహా చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అరియలూర్ సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు, బస్సు ముందు భాగం ఒక్కసారిగా పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి పరుగెత్తింది. ఈ పరిస్థితిలో క్షణాల్లోనే బస్సు వెనుక యాక్సిల్ విరిగిపోవడంతో వెనుక చక్రాలు బస్సు నుంచి విడిపోవడంతో వెనుక టైర్లు లేకుండానే బస్సు కొద్ది దూరం వెళ్లింది. భయంకరమైన శబ్ధం చేస్తూ బస్సు వేగంగా రోడ్డుపైకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు పెట్టారు. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణీకులు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
బస్సు చక్రాల కింద నలిగి బాలుడి మృతి
హైదరాబాద్: అప్పటిదాకా అక్క, అన్నయ్యతో సరదాగా ఆడుకుంటూ గడిపిన మూడున్నరేళ్ల బాలుడిని స్కూల్ బస్సు చిదిమేసిన హృదయ విదారక ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. చిరునవ్వులతో తమ వెంట ఉన్న చిన్నారి కళ్లెదుటే క్షణాల్లో అసువులు బాయడంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. శుక్రవారం చర్లపల్లి పోలీస్స్టేషన్ పరి«ధిలోని బీఎన్రెడ్డినగర్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి వివరాల ప్రకారం.. బీఎన్రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న నీల మౌనికకు ఇద్దరు కుమారులు హేమంత్ (9), మూడున్నరేళ్ల ప్రణయ్తో పాటు కూతురు స్నేహ ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో మౌనిక రెండేళ్లుగా బీఎన్రెడ్డి నగర్లోని పుట్టింట్లో నివాసం ఉంటోంది. ఇళ్లల్లో పని చేసుకుంటూ పిల్లలను చదివిస్తోంది. శుక్రవారం హేమంత్, స్నేహ స్కూల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు ప్రణయ్ను అమ్మమ్మ కనకమ్మ ఇంటి అరుగుపై కూర్చొబెట్టిన తల్లి మౌనిక.. హేమంత్, స్నేహలను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. అదే సమయంలో ప్రణయ్ అరుగు దిగి రోడ్డుపైకి వచ్చాడు. దీనిని గమనించకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ప్రణయ్ ముందు చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి మేనమామ వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
J&K: ఘోర ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దోడా ప్రాంతంలో అస్సార్ వద్ద ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. 19 మందికి గాయాలైనట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. క్షతగాత్రుల్ని కిష్తావర్, దోడా సీఎంసీ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించింది. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బుధవారం బటోటే-కిష్తావర్ జాతీయ రహదారిపై బత్రుంగల్-అస్సార్ వద్ద బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోతున పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జమ్ము డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. ప్రధాని దిగ్భ్రాంతి.. దోడా ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ప్రధాని.. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. The bus accident in Doda, Jammu and Kashmir is distressing. My condolences to the families who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs.… — PMO India (@PMOIndia) November 15, 2023 మరోవైపు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించిన ఆయన.. అవసరమైతే హెలికాఫ్టర్ సేవల్ని వినియోగించాలని సూచించారు. #UPDATE | Death toll in Doda bus accident rises to 36 with 19 injured. #JammuAndKashmir pic.twitter.com/mh6GMtZbu5 — ANI (@ANI) November 15, 2023 -
బస్సు ప్రమాద ఘటనపై విచారణకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, తాడేపల్లి : విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం -
రైల్వే ట్రాక్పై బస్సు బోల్తా
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో బస్సు అదుపుతప్పి రైలు పట్టాలపై బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగులు మృతి చెందారు. దాదాపు 24 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వైపు 30 మందితో ప్రయాణిస్తున్న బస్సు అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురైంది. 'ప్రమాదానికి గురైన వెంటనే 24 మందిని ఆస్పత్రికి తరలించాం. నలుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. క్షతగాత్రులకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.' అని జిల్లా అదనపు కలెక్టర్ రాజ్కుమార్ కాస్వా తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన అధికారులు.. ట్రాక్పై నుంచి బోల్తా కొట్టిన బస్సును తొలగించారు. ప్రమాదంపై సీఎం అశోక్ గహ్లోత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపారు. సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య -
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఫ్లాట్ఫామ్పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. 12వ నంబర్ ఫ్లాట్ఫైమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కండెక్టర్తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 10 నెలల చిన్నారి కూడా ఉంది. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఇలా జరిగిందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. బస్సు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లాల్సి ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటన దురదృష్టకరం. ప్రమాదంలో కుమారి అనే ప్రయాణీకురాలు, అవుట్ సోర్సింగ్ బుకింగ్ కంక్టర్ వీరయ్య ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో చిన్నారి అయాన్ష్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మానవ తప్పిదమా...బస్సులో లోపమా తేలాల్సి ఉంది. సాయంత్రంలోగా ప్రాధమిక నివేదిక వస్తుంది. 24 గంటల్లోగా పూర్తి నివేదిక తీసుకుంటాం. గాయపడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. మృతులకు ఆర్టీసీ తరపున రూ. 5 లక్షలు తక్షణ నష్టపరిహారం అందిస్తాం’ అని తెలిపారు. -
ఇటలీలో బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు..
వెనీస్: ఇటలీలోని వెనీస్ నగర సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి, 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగడంతో 21 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందడం పట్ల వెనీస్ సిటీ మేయర్ బ్రుగ్నారో సంతాపం ప్రకటించారు. -
గాల్లో ప్రాణాలు!
భువనేశ్వర్: ఓ వైపు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మహా నది. మరోవైపు నది వంతెనపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు. ఏమైందో గానీ ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి కాంక్రీట్ రెయిలింగ్ను ఢీకొట్టింది. బస్సు ముందుభాగం గాల్లో తేలింది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక, స్థానిక ప్రభుత్వ అధికారులు, పోలీసు బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సురక్షితంగా బస్సును యథాస్థితికి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కటక్ జిల్లా బంకీ ప్రాంతం మహా నది వంతెనపై మంగళ వారం ఈ ఘటన చోటుచేసుకుంది. భువనేశ్వర్ వైపు వెళ్తున్న ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయడినట్లు తెలిసింది. సాంకేతిక లోపం ప్రమాదానికి దారితీసి ఉంటుందని, ఈ విషయమై డ్రైవర్ను ప్రశ్నిస్తామని పోలీసు అధికారి తెలిపారు. డ్రైవరుదే పొరపాటు.. బంకీ మహానది వంతెనపై బస్సు ప్రమాదం ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాంతీయ రవాణా శాఖ ఈ దర్యాప్తు చేపట్టింది. బస్సు ఫిట్నెస్, పర్మిట్ వ్యవహారంలో ఎటువంటి లోటు లేదని, డ్రైవరు తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాంతీయ రవాణా విభాగం అధికారి సంజయకుమార్ బెహరా తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక డ్రైవరుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
హైస్పీడ్లో రయ్మని చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని ఖర్గోనే జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 25 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఈ క్రమంలో అతి వేగంతో ఉన్న బస్సు రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ చెరువులోకి దూసుకెళ్లింది. ఇక, ఈ ఘటనను బస్సు వెనకాలే ఉన్న ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు. కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు తెలిపారు. అయితే, బస్సు చెరువులో పడిపోయిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. దీంతో, ప్రాణ నష్టం తప్పింది. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. WATCH - On Cam: Bus carrying passengers falls into river in Khargone, several injured.#Accident #Khargone pic.twitter.com/QbzQC3yFUu — TIMES NOW (@TimesNow) September 29, 2023 -
ఆర్టీసీ బస్సు బోల్తా
యర్రగొండపాలెం: స్థానిక మార్కాపురం రోడ్డులోని పాల కేంద్రానికి సమీపంలో మంగళవారం ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సు ప్రైవేట్ పాలకేంద్రానికి సమీపంలోని హైవే రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీని డ్రైవర్ తప్పించే క్రమంలో అదుపు తప్పింది. పక్కనే ఉన్న చప్టాకు ఢీకొని పొలాల్లో బోల్తా పడింది. డ్రైవర్ నాగేశ్వరరావు కాలికి, కనిగిరికి చెందిన ప్రయాణికురాలు డి.ఆదిలక్ష్మికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మార్కాపురానికి చెందిన 8 మంది ప్రయాణికులు ధరణి, సురేంద్ర శ్రీనివాస్, మంత్రయ్య, చెన్నమ్మ, భువన్కుమార్, పోతిరెడ్డి, మహబూబ్బాష, బస్సు హెల్పర్ ఇస్సాక్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వీరిని 108లో స్థానిక ఏరియా వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.కోటయ్య తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి
లీమా: దక్షిణ అమెరికా దేశం పెరూలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెరూలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లిన కారణంగా ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనాటి ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పెరూలో సరైన రోడ్డు సదుపాయాలు లేక ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. ఇక్కడ రాత్రిపూట, పర్వతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి -
దూసుకొచ్చిన మృత్యువు
కర్ణాటక: దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళలు ఊహించని ప్రమాదంలో విగతజీవులయ్యారు. రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన తుమకూరు నగరంలోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ఉదయం ఈ ఘోరం చోటు చేసుకుంది. మండ్య జిల్లా శ్రీరంగ పట్టణ తాలూకా కేశెట్టి హళ్లి గ్రామానికి చెందిన పుట్టతాయమ్మ (60), పంకజా (50) మృతులు. వీరిద్దరు ఇంటి పక్కనే ఉండే మరికొందరి మహిళలతో కలిసి తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకాలోని గొరవనహళ్లి మహాలక్ష్మీ ఆలయానికి బస్సులో తుమకూరు చేరుకున్నారు. కొరటిగెరైవెపు వెళ్లే బస్సులు కోసం వేచి ఉన్నారు. కొద్దిసేపు అనంతరం కొరటిగెరె వెళ్లే బస్సు రావడంతో అందరూ కలిసి బస్సులో ఎక్కడానికి ముందుకు వెళ్లారు. అదే సమయంలో గౌరిబిదనూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ రివర్సు తీసుకుంటూ వీరిని ఢీకొట్టాడు. దీంతో పుట్టతాయమ్మ, పంకజ ఇద్దరు రెండు బస్సుల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనానికి వస్తే ప్రాణాలు పోయాయని వీరితో పాటు వచ్చిన మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. నగర ట్రాఫిక్ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు . -
సత్వర వైద్యం.. తప్పిన ప్రాణాపాయం
పాడేరు ఘాట్రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారంతా కోలుకుంటున్నారు. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలందించి ప్రాణనష్టానికి అడ్డుకట్ట వేయగలిగింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్ లోయలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిల్లో బోడిరాజు, బొట్ట చిన్నమ్మలతోపాటు మరో ముగ్గురికి ప్రాణాపాయం లేదని వైద్యులు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. వీరికి విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. మరోవైపు ఇదే ప్రమాదంలో గాయపడి పాడేరు జిల్లా ఆస్పత్రిలో చేరిన వారిలో ఐదుగురు కోలుకుని ఇళ్లకు క్షేమంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం 21 మంది ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. వారికి ఉన్నత వైద్య సేవలతోపాటు మూడు పూటల పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. వీరిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావుతోపాటు ఇతర వైద్య బృందమంతా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు, జిల్లా ఆస్పత్రిలోని గైనిక్ వైద్యుడు తమర్భ నరసింగరావు సైతం మహిళలకు, చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు. బాధిత ప్రయాణికులంతా పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇళ్లకు పంపాలని, వైద్య బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్కుమార్తోపాటు వైద్య ఆరోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్ అఽధికారులు తగిన ఆదేశాలిచ్చారు. బస్సు ప్రమాదంపై ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ విచారం ఘాట్ లోయ సంఘటనపై ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్పర్సన్ గదల బంగారమ్మ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయాన్నే ఆమె పాడేరు ఘాట్లోని సంఘటన స్థలానికి చేరుకున్నారు. లోయలోకి దూసుకుపోయిన బస్సును పరిశీలించారు. అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధిత ప్రయాణికులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య బృందాలను ఆదేశించారు. ఈ ప్రమాదంలో నారాయణమ్మ, సీసా కొండన్న మృతిచెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలతోపాటు, గాయపడిన ప్రయాణికులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట విశాఖ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కణితి వెంకటరావు, పాడేరు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. మాజీ మంత్రి బాలరాజు,డాక్టర్ వెంకటలక్ష్మి పరామర్శ విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు పొందుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాద ప్రయాణికులను మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు సోమవారం ఉదయం పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులతో సమీక్షించారు. అదేవిధంగా పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఆర్టీసీ బస్సు ప్రమాద బాధితులను వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పాడేరు ఎంపీపీ ఎస్.రత్నకుమారి, మాజీ ఎంపీపీలు ఎస్.వి.రమణమూర్తి, మత్స్యరాస వెంకటగంగరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్పర్సన్ పరామర్శ ఎంవీపీకాలనీ: పాడేరు ఘాట్రోడ్డులో గాయాలపాలై మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న కిల్లో బోడిరాజు (39), బుట్ట చిన్నమ్ములు (48), బుట్ట దుర్గాభవానీ (14), బుట్ట రామన్న (14)తోపాటు సామర్ల బాబూరావు (50)లను సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ కుంభ రవిబాబు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆయన అనంతరం వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, విశాఖ తూర్పు నియోజకవర్గ నాయకుడు అక్కరమాని వెంకటరావు తదితరులు క్షతగాత్రులను పరామర్శించారు. వెలికితీతకు వర్షంతో ఆటంకం సాక్షి,పాడేరు: ఘాట్ లోయలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సును బయటకు తీసే పనులకు వర్షం ఆటంకంగా మారింది. విజయనగరం నుంచి రోప్లు, చోడవరం దరి గోవాడకు చెందిన పెద్ద సంఖ్యలో కూలీలను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచారు. పాడేరుకు చెందిన రెండు ఎస్కాట్ యంత్రాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలో సోమవారం కుండపోత వానతో లోయలోకి కూలీలు దిగడానికి వీలుకాలేదు. కొంతమంది ఆర్టీసీ సిబ్బంది లోయలోకి దిగి బస్సుకు రోప్ కట్టారు. ఇంతలో మరలా వర్షం కురవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబుతోపాటు ఆర్టీసీ అధికారులు, పోలీసులు సంఘటన ప్రాంతంలోనే నిరీక్షించారు. చీకటి పడినా వర్షం తగ్గక పోవడంతో వారంతా పాడేరుకు తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుంచి బస్సు వెలికితీత పనులు చేస్తామని చెబుతున్నారు. ఘాట్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణమైన చెట్టు కొమ్మలను పూర్తిగా తొలగించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వీటిని నరికివేశారు. -
మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..
రాబాత్: మొరాకోలో ప్యాసింజర్లతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదకరమైన మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 24 మందిమృతి చెందినట్లు తెలిపింది మొరాకో వార్తా సంస్థ(MAP ). సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెమ్నాట్లోని వీక్లీ మార్కెట్కు వెళ్తోన్న ఓ బస్సు రోడ్డు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 24 ముంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ వారు సహాయక చర్యలు చేపట్టారు. దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొరాకోలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏడాదికి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించేవారు సంఖ్య సగటున 3500గా ఉందని, గతేడాది 3200 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని సరిగ్గా గత ఏడాది ఆగస్టులో తూర్పు కాసాబ్లాంకాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని అంతకు ముందు 2015లో యువ అథ్లెట్లు ప్రయాణిస్తున్న ఒక బస్సును సెమీ ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు.. -
మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు
మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ప్యాసింజర్లతో హైవేపై వెళ్తోన్న ఎలైట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా అందులో ఆరుగురు భారతీయులున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు మెక్సికో అధికారులు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో వేర్వేరు దేశాలకు చెందిన వారితో పాటు కొంతమంది అమెరికా సరిహద్దు ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు అధికారులు. మెక్సికో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సరిహద్దులోని తెపిక్ ప్రాంతంలో బారాంకా బ్లాంకా హైవేపై టిజువానా ఉత్తర సరిహద్దు వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదే స్పీడులో టర్నింగ్ తిరగడంతో ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయిందని.. అందులో డామినిక్ రిపబ్లిక్, భారత్, ఆఫ్రికా దేశాలకు చెందిన 42 మంది ప్రయాణిస్తున్నారని అన్నారు. వీరిలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా 20 మందిని మాత్రం చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించమని వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు నయారిట్ అధికారులు. నయారిట్ భద్రతా, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ బస్సు లోయలో సుమారు 40 మీటర్లు(131 అడుగులు) లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగానే సాగుతున్నాయన్నారు. ఎలైట్ బస్సు కంపెనీ వారి నుంచి కానీ, మెక్సికో మైగ్రేషన్ వారి నుంచి కానీ సంఘటనపై ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. 🚍Autobús de pasajeros cayó aun profundo barranco, de la línea Elite numero económico 4726 ruta México -Tijuana escala en Guadalajara, Jalisco Más de 20 decesos y 20 lesionados ⚠️Estará cerrado el paso ambos sentidos. Ruta alterna por autopista Guadalajara-Tepic hacia Mazatlán pic.twitter.com/BjJxuOmtQ9 — Reportes de Tráfico Vallarta Tepic Guadalajara 🚧 (@ClarabellaDra) August 3, 2023 ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాల్లో ఇది మూడోది. ఫిబ్రవరిలో సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. అందులో 17 మంది మృతిచెందగా గత నెల దక్షిణ రాష్ట్రమైన ఒక్సాకాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 29 మంది మృతి చెందారు. ఇది కూడా చదవండి: యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...! -
పెళ్లి సందడి సంతోషం.. అంతలోనే అంతులేని విషాదం...
పెళ్లి సందడి సంతోషం.. అంతలోనే అంతులేని విషాదం. రిసెప్షన్ సంబరాలను ఊహించుకుంటూ బయలుదేరిన కొద్ది సేపటికే ఊహలు సమాధి అయ్యాయి. అర్ధరాత్రి..అంతా చిమ్మ చీకట్లు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఏడుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అప్పటి వరకూ తమతో సంతోషంగా గడిపిన వారు ఇకలేరు అన్న విషయం వారి బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. గాయపడిన ఆప్తులు ఒక వైపు, అయిన వారి మృతదేహాలు మరో వైపు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పొదిలికి తరలించిన సమయంలో వారి గృహాల వద్ద తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. దర్శి వద్ద సాగర్ కాలువలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన నాలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. దర్శి/పొదిలి/పొదిలి రూరల్/కొనకనమిట్ల: పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో గౌస్ మొహిద్దీన్ కుటుంబం నివాసముంటోంది. ఆయన కుమారుడు సిరాజ్ సౌదీలో ఉంటున్నారు. వారితో పాటు ఆయన ఉంటున్నాడు. కుమార్తె ఫాతిమాను కాకినాడకు చెందిన అక్బర్ షరీఫ్తో వివాహం చేయాలని నిశ్చయించారు. వివాహం ఘనంగా జరపాలని తలంచారు. సౌదీ నుంచి అందరూ పొదిలికి చేరుకున్నారు. గత ఆదివారం పట్టణంలో అంగరంగ వైభవంగా కుమార్తె వివాహం జరిపించారు. రిసెప్షన్ కాకినాడలో పెట్టుకున్నారు. బంధు మిత్రులను పొదిలి నుంచి తీసుకెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ డిపోకు చెందిన ఇంద్రా బస్సును అద్దెకు తీసుకున్నారు. రాత్రి పది గంటలకు బయలుదేరి, తెల్లవారి ఆరు గంటలకు కాకినాడ చేరుకుంటారు. పగలంతా ఫంక్షన్లో ఉండి, రాత్రికి బయలు దేరి పొదిలికి చేరుకోవాలనేది వారి ఆలోచన. ఒక్క డ్రైవర్ అయితే ఇబ్బంది ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి రెండో డ్రైవర్ కూడా అవసరమని చెప్పారు. ఇద్దరు డ్రైవర్లతో రాత్రి 12.15 గంటలకు బయలు దేరారు. బస్సులో బంధుమిత్రులు కొందరు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి కొందరు నిద్ర పోతున్నారు. సరిగ్గా బస్సు బయలు దేరిన 20 నిముషాల్లోపే ఒక్క సారిగా డివైడర్ను ఢీకొట్టిన బస్సు కాలువలో ముందు వైపు కిందకు వేలాడినట్లు పడింది. దీంతో బస్సులో ఉన్నవారంతా ఒక్క సారిగా ముందుకు పడ్డారు. ఒకరిపై ఒకరు పడి ఏం జరిగిందో అర్థం కాక హాహాకారాలు చేశారు. సీట్లలో నుంచి అందరూ ఒక్కసారిగా కింద పడి పోవడంతో ముందున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతా చిమ్మ చీకట్లు.. ఏం జరిగిందో తెలియక ఎలా బయటకు రావాలో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ వైపు నుంచి బయటకు వచ్చిన కొందరు తమ బంధువులకు ఫోన్లు చేసి జరిగిన విషయం తెలిపారు. బస్సు డ్రైవర్ రమేష్ 100కి సమాచారం అందించాడు. అత్త, కోడలు మృతదేహాలు ఒకేసారి... పెండ్లికుమార్తె పెద్ద మేనత్త ముల్లా నూర్జహాన్ (58), ఆమె కోడలు సబియా ప్రమాదంలో మృతి చెందారు. రెండు మృతదేహాలు ఒకే సమయంలో ఇంటి వద్దకు చేరుకోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. కోడలు పెళ్లి చూశాం.. రిసెప్షన్ కూడా చూసి రావాలని కాకినాడ బయలుదేరిన వారు, తిరిగిరాని లోకాలకు చేరారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రిసెప్షన్కు వెళ్లి..అందరినీ చూడాలని... పెండ్లికుమార్తె బంధువు అయిన ముల్లా జానీబేగం (65) రిసెప్షన్కు వెళ్లి బంధువులు అందరినీ చూడాలని బస్సులో బయలుదేరింది. కానీ దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. వయసు మీద పడుతోంది కదా.. అందరినీ చూడాలి అన్న ఆమె కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు చేరిందని కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఉపాధ్యాయుడు కాగా, మరొకరు రైల్వే పోలీసుగా పనిచేస్తున్నారు. మృతుల్లో చైన్నె డీఎస్పీ భార్య... పెండ్లికుమార్తె మేనత్త షేక్.రమీజ్ మృతుల్లో ఒకరు. రమీజ్ భర్త రియాజుద్దీన్ చైన్నెలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. వివాహం కోసం కుటుంబంతో సహా అందరూ పొదిలికి వచ్చారు. తదుపరి తాను కాకినాడకు బస్సులో రాలేనని చెప్పి, రైల్లో రిజర్వేషన్ చేయించుకుని బయలు దేరాడు. తెనాలి చేరే సరికి రియాజుద్దీన్కు బస్సు ప్రమాదం జరిగి, అందులో భార్య మృతి చెందిందనే వార్త చేరింది. అక్కడ నుంచి తిరిగి పొదిలికి చేరుకున్నారు. భార్య మృతదేహాన్ని చూసిన రియాజుద్దీన్, వారి కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. రమీజ్ మృతదేహాన్ని చైన్నెకి తరలించారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో మృతిచెందిన నూర్జహాన్ డీఎస్పీకి వదిన. ఏం జరిగిందో...అర్థం కాలేదు: చుట్టూ చీకటి, రాళ్లపై పడి ఉన్నాను. కొంత సేపు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. బస్సులో ఉన్న నేను రాళ్లపై ఎందుకు పడి ఉన్నానో అని తెలియని స్థితి. లీలగా ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయి. బస్సు వాగులో పడినట్లు గుర్తించాను. బంధువులు, సామానులు, డబ్బులు, సెల్ఫోన్లు ఎక్కడకెక్కడో పడిపోయి ఉన్నాయి. ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరి ఆడటం లేదు. జేబులో సెల్ ఉంది. 108, పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చాను. అద్దం పగులగొట్టుకుని బయట పడ్డాను. దూర ప్రాంతం కాబట్టి బస్సుకు రెండో డ్రైవర్ను కూడా పంపించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరాం. పొదిలి నుంచి 12.15లు బయలు దేరాం. బస్సు బయలు దేరిన 20 నిముషాల్లోపే ప్రమాదం జరిగింది. రెండో డ్రైవరే బస్సులోని వారిని చాలా మందిని కాపాడాడు. – ముల్లా షుకూర్, క్షతగాత్రుడు ఎదురుగా వస్తున్న బస్సే ప్రమాదానికి కారణం దర్శి: బస్సు ప్రమాదానికి ఎదురుగా వస్తున్న జతిన్ ట్రావెల్స్ బస్ కూడా కారణమని డీఎస్పీ అశోక్వర్ధన్ తెలిపారు. ప్రమాదానికి గురైన బస్తో పాటు జతిన్ ట్రావెల్స్ బస్పై కూడా కేసు నమోదు చేశారు. రెండు బస్లు ఎదురెదురుగా వేగంగా వచ్చాయని సాగర్ కాలువ బ్రిడ్జి పైకి వచ్చేసరికి రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. బస్సులు వేగం తగ్గించి ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కాదన్నారు. జతిన్ ట్రావెల్స్ బస్ వేగంగా రావడంతో ఢీకొంటుందనే అనుమానంతో బస్సును సైడుకు నడపడంతో పాత నీటి పైపులకు నిర్మించిన కంకర దిమ్మె తగిలి బస్సు అదుపు తప్పి ఎస్కేజే పవర్ ప్రాజెక్ట్ నుంచి బయటకు నీరు వదిలే కాలువ బ్రిడ్జిని ఢీకొట్టి సుమారు 20 మీటర్ల లోతు ఉన్న కాలువలో బస్సు పడిపోయింది. దీంతో బస్సులోని వారు ఒకరిపై ఒకరు పడిపోయి బస్సులో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న డీఎస్పీ అశోక్వర్ధన్రెడ్డి నేతృత్వంలో సీఐ జే రామకోటయ్య, ఎస్సై రామకృష్ణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్, పొక్లెయిన్, బుల్డోజర్లను తెప్పించి బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసుకొచ్చారు. నిముషాల వ్యవధిలోనే ఐదు 108 వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. బయటకు తీసేవారిని పోలీసులు పరామర్శించి వారి పరిస్థితిని బట్టి ఆస్పత్రులకు తరలించారు. లగేజీలు కూడా వారి వారి కుటుంబీకులకు అప్పగించారు. ఈలోపే కొందరు డ్రైవర్ వైపు డోరు నుంచి బయటకు రాగా మరి కొందరు లోపలే ఇరుక్కుపోయారు. లోపలి వైపు ఇరుక్కుపోయిన వారిని అగ్నిమాపక సిబ్బంది బస్సులోకి వెళ్లి బయటకు తీశారు. క్రేన్ సాయంతో కాలువలో నుండి రోడ్డు పైకి తీసుకొచ్చారు. ఆ తరువాత మృతి చెందిన 6 మృత దేహాలను క్రేన్ల సాయంతో బయటకు తీశారు. బస్సు కింద ఇరుక్కుపోయిన చిన్నారి షీమాను అతికష్టం మీద వెలికి తీశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్పీ మలికాగర్గ్ ఉదయం 5 గంటలకే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. మృతుల బంధువులను ఓదార్చారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆమె ప్రమాద స్థలంలోనే ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ప్రకాశం: దర్శి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి -
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శి సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఎస్పీ కాలువలోకి ఆర్టీసీ ఇంద్ర బస్సు దూసుకుపోవడంతో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ అజీస్(65), జానీబేగం(65), అబ్దుల్ హనీ(60), నూర్జహాన్(58), షేక్ రమీజ్(48), షబీనా(35), షేక్ హీనా(6) మృతిచెందారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. బస్సు తలకిందులుగా పడటంతో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక 7 మంది మృతి చెందారు. దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనాస్థలిని ఎస్పీ మలిక గర్గ్ పరిశీలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. -
మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
ముంబై: శనివారం తెల్లవారు జామున సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద ఒక ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో మొతం 33 మంది ప్రయాణిస్తుండగా వారిలో 26 మంది మృతి చెందగా 7 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హైవే మీద వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బుల్దానా ఎస్పీ సునీల్ కందసానే. గాయపడిన వారిని బుల్దానాలోని సివిల్ హాస్పిటల్కు తరలించినట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యావత్మాల్ నుండి పూణే వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోకి ప్రవేశించగానే భారీ శబ్దం చేస్తూ బస్సు టైర్ ఒకటి పేలిపోయింది. దాంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పక్కకు పడిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ నుండి అగ్నికీలలు ఎగసి క్షణాల్లో బస్సు మొత్తాన్ని ఆవహించేశాయి. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో వారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులుబాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. ప్రమాదంలో మరణించవారి కుటుంబ సభ్యులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపారు. Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi — PMO India (@PMOIndia) July 1, 2023 అయితే తెల్లవారుతూనే వెలుగులోకి వచ్చిన ఈ వార్త గురించి తెలియగానే రహదారి నిర్మాణంపైనా, భద్రత పైనా చర్చ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలకు స్పందిస్తూ.. ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం నాణ్యత గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు. మృతుల కుటుంబాలను ఆదుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు, ఏడుగురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, మృతుల వివరాలు తెలియకుంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డెప్యూటీ సీఎం. ప్రమాదం మానవతప్పిదం వలన జరిగిందా? లేక సాంకేతిక లోపం వలన జరిగిందా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, వీలయితే స్మార్ట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు ఫడ్నవీస్. కేంద్రం కూడా ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
కేఎస్ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
సోమందేపల్లి: పుట్టపర్తి జిల్లా పెనుకొండ పరిధిలోని సోమందేపల్లిలోని మణికంఠ కాలనీ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న మోరీని బస్సు ఢీ కొట్టింది. కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి బెంగళూరుకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ లగ్జరీ బస్సు అదుపు తప్పి మోరీని ఢీకొని కొంతభాగం దూసుకుపోయింది. 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో దాదాపు 40 మంది దాకా ప్రయాణికులు అందులో ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు సీట్లకు కొట్టుకుని గాయపడ్డారు. పోలీసులు వచ్చి 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సును పోలీసులు స్టేషన్కు తరలించారు. దీంతో ప్రయాణికులు వేరే బస్సుల్లో బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. -
ఒడిశా రైలు దుర్ఘటన.. క్షతగాత్రులను తీసుకెళ్తున్న బస్సుకు ప్రమాదం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు దుర్ఘటన గాయపడిన వారిని తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పశ్చిమబెంగాల్లోని మేదినీపూర్లో శనివారం వ్యాన్ను బస్సు ఢీకొట్టింది. పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు ప్రయాణికులు ఒడిశా రైలుప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి చిన్న గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో మేదినీపూర్ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. అయితే రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి తమ ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు బాలాసోర్లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ ఒడిశా నుంచి చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు.. బాధితుల వివరాలివే.. -
Pushpa 2 The Rule: పుష్ప 2 మూవీ ఆర్టిస్ట్లకు రోడ్డు ప్రమాదం (ఫొటోలు)
-
ఇన్నోవా– ప్రైవేటు బస్సు ఢీ 9 మంది దుర్మరణం
సాక్షి, బెంగళూరు/ మైసూరు: పిల్లలకు వేసవి సెలవులు కావడంతో కొత్త ప్రదేశాలు చూసి వద్దామని అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన 13 మంది పిల్లాపాపలతో బయల్దేరారు. కానీ అదే తమ పాలిట మృత్యు ప్రయాణవుతుందని ఊహించలేకపోయారు. ప్రైవేటు బస్సు– ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీ కొన్న దుర్ఘటనలో ఇన్నోవాలోని పదిమంది విగతజీవులయ్యారు. ఇందులో డ్రైవర్ తప్ప 9 మంది సమీప బంధువులే. సోమవారం మధ్యాహ్నం మైసూరు జిల్లా తి.నరసీపుర తాలూకా కురుబూరు గ్రామం పింజరపూల్ వద్ద కొళ్లేగాల– తి.నరసిపుర ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. మృతులు వీరే బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన బిళ్యాళ మంజునాథ్ (35), పూర్ణిమా (30), సుజాత (40), గాయత్రి (35), కొట్రేశ్ (45), కార్తీక్ (8), పవన్ (10), శ్రావ్య (3), సందీప్ (40), ఆదిత్య (26, ఇన్నోవా డ్రైవర్)లను మృతులుగా గుర్తించారు. ప్రమాదం తర్వాత ఏడు మంది అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. మంజునాథ్, కొట్రేశ్, సందీప్ అన్నదమ్ములని తెలిసింది. తీవ్రంగా గాయపడిన కారులోని జనార్ధన్ (40), శశికుమార్ (24), పునీత్ (4) అనే వ్యక్తులను మైసూరు కేఆర్ ఆస్పత్రికి, బస్సులో గాయపడిన 16 మంది ప్రయాణికులను తి.నరసీపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలులో వచ్చి.. అద్దె కారు తీసుకుని మే 27న బళ్లారి నుంచి రైలులో మైసూరుకు వచ్చిన వీరంతా చాముండిబెట్టకు వెళ్లి అక్కడ చాముండేశ్వరి దేవి దర్శనం చేసుకున్నారు. తరువాత పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని మైసూరులో ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. కారులో మహదేశ్వర బెట్టకు, ఆపై బిళిగిరిరంగన బెట్టకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని మైసూరుకు తిరుగు పయనం అయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తి.నరసీపుర నుంచి కొళ్లేగాలకు ఎస్ఎంఆర్ ప్రైవేటు బస్సు ఎదురుగా వేగంగా వస్తోంది. ఎదురుగా ఇన్నోవా కారు కూడా అంతే వేగంగా వస్తోంది. ఈ క్రమంలో ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. మృతుల శరీర భాగాలు ముక్కలు తెగిపడడంతో అంతటా రక్తసిక్తమైంది. బస్సు డ్యాష్ బోర్డులో దృశ్యాలు.. విషయం తెలిసిన వెంటనే స్థానికులు, సమీప గ్రామస్తులు, పోలీసులు చేరుకుని క్షతగాత్రులను బయటకు తీయడానికి శ్రమించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలను బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తన మొబైల్లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రైవేటు బస్సు డ్యాష్బోర్డులో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాల్లో ఇన్నోవా కారు డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడుపుతూ రావడం కనిపించింది. కారు డ్రైవర్ ఓవర్టేక్ చేస్తూ రాంగ్రూట్లో అతివేగంగా రావడం వల్ల బస్సును ఢీ కొన్నాడు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన మైసూరు కలెక్టర్ కేవీ రాజేంద్ర, ఎస్పీ సీమా లట్కర్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా, రోడ్డుకు అటు ఇటు దట్టంగా చెట్లు ఉండడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవనే ఫిర్యాదు ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు చెట్లను తొలగించలేదని స్థానికులు ఆరోపించారు. ఇదే ఇంతటి భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు చెరో రూ. 2 లక్షల పరిహారాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. -
వీడియో: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు..
-
నదిలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం
ఖర్గోన్/భోపాల్: కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. జిల్లాలోని దొంగర్గావ్ గ్రామ సమీపంలో బొరాద్ నదిపై నిర్మించిన వంతెన మీదుగా బస్సు ప్రయాణిస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా బస్సుపై నియంత్రణ కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో బస్సు వంతెన రెయిలింగ్ను బద్దలుకొడుతూ నదిలో పడింది. బస్సు పడిన చోట నీటిప్రవాహం లేదు. 37 మందికే సీటింగ్ సామర్థ్యమున్న బస్సులో ఏకంగా 70 మంది ప్రయాణిస్తున్నారని, ఫిట్నెస్ లేని బస్సు వేగంగా ప్రయాణించడమూ ప్రమా దానికి కారణమని ప్రభుత్వం తెలిపింది. ఫిట్నెస్లేని బస్సుకు అనుమతినిచ్చిన అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ను ప్రభుత్వం సస్పెండ్చేసింది. ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.4 లక్షల నగదు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల ఆర్థికసాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షల ఎక్స్ గ్రేషి యా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. చదవండి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన సొంత కూతురు -
ఏం టైమింగ్ రా?.. 60 మందిని కాపాడాడు
Viral Video: పిల్లలను నేర్పాల్సింది విద్యాబుద్ధులు మాత్రమే కాదు.. సంఘంలో ఎలా మెలగాలన్నది కూడా!. సోషల్ మీడియాలో ఎరాలో పిల్లల్ని తప్పుదోవ పట్టించే రీతిలోనే ఉంటోంది చాలామంది తల్లిదండ్రుల పెంపకం. టెక్నాలజీ అవసరమే.. కానీ అది ఏ తరహాలో ఉండాలన్నది పిల్లలకు అలవాటు చేయాల్సింది పేరెంట్స్. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఏడో గ్రేడ్ చదివే ఓ చిన్నారి చేసిన పని.. ఏకంగా 60 మందికి పైగా ప్రాణాల్ని నిలబెట్టింది కాబట్టి. మిచిగాన్లో బుధవారం ఈ ఘటన జరిగింది. డ్రైవర్ కళ్లు తిరిగి పడితే.. ఓ విద్యార్థి సకాలంలో స్పందించాడు. డ్రైవర్ సీటులోకి దూకి.. ఎమర్జెన్సీ స్టాపర్ సాయంతో బస్సును ఆపేశాడు. ఆ ఘటన బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సాహసంగా ముందుకు దూకిన స్టూడెంట్ను దిల్లాన్ రీవ్స్గా గుర్తించిన అధికారులు అభినందించారు. బస్సును ఆపడమే కాదు.. ఎమర్జెన్సీ నెంబర్కు డయల్ చేయాలంటూ కేకలు వేశాడు ఆ స్టూడెంట్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
గొల్లపూడి సమీపంలో BSR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
-
150 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 12 మంది దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్గడ్ జిల్లా ఖోపాలి వద్ద బస్సు అదుపుతప్పి 150 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుణె-రాయ్గడ్ సరిహద్దులో ఈ ప్రమాదం జరింది. బస్సు పుణెలోని పంపిల్ గురవ్ నుంచి గొరెగావ్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిలుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలోకి దిగి బస్సులోని క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చదవండి: పండుగ వేళ విషాదం.. కుప్పకూలిన బ్రిడ్జి -
అమెరికాలో ఎయిర్పోర్ట్ ప్రమాదంలో తెలుగు వ్యక్తి దుర్మరణం
న్యూయార్క్: స్నేహితుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ అమెరికన్, తెలుగు వ్యక్తి విశ్వచంద్ కోళ్ల (47) అనుకోని ఎయిర్పోర్ట్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ నుంచి వస్తున్న విశ్వచంద్ స్నేహితుడైన ఒక సంగీత కళాకారుడు మసాచుసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ సిటీలోని లోగన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. ఆయన కోసం విశ్వచంద్ లోగన్ ఎయిర్పోర్ట్కు మార్చి 28 సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎస్యూవీ వాహనంలో చేరుకుని టర్మినల్–బి వద్ద వేచిచూస్తున్నారు. విమాన ప్రయాణికులు, లగేజీతో అదే సమయంలో అటుగా వచ్చిన డార్డ్మౌత్ ట్రాన్పోర్టేషన్ బస్సు విశ్వచంద్ను పక్క నుంచి గుద్దుకుంటూ వెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని నలిగిపోయి అక్కడే పడిపోయారు. ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. విశ్వచంద్ది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లె అని సమాచారం. అమెరికాలో తకేడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలోని గ్లోబల్ అంకాలజీ విభాగంలో డాటా అనలిస్ట్గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య సౌజన్య, కుమారులు ధృవ, మాధవ్ ఉన్నారు. విశ్వచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బంధువులు గోఫండ్మీ ద్వారా ఇప్పటికే 4,06,151 డాలర్లు (దాదాపు రూ.3.3 కోట్లు) విరాళంగా సేకరించారు. -
ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజ్ యాత్రికులతో వెళుతున్న బస్సు సోమవారం అదుపుతప్పి వంతెనను ఢీట్టింది. దీంతో బస్సు బోల్తా పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడినట్లు సౌదీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఖమీస్ ముషైత్ నుంచి అభాకు వెళ్తుండగా అసిర్ ప్రావిన్స్లోని అకాబత్ షార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20కు చేరింది. మరో 29 మంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా బస్సులో ప్రయాణిస్తున్న బాధితులందరూ వివిధ దేశాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో వాళ్లంతా మక్కా, మదినా యాత్ర కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 2019 అక్టోబర్లోనూ మదీనా సమీపంలో బస్సు మరొక భారీ వాహనాన్ని ఢీకొనడంతో 35 మంది విదేశీయులు మరణించారు. చదవండి: ఇదోక జబ్బులా ఉంది! స్కూల్లో కాల్పులు ఘటనపై జోబైడెన్ ఫైర్ -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి
దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామాలో అమెరికాకు వలస వెళ్లే వారిని తీసుకెళ్తున్న బస్సు.. మరో మినీ బస్సును ఢీకొట్టింది. చిరికీలోని గ్వాలకాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృత్యువాతపడినట్లు పనామా జాతీయ వలసదారుల డైరెక్టర్ సమీరా గోజైన్ బుధవారం తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకుడితోసహా మొత్తం 66 మంది ఉన్నారు. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్ రాజధాని నగరం డేవిడ్లోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. క్షతగాత్రుల సంఖ్యను, మృతుల వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. తొలుత 15 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మృతుల సంఖ్య 39కు పెరిగింది. కొలంబియా సరిహద్దులోని అడవి ప్రాంతం అయిన డేరియన్ నుంచి వలసదారులతో బస్సు బయల్దేరింది. వీరంతా పనామా, కోస్టా రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో గుండా చివరికి యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణిస్తున్నారు. -
బస్సుకిందపడ్డ మహిళ.. చక్రంలో ఇరుక్కున్న జుట్టు.. అంతా క్షణాల్లో..
తిరువనంతపురం: కేరళ కొట్టాయంకు చెందిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది. బస్సు ఢీకొట్టి దాని కిందపడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈమె జుట్టు బస్సు చక్రంలో ఇరుక్కుపోగా.. స్థానికులు చేశారు. తాను ఇంకా బతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నానని మహిళ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయిందని చెప్పింది. కొట్టాయం సమీపంలోని చింగవరానికి చెందిన ఈ మహిళ పేరు కే అంబిలి. స్కూల్ బస్సులో హెల్పర్గా పనిచేస్తోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ చిన్నారిని దాటించే సమయంలో ఆర్టీసీ బస్సు ఈమెను ఢీకొట్టింది. దీంతో ఆమె బస్సుకింద పడిపోయింది. డ్రైవర్ వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపైనుంచి వెళ్లలేదు. అయితే జుట్టు మాత్రం చక్రంలో ఇరుక్కుపోయింది. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మహిళకు సాయం చేశారు. ఓ బార్బర్ను పిలిపించారు. అతను బస్సు కిందకు వెళ్లి చక్రంలో ఇరుక్కున్న మహిళ జుట్టును కత్తిరించాడు. దీంతో మహిళ క్షేమంగా బయటపడింది. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. చదవండి: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి బెయిల్.. -
ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు.. 39 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. క్వెట్టా నుంచి కరాచీ వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ధాటికి మంటలు చెలరేగి బస్సు కాలిపోయింది. బలూచిస్తాన్ ప్రాంతంలోని లాస్బెలాలో జరిగిన ఈ విషాద ఘటనలో 39 ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ బస్సును వేగంగా నడిపాడని, ఈ క్రమంలోనే ఓ బ్రిడ్జి మలుపు వద్ద అదుపు తప్పి పిల్లర్ను ఢీకొట్టాడని అధికారులు తెలిపారు. అనంతరం బస్సు కాలువలోకి దూసుకెళ్లిందని వివరించారు. వెంటనే మంటలు చెలరేగి ప్రయాణికులు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంటల్లో కాలిపోయిన వారిని గుర్తించేందుకు మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చదవండి: భారత సంతతి రాజా చారికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి! -
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
నాసిక్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాసిక్- షిర్డీ హైవేపై ఒక బస్సు- ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృత్యువాత పడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్న బస్సును ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Maharashtra | 10 people died and several others injured after a bus carrying Sai Baba devotees collided with a truck near Pathare on Nashik-Shirdi Highway: Nashik Police pic.twitter.com/Xel2Irb0vc — ANI (@ANI) January 13, 2023 -
న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా..
తిరువనంతపురం: నూతన సంవత్సరం వేళ కేరళ మలప్పురంలోని తిరూర్లో విషాదం జరిగింది. టూర్కు వెళ్లి తిరిగివస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఆదివారం ఉదయం 1:15 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో 40 మంది గాయపడ్డారు. అయితే కొండ ప్రాంతంలో బస్సు నడిపిన అనుభవం డ్రైవర్కు లేకపోవడం కారణంగా బస్సు నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణం కూడా సరైన ప్లాన్ లేకుండా జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురైంది. చదవండి: డ్రైవర్కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం -
విషాదం.. 75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని సైదాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 75 మంది స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. జౌన్పూర్లోని కాంతి దేవి జనతా విద్యాలయ పాఠశాల విద్యార్థులను ప్రయాగ్రాజ్లోని మాన్గఢ్కు టూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ముందున్న ఓ బైక్ను తప్పించబోయి డ్రవైర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు కూడా కిందపడి గాయాలపాలయ్యారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
వాహనాలపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మంటల్లో ఇద్దరు మృతి!
ముంబై: అతివేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్ఆర్టీసీ)కి చెందిన ఓ బస్సు ముందున్న వాహనలను ఢీకొట్టింది. ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నాశిక్-పుణె రహదారిపై పాల్సే గ్రామం వద్ద గురువారం జరిగింది. ఈ ప్రమాదం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. పుణె జిల్లాలోని రాజ్గురునగర్ నుంచి నాశిక్కు వెళుతోంది. ఈ క్రమంలో పాల్సే గ్రామం సమీపంలో బ్రేకులు ఫెయిల్ అవగా.. నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు ఎస్యూవీ వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా వెళ్లి ముందున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ‘రెండు బస్సుల మధ్య రెండు బైకులు చిక్కుకుని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజ్గురునగర్ నుంచి వచ్చిన బస్సుకు సైతం మంటలు అంటుకున్నాయి. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి 43 మందిని రక్షించారు. నాశిక్ అగ్నిమాపక విభాగం హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసింది.’ అని అధికారులు తెలిపారు. బ్రేకులు పని చేయక ప్రమాదానికి కారణమైన బస్సులోని కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని నాశిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం కారణంగా కొంత సమయం ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు చెప్పారు. CCTV footage of ST bus accident at Palase on Nashik-Pune highway#Accident #CCTV #Nashik_pune_Highway#Nashik #Sinnar #Palse pic.twitter.com/9BaKJ0JMUo — पाटील 🤗 (@PareshPatil11) December 8, 2022 पळसे ता.जि नाशिक येथे बस दुर्घटने मध्ये मृत्यु झालेल्या सर्वांना भावपुर्ण श्रद्धांजली. शासना तर्फे तात्काळ मदत मिळावी हि विनंती. #Palse #Accidents @CMOMaharashtra @Dev_Fadnavis जी @TV9Marathi @abpmajhatv @saamTVnews @zee24taasnews @ChivateMangesh जी pic.twitter.com/TeC2ovtyaW — Sameer kale (@SAMEER_G_KALE) December 8, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా? -
వనపర్తి జిల్లాలో బస్సు ప్రమాదం
-
బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి
బొగోటా: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అమెరికాలోని కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సును పూర్తిగా ముంచేసింది బురద. మరో రెండు వాహనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రిసరాల్డా జిల్లాలోని ప్లూబో రికో నగరంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. భారీగా బురద ఉప్పొంగటంతో రహదారి రెండుగా చీలిపోయింది. భారీగా ట్రీఫిక్ జామ్ ఏర్పడింది. రెండు మీటర్ల లోతులో బురదలో కూరుకుపోయిన బస్సులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బురద కమ్మేయడంతో ఓ కారులోని ఆరుగురు, ద్విచక్రవాహనంపై ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. సుమారు 70 మంది రెస్క్యూ సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ప్రభుత్వ తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది.’ అని పేర్కొన్నారు. A #landslide engulfed a #bus in #Colombia on Sunday afternoon, leaving at least 34 people dead and several injured. The bus and 3 other vehicles were traveling on the highway near Pueblo Rico, #Risaralda when they were surprised by the #avalanche. #viralvdoz pic.twitter.com/ePahStfzo1 — ViralVdoz (@viralvdoz) December 6, 2022 ఇదీ చదవండి: మనిషి మెదడులో చిప్.. న్యూరాలింక్ ప్రయోగాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ -
ఘోరం: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. బస్సు బీభత్సం
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. రన్నింగ్ బస్సులో డ్రైవర్ గుండె పోటుతో సీటులోనే కన్నుమూశాడు. ఆపై బస్సు పలు వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. జబల్పూర్లో ఓ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుతో డ్రైవర్ సీటులోనే కన్నుమూశాడు. దీంతో బస్సు అదుపు తప్పి పలు వాహనాలపైకి బస్సు దూసుకెళ్లింది. సిగ్నల్ ప్రాంతం కావడం, బస్సు వేగం తక్కువగా ఉండడం, సిగ్నల్ దగ్గర ఓ ఈ-రిక్షాను ఢీ కొట్టడంతో బస్సు ముందుకెళ్లి ఆగిపోయింది. బస్సు ప్రయాణికులతో పాటు ఈ-రిక్షా బోల్తా పడగా.. అందులోని ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఆరు మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బస్సు ఢీ కొట్టడంతో ఓ పెద్దాయన గాయపడగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. డ్రైవర్ హర్దేవ్ పటేల్ గత పదేళ్లుగా సిటీ మెట్రో బస్సు సర్వీసుకు పని చేస్తున్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన స్టీరింగ్పైనే కుప్పకూలిపోయాడు. CAUGHT ON CAMERA - A city bus in Madhya Pradesh's Jabalpur ran into several vehicles, killing 2, after its driver died of sudden heart attack. #Jabalpur #MadhyaPradesh #Accident pic.twitter.com/MvOEq3lbHV — TIMES NOW (@TimesNow) December 2, 2022 VIDEO CREDITS: TIMES NOW -
అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా
వికారాబాద్ జిల్లా: జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 29 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అనంతగిరిలో మైసవ్వ చిన్న గుట్ట దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్రేన్ ద్వారా బస్సుని వెలికి తీశారు. కాగా, బస్సు బ్రేకులు సక్రమంగా లేవని అధికారులకు డ్రైవర్ చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది. -
కేరళలో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా
-
మహిళల క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు!
విశాఖపట్నం: మహిళల సీనియర్ టీ20 మ్యాచ్లు ముగించుకుని వెళ్తున్న బరోడా క్రికెటర్లు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు.. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో దానిని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విశాఖ వేదికగా మహిళా సీనియర్ టీ20 మ్యాచ్లు జరుగుతున్నాయి. చదవండి: West Indies: 'హెట్మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్కు ఈ దుస్థితి' -
దేవుడా ఎంత ఘోరం! మిన్నంటిన ఆర్తనాదాలు
అర్ధరాత్రి, డ్రైవర్ తప్ప అందరూ గాఢనిద్రలో ఉన్నారు. మరో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంట్లో ఉంటారు. కానీ విధి మరోలా తలచింది. పాల ట్యాంకర్ రాంగ్ రూట్లో మృత్యు శకటంలా వచ్చింది. యాత్రికుల టెంపో ట్రావెలర్ గమనించేలోపే ఢీ కొట్టారు. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు, మహిళలతో సహా 9 మంది దుర్మరణం చెందారు. దేవుని దర్శనానికి వెళ్లి వస్తుంటే ఎంత దారుణం జరిగింది దేవుడా అని మృతుల బంధువులు విలపించారు. బనశంకరి: టెంపో ట్రావెలర్కు ముందు పాల ట్యాంకర్, వెనుక నుంచి కేఎస్ఆర్టీసీ బస్ తాకిడితో భీకర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపోలోని నలుగురు పిల్లలతో పాటు 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసికెరె తాలూకా బాణావర పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ధర్మస్థల, హాసనాంబ దర్శనం చేసుకుని వివరాలు.. అరసికెరె తాలూకా బాణవార హొబళి హళ్లికెరె గ్రామానికి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది టెంపో ట్రావెలర్ వాహనంలో శనివారం ధర్మస్థల క్షేత్రానికి వెళ్లారు. మంజునాథ స్వామికి దర్శించుకుని తరువాత సాయంత్రం హాసన్కు బయలుదేరారు. హాసనాంబ మాతను దర్శించుకుని చేసుకుని హళ్లికెరె గ్రామానికి తిరుగుముఖం పట్టారు. మరో 10 నిమిషాల్లో క్షేమంగా సొంతూరికి చేరుకునేవారు. రాంగ్ రూట్లో పాల ట్యాంకర్ అరసికెరె–శివమొగ్గ హైవే – 69 బాణావర వద్ద వెళుతుండగా శివమొగ్గ నుంచి చెన్నరాయపట్టణ వైపునకు వస్తున్న పాల ట్యాంకర్ డ్రైవరుకు మలుపు తెలియకపోవడంతో టెంపోకి ఎదురుగా వెళ్లాడు. ఈ సమయంలో వేగంగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనం, పాల ట్యాంకర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఆ సమయంలో వెనుక వస్తున్న బెంగళూరు–శివమొగ్గ కేఎస్ ఆర్టీసీ బస్సు టెంపోను ఢీకొట్టింది. రెండు వైపులా ప్రమాదంతో టెంపోలోని యాత్రికులు విలవిలలాడారు. మృతులు వీరే..: తీవ్ర గాయాలతో లీలావతి (50), చైత్ర (33), సమర్థ (10), డింపి (12), తన్మయ్ (10), ధృవ (2), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50) అనే 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టెంపో, బస్సులోని మరో 12 మందికి తీవ్రగాయాలు కావడంతో 10 మందిని హాసన్ జిల్లాసుపత్రికి, ఇద్దరిని అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. టెంపో నుజ్జునుజ్జుకావడంతో క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించారు. గాయపడిన వారిలో కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవరుతో పాటు ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్యాంకర్ డ్రైవర్ అరెస్టు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే బాణవార పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాసన జిల్లాఆసుపత్రికి, అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. మతదేహాలకు శవపరీక్షల నిమిత్తం హాసన్ జిల్లాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. పాలట్యాంకర్ డ్రైవరును అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. హైవే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదం విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారి అధికారులు మరమ్మతులు జరుగుతుండగా సక్రమంగా సూచిక బోర్డులు అమర్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు. రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునే వారు విగతజీవులయ్యారని తెలిపారు. రూ.2 లక్షల చొప్పున పరిహారం మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై ప్రకటించారు. ఈ సంఘటన దురదష్టకరమని సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విపక్ష నేతలు సిద్దరామయ్య, కుమారస్వామిలు కూడా సంతాపం తెలిపారు. మిన్నంటిన ఆర్తనాదాలు దేవునికి కళ్లు లేవు. దేవుని శాపమో, గ్రహచారమో అని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు విలపించారు. ఈ ప్రమాదంలో హళ్లికెరెలో పెద్ద కుటుంబానికి చెందిన 9 మంది మృత్యవాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. ప్రమాద స్థలంలో విలేకరులతో మాట్లాడిన మృతుల బంధువు రవికుమార్.. అందరూ శుక్రవారం ఇంటి వద్ద పెద్దల పూజ చేసుకుని శనివారం ఉదయం ధర్మస్థలకు వెళ్లారు. తరువాత హాసనాంబను దర్శించుకుని తిరుగుప్రయాణంలో వస్తూ మరణించారని విలపించాడు. ఏ దేవునికి కళ్లు లేవు సార్. మేమంతా ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబం«దీకులు. నా తమ్ముడు రెండేళ్ల కిందట కోవిడ్తో చనిపోయాడు. ఈ రోజు ప్రమాదంలో అతని ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని రోదిస్తూ చెప్పాడు. (చదవండి: విజయపురలో పరువు హత్య?) -
Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం
ముంబై: మహారాష్ట్ర నాసిక్లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 11 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరి చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాసిక్ ఔరంగబాద్ హైవేపై ఈ ఘటన జరిగింది. యావత్మాల్ నుంచి ముంబై వెళ్లే బస్సు, పుణె నుంచి నాసిక్ వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టుకోవడం వల్ల బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్ని పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తాము చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది తప్ప సాయం చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలు అదుపు చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బస్సు యావత్మాల్ నుంచి బయలుదేరినప్పుడు 30 మంది ఉన్నారని, ఆ తర్వాత మధ్యలో మరో 19 మంది ఎక్కారని నాసిక్ పోలీస్ కమిషనర్ జయంత్ నాయక్నవారే తెలిపారు. వీరందరినీ గుర్తిస్తున్నట్లు చెప్పారు. మోదీ దిగ్భ్రాంతి ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల సాయం ప్రకటించారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం తెలిపింది. సీఎం రూ.5లక్షలు పరిహారం ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. Maharashtra | A luxury bus & a trailer truck collided with each other. A fire broke out due to the impact. 11 casualties so far. 30 people had started from Yavatmal & 19 people boarded the bus in the middle. They are being identified: Nashik Police Commissioner Jayant Naiknavare pic.twitter.com/xjljXPdM1K — ANI (@ANI) October 8, 2022 చదవండి: చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ -
40 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ బోల్తా.. విద్యార్థి మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా రహత్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు చంద్రాపూర్ గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలపాలైన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అందులోని విద్యార్థులు తెలిపారు. తమ తోటి విద్యార్థి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: పీఎఫ్ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు -
చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తాపడి 27మంది దుర్మరణం
బీజింగ్: చైనాలో ఆదివారం ఉదయం ఘోరో ప్రమాదం జరిగింది. గిజావ్ రాష్ట్రం సాండు కౌంటీలో హైవేపై బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన 20 మందిని హుటాహూటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినట్లు సమాచారం అందిన వంటేనే సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతం ఎత్తైన పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ సంప్రదాయ తెగలవారు జీవిస్తుంటారు. అయితే బస్సులో ఉన్నవారంతా కొవిడ్ బాధితులు అయి ఉంటారని ప్రచారం జరుగుతోంది. గిజావ్ ప్రభుత్వ అధికారులు కూడా వీరందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండగానే ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా కోవిడ్ సూట్లు ధరించి ఉన్నట్లు సమాచారం. కానీ వీరు కోవిడ్ బాధితులా? లేకా అనుమానితులా? అనే విషయంపై స్పషత లేదు. గిజావ్ రాష్ట్రంలో గత రెండు రోజుల్లో 900కుపైగా కొత్త కేసులు వెలుగుచేశాయి. సెప్టెంబర్ మొదట్లోనే ఇక్కడ లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. కోవిడ్ బాధితులను, వారిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తోంది. చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు..! వీడియో వైరల్ -
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు
రాంచీ: జార్ఖండ్ హజారీబాగ్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బస్సులోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బస్సు గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో తాతిఝరియా వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి సివేనీ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వీరి సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్కేస్లో కుక్కి.. -
ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమర్నాథ్ యాత్ర భద్రత కోసం వెళ్తున్న ఐటీబీపీ సిబ్బందితో కూడిన బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. పహాల్గాం వద్ద బస్సు నదీలోయలో పడిపోయింది బస్సు. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీబీపీ సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బందితో కూడిన బస్సు చందన్వారీ నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహల్గాం ఫ్రిస్లాన్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి.. లోయలో పడిపోయిందని ప్రమాదానికి గల కారణాలను వివరించారు అధికారులు. ఆ సమయంలో బస్సులో 37 మంది ఐటీబీపీ సిబ్బంది, ఇద్దరు జమ్ము పోలీసులు సైతం ఉన్నారు. గాయపడిన సిబ్బందని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. #WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmir pic.twitter.com/r66lQztfKu — ANI (@ANI) August 16, 2022 -
15 మంది అమర్నాథ్ యాత్రికులు మృతి!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్లోని కాజిగుండ్ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కాజీగుండ్లోని బద్రాగుండ్ క్రాసింగ్ వద్ద టిప్పర్ డంపర్ ఢీకోట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ఆ వరదల్లో సుమారు 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. అమరనాథ్ యాత్రకు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి గురువారం 5వేల మంది యాత్రికులు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ‘నున్వాన్-పహల్గామ్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి 201 వాహనాల్లో మొత్తం 5,449 మంది యాత్రికులు బయలుదేరారు. ’ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. జున్ 29న భగవతి నగర్ బేస్ క్యాంప్లో అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు గవర్నర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 88,526 మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో ఆరోగ్య సమస్యలతో 11 మంది మరణించారు. ఆగస్టు 11న రక్షా బంధన్, శ్రావణ పౌర్ణిమ రోజున అమర్నాథ్ యాత్ర ముగియనుంది. ఇదీ చూడండి: ప్రధాని మోదీ హత్యకు కుట్ర?.. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్ -
విషాదం: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు, కొందరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులు జిల్లా డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ చెప్పారు. సయింజ్ వైపునకు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 ప్రాంతంలో జంగ్లా గ్రామం వద్ద ప్రమాదానికి గురైందని తెలిపారు. జిల్లా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టు గార్గ్ వెల్లడించారు. పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్.. తీరా ఓపెన్ చేసి చూస్తే.. -
పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా పాకిస్తాన్లో ప్రమాదాలు సాధారణమయ్యాయి. గత నెలలో కూడా ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి👇 జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా? -
బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు
సుల్తాన్బజార్: నగరంలోని గోడేకబర్ నుంచి గోవాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదంలో మృతిచెందిన శివకుమార్, రవళి, దీక్షిత్ల మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం శనివారం ఉదయం 11 గంటలకు గోడేకబర్ కామటిపురాలోని వారి ఇళ్లకు చేరుకున్నాయి. దీంతో గోడేకబర్ పరిసర ప్రాంతాల్లో విషాదం అలముకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, స్థానిక కార్పొరేటర్ లాల్సింగ్, మాజీ కార్పొరేటర్ ముఖేష్ సింగ్లు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం పురానాపూల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. (చదవండి: కాన్పూర్ హింస..800 మందిపై కేసులు) -
విహారయాత్ర విషాదాంతం
సాక్షి, బళ్లారి/ సాక్షి, హైదరాబాద్/ అల్వాల్/గన్ఫౌండ్రి: వేసవి సెలవుల నేపథ్యంలో విహార యాత్రకు వెళ్లారు. ఐదు రోజులు ఉల్లాసంగా గడిపారు. తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఏడుగురు సజీవ దహనమయ్యారు. 13 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్కు చెందిన పలు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు.. బాధితులు, కలబురిగి జిల్లా ఎస్పీ ఇషా పంత్, స్థానిక బంధువుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. ఎప్పటిలాగే వేసవి టూర్ సికింద్రాబాద్ బొల్లారంలోని రిసాలబజార్ శాంతినగర్ కాలనీకి చెందిన ముకుందరావు (65) ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. ఈయన కుమారుడు అర్జున్ కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఈ కుటుంబం ప్రతి ఏడాది వేసవి సెలవుల నేపథ్యంలో బంధువులతో కలిసి విహార యాత్రకు వెళ్తుంటుంది. గత ఏడాది తిరుపతికి వెళ్లి వచ్చింది. ఈసారి గోవా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. దీంతో అర్జున్ సుచిత్ర జంక్షన్ వద్ద ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన 2+1 ఏసీ స్లీపర్ బస్సును బుక్ చేశారు. ఈ నెల 28న శాంతినగర్తో పాటు సమీపంలోని బంజారా విలేజ్ కాలనీకి చెందిన బంధువులు, నగరంలోని గోడేకీ ఖబర్ ప్రాంతానికి చెందిన శివకుమార్ (నాంపల్లి కోర్టులో అటెండర్) కుటుంబం.. అంతా కలిపి మొత్తం 32 మంది గోవా బయలుదేరారు. ముకుందరావు భార్య వసంత మాత్రం ఆనారోగ్య కారణాలతో ఇంట్లోనే ఉండిపోయారు. 5 రోజుల పాటు గోవాలో గడిపిన వారంతా గురువారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. రాంగ్ రూట్లో వచ్చిన వాహనాన్ని ఢీ కొట్టి.. ఈ బస్సుకు అమృత్, రవీంద్ర డ్రైవర్లుగా కాగా మరో క్లీనర్ కూడా ఉన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ బస్సు బీదర్ – శ్రీరంగపట్టణం హైవేలోని కలబురగి (గుల్బర్గా) జిల్లా కమలాపుర ప్రాంతానికి చేరుకుంది. అప్పటివరకు డ్రైవింగ్ చేసిన అమృత్ బస్సును రవీంద్రకు అప్పగించాడు. ఇతడు నడపటం మొదలెట్టిన కొద్ది సేపటికే ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన టెంపో.. బస్సును ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును ఢీ కొని కిందకు పడిపోయింది. ఈ ధాటికి వాహనం డీజిల్ ట్యాంక్ పగిలిపోగా... బస్సుకు మంటలు అంటుకున్నాయి. కళ్లముందే కాలి బూడిదయ్యారు గాఢ నిద్రలో ఉన్నవారు ప్రమాదంతో బస్సులోనే చెల్లాచెదురుగా పడిపోయారు. ఇంతలోనే బస్సంతా మంటలు వ్యాపించాయి. డ్రైవర్లు, క్లీనర్ సహా మిగతా వారంతా అక్కడి స్థానికులు, హైవేపై వెళ్తున్న ప్రయాణికుల సాయంతో కిటికీల్లోంచి బయటపడగా దట్టమైన మంటల్లో చిక్కుకున్న ఏడుగురు మాత్రం వారి కళ్లముందే కాలి బూడిదయ్యారు. తమ వారు కళ్ల ముందే కాలిపోతున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయతతో బయటపడిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్ద శబ్దం వచ్చిందని, కళ్లు తెరిచి చూసేలోగా మంటల మధ్య ఉన్నామని కొందరు తెలిపారు. బస్సు కూడా పూర్తిగా తగలబడిపోయింది. గాయపడిన వారిని పోలీసులు కలబురిగి ఆస్పత్రికి తరలించారు. టెంపో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎస్పీ ఇషా పంత్ తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. బస్సు ప్రమాదంపై కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బి.శ్రీరాములు తీవ్ర సంతాపం ప్రకటించారు. బస్సు దుర్ఘటన తమను కలచివేసిందన్నారు. శాంతినగర్లో విషాదఛాయలు ఈ ప్రమాదం విషయం శుక్రవారం సాయంత్రం వరకు ముకుందరావు భార్య వసంతకు తెలియనీయలేదు. ఆమె అనారోగ్య కారణాల నేపథ్యంలో బంధువులు గోప్యంగా ఉంచారు. ముకుందరావు ఆఖరిసారిగా గురువారం రాత్రి తన భార్యతో మాట్లాడి శుక్రవారం మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తామంటూ చెప్పారు. ప్రమాద నేపథ్యంలో శాంతినగర్ కాలనీలోని ముకుందరావు ఇంటికి చేరుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలబురిగిలో ఏం జరిగిందో, క్షతగాత్రుల పరిస్థితి తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కొందరు బంధువులు కలబురగి బయలుదేరి వెళ్లారు. వారు మృతులను గుర్తించినట్టు తెలిసింది. ముకుందరావు ఇంటికి వెళ్లిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే సాయన్న మృతుల బంధువులను పరామర్శించారు. గోవా వెళ్లింది వీరే.. ముకుందరావు, అర్జున్కుమార్, సరళాదేవి, దేవాన్‡్ష, మానసి, అర్చన, జయశ్రీ, ఖుషీ, కె.స్నేహలత, కవిత, కల్పన, విశాల్, రాజేశ్వర్, విరాన్, కె.రఘు, కె.విజయలక్ష్మి, జయంత్, నీలేష్, ఎస్.సుధ, కె.గగన్ దీప్, అర్చన, అనిత, శివకుమార్, లావణ్య, దీక్షిత్, అధ్వైత్, దీప్తి, దివాన్‡్ష, సుధీర్ కుమార్లతో పాటు మరో ముగ్గురు (వీరితో పాటు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ బస్సులో ఉన్నారు) మృతులు ..: అర్జున్కుమార్ (36), అతని భార్య సరళాదేవి (34), కుమారుడు వివాన్ (3), ముకుందరావు సోదరి అనిత (58), గోడేకా ఖబర్ ప్రాంతానికి చెందిన అనిత కుమార్తె రవళి (30), అల్లుడు శివకుమార్ (35) వీరి పెద్ద కుమారుడు దీక్షిత్ (11)క్షతగాత్రులు..: ముకుందరావు (65), అర్జున్ కుమార్తె ఖుషి (8), ముకుందరావు సమీప బంధువు మానస (18), అనిత భర్త రవీందర్ తదితరులు. ప్రధాని సంతాపం కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: Money Bags In Beggar Room: యాచకుడి మృతి.. సంచుల నిండా నోట్లు చూసి మైండ్ బ్లాక్ -
అవే చివరి పలకరింపులు.. ఇంటర్ పరీక్షలు ముగించుకొని బైక్పై వెళ్తూ..
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపింది. హాస్టల్లో తన వస్తువులు సిద్ధం చేసుకొని మరోసారి మిత్రులందరినీ పలకరించి నాన్నతో పాటు ఆనందంగా బైక్పై గ్రామానికి బయల్దేరింది. కానీ.. ఆ విద్యార్థిని ఆనందం కొన్ని నిమిషాల్లో ఆవిరైపోయింది. దారి మధ్యలోనే బస్సు రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి, కూతురిని బలితీసుకుంది. ఇక సెలవంటూ స్నేహితురాళ్లకి.. ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్లో విద్యార్థిని చెప్పిన ఆ పలకరింపులే.. చివరివయ్యాయి. సాక్షి, గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం మేరకు వివరాలిలా.. ఇటిక్యాల మండలం మునగాలకి చెందిన నల్లన్న (42), పద్మమ్మకు ఇద్దరు సంతానం. కుమార్తె రాజేశ్వరి (18) గద్వాల మండలంలోని గొనుపాడు కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతుంది. గురువారం ఇంటర్మీడియెట్ చివరి పరీక్ష సైతం పూర్తవడంతో విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద, హాస్టల్లో తోటి విద్యార్థినులతో ఆనందంగా పలకరిస్తూ.. తిరిగి పైచదువులకు కలుద్దామని చెప్పింది. కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి నల్లన్న బైక్పై మునగాల నుంచి గోనుపాడులోని కేజీబీవీ హాస్టల్కు చేరుకున్నాడు. స్నేహితులందరికీ మరోసారి పలకరించిన రాజేశ్వరి తండ్రితో పాటు బైక్పై స్వగ్రామానికి బయల్దేరింది. బస్సు రూపంలో కబళించిన మృత్యువు.. గురువారం మధ్యాహ్నం తండ్రీకూతురు ఇద్దరూ గద్వాల మీదుగా స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎర్రవల్లి నుంచి గద్వాల వైపు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుఎదురుగా వస్తున్న వీరి బైక్ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పైనుంచి వారు ఎనిమిది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన నల్లన్న, రాజేశ్వరి అక్కడిక్కడే మృతిచెందారు. ఇదిలా ఉండగా, బైక్ మామూలు వేగంతోనే వెళ్తుండగా.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వీరి బైక్ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. చదవండి: దిశ కేసు: వారిని పోలీసులే వేధించి కాల్చి చంపారు గ్రామంలో విషాదం. రోడ్డు ప్రమాదంలో మునగాలకి చెందిన తండ్రీకూతురు మృతి చెందారనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. రాజేశ్వరి చదువులో ఎంతో చురుకుగా ఉంటూ.. సెలవుల సమయంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉండేదని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయ పనులపైనే ఆధారపడి బతుకీడుస్తున్న నల్లన్న కుటుంబంలో ఒక్కసారిగా ఇరువురు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఏఎస్ఐ వెంకట్రాములు తెలిపారు. -
బస్సు ప్రమాద మృతులకు ఆర్థికసాయం
తిరుపతి తుడా/చంద్రగిరి: బస్సు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా నిలిచింది. చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పదిమంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బుధవారం రూ.2లక్షల చొప్పున ధర్మవరంలో చెక్కులను అందజేయగా.. తిరుపతిలోని 8 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 42 మంది క్షతగాత్రులకు అక్కడే రూ.50వేల చొప్పున చెక్కులను అందజేశారు. మృతుల కుటుంబాలకు మొత్తం రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.21 లక్షల సాయం ప్రభుత్వం తరఫున అందింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే భాకరాపేట లోయలో బస్సు ప్రమాదం చోటు చేసుకుందని రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ కృపానంద త్రిపాఠి ఉజేల స్పష్టం చేశారు. బుధవారం ఆయన భాకరాపేట కనుమలోని ప్రమాద స్థలాన్ని అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడుతో కలసి పరిశీలించారు. అతికష్టం మీద రోప్ సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు బస్సును పరిశీలించి పలు ఫొటోలను తన సెల్ఫోన్లో చిత్రీకరించారు. కనుమలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
నిర్లక్ష్యపు డ్రైవింగే కొంప ముంచింది
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై శనివారం రాత్రి భాకరాపేట ఘాట్లో పెళ్లి నిశ్చితార్థం కోసం వస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 300 అడుగులకు పైగా ఉన్న లోయలో బస్సు ఐదు పల్టీలు కొట్టి, పెద్ద పెద్ద బండ రాళ్లను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్కు తోడు అతి వేగం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన డ్రైవర్ రసూల్బాషా (47), క్లీనర్ షకీల్ (25), మలిశెట్టి గణేష్ (40), మలిశెట్టి మురళి (45), మలిశెట్టి వెంగప్ప (60), లక్ష్మీకాంతమ్మ (40) ఘటన స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యశస్విని (8) ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ జర్నలిస్ట్ ఆదినారాయణరెడ్డి (45), నాగలక్ష్మి (60) ఆదివారం మృతి చెందారు. మరో 43 మంది క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎముకలు విరిగిన 22 మందికి బర్డ్ ఆస్పత్రిలో, శస్త్రచికిత్సలు అవసరం అయిన 12 మంది స్విమ్స్లో, మరో 9 మందికి రుయాలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆర్తనాదాలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 45 మందిని (మొత్తం 52 మంది) శనివారం అర్ధరాత్రి తిరుపతిలోని రుయా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాలు విరిగి ఒకరు, ముఖంపై రాడ్లు గుచ్చుకుని రక్తం ధారలు కారుతూ మరొకరు, రెండు చేతులూ విరిగి, కాలు తెగి అల్లాడిపోతూ ఇంకొకరు.. బాధతో చేస్తున్న ఆర్తనాదాలు చూపరుల కంట నీరు తెప్పిస్తున్నాయి. చికిత్స పొందుతూ ఆదివారం వీరిలో ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొడుకు వేణు తీవ్ర గాయాలతో తల్లిదండ్రులు, బంధువుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు పడుతున్న ఆరాటం అయ్యో.. అనిపిస్తోంది. డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి, ధర్మవరం ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ శ్రీహరి, వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులతో నేరుగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లా మంత్రులు, అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో అత్యధికులు చేనేత కుటుంబాలకు చెందిన వారని, వారికి అండగా ఉంటామని సీఎం ప్రకటించారని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు చెప్పారు. కాగా, గాయపడిన వారి అభ్యర్థన మేరకు మరింత ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. మృతదేహాలకు తిరుపతి ఎస్వీ మెడికల్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రుయాలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బస్సు కండిషన్ ఓకే.. అతివేగమే కారణం భాకరాపేట ఘాట్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంపై లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ బసిరెడ్డి, తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ప్రాంతీయ రవాణా శాఖాధికారి సీతారామిరెడ్డి, ఆర్అండ్బీ (జాతీయ రహదారులు) డీఈ సత్యమూర్తి ఆధ్వర్యంలోని బృందం ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. బస్సు కండీషన్ బాగానే ఉందని, డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్ల స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో మలుపు వద్ద లోయలో పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అధికారులు తెలిపారు. ధర్మవరం కన్నీటి సంద్రం అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం ధర్మవరం టౌన్/అర్బన్ : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు బోల్తా ఘటనతో అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని నేసే పేటకు చెందిన సిల్క్ హౌస్ యజమాని మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్ (పట్టు చీరల వ్యాపారి), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు మురళి కుమారుడు వేణు (పెళ్లి కొడుకు) గాయపడడంతో ఆ ఇంట తీవ్ర విషాదం అలముకుంది. మలిశెట్టి మురళి బంధువైన మలిశెట్టి వెంగప్ప (పెళ్లిళ్ల పేరయ్య), అతని భార్య నాగలక్ష్మి కూడా చనిపోయారు. మరో బంధువు జింకా చంద్ర కుమార్తె చందన (నాలుగవ తరగతి) మృతి చెందింది. పట్టణంలోని మారుతీనగర్లో నివసించే బస్సు డ్రైవర్ నబీరసూల్, శాంతినగర్లో ఉండే బస్సు క్లీనర్ షకీల్ (ఇంకా వివాహం కాలేదు) చనిపోయారు. ఇదే ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణరెడ్డి సైతం మృత్యువాత పడ్డారు. ఈయన స్వగ్రామం బుక్కపట్నం మండలం మారాల. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో అతని కుమారుడి నిశ్చితార్థానికి వెళుతూ ప్రమాదంలో చనిపోయాడు. ఆదివారం వీరి మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారి అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని భాకారాపేట వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనపై ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మృతుల బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్ బస్సు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చిత్తూరు జిల్లా అధికార యాంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి తిరుపతి సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను ఆదివారం ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్లు ఈ ఘటనపై వేర్వేరు ప్రకటనల ద్వారా సానుభూతి తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, బస్సులకు వేగ పరిమితి విధించాలని పవన్ కల్యాణ్ సూచించారు. -
చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సాక్షి, ఢిల్లీ: చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. చదవండి: భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఘాట్ రోడ్లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. రూయాలో 32 మంది, స్విమ్స్లో ఏడుగురు, బర్డ్ ఆసుపత్రిలో ఆరుగురికి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ తెలిపారు. -
భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
-
లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!
-
లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!
సాక్షి, తిరుపతి: అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఘాట్ రోడ్లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి.. చెప్పినా డ్రైవర్ వినలేదు: పెళ్లికొడుకు వేణు బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పెళ్లికొడుకు వేణు అన్నారు. స్పీడ్గా వెళ్లొద్దంటూ చెబుతున్నా డ్రైవర్ వినలేదని.. ఓవర్ స్పీడ్ కారణంగా బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందన్నారు. రూయాలో 32 మంది, స్విమ్స్లో ఏడుగురు, బర్డ్ ఆసుపత్రిలో ఆరుగురికి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ తెలిపారు. మృతులు వీరే.. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు.ప్రమాద సమయంలో 55 మంది బస్సులో ఉన్నారు. రసూల్(డ్రైవర్), మలిశెట్టి వెంగప్ప, గణేష్, కాంతమ్మ, మురళీ, యశస్విని, ఆదినారాయణ, బస్సు క్లీనర్ మృతి చెందారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు సాయం.. బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా బాధితులు కోలుకునేంతవరకూ క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా బాధితులు కోలుకునేంతవరకూ క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు. క్షతగాత్రుల్ని తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని అన్నారు. చదవండి: (చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు) -
ఉత్సాహంగా పయనం.. గమ్యం చేరకముందే ఘోరం..
ధర్మవరం టౌన్(అనంతపురం జిల్లా) : నిశ్చితార్థ వేడుక ఘనంగా చేయాలనుకున్నారు. దగ్గరి బంధువులందరినీ పిలిచారు. ప్రైవేటు బస్సును అద్దెకు తీసుకుని సంతోషంగా బయలుదేరారు. తిరుచానూరులో కార్యక్రమం కావడంతో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. తిరిగొచ్చేటప్పుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రావచ్చనుకున్నారు. కానీ గమ్యం చేరకముందే ఘోరం జరిగిపోయింది. శనివారం రాత్రి చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ఘాట్రోడ్డులో బస్సు లోయలోకి బోల్తా పడింది. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 49 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురు ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్కు చెందిన వారు కాగా..మరికొందరు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి వాసులు. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను ఫణంగా పెట్టి.. ఉత్సాహంగా పయనం..మధ్యలో విషాదం ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్కు చెందిన మలిశెట్టి మురళి, లలిత దంపతులు. వీరికి కుమారుడు వేణు, కుమార్తె కోమలి సంతానం. మురళి పట్టణంలో సిల్్కహౌస్ నిర్వహిస్తున్నాడు. వేణు తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. వేణుకు పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన అమ్మాయితో నిశి్చతార్థం కుదిరింది. ఆదివారం తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో నిశ్చితార్థ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం నుంచి శనివారం ఉదయం 11 గంటలకు కేఏ 30ఏ 4995 నంబర్ బస్సులో బయలుదేరారు. మలిశెట్టి మురళి కుటుంబంతో పాటు వారి బంధువులు, పరిచయస్తులు అదే కాలనీకి చెందిన మునుస్వామి, సరస్వతి, కాంతమ్మ (వేణు పిన్ని), సునీత, శశితో పాటు పలు ప్రాంతాలకు చెందిన 55 మంది పయనమయ్యారు. అయితే..బస్సు మార్గమధ్యంలోని భాకరాపేట ఘాట్రోడ్డులో 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. అతి వేగంతో పాటు ఫిట్నెస్ లేని బస్సు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి, 49 మందికి తీవ్ర గాయాలయ్యాయన్న సమాచారం రావడంతో ధర్మవరంలోని బంధువులు, కాలనీ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షతగాత్రుల్లో పెళ్లికుమారుడు వేణు కూడా ఉన్నాడు. మలిశెట్టి మురళి పట్టణంలో చేనేత ప్రముఖుడు కావడంతో చాలా మంది చేనేతలు నిశ్చితార్థానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఘటనలో తమ వారికి ఏమైందోనన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్చైర్మన్ చందమూరి నారాయణరెడ్డి బాధితుల బంధువులను పరామర్శించి..ధైర్యం చెప్పారు. దిక్కుతోచడం లేదు మా అన్న కుమారుడు మలిశెట్టి వేణు నిశ్చితార్థానికి మా కుటుంబ సభ్యులంతా బయలు దేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే బస్సు లోయలో పడిందని టీవీలో చూశాను. ఎవరికి ఏమయ్యిందోనన్న బాధతో దిక్కుతోచడం లేదు. –మలిశెట్టి శివ, మారుతీనగర్, ధర్మవరం ఫొటోలు తీయడానికి వెళ్లి.. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన రామాంజినమ్మ, వెంకటేశులు కుమారుడు చంద్రశేఖర్ (28) ధర్మవరంలోని ఓ స్టూడియోలో ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. నిశ్చితార్థ వేడుకలో ఫొటోలు తీయడం కోసం బయలుదేరాడు. ప్రమాదంలో అతను చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనికింకా వివాహం కాలేదు. అక్క కుమారుడి నిశ్చితార్థం చూడాలని.. అక్క కుమారుడి నిశ్చితార్థ వేడుక చూడాలని సంతోషంగా బయలుదేరిన కాంతమ్మ (52) బస్సు ప్రమాదంలో చనిపోయింది. ఈమె వేణుకు స్వయాన పిన్ని కావడం గమనార్హం. ఈమె భర్త శివ ధర్మవరంలోనే ఉండిపోయాడు. భార్య చనిపోయిందన్న వార్త విని తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. -
300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి..
300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ఎవరు ప్రాణాలతో ఉన్నారో తెలియదు, ఎవరు చనిపోయారో తెలియదు.. ఘటనా స్థలికి చేరుకోవడం ప్రాణాలతో చెలగాటం. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టూరిస్టు బస్సు భాకరపేట మొదటి ఘాట్ లోయలో పడిపోయిందనే సమాచారం అందగానే జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు పోలీసు శాఖ అప్రమత్తమైంది. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, సీవీఎస్ఓ గోపీనాథ్జెట్టి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు హర్షిత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వీరితో పాటు స్థానికులు ప్రాణాలను ఫణంగా పెట్టి లోయలోకి దిగి క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. సాక్షి బృందం, తిరుపతి: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్కు చెందిన మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు(25) నిశ్చితార్థం నారాయణవనం మండలం తుంబూరుకు చెందిన అమ్మాయితో నిశ్చయించారు. ఆదివారం ఈ వేడుకను తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు టూరిస్టు బస్సులో ధర్మవరం, చుట్టుపక్క ప్రాంతాల నుంచి సుమారు 55 మంది బయలుదేరారు. అతి వేగంతో పాటు ఫిట్నెస్ లేని బస్సు కావడంతో భాకరపేట సమీపంలోని ఘాట్లో 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. చదవండి: చిత్తూరులో విషాదం.. లోయలో పడ్డ బస్సు రక్తసిక్తం.. బస్సు లోయలోకి పడిపోవడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. క్షతగాత్రులు రక్షించండి, కాపాడండి అంటూ పెద్ద ఎత్తున రోదించారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రులతో ఆ ప్రాంతం బీతావహంగా మారిపోయింది. స్థానికులతో పాటు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టారు. తాళ్లు, చెట్ల సాయంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఒకరికొకరు తోడుగా.. క్షతగాత్రులను కాపాడేందుకు ఒకరికొకరు తోడుగా లోయలోకి చేరుకున్నారు. ఒక్కో క్షతగాత్రుడిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరుగురు చొప్పున అరగంట పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, సీవీఎస్ఓ గోపినాథ్జెట్టి స్వయంగా క్షతగాత్రులకు ప్రాథమక చికిత్సలు చేశారు. కలెక్టర్ హరినారాయణన్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. పది 108 వాహనాలు 12కు పైగా ట్రిప్పులు, ఒక ప్రయివేట్ వెహికల్, నాలుగు మినీ వ్యాన్లతో క్షతగాత్రులను రుయాకు తరలించారు. పెళ్లి కొడుక్కి తీవ్ర గాయాలు ప్రమాదంలో పెళ్లి కుమారుడు వేణుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పిన్నమ్మ ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. మరో ఆరుగురు మరణించగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం 55 మంది ఉండగా, 48 మంది రుయాలోని అత్యవసర విభాగం, ఎంఎం వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల్లో 11 మందికి పైగా చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో పరిస్థితిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్రెడ్డి, ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ తదితరులు వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా.. 10 మంది మృతి
కర్ణాటక: పావగడ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 10 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. వైఎన్ఎస్ కోట నుంచి పావగడకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని పావగడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చదవండి: రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని.. -
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం .. 14 మంది మృతి.. మోదీ సంతాపం
రాంచీ: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంపావత్ జిల్లాలో సుఖిధాంగ్-దండమినార్ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. తనక్పూర్లో బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. చదవండి: విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చంపావత్ ఎస్పీ వెల్లడించారు. కాగా మృతి చెందిన వారంతా కాకాని దండా, కతోటి గ్రామాలకు చెందిన వారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: నేనున్నా లేకున్నా, మరో 50 ఏళ్లు కొనసాగాలి: కమల్ హాసన్ ప్రధాని మోదీ సంతాపం ఉత్తరాఖండ్లోని చంపావత్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయన సంతాపం తెలిపారు. ‘ఉత్తరాఖండ్లోని చంపావత్లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు -
కాన్పూర్లో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి, విషమంగా తొమ్మిది మంది!
Kanpur Bus Accident: ఉత్తర ప్రదేశ్లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి జనాల మీదకు దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలు అయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి.. జనాల మీదకు దూసుకెళ్లింది. ఆపై బస్సు ఓ ట్రాఫిక్ బూతును ఈడ్చుకుంటూ వెళ్లి.. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కును ఢీ కొట్టి ఆగిపోయింది. ఘటన తర్వాత బస్సు డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు ఈస్ట్ కాన్పూర్ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులకు దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు.. వాళ్లలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకులు ఫేయిల్ అయినందునే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటన సమయంలో 20 మందికి పైగా గుంపు అక్కడ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. #Police_Commissionerate_Kanpur_Nagar के घण्टाघर से टाटमील चौराहे के बीच हुयी घटना व की गयी कार्यवाही के सम्बन्ध में पुलिस उपायुक्त पूर्वी @dcpekanpur द्वारा दी गयी बाइट।@Uppolice pic.twitter.com/QpGho35a0M — POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) January 30, 2022 ఇదిలా ఉండగా.. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు పొలిటీషియన్లు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. कानपुर में हुई बस दुर्घटना में कई लोगों के हताहत होने की खबर से अत्यंत दुःख हुआ है। इस घटना में अपने प्रियजनों को खोने वाले परिवारों के प्रति मेरी गहन शोक-संवेदनाएं। मैं घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ। — President of India (@rashtrapatibhvn) January 31, 2022 कानपुर से सड़क हादसे का बहुत ही दुखद समाचार प्राप्त हुआ। मृतकों के परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि घायलों को जल्द स्वास्थ्य लाभ मिले। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 30, 2022 -
రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి
Five dead, 21 injured in bus accident south of Moscow: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 21 మంది గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. మాస్కోకు దక్షిణంగా 270 కిలోమీటర్ల (170 మైళ్లు) దూరంలో వోస్లెబోవో గ్రామ సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగిందని రష్యా ఫెడరల్ రోడ్ ట్రాఫిక్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ తెలిపింది. (చదవండి: స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే) పైగా భారత కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 5.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఏజెన్సీ పేర్కొంది. అయితే బస్సు రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న పిల్లర్ని ఢీ కొట్టి ఉండవచ్చని ఏజెన్సీ తెలిపింది. అంతేకాదు ఈ బస్సులో మొత్తం 49 మంద ప్రయాణికులు ఉన్నారని అధికారులు అన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: అఫ్గాన్ వాసులకు ప్రాణాలను కాపాడే గొప్ప బహుమతిని ఇచ్చిన భారత్!!) -
జంగారెడ్డిగూడెం : జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు ప్రమాదం ( ఫొటోలు )
-
ఈక్వెడర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
క్విటో: ఈక్వెడర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెజోనియన్ రాష్ట్రంలోని సుకువాలో బస్సు బొల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందినవారిని మార్చురీకి తరలించారు. కాగా, బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: అత్యాచార ఆరోపణలు.. బాధితురాలికి అలీబాబా షాక్ -
బల్గేరియాలో దారుణం..బస్సు ప్రమాదంలో 48 మంది మృతి
సోఫియా: పశ్చిమ బల్గేరియాలోని హైవేపై నార్త్ మెసిడోనియన్ లైసెన్స్ ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 45 మంది మరణించారని అధికారులు తెలిపారు. అయితే బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు, కాలిన గాయాలతో ఏడుగురిని రాజధాని సోఫియాలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక భద్రతా విభాగానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధిపతి నికోలాయ్ నికోలోవ్ వెల్లడించారు. (చదవండి: కుక్కని బుక్ చేసేందుకై...మరీ అలా చేయాలా!) అంతేకాదు బస్సు బోల్తాపడటంతో అగ్నిప్రమాదం జరిగిందో లేదా అగ్నిప్రమాదం జరిగాక బొల్తాపడిందనేది ఇంకా స్పష్టం కాలేదని నికోలోవ్ చెప్పారు. అయితే ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంతో జరిగిందని అన్నారు. పైగా బాధితుల్లో ఎక్కువ మంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారేనని సోఫియాలోని నార్త్ మెసిడోనియా రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. (చదవండి: వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!) -
పాక్లో ఘోర రోడ్డు ప్రమాదం: 22 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహయంతో సహయక చర్యలు ప్రారంభించారు. బస్సు బలోచ్ ప్రాంతం నుంచి రావల్పిండి వెళ్తుండగా సుద్నోతి జిల్లాలో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సు.. బ్రేకులు సరిగా పడకపోవడం వలన అదుపుతప్పి 500 మీటర్ల పాటు.. రోడ్డుకిందకు వచ్చి పడింది. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బస్సులోయలో పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లక్షచోప్పున ఎక్స్గ్రెషియాను ఇస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజేశ్కుమార్ తెలిపారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన వారికి 40,000 వేల రూపాయలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న (ఆదివారం) బైల గ్రామం నుంచి వికాస్నగర్కు బయలు దేరిన బస్సు.. చక్రాటా అనే ప్రాంతంలో అదుపుతప్పి 300 అడుగుల లోతున పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. చదవండి: 300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి -
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి పరిస్థితి విషమం
ముంబై: ముంబైలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదర్ ప్రాంతంలో.. బస్సు,ట్రక్ను ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో.. రాజేంద్ర (53), కాశీరామ్ ధూరీ (57), తాహిర్ హుస్సెన్ (52), రూపాలి గైక్వాడ్ (36), సుల్తాన్ (50), శ్రావణి మోస్కీ (16), వైధేహి బామనీ (17), మాన్సూర్ ఆలీ (52) తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తేజస్వినీ ట్రావెల్ కు చెందిన బస్సు మారోల్ నుంచి పైడోనీకి వెళ్తుండగా దాదార్ వద్ద ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం.. డ్రైవర్ కండక్టర్తో సహా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: పంజాబ్లో మారనున్న రాజకీయ సమీకరణాలు -
నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి
కఠ్మాండూ: నేపాల్లో మంగళవారం బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్గంజ్ నుంచి గమ్గాధి వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పినాఝరి నదిలో ప్రమాదవశాత్తు పడింది. ఛాయానాథ్ రారా మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఘటనలో 32 మంది చనిపోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు మై రిపబ్లికా అనే వెబ్సైట్ తెలిపింది. ప్రమాద బాధితులంతా విజయదశమి పండక్కి సొంతూళ్లకు వెళ్తున్న వారేనని పేర్కొంది. చదవండి: ('అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తా: కిమ్ ప్రతిజ్ఞ) -
అదే వంతెనపై మరో ఘోరం
బొమ్మనహళ్లి(బెంగళూరు): సుమారు నెల కిందట బెంగళూరులోని బొమ్మనహళ్లి– ఎలక్ట్రానిక్ సిటీ వంతెన పైన నిలిపి ఉన్న బుల్లెట్ బైక్ను కారు ఢీకొని టెక్కీ జంట కిందకు పడి దుర్మరణం పాలైన సంగతి మరువక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ఇదే వంతెనపై ఆదివారం రాత్రి బీఎంటీసీ బస్సు ఒక బైక్ను ఢీకొట్టడంతో ప్రభాకర్ (25) అతని స్నేహితురాలు సహాన (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఇద్దరూ దావణగెరెకు చెందినవారు కాగా బెంగళూరులో ఐటీ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ బైక్ మీద ఎలక్ట్రానిక్ సిటీ మొదటి స్టేజ్ నుంచి రెండవ స్టేజ్కు వెళ్లడానికి వంతెన మీద ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వెనుక ఉంచి వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్సు బైక్ను ఢీకొట్టగా ఇద్దరూ కిందపడిపోయారు. వారిపై బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలతో క్షణాల్లో మృతి చెందారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వచ్చి మృతదేహాలను అక్కడి నుంచి తరలించి కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన బీఎంటీసీ బస్సు డ్రైవర్ను అరెస్టు చేశారు. వంతెన పైన బైక్ను యూటర్న్ చేస్తున్న సమయంలో బస్సు ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా ఈ వంతెనపై యాక్సిడెంట్లలో టెక్కీ జంటలు మరణిస్తుండడం నగరంలో కలకలం రేపుతోంది. చదవండి: VIDEO: ఇలా ఖాళీ చేయగానే.. అలా కుప్పకూలింది -
రన్నింగ్ బస్సును ఎక్కబోయిన వృద్ధుడు.. పట్టుతప్పి ప్రాణాలు..
ముంబై: రన్నింగ్ బస్సును ఎక్కడానికి ప్రయత్నించి ఓ వృద్ధుడు ప్రమాదావశాత్తు అదే బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం ముంబైలోని గోరేగావ్ బస్ డిపో సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకాం.. ముంబైలోని గోరేగావ్ సబ్బరన్ ప్రాంతంలో 55 ఏళ్ల వృద్ధుడు రోడ్డుపై వెళ్తున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించి ప్రమాదావశాత్తు అదే బస్సు కింద పడిసోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక మృతుడు వసంత్ గోండు ఘోలేగా పోలీసులు గుర్తించారు. బస్సు వెనుక చక్రం కింద పడిపోయిన వృద్ధుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సీసీటీవీ పుటేజీని సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ను అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వాన్రాయ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ వాగ్మారే తెలిపారు. -
మధ్య ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం..
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘెరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భోపాల్ నుంచి సాగర్ హైవేమీద ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 13 మంది వరకు గాయపడ్డారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. భోపాల్ పోలీసు అధికారి కమలేష్ సోని తెలిపిన వివరాలు..ఈ బస్సు ప్రమాదం ఈ రోజు ఉదయం(ఆదివారం) 5 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలిపారు. భోపాల్లోని విదిష నగరానికి సమీపంలో హిర్ని గ్రామం వద్ద ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు.. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు. సంఘటన సమాచారం అందగానే పోలీసులు హుటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకుని.. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. అయితే, ప్రయాణికులలో 13 మంది వరకు గాయపడ్డారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అదే విధంగా, వీరిని మెరుగైన వైద్యం కోసం భోపాల్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి: ముగ్గురి మృతి
ఛండీఘడ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్తున్న కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన తనను కలచి వేసిందని పార్టీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్జ్యోత్ సింగ్ శుక్రవారం ఉత్సాహ వాతావరణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మోగ జిల్లాలోని లోహరా గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛండీఘర్లో జరిగే సిద్ధూ కార్యక్రమానికి మినీ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యలో మార్గమధ్యలో ఆర్టీసీ బస్సును వీరి బస్సు వేగంగా ఢీకొట్టింది. మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. తీవ్ర గాయాలవడంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. Saddened to learn of the bus accident in Moga district in which 3 Congress workers have reportedly died & many persons are injured. Have directed DC Moga to immediately provide full medical treatment to all the injured and to send a report to the Government. — Capt.Amarinder Singh (@capt_amarinder) July 23, 2021 -
టీస్టాల్పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు మృతి
లక్నో : రోడ్డు పక్క టీస్టాల్పైకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని షహనాజ్పూర్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం షహనాజ్పూర్లో ఢిల్లీ-లక్నో హైవేపై వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి అక్కడి మెడికల్ వద్ద ఉన్న టీస్టాల్పైకి దూసుకెళ్లింది. దీంతో టీస్టాల్లోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. బస్సులో ఉన్న వారితో కలిపి మొత్తం ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను సురేష్కుమార్, అధార్ అలి, వేద్ పాల్గా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అలి గర్భిణి అయిన తన భార్యను ఆసుపత్రిలో చేర్పించడానికి రాగా.. వేద్పాల్ అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శింటానికి వచ్చాడు. ఇద్దరూ అనుకోని ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తిరుపతి లోఆర్టీసీ బస్సు బీభత్సo...ఇద్దరు మృతి
-
లోయలో పడ్డ బస్సు.. 14 మంది దుర్మరణం
కొలంబో: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. దీంతో 13 మంది దుర్మరణం పాలవగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ విషాద సంఘటన శ్రీలంకలో జరిగింది. శ్రీలంకలోని పసరా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రిసిపైస్ గ్రామంలో విషాదం అలుముకుంది. 70 మంది ప్రయాణికులతో శనివారం బస్సు బయల్దేరింది. అయితే కొండ ప్రాంతమైన మొనెరగులా-బదుల్లా రోడ్డు మార్గం చాలా ప్రమాదకరం. ఈ ఇరుకు మార్గంలో ఒకేసారి బస్సు, ట్రక్కు వచ్చాయి. ఈ సమయంలో ట్రక్కును తప్పించబోయి మలుపు ప్రాంతంలో బస్సు కొంచెం పక్కకు జరగడంతో పక్కనే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 13మంది దుర్మరణం పాలయ్యారు. 30 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందించిన వెంటనే అధికారులు, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొద్దిమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీస్ అధికారి అజిత్ రోహన తెలిపారు. ఈ రోడ్డు వెంట తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. 16 ఏళ్లల్లో ఇదే అతి పెద్ద ప్రమాదమని అధికారులు గుర్తించారు. CCT கேமராவில் பதிவான லுணுகலை பஸ் விபத்து#badulla #passara #SriLanka #Lunugala pic.twitter.com/hYhJ8D4won — Abinesh (@aBINE00sh71) March 20, 2021