Florida
-
ఎయిర్పోర్ట్లో దారుణం: పెంపుడు కుక్కను చంపేసి.. విమానం ఎక్కేసింది
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన జంతు ప్రేమికులను నివ్వెరపోయేలా చేసింది. జంతు రవాణాకు తగిన పత్రాల్లేవని కుక్కను విమానంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో తన పెంపుడు కుక్కని చంపి చెత్తసంచిలో పడేసి వెళ్లిపోయిందా ఆ మహిళా యజమాని..సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి దారుణం..పెంపుడు శునకంతో విమానాశ్రయానికి వచ్చిన అలిసన్ లారెన్స్ అనే మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని వెంట తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతిస్తామంటూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటి తర్వాత తిరిగి వచ్చి.. ఏమీ తెలియనట్లుగా విమానం ఎక్కి వెళ్లిపోయింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు.అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది.. విమానం బయలుదేరిన కాసేపటికి బాత్ రూయ్లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి కనిపించింది. బాత్ రూమ్లో శునకం కళేబరం బయటపడటంతో మెడకు ఉన్న వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమానురాలు అలిసన్గా ఎయిర్పోర్టు అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన దారుణం బయటపడింది. దీంతో జంతుహింస నేరం కింద ఆమెను అరెస్టు చేశారు. -
క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చిన సునీత విలియమ్స్ (ఫోటోలు)
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. తిరిగొస్తున్న సునీత
వాషింగ్టన్: భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో. ఏడెనిమిది రోజులనుకుంటే ఏకంగా వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. ఉన్నది భారరహిత స్థితిలోనే. అయినా అటు కార్యభారం. ఇటు ఎడతెగని ఆలోచనల భారం. క్షణమొక యుగంగా సమయం కూడా భారంగానే గడుస్తున్న పరిస్థితి. ఎడతెగని ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు శుభంకార్డు పడనుంది. 9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (59), బచ్ బారీ విల్మోర్ (62) భూమికి తిరిగి రానున్నారు. వాతావరణం అనుకూలించి, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిరీ్ణత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెపె్టంబర్లో ఐఎస్ఎస్కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్ (అమెరికా), అలెగ్జాండర్ గుర్బనోవ్ (రష్యా) కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్–10 స్పేస్క్రాఫ్ట్లో సునీత, విల్మోర్తో పాటే తిరిగి వస్తున్నారు. వారి రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోందిప్పుడు. బాధ్యతల అప్పగింత బోయింగ్ సంస్థ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న ప్రయోగించిన స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ మేరకు వారు ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాలి. కానీ స్టార్లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది వీలు పడలేదు. దాని మరమ్మతుకు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. దాంతో రిస్కు తీసుకోరాదని నాసా నిర్ణయించింది. ఫలితంగా సెపె్టంబర్ 7న స్టార్లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యలో చేసిన ఒకట్రెండు ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా 9 నెలలుగా సునీత ఐఎస్ఎస్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆమెను, విల్మోర్ను వెనక్కు తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ ప్రయోగించిన డ్రాగన్–9 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరింది. అందులో వచ్చిన నలుగురు వ్యోమగాములు సునీత బృందం నుంచి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. కమాండర్ బాధ్యతలను రష్యాకు చెందిన అలెక్సీ ఒచినిన్కు సునీత అప్పగించారు. వచ్చే ఆర్నెల్ల పాటు ఐఎస్ఎస్ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. అయినా స్థైర్యమే... అనూహ్యంగా ఐఎస్ఎస్లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యం ప్రదర్శించారు. తన పరిస్థితిపై కూడా తరచూ జోకులు పేల్చారు! నడవటమెలాగో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ గత జనవరిలో నాసా సెంటర్తో మాట్లాడుతూ చమత్కరించారు. ఐఎస్ఎస్లో ఉన్నన్ని రోజులూ ఊపిరి సలపని బాధ్యతల నడుమే గడిపారు. అలాగని చిన్నచిన్న సరదాలకూ లోటులేకుండా చూసుకున్నారు. సహచరులతో కలిసి సునీత, విల్మోర్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులతో టచ్లో ఉంటూ వచ్చారు. → ఐఎస్ఎస్ కమాండర్గా కీలక ప్రయోగాలకు సునీత సారథ్యం వహించారు. → అంతరిక్షంలో భారరహిత స్థితిలో మొక్కల్ని పెంచిన నాసా ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించారు. → మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్వాక్ చేశారు. ఎందరికో స్ఫూర్తి వ్యోమగామిగా గ‘ఘన’ విజయాలు సాధించిన సునీతవి భారత మూలాలు. ఆమె పూర్తి పేరు సునీతా లిన్ విలియమ్స్. 1965లో అమెరికాలోని ఒహాయోలో జని్మంచారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కాగా తల్లి బోనీ జలోకర్ది స్లొవేనియా. వారి ముగ్గురు సంతానంలో సునీత అందరికన్నా చిన్న. అమెరికా నావల్ అకాడెమీ నుంచి ఫిజిక్స్లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. తండ్రి సూచనతో...తండ్రి సూచన మేరకు నావికా దళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరారు సునీత.→ నేవల్ ఏవియేటర్గా యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. కంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్లో పని చేశారు. → 30 ఏళ్ల వృత్తిగత జీవితంలో పైలట్గా 30 పై చిలుకు రకాల విమానాలను 3,000 గంటలకు పైగా నడిపిన అపార అనుభవం ఆమె సొంతం. → నేవీ నుంచి రిటైరయ్యాక సునీత 1998 జూన్ లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. → 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఐఎస్ఎస్లో ఆర్నెల్లకు పైగా గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. → 2012లో రెండోసారి ఐఎస్ఎస్కు వెళ్లి నాలుగు నెలలకు పైగా ఉన్నారు. → సునీత భర్త మైకేల్ జె.విలియమ్స్ రిటైర్డ్ ఫెడరల్ మార్షల్. వారికి సంతానం లేరు. పెట్ డాగ్స్ అంటే ఈ జంటకు ప్రాణం. వాటినే తమ సంతానంగా భావిస్తుంటారు. → సునీత హిందూ మతావలంబి. నిత్యం భగవద్గీత చదువుతానని చెబుతారు.పరిహారమేమీ ఉండదు సునీత, విల్మోర్ ఏకంగా 9 నెలలకు పైగా ఐఎస్ఎస్లో చిక్కుబడిపోయారు కదా. మరి వారికి పరిహారం రూపంలో అదనపు మొత్తం ఏమన్నా లభిస్తుందా? అలాంటిదేమీ ఉండదు. తమకు ప్రత్యేకంగా ఓవర్టైం వేతనమంటూ ఏమీ ఉండదని నాసా వ్యోమగామి కాడీ కోల్మన్ చెప్పారు. ‘‘అంతరిక్ష యాత్రలను అధికార పర్యటనల్లో ఇతర కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే పరిగణించడమే ఇందుకు కారణం. ఇలాంటప్పుడు ఖర్చుల నిమిత్తమని మాకు అదనంగా రోజుకు కేవలం 4 డాలర్లు (రూ.347) అందుతాయంతే’’ అని వివరించారు. ఆ లెక్కన సునీత, విల్మోర్ అదనంగా 1,148 డాలర్లు (దాదాపు రూ.లక్ష) అందుకోనున్నారు. వారు అమెరికా ప్రభుత్వోద్యోగుల్లో అత్యున్నతమైన జీఎస్–15 వేతన గ్రేడ్లో ఉన్నారు. ఆ లెక్కన వాళ్లకు ఏటా 1.25 లక్షల నుంచి 1.62 లక్షల డాలర్ల (కోటి నుంచి 1.41 కోట్ల రూపాయల) వేతనం లభిస్తుంది.తిరుగు ప్రయాణం ఇలా... → సునీత బృందం తిరుగు ప్రయాణానికి భారత కాలమానం ప్రకారం మంగళవారం కౌంట్డౌన్ మొదలవుతుంది. → క్రూ డ్రాగన్–10 వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15కు మొదలవుతుంది. → ఐఎస్ఎస్ నుంచి వ్యోమనౌక విడివడే ప్రక్రియ మంగళవారం ఉదయం 10.35కు మొదలవుతుంది. ఆ తర్వాత నాసా ప్రత్యక్ష ప్రసారం ఆడియోకు పరిమితమవుతుంది. అంతా అనుకూలిస్తే బుధవారం (మంగళవారం అర్ధరాత్రి దాటాక) తెల్లవారుజాము 2.15 గంటలకు తిరిగి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుంది. → బుధవారం తెల్లవారుజాము 2.41 గంటలకు వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. → బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27కు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగుతుంది. → ఆ వెంటనే నలుగురు వ్యోమగాములనూ నాసా సిబ్బంది ఒక్కొక్కరిగా బయటికి తీసుకొస్తారు. అన్నీ అనుకూలించాలి అయితే ప్రయాణ సమయం నిర్ణయమైనా చివరి నిమిషం దాకా అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. వాతావరణంతో పాటు ఇతర పరిస్థితులన్నీ సజావుగా ఉంటేనే తిరుగు ప్రయాణం షెడ్యూల్ ప్రకారం సాగుతుంది. ప్రత్యక్షప్రసారం సునీత బృందంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ–9 స్పేస్క్రాఫ్ట్ తిరుగు ప్రయాణాన్ని భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 నుంచి నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రికార్డు మాత్రం కాదు సునీత, విల్మోర్ వరుసగా 9 నెలల పాటు (287 రోజులు) ఐఎస్ఎస్లో గడిపినా ప్రపంచ రికార్డుకు మాత్రం దూరంగానే ఉండిపోయారు. రష్యా వ్యోమగామి వలేరీ పొల్యకోవ్ తమ దేశానికి చెందిన మిర్ అంతరిక్ష కేంద్రంలో ఏకబిగిన 437 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. నాసా ఆస్ట్రోనాట్ 371 రోజులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. మూడు అంతరిక్ష యాత్రల్లో కలిపి సునీత 583 రోజులు ఐఎస్ఎస్లో గడిపారు. క్రమశిక్షణ విషయంలో సునీత చాలా పట్టుదలగా ఉంటారు. ఐఎస్ఎస్లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదట!టైమ్లైన్ 2024 జూన్ 5: సునీత, విల్మోర్లతో ఐఎస్ఎస్కు బయల్దేరిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక జూన్ 6: ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైన స్టార్లైనర్. కానీ ఆ క్రమంలో స్టార్లైనర్లో థ్రస్టర్లు పని చేయకపోవడం, ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలు తెరపైకొచ్చాయి. దాంతో వ్యోమగాములు క్షేమంగా తిరిగిరావడంపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 12: స్టార్లైనర్ ప్రయాణానికి సిద్ధంగా లేనందున సునీత, విల్మోర్ తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడ్డట్టు నాసా ప్రకటన. జూలై–ఆగస్టు: తిరుగు ప్రయాణంపై మరింత పెరిగిన అనిశ్చితి. దాంతో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ సిబ్బందితో కలిసిపోయి దాని నిర్వహణ బాధ్యతలు, పరిశోధనలు తదితరాను పూర్తిగా తలకెత్తుకున్నారు. ఆ క్రమంలో సునీత ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు తలెత్తాయి. సెపె్టంబర్: ఐఎస్ఎస్ కమాండర్గా బాధ్యతలు స్వీకరించిన సునీత నవంబర్: సహోద్యోగులతో కలిసి ఐఎస్ఎస్లోనే దీపావళి, థాంక్స్ గివింగ్ వేడుకలు జరుపుకున్న సునీత. ఈ సందర్భంగా వారికోసం ప్రత్యేకంగా స్మోక్డ్ చికెన్ తదితర వంటకాలను పంపిన నాసా. డిసెంబర్: విద్యార్థులతో చిట్చాట్ చేసి తన అనుభవాలు పంచుకున్న సునీత. అంతరిక్షంలో జీవితం చాలా ఫన్నీగా ఉందని వ్యాఖ్య. 2025 జనవరి 30: తొలి స్పేస్ వాక్ చేపట్టిన సునీత. అందులో భాగంగా ఐఎస్ఎస్ బయట కీలక మరమ్మతుల్లో భాగస్వామ్యం. ఫిబ్రవరి: తిరుగు ప్రయాణంపై సర్వత్రా అనిశ్చితి పెరుగుతుండటంతో, తాము బాగున్నామని సందేశం పంపిన సునీత, విల్మోర్. మార్చి 12: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎక్స్. మార్చి 16: విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరిన డ్రాగన్ క్రూ–10 వ్యోమనౌక మార్చి 17: సునీత, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ మార్చి 18న భూమికి తిరిగొస్తుందంటూ నాసా ప్రకటన – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్పర్సన్గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు. -
పొద్దుపొద్దునే ఉల్కా పాతాన్ని తలపించేలా.. ముక్కలు చెక్కలైన రాకెట్
ప్రముఖ బిలీయనీర్ ఇలాన్ మస్క్కు చెందిన రాకెట్ సంస్థ స్పేస్ఎక్స్ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్షిప్ రాకెట్ గగనతలంలో పేలిపోయి ముక్కలు చెక్కలు అయ్యింది. ఈ రాకెట్కు సంబంధించి ఇది ఎనిమిదో ప్రయోగం కాగా.. ఆ శకలాలు ఫ్లోరిడా, బహమాస్లలో పడడం విశేషం.చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత ప్రయోగాల కోసం.. స్టార్షిప్ సామర్థ్యాన్ని పరీక్షించడం, అలాగే డమ్మీ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి వంటి అంశాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ ఉదయం టెక్సాస్ నుంచి స్పేస్ఎక్స్ స్టార్షిప్-8 స్పేస్క్రాఫ్ట్ ప్రయోగించారు. అయితే..స్పేస్లోకి ప్రవేశించిన వెంటనే అది పేలిపోయింది. ఆ శకలాలు దక్షిణ ఫ్లోరిడా.. అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహమాస్లోనూ పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఉల్కా పాతాన్ని తలపించేలా ఉన్న ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Is that space X rocket disintegration #spacex pic.twitter.com/apEagPIqDB— Talha Mirza (@tmirza777) March 6, 2025“Never give up” Elon Musk Starship 8 debris pic.twitter.com/NseQxyEZWP— Tesla Owners Silicon Valley (@teslaownersSV) March 7, 2025 ఇదిలా ఉంటే.. స్టార్షిప్ రాకెట్ ప్రయోగం విఫలం కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో ప్రయోగం జరగ్గా.. కరేబియన్ దీవులపైన రాకెట్ పేలిపోయింది. ఆ శకలాలు ట్రక్స్ అండ్ కైకోస్ దీవుల్లో పడ్డాయి. మొత్తంగా ఇప్పటిదాకా స్టార్షిప్ రాకెట్తో ఎనిమిది ప్రయోగాలు చేయగా.. మే 2021లో నిర్వహించిన ఎస్ఎన్ 15 టెస్ట్ ఫ్టైట్ ఒక్కటి మాత్రమే పాక్షికంగా సక్సెస్ అయ్యింది.ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్గా స్టార్షిప్గా ప్రస్తుతానికి గుర్తింపు ఉంది. 123 మీటర్ల ఎత్తు(403 అడుగులు)తో నాసా శాటర్న్-V రికార్డును బద్ధలు కొట్టింది. రాకెట్ రూపకల్పనకు రూ.830 కోట్ల రూపాయలను స్పేస్ఎక్స్ ఏజెన్సీ ఖర్చు చేసింది. అంగారకుడు, చంద్రుడిపైకి మానవ సహిత రాకెట్ ప్రయోగాల కోసం దీనిని తయారు చేశారు. -
40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా! ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయ్యింది చిలీలోని శాన్ ఆంటోనియో. వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్లకిందట.. శాన్ అంటోనియాకు చెందిన 24 ఏళ్ల ఎడిటా బిజామాకు అప్పటికే ఇద్దరమ్మాయిలు. మూడో సారి కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి అగస్టో పినోచెట్ నాయకత్వంలోని సైనిక నియంతృత్వ ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతలే మార్గమని భావించింది. అట్లా దాదాపు 20వేల మంది పిల్లలను బలవంతపు దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా.. బిజామా సైతం దత్తతకు అంగీకరించింది. కానీ.. పాప పుట్టిన తరువాత పంపించడానికామె ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావ్’అంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతురిని తీసుకెళ్లిపోయారు. బిజామా కుటుంబంలోని చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. కానీ పేగు తెంచుకు పుట్టింది కదా.. బిజామా బిడ్డకోసం రోదిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు తెలియదు. మార్గం కూడా లేదు. మరోవైపు.. ఆమె కూతురు అడామరీ గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది. ఇప్పుడు ప్యూర్టో రికోలో నివసిస్తోంది. తనను దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడమెలాగో తెలియదు. అలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు.. శిశువుగా దత్తతకు వచ్చి.. చిలీలోని తన సొంత కుటుంబాన్ని కలుసుకున్న టెక్సాస్ అగ్నిమాపక అధికారి టేలర్ గ్రాఫ్ గురించి చెప్పారు. అలాంటివారికోసం సాయం చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ రూట్స్’స్వచ్ఛంద సంస్థ గురించి వివరించారు. వెంటనే ఆ సంస్థను కలిసింది గార్సియా. కుటుంబం గురించి తెలుసుకోవడానికి గార్సియా తపన చూసి.. ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహమందించారు. సోదరి బర్త్ సరి్టఫికెట్ ద్వారా కుటుంబ వివరాలు తెలిసాయి. అయినా.. డీఎన్ఏ పరీక్షతో బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది. వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు. గార్సియాది ప్యూర్టో రికన్ స్పానిష్, మయామీ యాస. కానీ తల్లి, అక్కలది విలక్షణమైన చిలీ యాస. మొదటిసారి సంభాషణ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా. 41 ఏళ్ల గార్సియాకు తల్లికి, ఇద్దరు అక్కలకు దగ్గరకు పోలికలున్నాయి. అంతేకాదు.. పెద్దక్కకు ఇష్టమున్నట్టే ఆమెకూ కుక్కలంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్సియా చిలీయాస, వంటకాలు, సంగీతం అన్నింటినీ నేర్చుకుంటోంది. అక్కలతో ఎక్కువకాలం గడపాలని నిర్ణయించుకుంది. కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చిలీకి తీసుకువచి్చన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు. ఇది ఆ ఎన్జీవో చేసిన నాలుగవ పునరేకీకరణ. ఎన్జీవో చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు. కొందరు చనిపోయారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్రలో లేని గెలుపు: ఫలితాలపై స్పందించిన ట్రంప్
ఫ్లోరిడా: అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఫ్లోరిడాలో బుధవారం(నవంబర్ 6) ట్రంప్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ట్రంప్..ట్రంప్ నినాదాలతో హోరెత్తించారు. తన గెలుపు అమెరికాకు ఉపయోగమని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. రిపబ్లికన్లకు 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్ ఓట్లు కూడా మాకే ఎక్కువ వచ్చాయి. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా.‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఉన్నారు.#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, "...This is a movement that nobody has ever seen before. Frankly, this was, I believe, the greatest political movement of all time. There has never been anything like this in this country and… pic.twitter.com/MEcRDSAI72— ANI (@ANI) November 6, 2024 ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు టాంప లో శంఖారావం పూరించింది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ ఏవీ ద్వారా సంబరాలు ఎలా జరగనున్నాయనేది చాటిచెప్పింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, స్థానిక తెలుగు కళాకారులతో నృత్య ప్రదర్శనలు.. మ్యూజిక్ షోలతో టంపాలో తెలుగువారికి గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ మంచి కిక్ ఇచ్చింది. వచ్చే జులై 4, 5, 6 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ట్రైలర్లా కిక్ ఆఫ్ ఈవెంట్ జరిగింది. దాదాపు 1500 మంది తెలుగువారు ఈ ఈవెంట్కు హాజరయ్యారు. టాంప లో జరగనున్న అతి పెద్ద తెలుగు సంబరానికి అమెరికాలో ఉండే ప్రతి కుటుంబం తరలిరావాలని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ పిలుపు నిచ్చారు. తెలుగువారందరిని కలిపే వేదిక.. తెలుగువారికి సంతోషాలు పంచే వేదిక అమెరికా తెలుగు సంబరాలు అని ఈ అవకాశాన్ని ప్రతి తెలుగు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు, సినీ స్టార్లు, సంగీత, సాహిత్య ఉద్దండులు, కళాకారులు పాల్గొనే సంబరాల్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా పాల్గొనాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. టాంప సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్కు నాట్స్ జాతీయ నాయకులు కూడా తరలివచ్చారు.స్థానిక డ్యాన్స్ స్కూల్స్ సబ్రిన (గణేశస్తోత్రం, కౌత్వం) , సరయు, లీలా టాలీవుడ్ లేడీస్ డాన్స్, మాధురి (తిల్లానా), శివం గర్ల్స్, సరయు(తమన్ మెడ్లీ), సబ్రిన(అన్నమయ్య కీర్తన),శివం(మస్తీ) చేసిన డ్యాన్స్ అందరిలో ఉత్సాహం నింపింది. సాకేత్ కొమాండూరి, మనీషా ఈరబత్తిని, శృతి రంజనీలు తమ గాన మాధుర్యంతో చక్కటి తెలుగుపాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. సాహిత్య వింజమూరి తన యాంకరింగ్ తో ఈ ఈవెంట్లో మెప్పించారు. ఈ సారి టాంపాలో జరిగే సంబరాల ప్రత్యేకత ఏమిటీ అనే దానిపై రూపొందించిన ట్రైలర్ ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమన్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుని సంబరాలపై అంచనాలను పెంచింది. చక్కటి తెలుగు ఇంటి భోజనం కూడా గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్కు వచ్చిన తెలుగువారి చేత ఆహా అనిపించింది. అనంతరం, నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ గౌరవ సభ్యులను, గత అధ్యక్షులను, డైరెక్టర్స్ ను వేదికపైకి ఆహ్వానించారు.టాంప నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు నాట్స్ చాప్టర్ల నాయకులను, కార్యవర్గ సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించారు. అలాగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలుపంచుకునే టాంప స్థానిక తెలుగు సంఘలైన టీఏఎఫ్, మాటా, టీజీఎల్ఎఫ్, టీటీఏ, ఎఫ్ఐఏ, హెచ్టీఎఫ్ఎల్, సస్త, ఐటీ సర్వ్ సంస్థల ప్రతినిధులను గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై పరిచయం చేశారు. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్లో ముఖ్యగా టాంప లో స్థానిక కళాకారుల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై థమన్తో పాటు ఈవెంట్కు వచ్చిన ప్రముఖులను నాట్స్ సత్కరించింది. నాట్స్ సభ్యులు, దాతల నుంచి అమెరికా తెలుగు సంబరాలకు 2.5 మిలియన్ డాలర్ల విరాళాలు ఇచ్చేందుకు హామీ లభించింది.(చదవండి: మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు) -
భర్తను సూట్కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!
కొన్నిగంటలపాటు భర్తను సూట్కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్పార్క్ అపార్ట్మెంట్లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్కేస్లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్ తన ఫోన్లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్ను దోషిగా తేల్చింది. డిసెంబర్లో శిక్ష ఖరారు చేయనుంది. – వాషింగ్టన్ -
చేపలు మాత్రమే తింటు..ఏకంగా 15 కిలోల బరువు తగ్గిన మహిళ..!
చేపలు ఆరోగ్యానికి మంచిదే గానీ అతిగా తింటే మాత్రం ప్రమాదమే. అలా తినమని సాధారణంగా వైద్యులు కూడా సూచించరు. కానీ ఈ మహిళ మూడు నెలల పాటు చేపలు మాత్రమే తిని ఏకంగా 15 కిలోల బరువు తగ్గింది. అది చూసి వైద్యులే కంగుతిన్నారు. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకి చెందిన 62 ఏళ్ల జేన్ క్రమ్మెట్ బరువు 109 కిలోలు ఉండేది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉంది. వైద్యులు బరువు తగ్గేలా ఆహారాలు, పానీయాలపై పలు నిబంధనలు పాటించాలని సూచించారు. కానీ అలా చేసినా ఆమె బరువు పరంగా ఎలాంటి మార్పు కనిపించలేదు.పైగా అలా మంచపైనే ఉండటంతో కాళ్లు బాగా వాచిపోయి, విపరీతమైన ఆకలితో బాధపడేది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభం లేదని భావంచి స్నేహితుల సూచన మేరుకు వైద్యుడు బోజ్ని సంప్రదించింది. ఆయన ఆమెకు 'ఫిష్ ఫాస్ట్'ని సూచించారు. మూడు నెలల పాటు సార్డినెస్ అనే చేపలను మాత్రమే తినమని సూచించారు. ఇలా చేస్తే బరువు తగ్గుతారని అనడంతో జేన్ విస్తుపోయింది. ఏదో వింతగా ఉన్న ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఏమో..చూడాలని ట్రై చేసి చూసింది. ఆయన చెప్పినట్లుగా మూడు నెలల పాటు సార్డిన్ చేపలు మాత్రమే తినడం ప్రారంభించింది. ఇలా చేసిన రెండు నెలల్లోనే మంచి మార్పు కనిపించింది. ఏకంగా ఆరు కిలోలు వరకు తగ్గింది. ఇక మూడు నెలలు పూర్తి అయ్యేటప్పటికీ ఏకంగా 15 కిలోల వరకు తగ్గిపోయింది. జోన్ ఇంత స్పీడ్గా బరువు తగ్గడం చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఒక రకమైన జిడ్డుకరమైన చేప. పైగా ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారిని దీన్ని తినమని వైద్యులు సూచిస్తారు. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, విటమిన్ డి, క్యాల్షియం ఉంటాయి. ఇలా చేపలతో బరువు తగ్గడం అత్యంత అరుదు కదూ..!.(చదవండి: వెన్ను నొప్పి కేన్సర్కు దారితీస్తుందా..?) -
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
Hurricane Milton: మిల్టన్ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం
మిల్టన్ తుఫాను ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలులు, వర్షంతో నగరాలను అతలాకుతలం చేసింది. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మరణించారు. విద్యుత్ లేక 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. బుధవారం రాత్రి 3 కేటగిరీగా తీరం దాటిన తుఫాను తరువాత ఒకటో కేటగిరీకి బలహీనపడింది. అయినా ముప్పు ఇంకా పొంచి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు. టంపా: మిల్టన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఫ్లోరిడా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. బుధవారం ఉదయం దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడోలు సంభవించాయి. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మృతి చెందారు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫోర్ట్ మైయర్స్లో మరో టోర్నడో ధాటికి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీతో సహా పలు ప్రదేశాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. వరదలతో టంపా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. నేపుల్స్లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది. తుఫాను ధాటికి తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉంటుందని, అయితే ఎంత మంది చనిపోయారనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం... సెయింట్ పీటర్స్బర్గ్లో 41 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వెయ్యేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈదురు గాలులు ట్రోపికానా ఫీల్డ్ పైకప్పును చీల్చాయి. తుపాను ధాటికి పలు క్రేన్లు కూడా కూలిపోయాయి. మంచి నీటి సరఫరాను సైతం నిలిపేశారు. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సైతం మూతపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓర్లాండోలో వాల్ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ ఓర్లాండో, సీ వరల్డ్ సంస్థలు గురువారం మూతపడ్డాయి. పలు ఫ్లోరిడా విమానాశ్రయాలను నిరవధికంగా మూసివేశారు. హరికేన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. హెలెన్ హరికేన్తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత దుస్థితిలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాది అమెరికాను తాకిన ఐదో హరికేన్ ఇది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరానికి 75 మైళ్ల దూరంలో మిల్టన్ కేంద్రీకృతమై ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్హెచ్సీ)తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య, ఈశాన్య ఫ్లోరిడాలో ఈదురుగాలులు వీస్తాయని, ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని వెల్లడించింది. అధికారులు ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9,000 మంది నేషనల్ గార్డ్ సభ్యులతో సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోరి్నయా వరకు 50,000 మందికి పైగా యుటిలిటీ కారి్మకులను అందుబాటులో ఉంచారు. టంపా, సెయింట్ పీటర్స్బర్గ్లోని 60 శాతానికి పైగా గ్యాస్ స్టేషన్లలో బుధవారం రాత్రే గ్యాస్ నిండుకోవడంతో గ్యాసోలిన్ ట్యాంకర్లను తరలించడానికి సైరన్లతో హైవే పెట్రోలింగ్ కార్లు పనిచేస్తున్నాయి. -
Hurricane Milton: ముంచుకొస్తున్న మిల్టన్
టంపా(అమెరికా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పశి్చమతీరంపై మిల్టన్ తుపాను విరుచుకుపడనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం తీరాన్ని దాటి జనావాసాలను అతలాకుతం చేయనుందన్న వార్త అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంటకు 260 కి.మీ.ల వేగంతో వీస్తున్న పెనుగాలులకుతోడు జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన లక్షలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా, సారాసోటా, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల ప్రజలు కొందరు సొంతిళ్లను విడిచి వెళ్లలేక, తుపానును ఎలా తట్టుకోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 33 లక్షల మంది నివసించే టంపా బే ప్రాంతంలో హరికేన్ దారుణంగా విరుచుకుపడి వినాశనం సృష్టించనుందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ ప్రాంతంపై ఐదో కేటగిరీ హరికేన్ ఇంతటి భారీ స్థాయిలో విరుచుకుపడుతుండటం ఈ శతాబ్దంలోనే తొలిసారి అనే విశ్లేషణలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రానికి టంపా నగరానికి 485 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమైన హరికేన్ గంటకు కేవలం 22 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోందని, తీరాన్ని తాకే సమయానికి కాస్తంత బలహీనపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలు హరికేన్ కారణంగా వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 18 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావచ్చని తెలుస్తోంది. ద్వీపకల్పంలా ఉండే ఫ్లోరిడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్పింది. ఫ్లోరిడా నేషనల్ సెర్చ్, అండ్ రెసూ్క్క బృందాలు పెద్దమొత్తంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర చరిత్రలో ఇంతటి భారీ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హరికేన్ తీరాన్ని తాకితే దాదాపు 5,00,000 ఇళ్లు నాశనమవుతాయని ఓ అంచాన. జనం ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టంపా సిటీ మేయర్ జన్ కాస్టర్ విన్నవించుకున్నారు. ‘‘మొండిపట్టుదలతో ఇంట్లోనే కూర్చుంటే అదే మీకు శవపేటికగా మారుతుంది’’అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హెలెన్ హరికేన్ సృష్టించిన విలయం నుంచి సమీప పుంటా గోర్డా సిటీ ఇంకా కోలుకోలేదు. నగర వీధుల్లో ఎక్కడా చూసినా పాడైన ఫరీ్నచర్లు, దుస్తులు, పుస్తకాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. ‘‘మొన్నటి హెలెన్ హరికేన్ ధాటికే వీధుల్లోకి బుల్ షార్క్లు కొట్టుకొచ్చాయి. ఇప్పుడేం జరుగుతుందో’’అని స్థానిక అకౌంటెంట్ స్కౌట్ జానర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
అమెరికాను భయపెడుతోన్న మరో తుఫాను: భయం గుప్పిట్లో ఫ్లోరిడా
ఫ్లోరిడా : హెలెన్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి బయటపడకముందే అమెరికాను మరో తుఫాను భయపెడుతోంది. ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్ హరికేన్ దూసుకొస్తోంది. మిల్టన్ ఐదో కేటగిరీ హరికేన్గా బలపడిందని, అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాను వల్ల ప్రాణహాని ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా పశి్చమ తీరం వైపు కదులుతున్న మిల్టన్.. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ఉధృతితో బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని ఎన్హెచ్సీ హెచ్చరించింది. మిల్టన్ ఐదో కేటగిరీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద తరలింపు ప్రయత్నానికి సిద్ధం కావాలని గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రజలను కోరారు. మిల్టన్ మార్గంలోని విమానాశ్రయాలు మూసివేశారు. తుఫాను హెచ్చరికలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఒకేసారి బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మిల్టన్ తుఫాను.. హరికేన్లను వర్గీకరించడానికి ఉపయోగించే సాఫిర్–సింప్సన్ స్కేలుపై మిల్టన్ ఐదో కేటగిరీగా నమోదైనది. ఈ తుఫాను సమయంలో గాలులు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్హెచ్సీ) తెలిపింది. మొదట రెండో కేటగిరీలో ఉన్న తుఫాను కొన్ని గంటల్లోనే 5వ కేటగిరీకి మారింది. ఇంత వేగంగా తుఫాను బలపడటం నమ్మశక్యంగా లేదని ఫ్లోరిడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ హరికేన్ బలపడిందంటున్నారు. ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను ఇదే కావచ్చని చెబుతున్నారు. హరికేన్లు మూడో కేటగిరీ దాటితేనే తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాను నాలుగో కేటగిరీకి చెందింది. గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో ఆస్తి నష్టం జరిగింది. దీని ధాటికి నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో దాదాపు 230 మంది మరణించారు. ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సాధారణం కంటే 2024 హరికేన్ సీజన్ తీవ్రంగా ఉందని నేషనల్ ఓషియానిక్ అటా్మస్ఫియరిక్ అసోసియేషన్ (ఎన్ఓఏఏ) అంచనా వేసింది. మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. -
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్
వాషింగ్టన్: అమెరికాను హరికేన్ హెలెనా వణికిస్తోంది. మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా దిశగా అతి తీవ్ర హరికేన్ హెలెన్ దూసుకెళ్తోందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్(ఎన్హెచ్సీ) వెల్లడించింది. హెలెన్ హరికేన్ కేటగిరి-3 లేదా కేటగిరి-4 హరికేన్గా బలపడే అవకాశం ఉందని ఎన్హెచ్సీ అధికారులు చెబుతున్నారు.హరికేన్ హెలెన్ ఫ్లోరిడా సిటీపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడాలోకి దాదాపు పది కౌంటీలపై హరికేన్ ప్రభావం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఇప్పటికే హరికేన్ ప్రభావంతో సిటీలో తీవ్రమైన గాలులతో కూడా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, హెలెన్ ప్రభావంతో పెనుగాలులు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని అమెరికా వాతారణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 🚨Storm surges up to 20 feet in Florida. #HurricaneHelene This is absolutely catastrophic…Prayers to anyone involved🙏pic.twitter.com/tD1LtlFFEd— WOLF News (@WOLF_News_) September 26, 2024 🚨🇲🇽HURRICANE HELENE UPDATEQuintana Roo, Mexico:- Massive flood and Material damage reported- Cancun hotel area severely affectedNo loss of life reportedAssessment and recovery efforts underway#HurricaneHelene #QuintanaRoo #Cancun #Hurricane #mexico pic.twitter.com/6vmlMY0qaV— Berkan Yılmaz (@Berk04790) September 26, 2024 🚨🇺🇲 UNC Asheville Flood Alert (University of North #Carolina at Asheville, 1 University Heights, #Asheville, NC - Flash flooding reported on campus- Students and staff advised to seek higher groundSTAY SAFE: Avoid flooded areas#UNCA #FlashFlood #Helene #HurricaneHelene… https://t.co/J0RtuUKJSR pic.twitter.com/R8wnLhUm2P— Weather monitor (@Weathermonitors) September 26, 2024ఇది కూడా చదవండి: న్యూక్లియర్ వార్కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
వ్యాక్సిన్స్ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి, దారుణంగా! వీడియో వైరల్
అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సీన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో వైద్య నిధుల సమీకరణకు నానా బాధలుపడుతోంది. విషయం ఏమిటంటే..ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్ పరోక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా (PNH)తో భాపడుతోంది. దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని UCI మెడికల్ సెంటర్లో చేరింది.నివేదికల ప్రకారం, ఆమె చికిత్సను కొనసాగించే ముందు టెటనస్, మెనింజైటిస్ ,న్యుమోనియాకు టీకాలు వేయించుకోవాలిన ఆసుపత్రి వైద్యులు కోరారు. అయితే టీకాలు ఏకకాలంలో ఇవ్వడంతో భయంకరమైన రియాక్షన్ వచ్చింది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది. తాత్కాలిక అంధత్వం,దవడలు బిగుసుకుపోయాయి. ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు. ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ. దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది. ఫలితంగా ఆమెను ప్రత్యేక చికిత్స కోసం లాస్ ఏంజిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లోరెంజ్కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడం నిధులను సేకరించే పనిలో ఉన్నారు ఆమె బంధువులు, స్నేహితులు. Alexis Lorenze suffering reactions from 3 vaccines administered to her: meningitis, pneumonia, and tetanus at UCI Medical Center (Anaheim California). I'd give this woman a lot of C to begin with. #VaccineSideEffects https://t.co/whOja2HeGs pic.twitter.com/Hwy1wVuVir— Robert, C.N., Pharm Tech. (@Robertvegan7) September 17, 2024తన పరిస్థితిపై లోరెంజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మె మొదట రక్త రుగ్మత కోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. రక్త మార్పిడి చేయించుకుంది. రక్తమార్పిడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పూర్తిగా తగ్గలేదని ఆమె వాపోయింది. టీకాలు వేసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని, బలవంతంగా తీసుకున్న మూడు వ్యాక్సిన్ల కారణంగా తన పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు టీకాలు తీసుకున్న తర్వాత, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటానికి దారితీసిందనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం లోరెంజ్ నెమ్మదిగాకోలుకుంటోందని ఆమెకోసం కేటాయించిన స్పెషల్ నర్సు వెల్లడించారు. -
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
ఫ్లోరిడాలో కాల్పుల కలకలం .. ట్రంప్ సురక్షితం
-
Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్వాకర్లు
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇసాక్మాన్తోపాటు ఇద్దరు స్పేస్ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్ఫోర్స్ థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్ఎక్స్ నూతన స్పేస్సూట్ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్హిట్ హాలీవుడ్ సినిమా స్టార్వార్స్ థీమ్ సాంగ్కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే. – కేప్ కనావరెల్ -
ఒకరు ధర్మాసనంపై.. మరొకరు బోనులో... ఇద్దరు మిత్రుల కథ!
అది 2015. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఆర్థర్ నథానియల్ బూత్ దొంగతనం ఆరోపణలపై అరెస్టయ్యాడు. మియామీ–డేడ్ జడ్జి మిండీ గ్లేజర్ ముందు విచారణకు హాజరయ్యాడు. అతన్ని తేరిపార చూసిన జడ్జి, నువ్వు నౌటిలస్ మిడిల్ స్కూల్లో చదివావు కదా ప్రశ్నించారు. దాంతో ఆమెను గుర్తు పట్టిన బూత్ ఒక్కసారిగా భావోద్వేగంతో రోదించాడు. వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు మరి! స్కూలు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి ఫుట్ బాల్ ఆడేవాళ్లమని, బూత్ తమ స్కూళ్లోకెల్లా ఉత్తమ బాలుడని మిండీ గుర్తు చేసుకున్నారు. ‘బూత్, నిన్నిక్కడ చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై మంచి జీవితం గడుపుతాడని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ అలా జరగలేదు. బూత్ చోర జీవితమే కొనసాగిస్తూ వచ్చాడు. నగరమంతటా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్లంబర్ వేషంలో ఓ వృద్ధుడి ఇంట్లో దూరి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. వాటర్ ఇన్స్పెక్టర్గా నటించి ఓ ఇంట్లోంచి నగల పెట్టె దొంగిలించాడు. టైరు మారుస్తున్న మహిళ బంగారు గొలుసు లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి కోర్టులో జడ్జిగా చిన్నప్పటి నేస్తం కని్పంచలేదు గానీ అతని అరెస్టుతో నాటి ఉదంతం మరోసారి తెరపైకి వచి్చంది. 2015 నాటి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో వైరల్గా మారింది. – వాషింగ్టన్ -
Miami: వేకేషన్లో బ్యూటీ.. లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
తుమ్మితే పేగులు బయటికొచ్చాయి!
వాషింగ్టన్: ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి. యూరినరీ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు. దీంతో ఆపరేషన్ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు. -
నా ఫేవరెట్ క్రికెటర్ కోహ్లి.. ఎందుకంటే: కెనడా కెప్టెన్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆటంటే తనకెంతో ఇష్టమని కెనడా క్రికెట్ జట్టు కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అన్నాడు. తన ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే అని తెలిపాడు.కోహ్లి సేవలు కేవలం భారత్కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచ క్రికెట్పై తనదైన ముద్ర వేసిన గొప్ప ఆటగాడని సాద్ బిన్ జఫర్ ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్లతో పాటు కెనడా గ్రూప్-ఏలో ఉంది.ఈ గ్రూపు నుంచి ఇప్పటికే భారత్, అమెరికా సూపర్-8కు చేరగా.. పాక్, ఐర్లాండ్, కెనడా ఎలిమినేట్ అయ్యాయి. ఇక ఈ మెగా టోర్నీలో కెనడా ఆడిన మూడు మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచింది.లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా పటిష్ట టీమిండియాతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ ఈ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.మాకంటూ మంచి గుర్తింపు వస్తుందిస్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి నాకు అత్యంత ఇష్టమైన క్రికెటర్. అతడు కేవలం టీమిండియాకే కాదు.. క్రికెట్ ప్రపంచానికి ఎంతో చేశాడు.ఇక టీమిండియా ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు. అలాంటి టీమ్తో మేము కలిసి ఒకే గ్రౌండ్లో ప్రత్యర్థులుగా ఆడటం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది.పాక్లో జన్మించిన సాద్ బిన్ జఫర్ఒకవేళ ఈ మ్యాచ్లో మేము గనుక రాణిస్తే కచ్చితంగా క్రికెటింగ్ సర్క్యూట్లో మాకంటూ మంచి గుర్తింపు వస్తుంది’’ అని సాద్ బిన్ జఫర్ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించిన సాద్ బిన్ జఫర్ తర్వాత కెనడాకు మకాం మార్చాడు.లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన జఫర్.. లెఫ్టాండ్ బ్యాటర్ కూడా. 37 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్రౌండర్ ప్రస్తుతం కెనడా జట్టు కెప్టెన్గా ఉన్నాడు. కెనడా తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, 41 టీ20 మ్యాచ్లు ఆడి ఆయా ఫార్మాట్లలో 16, 44 వికెట్లు తీశాడు.ఐర్లాండ్పై గెలిచిఇక వరల్డ్కప్-2024లో సాద్ బిన్ జఫర్ కెప్టెన్సీలో కెనడా తమ తొలి మ్యాచ్లో ఆతిథ్య అమెరికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. అనంతరం.. ఐర్లాండ్పై 12 పరుగుల తేడాతో గెలిచింది.అయితే, సూపర్-8 రేసులో నిలవాలంటే పాకిస్తాన్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరగా టీమిండియాతో మ్యాచ్ ఆడి ఇంటిబాట పట్టనుంది.చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్With #TeamIndia already advancing in the Super 8 stage, Canada players share their favourite players to watch out for on the biggest stage! 🔥Will @ImRo45 & Co. go into the Super 8 with a win against Canada? 🤨#INDvCAN | TODAY, 6 PM | #T20WorldCupOnStar pic.twitter.com/88cOlwURWU— Star Sports (@StarSportsIndia) June 15, 2024 -
IND vs CAN: భారత తుదిజట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్?!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ఇప్పటికే సూపర్-8కు చేరుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్కు సిద్దమైంది. గ్రూప్-ఏలో తమకు మిగిలి ఉన్న నామమాత్రపు మ్యాచ్లో కెనడాతో ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి తలపడనుంది.కాగా ఫ్లోరిడాలోని లాడెర్హిల్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైంది. ఫలితంగా పాయింట్ల పరంగా మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా సూపర్-8కు చేరగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇక టీమిండియా- కెనడా మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైపోయినా రోహిత్ సేనకు ఎలాంటి నష్టం లేదు. అదే విధంగా.. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన కెనడాపై కూడా ఇంకెలాంటి ప్రభావం ఉండదు.ఆ ఇద్దరు అవుట్!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులో ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.అదే విధంగా.. శివం దూబే స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికాలో జరుగుతున్న టీమిండియా లీగ్ దశ మ్యాచ్లలో జడ్డూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.గత మ్యాచ్(అమెరికాతో)లో అతడికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో మూడు మ్యాచ్లు ఆడే ఛాన్స్ కొట్టేసిన రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే, సూపర్-8కు ముందు అతడికి కెనడాతో మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే.. ప్రాక్టీస్ దొరుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో శివం దూబే స్థానంలో సంజూను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా.. వెస్టిండీస్లో సూపర్-8 మ్యాచ్ల నేపథ్యంలో.. కుల్దీప్ యాదవ్కు కూడా అమెరికాలో తొలి ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ మ్యాచ్లోనైనా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్లు న్యూయార్క్లోనే జరిగాయి.అక్కడి నసావూ కౌంటీ డ్రాప్ ఇన్- పిచ్ బౌలర్ల పాలిట స్వర్గధామంలా మారి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో కోహ్లి మూడు మ్యాచ్లలో కలిపి కేవలం ఐదు పరుగులే చేశాడు.అయితే, కెనడాతో మ్యాచ్ జరిగే వేదిక ఫ్లోరిడాలో పరుగులకు ఆస్కారం ఉన్న వికెట్ ఉంటుంది. కాబట్టి ఈసారైనా కింగ్ భారీగా రన్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇండియా వర్సెస్ కెనడాతో నామమాత్రపు మ్యాచ్కు తుదిజట్ల అంచనా భారత తుదిజట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.కెనడా తుదిజట్టు(అంచనా)ఆరోన్ జాన్సన్, నవనీత్ ధాలివాల్, పర్గత్ సింగ్, దిల్ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ (వికెట్ కీపర్), డిల్లాన్ హెయిలిగర్, సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్.చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx— BCCI (@BCCI) June 14, 2024 -
T20 World Cup 2024: టీమిండియా తదుపరి మ్యాచ్ వర్షార్పణం..?
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా భారత్ ఆడబోయే తదుపరి మ్యాచ్ భారీ వర్షాల కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 15న భారత్.. కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్కు వేదిక అయిన ఫ్లోరిడాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.ఫ్లోరిడాలో భారత్-కెనడా మ్యాచ్తో పాటు మరో రెండు కీలక మ్యాచ్లు జరుగనున్నాయి. జూన్ 14న యూఎస్ఏ-ఐర్లాండ్.. జూన్ 16న ఐర్లాండ్-పాకిస్తాన్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు చేరే క్రమంలో యూఎస్ఏ, పాకిస్తాన్లకు ఈ మ్యాచ్లు చాలా కీలకం.The conditions in Florida is reallyBad right now.- India vs Canada.- Pakistan vs Ireland.- USA vs Ireland.- All 3 games will be played in Florida in this T20 World Cup 2024.pic.twitter.com/0g1zhWOzEZ— Tanuj Singh (@ImTanujSingh) June 13, 2024ఇలా జరిగినా పాక్ ఇంటికే..జూన్ 14న యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాకిస్తాన్ అధికారికంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే.. అమెరికా ఖాతాలో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్తో మ్యాచ్ రద్దైతే ఆ జట్టు ఖాతాలో మరో పాయింట్ చేరి మొత్తంగా ఐదు పాయింట్లు అవుతాయి. మరోవైపు.. పాక్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే.. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్లో ఐర్లాండ్ను ఓడించినా ఫలితం ఉండదు. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు యూఎస్ఏ.. భారత్తో పాటు గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు అర్హత సాధిస్తుంది. భారత్ ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి సూపర్-8కు క్వాలిఫై అయ్యింది. -
అన్యాయంగా 37 ఏళ్లు ఖైదు : రూ. 116 కోట్లు పరిహారం
వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది ఒక ధర్మ సూత్రం. కానీ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 37 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు. ఫలితంగా విలువైన జీవితంలో విలువైన సమయంలో జైలులో మగ్గిపోవాల్సి వచ్చింది. చివరికి న్యాయమే గెలచింది. ఒక కేసులో దొరికిన ఓ సాక్ష్యం ఆధారంగా అతణిని నిర్దోషిగా తేల్చింది. ఈ తప్పిందం దొర్లినందుకు గాను అతనికి రూ. 116 కోట్ల రూపాయలు భారీ పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అసలేమైందంటే..లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్ను 1982లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు మాత్రమే. 19 ఏళ్ల బార్బరా గ్రామ్ను అత్యాచారం చేసి, చంపేశాడంటూ అభియోగాలు నమోదైనాయి. ఈ కేసులో విచారణ అనంతరం అమెరికాలోని ఒక కోర్టు తొలుత అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ సహాయంతో అతని శిక్షను 2018లో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. చివరకు తప్పుడు నేరారోపణ కేసులను వాదించడంలో అపారమైన అనుభవం ఉన్న చికాగోకు చెందిన పౌర హక్కుల సంస్థ లోవీ & లోవీ ఈ కేసులో జోక్యం చేసుకుని, ఈ కేసులో బాధితుడి ప్రమేయం లేదని నిరూపించడంలో అతినికి విముక్తి లభించింది. 1980లలో అందబాటులోని, ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన డీఎన్ఏ టెస్ట్ద్వారా నిర్దోషిగా తేలాడు. 2020 ఆగష్టులో ఫ్లోరిడా జైలు నుండి విడుదలయ్యాడు.కొంతకాలం తర్వాత, రాబర్ట్ డుబోయిస్ తనకు జరిగిన నష్టానికి న్యాయం కావాలంటూ పోరాటానికి దిగాడు. టంపా నగరం అధికారులు, విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు , ఫోరెన్సిక్ దంతవైద్యుడిపై (బార్బరా మృతదేహంపై ఉన్న పంటి గాట్లను సరిపోలాయని సర్టిఫై చేసిన) కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన అమెరికా కోర్టు అతని వాదనను సమర్ధించింది. బాధితుడికి 1.4 మిలియన్ డాలర్ల (రూ. 116 కోట్లు) పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విడతలవారీగా డుబోయిస్ను ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ సంవత్సరం 90 లక్షల డాలర్లు, వచ్చే ఏడాది 30 లక్షల డాలర్లు, చివరిగా 2026లో 20 లక్షల డాలర్లు డుబోయిస్ అందుకుంటాడు. -
అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్ తోపాటు 50 వేల డాల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్కు చేరుకున్నారు. ఇక వారిలో బృహత్ సోమకి, టెక్సాస్కు చెందిన పైజాన్ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్ని సొంతం చేసుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్లు చెప్పగా, ఆ రికార్డును బృహత్ బ్రేక్ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం బృహత్ టైటిల్తో సత్తా చాటాడు. ఇక రన్నరప్గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్ పరీఖ్ రెండోవ స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. (చదవండి: US: పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!) -
USA: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం
ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని జాక్సెన్ విల్లా బీచ్ నగరం డౌన్ టౌన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జరిగిన డౌన్టౌన్ ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. జాక్సన్ విల్లే బీచ్లో 24వేల మంది జనాభా ఉంటారు. కాగా, అమెరికాలో చిన్న చిన్న గొడవలకు కాల్పులు జరపడం సర్వసాధారణంగా మారింది. ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు. దేశంలో వేళ్లూనుకుపోయిన గన్ కల్చర్ ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్షల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి.. అమెరికాకు స్పేస్ ఎక్స్ నిఘా ఉపగ్రహాలు -
ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఘనంగా జరిగాయి. టెంపుల్ టెర్రేస్ నగరంలో భారతీయులు ఈ వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్- మాట, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు అంబరాన్నంటాయి. మాట, నాట్స్తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని, ప్రసంగించారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియన్ రిపబ్లిక్ థీమ్ తో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ అలరించారు.ఇక జాతీయ జెండాలను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఇక భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలువురిని మెమెంటోలతో సన్మానించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుడ్ మరియు వెండర్ స్టాల్స్కి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్కు సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!) -
America: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఫోర్ట్లాడర్డేల్ నగరంలో శనివారం టోర్నడో బీభత్సం సృష్టించింది. భారీ విధ్వంసం సృష్టించిన ఈ టోర్నడో చివరకు ఫోర్ట్ లాడర్డేల్లోనే ముగిసింది. టోర్నడో దాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. వీధుల నిండా చెత్త నిండిపోయింది. టోర్నడో విధ్వంసంలో స్థానికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ గాయపడలేదు. టోర్నడో బీభత్సాన్ని పలువురు స్థానికులు తమ సెల్ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియలో పోస్టు చేయడంతో అవి వైరల్గా మారాయి. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన టోర్నడో వేగంగా బలం పుంజుకొని పలు భవనాలను, విద్యుత్ వైర్లను, తీరంలో నిలిచి ఉన్న నౌకలను ఢీ కొట్టిందని ఫోర్ట్ లాడర్డేల్ అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. 🚨#UPDATE: Here is additional footage as the City of Fort Lauderdale reports that there are currently no injuries and only minor damage after a tornado touched down. They are urging citizens to be cautious of downed power lines. pic.twitter.com/wno3qonwxP — R A W S A L E R T S (@rawsalerts) January 7, 2024 ఇదీచదవండి..అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం -
రూ.166 లాటరీ టికెట్.. వచ్చిన బహుమతి.. రూ.13,339 కోట్లు
ఒక్కసారిగా ఏదైనా కలిసి వచ్చిందంటే.. లాటరీ తగిలిందని అంటుంటాం. మరి ఒక లాటరీ తగిలి మొత్తం జీవితం అసలే మాత్రం ఊహించనంతగా మారిపోతే.. ఆ ఊహే ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది కదా.. అలాగే అమెరికాలోని ఫ్లారిడాలో ఓ వ్యక్తికి లాటరీ(రూ.166)లో ఏకంగా 13,339 కోట్ల రూపాయల (160 కోట్ల డాలర్ల) ‘మెగా మిలియన్’ లాటరీ తగిలింది. నిజానికి సెప్టెంబర్ 27నే విజేత ఎవరో తేలిపోయినా.. భద్రతా నిబంధనల మేరకు మూడు నెలల తర్వాత తాజాగా పేరును ప్రకటించారు. సాల్టయిన్ హోల్డింగ్స్ పేరిట దాని యజమాని ఈ లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. ‘మెగా మిలియన్’ లాటరీ చరిత్రలోనే ఇది అత్యధిక బహుమతి మొత్తం కావడం గమనార్హం. ఇక లాటరీ టికెట్ను అమ్మిన జాక్సన్విల్లే ప్రాంతంలోని పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్కు రూ.83 లక్షలు (లక్ష డాలర్లు) అదనపు కమీషన్గా లభించాయి. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వెయిటర్కి కోట్లలో జాక్పాట్ తగిలింది! అదే ఆమె జీవితాన్ని..
కోట్లల్లో లాటరీ తగిలితే వాట్ ఏ జాక్పాట్ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఒక్క క్షణంలో జీవితమే మారిపోయింది అని సంబరపడిపోతాం. అది కూడా ఓ సాధారణ వెయిటర్లా పనిచేస్తున్న వ్యక్తికి ఇలాంటి అదృష్టం దక్కితే అతడి సంతోషానికి అవధులే ఉండవు. కానీ అతడికి ఆ లాటరీ టికెట్ శాపమైపోయింది. ఎందుకు తగిలిందిరా బాబు అని జుట్టు పీక్కునేలా చుక్కలు చూపించింది. ఇందేంటి అనుకుంటున్నారా..!ఇంకెందుకు ఆలస్యం అలా ఎలా అయ్యిందో త్వరగా చదివేయండి మరీ..! ఫోరిడాలోని అలబామాలోని వాఫిల్ హౌస్ హోటల్కి ఎడ్వర్డ్ సెవార్డ్ అనే కస్టమర్ వచ్చాడు. అతడు వెళ్లిపోతూ వెయిటర్ టోండా డికర్సన్ అనే మహిళకి తాను ఫ్లోరిడాలో కొనుగోలు చేసిన లాటరీని టిప్గా ఇచ్చాడు. ఈ ఘటన మార్చి 6, 1999లో చోటు చేసుకుంది. అనూహ్యంగా ఆ మరుసటి రోజే ఆ లాటరీ టికెటే విజేతగా ప్రకటించబడింది. దీంతో డికర్సన్కి ఆ లాటరీలో ఏకంగా రూ. 73 కోట్లకు పైగా సోమ్ము వచ్చింది. అంతే ఇక తన జీవితం మారబోతుందన్న ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది డికర్సన్. అంతేగాదు ఆ వాఫిల్ హౌస్లోని మిగతా ఉద్యోగులు కూడా డికర్సన్కి లాటరీ తగలిందని సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆ హోటల్లో తమ ఉద్యోగులు ఎవరైనా జాక్పాట్ కొట్టినట్లయితే ఆ వచ్చిన మొత్తాన్ని అందరూ షేర్ చేసుకుంటామని ఒప్పదం చేసుకున్నారు. ఇప్పడు డికర్సన్ ఇప్పుడు అందుకు ఇష్టపడటం లేదు. దీంతో సహోద్యోగులు కోపంతో ఆమెపై కేసు పెట్టారు. అయితే కోర్టు ఆ ఒప్పదం నోటిమాటే గానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వెల్లడించింది. అలబామా చట్టం ఇలాంటి ఒప్పందాలు చట్టం విరుద్ధం కాదని చెబుతుండటంతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. అలాగే డికర్సన్ గెలుచుకున్న మొత్తాన్ని తన వద్ద ఉంచుకోవచ్చని తీర్పు ఇచ్చేసింది. ఇలా డికర్సన్ తన సహోద్యోగులతో పంచుకోలేదన్న విషయం లాటరీ టికెట్ ఇచ్చిన ఎడ్వర్ సెవార్డ్కి తెలుస్తుంది. దీంతో అతను కూడా డికర్సన్పై కేసు పెట్టాడు. తన సహోద్యుగులకు డికర్సన్ వాటా ఇవ్వాల్సిందే అని కోర్టుని ఆశ్రయించాడు. ఐతే కోర్టు అతడి కేసుని కూడా కొట్టేసింది. అయితే డికర్సన్కి ఆ కోర్టు కష్టాలు అక్కడితో ఆగలేదు. హమ్మయ్యా!.. అని అన్ని అడ్డంకులు దాటుకుని తన స్నేహితుడితో కలిసి ఎస్ కార్పోరేషన్ అనే కంపెనీని పెట్టింది. అయితే ఆ కంపెనీ ట్యాక్స్లు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చి.. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్(ఐఆర్స్) ఎదుర్కొంటోంది. డికర్సన్ తన కుటుంబానికి రూ. 20 కోట్లు బహుమతిగా ఇచ్చిందన్న అంశం తెరపైకి వచ్చి రాద్ధాంతంగా మారింది. ఆమె గెలుచుకున్న మొత్తంలో సుమారు 51% గిఫ్ట్గా ఇచ్చినట్లు ఐఆర్ఎస్ చెబుతోంది. ఐతే డికర్సన్ అది గిఫ్ట్ కాదని తమ కుటుంబంలో ఎవరైన పెద్ద మొత్తంలో గెలుచుకుంటే అది అందరం షేర్ చేసుకోవడం జరుగుతుందని, అదికూడా ఒకరి బాగోగులు చూసుకోవడంలో భాగంగానే అని వివరణ ఇచ్చుకుంది. ఇలా ఆమెను 12 ఏళ్ల పాటు ఇన్కమ్ ట్యాక్స్ కష్టాలు వెంటాడాయి. ఆ విధంగా ఆమె ఉదారంగా గెలుచుకున్న సొమ్ములో దాదాపు రూ. 9 కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించాలని 2012లో కోర్టు ఆమెను ఆదేశించింది. కోట్లలో డబ్బు గెలుచుకుందన్నమాటే గానీ ట్యాక్స్లు సహోద్యోగుల రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోట్లాధికారిగా మారానన్న సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు సరికదా!. ఆ లాటరీ తగిలాక ప్రతి నిమిషం ఓ టెన్షన్.. టెన్షన్..అన్నట్లుగా మారిపోయింది జీవితం. టైం బ్యాడ్గా ఉంటే అదృష్టం కూడా దురదృష్టంలా ఏడిపించేస్తుందేమో. బహుశా ఊరికే వచ్చిన సొమ్ము లేదా నడిమంత్రపు సిరి ఎక్కువ కాలంనిలవదు అంటే ఇదేనేమో కదా..!. In 1999, waitress Tonda Dickerson was tipped a lottery ticket and won $10,000,000. Her colleagues then sued her for their share. Then she was sued by the man who tipped her the ticket. Later, she was kidnapped by her ex-husband and had to shoot him in the chest. Finally, she… pic.twitter.com/KpDR4lhN4I — Fascinating (@fasc1nate) December 11, 2023 (చదవండి: 24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!) -
భార్యను 17సార్లు కత్తితో పొడిచి, కారుతో తొక్కించి..
వాషింగ్టన్: భార్యను దారుణంగా చంపిన కేరళ వాసికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ, మెరిన్ జోయ్(26) అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. జోయ్ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. విభేదాల కారణంగా భార్య తనను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మాథ్యూ అక్కసుతో ఉన్నాడు. 2020లో ఆమె కారును అడ్డగించి, కత్తితో 17సార్లు పొడిచాడు. ఆపై కారుతో ఆమెను తొక్కుకుంటూ తన ఆఫీసుకు వెళ్లిపోయాడు. అక్కడ తన స్నేహితులతో భార్యను కారుతో తొక్కుకుంటూ వచ్చిన విషయాన్ని తెలిపాడు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన మెరిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త అమానుషత్వంపై అధికారులకు వాంగ్మూలమిచ్చింది. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలోనే చనిపోయింది. దీంతో, పోలీసులు మా«థ్యూను అదుపులోకి తీసుకున్నారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
తంపా (యూఎస్): అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున రెండు గ్యాంగుల మధ్య పోరాటం కాల్పుల దాకా వెళ్లడంతో ఇద్దరు మరణించారు. 18 మంది దాకా గాయపడి ఆస్పత్రి పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతమంతా బార్లు, క్లబ్బులతో, లేట్ నైట్ కార్యకలాపాలతో నిండి ఉంటుంది. అనుమానితుల్లో ఒకరు ఇప్పటికే పోలీసులకు లొంగిపోయారు. మిగతావారి కోసం గాలింపు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. మరో ఘటన... జార్జియా యూనివర్సిటీ అట్లాంటా క్యాంపస్లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
T20 WC 2024: ఐసీసీ ప్రకటన.. ఆ 3 నగరాలకు గుడ్న్యూస్
3 USA venues locked in for ICC Men's T20 WC 2024: ఐసీసీ మెన్స్ వరల్డ్కప్-2024 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్లను టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఎంపిక చేసినట్లు బుధవారం ధ్రువీకరించింది. మొట్టమొదటిసారి కాగా వెస్టిండీస్తో కలిసి యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈసారి పొట్టి ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను అమెరికా దక్కించుకోగా.. వేదికల ఎంపికలో ఐసీసీ తాజాగా తుది నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్లోని నసౌవ్ కౌంటీ, డల్లాస్లోని గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రొవార్డ్ కౌంటీ అసోసియేషన్లకు ఈ మేరకు శుభవార్త చెప్పింది. ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. సీటింగ్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఫ్యాన్స్ కోసమే ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. అతిపెద్ద ఐసీసీ ఈవెంట్కు అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతుండటం సంతోషంగా ఉందన్నాడు. అమెరికాలో క్రికెట్ పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుండటం.. ఫ్యాన్బేస్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. సొంత నగరాల్లోనే మేటి క్రికెట్ మ్యాచ్లు నేరుగా వీక్షించేందుకు యూఎస్ఏలోని క్రికెట్ ఫ్యాన్స్కు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం దొరకనుంది. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్గా.. ఏకంగా.. -
ఆ ముగ్గురి మరణాలు.. 20 ఏళ్లుగా మూతబడిన డిస్నీపార్కు
డిస్నీపార్కుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వాల్ట్ డిస్నీ నెలకొల్పిన డిస్నీ థీమ్ పార్కులు ప్రపంచంలో పన్నెండు ఉన్నాయి. ఈ పార్కులన్నీ సందర్శకులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. రోజూ వేలాది సందర్శకులు వీటిని సందర్శిస్తుంటారు. ఇవి ఈనాటికీ దేశ విదేశాల సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, డిస్నీ థీమ్ పార్కుల్లో ఒకటైన ‘డిస్నీ రివర్ కంట్రీ’ మాత్రం దాదాపు ఇరవై ఏళ్లుగా మూతబడింది. ఇప్పుడు ఈ పార్కు పాడుబడి దెయ్యాల నివాసాన్ని తలపించేలా తయారైంది. డిస్నీ థీమ్ పార్కుల్లో భాగంగా వాల్ట్ డిస్నీ కంపెనీ 1976 జూన్ 20న ఫ్లోరిడాలోని బే లేక్ తీరం వద్ద ‘డిస్నీ రివర్ కంట్రీ’ పార్కును నెలకొల్పింది. వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన మిగిలిన డిస్నీ పార్కుల్లాగానే ఇది కూడా సందర్శకులతో కిటకిటలాడేది. నిత్యం కోలాహలంగా కనిపించేది. వ్యాపారపరంగా లాభసాటిగానే నడిచేది. ఇందులో రెండు స్విమింగ్పూల్స్, ఐదు వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. సమీపంలోని బే లేక్ నుంచి వీటికి నీరు చేరవేసేవారు. బే లేక్ నుంచి వచ్చే నీటిని వడబోసేందుకు అడుగు భాగాన ఇసుక నింపిన ఫిల్టర్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు తలెత్తడం, దీనిపై జనాల్లో ఆందోళన మొదలవడంతో ఇది 2001 నవంబర్ 2న మూతబడింది. అప్పటి నుంచి దీనిని మళ్లీ తెరిచే ప్రయత్నాలేవీ ఇంతవరకు జరగలేదు. ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు 1980లోనే మొదలయ్యాయి. ఇక్కడి స్విమింగ్పూల్లో ఈత కొట్టిన ఒక పదకొండేళ్ల బాలుడికి మెదడులో అమీబిక్ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఆ ఇన్ఫెక్షన్తోనే అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 1982లో ఒకరు, 1989లో మరొకరు ఇలాగే నీటివల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారినపడి మరణించారు. చాలామంది ఇన్ఫెక్షన్ల బారిన పడినా, చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ పార్కులో అడుగుపెట్టడానికి జనాలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ 2001 నవంబర్ 2న ఈ పార్కును మూసివేస్తున్నప్పుడు దీనిలోని నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించి, 2002 ఏప్రిల్ 11న పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, ‘వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన తొలి వాటర్ థీమ్ పార్కు శాశ్వతంగా మూతబడినట్లే’ అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ ప్రకటించినట్లుగా ఇది పునఃప్రారంభం కాలేదు. వార్తాకథనాలు ఊహించినట్లుగానే జరిగింది. ప్రస్తుతం ఇది పూర్తిగా పాడుబడి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. వాల్ట్ డిస్నీ కంపెనీ చరిత్రలో ఇలాంటి వైఫల్యం ఇదొక్కటే! -
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు నల్లజాతీయులు మృతి
జాక్సన్విల్లె: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్లెలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీకి సమీపంలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ యువకుడు(20) జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్ల జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జాతి విద్వేష ఘటన అని పోలీసులు తెలిపారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. నిందితుడు నల్ల జాతీయులను ద్వేషించే వాడని, ఇతర గ్రూపులతో అతడికి సంబంధాలున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అతడు హ్యాండ్గన్తోపాటు, సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో కాల్పులకు తెగబడ్డాడన్నారు. ఒక తుపాకీపై స్వస్తిక్ గుర్తు ఉందని వివరించారు. పొరుగునే ఉన్న క్లె కౌంటీ నుంచి నల్లజాతీయులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి వచ్చాడు. కాల్పులకు కొద్దిసేపటి ముందు తన తండ్రికి మెసేజీ పంపించాడని, దాని ప్రకారం నిందితుడి కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా విద్వేషపూరిత రాతలు కనిపించాయని పోలీసులు వివరించారు. -
విండీస్తో టీమిండియా కీలక పోరు.. వెస్టిండీస్ స్కోరు ఎంతంటే!
India tour of West Indies, 2023 - West Indies vs India, 4th T20I: టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్కు 3, కుల్దీప్ యాదవ్కు రెండు, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, ముకేశ్ కుమార్కు ఒక్కో వికెట్ దక్కాయి. 19.2: అర్ష్దీప్ మరోసారి అర్ష్దీప్ బౌలింగ్లో హెట్మైర్ అవుట్. 61 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించిన హిట్టర్. విండీస్ స్కోరు 171/8 (19.3) ఏడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 15.3: ముకేశ్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయిన జేసన్ హోల్డర్. స్కోరు: 132-7 14.2: అక్షర్ పటేల్కు తొలి వికెట్ షెపర్డ్(9) రూపంలో వెస్టిండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో షెపర్డ్ ఇచ్చిన క్యాచ్ను సంజూ ఒడిసిపట్టాడు. స్కోరు: 119/6 (14.3) ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 12.5: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ వెస్టిండీస్కు షాకిచ్చాడు. అర్ధ శతకం దిశగా వెళ్తున్న షాయీ హోప్[45(29)]ను పెవిలియన్కు పంపాడు. 109/5 (13.3) 12 ఓవర్లలో విండీస్ స్కోరు: 102/4 నిలకడగా ఆడుతున్న షాయీ హోప్(43), హెట్మెయిర్(22) 10 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 79/4 6.5: మళ్లీ దెబ్బేసిన కుల్దీప్ టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఏడో ఓవర్ మొదటి బంతికి పూరన్ను అవుట్ చేసిన ఈ స్టార్ స్పిన్నర్.. ఐదో బంతికి విండీస్ సారథి పావెల్(1)ను అవుట్ చేశాడు. స్కోరు: 57-4(7) 6.1: మూడో వికెట్ కోల్పోయిన విండీస్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్కు భారీ షాకిచ్చాడు. బిగ్ హిట్టర్ నికోలస్ పూరన్(1)ను పెవిలియన్కు పంపాడు. విండీస్ స్కోరు: 55/3 (6.1) 5.4: విండీస్ను దెబ్బకొట్టిన అర్ష్దీప్ బ్రాండన్ కింగ్[18(16)] రూపంలో రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్. 5 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 48-1 1.4: తొలి వికెట్ కోల్పోయిన విండీస్ అర్ష్దీప్ బౌలింగ్లో మేయర్స్ [17(7)] అవుట్. కింగ్, షాయీ హోప్ క్రీజులో ఉన్నారు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 టాస్ గెలిచిన వెస్టిండీస్ వెస్టిండీస్ మరో కీలక మ్యాచ్కు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం నాటి నాలుగో టీ20కి అమెరికాలోని ఫ్లోరిడా వేదికైంది. రీజినల్ పార్క్ స్టేడియంలో హార్దిక్ సేన.. రోవ్మన్ పావెల్ బృందంతో తలపడేందుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించగా.. వెస్టిండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. కాగా ఫ్లోరిడా పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 13 టి20 మ్యాచ్లలో 11 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య విండీస్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో విజయం సాధిస్తేనే భారత జట్టు సిరీస్ సాధించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. తుది జట్లు టీమిండియా: యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. మనకు ఎవరూ సపోర్ట్ చేయరు: షాదాబ్ ఖాన్ -
లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?
అమెజాన్ కో ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.ఇప్పటికే భారీ ఆస్తులను సొంతం చేసుకున్న బెజోస్ ప్రపంచంలోనే మూడో కుబేరుడు ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ఇండియన్ క్రీక్ ఐలాండ్లో దాదాపు రూ.560 కోట్ల (68 మిలియన్ల డాలర్లు) ఎస్టేట్ను కొనుగోలుకు అంగీకరించినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. రికార్డుల ప్రకారం దాదాపు 9,300 చదరపు అడుగుల (864 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉంది. లారెన్ శాంచెజ్తో చెట్టాపట్టాల్, రూ.560 కోట్ల ఇల్లు ఇటీవల గర్ల్ఫ్రెండ్తో లారెన్ శాంచెజ్తో సందడి చేసిన జెఫ్ బెజోస్ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి ఫ్లోరిడాలోని వాటర్ ఫ్రంట్ మాన్షన్ను జోడించడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. 1965లో నిర్మించిన 2.8-acre (1.1హెక్టార్లు) మూడు పడకగదులప్రాపర్టీ MTM స్టార్ ఇంటర్నేషనల్ పేరుతో ఉన్నట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని ఇతర కొనుగోళ్లపై దృష్టి పెట్టారని, ప్రస్తుతం కొనుగోలు చేసిన స్పెషల్ ఇండియన్ క్రీక్ను "బిలియనీర్ బంకర్" అని పిలుస్తారని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి సమాచారం ద్వారా తెలుస్తోందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ చేసింది. బెజోస్తోపాటు, కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, జారెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ లాంటి టాప్ సెలబ్రిటీలకు కూడా ఇక్కడ ఇళ్లు ఉండట విశేషం. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు బెజోస్ ప్రతినిధి నిరాకరించారు. ఇప్పటికే దిమ్మదిరిగే ప్రాపర్టీలు బెజోస్కు ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో 165 మిలియన్ల డాలర్ల విలువన తొమ్మిది ఎకరాల బెవర్లీ హిల్స్ మాన్షన్ , ఇంకా మౌయ్లోని ఒక ఎస్టేట్తో సహా పలు లగ్జరీ భవనాలు ఆయన సొంతం. అలాగే మాన్హాటన్ ,సీటెల్లో ఖరీదైన ఆస్తులు, టెక్సాస్లో 300,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడే బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్కు ప్రయోగ కేంద్రం కొలువై ఉంది. లగ్జరీ ప్రాపర్టీలపై మోజు 2021లో అమెజాన్ సీఈవోగా వైదొలగిన బెజెస్కు భార్య మెకెంజీ స్కాట్తో విడాకుల తరువాత సూపర్ లగ్జరీ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడంపై మోజు పెరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సూపర్యాచ్ కోరును కొనుగోలు చేశారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 163 బిలియన్ల డాలర్ల సంపదతో, ఈ ఐలాండ్ ఎస్టేట్లో అత్యంత సంపన్న నివాసి అవుతాడు. ఈ ద్వీపంలో కేవలం 40 నివాసాలు, ఒక కంట్రీ క్లబ్ . సొంత పోలీసు విభాగం గా ఉన్నాయి. -
సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే..చివరికి ఒక్కడే సముద్రంలో..
చావు అంచులదాక వెళ్లి బతికితే మృత్యుంజయుడి అంటాం. కానీ చుట్టూ నీరు కనుచూపు మేరలో ఎవ్వరూ లేకుండా ఒక్కడే 24 గంటలు పైగా గడిపి ప్రాణాలతో బయటపడితే ఏం అనాలో చెప్పండి. వింటేనే వామ్మో అనిపిస్తుంది. బఆశలన్ని వదులుకునే స్థితిలో అదికూడా 24 గంటల పైగా అంటే మాటలు కాదుకదా. అంతటి కష్టాన్ని జయించి చివరి దాక ఆశను వదలక ప్రాణాలతో బయటపడి ఔరా! అనిపించుకున్నాడో ఓవ్యక్తి. ఈ భయానక ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల చార్లెస్ గ్రెగొరీ తన బోట్పై శుక్రవారం ఫ్లోరిడా తీరానికి 12 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా.. సడెన్గా ఓ రాకాసి అల అతని బోట్ని గట్టిగా తాకింది. దీంతో ఒక్కసారిగా బోటు మునిగిపోపయింది. దీంతో అతడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఏకంగా 24 గంటలు పాటు అలానే సముద్రంలో ఒంటరిగా బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. ఓ పక్క ఆకలితో ఉన్న సోర చేపలు, జెల్లి ఫిష్లు దగ్గర నుంచి వెళ్తుంటే..బతుకుతానా ఆహారమైపోతానా అన్నట్లు భయాందోళలనతో గడిపాడు. శనివారానికి ఓ కోస్ట్గార్డ్ గ్రెగోరి పడవ మునిగిపోవడాన్ని గుర్తించి అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చి వైద్యసాయం అందించాడు. ఈ మేరకు సదరు కోస్ట్గార్డు నిక్ బారో మాట్టాడుతూ.. ఆ వ్యక్తి తల్లిదండ్రుల తమ కుమారుడు పడవతో వెళ్లాక తిరిగి అగస్టిన్కి తిరిగి రాకపోవడంతో భయంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము రంగంలోకి దిగి అతన్ని రక్షించినట్లు చెప్పాడు. ఐనా ఇలా ఎప్పుడైనా ఇలా సముద్రంలోకి వెళ్లాలనుకుంటే మాత్రం లైఫ్ జాకెట్, విహెచ్బై మెరైన్ గ్రేడ్ రేడియో, సిగ్నలింగ్ పరికారాలు తోపాటు ఎలాంటి ఆపదలోనైనా చిక్కుకుంటే సమాచారం అందించ గలిగేలా ఎమర్జెన్సీ పర్సనల్ లొకేటర్ బెకన్ని తదితర రక్షణను ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #FinalUpdate @USCG crews rescued 25YO Charles Gregory, Saturday, after he went missing on a 12-foot jon boat, 12 miles offshore of #StAugustine, #Florida. Press release: https://t.co/OGaPL6S6nS#USCG #CoastGuard #SAR pic.twitter.com/WezyZHEXB8 — USCGSoutheast (@USCGSoutheast) August 5, 2023 (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
సముద్ర గర్భంలో సంగీత కచేరి!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!
ఎన్నో రకాల సంగీత కచేరీల గురించి విని ఉంటారు. నీటి అడుగును ప్రేక్షకులను అలరించేలా మ్యూజిక్ షో నిర్వహించడం గురి విని ఉన్నారా. అదికూడా సముద్రంలోనా! అసలు ఎలా ప్లే చేయగలం. వినేవాళ్లు ఎవర?... ఎవరబ్బా?.. ఇలాంటి మ్యూజిక్ షో నిర్వహించాలనుకున్నారు.. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది? ఏంటీ అనే కథ కమామీషు గురించి చూద్దాం! వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ఫ్లోరిడాలో అభయారణ్యానికి సుమారు 201 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడా కీస్ నేషనల్ మైరైన్ శాంక్చురీ ప్రాంతంలోని లూకీ రీఫ్లో ఈ మ్యూజిక్ షో జరుగుతుంది. దీన్ని "లోయర్ కీస్ అండర్వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్" అంటారు. ప్రతి ఏడాది ఆగస్టులో నిర్వహిస్తుంటారు. ఎంతోమంది డైవింగ్ చేసుకుంటూ వచ్చి మరీ ఆ మ్యూజిక్ షాలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు. ఆ సంగీతాన్ని వినేందుకు ఔత్సాహికులు ఈదుకుంటూ వచ్చి మరీ పాల్గొనడం విశేషం. పగడపు దిబ్బలపై పర్యావరణ ప్రభావాలను తగ్గించేలా అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఇలా వినూత్న రీతిలో మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు ఫ్లోరిడా అధికారులు. ఆ సంగీత కచేరిలో సింగర్స్ 'వాటర్' నేపథ్య సంగీతాన్ని అలపిస్తారు. వాటర్ప్రూఫ్ స్పీకర్ల ద్వారా సంగీతం సముద్రంలోకి పైప్ చేస్తారు. అంతేకాదు పగడపు దిబ్బల రక్షణపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ఒక్కో థీమ్తో ఈ మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. చూసేందుకు అవకాశం లేని ప్రజల కోసం ఈ మ్యూజిక్ని స్థానిక ఎఫ్ఎం రేడియోస్టేషన్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ కార్యక్రమం నాలుగు గంటల పాటు ఆహ్లాదభరితంగా జరుగుతుంది. ఈ పగడపు దిబ్బలను వారంతా సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. కాగా, ఈ ఏడాది శనివారం జరిగిన 39వ వార్షిక లోయర్ కీస్ అండర్ వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్కు డజన్ల కొద్దీ డైవర్లు, స్నార్కెలర్లు హాజరయ్యారు. పర్యావరణంపై స్ప్రుహ కలిగించేలా ఇంతటి సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడం గ్రేట్ కదా!. (చదవండి: అతనో రాజవంశస్తుడు..'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..) -
గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు!
వివిధ దేశాలు, దీవులను కొన్న దేశాలు సాధారణంగా ఎక్కడైనా భూమిని చదరపు అడుగులు, చదరపు గజాలు లేదా ఎకరాల్లో కొంటారని అందరికీ తెలుసు. కానీ కొన్ని దేశాలు ద్వీపాలు లేదా వేరే దేశాలను కొనుగోలు చేశాయని తెలుసా? దాదాపు 20 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్ల్యాండ్ను కొనేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నం చేసిందని తెలుసా? అలా దేశాలను లేదా ద్వీపాలను ఇతర దేశాలు కొనాల్సిన అవసరం.. దాని వెనకున్న ఉద్దేశమేంటి? అందుకు ఎంత వెచ్చించాయి. ఇలాంటి వెరైటీ భూకొనుగోళ్లలో కొన్నింటి గురించి క్లుప్తంగా... అలాస్కా ఉత్తర అమెరికా ఖండం ఎగువ భాగాన 17 లక్షల చ.కి.మీ.పైగా విస్తీర్ణం మేర విస్తరించిన ఈ ప్రాంతాన్ని అమెరికా 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి రష్యన్ చక్రవర్తి కేవలం 72 లక్షల డాలర్లకు ఈ ప్రాంతాన్ని అమ్మేశాడు. అమెరికా కొనుగోలు చేసిన అతిస్వల్పకాలంలోనే అలాస్కాలో అత్యంత విలువైన బంగారు గనులు బయటపడ్డాయి. అంతేకాదు.. ఆపై చమురు నిక్షేపాలతోపాటు అనేక ఖనిజాలు లభించాయి. ఇప్పుడు అలస్కాలో ఏటా 8 కోట్ల టన్నుల చమురును అమెరికా వెలికితీస్తోంది. సింగపూర్ బ్రిటన్ 1819లో సింగపూర్ను కొన్నది. ఈస్టిండియా కంపెనీ వాణిజ్య అవసరాల కోసం మలేసియాలోని జోహర్ రాజ్యం నుంచి సింగపూర్ను కొనుగోలు చేసింది. దీనికోసం జోహర్ సుల్తాన్ హుస్సైన్షాకు ఏడాదికి 5,000 స్పెయిన్ డాలర్లు అదే రాజ్యానికి సైన్యాధికారి అయిన అబ్దుల్ రహమాన్కు 3,000 డాలర్లు ఇచ్చేట్లు బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటన్ సింగపూర్ను వదుకోవాల్సి వచ్చింది. తిరిగి మలేసియాలో భాగమైన సింగపూర్ 1965లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఫ్లోరిడా బ్రిటన్ సింగపూర్ను కొనుగోలు చేసిన 1819లోనే అక్కడ అమెరికా ఫ్లోరిడాను స్పెయిన్ నుంచి కొన్నది. దీనికోసం అమెరికా కేవలం 50 లక్షల డాలర్లను వెచ్చించింది. 1845లో ఫ్లోరిడా అమెరికా 27వ రాష్ట్రంగా అవతరించింది. ఫిలిప్పైన్స్ సుదీర్ఘ పోరాటం తరువాత స్వాతంత్య్రం సాధించిన ఫిలిప్పైన్స్ను ఒకప్పుడు స్పెయిన్ నుంచి అమెరికా కొనుగోలు చేసింది. 1898లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 2 కోట్ల డాలర్లు వెచ్చించి అమెరికా ఫిలిప్పైన్స్ను సొంతం చేసుకుంది. గ్వదర్ బలూచిస్తాన్ రాష్ట్రంలో భాగమైన ఈ తీరప్రాంత పట్టణాన్ని పాకిస్తాన్ 1958లో ఒమన్ నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం 550 కోట్ల పాకిస్తాన్ రూపాయలను వెచ్చించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా గ్వదర్ పోర్టును పాకిస్తాన్ 2013లో చైనాకు అప్పగించింది. అప్పట్లో ఈ పోర్టు విలువను 4,600 కోట్ల డాలర్లుగా విలువ కట్టారు. వర్జిన్ ఐలాండ్స్ అమెరికా 1917లో డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐల్యాండ్స్ను కొనుగోలు చేసింది. దీనికోసం 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా డెన్మార్క్కు అప్పగించింది. అప్పట్లోనే 10 కోట్ల డాలర్లతో గ్రీన్ల్యాండ్ను కూడా కొంటామని అమెరికా ప్రతిపాదించినా డెన్మార్క్ అంగీకరించలేదు. 1867 నుంచి 2019 వరకు అమెరికా పలుమార్లు గ్రీన్ల్యాండ్ను కొనే ప్రయత్నాలు చేసింది. కానీ గ్రీన్ల్యాండ్పై సార్వభౌమాధికారంగల డెన్మార్క్ మాత్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. ఆఖరి కొనుగోలు ప్రపంచంలో ఇతర దేశాలను లేదా ప్రాంతాలను కొనుగోలు చేసే ప్రక్రియ చివరగా సౌదీ అరేబియా ఈజిప్టు మధ్య జరిగింది. 2017లో ఎర్ర సముద్రంలోని రెండు చిన్నదీవులైన టీరన్, సనఫిర్లను సౌదీకి అప్పగించేందుకు ఈజిప్టు అంగీకరించింది. దీనికోసం 2 కోట్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇచ్చేందుకు సౌదీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈజిప్టు పౌరులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కట్నంగా నాటి బొంబాయి ప్రస్తుత ముంబై ఒకప్పటి బొంబాయిని బ్రిటన్ రాజు చార్లెస్–2 కట్నంగా పొందారు. ప్రస్తుత ముంబైలో ఉన్న అనేక ప్రాంతాలు, ద్వీపాలు అప్పట్లో పోర్చుగీసు రాజ్యం అదీనంలో ఉండేవి. చార్లెస్–2 పోర్చుగీసు యువరాణి కేథరీన్ను పెళ్లి చేసుకున్నందుకు కట్నంగా కింగ్ జాన్–4 బొంబాయిని కట్నంగా రాసిచ్చారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు బొంబాయిని బోమ్బెహియాగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు బాంబేగా మార్చారు. కట్నంగా పొందిన బొంబాయిని చార్లెస్... బ్రిటన్కు చెందిన ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. నటోవతు ద్వీపం 2014లో ఫిజికి చెందిన నటోవతు అనే దీవిలో 5,000 ఎకరాలను కిరిబటి రిపబ్లిక్ 87 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగితే తమ దేశం మునిగిపోతుందని ముందుజాగ్రత్త చర్యగా కిరిబటి తన జనాభా సంరక్షణ కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది. అమ్మకానికి మరెన్నో దీవులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మానవరహిత దీవులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాదిరిగానే దీవుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఏజెంట్లు, ఆన్లైన్ వెబ్సైట్లు కూడా సేవలు అందిస్తున్నాయి. ధనవంతులు వెకేషన్ల కోసం ఇలాంటి దీవుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశాన్ని బట్టి వాటి రేట్లు ఉంటాయి. మధ్య అమెరికాలో కొంత తక్కువగా... యూరప్ కొంత ఎక్కువగా ఈ దీవుల రేట్లు ఉన్నాయి. ప్రైవేట్ ఐలాండ్స్ వంటి ఆన్లైన్ వెబ్సైట్ల ప్రకారం దక్షిణ అమెరికాలో అతితక్కువగా మన కరెన్సీలో రూ. 5 కోట్లుగా ఓ దీవి విలువ ఉంటే యూరప్లో రూ. 7 కోట్లకు ఎంచక్కా దీవిని సొంతం చేసుకోవచ్చు. ఎందరో హాలీవుడ్ స్టార్లతోపాటు బాలీవుడ్ స్టార్లు ఇలాంటి దీవులను కొనుగోలు చేశారు. షారుక్ఖాన్ దుబాయ్ సమీపంలో 70 కోట్ల డాలర్లకు ఓ దీవిని సొంతం చేసుకోగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పాప్సింగర్ మీకా కూడా దీవులు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. 30 భద్రత, ఆర్థిక లేదా వాణిజ్య అవసరాల కోసం ఓ దేశం మరో దేశాన్ని మొత్తంగా లేదా కొంత భాగాన్ని కొన్న ఉదంతాలు -
సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్గా షార్క్ దూసుకురావడంతో..
అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీరంలో ఆ క్షణంలో భయానక వాతావరణం ఏర్పడింది. సముద్రంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా స్నానం చేస్తున్న వారి మధ్యలోకి ఉన్నట్టుండి ఒక భారీ షార్క్ ప్రత్యక్షమయ్యింది. దీంతో వారంతా నీటిలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ భారీ షార్క్ నీటి మీద తేలియాడుతూ సముద్రంలో సేద తీరుతున్నవారి దిశగా దూసుకువచ్చింది. ఈ షార్క్ను బీచ్లో నుంచి చూసినవారు సముద్రంలో సయ్యాటలాడుతున్న వారిని హెచ్చరిస్తూ బయటకు వచ్చేయండంటూ గట్టిగా కేకలు పెట్టారు. గతంలో న్యూయార్క్లోని ఫైర్ ఐలాండ్ను 15 ఏళ్ల కుర్రాడిని షార్క్ చంపేసినప్పటి నుంచి జనాలకు షార్క్లంటే విపరీతమైన భయం పట్టుకుంది. తాజాగా ఫ్లోరిడా బీచ్లో కనిపించిన షార్క్ భారీ ఆకారంతో ఉండటంతో అక్కడున్న వారంతా భయపడిపోయారు. ఆ క్షణంలో అక్కడ ఆందోళనకర వాతావారణం ఏర్పడింది. గతంలో షార్క్ దాడిలో బాలుడు మృతి చెందడం, దీనికి ముందు షార్క్ దాడిలో కొందరు గాయపడటాన్ని స్థానికులు మరోమారు గుర్తుచేసుకున్నారు. ‘అది ఆకలితో ఉన్నట్టుంది’ ఫ్లోరిడాలో ఆ సమయంలో సముద్రతీరంలో సేదతీరిన క్రిస్టీ కాక్స్ మాట్లాడుతూ తాను ఆ షార్క్ను చూసినప్పుడు అది ఆహరపు వేటలో ఉన్నట్లు అనిపించిదన్నారు. అందుకే అది వేగంగా కదులుతూ మనుషులవైపు వచ్చిందన్నారు. దానిని చూడగానే అక్కడున్న వారంతా నిశ్చేష్టులైపోయారన్నారు. ఎలాగోలా అందరూ దారి బారి నుంచి తప్పించుకున్నారన్నారు. కాగా గతంలో పలువురిపై షార్క్ దాడులు జరగగా, వారిలో కొందరు వికలాంగులుగా మారిపోయారు. ఇది కూడా చదవండి: ‘ఇదేం పువ్వు రా బాబూ.. ముక్కు పేలిపోతోంది’ -
అమెరికా ఫ్లోరిడాలో తెలుగు వ్యక్తి మృతి
-
అమెరికాలో టోర్నడో విధ్వంసం.. అయిదుగురి మృతి
అమెరికాలో టోర్నడో తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రంలోని పాన్హ్యాండిల్ పట్టణం పెర్రిటన్లో టోర్నడో ధాటికి అయిదుగురు మృతి చెందారు. దాదాపు 100 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృతుల్లో 11 బాలుడు, 60 ఏళ్ల వయస్సున ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత టోర్నడో తుపాను టెక్సాస్, ఫ్లోరిడా ప్రాంతాన్ని తాకినట్లు అమరిల్లోలోని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. సమాచారం అందుకున్న అత్యవసర సేవల అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ సేవలు ముమ్మరంగా సాగుతున్నాయని పెర్రిటన్ ఫైర్ చీఫ్ పాల్ డచర్ తెలిపారు. సుడిగాలి కారణంగా టెక్సాస్లో 200 ఇళ్లు ధ్వంసమవ్వగా.. మొబైల్ హోమ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వృక్షాలు నెలకొరిగాయి. వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టెక్సాస్, లూసియానా, మిస్సిస్సిప్పి, ఫ్లోరిడా, ఓక్లహోమాలో సుమారు 50 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. పెర్రిటన్లో ముగ్గురు వ్యక్తులు మరణించారని, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సుడిగాలి తీవ్రతకు గురువారం ఫ్లోరిడా పాన్హ్యండిల్లో ఇంటిపై చెట్టు కూలడంతో ఒకరు మరణించారని తెలిపింది. చదవండి: ఐరాసలో యోగా వైట్హౌస్లో విందు -
పోలీసోడివా.. అయితే ఏంటి? లైసెన్స్ తియ్యి
నేనో పోలీస్నయ్యా.. పని మీద వెళ్తున్నానంటే వినవేంటయ్యా.. అంటూ తనను వెంబడించి అడ్డగించిన పైస్థాయి అధికారికి ఆ పోలీస్ అధికారి బదులిచ్చాడు. అయితే ఏంటి? అలా బండి నడుపుతావా? లైసెన్స్ చూపించు అని నిలదీశాడు పైస్థాయి అధికారి. అయితే నిర్లక్ష్య ధోరణి ఉన్న ఆ అధికారి మాత్రం అదే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. రూల్స్ బ్రేక్ చేసిన ఆ అధికారి ఉద్యోగం ఊడింది. నిర్లక్ష్య ధోరణితో బండి నడపడంతో పాటు పలు రకాల కేసుల కింద అతనిపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ కూడా అయ్యాడు. చేసిన తప్పునకు అతనికి శిక్ష కఠినంగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడాలో ఓర్లాండో నగరంలో గంటకు 45 మైళ్ల స్పీడ్తో వెళ్లాల్సిన చోట.. 80 మైళ్ల వేగంతో అధికారిక వాహనంలోనే దూసుకెళ్లిన ఓ పోలీసోడికే పడిన శిక్ష ఇది. అక్కడంతే.. చట్టాలు వెరీ పవర్ఫుల్. ఎవరికీ చుట్టంగా వ్యవహరించదు మరి!. “I am going into work" Speeding police officer pulled over by another officer https://t.co/NKV4xszcZq pic.twitter.com/mZtnZXmC4P — BBC News (World) (@BBCWorld) June 15, 2023 Video Credits: BBC News World ఇదీ చదవండి: బరువు తగ్గాలనుకుంటే.. మనిషే లేకుండా పోయాడు పాపం -
వారి నిర్లక్ష్యంతోనే నా భార్య మృతి.. రిసార్ట్, బోట్ కెప్టెన్పై ఎన్ఆర్ఐ దావా
తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు. శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్లో పారాసైలింగ్కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్ను బోట్కి అనుసంధానించే టౌలైన్ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా?
కుక్క కరిస్తే ఎంత ప్రమాదమో అని అందరికీ తెలుసు. అందుకే అది కరిచిన వెంటనే ర్యాబిస్ వ్యాధి రాకుండా ఇంజెక్షన్లు తీసుకుంటాం. కొద్ది రోజులు ఆహార నియమాలు పాటిస్తాం. అయితే కుక్క కాటు కంటే మనిషి కరిస్తేనే అత్యంత ప్రమాదకరమట. ఆ వ్యక్తి కోలుకోవడానికే ఆరు నెలల పడుతుందట. ఔను! ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..డోని ఆడమ్స్ ఫిబ్రవరిలో టంపా బేలో ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ చిన్న గొడవ జరిగింది. దీంతో ఇద్దరు బంధువులు కలబడ్డారు. వారిని విడదీసేందకు మధ్యలో కలగజేసుకున్న ఆడమ్స్ని ఒక వ్యక్తి కోపంతో మోకాలిపై కరిచాడు. దీంతో అతను నైక్రోటైజింగ్ షాసిటిస్ వ్యాధి బారినపడ్డాడు. దీనిని సాధారణంగా మాంసం తినే భ్యాక్టీరియా అని పిలుస్తారు. దీని కారణంగా శరీరీం కుళ్లిపోతూ ఇన్ఫెక్షన్కు గురై చనిపోతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా చర్శంలోకి ప్రవేశించి కండరాల తొడుకు ఉండే ఆరోగ్యకరమైన కణజాలాన్ని నాశనం చేస్తుంది. పాపం ఆ ఘటన కారణంగా ఆడమ్స్ ఆస్పత్రికి సందర్శించాల్సి వచ్చింది. అక్కడ వైద్యలు ఈ విషయాన్నే ఆడమ్స్ తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్స చేయలని లేదంటే ప్రాణాంతకమని చెప్పారు. కుక్క కాటు కంటే మనిషి కాటు ఎంత ప్రమాదమో వైద్యులు అతనికి వివరించి చెప్పారు. శస్త్ర చికిత్సలో ఆడమ్స్కి 70 శాతం కణజాలాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ శస్త్ర చికిత్స త్వరిత గతిన చేయకపోతే గనుక ఆడమ్స్ కాలుని కోల్పోవలసి ఉండేది. అతను కోలుకోవడానికి మూడు వారాలు పడితే..పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. దీంతో ఆడమ్స్ ఈ భయానక ఘటన నుంచి కోలుకునేలా చేసిన వైద్యులకు రుణపడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆడమ్స్. కుక్క కాటు కన్న మనిషిక కాటు ఇంతా భయానకంగా ఉంటుందని తాను అస్సలు అనుకోలేదని వాపోయాడు. అందుక సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్) -
అధ్యక్ష రేసులో ఆయన.. ట్విటర్ అతలాకుతలం
శాన్ ఫ్రాన్సిస్కో: ఆయన అగ్రరాజ్యం అధ్యక్ష రేసుపై ఆసక్తి ప్రకటించాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని తెలిపాడు. అయితే అందుకు ఆయన ఎంచుకున్న వేదిక.. అవతలి నుంచి సంభాషణ జరిపిన వ్యక్తి.. తదితర కారణాలతో సోషల్ మీడియా అతలాకుతలం అయ్యింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం ప్రారంభించారు. అమెరికా పునర్వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారాయన. సారథ్యం వహించే ధైర్యం కావాలి, గెలిచే శక్తి ఉండాలి అంటూ తన ప్రచార నినాదాన్ని సైతం ప్రకటించారాయన. అయితే.. ఆ సమయంలో ట్విటర్ క్రాష్ అయిపోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బిడ్ను ధృవీకరిస్తూ ఫెడరల్ ఎన్నికల అధికారులకు నామినీ పత్రాలను సమర్పించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్కు పోటీగా.. రాన్ సైతం బిడ్లో నిలిచినట్లయ్యింది. ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్తో కలిసి లైవ్ ఆడియో ఛాట్లో పాల్గొన్నారు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్. ఆరున్నర లక్షల మందికిపైగా ఆ సంభాషణను లైవ్లో విన్నారు. ఇంకేం.. ఆ సమయంలో ట్విటర్ పదే పదే క్రాష్ అయ్యింది. I’m running for president to lead our Great American Comeback. pic.twitter.com/YmkWkLaVDg — Ron DeSantis (@RonDeSantis) May 24, 2023 గతేడాది అక్టోబర్లో ఎలన్ మస్క్.. ట్విటర్ను టేకోవర్ చేశాడు. ఆ సమయంలోనే వేలమందిని తొలగించాడు. వాళ్లలో బగ్స్ను ఫిక్స్ చేసే ఇంజినీర్లు సైతం ఉండడం గమనార్హం. ఒకేసారి ట్విటర్పై లక్షల్లో యూజర్లు ఎగబడినప్పుడు.. ఆ హెవీ ట్రాఫిక్ కారణంగా ఇలాంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ట్విటర్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇది ఆరోసారి. Ron DeSantis fought against President Donald Trump's America First agenda while in Washington. pic.twitter.com/YytIGaSjyX — MAGA War Room (@MAGAIncWarRoom) May 24, 2023 అయితే.. ఈ ప్రభావం ట్విటర్ను ముందు ముందు దారుణంగా దెబ్బ తీయొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అదే టైంలో.. #FailuretoLaunch #Crashed, #DeSaster లాంటి హ్యాష్ట్యాగ్లు ట్విటర్ విషయంలో ట్రెండ్ అవుతుండడం గమనార్హం. -
ప్రపంచంలోనే అతి పొట్టి శునకం.. ఎత్తు 3.5 అంగుళాలే..!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతి చిన్న శుకనంగా అమెరికా ఫ్లోరిడాకు చెందిన 'పర్ల్' అనే ఆడ శునకం నిలిచింది. ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న శునకాల్లో ఇదే అత్యంత పొట్టిది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కూడా దక్కించుకుంది. చిహువాహువా బ్రీడ్కు చెందిన ఈ బుల్లి శునకం వయసు రెండేళ్లు. ఎత్తు 3.59 అంగుళాలు. పొడవు 5 అంగుళాలు. అంటే టీ కుప్పు సైజులో ఉంటుంది. ఇది పుట్టినప్పుడు ఔన్సు బరువు కంటే తక్కువ ఉండటం గమనార్హం. గతంలో గిన్నిస్ రికార్డు సృష్టించిన మిరాకిల్ మిల్లీ సోదరే దీనికి జన్మనివ్వడం మరో విశేషం. 2020లో మిల్లీ చనిపోయింది. మరో ప్రత్యేక ఏంటంటే ఈ రెండు శునకాల యజమాని కూడా ఒక్కరే. ఆమే ఫ్లోరిడాలోని వనేసా సెమ్లర్. పర్ల్ చాలా యాక్టివ్గా ఉంటుందని, చికెన్, సాల్మన్ ఫిష్ను చాలా ఇష్టంగా తింటుందని సెమ్లర్ చెప్పుకొచ్చారు. రోజుకు నాలుగు సార్లు దీనికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై కేఫ్లు కన్పిస్తే వాటి ముందు అరుస్తుందని, దానికి క్రీమ్ ఇచ్చేంతవరకు అలాగే మొరుగుతుందని వివరించారు. కాగా.. గతంలో ప్రపంచంలో అతి పొట్టి శునకంగా బ్రిటన్కు చెందిన యార్క్షైర్ టెర్రియర్ ఉండేది. దీని ఎత్తు 2.8 అంగుళాలే. పొడవు 3.75 అంగుళాలు. అయితే ఈ శునకం 1945లో చనిపోయింది. ఇంతకంటే పొట్టి శునకాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. చదవండి: 92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులు.. ఇక చాలు అంటూ.. -
క్లాస్మేట్ను 114 సార్లు పొడిచాడు
ఫ్లోరిడా: అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్లేకు చెందిన అయ్డెన్ ఫుస్సి అనే 13 ఏళ్ల బాలుడు తోటి విద్యార్థినిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు. ఏకంగా 114 సార్లు పొడిచి చంపాడు! అకారణంగా ఈ అమానుషానికి పాల్పడ్డ బాలునికి కోర్టు 40 ఏళ్ల జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన 2021లో జరిగింది. తన క్లాస్మేట్, చీర్ లీడర్ అయిన ట్రిస్టిన్ బైలీ (13)ని ఫుస్సి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొట్టన పెట్టుకున్నాడు. కేవలం ఎవరో ఒకరిని చంపాలనే ఉద్దేశంతోనే, ముందస్తు ప్రణాళిక ప్రకారమే అతనీ దారుణానికి ఒడిగట్టినట్లు జడ్జి చెప్పారు. -
భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..
మొసళ్లకు సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. అవి ఎంత క్రూరంగా దాడి చేస్తాయో కూడా చూశాం. అంతెందుకు సరదాగా చూడటానికి వచ్చిన ఒక పర్యాటకుడిపై మొసలి ఎలా దాడి చేసి గాయపరిచిందో వంటి పలు ఘటనలు చూశాం. అయినా సరే కొంతమంది నిర్లక్ష్యంగానే ఉంటారు. అచ్చం అలానే ఇక్కడొక జంట ఎంత నిర్లక్ష్యంగా అంటే.. ఆ మొసళ్లు ఉన్న నదిలోకే వెళ్లి వాటిని పిలిచి మరీ ఆహారం పెడుతున్నారు. ఏదో పెంపుడు కుక్కకు పెట్టినట్లుగా పెట్టాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బుచ్, పెగ్గి అనే ఒక జంట నదిలో కూర్చొని దూరం నుంచి వస్తున్న మొసళ్లును పిలుస్తూ చేతులూ ఊపాడు. ఆ తర్వాత వాటికి పంది మాంసంతో తయారు చేసిన శాండ్విచ్లు నేరుగా చేతితో తినిపిస్తున్నాడు. ఒకవేళ దాడి చేసి ఉంటే పరిస్థితి ఇక అంతే. పైగా వారు నీళ్లలోనే ఉన్నారు తప్పించుకునే అవకాశం కూడా లేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు.. ఏం భయ్యా మరి ఇంత బలుపేంటి అంటూ ఫైర్ అయ్యారు. అయినా ఫ్లోరిడాలో ఇలాంటివి నేరం దుష్ప్రవర్తన కింది పరిగణించి చర్యలు తీసుకుంటుందని తెలిసి కూడా ఇలా చేస్తారా మీరు అంటూ తిట్టిపోశారు. View this post on Instagram A post shared by Only In Florida (@onlyinfloridaa) (చదవండి: పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్) -
నూలుపోగు లేకుండా వీధుల్లో హల్చల్.. వేరే గ్రహం నుంచి..
ఓ వ్యక్తి నులుపోగులేకుండా వీధుల్లో హల్చల్ చేశాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పైగా తాను వేరే గ్రహం నుంచి వచ్చానని చెబుతున్నాడు. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాలోని పామ్బీచ్లో నగ్నంగా ఓ వ్యక్తి వీధుల్లో హల్చల్ చేశాడు. ఓ దుకాణం వద్దకు నగ్నంగా నడుచుకుంటూ వస్తున్న ఆ వ్యక్తిని చూసి.. భయపడిన ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. ఐతే ఆ వ్యక్తి బట్టలు ఎక్కడ వదిలేశానో తెలియదని విచిత్రమైన సమాధానం చెప్పాడు. తన పేరు, పుట్టిన తేది చెప్పేందుకు కూడా నిరాకరించాడు. అతను ఏ రాష్ట్రం నుంచి వచ్చాడని వాకాబు చేసేన, ఐడీ కార్డు గురించి అడిగినా..ఏమి లేవు, తెలియదు అనే బదులిస్తున్నాడు ఆ వ్యక్తి. దీంతో పోలీసులు ఆ వ్యక్తి గురించి ముమ్మరంగా విచారించి..అతను 44 ఏళ్ల జాసన్ స్మిత్గా గుర్తించారు. పైగా తాను వేరే గ్రహం నుంచి వస్తున్నట్లు ఏవేవో కథలు చెబుతున్నాడు. ఐతే పోలీసులు అతనిపై బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణలు మోపి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: గన్ కల్చర్పై విరుచుకుపడ్డ ప్రభుత్వం..ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు..) -
వన్వెబ్ 40 ఉపగ్రహాల ప్రయోగం..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్వెబ్ తాజా స్పేస్ఎక్స్తో కలిసి 40 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని ప్రయోగించినట్లు వివరించింది. దీంతో తాము మొత్తం 582 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లయిందని పేర్కొంది. కనెక్టివిటీ సామర్థ్యాలను పెంచుకోవడంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయని వన్వెబ్ సీఈవో నీల్ మాస్టర్సన్ తెలిపారు. -
కలకలం రేపుతున్న కొత్త వ్యాధి.. నీటితో జాగ్రత్త.. సోకితే బతకడం కష్టమే!
ఇప్పటికే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడు ఆ వైరస్ దెబ్బ నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. అయితే అక్కడక్కడ వెలుగుచూస్తున్న కొత్త వైరస్లు, ఇన్ఫెక్షన్లు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఫ్లోరిడాలో ఓ వ్యక్తి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్లోరిడాలోని షార్లెట్ కౌంటీలో ఒక వ్యక్తి తన ముక్కును పంపు నీటితో కడుక్కోవడంతో వైరస్ సోకి మరణించినట్లుగా ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. అరుదైన వ్యాధి.. సోకితే కష్టమే! బ్రెయిన్ తినే అమీబా అయిన నేగ్లేరియా ఫౌలెరీ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ధృవీకరించింది. ఇది నీటి ద్వారా మనుషులకు సోకుతుందని, ఈ క్రమంలో ప్రజలు వైరస్ బారినపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. సీడీసీ ప్రకారం, నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వెచ్చని మంచినీటిలో నివసించే ఒక అమీబా (ఏకకణ జీవి). ఇదొక అరుదైన ఇన్ఫెక్షన్. కలుషితమైన నీరు ద్వారా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది. ఈ అమీబా సోకితే మెదడుని తినేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ (అమీబా) ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతుంది. అక్కడ అది జీవి మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది, ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే హానికరమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. దీని సంక్రమణ ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణాలు తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మానసిక సమతుల్యత దెబ్బతినడం వంటివి కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే కోమాకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 154 మందిలో బయటపడింది కేవలం నలుగురు ఈ వ్యాధి బారిన పడిన వారిలో 97 శాతం మంది మరణించారని, 1962-2021 మధ్య కాలంలో యూఎస్లో 154 మందిలో కేవలం నలుగురు రోగులు మాత్రమే ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారని రికార్డులు చెబుతున్నాయి. షార్లెట్ కౌంటీ నివాసితులందరూ నీటిని ఉపయోగించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని మరిగించి ఆ తర్వాత ఉపయోగించాలని అధికారులు చెబుతున్నారు. చదవండి: టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్! -
ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!
కొన్ని దేశాల్లో చిన్న నేరాలకే పెద్ద పెద్ధ శిక్షలు విధిస్తారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారా? లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ ఆ శిక్షలు చూస్తే మనకే చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిందితుడు చేసింది నేరంగా పరిగణించేది కాకపోయినా..ఘోరమైన శిక్షలు విధిస్తుంటారు. అచ్చం అలానే 65 ఏళ్ల వృద్ధుడు దారుణమైన శిక్ష ఎదర్కొంటున్నాడు. అతడు చేసిన నేరం, పడిన శిక్ష! చూస్తే ఏంటిదీ?.. అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన 64 ఏళ్ల డేవిడ్ షెర్మాన్ పావెలన్స్ అనే వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేశారు. పైగా అతడిపై ఘోరమైన ఆరోపణలు చేస్తూ.. సీరియస్ కేసుగా నమోదు చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. తన సోదరుడి ముఖంపై కూల్ వాటర్ని పోశాడు. రెండు గ్లాస్ల వాటర్ని అతని ముఖంపై పోసి తనని చనిపోయేలా భయబ్రాంతులకు గురి చేశాడంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే అందువల్ల అతనికి ఎలాంటి హాని గానీ, గాయాలు గానీ కాలేదు. షెర్మాన్ చర్యకు తాను చాలా భయపడిపోయానంటూ కేసు నమోదు చేయించాడు. ఆ వృద్ధుడిని ఈ విషయమై విచారించగా.. ఫ్రిజ్లో ' కీ లైం పై' అనే కేకులాంటి స్వీట్ తినేందుకు అలా చేశానని చెబుతున్నాడు. ఆ స్వీట్ని తన సోదరుడు చాలా రోజులుగా ఫ్రిజ్లో ఉంచాడని, తనకు తినాలనిపించడంతో సోదరుడికి తెలియకుండా తినేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, తాను సోదరుడిని కూల్ చేసేందుకు చల్లటి వాటర్ అతడి నెత్తిమీద నుంచి పోసినట్లు తెలిపాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న షెర్మాన్ సోదరుడు అతడిని కటకటాల పాలు చేశాడు. అతను గనుక నేరం చేసినట్లు తేలితే గనుక అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష తోపాటు పెద్ద మొత్తంలో జరిమాన కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారుల కూడా అతడి దూకుడు ప్రవర్తన ఇతరుల ప్రాణాలను ప్రమాదకరంగా ఉందంటూ త్రీవమైన కేసుగా పరిగణించి మరీ నమోదు చేయడం గమనార్హం. Florida Man Faces Up to 30 Years for Dumping Water on Older Brother in Argument Over Key Lime Pie https://t.co/jYkWyrPF71 pic.twitter.com/4P2FVbtQVC — Florida Man (@FloridaMan__) February 24, 2023 (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
Video: జిమ్లో యువతిపై అత్యాచారయత్నం.. నీచుడితో ఎలా పోరాడిందో చూడండి
జిమ్లో కసరత్తులు చేస్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. జిమ్లోకి ప్రవేశించిన వ్యక్తి యువతి వద్దకు వచ్చి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. అగంతకుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తన శక్తికి మంచి ప్రయత్నించింది. కామాంధుడికి భయపడకుండా ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. జనవరి 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని టంపా నగరానికి చెందిన నషాలి అల్మా అనే 24 ఏళ్ల యువతి ఫిట్నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్. తన అపార్ట్మెంట్లోని జిమ్లో వ్యాయామం చేస్తుంది. ఆ సమయంలో అక్కడ ఆమె ఒక్కతే ఉంది. ఇంతలో ఎవరో వ్యక్తి జిమ్లోకి వచ్చాడు. కొద్దిసేపు ఏదో పనిచేసుకుంటున్న నటిస్తూ అనంతరం వ్యాయామం చేసుకుంటున్న యువతి వద్దకు వచ్చాడు. ఆమెను బంధించడానికి ప్రయత్నించాడు. గట్టిగా పట్టుకొని నేలమీద పడేసి లైంగికదాడికి ప్రయత్నించాడు. అయితే కామాంధుడికి చిక్కకుండా గట్టిగానే పోరాడింది నషాలి. భయపడకుండా ధైర్యంగా అతని బారి నుంచి తనను తాను రక్షించుకుంది. ఈ దృశ్యాలన్నీ జిమ్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు యువతి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. అలాగే ఆ నీచుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hillsborough County Sheriff (@hcsosheriff) తనకు జరిగిన ఘోర అనుభవంపై బాధితురాలు మాట్లాడుతూ..‘ అతను నా వద్దకు రాగానే నేను దూరంగా తోశాను. ఏం చేస్తున్నావ్, దూరంగా వెళ్లు, నన్ను తాకడం ఆపు అని అరిచాను. అయినా తను వినలేదు. నా బలవంతం చేశాడు. తనకు దొరకకుండా ప్రయత్నించాను. అతనికి ఎదురు తిరిగి ధైర్యంగా పోరాడాను. చివరకు తను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని తెలిపింది. కాగా నిందితుడిని జేవియర్ థామస్-జోన్స్గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
బ్రెజిల్ రణరంగం: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత
ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో. 67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్లో చేరినట్లు బ్రెజిల్కు చెంది ఓ గ్లోబో న్యూస్పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. - Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos. - Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA. - Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc — Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023 మద్దతుదారుల దురాక్రమణ.. బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన -
షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ పామును విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా ఎంట్రెన్స్ గేటు వద్ద తప్పించుకుని విమానాశ్రయంలోకి వెళ్లినప్పటికీ ఎక్స్-రే మెచీన్ వద్ద దొరికిపోయింది. బ్యాగును స్కాన్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది లోపల పామును చూసి షాక్ అయ్యారు. ఫ్లోరిడాలోని టాంపా ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ మహిళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది 'బోవా కన్స్ట్రిక్టర్' పామును. ఇది పిల్ల పాము. 4 అడుగులుంది. దీనికి ఎమోషనల్గా దగ్గరయ్యానని, అందుకే పెంచుకునేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు మహిళ చెప్పింది. ఈ పాముకు 'బార్తోలోమ్యూ' అని ముద్దుపేరు కూడా పెట్టుకుంది. బోవా కన్స్ట్రిక్టర్ పాములు చూడటానికి కొండచిలువలా కన్పిస్తాయి. ఇవి 13 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ పాము విషపూరితం కానందు వల్ల అమెరికాలో చాలా మంది వీటిని సరదాగా ఇళ్లలోనే పెంపుడు జంతువుల్లా చూసుకుంటారు. చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం.. -
3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..
వాషింగ్టన్: ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్లో పాస్తా ఉడకలేదని ఫుడ్ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది. ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్... క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదని, ప్యాక్పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. చదవండి: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా! -
బాయ్ఫ్రెండ్ను పెళ్లాడిన ట్రంప్ కూతురు.. ఫోటోలు వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో తన ప్రియుడు మైఖెల్ బౌలోస్ను(25) పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమాయాణం అనంతరం బాయ్ఫ్రెండ్ను పెళ్లాడింది. ట్రంప్కు చెందిన మార్ ఏ లాగో క్లబ్ ఈ వేడుకకు వేదికగా మారింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయత్రం 4.30 నిమిషాలకు వివాహం జరిగింది. పెళ్లిలో తెలుపు రంగు గౌను ధరించి మెరిసిపోయారు టిఫానీ. ట్రంప్ దగ్గరుండి ఈ పెళ్లిని జరిపించారు. కూతురుని అప్యాయంగా వివాహ వేదికకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ముద్దుపెట్టి..వరుడు చేతికి వధువు చేతిని అందించారు. ఈ వేడుకకు ట్రంప్ కుటుంబమంతా హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. వీరిలో ట్రంప్ భార్య మెలానియా, మరో కూతురు ఇవాంక, ఆమె భర్త జేర్డ్ కుష్నర్, జూనియర్ డొనాల్డ్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, బారన్ ట్రంప్ ఉన్నారు. 2018లో టిఫానీ, మైఖెల్కు పరిచయం ఏర్పడగా.. ఏడాదికి 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేశారు. 2021 జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పదవి నుంచి తొలగిపోయే ముందు బాయ్ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ చేసుకన్నట్లు టిఫానీ ప్రకటించింది. కాగా డొనాల్డ్ ట్రంప్.. ఆయన రెండో భార్య, నటి మార్ల మాపుల్స్ ఏకైక కూతురే టిఫానీ. 1993లో మర్లను ట్రంప్ వివాహమాడగా 1999 వరకు వీరు భార్యభర్తలుగా కొనసాగారు. అనంతరం విడాకులు తీసుకున్నారు. -
Viral Video: కొండచిలువ పాలిట క్రొక‘డై’ల్
కొండచిలువలు భారీ ఆకారంతో పొడవుగా ఉండి.. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయన్న విషయం తెలిసిందే. ఏ జంతువునైనా పూర్తిగా చుట్టేసి ఊపిరిడాకుండా చేసి చంపేస్తాయి. అయితే అప్పుడప్పుడు ఇదే కొండచిలువకు కొన్నిసార్లు మృత్యుపాశంగా మారుతుంటాయి. మింగిన జంతువులను జీర్ణించుకోలేక, కక్కలేక అవస్థపడి చివరికి అవు ప్రాణాలు విడుస్తాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ‘ఆశ లావు.. పీక సన్నం’ సామెత ఈ 18 అడుగుల బర్మీస్ పైథాన్కు అక్షరాలా వర్తిస్తుంది. కొండచిలువ అంటే ఏదో చిన్న జింకలు, కుందేళ్లు లాంటి వాటిని మింగాలి కానీ.. ఏదో 18 అడుగులు ఉన్నాం కదా అని.. ఐదడుగుల పొడవున్న భారీ మొసలిని మింగేసింది. చివరికి జీర్ణించుకునే శక్తి లేక కీర్తిశేషుల జాబితాలో కలిసిపోయింది. దీని కడుపులోంచి చనిపోయిన మొసలిని జియోసైంటిస్ట్ రూసీ మూరే, సైంటిస్టుల బృందం బయటకు తీసింది. ఫ్లోరిడాలో ల్యాబ్లో ఈ మొసలిని తీస్తున్న దృశ్యాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశారు మూరే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ.. షాకింగ్ వీడియో -
చికెన్లో గన్.. ఎయిర్పోర్ట్ అధికారులు షాక్!
ఇంతవరకు కొంతమంది నేరస్తులు రకరకాల మార్గాల్లో ఆయుధాలను, బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కంటపడకుండా తరలిస్తుంటారని తెలుసు. కొంతమంది విగ్గుల్లోనూ, షూ, పెన్ వంటి విచిత్రమైన ప్రదేశాల్లో చాలా గమ్మత్తుగా బంగారాన్ని తరలించడం చూశాం. అలాగే ఆయుధాలను కూడా చాలా వెరైటీగా తరలిస్తుంటారు. ఐతే ఇక్కడొక వ్యక్తి వారందరికంటే భిన్నంగా ఆయుధాన్ని తరలించే యత్నం చేసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...యూఎస్లోని ఒక వ్యక్తి చికెన్లో గన్ని స్టఫ్ చేసి చక్కగా ప్యాకింగ్ చేసుకుని ఫ్లోరిడాలో లాడర్డేల్ హాలీవుడ్ విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడ అందరీ ప్రయాణికులను తనిఖీ చేసినట్లుగానే ఇతన్ని తనిఖీ చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. అతని వద్ద ఉన్న ప్యాకింగ్ చికెన్ని చూసి కాస్త ఆశ్చర్యంతోపాటు సందేహం కూడా వచ్చింది అధికారులకు. దీంతో ఆ ప్యాకింగ్ కవర్ని ఓపెన్ చూసి పరిశీలించగా...ఆ చికెన్ లోపల గన్ని కుక్కి ఉంచాడాన్ని చూసి ఒక్కసారిగా అధికారులు షాక్కి గురయ్యారు. ఇంతవరకు తాము వివిధ రకాల్లో ఆయుధాలను తరలించడం చూశాం గానీ ఇలా ఇంత వింతగా తరలించేందుకు యత్నించడం చూసి ఆశ్చర్యపోయాం అన్నారు. దీంతో సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఎయిర్పోర్ట్ పోలీసులు. వాస్తవానికి యూఎస్ ఎయిర్లైన్స్లో తుపాకీలను నిషేధించ లేదు. కానీ ప్రయాణికులు వాటిని తీసుకుని వెళ్లేటప్పుడూ..తనిఖీ చేసే సామానుల్లోనే తీసుకువెళ్లాలి. పైగా ఆ తుపాకీలను అన్లోడ్ చేసి హార్డ్ కంటైనర్లో లాక్ చేసి పట్టుకెళ్లాలి. ఇలా అక్రమ మార్గంలో తరలించేందుకు యత్నిస్తే మాత్రం పోలీసులు కచ్చితంగా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. There’s a personal fowl here. Our officers @FLLFlyer made this very raw find. We hate to break it to you but stuffing a firearm in your holiday bird for travel is just a baste of time. So, don’t wing it, you'll find all the proper packaging info here: https://t.co/Zm2XnorDx7 pic.twitter.com/BpdbEwwouX — TSA (@TSA) November 7, 2022 (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
48 ఏళ్లుగా.. అంతుచిక్కని ‘దెయ్యపు’ బొమ్మ!!
ఒక బొమ్మ.. దానిని ఇష్టపడే వ్యక్తులు. కానీ, అన్యాయంగా చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ అందులో దూరి.. అందరికీ వణుకు పుట్టిస్తూ ఉంటుంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. అన్ని భాషల్లో ఈ స్టోరీ లైన్తో బొమ్మల్ని బేస్ చేసుకుని బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే నిజజీవితంలోనూ అమ్మో బొమ్మ తరహా కథలు ప్రచారంలో ఉండడం మీరెప్పుడైనా విన్నారా? రాబర్ట్.. హాంటెడ్ డాల్. అలా ఇలా కాదు.. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన బొమ్మ అదట. 1994 నుంచి యూఎస్ స్టేట్ ఫ్లోరిడా కీ వెస్ట్లోని ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో అది ఉంటోంది. ఒక చిన్నారికి నావికుడి గెటప్ వేసినట్లు ఉండే ఆ బొమ్మ.. చేతిలో మరో బొమ్మను పట్టుకున్నట్లు ఉంటుంది. అయితే ఈ బొమ్మ వల్లే ఎన్నో అనర్థాలు జరిగాయనే ప్రచారం.. ఇదొక దెయ్యం బొమ్మనే ముద్రను వేశాయి. 1904 సంవత్సరంలో కీ వెస్ట్కి చెందిన రాబర్ట్ ఎయుజెనె ఒట్టో అనే చిన్నారికి బర్త్డే గిఫ్ట్గా.. అతని తాత జర్మనీ నుంచి తీసుకొచ్చి మరీ ఈ బొమ్మను కానుకగా తీసుకొచ్చాడు. రాబర్ట్ ఆ బొమ్మను ఎంతగా ప్రేమించాడంటే.. దానికి కూడా తన పేరే పెట్టుకున్నాడు. పెద్దయ్యాక కూడా దాన్ని అతను వదల్లేదట. చివరికి ప్రాణం పోయే సమయంలోనూ ఆయన హత్తుకుని పడుకున్నాడని ఆ బొమ్మ హిస్టరీ నోట్లో పేర్కొని ఉంటుంది. అయితే.. 118 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బొమ్మ ఆ తర్వాత వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. కానీ.. రాబర్ట్ బొమ్మ వేరే వాళ్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు.. ఏదో ఒక అపశ్రుతి జరిగేదన్న వాదన ఒకటి ఉంది. ప్రమాదాలు జరగడం, గాయాలు, ఎముకలు విరిగిపోవడాలు, విడాకులు.. ఇలా ఏదో ఒక చెడు జరిగేదన్న నమ్మకం ముద్రపడిపోయింది. 1974లో రాబర్ట్ ఒట్టో కన్నుమూశాడు. రెండేళ్ల తర్వాత అతని భార్య సైతం చనిపోయింది. ఆ తర్వాత కీవెస్ట్ ఈయేటన్ స్ట్రీట్లోని వాళ్ల ఇంట్లో ఆ బొమ్మ అలాగే ఉండిపోయింది. మైర్టెల్ రూటర్ అనే వ్యక్తి 20 ఏళ్ల పాటు ఆ ఇంటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆపై మరొకరికి దానిని అమ్మేయగా.. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ గెస్ట్ హౌజ్గా మార్చేశారు. అయితే.. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. రాబర్ట్ మరణం తర్వాతే ఈ అనుభవాలు ఎదురయ్యాయని చాలా మంది అంటున్నారు. అదీ దానిని సరిగ్గా పట్టించుకోని తరుణంలోనేనట. దీంతో దానికి అతీత శక్తులు ఉన్నాయని, దాని వల్ల ఏదో ఒక అనర్థం జరిగేదన్న నమ్మకం బలంగా స్థిరపడింది స్థానికుల్లో. దీంతో 1994లో ఆ బొమ్మను భద్రంగా ఉంచేందుకు కీ వెస్ట్లో ఉన్న మ్యూజియానికి అప్పజెప్పారు. అప్పటి నుంచి అదొక టూరిస్ట్ ఎట్రాక్షన్గా మారిపోయింది. అయితే అక్టోబర్లో మాత్రం దీనికి ఓల్డ్ పోస్టాఫీస్కు తరలిస్తుంటారు ఎందుకనో!. రకరకాల కథలు.. రాబర్ట్ బొమ్మ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. దానిలో ఏదో శక్తి దాగి ఉందని, అప్పుడప్పుడు ముఖకవళికలు మారుస్తుందని, ఒక్కోసారి విచిత్రమైన శబ్దాలు చేస్తుందని కొందరు చెప్తుంటారు. అంతేకాదు.. గతంలో అది మాయమై .. మరొచోట ప్రత్యక్షమైన సందర్భాలు కూడా ఉన్నాయట. ఏదేమైనా ఆ బొమ్మకు మంచి స్థానం కల్పించకపోతే కోపం వచ్చి ఏదో ఒక చెడు చేస్తుందనే నమ్మకం బలంగా ముద్రపడడంతో.. ఇప్పటికీ దానిని భద్రంగా చూసుకుంటున్నారు. ఈ బొమ్మ కథను ఆసరాగా చేసుకునే రాబర్ట్ సిరీస్లో నాలుగు సినిమాలొచ్చాయి కూడా. అలా ఓ సాధారణ బొమ్మ.. దెయ్యపు బొమ్మగా మ్యూజియంలో సకల మర్యాదలు అందుకుంటోంది. -
రేయ్.. అది పెళ్లామో.. గర్ల్ ఫ్రెండో కాదు!
పుర్రెకో బుద్ధి.. మనిషి తీరు ఒక్కోసారి బహు విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదుగానీ.. కొన్ని పనులు మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే 15 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న ఓ ట్విట్టర్ వీడియో. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇలా మొసలితో రొమాంటిక్ డ్యాన్స్ చేసినట్లు విపరీతంగా వైరల్ అవుతోంది. విచిత్ర ధోరణితో ఫ్లోరిడా ప్రజలు వార్తల్లోకి ఎక్కుతారనే ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో సరదాగా వైరల్ అవుతుంటుంది. ఆ కోవకు చెందిన ఓ వ్యక్తే.. అంటూ బోర్న్ఏకాంగ్ అనే ట్విట్టర్ థ్రెడ్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయ్యింది. అంతేకాదు.. ఈ వీడియో గతంలోనూ వైరల్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్లోకి వచ్చింది. నమ్మశక్యంగా అనిపించని ఆ సరదా వీడియోను మీరూ చూసేయండి.. Florida man strikes again pic.twitter.com/MAgGnFkymk — Lance🇱🇨 (@BornAKang) October 18, 2022 వీడియో ఒక ఎత్తయితే.. ఆ వీడియో కింద కనిపించే కామెంట్లు మరో ఎత్తు. అది పెళ్లామో .. గర్ల్ఫ్రెండో కాదని, మొసలికి నీళ్లలో బలం ఎక్కువని, తేడా వస్తే పని అంతేఅని కొందరు.. ఆ మొసలికి అతను బాగా నచ్చి ఉంటాడని మరికొందరు.. ఇలా కామెంట్ల పర్వం హిలేరియస్గా ఉంది. -
Ned Davis Research: ముంచుకొస్తున్న మాంద్యం
ప్రపంచాన్ని మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసేలా కన్పిస్తోంది. కరోనా దెబ్బ నుంచి కోలుకోకముందే వచ్చిపడ్డ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తదితరాలతో ఆర్థిక వృద్ధి క్రమంగా కుంటుపడుతూ ప్రధాన దేశాలన్నీ మాంద్యం వైపు అడుగులేస్తున్నాయి.... (డి.శ్రీనివాసరెడ్డి) ప్రపంచం ఆర్థిక మాంద్యం బారిన పడటం ఖాయమని ఫ్లోరిడాకు చెందిన నెడ్ డేవిస్ రీసెర్చ్ చెబుతోంది. మాంద్యాన్ని అంచనా వేయడంలో ఈ సంస్థ అందెవేసిన చేయి. దాని లెక్క ప్రకారం వచ్చే ఏడాదికల్లా ప్రపంచం మాంద్యం గుప్పెట్లో చిక్కేందుకు 98.1 శాతం ఆస్కారముంది. వాల్స్ట్రీట్ జర్నల్ జూలైలో చేసిన సర్వేలో మాంద్యం తప్పదని 49 శాతం ఆర్థికవేత్తలు పేర్కొనగా అక్టోబర్లో వారి సంఖ్య 63 శాతానికి పెరిగింది! 12 నెలల్లోపే అమెరికా మాంద్యం కోరల్లో చిక్కడం ఖాయమని సర్వే తేల్చింది. వర్ధమాన దేశాలపై ఇది సుదీర్ఘ ప్రభావమే చూపవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్ఫాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, యుద్ధం, వాతావరణ విపరణామాలు ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎండీ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు. కుంటినడకన ఆర్థికం... చాలా దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు నానాటికీ పడిపోతోంది. 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి రేటు 6.1 శాతముంటే 2023 నాటికి ఏకంగా సగానికి సగం పడిపోయి 3.2 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సంపన్న దేశాల ఆర్థిక వృద్ధి కూడా నేల చూపులే చూస్తోంది. యూరప్ జీడీపీ 1.2 శాతానికి, బ్రిటన్ కేవలం 0.3, ఫ్రాన్స్ 0.7కు పరిమితం కావచ్చని అంచనా. సవరించిన వృద్ధి రేట్ల ప్రకారం చూసినా అమెరికా 1 శాతం, చైనా 3.2 శాతంతో సరిపెట్టుకునేలా ఉన్నాయి. 2016తో పోలిస్తే ప్రపంచ జీడీపీ 23 శాతం పెరగాలన్నది అంచనా కాగా కరోనా, యుద్ధం తదితరాల దెబ్బకు 17 శాతానికే పరిమితమైంది. ఇలా పడిపోయిన ఉత్పాదకత విలువ ఏకంగా 17 లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచ ఆదాయంలో ఏకంగా 20 శాతం! ఎందుకీ దుస్థితి...? కరోనా, యుద్ధం నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోయిన ధరలకు కళ్లెం వేసేందుకు ఈ ఏడాది ఏకంగా 90 దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ దెబ్బకు ఉత్పాదకత తగ్గడంతో పెట్టుబడులు, వినియోగం పడిపోయి మాంద్యం ముంచుకొస్తోంది. ధరల అదుపు కోసమని పదేపదే వడ్డీ రేట్లు పెంచితే మాంద్యం బారిన పడక తప్పదని జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ పావ్లిన్ టియెన్ అన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుతో 90 దేశాల కరెన్సీ విలువలు పతనమయ్యాయి. గతేడాది 125.7గా ఉన్న ఆహారోత్పత్తుల ధరల సూచీ ఈ ఏడాది 146.94 పాయింట్లకు పెరిగింది. మాంద్యం దెబ్బకు కంపెనీలు నియామకాలకు కత్తెర వేస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత వచ్చే డిసెంబర్ నాటికి 3.7 శాతానికి, 2023 జూన్కల్లా 4.7కు పెరుగుతుందని అంచనా. మాంద్యమంటే... మామూలు పరిభాషలో వరుసగా రెండు త్రైమాసికాలు గనక జీడీపీ తిరోగమనంలో సాగితే ఆ దేశంలో మాంద్యంలోకి జారుకున్నట్టు పరిగణిస్తారు. ఇవీ సంకేతాలు... ► సుదీర్ఘంగా సాగేలా కన్పిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ► డాలర్ ముందు కుదేలవుతున్న అన్ని దేశాల కరెన్సీలు ► చుక్కలనంటుతున్న ద్రవ్యోల్బణం ► వడ్డీరేట్లను పెంచేస్తున్న అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ► నియామకాలు బాగా తగ్గిస్తున్న కార్పొరేట్ సంస్థలు ► నానాటికీ మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి మనకూ తిప్పలే... మన జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 6.8 శాతం ఉంటుందని, 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది మెరుగేనని కితాబిచ్చింది. కానీ మాంద్యం ఎఫెక్ట్ భారత్పైనా గట్టిగానే ఉంటుందని అంచనా. అమెరికాకు మన ఎగుమతులు 2011 10.1 శాతముంటే ఇప్పుడు 18.1 శాతానికి పెరిగాయి. మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఏకంగా 54.8 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. అగ్రరాజ్యం మాంద్యంలో చిక్కితే వీటిపై గట్టి ప్రభావమే పడుతుంది. మన విదేశీ మారక నిల్వలు వరుసగా తొమ్మిదో వారమూ తిరోగమన దిశలో ఉన్నట్టు అక్టోబర్ 7నాటి నివేదికలో రిజర్వ్ బ్యాంకే పేర్కొంది. అమెరికాతో భారత వాణిజ్య లోటు 3.8 శాతానికి ఎగబాకుతుందని అంచనా! -
విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్! కానీ...
చైన్స్నాచర్లు, పిక్ పాకెటర్స్ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్ పార్కింగ్ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్ డీన్గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు) -
ఫ్లోరిడాలో హరికేన్ విలయం.. వరదలో కొట్టుకుపోయిన రూ. 8 కోట్ల కారు
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్ హరికేన్ ప్రళయం సృష్టిస్తోంది. హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. రోడ్లన్నీ మునిగిపోయాయి. ఇంటి ముందు పార్క్చేసిన వాహనాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. 20 మంది వలసకారులతో కూడిన పడవ మునిగిపోవడంతో కొంతమంది అదృశ్యమైనట్లు యూఎస్ బార్డర్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. హరికేన్ పరిస్థితిని లైవ్లో ని వివరిస్తన్న రిపోర్టర్లు కొట్టుకొని పోయినంతపనైంది. వీధుల్లోకి షార్క్లు కొట్టుకొని వచ్చిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇయన్ హరికేన్ కారణంగా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్లో పార్క్ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్వయంగా యాజమాని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. మెక్లారెన్ కంపెనీకి చెందిన పీ1 సూపర్ కారు ఖరీదు అక్షరాలా 1 మిలియన్ డాలర్లు. ‘అంటే ఇండియాన్ కరెన్సీలో దాదాపు 8 కోట్లు). ఇంత ఖరీదైన లగ్జరీ నేపుల్స్ ప్రాంతంలో కారు వరద నీటిలో కట్టుకుపోయింది.ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఇప్పటి వరకు వేలల్లో లైకులు వచ్చి చేరాయి. చాలా మంది నెటిజన్లు కొట్టుకుపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘నన్ను క్షమించండి, ఇది చాలా బాధాకరం. ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి.. కారు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారికి మూడేళ్లు జైలు -
Hurricane Ian: అమెరికాలో హరికేన్ బీభత్సం.. ఫొటోలు, వీడియోలు వైరల్
సెయింట్ పీటర్స్బర్గ్: అమెరికాలో ఇయన్ హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా విలవిలలాడుతోంది. నైరుతి ఫ్లోరిడాలో హరికేన్ విధ్వంసం సృష్టిస్తోంది. గంటకి 241 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నీట మునిగిపోయాయి. వీధుల్లోకి షార్క్లు కొట్టుకొస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 25 లక్షల మంది కరెంట్ లేక తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన హరికేన్ ఇదేనని నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. టాంపా, ఒర్లాండో విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. వందల సంఖ్యలో మృతులు ఫ్లోరిడా కౌంటీ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. సహాయం కోసం తమకు ఆగకుండా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే కొన్ని కౌంటీలలోకి వెళ్లడానికి వీల్లేని పరిస్థితులున్నాయని తెలిపారు. ఇళ్లల్లోకి అయిదు అడుగుల మేరకు నీరు వచ్చి చేరినట్టుగా సమాచారం అందుతోందని చెబుతున్నారు. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. హరికేన్ వార్తల్ని కవర్ చేస్తున్న విలేకరులు పెనుగాలల ధాటికి నిలువలేక ఒరిగిపోతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. విద్యుత్ లేకపోవడం, సెల్ టవర్లు పనిచెయ్యకపోతూ ఉండడంతో సహాయ చర్యలు అందించడం కత్తి మీద సాములా మారింది. జాతీయ రక్షణ సిబ్బంది దాదాపుగా 5 వేల మందిని సహాయం కోసం ఫ్లోరిడా పంపినట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. హరికేన్ విధ్వంసం సృష్టించే ప్రాంతాల్ని తిరిగి పునర్నిర్మిస్తామని అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. 😥#Ianflorida pic.twitter.com/ccDcKKruyV — Elisabeth M G Halle (@ElisabethMGHal1) September 30, 2022 Estas imágenes aéreas corresponden a la localidad de Kissimmee, donde se encuentran los parques de Disney y Universal. Las inundaciones son gravísimas. #IanHurricane #IanRescue #Ianflorida pic.twitter.com/WhWtvSY0Gx — Conexión Con El Tiempo (@conexiontiempo) September 29, 2022 PLEASE PRAY FOR US 🙏 WE ARE GETTING POUNDED IN FLORIDA …#HurricaneIan #Ian #Ianflorida pic.twitter.com/Cf18P0fC8y — RightofOpinion ® (@RightofOpinion) September 28, 2022 #Shockingmoment house floats away in Naples during #HurricaneIan #IanHurricane #Ianflorida pic.twitter.com/itIsTa37Iu — 6IX WORLD NEWS (@6ixworldnews) September 29, 2022 #Video | Destruction and devastation in Florida, after Hurricane Ian ripped through the region.#IanHurricane #Ian #FloridaStorm #HurricaneIan #FloridaHurricane #Storm #Watch #ViralVideo #NCIBNewsNetwork #Florida #Ian2022 #Ianflorida #Stormsurge #Hurricane pic.twitter.com/YyT7XKaGVt — NCIB NEWS NETWORK (@NCIB_INDIA_NEWS) September 29, 2022 Spectaculaire élévation du niveau de la mer causée par l'ouragan #Ian à Fort Myers, Floride. (La dépression cyclonique aspire littéralement l'eau). pic.twitter.com/K4LyMo1atP — Mac Lesggy (@MacLesggy) September 29, 2022 Ian's impact on Fort Myers Beach, Florida. This is of Estero Boulevard. Video: Loni Architects. #IanHurricane #ian #Ianflorida pic.twitter.com/8ZyiecLxzv — Me (@Winner96455) September 28, 2022 People risk their lives swimming in Fort Myers during #hurricaneian #HurricanIan #Ianflorida pic.twitter.com/Trb2OpUfQS — 6IX WORLD NEWS (@6ixworldnews) September 28, 2022 #Video | Catastrophic footage of hurricane Ian in Florida, USA! #IanHurricane #Ian #FloridaStorm #HurricaneIan #Storm #Watch #ViralVideo #NCIBNewsNetwork #Florida #Ian2022 #Ianflorida pic.twitter.com/b5eNfjY3cO — NCIB NEWS NETWORK (@NCIB_INDIA_NEWS) September 29, 2022 This is what it looks like in North Naples this morning. Several cars are displaced, several trees knocked down. We are safe and the other guests we’ve seen at our hotel our safe. We’ve all been checking on each other. @winknews #HurricaneIan #Ianflorida #CollierCounty pic.twitter.com/6ZwKz34wkF — Annette Montgomery (@AnnettemTV) September 29, 2022 -
బీభత్సం సృష్టించనున్న ఇయాన్ తుపాన్...బలమైన గాలులతో కూడిన వర్షం
అతి పెద్ద తుపాను బుధవారం రాత్రికే బలపడనుందని గురువారం తెల్లవారుజామున తాకే అవకాశం ఉందని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) హెచ్చరించింది. ఈ తుపాన్ అమెరికాలోని మెక్సికో గల్ఫ్ మీదుగా పయనించి ఫ్లోరిడా రాష్ట్రం వైపుగా ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలో 1921 తర్వాత అదే స్థాయిలో ఈ తుపాను సంభవిస్తున్నట్లు పేర్కొంది. ఈ తుపానుకి ఇయాన్ తుపాన్గా నామకరణం చేశారు. ఈ ఇయాన్ తుపాను ఫ్లోరిడాలోని తుంబా ప్రాంతానికి తాకుతుందని తెలిపింది. ఇప్పటికే అమెరికాలోని క్యూబా ప్రాంతాన్ని ఈ తుపాన్ అంధకారంలోకి నెట్టినట్లు అధికారులు తెలిపారు. అదీగాక ఆ ప్రాంతంలో యూఎస్ జాతీయ తుఫాను కేంద్రం(ఎన్హెచ్సీ) ఐదవ ప్రమాదకర విపత్తుగా హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాదు అక్కడ ఉన్న ప్రజలను తరలించే పనులను ముమ్మరంగా చేపట్టింది. పైగా గంటకు 250 కి.మీ దూరం నంచి బలమైన గాలులుతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది. సుమారు రెండు అడుగుల మేర వర్షం కురిసే అవకాశ ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండు రోజుల వరకు ఈ తుపాను ప్రభావం ఉంటుందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికే సుమారు 2.5 మిలియన్ల మంది ప్రజలను తరలించినట్లు తెలిపారు. శాటిలైట్ సాయంతో సంగ్రహించిన ఐయాన్ తుపాన్ బలపడుతున్న వీడియోని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. As #HurricaneIan churns near Cuba, #GOESEast can see its distinct eye as well as #lightning flashing around the storm.#Ian is a major Category 3 #hurricane that is continuing to strengthen in the southeastern Gulf of Mexico. Latest: https://t.co/FYrreOueMf pic.twitter.com/Rh85xqu0Rt — NOAA Satellites (@NOAASatellites) September 27, 2022 (చదవండి: మిసైల్ దూకుడు పెంచిన ఉత్తరకొరియా.. షాక్లో యూఎస్, దక్షిణ కొరియా) -
వీడియో: గన్ పేలుతుందనగా మెరుపులా దూసుకొచ్చి..
తల్లాహస్సీ: పక్కడో ఏమైనా పర్వాలేదు.. మనం బాగుంటే చాలనుకునే సమాజం ఇది. అయితే అడపా దడపా జరిగే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మానవత్వం.. సాయ గుణం మనిషిలో ఇంకా మిగిలే ఉందని అనిపిస్తుంటుంది. తన ప్రాణాలను అడ్డుపెట్టి.. తల్లీకూతుళ్లను ఓ దొంగ నుంచి కాపాడాడు ఇక్కడ ఓ హీరో. ఫ్లోరిడా ఫోర్ట్ వాల్టన్ బీచ్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఓనర్ను తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆమె తన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. భయంతో కేకలు వేసింది. ఇక ఆమెను షూట్ చేయబోతున్నాడగా.. మెరుపు వేగంతో దూసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ దొంగ మీదకు దూకి పక్కకు నెట్టేసి.. ఆ కాల్పుల ఘటనను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అంతలో ఆ తల్లి అరుపులతో చుట్టుపక్కల వాళ్లు కొందరు గుమిగూడడంతో దొరికిపోవడం ఆ దొంగ వంతు అయ్యింది. సమాచారం అందుకున్న ఒకలూసా కౌంటీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు బ్యాటరీ దొంగతనం కోసమే అతను ఆ ఘాతుకానికి యత్నించినట్లు తేలింది. In reference to the FWB Chick-fil-A employee who ran to help a woman with a baby who was being carjacked, we want to say a sincere thank you to Ms. Kelner for providing video of a portion of the encounter. (see prior post). A major shout-out to this young man for his courage! pic.twitter.com/2Lcwe46azv — OkaloosaSheriff (@OCSOALERTS) September 14, 2022 ఇక కాపాడిన వ్యక్తి అక్కడే ఓ రెస్టారెంట్లో పని చేసే మైకేల్ గోర్డాన్గా గుర్తించారు. అక్కడే మరో కారులో కూర్చున్న వ్యక్తి.. ఆ ఘటనను వీడియో తీయడంతో ఆ సూపర్ హీరో ఉదంతం వెలుగు చూసింది. తల్లీబిడ్డలను కాపాడడంతో పాటు తమ రెస్టారెంట్కు మంచి పేరు తెచ్చినందుకు ఆ యాజమాన్యం.. గోర్డాన్ను అభినందించింది. సూపర్ హీరోలు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యే మంచి మనసున్న మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు. -
ఆర్టెమిస్ 1 ప్రయోగం నిలిపివేత.. ప్రకటించిన నాసా
తల్లాహస్సీ: నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్లో RS-25 ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల తొలుత కౌంట్డౌన్ గడియారం నిలిపివేసింది నాసా. అనంతరం సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఇవాళ(సోమవారం) ప్రయోగం ఉండదని.. తిరిగి ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ప్రకటించింది. ఇంజిన్ను ప్రయోగించే ముందు కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్తో బ్లీడ్ చేయవలసి ఉంది. అయితే టీమ్ ఇంజనీర్లు ఇంజిన్లలో ఒకదానిలో ఆశించిన విధంగా కాలేదని గమనించారు. ఇంజిన్ నంబర్ 3కి సంబంధించిన సమస్యపై బృందం పని చేస్తున్నందున లాంచ్ ప్రస్తుతం ప్రణాళిక లేకుండా నిలిపివేయబడిందని నాసా ప్రకటించుకుంది. అంతకు ముందు కౌంట్డౌన్ క్లాక్ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి.. లాంఛ్ డైరెక్టర్తో చర్చించినట్లు తెలిపింది. ప్రయోగం ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే సస్పెన్స్ కొనసాగగా.. చివరికి వాయిదా వైపే మొగ్గు చూపింది నాసా. The countdown clock is on a hold at T-40 minutes. The hydrogen team of the @NASA_SLS rocket is discussing plans with the #Artemis I launch director. Operational commentary continues at https://t.co/z1RgZwQkWS. pic.twitter.com/5J6rHVCe44 — NASA (@NASA) August 29, 2022 The launch of #Artemis I is no longer happening today as teams work through an issue with an engine bleed. Teams will continue to gather data, and we will keep you posted on the timing of the next launch attempt. https://t.co/tQ0lp6Ruhv pic.twitter.com/u6Uiim2mom — NASA (@NASA) August 29, 2022 ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో భాగంగా ఇవాళ అమెరికా స్పేస్ సెంటర్ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్ను ప్రయోగించాల్సి ఉంది. దీనితో పాటు ఓరియన్ స్పేస్క్రాఫ్ట్ను కూడా నాసా నింగిలోకి పంపాల్సి ఉంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. శాశ్వత ఆవాసాల కోసం.. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్ మిషన్లో భాగంగా.. ఆర్టెమిస్-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి. ఇదీ చదవండి: ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే? -
మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్ ఉద్యోగి మృతి
ఫ్లోరిడా: నార్త్ ఫ్లోరిడాలో ఒక పోస్టల్ ఉద్యోగి కుక్కల దాడిలో మృతి చెందింది. 61 ఏళ్ల పమేలా జేన్ రాక్ అనే మహిళ తన పోస్టల్ ట్రక్కుతో రోడ్డుపై వెళ్తోంది. ఇంతలో ట్రక్కు కదలకుండా మొరాయించడంతో ఆమె వాహనం దిగి సాయం కోసం చూస్తోంది. అంతే ఎక్కడ నుంచి వచ్చాయో ఒక ఐదు కుక్కలు గుంపుగా ఆమెను చుట్టుముట్టి దాడి చేశాయి. దీంతో ఆమె కింద పడిపోయి గట్టిగా పెడబొబ్బలు పెడతూ సాయం కోసం అరుస్తూ ఉంది. ఆమె కేకలు విని చుట్టు పక్కల ఉన్న నివాసితులు, సదరు కుక్కల యజమాని వెంటనే వచ్చి ఆ కుక్కలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఒక వ్యక్తి తుపాకిని గాల్లో రెండు రౌండ్ల కాల్చాడు కూడా. ఐతే పమేలాకి తీవ్ర గాయాలై రక్త స్రావం అవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో జంతు నియంత్రణ సంస్థ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఐదు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేయడమే కాకుండా సదరు కుక్కుల యజమానిని కూడా విచారిస్తున్నారు. యూఎస్ పోస్ట్ సర్వీస్ విడుదల చేసిన డేటా ప్రకారం 2021లో సుమారు 5 వేల మంది పోస్టల్ ఉద్యోగుల పై కుక్కలు దాడి చేశాయని అదికారులు తెలిపారు. కుక్కల యజమానుల తమ కుక్కలను చుట్టుపక్కల వారికి హాని కలిగించకుండా సురక్షితమైన ప్రదేశాల్లో పర్యవేక్షించుకోవాలని సూచించారు అధికారులు. (చదవండి: ఇదేం సరదా.. అడిగి మరీ అరెస్టయింది!) -
Mystery: పసికందుగా మాయమై.. ఐదుగురు పిల్లల తల్లిగా! కానీ ఆమె తల్లిదండ్రులు..
ఫ్లోరిడాలో ఇది 1980 నాటి కథ. డోనా కాసాసంటా అనే ఓ మహిళ.. తన కొడుకు, కోడలు, మనవరాలు కనిపించడం లేదంటూ టెక్సాస్ పోలీసుల్ని ఆశ్రయించింది. ‘కొడుకు హెరాల్డ్ డీన్ క్లౌస్ జూనియర్.. టీనా గెయిల్ లిన్ క్లౌస్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, టెక్సాస్లో నివాసం ఉంటున్నారని, వారికి ఓ పాప కూడా పుట్టిందని, పాప పేరు బేబీ హోలీ అని, కొన్ని వారాలుగా వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదని, తనకు చెప్పకుండా వాళ్లు ఎక్కడికీ వెళ్లరని.. ఇలా ఎన్నో విషయాలు చెబుతూ కేసు నమోదు చేయించింది. పోలీసులు రంగంలోకి దిగారు. డీన్ క్లౌస్ టెక్సాస్లో వడ్రంగి పని చేసేవాడు. అతడికి మత ఆచారాలు ఎక్కువ. ఫ్లోరిడాలోని వోలుసియా కౌంటీలో ఉన్నప్పుడు.. 1970లో ఒక మతఛాందస బృందంలో సభ్యుడిగా చేరాడు. ఆ బృందం ఆచార నియమాల ప్రకారం సర్వ భోగాలు, పెళ్లి, పిల్లలు, ఆస్తులు ఇలా అన్నింటినీ త్యజించాల్సిన డీన్ క్లౌస్.. టీనాని పెళ్లి చేసుకుని.. పాపని కని.. టెక్సాస్లోని లెవిస్విల్లేలోకి మకాం మార్చాడు. తన జీవితాన్ని రంగుల ప్రపంచంగా మార్చుకున్నాడు. దాంతో మత సమూహం నుంచి కొన్ని బెదిరింపులొచ్చాయి. డీన్ వాటిని పట్టించుకోలేదు. అయితే ఉన్నట్టుండి అతడి కుటుంబం కనిపించకుండా పోయింది. ఆ జంట మిస్ అవ్వడానికి ముందు.. టూ–డోర్ రెడ్ బర్గండీ ఏఎంసీ కాంకార్డ్ కారుపై తిరిగే వారు. ఆ కారుతోనే వారు మిస్ అయ్యారు. కీలకంగా ఫోన్ కాల్! 1981 జనవరిలో డోనా కుటుంబం.. ఓ ఫోన్ కాల్ అందుకుంది. అదేంటంటే.. ‘మేము లాస్ ఏంజెలెస్ నుంచి కాల్ చేస్తున్నాం.. టీనా, డీన్లు మా మత బృందంలో చేరారు.. ఇకపై వారు కుటుంబాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరు. తమ ఆస్తుల్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పమన్నారు. వారి కారు మా వద్దే ఉంది. కావాలంటే దాన్ని మీకు అందిస్తాం.. కానీ కొంత ఖర్చు అవుతుంది’ అని సిస్టర్ సుసాన్ అనే మహిళ డోనా కుటుంబంతో డీల్ మాట్లాడింది. అందుకు డోనా కుటుంబం సరేనంది. ‘ఫ్లోరిడాలోని డేటోనా రేస్ట్రాక్లో.. సిస్టర్ సుసాన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ముందు చేసుకున్న డీల్ ప్రకారం నలుగురు వ్యక్తులు కారు ఇవ్వడానికి వచ్చారు. అందులో ముగ్గురు ఆడవారు ఉన్నారని.. వారంతా తెల్లటి వస్త్రాలను ధరించి, చెప్పులు లేకుండా ఉన్నారని.. డోనా కుటుంబం అధికారులకు తెలిపింది. ఆ దిశగా దర్యాప్తు మొదలైంది. ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో 2021 వరకూ ఈ కేసు మిస్సింగ్ కేసుగానే మిగిలిపోయింది. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. టీనా, డీన్ల శవాలు సరే.. బేబీ హోలీ ఎక్కడా? 2021 అక్టోబర్లో ఓ షాకింగ్ విషయం బయటపడింది. 1981 జనవరిలో హారిస్ కౌంటీలోని వాలిస్విల్లే రోడ్ సమీపంలో హ్యూస్టన్ లోని అటవీ ప్రాంతంలో లభించిన ఓ జంట శవాలు.. టీనా, డీన్లవని తేలడంతో డోనా కుటుంబం అల్లాడిపోయింది. మరి పసికందు బేబీ హోలీ ఎక్కడా? అనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం లేకపోయింది. ఆ పాపకు సంబంధించి.. ఒక్క ఆధారం కూడా ఘటనా స్థలంలో దొరకలేదు. దాంతో ఆనాడు గుర్తుతెలియని నూతన దంపతుల హత్య అని మాత్రమే కేసు నమోదు చేసుకున్నారు. భర్తని కొట్టి, భార్యని పీక కోసి చంపేశారని అప్పుడే తేలింది. కానీ వాళ్లు ఎవరు అనేది అంతుపట్టలేదు. ఏది ఏమైనా బేబీ హోలీ ఏమైంది? ఇదే ప్రశ్నతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. మీడియా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించింది. పాప ఫొటోతో ఊహాచిత్రాలు బయటికి వచ్చాయి. పోలీసులు.. అనాథ పిల్లలు, దత్తత వెళ్లిన పిల్లలు ఇలా 1980–81 చరిత్రను తిరగేశారు. డీఎన్ఏ పరీక్షలు విస్తృతంగా నిర్వహించారు. ఈ క్రమంలో 2022 జూన్లో.. ఓక్లహోమాలో నివసిస్తున్న 42 ఏళ్ల మహిళే ఈ బేబీ హోలీ అని తేలింది. ప్రపంచం నివ్వెరపోయింది. ఇదెలా సాధ్యం? అని ఆరా తీశారు అధికారులు. 1981లో తెల్లవస్త్రాలు ధరించిన ఓ మత సమూహం.. ఆ పాపని అరిజోనాలోని ఒక చర్చ్లో ఇచ్చి వెళ్లారని.. లాండ్రోమాట్ దగ్గర పాప దొరికిందని వారు చెప్పారని.. వారంతా సర్వం త్యజించిన శాకాహారులని.. విచారణలో తేలింది. చర్చ్ నుంచి ఓ కుటుంబం బేబీ హోలీని దత్తత తీసుకుని పెంచింది. బేబీ హోలీ ప్రస్తుతం అత్తింటితో, పెంచిన కుటుంబంతో మంచి సంబంధాలే కలిగి ఉంది. అలాగే డోనా కుటుంబాన్ని కలుసుకుంది. అయితే తమ వివరాలు గోప్యంగా ఉంచమంటూ హోలీ కుటుంబం అధికారులని కోరింది. అలాగే దత్తత తీసుకున్న కుటుంబానికీ, ఈ మర్డర్ కేసులకి ఏ సంబంధం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికీ డీన్ పుట్టిన రోజు నాడే హోలీ దొరకడంతో డోనా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అయితే టీనా, డీన్లను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేదానికి నేటికీ సరైన సమాధానం దొరకలేదు. దాంతో ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలి ఉంది. అరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్తో సహా నైరుతి యునైటెడ్ స్టేట్స్లో ఆ మత సమూహం బిక్షాటన చేసేదని.. ఆ దిశగా విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఏది ఏమైనా.. నలభై దశాబ్దాల క్రితం ఒక పసికందుగా మాయమైన బేబీ హోలీ.. ఐదుగురు పిల్లల తల్లిగా తిరిగి ప్రపంచానికి పరిచయం కావడం గమ్మత్తైన విషయం. -సంహిత నిమ్మన -
110 అడుగుల జుట్టు
ఫొటో చూశారా? ఆమె ముందు పరిచి ఉన్న జుట్టు పొడవెంతో తెలుసా... 110 అడుగులు. అత్యంత పొడవైన డ్రెడ్లాక్స్ (చిక్కులు పడిన జుట్టు) కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది ఫ్లోరిడాకు చెందిన ఆశా మండేలా. 40 ఏళ్లుగా ఈ జుట్టు పెంచుతున్న ఆమె... 19 అడుగుల ఆరున్నర అంగుళాల పొడవు డ్రెడ్లాక్స్ ఉన్న మహిళగా 2009 నవంబర్ 11లోనే గిన్నిస్ రికార్డు సాధించింది. 14 ఏళ్ల తరువాత 110 అడుగుల పొడవైన జుట్టుతో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆధ్యాత్మిక శోధనలో భాగంగానే ఈ జుట్టు పెంచానని, అది తన జీవితాన్నే మార్చేసిందంటుంది ఆశా మండేలా. ఆ ముడులను డ్రెడ్గా పిలవడానికి ఇష్టపడదు.. అది తన కిరీటమని చెబుతుంది. అంత పొడవైన జుట్టు.. మెయింటెనెన్స్ కష్టం కదా! అంటే? కిందపడకుండా సిల్క్ క్లాత్లో చుట్టేసుకుంటుంది. ఆ హెయిర్ను ఒక్కసారి వాష్ చేయాలంటే ఆరు షాంపూ బాటిల్స్ అయిపోతాయి. ఇక ఆరడానికి పట్టే సమయం రెండు రోజులు! -
సైకిల్ రైడ్కి వెళ్లిన 'తారా లీ'కి ఏమైంది..? ఇప్పటికీ మిస్టరీగానే!
అది 1989 జూలై నెల. ఫ్లోరిడాలోని పోర్ట్సెయింట్ జాన్లోని రద్దీగా ఉండే కన్వీనియెన్స్ స్టోర్ పార్కింగ్లో ఓ మహిళ తన కారును పార్క్ చేస్తూ.. పక్కనే ఆగిన టయోటా కార్గో వ్యాన్ని గమనించింది. దాన్ని ఒక ముప్పై ఏళ్ల మీసాల వ్యక్తి డ్రైవ్ చేసుకుని రావడం, పార్క్ చేసి వేగంగా స్టోర్ లోపలికి వెళ్లడం చూసింది. ఆ టయోటాలో ఏదో అలికిడిగా అనిపించి.. వెనుక నుంచి వెళ్లి గమనించింది. ఆ కారు విండో ఓపెన్ చేసి ఉండటంతో.. తొంగి చూసింది. చూడగానే షాక్ అయ్యింది. అందులో ఒక యుక్త వయస్కురాలు, ఒక చిన్న బాలుడు నోటికి నల్లటి ప్లాస్టర్ వేసి, చేతులు వెనక్కి కట్టేసి బందీలుగా ఉన్నట్లు గుర్తించింది. వాళ్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కారు డోర్ రావట్లేదు. తను కూడా వాళ్లకు సాయం చెయ్యాలని అనుకుంది కానీ వీలు కాలేదు. వెంటనే వాళ్లను తన కారులో ఉన్న కెమెరాతో ఫొటో తీసి (చిత్రంలో గమనించొచ్చు) పోలీసులకు సమాచారం ఇవ్వడానికి పరుగుతీసింది. పోలీసులు వెంటనే స్పందించారు. కారు పోయేదారుల్లో రోడ్డు బ్లాక్ చేయడంతో పాటు.. కొందరు ఆ స్టోర్ పార్కింగ్ని తనిఖీ చేశారు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. కేవలం ఆమె తీసిన ఫొటో తప్ప మరే సాక్ష్యం లేదు. విషయం బయటికి రావడంతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె తీసిన ఫొటో చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. పలు టెలివిజన్ కార్యక్రమాల్లో విస్తృతమైన కవరేజీ వచ్చింది. ఆ ఫొటోలో యువతిని పరిశీలనగా చూసిన కొందరు.. తను కచ్చితంగా తారా లీ క్యాలికో అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు కాలికో కాదని కొట్టి పారేశారు. ఇంతకీ ఎవరా తారా లీ క్యాలికో? 1988 సెప్టెంబర్ 20న ఉదయం 9:30 గంటలకు ఇంటి నుంచి సైకిల్ రైడ్కి వెళ్లి, తిరిగి రాని పందొమ్మిదేళ్ల అమ్మాయి తారా. న్యూ మెక్సికోలోని వాలెన్సియా కౌంటీలో నివసించే ఆమె.. హైవే 47పైకి ప్రతిరోజు రైడ్కి వెళ్లేది. తనకది చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన తల్లి ప్యాటీ డోయెల్తో కలసి పోటీ పడేది. ఒకసారి తారా, ప్యాటీ కలసి రైడ్కి వెళ్లినప్పుడు.. ఓ అనుమానాస్పద ట్రక్ తమను వెంబడించడం చూసి ప్యాటీ భయపడింది. కొన్ని రోజులు రైడింగ్కి వెళ్లడం మానేస్తే బెటర్ అని.. వెళ్లినా సెక్యూరిటీ వెపన్స్ అందుబాటులో ఉంచుకోమని తారాను హెచ్చరించింది. అయితే తారా తేలిగ్గా తీసుకుంది. ‘ఆ రోజు తన సైకిల్ టైర్ గాలి తక్కువగా ఉందని నా సైకిల్ తీసుకుని వెళ్లింది. ఎప్పుడూ గంటలోపు వచ్చేసేది. ఆ రోజు రాలేదు. అనుమానం వచ్చి నేను వెతుక్కుంటూ వెళ్లాను. ఎక్కడా తారా కానీ తను వేసుకుని వెళ్లిన సైకిల్ కానీ కనిపించకపోవడంతో భయపడి పోలీసులకు కంప్లైంట్ చేశా’ అని చెప్పుకొచ్చింది ప్యాటీ. అయితే ఆ మరునాడు ప్యాటీ.. తారా వెళ్లిన దారిలోనే మరింత ముందుకు వెళ్తే.. ఇంటికి మూడు మైళ్ల దూరంలో తారా వాడే వాక్మన్ భాగాలు, బోస్టన్ టేప్ ముక్కలు కనిపించాయి. ఈ సారి పోలీసులు రంగంలోకి దిగారు. తారా అదృశ్యమైన నాలుగు రోజుల తర్వాత జాన్ ఎఫ్. కెన్నెడీ క్యాంప్గ్రౌండ్ సమీపంలో మరిన్ని వాక్మన్, టేప్ ముక్కలు దొరికాయి. అయినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తారా ఆ రోజు సైకిల్ మీద వెళ్లడం చాలా మంది చూశారు. అయితే అందులో కొందరు.. క్యాంపర్ షెల్ కలిగిన ఒక లేత–రంగు పికప్ ట్రక్ను తారాకు సమీపంలో గమనించామని చెప్పారు. ఫొటోలో బందీగా ఉన్న అమ్మాయి ముఖానికి ప్లాస్టర్ ఉండటంతో.. ప్యాటీ తన కూతురు తారాని సరిగా గుర్తించలేకపోయింది. అయితే ఫొటోలోని అమ్మాయి కాలు మీద ఉన్న చిన్న మచ్చను చూసి.. తన కూతురు తారాకు కారు యాక్సిడెంట్లో ఏర్పడిన గాయమే అదని గుర్తుపట్టింది. పైగా ఫొటోలో అమ్మాయి పక్కనే ఉన్న పుస్తకం తారాకు బాగా ఇష్టమైన పుస్తకం కావడంతో తనే తారా అని ఫ్యాటీ నిర్ధారించింది. మరి తను తారా అయితే.. ఆ బాబు ఎవరు? ఈ ప్రశ్నే పోలీసులకు మరో సవాలుగా మారింది. మొత్తానికీ ఆ అబ్బాయి పేరు మైకేల్ హేన్లీ అని, 1988లో తారా అపహరణకు గురైన ప్రదేశానికి 75 మైళ్ల దూరంలో తన తండ్రితో కలసి వేటకు వెళ్లినప్పుడు తప్పిపోయాడని ఆధారాలు సంపాదించారు. హేన్లీ కుటుంబం కూడా ఆ ఫొటోలో ఉన్న బాబు తమ బాబే అని అంగీకరించింది. దాంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. సరిగ్గా అప్పుడే కొన్నినెలల తేడాలో.. మరిన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. వాటిలో తారాను పోలిన అమ్మాయిలు నోటికి ప్లాస్టర్స్ కట్టి.. బందీగా ఉన్నట్లే ఉండటంతో ఇది కేసును పక్కదారి పట్టించడానికి నేరస్థులు ఆడుతున్న ఆటేనని పోలీసులు భావించారు. ఇక 1990లో మైకేల్ హేన్లీ అవశేషాలు.. తను అదృశ్యమైన ప్రదేశానికి 7 మైళ్ల దూరంలో బయటపడ్డాయి. దాంతో ఫొటోలో ఉన్న అబ్బాయి హేన్లీనేనా అనే అనుమానాలూ మొదలయ్యాయి. కూతురు మీద బెంగతో ప్యాటీ.. ఆరోగ్యం క్షీణించి 2006లో చనిపోయింది. 2008లో వాలెన్సియా కౌంటీకి చెందిన రెనే రివెరా అనే అధికారి మాట్లాడుతూ.. ‘తారా మిస్ అయిన రోజు.. ఇద్దరు యువకులు తారాతో మాట్లాడాలని ట్రక్లో ఆమెని ఫాలో చేశారు. కానీ అనుకోకుండా ట్రక్ సైకిల్ని ఢీ కొట్టడంతో.. తారా సైకిల్ మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కేసు అవుతుందనే భయంతో తారాను చంపేసి.. ఓ చెరువులో పడేశారని నాకు సమాచారం ఉంది. కానీ.. తారా బాడీ దొరక్కుండా నేను ఏ చర్యలు తీసుకోలేను’ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. రివెరా చెప్పిన కథ చాలా వరకూ నిజమేనని.. ఆ వెంబడించిన యువకుల్లో ఒకడు పోలీసు అధికారి కొడుకని.. తారాపై లైంగిక దాడి చేసి, చంపేసి ఉంటారని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అయితే స్టోర్ పార్కింగ్ ఫొటోలోని అమ్మాయి.. తారా ఒక్కరేనా? అసలు తారా ఏమైపోయింది? ఆ ఫొటోలో ఉన్న బాబు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలతో నేటికీ ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. ∙సంహిత నిమ్మన -
మియామి బీచ్లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఖరి రెండు టీ20లు ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి. ఇరు జట్లు మధ్య నాలుగో టీ20 శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను వీసా సమస్య వెంటాడుతోంది. వీసా సమస్య కారణంగా గయనా నుంచి కొంత మంది టీమిండియా ఆటగాళ్లు మాత్రమే ప్లోరిడాకు గరువారం చేరుకున్నారు. మరి కొంతమంది శుక్రవారం ఫ్లోరిడాకు చేరుకోనున్నట్లు సమాచారం. అయితే తొలుత యునైటెడ్ స్టేట్స్ చేరుకున్న హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ వంటి భారత ఆటగాళ్లు మియామి బీచ్ల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్లోరిడా రాష్ట్రంలో మియామి అతి సుందరమైన నగరం. మియామిలోని ఆహ్లాదాన్ని పంచే అందమైన బీచ్లు చాలా ప్రసిద్దిగాంచాయి. కాగా ఇరు జట్లు మధ్య మూడో టీ20 మంగళవారం ముగిసిన తర్వాత శనివారం వరకు మ్యాచ్ లేకపోడవంతో ఆటగాళ్లు అక్కడి బీచ్ల్లో సేదతీరుతున్నారు. వీరి ముగ్గురితో పాటు కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ కూడా బీచ్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆటగాళ్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 2-1తో లీడ్లో ఉంది. మరోవైపు విండీస్తో మూడో టీ20లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించాడు. దాంతో అతడు ఆఖరి రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండనున్నాడు. View this post on Instagram A post shared by Shreyas Iyer (@shreyas41) View this post on Instagram A post shared by Ravi Bishnoi (@bishnoi6476) చదవండి: IND vs WI: ఉత్కంఠ రేపుతున్న వీసా సమస్య.. ఫ్లోరిడాకు చేరుకోని భారత ఆటగాళ్లు! -
ఉత్కంఠ రేపుతున్న వీసా సమస్య.. ఫ్లోరిడాకు చేరుకోని భారత ఆటగాళ్లు!
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. లగజీ సమస్య మొదలుకొని వీసా వరకు టీమిండియా ఆటగాళ్లను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఫ్లోరిడాలో జరగనున్న టి20 మ్యాచ్లు.. ప్రారంభానికి ముందే పెద్ద థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. మ్యాచ్లో చోటు చేసుకోవాల్సిన ఉత్కంఠ.. వీసాల రూపంలో టీమిండియా ఆటగాళ్ల వెంట పడుతుంది. నేరుగా ఫ్లోరిడా వెళ్లే అవకాశం లేకపోవడంతో ముందుగా ఇరుజట్లను గయానాకు పంపించారు. అక్కడి అమెరికా ఎంబసీ వీసాలు ఇవ్వడంలో అభ్యతంరం చెప్పడంతో సమస్య మొదటికి వచ్చింది. దీంతో బుధవారం గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ చొరవతో ఆటగాళ్ల వీసా సమస్య క్లియర్ అయింది. ఇక శుభం అని మనం అనుకునే లోపే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. గురువారం రెండు జట్లు ప్లోరిడాకు బయలుదేరగా కొంతమంది ఆటగాళ్లు మాత్రం విండీస్లోనే ఉండిపోయారంట. ఆ మిగిలిపోయిన ఆటగాళ్లు కూడా టీమిండియా సభ్యులేనట. ఫ్లోరిడాకు చేరుకున్న వారిలో విండీస్ ఆటగాళ్లు మొత్తం ఉండగా.. భారత్ జట్టులో సగం మంది మాత్రమే ఉన్నారు. మిగతా సగం వీసా సమస్యలతో వెస్టిండీస్లోనే ఆగిపోయారనే వార్తలు వస్తున్నాయి. అయితే టీమిండియాలోని మిగిలిన ఆటగాళ్లు ఈరోజు బయలుదేరుతారని.. మ్యాచ్లు జరుగుతాయని విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. కాగా ఒక టీమిండియా అభిమాని మాత్రం ''బ్రేకింగ్ న్యూస్.. టీమిండియా పూర్తిస్థాయి జట్టు ఫ్లోరిడాకు చేరుకోలేదు.. మ్యాచ్లు ప్రశ్నార్థకమేనా?'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫ్లోరిడా వేదికగా ఆగస్టు 6, 7 తేదీల్లో నాలుగు, ఐదు టి20లు జరగనున్నాయి. ఒకవేళ సకాలంలో ఆటగాళ్లు చేరుకోలేకపోతే.. మ్యాచ్లు ఒకరోజు వాయిదా వేసే అవకాశం ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నాయి. అయితే విండీస్ సిరీస్ ముగించుకొని టీమిండియా జట్టులోని సీనియర్లు మినహా మిగిలిన ఆటగాళ్లు వెంటనే జింబాబ్వే పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విండీస్తో మిగతా టి20లు ప్రశ్నార్థకంగా మారాయనే చెప్పొచ్చు. చదవండి: వీసా ఇచ్చేందుకు ససేమిరా.. అధ్యక్షుడి చొరవతో లైన్ క్లియర్ IND Vs WI: విండీస్లో భారత్కు వింత పరిస్థితి.. లగేజీ మొదలు వీసా సమస్య వరకు Breaking News : Full Indian Squad Has Not Reached Florida — Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) August 4, 2022 -
Ind Vs WI 4th T20: టీమిండియాకు గుడ్న్యూస్! కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
India Vs West Indies T20 Series: టీమిండియా అభిమానులకు శుభవార్త! కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెస్టిండీస్తో మిగిలిన రెండు టీ20 మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా విండీస్తో మూడో టీ20 సందర్భంగా రోహిత్ శర్మ.. వెన్నునొప్పి కారణంగా రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో లెగ్ సైడ్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హిట్మ్యాన్కు వీపు కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో రోహిత్ క్రీజును వీడాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పి కారణంగా బాధపడుతున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆఖరి రెండు టీ20 మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడా లేదోనన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా మంగళవారం నాటి మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నాలుగో టీ20కి సమయం ఉన్నందున అప్పటి పరిస్థితిని బట్టి తాను మైదానంలో దిగుతానో లేదోనన్న విషయం తెలుస్తుందని పేర్కొన్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం హిట్మ్యాన్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రిక్బజ్.. ‘‘శని, ఆదివారాల్లో జరిగే ఆఖరి రెండు మ్యాచ్లకు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు’’ అని తన కథనంలో పేర్కొంది. వీసా సమస్య తొలగింది! ఇక అమెరికాలోని ఫ్లోరిడాలో టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఖరి రెండు టీ20లు జరుగనున్నాయి. అయితే, ఇరు జట్ల ఆటగాళ్లు అమెరికాకు చేరే క్రమంలో వీసా సమస్యలు ఎదురుకాగా.. గయానా అధ్యక్షుడు చొరవ తీసుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం విండీస్, భారత్ ఆటగాళ్లు ఫ్లోరిడా చేరుకోనున్నట్లు సమాచారం. కాగా శని(ఆగష్టు 6), ఆది(ఆగష్టు 7) వారాల్లో నాలుగో, ఐదో టీ20 జరుగనున్నాయి. ఇక వెస్టిండీస్ వేదికగా సాగిన వన్డే సిరీస్లో ధావన్ సేన 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్లో ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ బృందం ఫ్లోరిడా మ్యాచ్లలో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: SA vs IRE T20: ప్రొటిస్కు చుక్కలు చూపించిన ఐర్లాండ్... ఓడినా ఆకట్టుకుంది -
విండీస్లో భారత్కు వింత పరిస్థితి.. లగేజీ మొదలు వీసా సమస్య వరకు
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందు లగేజీ సమస్య రాగా.. తాజాగా ఆటగాళ్లకు వీసా సమస్య వచ్చి వచ్చింది. విషయంలోకి వెళితే.. విండీస్తో చివరి రెండు టి20లు అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామిలో జరగనున్నాయి. కాగా మొదట అమెరికా వెళ్లేందుకు ఇరుజట్లలోని ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో మ్యాచ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన విండీస్ క్రికెట్ బోర్డు వీసా ఎంట్రీకి సంబంధించిన కార్యచరణను పూర్తి చేయాల్సి వచ్చింది. ముందుగా బుధవారం ఇరుజట్ల ఆటగాళ్లు గయానాలోని జార్జిటౌన్కు చేరుకోనున్నారు. గయానాలోని అమెరికా ఎంబసీలో ఆటగాళ్లకు వీసా అపాయింట్మెంట్స్ బుక్ చేశారు. అన్ని సక్రమంగా జరిగితే గురువారం సాయంత్రం వరకు ఆటగాళ్లు ప్లోరిడాలోని మయామికి చేరుకుంటారు. క్రికెట్ వెస్టిండీస్ బోర్డు(సీడబ్ల్యూఐ) అధ్యక్షుడు రికీ స్కెరిట్ మాట్లాడుతూ.. ''ఆటగాళ్లకు వీసా సమస్య తీరిపోయినట్లేనని భావిస్తున్నాం. గయానా నుంచి ఆటగాళ్లకు వీసా అపాయింట్మెంట్ ఇప్పించాం. ముందుగా గయానాకు వెళ్లనున్న ఆటగాళ్లు అక్కడి నుంచి ఫ్లోరిడాకు చేరుకుంటారు. ఇక ఫ్లోరిడాలో మ్యాచ్లు జరుగడం ఇదే చివరిసారి అనుకుంటా. అంతకమించి ఎక్కువ చెప్పలేం.'' అంటూ పేర్కొన్నాడు కాగా ఇంతకముందు రెండో టి20కి ముందు టీమిండియా ఆటగాళ్లకు లగేజీ సమస్య ఎదురైంది. ట్రినిడాడ్ నుంచి సెయింట్ కింట్స్కు లగేజీ రాక ఆలస్యం కావడంతో మ్యాచ్ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆటగాళ్ల లగేజీ సమస్యపై విండీస్ క్రికెట్ బోర్డు క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫ్లోరిడాలోని మియామిలో ఆగస్టు 6,7 తేదీల్లో చివరి రెండు టి20లు జరగనున్నాయి. ఇప్పటికైతే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక మూడో టి20 మ్యాచ్లో వెన్నునొప్పితో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్హర్ట్గా వెనుదిరగడంతో మిగతా టి20లు ఆడడం అనుమానంగానే ఉంది. ఒకవేళ రోహిత్ దూరమైతే.. మిగతా రెండు టి20లకు పంత్ టీమిండియా స్టాండింగ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రానున్న ఆసియా కప్ దృష్టిలో పెట్టుకొని రోహిత్ గాయం నుంచి కోలుకున్నప్పటికి ఆడించడం అనుమానంగానే ఉంది. ఈ విషయంపై బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోనుంది. చదవండి: Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ IND vs WI: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. తొలి భారత కెప్టెన్గా! -
ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి...
ఫ్లోరిడాలోని ముగ్గురు మహిళలు 100 పౌండ్ల (దాదాపు 45 కిలోల) సెయిల్ ఫిష్ని పట్టుకున్నారు. హమ్మయ్య అంటూ ఆనందంగా నీటి నుంచి పైకి తీస్తుండగా ఒక్కసారిగా అనుహ్య ఘటన చోటుచేసుకుంది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలేం జరిగిందంటే...ముగ్గురు మహిళలు ఒక పడవలో చేపల వేటకు వెళ్లారు. పాపం వారు ఎంతో కష్టబడి దాదాపు 45 కిలోల సెయిల్ ఫిష్ని పట్టుకున్నారు. అంతే తర్వాత వారు చాలా ఆనందంగా ఆ చేపను ఫిషింగ్ ట్రైలోకి వేయడం కోసం నీటి నుంచి పైకి లాగుతున్నారు. అంతే అది అనుహ్యంగా వారి మీదకు ఒక్క ఊదుటన దాడి చేసింది. ఈ ఆకస్మిక ఘటనలో వారి పక్కన ఉన్న కేథరిన్ పెర్కిన్స్ అనే 73 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సదరు స్నేహితులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. సెయిల్ ఫిష్ అనేది అత్యంత వేగవంతమైన చేప జాతులలో ఒకటి. ఇవి సమద్రం అడుగు భాగాన డీప్గా సంచరించేవిగానూ, అత్యంత బలంగా దాడి చేసే చేపలగానూ ప్రసిద్ధి. (చదవండి: అరుదైన ఘటన: రోబోతో చెస్ ఓపెన్... గాయపడిన చిన్నారి) -
తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్
US Boy Playing With His Father Gun: ఎనిమిదేళ్ల బాలుడు తండ్రి తుపాకితో ఆడుకుంటూ...అనుకోకుండా జరిపిన కాల్పుల్లో పసికందు మృతి చెందింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....45 ఏళ్ల రోడెరిక్ రాండాల్ తుపాకిని కలిగి ఉండకుండా నిషేధింపబడిన నేరచరిత్ర కలిగిన వ్యక్తి. ఒక రోజు అతను తన కొడుకుతో కలిసి తన స్నేహితురాలిని కలిసేందుకు మోటెల్ ప్రాంతానికి వెళ్లాడు. అతడి స్నేహితురాలు తన ఇద్దరు కలలు, ఒక ఏడాది కుమార్తెతో అక్కడకి వచ్చింది. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్లంతా కలుసుకుని కాసేపు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏదో పని పై రాండల్ బయటకి వెళ్లాడు. ఇంతలో కొడుకు అలమరాలో దాచిన తుపాకీని తీసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బాలికల తల్లి నిద్రిస్తుంది. అంతే ఆ పిల్లాడు ఆ గన్తో ఆడుకుంటూ..ఆడుకుంటూ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అంతే అక్కడే ఉన్న పసికందు శరీరంలోకి తూట దూసుకుపోయింది. అక్కడికక్కడే ఆ పసికందు మృతి చెందింది. ఐతే ఇలాంటి దారుణ ఘటనలు యూఎస్లో ఏటా కోకొల్లలు. పెద్దలు దాచిన గన్ని పిల్లలు తెలుసుకుని ఆడుకుంటూ తమను కాల్చుకోవడం లేదా తమ తోటివారిని కాల్చడం జరుగుతోంది. ఇలా ఏటా మైనర్లు హత్యలు చేయడం...తెలిసి తెలియని వయసులో జైలు పాలుకావడం జరుగుతోందని, ప్రతి ఏడాది సగటున ఇలాంటి ఘటనలల్లో 350 మందికి పైగా మృతి చెందుతున్నారని యూఎస్ పోలీసులు చెబుతున్నారు. సదరు వ్యక్తి పై నిర్లక్ష్యం, చట్ట విరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటం తదితర ఆరోపణలతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇటీవలే యూఎస్ అత్యున్నత న్యాయస్థానం న్యూయార్క్ పౌరులు తమ వెంట గన్లు తీసుకువెళ్లొచ్చు అంటూ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు దేశ అధ్యక్షుడు జోబైడెన్ సైతం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైగా ఇది రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞాననికి విరుద్ధంగా ఉందంటూ ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పులు ఇవ్వడం అత్యంత బాధకరం. (చదవండి: శిథిలాల నడుమ అయిన వాళ్ల కోసం.. గుండెల్ని పిండేస్తున్న ఫొటో) -
మొసలితో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి... వీడియో వైరల్
Dance with a crocodile: మాములుగా మొసలి అంటే ఎవరైన భయపడతాం. గతంలో దానితో సాహసోపేతమైన ఫీట్లు చేసి భంగపాటుకు గురైనవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు కాస్త అజాగ్రత్తగా వ్యవహరించిన ఇక అంతే సంగతులు. అలాంటిది ఇక్కడొక వ్యక్తి ఏకంగా మొసలితో డ్యాన్స్ చేస్తున్నాడు. వివరాల్లోకెళ్తే...ఫ్లోరిడాలోని ఒక వ్యక్తి మొసలితో కలిసి డ్యాన్స్ చేశాడు. నిజానికి మొసలి కనబడితేనే భయంతో అమాంతంగా పారిపోతం. కానీ ఈ వ్యక్తి ఏకంగా దానితో కలిసి నీళ్లల్లో ఎంచక్కా చిందులు వేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్స్ట్రాగ్రాంలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇంతకీ ఆ మొసలి బతికే ఉంటే అతను అలా డ్యాన్స్ చేయలేడు అంటూ రకరకాలుగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by MEMES | COMEDY | CULTURE (@bitchreject) (చదవండి: ఢిల్లీ మహిళ ప్రపంచ రికార్డు... కాలినడకనే ఢిల్లీ, ముంబై, కోల్కతా.. 110 రోజుల్లో) -
అంతా మా ఇష్టం.. ఎయిర్పోర్ట్ దగ్గర వానరాల హల్చల్
-
ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్నే కొనేశారు!
Jr NTR Fans Buy Entire Theatre For RRR Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ల మానియే కనిపిస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్, మార్చి 25న ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల బుకింగ్ ప్రారంభమై రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈమూవీ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్ అటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బజ్ నెలకొంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకా ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు వారాలపైనే సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఈ మూవీ టికెట్స్ ఓ రేంజ్లో సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఏకంగా థియేటర్ మొత్తాన్నే కొన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అమెరికాలో చోటుచేసుకోవడంతో మరింత ఆసక్తిని సంతరించుకుంది. ఫ్లోరిడాలోని ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ అంతా బుక్ చేసుకున్నారట. చదవండి: జ్యోతిష్యాన్ని నమ్మను కానీ.. బాహుబలి విజయం తర్వాత ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్సెల్టౌన్లో సాయంత్రం 6 గంటల షో కోసం అన్ని ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అసలే భారీ సినిమా, పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకే థియేటర్లో కూర్చొని ప్రీమియర్ చూస్తుంటే ఇక ఆ హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో తారక్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కాగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
ఇంతవరకు మనం హెలకాప్టర్ క్రాష్కి సంబంధించిన పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవల యూకేలోని యూనిస్ తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి విమానం ఎంత ప్రమాదకరంగా ల్యాండ్ అయ్యిందో చూశాం. అయితే ఇక్కడొక హెలికాప్టర్ ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందో గానీ అందరూ చూస్తుండగానే బీచ్లోని అలల పైకి దూసుకుపోయింది. అసలు విషయంలోకెళ్తే...అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే మియామీ బీచ్లో ముగ్గురు ప్రయాణికులతో కూడిన రాబిన్సన్ R44 హెలికాప్టర్ కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్తో హెలికాప్టర్ క్రాష్కి గల కారణాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు మయామి బీచ్ పోలీసులు, అగ్నిమాపక విభాగాలు ఘటనాస్థలికి వచ్చి ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. This afternoon at 1:10 p.m., MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street. Police and @MiamiBeachFire responded to the scene along with several partner agencies. Two occupants have been transported to Jackson Memorial Hospital in stable condition. 1/2 pic.twitter.com/heSIqnQtle — Miami Beach Police (@MiamiBeachPD) February 19, 2022 (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
చావుతో భీకర పోరాటం.. చివరికి ఏమైందంటే!
Shark Attack On Woman: షార్క్ చేపలను సముద్రంలో దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం! కానీ షార్క్ చేప తన కాలును పట్టేసినా భయపడకుండా ఓ మహిళ అత్యంత చాకచక్యంతో దాన్నుంచి తప్పించుకుంది. హీదర్ వెస్ట్ అనే మహిళ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సముద్రంలోకి ఈత కొట్టడానికి దిగింది. ఆమె సముద్రంలోకి దిగగానే.. క్షణాల్లో ఓ షార్క్ చేప ఆమె కాలును గట్టిగా పట్టేసి సముద్రంలోకి లాక్కునే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆమె షార్క్ చేప నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాళ్లు, చేతులు గట్టిగా ఆడిస్తూ.. దాని తలపై బలంతో కొడుతూ దాడి చేసి తప్పించుకుంది. ఈ విషయాన్ని హీదర్ వెస్ట్ స్వయంగా వెల్లడించారు. షార్క్ చేపతో దాదాపు 35 సెకన్ల పాటు భీకరంగా పోరాడినట్లు తెలిపారు. బలంగా కొట్టడంతో షార్క్ చేప తనను వదిలేసిందని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by 🌵 Heather West 🌵 (@wildwitchofthew3st) -
లాటరీలో లక్కీ చాన్స్! 150 కిలోల బరువు ఉండటంతో టికెట్ ఫ్రెండ్కు ఇచ్చి..
కేప్ కానవెరల్: ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ గతేడాది చేపట్టిన తొలి పౌర అంతరిక్షయానం ‘ఇన్స్పిరేషన్ 4’కు లాటరీలో టికెట్ గెలుచుకున్న వ్యక్తి దాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడని తెలుసా? బరువు ఎక్కువున్నందు వల్ల స్పేస్లో ప్రయాణించే అవకాశాన్ని అతను కోల్పోయాడంటే నమ్ముతారా? అక్షరాలా నిజం. టికెట్ గెలుచుకున్న అసలు వ్యక్తి పేరు కైల్ హిప్చెన్. తన కాలేజీ స్నేహితుడు క్రిస్ సెంబ్రోస్కీకు ఆ టికెట్ను ఇచ్చాడు. అలా స్నేహితుడికి టికెట్ ఇచ్చిన విషయాన్ని హిప్చెన్ ఎప్పుడో తన స్నేహితులు, బంధువులకు చెప్పినా ఇటీవలే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఫ్లోరిడాకు చెందిన ఎండీవర్ ఎయిర్ అనే విమానయాన సంస్థలో హిప్చెన్ కెప్టెన్గా పని చేస్తున్నాడు. 1990ల్లో ఏరోనాటికల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్రిస్ సెంబ్రోస్కీ, హిప్చెన్ కలిసి ఒకే రూమ్లో ఉన్నారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. తర్వాత కాలంలో హిప్చెన్ కెప్టెన్గా ఫ్లోరిడాలో, క్రిస్ డేటా ఇంజనీర్గా వాషింగ్టన్లో ఉంటున్నారు. రూ. 48 వేలు పెట్టి లాటరీలో పాల్గొని.. స్పేస్ ఎక్స్ అంతరిక్షయానానికి సంబంధించిన ఓ సీటును ‘షిఫ్ట్4 పేమెంట్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జారెడ్ ఇసాక్మన్ కొనుగోలు చేశాడు. ఓ పిల్లల రీసెర్చ్ ఆస్పత్రి కోసం డబ్బులు పోగు చేయడానికి దాన్ని లాటరీ ద్వారా అమ్మతున్నట్టు ప్రకటించాడు. అది తెలుసుకున్న హిప్చెన్ రూ. 45 వేలు, క్రిస్ రూ. 3 వేలు కలిపి రూ. 48 వేలతో లాటరీలో పాల్గొన్నారు. 72 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరిలో లాటరీ తీస్తే హిప్చెన్ పేరొచ్చింది. గెలిచిన వ్యక్తి 2 మీటర్ల లోపు పొడవు, 113 కిలోల వరకు బరువుండాలని స్పేస్ ఎక్స్ షరతు విధించింది. కానీ హిప్చెన్ 150 కిలోలున్నాడు. లాంచింగ్కు 6 నెలలుంది. బరువు తగ్గుదామనుకున్నాడు. కానీ ఒకేసారి అంత బరువు తగ్గడం మంచిదికాదని తెలుసుకున్నాడు. దీంతో తన స్నేహితుడు క్రిస్ సెంబ్రొస్కీని హిప్చెన్ ఎంచుకున్నాడు. -
హోటల్ రూంలో శవమై తేలిన ప్రముఖ కమెడియన్
ప్రముఖ అమెరికన్ కమెడియన్ బాబ్ సాగేట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో సాగేట్ శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది. మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన చేసిన ఓ షో గురించి సరదాగా ట్వీట్ చేయడం గమనార్హం. గత రాత్రి ఓర్లాండోలోని రిట్జ్-కార్ల్టన్లోని హోటల్లో సాయంత్రం 4గంటల తర్వాతి నుంచి సాగేట్ గదిలోంచి బయటకు రాకపోవడం, ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఎలాంటి డ్రగ్స్ లేవని ద్రువీకరించారు. ప్రస్తుతం సాగేట్ మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అమెరికన్ కమెడియన్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాబ్ సాగేట్ 1956 మే 17న అమెరికాలోనే జన్మించాడు. 1887 నుండి 1995 వరకు ప్రసారమైన ABC టెలివిజన్ షో ‘ఫుల్ హౌస్’లో డానీ టాన్నర్ పాత్రతో పాపులర్ అయ్యాడు. దీని సీక్వెల్గానే ‘ఫుల్ హౌస్’ పేరుతో నెట్ఫ్లిక్స్లో ఓ పాపులర్ వెబ్సిరీస్ కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే. Loved tonight’s show @PV_ConcertHall in Jacksonville. Appreciative audience. Thanks again to @RealTimWilkins for opening. I had no idea I did a 2 hr set tonight. I’m happily addicted again to this shit. Check https://t.co/nqJyTiiezU for my dates in 2022. pic.twitter.com/pEgFuXxLd3 — bob saget (@bobsaget) January 9, 2022 -
ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు
టెంపాబే, ఫ్లోరిడా: ప్రాణాలకు తెగించి సేవలందించే కాప్స్ (పోలీసులు)ను ప్రోత్సహించేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ లంచ్ బాక్సులు అందించింది. టెంపాబే నాట్స్ విభాగం, ఐటీ సర్వ్ అలయన్స్ ప్లోరిడాతో కలిసి పాస్కో కౌంటీ షెరీఫ్లో కాప్స్/డిప్యూటీలకు 50 లంచ్ బాక్సులను ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా నాట్స్ కాప్స్ను గౌరవిస్తూ.. వారిని ప్రోత్సాహించే విధంగా వారికి లంచ్ బాక్సులను అందిస్తూ వస్తుంది. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ఫ్రంట్ లైన్ వర్కర్లుగా వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. నాట్స్ ఇలా కాప్స్ను ప్రోత్సాహించేలా లంచ్ బాక్సులు అందించడాన్ని స్థానిక అధికారులు ప్రశంసించారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు. నాట్స్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఫైనాన్స్/ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కాండ్రు, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే కో ఆర్డినేటర్, ఐటీ సర్వ్ అలయన్స్ టెక్నాలజీ చైర్ ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టెంపాబే జాయింట్ కో ఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, ఐటిసర్వర్ ఎఫ్ఎల్ చాప్టర్ ప్రెసిడెంట్ భరత్ ముల్పురు, భాను ధూళిపాళ్ళ, నాట్స్ కోర్ సభ్యులు సుమంత్ రామినేని, శిరిష దొడ్డపనేని, దీప్తి రాటకోండ, ప్రభాకర్ శాఖమూరి, రుత్విక్, రిష్వితా ఆరికట్ల తదితరులు ఈ కార్యక్రమానికి తమ వంతు సాయం అందించారు. -
వికటించిన పెడిక్యూర్.. ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం
మహిళలు బ్యూటీ పార్లర్కి వెళ్లి ఫేషియల్స్ వంటివి చేయించుకుంటారనే విషయం తెలుసు. కానీ ఒక్కొసారి అవి వికటిస్తే ఎంతటి ప్రమాదాలు ఎదురవుతాయో కుడా ఇటీవల చూస్తున్నాం. అచ్చం అలానే ఒక మహిళ పాదాలకు మానిక్యూర్ చేయించకున్న తర్వాత ఆమె ఏకంగా కాలునే పొగొట్టుకుంది. (చదవండి: షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!) అసలు విషయంలోకెళ్లితే....ఫ్లోరిడాకు చెందిన ఒక మహిళ టంపాలోని టామీస్ నెయిల్స్ అనే పార్లర్కి వెళ్లింది. అయితే అప్పుడు ఆమె పాదాలకు పెడిక్యూర్ చేయించుకుంది. అప్పుడు పార్లర్ వాళ్లు పాదాలు మంచి అందంగా ఉండే నిమిత్తం కాస్మటిక్ ట్రీట్మెంట్ వంటివి చేశారు. అయితే ఆ సమయంలో ఆమె పాదం కాస్త తెగుతుంది. ఈ మేరకు ఆమెకు ఫెరిఫెరల్ వాస్క్యూలర్ అనే వ్యాధి( రక్తనాళాల్లో కొలస్ట్రాల్ ఏర్పడి ద్వారాలు ఇరుకై రక్త ప్రవహానిక అవరోదం ఏర్పడుతుంది) ఉండటంతో ఆ గాయం మానదు. దీంతో ఆ చిన్న గాయం కాస్త మానకపోగా పూర్తిగా ఇన్ఫెక్షన్కి గురై కాలు తీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో వైద్యా ఖర్చుల అధికమవ్వడమే కాక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇల్లును కూడా కోల్పోయింది. అయితే 55 ఏళ్ల ఈ మహిళ పాదాల సౌందర్యం కోసం చేయించుకున్న పెడిక్యూర్ తన జీవితాన్ని అత్యంద దయనీయ స్థితిలోకి నెట్టేసింది. ఏదిఏమైతేనే ఆ టామీస్ నెయిల్స్ పార్లర్ మూడు సంవత్సరాల తర్వాత తమ తప్పుని ఒప్పుకోవడమే కాక ఆ మహిళకు ఏకంగా రూ 13 కోట్ల నష్టపరిహారాన్ని కూడా చెల్లించింది. (చదవండి: తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!) -
తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!
ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కఠినమైన కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంతో ప్రజల ఆరోగ్య దృష్ట్యా కఠినమైన నిబంధనలను అనుసరిస్తున్నాయి. ఈ ఆంక్షలు నేపథ్యంలోనే కరోన నియమాలనకు లోబడి ప్రవర్తించని ఒక ప్రయణికుడిని యూఎస్ ఎయిర్లైన్స్ సిబ్బంది విమానం నుంచి నిర్థాక్షిణ్యంగా దింపేసింది. (చదవండి: ఒమిక్రాన్ వైరస్ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!) అసలు విషయంలోకెళ్లితే...యూస్లోని లాడర్డేల్ విమానాశ్రయం నంచి విమానం బయలు దేరేమందు ప్రయాణికులందరూ మాస్క్లు ధరించారో లేదో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు 38 ఏళ్ల ఆడమ్ జెన్నె అనే వ్యక్తి మాస్క్ ధరించకుండా ఒక ఎర్రటి వస్త్రాని ధరించి వచ్చాడు. దీంతో విమానాశ్రయ అధికారులు జెన్ని మాస్క్ విషయమై ప్రశ్నించారు. అయితే జెన్నె ఆహారం తినేటప్పుడు సైతం మాస్క్ ధరించమంటూ విమాన సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని వివరణ ఇచ్చాడు. దీంతో అధికారులు అతని సమాధానికి ఒక్కసారిగా విస్తుపోతారు. ఆ తర్వాత ఏదిఏమైన కోవిడ్ -19 నిబంధనల దృష్ట్యా మాస్క్ ధరించాల్సిందే లేనట్లయితే దిగిపోవాల్సిందే అంటూ సదరు అధికారులు గట్టిగా ఆదేశించారు. ఈ మేరకు జెన్నెతోపాటు ప్రయాణిస్తున్న తోటిప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు యూఎస్ ఎయిర్లైన్స్ కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తమ సిబ్బంది, అధికారులపై ప్రశంసల వర్షం కురిపించింది. (చదవండి: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం) LEAVE IT TO THE #FLORIDAMAN! This guy from Cape Coral tried wearing a #thong as a #mask on a United flight in Fort Lauderdale today. He was kicked off the plane. TSA and sheriff were called but passengers remained peaceful. #airtravel #Florida #aviation #travel pic.twitter.com/kUnkXrgTY8 — Channing Frampton (@Channing_TV) December 16, 2021 -
డెలివరీ వ్యాన్లో అమ్మాయి.. ఎలా వెళ్లిందని నెటిజన్ల కామెంట్లు
కొంతమంది వాహనదారులకు తెలియకుండా వెనక నుంచి వాహనంలోకి ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా గూడ్స్ డెలివరీ చేసే వాహనాల్లో అయితే ఇటువంటి ఘటనలు ఆధికంగా జరగుతుంటాయి. తాజాగా అటువంటి ఓ ఘటన అమెజాన్ డెలివరీ వాహన డ్రైవర్కు ఎదురైంది. ఓ అమ్మాయి అమెజాన్ డెలివరీ వాహనం డ్రైవర్కు తెలియకుండా ఆ వాహనంలోకి ఓ మహిళ ఎక్కి కూర్చుకుంది. ఈ ఘటన అమెజాన్ డెలివరీ ఫ్లొరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... ఫ్లొరిడాలోని ఓ రోడ్డుపై ఉన్న అమెజాన్ డెలివరీ వాహనం నుంచి ఓ మహిళ కిందకు దిగి నడుచుకుంటూ వెళ్లుతుంది. అయితే వాహనదారుడికి తెలియకుండా అందులోకి ఎక్కడంతో విషయం తెలుసుకున్న వాహనదారుడు ఆమెను కిందకు దించివేశాడు. అయితే ఈ వీడియోను ట్విటర్లో ఓ నెటిజన్ షేర్ చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఫన్నీగా జోకులు పేల్చుతున్నారు. ‘అందుకే నా డెలివరీ ప్యాకేజీలు అలస్యం అవుతన్నాయా?’.. ‘ఆమె ప్రైమ్ ప్లస్ మెంబర్షిప్ తీసుకున్నట్లు ఉంది’.. ‘అసలు ఆ అమ్మాయి వ్యాన్లోకి ఎలా వెళ్లింది?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. తాము ఉత్పత్తులను డెలివరీ చేసే సయమంలో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కేవలం కంపెనీ గుర్తింపు ఉన్నవాళ్లు డ్రైవర్లు మాత్రమే.. డెలివరీ వాహనాలను నడుపుతారని అన్నారు. Amazon delivery drivers are different! 😅😂 (via @patrickhook01/TT) pic.twitter.com/sS0kzEw0Ij — i SEENT it (@iseentit_online) October 25, 2021 -
ట్విటర్ కోసం కోర్టుమెట్లెక్కిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ ఖాతాపై విధించిన నిషేధం తొలగించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. తాజాగా తన ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జూలైలో ట్విటర్, ఫేసుబుక్, గూగుల్పై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ట్రంప్ కేసు విచారణ కొనసాగుతోంది. చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి రాజకీయ దురుద్దేశంతోనే జనవరిలో తన సామాజిక మాధ్యమాలు నిషేధానికి గురయ్యాయని వాదించారు. వెంటనే తన ఖాతాను పునరుద్ధరణపై ట్విటర్కు ఆదేశాలు ఇవ్వాలని ట్రంప్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ట్విటర్పై ఒత్తిడి పెంచాలని కోరాడు. అయితే ఈ వాదనకు ట్విటర్ స్పందిస్తూ.. ‘మేము చేసిన విజ్ఞప్తిపై ట్రంప్ వెంటనే స్పందించలేదు’ అని పేర్కొంది. జనవరి 6వ తేదీన అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు ప్రేరేపించేలా ట్రంప్ పోస్టులు ఉన్నాయని ఆరోపిస్తూ ట్విటర్ అతడి ఖాతాను నిషేధించింది. ఆ తర్వాత ఫేస్బుక్, గూగుల్ కూడా ట్రంప్ ఖాతాలపై పలు చర్యలు తీసుకున్నాయి. చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పాలమూరు బుడ్డోడు -
బాయ్ఫ్రెండ్తో వెళ్లి.. నరహత్యకు గురైంది
వాషింగ్టన్: గత కొన్ని రోజులుగా టిక్టాక్లో ట్రెండిగ్గా మారిన గబ్బి పెటిటో అదృశ్యం కేసును అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులు చేధించారు. బాయ్ఫ్రెండ్ చేతిలో ఆమె నరహత్యకు గురైనట్లు వెల్లడించారు. ఫ్లోరిడాకు చెందిన 22 ఏళ్ల యువతి గబ్బి పెటిటో తన బాయ్ఫ్రెండ్తో కలిసి రోడ్ ట్రిప్కు వెళ్లి.. కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎఫ్బీఐ అధికారులు వ్యోమింగ్ సరిహద్దులో లభించిన మానవ అవశేషాలు గబ్బి పెటిటోవి గుర్తించారు. ఫ్లోరిడాకు చెందిన గబ్బి పెటిటో ఈ ఏడాది ఆగస్టులో తన బాయ్ఫ్రెండ్తో కలిసి వ్యోమింగ్లోని గ్రాండ్ టెటాన్ నేషనల్ పార్క్కు వెళ్లింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 గబ్బి పెటిటో బాయ్ఫ్రెండ్ బ్రియాన్ లాండ్రి మాత్రం ఒంటరిగా ఫ్లోరిడాలోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియ లేదు. (చదవండి: గుండెలు పగిలేలా రోదనలు.. ఇక సజీవ సమాధిగా మిగిలేనా?) గబ్బి గురించి ఆమె బాయ్ఫ్రెండ్ లాండ్రీని ఎంతలా ప్రశ్నించినా.. అతడు సమాధానం చెప్పలేదు. లాండ్రీ సెప్టెంబర్ 1న ఇంటికి తిరిగి రాగా, ఆ తర్వాత పది రోజులకు పెటిటో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పెటిటో అదృశ్యంపై లాండ్రీ మాట్లాడటానికి నిరాకరించాడు. ఈ క్రమంలో పోలీసులు గబ్బి పెటిటో ఆచూకీ గురించి ఎవరికైనా.. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలపాలని లాండ్రీ తోపాటూ, ప్రజలను కూడా విజ్ఞప్తి చేశారు. (చదవండి: పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం) ఈ క్రమంలో వ్యోమింగ్ సరిహద్దులో లభించిన మానవ అవశేషాలు పెటిటోకు సరిపోయాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న లాండ్రీ గురించి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గబ్బి పెటిటో హత్యకు గల కారణాలు తెలియాలంటే లాండ్రీ పట్టుబడాలి. గబ్బి పెటిటో అదృశ్యం అయిన నాటి నుంచి ఈ వార్త మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. టిక్టాక్లో గబ్బి పెటిటో అనే హ్యాష్ట్యాగ్తో క్యాంపెయిన్ నడుస్తోంది. ఇప్పటివరకు దీనికి 650 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చదవండి: ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు -
తొలి గోల్ఫ్ టోర్నమెంట్ను గ్రాండ్గా నిర్వహించిన ఆటా
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి గోల్ఫ్ టోర్నమెంట్ను ఆగస్టు 28 ఆదివారం రోజున నిర్వహించింది. గోల్ఫ్ టోర్నమెంట్ను ఫ్లోరిడాలోని గైనెస్విల్లేలోని స్టోన్ వాల్ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటుచేసింది. ఈ టోర్నమెంట్లో ప్లేయర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోల్ఫ్ టోర్నమెంట్ కోసం నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా రుచికరమైన వంటకాలను అందించారు. షార్ట్గన్ ఫార్మాట్లో సుమారు 28 జట్లు పాల్గొన్నాయి. కిషోర్ చెన్పుపాటి, దినకర్ కుడుం, రిషి సుందరేశన్, సుండు వెంకటరమణి బృందం 58 టై బ్రేక్ స్కోర్తో ఫ్లెట్ 1 లో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చంద్ర ద్యామంగౌదర్, అనుప్ గుప్తా, సమీష్ చావ్లా, ప్రకాశ్ కృష్ణమూర్తి బృందం నిలిచింది. ఫ్లైట్ 2 లో కరణ్ చిలుకూరి, శశి రంగనాథన్, దురై నటరాజన్, వికాస్ కాలే బృందం 68 టై బ్రేక్ స్కోరుతో మొదటిస్థానంలో నిలిచారు. క్రిష్ రామయ్య కృష్ణమూర్తి, గోవింద్ జగన్నాథన్ ,సుందర్తో కూడిన బాలపెరుంబాల బృందానికి రెండవ స్థానం లభించింది. క్లోజెస్ట్ టూ ది పిన్ కెటగిరీలో హోల్-4లో సుందు వెంకటరమణి, హోల్-12లో సకీత్ వెంనూరి విజేతలుగా నిలిచారు. లాంగెస్ట్ డ్రైవ్స్ విభాగంలో విక్రం కల్లెపు(హోల్-6), చంద్ర ద్యామన్ గౌడ్ (హోల్-18 ) విజేతలుగా నిలిచారు. సురేందర్ యెదుల్లా, ప్రసాద్ తుములూరి, రాజా శ్రీనివాసన్, విక్రమ్ కల్లెపు పర్యవేక్షణలో గోల్ఫ్ టోర్నమెంట్ గ్రాండ్గా నిర్వహించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేష్ బూజాలా మాట్లాడుతూ.. టోర్నమెంట్లో పాల్గోన్న బృందాలను అభినందించారు. 2022 జూలై 1,2,3 తేదిల్లో వాషింగ్టన్ డీసీలో వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ డీసీ సమావేశానికి ప్రతి ఒకరిని ఆహ్వానించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ డీసీ కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో-ఆర్డినేటర్ రవి చల్లా వాలంటీర్లను స్పాన్సర్లైన సోమిరెడ్డి లా సంస్థ, సురేష్ సరిబాల, సురేందర్ యెదుల్లా, విజయ్ ఖేతర్పాల్ , లూర్డ్స్ మెక్మైఖేల్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు అభినందించారు. -
విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్
సాక్షి, తల్లహస్సీ: బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే అనేక దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అయితే, కొంత మంది వ్యక్తులు అప్పుడప్పుడు బస్సుల్లో లేదా రైళ్లల్లో సిగరెట్ తాగిన సంఘటనలు తరచుగా వార్తలలో వస్తుంటాయి. సిగరెట్ తాగటం వలన.. వారికే కాకుండా తోటి ప్రయాణికుల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పు సంభవించే అవకాశం ఉంటుంది. కాగా, ఒక యువతి ఏకంగా విమానంలోనే సిగరెట్ తాగి తోటి ప్రయాణికులను షాకింగ్కు గురిచేసింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని స్పిరిట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో గత మంగళవారం చోటుచేసుకుంది. ఒక తోటి ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి టిక్టాక్లో పోస్ట్ చేయగా ఇది వైరల్గా మారింది. ఫోర్ట్లాడర్డేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పిరిట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేక్ఆఫ్ అయ్యింది. రన్వే మీద వెళ్లడానికి మరికొంత సమయం ఉంది. ఈ క్రమంలో ఒక యువతి సిగరెట్ను తీసి తాగడం ప్రారంభించింది. దీంతో తోటి ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. అయితే, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న.. మజ్దలావి అనే వ్యక్తి దీన్ని రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా విమాన సెక్యురిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే యువతి దగ్గరకు చేరుకుని ఆమెను కిందికి దిగిపోవాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా, యూఎస్లో 1988లోనే బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగడాన్ని నిషేదించారు. చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
అక్కున చేర్చుకుందాం
మూడున్నర కోట్లకు పైగా వీథికుక్కలున్నాయి మనదేశంలో. పెంపుడు కుక్కలకు ఉన్నట్లు వాటి పొట్టను చూసి ఆకలి తీర్చే పెట్ పేరెంట్స్ ఎవరూ వీథి కుక్కలకు ఉండరు. వాటి ఆహారాన్ని అవి సొంతంగా సంపాదించుకుంటాయి. అది ప్రకృతి నియమం కూడా. అయితే... వాటికి ఎదురయ్యే ప్రధాన కష్టం ఆరోగ్యరక్షణ లేకపోవడమే. ‘‘ప్రతి పాణికీ జీవించే హక్కు ఉంది. వీథికుక్కలు అయినంత మాత్రాన వాటి జీవించే హక్కును కాలరాసే అధికారం మనిషికి ఉండదు. చేతనైతే వాటిని పరిరక్షించడానికి ముందుకు రండి’’ అంటున్నారు ఎన్ఆర్ఐ ఉజ్వల చింతల. ఇందుకోసం ఆమె ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ను స్థాపించి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలోని వీథికుక్కల కోసం పని చేస్తున్నారు. మాది మహేశ్వరం ఉజ్వల చింతల 2019లో యూఎస్, ఫ్లోరిడాలో ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొన్నేళ్లుగా ఆమె వీథి కుక్కల కోసం పని చేస్తూనే ఉన్నారు. ‘‘మాది హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం. నాన్న నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయంలోనే చదివాను. బాండింగ్ నా బలం, బలహీనత కూడా. ఇంటర్కి విజయవాడలోని మేరీస్టెల్లా కాలేజ్లో చేరిస్తే అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక, మూడు నెలల్లో వెనక్కి వచ్చేశాను. డిగ్రీ హన్మకొండ, ఎంబీఏ బెంగళూరులో చేసిన తర్వాత పెళ్లితో యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. యూఎస్లో కంప్యూటర్స్ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరాను. పేరెంట్స్ మీద బెంగ తో తరచూ ఇండియాకి వస్తూనే ఉంటాను. అలా రావడమే ఈ సేవాపథంలో నడిపించింది. పాలు తాగే పిల్లల్ని విసిరేశారు 2013లో ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటి వాళ్లు చిన్న కుక్కపిల్లల్ని పాలుతాగే పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటపడేయడం నా కంట పడింది. అప్పుడు తల్లి కుక్క పడిన ఆరాటం, ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు. మరోసారి పెళ్లిలో భోజనాల దగ్గర... పదార్థాలన్నీ పారవేస్తున్నారు. ఆ ప్లేట్ల కుప్ప మీదకు కుక్కలు ఎగబడుతున్నాయి. ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని విచక్షణరహితంగా కొడుతున్నాడు. అలాంటిదే మరోటి... ఓ కుక్కకు వెనుక కాళ్లు రెండూ విరిగిపోయాయి. దేహాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోతోంది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పర్మిషన్ తీసుకుని నాతోపాటు మూడు కుక్కలను యూఎస్ తీసుకెళ్లాను. అక్కడ చికిత్స చేయించి కోలుకున్న తర్వాత పెంచుకునే వాళ్లకు దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి స్ట్రే యానిమల్స్ కోసం పని చేస్తున్నాను. అమెరికాలో లడ్డూ హౌస్ హైదరాబాద్, అమీన్పూర్లో షెడ్ వేసి, ముగ్గురు ఉద్యోగులతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇప్పడు తొంభై ఉన్నాయి. నెలనెలా వాటి పోషణ, ట్రీట్మెంట్ కోసం డబ్బు పంపిస్తున్నాను. నా జీతం నుంచి కొంత భాగం, నా లడ్డూ హౌస్ రాబడితో వాటిని సంరక్షిస్తున్నాను. లడ్డూ హౌస్ బ్రాండ్ మీద నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తినుబండారాలు తయారు చేసి, ఆదివారం ‘స్ట్రే యానిమల్స్ కోసం’ అని బోర్డు పెట్టి సేల్ చేస్తున్నాను. యూఎస్లో చారిటీ కోసం సేల్స్ చేసినప్పుడు... ఒక వస్తువు ధరను ఆ పదార్థానికి ఆపాదించి చూడరు, చారిటీ కోసం ధారాళంగా ఖర్చు చేస్తారు. మేము ప్రధానంగా గాయపడిన కుక్కలకు వైద్యం చేయించడం, కోలుకున్న తర్వాత పెంపకానికి ఇచ్చేయడం లేదా స్వేచ్ఛగా వదిలేయడం మీద దృష్టి పెట్టాం. ముసలితనం వల్ల ఎటూ పోలేని కుక్కలకైతే జీవితకాలపు సంరక్షణ బాధ్యత మాదే. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్ వంటి కొన్ని సహకారాలను బ్లూ క్రాస్ నుంచి తీసుకుంటాం’’ అని చెప్పారు ఉజ్వల. భారతీయ సమాజాన్ని ఆమె కోరుకునేది ఒక్కటే... మనం మనుషులం, మానవీయంగా మసలుకుందాం. కుక్క అనగానే తక్కువగా చూడవద్దు. వాటి జీవితం మన అధికారం ప్రదర్శించవద్దు. మనవి ‘ప్రాణాలను హరించే చేతులు కావద్దు, రక్షించే చేతులు కావాలి’ అన్నారు. – వాకా మంజులారెడ్డి -
12 అంతస్తుల భవనం.. క్షణాల్లో నేలమట్టం
వాషింగ్టన్: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 121 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. అయితే ప్రస్తుతం ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనం జూన్ 24 తెల్లవారుజామున కూలిపోగా.. 2021, జూలై 4న పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజనీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగింది. కాగా, వచ్చే వారంలో ఎల్సా తుపాను వచ్చే అవకాశం ఉండటంతో.. సర్ఫ్సైడ్లోని మిగిలిన 12-అంతస్తుల చాంప్లైన్ టవర్స్ సౌత్ను అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 తర్వాత కూల్చివేశారు. తుపాను ముప్పు కాగా, చాంప్లైన్ సౌత్ టవర్ కూల్చివేతను చూడటానికి పెద్ద మొత్తంలో ప్రజలు అక్కడి చేరుకున్నారు. ఈ ఘటనపై కౌంటీ మేయర్ లెవిన్ కావా మాట్లాడుతూ.. ఉష్ణమండల తుఫాను ఎల్సా కరేబియన్ మీదుగా ఉత్తరం వైపు వస్తుండటంతో.. అధికారులు బిల్డింగ్ కూల్చివేత షెడ్యూల్ను వేగవంతం చేశామని తెలిపారు.. గతవారం ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల బంధువులను ఓదార్చారు. అంతే కాకుండా రెస్క్యూ కార్మికులను కలుసుకుని వారి పనితీరుని ప్రశంసించారు. WATCH: The portion left standing of the partially collapsed Champlain Towers South condo building in Surfside, Florida, was demolished.https://t.co/ssfxO7WmMN pic.twitter.com/hKOS0nAr4e — CBS 21 News (@CBS21NEWS) July 5, 2021 -
గుండెలు పగిలేలా రోదనలు.. ఇక సజీవ సమాధిగా మిగిలేనా?
తమవాళ్లు ఏమైపోయారో అని కొందరి రోదనలు. తమవాళ్లు మృత్యుముఖం నుంచి బయటపడతారేమోనని ఆశతో మరికొందరు. ఇంకొందరు సహాయక బృందాలతో కలిసి వెతుకులాట.. మియామీ బిల్డింగ్ కూలిన ఘటనాస్థలంలో కనిపిస్తున్న దృశ్యాలివే. అయితే నిమిషాల వ్యవధిలో జరిగిన దుర్ఘటన వందకు పైగా కుటుంబాల్లో పెనువిషాదం నింపేలా కనిపిస్తోంది. అయితే ఇప్పటిదాకా 150 మందికిదాకా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది. మరోపక్క సహాయక చర్యలను నిలిపివేయాలన్న ఆదేశాలతో బాధిత కుటుంబాలు రోదనలు మిన్నంటుతున్నాయి. ఫ్లోరిడా: మియామీ బీచ్ సమీపంలోని ఛాంప్లెయిన్ టవర్స్లో మొత్తం 136 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటిలో 55 అపార్ట్మెంట్లు గత గురువారం రాత్రి(బుధవారం అర్థరాత్రి దాటాక 1గం.30ని. సమయంలో) కుప్పకూలిపోయాయి. ఆ మరుసటి ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనను 9/11 విషాదంతో పోలుస్తున్నారు కొందరు. కాగా, ఈ ఘటనలో ఇప్పటిదాకా 18 మృతదేహాలను వెలికితీయగా(పిల్లలు కూడా ఉన్నారు).. గాయపడ్డ ఇరవై మందికి పైగా ఆస్పత్రికి తరలించారు. ఇంకా 145 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే శిథిలాల కింద కొందరైనా ప్రాణాలతో ఉండొచ్చేమోనన్న ఆశతో గాలింపు చర్యలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్, రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సహాయక కార్యక్రమంలో సెలబ్రిటీలు, స్కూల్ పిల్లలు సైతం స్వయంగా వచ్చి పాల్గొనడం విశేషం. మరోపక్క అంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. శకలాల తొలగింపు నిలిపివేత మియామీ దుర్ఘటనలో శకలాల తొలగింపును నిలిపివేయాలని సర్ప్సైడ్ మేయర్ ఛార్లెస్ బర్కెట్ శుక్రవారం ఉదయం ఆదేశించాడు. ఓవైపు తుఫాన్ హెచ్చరికలు.. మరోపక్క శకలాలను తొలగించే క్రమంలో ఒరిగిపోయి ఉన్న మిగిలిన అపార్ట్మెంట్ భాగం కూలిపోయే ప్రమాదం ఉందని ఇంజినీర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పనులు ఆపేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతంలో శోక మేఘాలు అలుముకున్నాయి. తమ వాళ్లను శకలాల కిందే చావనివ్వకండని అధికారుల్ని వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బైడెన్ సంఘీభావం కాగా, ఘటనాస్థలాన్ని గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సందర్శించాడు. బాధితుల కుటుంబాలను ఓదార్చడంతో పాటు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాడు. కనీసం తమవాళ్ల శవాలైనాన అప్పగించాలని కొందరు బైడెన్ను వేడుకోవడం అందరినీ కలిచివేసింది. ఈమేరకు అక్కడి దీనగాథల్ని, పరిస్థితుల్ని వివరిస్తూ.. బైడెన్ ట్విటర్లో పోస్ట్లు చేశారు. కారణాలేంటసలు.. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఉన్న స్థలం ఒకప్పుడు సముద్రపు నీట మునిగి ఉన్న స్థలం అని.. 40 ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్ను నిబంధనలకు విరుద్ధంగా కట్టారనేది నిపుణుల అభిప్రాయం. అంతేకాదు 2018లో బిల్డింగ్ బేస్మెంట్ బాగా దెబ్బతిందని, ఆ ప్రభావం గోడల మీద కూడా కనిపిస్తోందని ఓ ఇంజినీర్ రిపోర్ట్ ఇచ్చాడు కూడా. అయితే కుట్ర కోణాలను, ఆరోపణలను, అభిప్రాయాలను అధికారులు ఖండిస్తున్నారు. దుర్ఘటన కారణాలపై ఇప్పుడు నిర్ధారణకే రాలేమని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మియామీ దుర్ఘటన.. కుట్ర కోణం?.. ఆయన సూసైడ్తో లింక్! -
మహిళకు భారీ షాక్.. అకౌంట్లో ఏకంగా రూ.7400 కోట్లు!
వాషింగ్టన్: వంద రూపాయాలు డ్రా చేద్దామని వెళ్లిన వ్యక్తికి తన ఖాతాలో ఏకంగా వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిస్తే.. ఎలా ఉంటుంది.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఆ సంతోషంలో నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే అనుభవం ఎదురయ్యింది ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళకు. 20 డాలర్లు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లింది. అయితే ఆమె అకౌంట్లో సరిపడా మొత్తం లేవని.. ఇప్పుడు 20 డాలర్లు డ్రా చేస్తే అది ఓవర్డ్రాఫ్ట్ కిందకు వస్తుందని మెసేజ్ వచ్చింది. పర్లేదు అనుకుని డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. సదరు మహిళ అసలు తన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేయగా.. దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. ఏకంగా తన ఖాతాలో బిలయన్ డాలర్లు(7400 కోట్ల రూపాయలు) ఉన్నట్లు చూపింది. ఇది చూసి ఆ మహిళకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే బ్యాంక్కు వెళ్లి విషయం చెప్పగా.. వారు కూడా చెక్ చేశారు. ఆమె అకౌంట్లోకి ఇంత మొత్తం ఎలా వచ్చిందో వివరించారు. వాస్తవానికి సదరు మహిళ అకౌంట్లో నెగిటివ్ బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. మోసాలను నివారించడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు. అనుమానాస్పదంగా తోచిన వ్యక్తి అకౌంట్ను లాక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అని తెలిపారు. ఫలితంగా సదరు మహిళ 20 డాలర్లను కూడా డ్రా చేసుకోలేకపోయింది అని వివరించారు. చదవండి: ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా.. -
ఫ్లోరిడాలో నాట్స్ ఆధ్వర్యంలో భారత కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్
టెంపాబే: అమెరికాలో తెలుగు వారిని ఏకం చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇండియన్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ను నిర్వహించింది. టెంపాబే నాట్స్ విభాగంతో పాటు స్థానిక భారతీయ సంఘాలు ఈ క్యాంప్ నిర్వహణలో కీలక పాత్ర పోషించాయి. ప్లోరిడాలోని హిందూ ఆలయం సహకారంతో, నాట్స్ హిందూ ఆలయంలోనే ఈ సర్వీసెస్ క్యాంప్ నిర్వహించింది. 400 మందికి పైగా భారతీయులు ఈ కాన్సులర్ సేవలను ఈ వేదికగా ద్వారా పొందారు. పాస్పోర్ట్ పునరుద్ధరణ, కొత్త పాస్పోర్ట్ దరఖాస్తు, OCI దరఖాస్తు, పునరుద్ధరణలు, పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికేషన్, ధృవీకరణ వంటి వివిధ సేవలను అందుకున్నారు. ఈ క్యాంప్లో 4వేలకు పైగా పత్రాల పరిశీలన, ధ్రువీకరణ జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓ క్రమపద్ధతిలో నాట్స్ వారందరికి సేవలు అందించడంలో చేసిన కృషిని భారత కాన్సులేట్ బృందం ప్రత్యేకంగా అభినందించింది. టెంపాబే లో ప్రవాస భారతీయులకు కాన్సులర్ సేవలను అందించడమే లక్ష్యంగా నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రవాస భారతీయులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇది తమకు ఎంతగానో ఉపకరించే కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాట్స్ను ప్రత్యేకంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షులు(ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది కీలక పాత్ర పోషించారు. ఈ సేవలను అందించడంలో ప్రవాస భారతీయులకు సహకరించిన నోటరీ సర్వీస్ ప్రోవెడర్లు జగదీష్ తోటం, పరాగ్ సాథే, హేమ కుమార్లకు నాట్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇండియన్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ను దిగ్విజయం చేసేందుకు నాట్స్ ముందు నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహారించింది. ఉదయం యోగా శిబిరంతో ఈ క్యాంప్ ప్రారంభించింది. దాదాపు 30 మంది సభ్యులు ఈ యోగా శిబిరంలో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా నాట్స్ జాగ్రత్తలు తీసుకుంది. మాస్క్లు, టెంపరేచర్ చెకింగ్ వంటి సీడీసీ మార్గదర్శకాలను అమలు చేసింది.. నిర్వాహకులకు కావాల్సిన ఆహార ఏర్పాట్లు చేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ, సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టెంపా బే విభాగం జాయింట్ కోఆర్డినేటర్ సురేష్ బొజ్జాతో పాటు నాట్స్ సభ్యులు విజయ నాయుడు కట్టా, అనిల్ అరిమంద, జగదీష్ తోటం, సుమంత్ రామినేని, అచ్చిరెడ్డి శ్రీనివాస్, నవీన్ మేడికొండ, హేమ కుమార్, సాయి వర్మ, పరాగ్ సాతే, రమేష్ కొల్లి తదితరులు ఈ క్యాంప్ విజయవంతం చేయడానికి తమ వంతు సహయ సహకారాలు అందించారు. ఈ సర్వీస్ క్యాంప్కు మద్దతు ఇచ్చిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళి మేడిచెర్లకు నాట్స్ టెంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. చదవండి: అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం -
అరుదైన ప్రయోగం.. స్పేస్లోకి టిక్టాక్ స్టార్
కాలిఫోర్నియా: అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ అరుదైన ప్రయోగానికి రెడీ అయ్యింది. ఫ్లోరిడాకు చెందిన కెల్లీ గెరార్డియా అనే ఫేమస్ టిక్టాక్ స్టార్ను స్పేస్లోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రకరకాల పరీక్షల కోసమే ఈ స్పేస్ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. కొత్త హెల్త్కేర్ టెక్నాలజీని ఆమెపై ప్రయోగించడం ద్వారా వాటి సానుకూలతపై ఓ స్పష్టతకు వస్తామని ఒక ప్రకటనలో వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. కాగా, గెరార్డియాకు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బయోఆస్ట్రోనాటిక్స్ రీసెర్చర్ కావడం విశేషం. ఈ విషయాన్ని వర్జిన్ గెలాక్టిక్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల కెల్లీ.. పాపులర్ సైన్స్ కమ్యూనికేటర్ అని తెలిపింది. ఇక స్పేస్షిప్లో గాల్లో తేలియాడుతూనే కెల్లీ, ఆరోగ్యపరమైన ప్రతీ ప్రయోగంలో పాలుపంచుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఆమె ప్రాణాలకు వచ్చే హాని ఏం ఉండదని వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. ఇక ఈ స్పేస్క్రాఫ్ట్ ప్రయోగం ద్వారా బయోమానిటరింగ్(లాంఛ్, వెయిట్లెస్నెస్, రీ ఎంట్రీ) కెపాసిటీని పరీక్షించబోతున్నట్లు సమాచారం. తద్వారా రాబోయే రోజుల్లో మానవ సహిత వర్జిన్ గెలాక్టిక్ స్పేస్షిప్ ప్రయోగాల సాధ్యాసాధ్యాలపై మరో అడుగు ముందుకు వేయనుంది. ఇక ఈ ప్రయోగంపై గెరార్డియా స్పందిస్తూ.. ‘తన ప్రయత్నం మరికొందరు యువ రీసెర్చర్లను ముందుకు తీసుకొస్తుందని’ ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెరికా రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజినీర్ బర్ట్ రూటన్ కలిసి స్థాపించిన వర్జిన్ గెలాక్టిక్.. వచ్చే ఏడాది నుంచి కమర్షియల్ సబ్-ఆర్బిటల్ ఫ్లైట్స్ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఏడాదికి 400 ట్రిప్పులను లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ కంపెనీ తరపున ఇటీవలె రాకెట్ తరహా విమానం వీఎంఎన్ ఈవ్ ద్వారా ఇద్దరు పైలైట్లు స్పేస్లోకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక వర్జిన్ గెలాక్టిక్ నుంచి స్పేస్లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో సహా 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడం విశేషం. -
పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం
వాషింగ్టన్/ఫ్లోరిడా: విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు అతడి మాజీ భార్యపై ఎక్కడో ఓ చోట కాస్త అసహనం, కోపం, అనుమానం ఉంటాయి. తన భర్త మాజీ భార్యను మళ్లీ కలుస్తున్నాడేమో.. వారిద్దరు మాట్లాడుకుంటున్నారేమో అనే అనుమానం సహజం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఇందుకు పూర్తి విరుద్ధం. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ వివాహం అయిన రెండు రోజులకే తన భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు తామిద్దరం కిడ్నీ సిస్టర్స్ అయ్యాం అని చెప్తోంది. ఆ వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి పిల్లలను కలిసి పెంచడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్కు డెబ్బీ నీల్-స్ట్రిక్ల్యాండ్తో పరిచయం ఏర్పడింది. గత పదేళ్లుగా వారు డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది నవంవర్ 22న జిమ్, డెబ్బీ వివాహం చేసుకున్నారు. ఇక జిమ్ మాజీ భార్య మైలాన్(59) గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కేవలం 8 శాతం పని చేయడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. మైలాన్కు కిడ్నీ దానం చేయడానికి ఆమె సోదరుడు ముందుకు వచ్చాడు. కానీ మ్యాచ్ కాలేదు. అప్పటికి కేవలం రెండు రోజుల ముందే జిమ్, డెబ్బీల వివాహం జరిగింది. మైలాన్ పరిస్థితి తెలుసుకున్న డెబ్బీ ఆమెకు తన కిడ్నీ దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఈ ఇద్దరు మహిళలకు కేవలం ముఖ పరిచయం మాత్రమే. వారి మధ్య పెద్దగా స్నేహం కూడా లేదు. ఇక మైలేన్ ఆస్పత్రిలో చేరే నాటికి ఆమె కుమార్తె గర్భవతి. ఇలాంటి సమయంలో మైలాన్ తన కుమార్తె దగ్గర లేదు అనే ఊహే డెబ్బీకి నచ్చలేదు. ఆ పరిస్థితిని మార్చాలని భావించింది. గతంలో తన సోదరుడు కూడా ఇలానే ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఎదురు చూస్తూ.. డెబ్బీ కళ్లముందే ప్రాణాలు విడిచాడు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో డెబ్బీకి తెలుసు. అందుకే తన కిడ్నీ దానం చేయాలని భావించింది. ఇక డాక్టర్లు డెబ్బీకి రక్తం, కణజాల టెస్ట్ చేశారు. ఈ రెండు మ్యాచ్ అయ్యాక అత్యంత క్లిష్టమైన మరో టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో భాగంగా పైప్ ద్వారా 24 గంటల పాటు డెబ్బీ మూత్రాన్ని కలెక్ట్ చేసి టెస్ట్ చేశారు. అన్ని మ్యాచ్ కావడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్కు సిద్ధం చేశారు వైద్యులు. జిమ్, డెబ్బీల వివాహం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. స్పృహలోకి వచ్చాక మైలాన్, డెబ్బీ ఒకరి యోగ క్షేమాల గురించి ఒకరు ఆరా తీశారు. ఆ తర్వాత మైలాన్ తన కుమార్తె ఇంటికి.. డెబ్బీ జిమ్ ఇంటికి వచ్చారు. ఇకపైన జీవితాంతం తామిద్దరం కిడ్నీ సిస్టర్స్గా ఉంటామన్నారు. చదవండి: ప్రేమికుల రోజు: భార్యకు కిడ్నీ కానుక -
ఎస్యూవీ కారులో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు
మియామి: అమెరికాలో ఆదివారం మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫ్లొరిడా రాష్ట్రంలోని మియామి నగరంలో గుర్తు తెలియని దుండగులు ఎస్యూవీ కారులో వచ్చి పార్టీలో ఉన్న అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మియామి పోలీస్ డైరెక్టర్ ఆల్ఫ్రెడో రామిరెజ్ పేర్కొన్నారు. మియామిలోని బిలియర్డ్స్ క్లబ్ వద్దకు అర్థరాత్రి 12 గంటల సమయంలో నిస్సాన్ ఎస్యూవీ కారు వచ్చి ఆగిందని.. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు గన్స్తో కిందకు దిగి క్లబ్ నుంచి బయటకు వస్తున్న ఒక గుంపుపై కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు రామిరెజ్ తెలిపారు. కాల్పులు జరిగే సమయంలో 20 నుంచి 25 మంది ఉన్నారని.. వారిలో ఇద్దరు చనిపోయారని.. మిగతావారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించామని.. కాల్పులకు పాల్పడ్డ దుండగులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: 41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి -
Miss Universe: ఏంటీ ఆండ్రియాకు పెళ్లైందా?!
మెక్సికో సిటీ: మిస్ యూనివర్స్-2020 విజేత, మిస్ మెక్సికో ఆండ్రియా మెజాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెకు ఇది వరకే పెళ్లి అయ్యిందని, భర్తతో కలిసి దిగిన ఫొటోలే ఇందుకు నిదర్శనమంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆండ్రియా మెజా ఖండించారు. తనకు వివాహం కాలేదని స్పష్టం చేశారు. కాగా మెక్సికోని చిహువాకు చెందిన ఆండ్రియా... సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మోడలింగ్పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి తమ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం.. మెజా ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో.. తెల్లటి వెడ్డింగ్ గౌనులో మెరిసిపోతున్న ఆమె.. సూటులో ఉన్న ఓ పురుషుడిని హత్తుకుని ఉన్నారు. ‘‘ఇందుకు 3-09-2019’’ అనే క్యాప్షన్తో పాటు ఉంగరం ఎమోజీని జతచేశారు. ఇక ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీల్లో మిస్ యూనివర్స్గా ఆండ్రియా మెజా కిరీటం దక్కించుకున్న క్రమంలో ఈ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో.. కొంతమంది ఆమెకు పెళ్లైందని, నిర్వాహకులను మోసం చేసి పోటీ చేసిందని కొంతమంది కామెంట్లు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆండ్రియా మెజా... ఈ వ్యాఖ్యలను కొట్టిపడేశారు. చిహువా టూరిజం డెవలప్మెంట్లో భాగంగా కాపర్ కెనన్ వద్ద చేసిన ఫొటోషూట్కు సంబంధించిన దృశ్యం అది అని వివరణ ఇచ్చారు. అంతేగాక ఆ ఫొటోలో ఉన్నది తన బెస్ట్ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు అని, స్నేహితులను ఆటపట్టించేందుకు డేట్ వేసి, వెడ్డింగ్ రింగ్ ఎమోజీ పెట్టామని పేర్కొన్నారు. అయితే, ఈ ఫొటో విషయం ఇంత గందరగోళం సృష్టిస్తుందని ఊహించలేకపోయానని వాపోయారు. అయినా తను అసత్య ప్రచారాలకు భయపడేదానిని కాదని, కెరీర్పై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు. అది అవాస్తవం ఇక మిస్ యూనివర్స్ పోటీల అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఈ ఫొటో గురించి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. కానీ మేం అన్ని పరిశీలించిన తర్వాతే పోటీకి అర్హురాలిగా పరిగణిస్తాం. మెజా వివాహిత అన్న ప్రచారం అవాస్తవం’’ అని స్పష్టం చేశారు. కాగా విశ్వ సుందరి పోటీల నియమం ప్రకారం... అందులో పాల్గొనే వారు అవివాహుతులై ఉండాలన్న సంగతి తెలిసిందే. చదవండి: Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా? The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I — Miss Universe (@MissUniverse) May 17, 2021 -
వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు
ఫ్లోరిడా: చూడ్డానికి పెద్ద మనిషి తరహాలో ఉన్నాడు. వయసు కూడా దాదాపు 70 ఏళ్లకు పైనే ఉంటుంది. కానీ బుద్ధి మాత్రం నికృష్టం. ఏం ఏరగని వాటిలా అటూ ఇటూ తిరుగుతూ.. రహస్యంగా బీచ్లో ఉన్న ఆడాళ్ల ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించాడు. ఇది గమనించిన ఓ యువతి ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి ఫోన్ లాక్కొని చూడగా.. తనతో పాటు మరికొందరు మహిళల అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటిని డిలీట్ చేసి అతడి నిర్వాకం గురించి బీచ్లోని వారందరికి తెలిపింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి బీచ్కు వెళ్లింది. ఆ సమయంలో ఓ వృద్ధుడు మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. రహస్యంగా వారి ఫోటోలు తీయడం ప్రారంభిస్తాడు. అతడి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన మహిళ అతడి దగ్గరకు వెళ్లి ఫోన్ లాక్కుని చూడగా మొబైల్లో తనతో పాటు మరికొంందరి మహిళల అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటిని చూడగానే సదరు మహిళకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వాటిని డిలీట్ చేయమని ఆదేశించిది. ఆ తర్వాత ఫోన్ గ్యాలరీ ఒపెన్ చేసి చూడగా మరి కొందరు మహిళల అసభ్య ఫోటోలు దర్శనం ఇచ్చాయ. దాంతో ఆ మహిళ అతడి ఘనకార్యం గురించి అందరికి వెల్లడించి.. వాటిని డిలీట్ చేయించింది. చదవండి: బూతులు తిడుతూ, రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు -
Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా?
వాషింగ్టన్: మెక్సికో భామ ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో గెలుపొంది విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకున్నారు. తొలి రన్నరప్గా మిస్ బ్రెజిల్ జులియా గామా, రెండో రన్నరప్గా మిస్ పెరూ జానిక్ మెసెటా డెల్ కాసిలో నిలిచారు. మిస్ ఇండియా అడెలిన్ కాస్టెలినో సైతం గట్టిపోటీనిచ్చి టాప్-5లో స్థానం సంపాదించుకున్నారు. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్(2019) జోజిబినీ తుంజీ విజేత ఆండ్రియాకు కిరీటం అలంకరించారు. కాగా మొత్తం డెబ్బై మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో విజయం సాధించారని ప్రకటించగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూనే క్యాట్వాక్ పూర్తి చేశారు. ఎవరీ ఆండ్రియా? మిస్ యూనివర్స్ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం.. 26 ఏళ్ల ఆండ్రియా మెజా.. మెక్సికోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. మోడలింగ్పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు. అంతేగాకుండా, మహిళా హక్కులపై ఉద్యమిస్తూ.. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్టు మోడల్ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె.. వీగన్గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు. కాగా మెక్సికో నుంచి మిస్ యూనివర్స్గా ఎంపికైన మూడో మహిళగా ఆండ్రియా నిలిచారు. అంతకు ముందు లుపితా జోన్స్(1991), షిమెనా నవరటె(2010) ఈ విశ్వ సుందరీమణులుగా నిలిచారు. గొప్ప హృదయం ఉన్నవాళ్లే.. ఫైనల్లో భాగంగా.. అందానికి ప్రామాణికత ఏమిటి అన్న ప్రశ్నకు..‘‘అత్యంత నాగరికమైన సమాజంలో మనం ఉన్నాం. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లను కూడా మనతో పాటు ముందుకు తీసుకువెళ్తున్నాం. అందం అనేది కేవలం బాహ్య రూపురేఖలకు సంబంధించింది కాదు. మన ఆత్మలో, గొప్ప మనసు కలిగి ఉండటంలోనే ఉంటుంది. మనం విలువ గల వ్యక్తులం కాదని ఎదుటివాళ్లు అవహేళన చేసేందుకు అస్సలు అనుమతించకూడదు’’ అని బదులిచ్చి ఆండ్రియా 69వ మిస్ యూనివర్స్గా నిలిచారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది విశ్వ సుందరి పోటీలు రద్దు అయిన సంగతి తెలిసిందే. The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I — Miss Universe (@MissUniverse) May 17, 2021 -
ఉబర్ డ్రైవర్పై మహిళ దాడి.. ‘నాకిద్దరు సిస్టర్స్ ఉన్నారు’
ఫ్లోరిడా: మధ్య వయస్కురాలైన ఓ నర్సు ఉబర్ డ్రైవర్పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అతడి గొంతు పట్టుకుని చితకబాదింది. మహిళ తనను ఇంతలా బాధపెడుతున్న సదరు డ్రైవర్ ఆమె మీద చేయి చేసుకోలేదు. అందుకు అతడు చెప్పిన కారణం ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ‘‘నాకు ఇద్దరు సోదరీమణలు ఉన్నారు. ఆడవారికి గౌరవం ఇవ్వాలని నా తల్లి నాకు చిన్నప్పటి నుంచి బోధించింది. అవే నేను పాటించాను’’ అన్నాడు. ఇంతకు సదరు నర్స్ అతడిపై ఎందుకు దాడి చేసింది అనేది మాత్ర తెలియలేదు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో ఈ నెల 17న చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మైఖెల్ స్టిల్విల్ అనే లేడీ నర్స్ ఏప్రిల్ 17న సాయంత్రం ఐదు గంటలకు ఉబర్ కారు బుక్ చేసుకుంది. హస్సీ జూనియర్ అనే వ్యక్తి ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. కారు ఎక్కిన తర్వాత మైఖెల్ నిద్రలోకి జారుకుంది. మెలకువ వచ్చిన తర్వాత సడెన్గా హస్సీపై దాడి చేయడం ప్రారంభించింది. వెనక ప్యాసింజర్ సీటులో కూర్చున్న మైఖెల్ నిద్ర నుంచి లేచి.. వెనక నుంచి హస్సీ మెడ పట్టుకుని అతడిని కొట్టడం ప్రారంభించింది. ‘నా కూతురు’ అంటూ అరుస్తూ.. అతడిపై పిడి గుద్దులు కురిపించింది. హస్సీ ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఇంతలో మైఖెల్ ముందుకు వచ్చి అతని ఛాతీపై గోళ్లతో గీరింది.. లోతైన గాయం చేసింది. అతడికి ఏమాత్రం తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా దాడి చేసింది. దారిన పోయే వారు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి సదరు నర్స్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హస్పీ మాట్లాడుతూ.. ‘‘ఏం జరిగితే అదే జరుగుతుంది.. నేను మాత్రం ఆమెపై చేయి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. పైగా చిన్నతనం నుంచి ఆడవారిపై చేయి చేసుకోకూడదు అనే వాతావరణంలో నేను పెరిగాను. అందుకే ఆమెపై ప్రతి దాడి చేయలేదు’’ అన్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో నర్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్పై మహిళ దాడి ఈమె 8 మంది శిశువులను చంపారట! -
మయామి ఓపెన్ చాంప్ హుర్కాజ్
ఫ్లోరిడా: పురుషుల టెన్నిస్ స్టార్స్ ఫెడరర్, రాఫెల్ నాదల్, జొకోవిచ్, డొమినిక్ థీమ్ గైర్హాజరీలో మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో పోలాండ్ ప్లేయర్ హుబర్ట్ హుర్కాజ్ చాంపియన్గా అవతరించాడు. ఫైనల్లో హుర్కాజ్ 7–6 (7/4), 6–4తో ఇటలీకి చెందిన 19 ఏళ్ల జానిక్ సినెర్పై గెలుపొందాడు. హుర్కాజ్ కెరీర్లో ఇదే తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతగా నిలిచిన హుర్కాజ్కు 3,00,110 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 కోట్ల 22 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో ఐదో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)పై, ఎనిమిదో ర్యాంకర్ ఆండ్రీ రుబెŠల్వ్ (రష్యా)పై, 11వ ర్యాంకర్ షపోవలోవ్ (కెనడా)పై, 19వ ర్యాంకర్ మిలోస్ రావ్నిచ్ (కెనడా)పై నెగ్గడం విశేషం. ఈ విజయంతో హుర్కాజ్ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 21 స్థానాలు పురోగతి సాధించి 37వ ర్యాంక్ నుంచి 16వ ర్యాంక్కు చేరుకున్నాడు. -
ఫ్లోరిడాలో రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు
-
బూతులు తిడుతూ, రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు
ఫ్లోరిడా: దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నందుకు గాను రెస్టారెంట్ సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు నలుగురు మహిళలు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఫ్లోరిడా పామ్ బీచ్ కౌంటీలోని పొపాయ్స్ రెస్టారెంట్ డ్రైవ్-త్రూ లేన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నలుగురు మహిళలు వైట్ కలర్ నిస్సాన్ కారులో పొపాయ్స్ రెస్టారెంట్కి వచ్చారు. వీరిలో ఓ మహిళ క్యాష్ కౌంటర్లో నుంచి డబ్బులు దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. దాంతో రెస్టారెంట్ సిబ్బంది ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహానికి గురైన మహిళ క్యాషియర్ని బూతులు తిడుతూ.. అతడిపై దాడి చేయడం ప్రారంభించింది. ఇది చూసి మిగతా ముగ్గురు మహిళలు కూడా అక్కడికి వచ్చి సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించి.. డబ్బు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ తతంగాన్ని రెస్టారెంట్లో ఉన్న మరోక కస్టమర్ తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పామ్ బీచ్ కౌంటీ పోలీసులు ఈ వీడియోని తమ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘మీలో ఎవరైనా రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేసిన ఈ మహిళలను గుర్తించగలరా. వీరు సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించి.. డబ్బుతో ఉడాయించారు’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి కోసం గాలిస్తున్నాం అని తెలిపారు. సదరు మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. చదవండి: బోనాల్ వెళ్లే దారి ఇదేనా? మాటల్లోకి దించి చోరి.. -
కరోనా యాంటీ బాడీస్తో పాప పుట్టింది
ఫ్లొరిడా: కరోనా పేరు తలిస్తేనే గుండె గుభేలుమనే పరిస్థితి. దాన్నుంచి రక్షణకు టీకా వేసుకోవడమే మార్గం. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో, వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కరోనా యాంటీ బాడీస్ తయారవుతాయి. శరీరంలోకి వైరస్ ఎంటరవకుండా పోరాడుతాయి. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని ఫ్లారిడాలో ఓ చిన్నారి కరోనా యాంటీ బాడీస్తోనే పుట్టింది. వైరస్ వచ్చినా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా జన్మించింది. పాప పుట్టాక బొడ్డుతాడు నుంచి తీసిన రక్తంతో పరీక్షలు చేసిన వైద్యులు పాల్ గిల్బర్ట్, చాడ్ రుడ్నిక్ ఈ విషయాన్ని నిర్ధారించారు. చిన్నారి కడుపులో ఉన్నప్పుడే ఆమె తల్లి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుందని, దానివల్ల చిన్నారిలోనూ యాంటీ బాడీస్ ఏర్పడ్డాయని తేల్చారు. అయితే ఈ యాంటీ బాడీస్ ఎంతకాలం ఉంటాయి, వీటి నుంచి ఎంత వరకు రక్షణ ఉంటుం దన్నది పరిశోధకులు తేల్చాల్సి ఉందని వారు చెప్పారు. దానివల్ల గర్భంతో ఉన్న మహిళలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ఏర్పడే పరిస్థితులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. -
భయానకం: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన విమానం
వాషింగ్టన్: రోడ్డుపై వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా దూసుకువచ్చిన ఓ విమానం కూలిపోయింది. కారుపై కూలడంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆ ప్రమాదం ధాటికి పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సంభవించింది. దక్షిణ ఫ్లోరిడాలోని నార్త్ పెర్రీ విమానాశ్రయం నుంచి సింగిల్ ఇంజన్ ఉన్న ఓ చిన్న విమానం టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పెంబ్రోక్ పైన్స్లో రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దహనమయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆలోపే మృతిచెందారు. అయితే ఈ ఘటనలో ఓ బాలుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. #BREAKING: 2 killed in plane crash at North Perry Airport in Pembroke Pines, Florida after hitting car, injuring woman and child — Billy Corben (@BillyCorben) March 15, 2021 -
వైరల్: చేప కడుపులో తాబేలు చక్కర్లు!
ఫ్లోరిడా : బ్రతికున్న చేప కడుపులో ప్రాణాలతో ఉన్న తాబేలును గుర్తించారు బయోలజిస్టులు. ఈసంఘటన అమెరికాలోని ఫ్లొరిడాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఫ్లోరిడాలోని ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సెంటర్ బయోలజిస్టులు అక్కడి ఓ చెరువులో లార్జ్మౌత్ బాష్ చేపను పట్టుకున్నారు. అనంతరం దాన్ని ల్యాబ్కు తెచ్చి పరిశోధనకు ఉంచారు. దాని లింగాన్ని కనుగొనే నేపథ్యంలో పొట్టలో ఏదో కదులుతున్నట్లు వారు గుర్తించారు. జాగ్రత్తగా చేప నోటిని తెరిచి చూడగా ఓ బ్రతికున్న తాబేలు కనిపించింది. వెంటనే దాన్ని బయటకు తీసి చెరువులో వదిలేశారు. లార్జ్మౌత్ బాష్ చేప కడుపులో బ్రతికున్న తాబేలును గుర్తించటం సాధారణంగా జరగదని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఆ పెద్ద నోటి చేప గట్టిగా ఉన్న తాబేలు పైచిప్పను ఎలా నమలగలననుకుంది’’.. ‘‘ తాబేలుకు భూమ్మీద నూకలున్నాయి’’.. ‘‘ బ్రతికున్న చేప కడుపులో తాబేలు బ్రతికుండటం.. ఓ అద్భుతం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్ రేజర్ ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు -
స్కూలుకు తుపాకీ తెచ్చిన బాలుడు
నాప్లెస్: ఫ్లోరిడాలోని నాప్లెస్లోఉన్న ఓసియోలా ఎలిమెంటరీ స్కూలుకు చెందిన 11 ఏళ్ల బాలుడు తన బ్యాగులో తుపాకీ పెట్టుకొని పాఠశాలకు రావడం కలకలం రేపింది. కౌంటీ షెరిఫ్ అందించిన వివరాల ప్రకారం.. 4వ గ్రేడ్ చదువుతున్న బాలుడు తనతో పాటు తుపాకీని స్కూలుకు తెచ్చుకున్నాడు. అయితే అందులో బుల్లెట్లు లేవు. ఆ తుపాకీని తోటి విద్యార్థులకు చూపించి బెదిరించినట్లు పాఠశాల అధికారులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలున్ని అదుపులోకి తీసుకున్నారు. -
ప్రపోజ్: ప్రేయసి ఉంగరాన్ని ఇంకో లవర్కు
ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప. చాలామంది చాటుగా ప్రేమిస్తూ ఊహల్లోనే కాలం గడిపేస్తుంటారు. అమ్మాయికు ఎదురు వెళ్లాలన్నా, ఆమెకు మనసులోని మాట చెప్పాలన్నా ధైర్యం చాలదు. క్షణాలు రోజులై, రోజులు నెలలై, నెలలు సంవత్సరాలైనా ప్రేమ విషయం చెప్పకుండా వన్సైడ్ లవర్స్గానే మిగిలిపోతుంటారు. మరికొందరు మాత్రం ఫోన్ నంబర్ మార్చినంత ఈజీగా ప్రేమికులను మారుస్తుంటారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి రెండో రకానికి చెందినవాడు. ఇంతకీ ఫ్లోరిడాకు చెందిన ఈ రోమియో ఏం చేశాడో తెలియాలంటే ఇది చదివేయండి.. ఫ్లోరిడా: అమెరికాలోని జోసెఫ్ డేవిస్ ఫ్లోరిడాలోని ఆరెంజ్ సిటీకి చెందిన ఓ యువతి మీద మనసు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతికి చెప్పగా ఆమె కూడా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అంతా బాగానే ఉన్నందుకున్న క్రమంలో ప్రియుడు సరిగా టచ్లో లేకుండా పోయాడు. ఓ రోజు అతడి ఫేస్బుక్ను చూస్తుండగా ఓ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఫొటో కనిపించింది. మరీ పరిశీలించి చూస్తే ఆ వజ్రపు ఉంగరం తనదే. ఎందుకైనా మంచిది, అది తనదేనా? కాదా? అన్న అనుమానంతో తన బీరువా అంతా వెతికి చూడగా ఖాళీ ఉంగరం బాక్సు మాత్రమే దర్శనమిచ్చింది. పైగా మరికొన్ని ఆభరణాలు కూడా మాయమైనట్లు గుర్తిచ్చింది. వీటన్నిటి విలువ 6,270 డాలర్లుగా ఉంది. దీంతో ఆగ్రహించిన ఆరెంజ్ సిటీ యువతి అతడిని నిలదీసింది. దీంతో అతడు కొన్నింటిని తిరిగిచ్చేసేందుకు అంగీకరించాడు. ఇంత జరిగాక అతడితో కలిసి జీవితం పంచుకోలేనని నిర్ణయించుకున్న యువతి అతడికి కటీఫ్ చెప్పింది. ఇదిలా వుంటే ఆరెంజ్ సిటీ మహిళ ఆఫీసుకు వెళ్లినప్పుడు తన ప్రియురాలిని తీసుకుని నేరుగా ఆమె ఇంటికే తీసుకెళ్లాడట. ఇక డేవిస్.. జో బబ్రౌన్, మార్కస్ బబ్రౌన్ అనే మారుపేర్లతో చాలామంది అమ్మాయిలను బురిడీ కొట్టించాడని పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ -
కోర్టు విచారణ.. జడ్జికే లైన్ వేసిన ముద్దాయి
వాషింగ్టన్: కోర్టు విచారణ సమయంలో నిందితులు ఎంతో పద్దతిగా ప్రవర్తిస్తారు. పోలీసుల దగ్గర కాస్త అతి చేసినా చెల్లుతుంది కానీ.. కోర్టులో మాత్రం ఎలాంటి పిచ్చి వేశాలు వేయకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పడం... మన వాదన వినిపించడం ఇదే జరిగేది. మన సినిమాల్లో కూడా న్యాయవాదులు, కోర్టులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు, సీన్లు ఉండవు. చాలా దేశాల్లో ఇలాగే ఉంటుంది. ఇంతటి అత్యున్నత స్థానం ఉన్న కోర్టులో ఓ నిందితుడు పిచ్చి వేషాలు వేశాడు. ఏకంగా జడ్జికే లైన్ వేయడమేకాక.. పడిపోయాను అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు.. దక్షిణ ఫ్లోరిడా కోర్టులో తబితా బ్లాక్మోన్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రతివాది డెమెట్రిస్ లూయిస్ బ్రోవార్డ్ కౌంటీ జడ్జి తబితా బ్లాక్మోన్ ముందు వర్చువల్ విచారణలో హాజరయ్యాడు. కెమరా ముందుకు వచ్చాక లూయిస్.. జడ్జిని ఫ్లర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘జడ్జి గారు మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా.. నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు పడిపోయాను’’ అంటూ జడ్జి తబితాను మోసే ప్రయత్నం చేశాడు. అతడి పొగడ్తలకు ఆమె నవ్వుకుని.. ‘‘థాంక్యూ.. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు. పొగడ్తలు ఎక్కడైనా పని చేస్తాయేమో కానీ ఇక్కడ కాదు’’ అని తెలిపారు. ఇక లూయిస్పై నమోదయిన కేసు ఏంటంటే కొద్ది రోజుల క్రితం అతడు తల్లి, ముగ్గురు కుమార్తెలు ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. డోర్ పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ తతంగాన్ని సదరు ఇంటి ఓనర్ డోర్బెల్ కెమెరా ద్వారా చూసి.. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ నేరానికి గాను కోర్టు లూయిస్కి 50 వేల డాలర్ల జరిమానా విధించింది. ఇక గతంలో మరణాయుధం కలిగి ఉన్నాడనే నేరం కింద లూయిస్ నాలుగేళ్లు జైల్లో గడిపి 2019లో బయటకు వచ్చాడు. చదవండి: ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి? జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే -
మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికీ ఓటమి అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విధిలేని పరిస్థితుల్లో శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు బుధవారం ఉదయం ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలు వైట్హౌస్ వీడి ఫ్లోరిడాకు వెళ్లారు. ముందుగా చెప్పినట్టుగానే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరు కాలేదు. అధ్యక్షులు మాత్రమే వినియోగించే మెరైన్ వన్ హెలికాప్ట్టర్లో ఫ్లోరిడాలోని తాను నివాసం ఉండబోయే మార్ ఏ లాగో ఎస్టేట్కి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. వైట్హౌస్లోని సౌత్ లాన్లో మెరైన్ వన్ హెలికాప్టర్లోకి వెళ్లడానికి ముందు ట్రంప్ తనకు వీడ్కోలు చెప్పిన మద్దతుదారులు, సిబ్బందిని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడారు. ఏదో ఒక రూపంలో తాను మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పారు. ఈ నాలుగేళ్లు చాలా గొప్పగా గడిచాయన్న ట్రంప్ తాము ఎంతో సాధించామని గర్వంగా ప్రకటించుకున్నారు. ‘‘ఇది నాకెంతో గౌరవం, జీవితకాలంలో లభించిన గౌరవం. ప్రపంచంలోనే మీరంతా గొప్ప ప్రజలు. ఈ జగత్తులోనే గొప్ప ఇల్లు ఇది’’ అని కొనియాడారు. ‘‘నేను మీ కోసం ఇంకా పోరాటం చేస్తాను. ఏదో ఒక రకంగా మళ్లీ వస్తా’’ అని ట్రంప్ అన్నారు. నిండైన ఆత్మవిశ్వాసంతో వెళుతున్నా వైట్ హౌస్ మంగళవారం విడుదల చేసిన ట్రంప్ ప్రసంగం వీడియోలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ‘‘నేను ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నాను. గట్టి పోరాటాలే చేశాను. మీరు అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. ఇప్పుడు నిండైన ఆత్మ విశ్వాసంతో శ్వేతసౌధాన్ని వీడుతున్నా. మా ప్రభుత్వం సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటూ గర్వంగా మీ ముందు నిలబడ్డాను. వైట్హౌస్ వీడి వెళుతున్నప్పటికీ తాను ప్రజాసేవలోనే ఉంటా’’ అని ట్రంప్ చెప్పారు. ఈ చివరి వీడ్కోలు ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. ట్రంప్ నోట్ న్యూయార్క్: నూతన అధ్యక్షుడి ప్ర మాణస్వీకార సమయంలో పదవి వీడుతున్న అధ్యక్షుడు పాటించాల్సిన దాదాపు అన్ని సంప్రదాయాలను పక్కనబెట్టిన ట్రంప్.. ఒక సంప్రదా యాన్ని మాత్రం పాటిం చారు. కొత్త అధ్యక్షుడి కోసం వైట్హౌస్లోని అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో ఒక సందేశాన్ని ఉంచారు. ఓవల్ ఆఫీస్లోని రెజొల్యూట్ డెస్క్లో ఈ నోట్ను ట్రంప్ పెట్టారు. బైడెన్ ప్రమాణ స్వీకారం కన్నా ముందే ట్రంప్ వాషింగ్టన్ను, వైట్హౌస్ను వీడి ఫ్లారిడాకు పయనమయ్యారు. బైడెన్కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను బైడెన్తో కలిసి పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నానని పేర్కొన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుద్దామని అమెరికా నాయకత్వానికి పిలుపునిచ్చారు. -
జస్ట్ మిస్: సొర చేపకు స్నాక్ అయ్యేవాడు
ఫ్లోరిడా : పారే నదిలో ఈత కొట్టడం అంటే ఎవరికి సరదా ఉండదు. కానీ ఈ సరదా కొన్నిసార్లు అపాయాలను కూడా తెచ్చి పెడుతుంది. ఫ్లోరిడాలోని మిలామీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా సముద్రంలోనే స్విమ్మింగ్ చేస్తున్నాడు. అతడికి తోడుగా ఓ సొర చేప కూడా అదే సంద్రంలో ఈత కొడుతోంది. స్వేచ్ఛగా తనకు నచ్చినదారిలో ఈదుకుంటూ వెళ్తూ నెమ్మదిగా మనిషి సమీపంలోకి వెళ్లింది. దీంతో దానికి దారిస్తూ పక్కకు తప్పుకున్నాడు. అయినా సరే.. ఆ సొర చేప అతడిని వెంటాడుతూ సమీపంలోకి వెళ్లింది. దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా ఆ వ్యక్తి లోపల భయంగానే ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ మరింత దూరం జరుగుతున్నాడు. (చదవండి: 3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసింది!) హారర్ సినిమాను తలపిస్తున్న ఈ దృశ్యాన్ని డ్రోన్ సాయంతో చిత్రీకరించగా ఈ వీడియోను స్థానిక ఫొటోగ్రాఫర్ జేసన్ మెకింటోష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సొర చేప మాత్రమే కనిపించినప్పుడు మామూలుగా ఉన్న మ్యూజిక్.. షార్క్కు దగ్గరలో మనిషి ప్రత్యక్షం కాగానే డేంజర్ బెల్స్ మోగించినట్లుగా ప్రతిధ్వనించే సంగీతం గుబులు పెట్టిస్తోంది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా అతడి గుండెధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. జస్ట్ మిస్.. లేదంటే సొర చేపకు స్నాక్ అయ్యేవాడంటూ మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడి చుట్టూ చక్కర్లు కొట్టిన సొర చేప సదరు మనిషిని గాయపర్చలేదని మెకింటోష్ స్పష్టం చేశాడు. (చదవండి: ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మాడు, చివరికి..) View this post on Instagram A post shared by JMac (@jasonmac7) -
కారు ఇంజిన్లో కొండచిలువ.. ఎలా వచ్చిందబ్బా!
ఫ్లోరిడా : అప్పుడప్పుడు మన జీవితంలో అనుకోని ఘటనలు ఎదురవడం సహజం. తాజాగా ఫ్లోరిడాకు చెందిన మోర్ బ్లూమెన్ఫెల్డ్ అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. సరదాగా బయటికి వెళ్దామని భావించి అతను తన ఫోర్డ్ ముస్తాంగ్ కారును స్టార్ట్ చేశాడు. కానీ కారు ఇంజిన్ లైట్ పనిచేయకపోవడంతో కారు స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఇంజిన్ చెక్ చేద్దామని క్యాబిన్ ఓపెన్ చేశాడు. ఇంజిన్ క్యాబిన్ ఓపెన్ చేసి చూసిన మోర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. కారణం అప్పటికే ఇంజిన్ భాగంలో దాదాపు పది అడుగుల కొండచిలువ చుట్టుకొని ఉంది. (చదవండి : పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే) దీంతో భయాందోళనకు గురైన మోర్ వెంటనే వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి ఫోన్ చేయగా వారు స్పందించారు. ఆ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది వచ్చి కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అమెరికాలోని ఫ్లోరిడా డానియా బీచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. కాగా కొండచిలువ బర్మా ప్రాంతానికి చెందినదని అధికారులు పేర్కొన్నారు. అధికారులు కొండచిలువను కారు ఇంజిన్ నుంచి బయటకు తీస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అంత పెద్ద కొండచిలువ కారు ఇంజిన్లోకి ఎలా దూరిందబ్బా అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : పవిత్రమైన మక్కాలో కారుతో హల్చల్) -
యజమానికి పెంపుడు పిల్లి వింత బహుమతి
తల్లాహస్సీ: అమెరికాలో వింత సంఘటన చోటుచేసుకుంది. సరదాగా బయట తిరగడానికి వెళ్లిన ఓ పెంపుడు పెల్లి అరుదైన రెండు తలల పామును యాజామానికి కానుక ఇచ్చి అబ్బురపరించింది. ఫ్లోరిడాలో శనివారం వెలుగు చూసిన ఈ రెండు తలల పాము పేరు బైస్ఫాలీ. ప్రస్తుతం ఈ పాము సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాలు... అమెరికాలోని రోజర్స్ అనే మహిళా పెంపుడు పిల్లి బయటకు వెళ్లిన ప్రతిసారి యజమానికి బయట నుంచి ఎదోక బహుమతి తీసుకువెళుతుంది. అయితే అది ఈసారి పామును తీసుకువచ్చి నేరుగా హాల్లోని కార్పెట్పై ఉంచడంతో వారంత ఆశ్చర్యపోయారు. అయితే ఆ పాము రెండు తలలతో వింతగా ఉండటం వారు బయపడకుండా దానిని పెంచుకునేందుకు ఆసక్తి చూపారు. ఇందుకోసం ప్లాస్టిక్ కంటైనర్ దానిని బంధించి సరిసృపాల నిపుణులను సంప్రదించారు. (చదవండి: ఈ చిన్న జీవి బలం ఎంతో తెలుసా?) దీనిని బైస్ఫాలీ అని పిలిచే ఈ రెండు తలల పాము జన్యులోపం వల్ల జన్మించినట్లు నిపుణులు వెల్లడించారు. అయితే ఇది పిండం అభివృద్ధి సమయంలో రెండు మోనో జైగోటిక్ కవలలు వేరు చేయడంలో విఫలమై తలలు ఒకే శరీరంలో కలిసిపోవడం ఈపాము రెండు తలలతో పుట్టినట్లు తెలిపారు. కానీ ఇది అడవిలో జీవించే అవశాకం లేదని, ఇది ఆహారం కూడా సరిగా తీసుకోలేదన్నారు. ఎందుకంటే ఒక తల ఆహారాన్ని చూసి దాని వైపు కదులుతుండగా రెండో తల మరోవైపుకు లాగడం వల్ల ఆహారాన్ని తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ రెండు తలల పామును ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్(ఎఫ్డబ్ల్యూసీ) వారు పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: సోషల్ మీడియా జోరు- యూఎస్ వీక్) -
ఒక్క పనితో రియల్ హీరో అనిపించుకున్నాడు
ఫ్లోరిడా : హిల్స్బరో కౌంటీ షెరిఫ్ ఆఫీస్లో డిప్యూటీ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న క్లేటన్ రైడ్అవుట్ ఇప్పుడు ఫ్లోరిడా నగరంలో రియల్ హీరోగా నిలిచాడు. అతను రియల్ హీరో ఎందుకయ్యాడనేది ఈ వార్త చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. పెట్రోలింగ్ విధుల్లో క్లేటన్ బిజీగా ఉన్నాడు. కాగా దారిలో ఒక కారులోంచి అదే పనిగా హారన్ మోగూతూనే ఉంది. దీంతో క్లేటన్ కారు దగ్గరికి వెళ్లి చూడగా.. అందులో ఒక వ్యక్తి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. వెంటనే ఆ వ్యక్తిని కారు నుంచి బయటకు తీసిన క్లేటన్ 'హిమ్లిచ్ మాన్యూవర్' అనే శ్వాస ప్రక్రియ పద్దతి ఉపయోగించి అతని ప్రాణాలు కాపాడాడు. హిమ్లిచ్ మాన్యూవర్ పద్దతిలో పొత్తి కడుపు, రిబ్కేజ్కు మధ్యలో చేతిని పెట్టి గట్టిగా పట్టుకొని బలంగా ఒత్తిడి అందిస్తుంటారు. ఈ ప్రక్రియతో శ్వాసనాళంలో ఏదైనా వస్తువు తట్టినప్పుడు అది క్లియర్గా మారి శ్వాస ప్రక్రియ మాములు స్థితికి వచ్చేస్తుంది. సరిగ్గా ఈ పద్దతినే క్లేటన్ ఆ వ్యక్తిపై ప్రయోగించి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా ఆ వ్యక్తి మళ్లీ మాముల స్థితికి వచ్చాక అసలు విషయం చెప్పాడు. సాండ్విచ్ తింటుండగా గొంతుకు అడ్డం పడడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని.. సమయానికి క్లేటన్ రాకపోయుంటే చనిపోయేవాడినేమో అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన జరిగి చాలా రోజులే అయినా హిల్స్బరో కౌంటీ షెరిఫ్ ఆఫీస్ ఈ వీడియోనూ తాజాగా తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్గా మారింది. క్లేటన్ రియల్ హీరో అనే పదానికి అర్థం చెప్పాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
సీక్రెట్గా పెళ్లి చేసుకున్న జాన్సేన
ఫ్లోరిడా: నటుడిగా మారిన రెజ్లింగ్ స్టార్ జాన్సేన మరోసారి పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. ఏడాది కాలంగా డేటింగ్ చేస్తోన్న ప్రియురాలు షే షరియాత్జాదేను రహస్యంగా పెళ్లాడారు. ఫ్లోరిడాలోని తంపాలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ వివాహ విషయాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ అక్కడి మీడియాకు మాత్రం సమాచారం లీకైంది. దీంతో అతని పెళ్లి సర్టిఫికెట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (చదవండి: లక్ష్మీ దేవిని ఆరాధిస్తాను: హాలీవుడ్ నటి) కాగా గతేడాది మార్చిలో జాన్సేన "ప్లేయింగ్ విత్ ఫైర్" సినిమా చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఈ ఇద్దరికీ చూపులు కలిశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో షే షరియాత్జాదే ఎడమ చేతికి వజ్రపుటుంగరం కనిపించడంతో నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు తాజాగా డేటింగ్కు ముగింపు పలుకుతూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా జాన్సేన 2009లో మొదట ఎలిజబెత్ హుబెర్డీయును పెళ్లాడారు. తర్వాత ఆమెతో తెగతెంపులు చేసుకుని నిక్కీ బెల్లాతో తొమ్మిదేళ్లపాటు ప్రేమాయణం జరిపారు, కానీ అనుకోని కారణాల వల్ల 2018లో బ్రేకప్ చెప్పుకున్నారు. (చదవండి: రణ్వీర్ డ్రెడ్లుక్ ఫొటో షేర్ చేసిన జాన్సెనా) View this post on Instagram John is married. He didn't blame a pandemic for not getting married. Y'all love to see it. #nikkibella #johncena#shayshariatzadeh #shena #married #getsome #youcantseeme #Nartem A post shared by @ johncenaismarried on Oct 14, 2020 at 7:18pm PDT -
వైరల్: రికార్డు సృష్టించిన భారీ కొండచిలువ
వాషింగ్టన్ : ఫ్లోరిడాలో అత్యంత పొడవైన కొండచిలువను స్థానిక వేటగాళ్లు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ ఫ్లోరిడాలోని వాటర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్లో గుర్తించిన ఈ ఆడ కొండచిలువ పొడువు 18.9 అడుగులు. ఇది ఇప్పటి వరకు 18.8 అడుగుల పొడవున్న కొండచిలువ రికార్డును చెరపేసి కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ర్యాన్ ఆస్బర్న్, అతని స్నేహితుడు కెవిన్ పావ్లిడిస్ ఇద్దరూ పాముల వేటగాళ్లు. వైల్డ్ లైఫ్ సొసైటీలో పనిచేసే వీరు వవిధ ప్రాంతాలలో తిరుగుతూ పాములను పట్టుకొని వారి సంస్థకు అప్పజెప్పుతారు. చదవండి: బ్లూ స్నేక్.. కనిపించేంత సాఫ్ట్ కాదు సుమీ.. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి వేటలో నడుము లోతులో ఉన్న నీటిలో దిగి ఈ భారీ కొండ చిలువను పట్టుకున్నారు. తాజాగా లభించిన కొండ చిలువ బరువు 47 కిలోలు. ఈ విషయాన్ని పావ్లిడిస్ తన ఫేస్బుక్లో వెల్లడించారు. ఇంత పెద్ద పామును మునుపెన్నడూ చూడలేని, దాన్ని పట్టుకునేటప్పుడు చేతులు వణికాయని పావ్లిడిస్ పేర్కొన్నారు. కొండచిలువ కొత్త రికార్డు సృష్టించినట్లు ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్లైఫ్ కన్సర్వేషన్ కమిషన్ ధృవీకరించింది. చదవండి: నోటిలో నుంచి 4 అడుగుల పాము.. -
డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ఇంట్లోకి చొరబడి..
ఫ్లోరిడా : డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెస్లర్ను వేధింపులకు గురిచేయటమే కాకుండా కిడ్నాప్కు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన సోన్య డెవిల్లే అనే డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్పై సౌత్ కాలిఫోర్నియా కార్డ్స్ విల్లేకు చెందిన థామస్ అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు. ఆదివారం సోన్య నివాసం ఉంటున్న ఫ్లాట్ ఆవరణలోకి చొరబడ్డాడు. దాదాపు నాలుగు గంటల పాటు అక్కడే ఉండి లోపల ఏం జరుగుతోందో గమనించసాగాడు. ( డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ ) నిందితుడు థామస్ అనంతరం ఇంటి గ్లాస్ డోర్ గుండా లోపలికి ప్రవేశించాడు. దీంతో ఇంట్లోని అలారం మోగటం మొదలుపెట్టింది. అలారం గట్టిగా మోగుతుండటంతో థామస్కు ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత థామస్ను చూసిన ప్లాట్ యాజమాని పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
జూమ్ క్లాస్లో ఘోరం..
ఫ్లోరిడా : పదేళ్ల బాలిక జూమ్ క్లాస్లో జాయిన్ కాగానే వార్ఫీల్డ్ ఎలిమెంటరీలో ఆమె టీచర్ ఏదో జరగరానిది జరుగుతోందని గమనించేలోగా బాలిక తల్లి హత్యకు గురైన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో బుధవారం వెలుగుచూసింది. ఆ సమయంలో ఆన్లైన్ క్లాసులో లాగిన్ అవుతున్న ఇతర విద్యార్థులు భయపడకుండా ఉండేందుకు బాలికను టీచర్ మ్యూట్ చేశారు. కానీ కొద్దిసేపటికే భారీ శబ్ధాలు వినిపించడం ఆ బాలిక తన చెవులపై చేతులు వేసుకోవడం గమనించగా అంతలోనే స్క్రీన్పై చీకటి అలుముకుంది. సరిగ్గా జూమ్ క్లాస్ ప్రారంభం కాగానే బాలిక తల్లి మర్బియల్ రొసాడో మోరేల్స్ (32) ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ డొనాల్డ్ జే విలియమ్స్ (27) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురి మధ్య ఘర్షణ తీవ్రతరం కావడంతో విలియమ్స్ మోరేల్స్పై నాలుగుసార్లు కాల్పులకు తెగబడ్డాడు. మోరేల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన గంటలోనే విలియమ్స్ను అరెస్ట్ చేసి హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు మార్టిన్ కౌంటీ షెరీఫ్ విలియం సిండర్ తెలిపారు. జూమ్ క్లాస్లో ఉన్న బాలికతో పాటు అదే ఇంట్లో ఉన్న మరో ఐదుగురు పిల్లలు ఈ హత్యను చూశారని పోలీసులు పేర్కొన్నారు. మోరేల్స్ ఇంట్లోకి చొరబడిన విలియమ్స్ ఫేస్బుక్లో పోస్టు చేసిన ఓ వీడియోపై ఆమెను ప్రశ్నించాడని, ఆమె నవ్వుతూ బదులిస్తుండగా ఆగ్రహంతో విలియమ్స్ ఆమెపై కాల్పులు జరిపాడని సిండర్ తెలిపారు. 2015లో విలియమ్స్ తాను దొంగిలించిన తుపాకీని తీసి మోరేల్స్పై పలుమార్లు కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాగా, జూమ్ క్లాస్ తీసుకున్న స్కూల్ టీచర్ వివరాలను పోలీసులు వెల్లడించలేదు. చదవండి : భారత సంతతి రీసెర్చర్ హత్య -
‘చెల్లని చెక్కుతో లగ్జరీ కారు కొన్నాడు’
వాషింగ్టన్ : రూ కోటి విలువైన పోర్షే లగ్జరీ కారును నకిలీ చెక్తో కొనుగోలు చేసిన వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన వెలుగుచూసింది. తన ఇంట్లోని కంప్యూటర్లో ప్రింట్ చేసిన చెక్తో పోర్షే కారును కొనుగోలు చేయడంతో పాటు రోలెక్స్ వాచీలను నకిలీ చెక్లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ గతవారం కాసీ విలియం కెల్లీ (42) పట్టుబడ్డాడు. వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం కెల్లీ డెస్టిన్లోని పోర్షే డీలర్షిప్ వద్ద జులై 27న 1,39,203 డాలర్ల నకిలీ చెక్ను ఇచ్చి దర్జాగా పోర్షే 911 టర్బోను తీసుకువెళ్లాడు. ఆయన ఇచ్చిన చెక్ చెల్లకపోవడంతో డీలర్ ఒకలూసా కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. చెల్లని చెక్కు ఇచ్చి పోర్షే కారులో చెక్కేసిన కెల్లీ ఆ కారుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అదే కారులో మిరమర్ బీచ్లో ఓ నగల దుకాణానికి వెళ్లి 61,521 డాలర్లకు మరో నకిలీ చెక్ ఇచ్చి మూడు రోలెక్స్ వాచీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే చెక్ నగదుగా మారే వరకూ వాచ్లను జ్యూవెలర్ తన వద్దే ఉంచుకున్నారు. చెక్ చెల్లకపోవడంతో జ్యూవెలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ చెక్లతో మోసగించిన కెల్లీని పోలీసులు అరెస్ట్ చేయగా తన ఇంట్లో కంప్యూటర్ నుంచి ఈ చెక్కులను ప్రింట్ చేశానని అంగీకరించాడు. కెల్లీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని వాల్టన్ కౌంటీ జైలుకు తరలించారు. చదవండి : పోర్షే కయన్ కూపే @ 1.32 కోట్లు -
నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం
ఫ్లోరిడా: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం సాధించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా అమెరికా వ్యోమగాములు డగ్ హార్లీ, బాబ్ బెంకెన్ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమనం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12.18కి ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో డ్రాగన్ క్యాప్సుల్ సురక్షితంగా దిగింది. వీరు సురక్షితంగా భూమికి చేరడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అపోలో కమాండ్ మాడ్యుల్ అమెరికాలో దిగిన 45ఏళ్ల తర్వాత ఇదే తొలి స్పాష్ డౌన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. 'అంతరిక్షయానం కూడా సాధారణ విమాన ప్రయాణంలాగా మారిపోయినప్పుడు భవిష్యత్లో మానవాళి మనుగడకు భద్రత దొరికనట్లే' అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. (ట్రంప్కి ఎన్ని కల్లలేనా?) "Thanks for flying @SpaceX." 📍 Current Location: Planet Earth A 2:48pm ET, @AstroBehnken and @Astro_Doug splashed down, marking the first splashdown of an American crew spacecraft in 45 years. #LaunchAmerica pic.twitter.com/zO3KlNwxU3 — NASA (@NASA) August 2, 2020 -
సీసాలో సందేశం..
-
సీసాలో సందేశం.. చివరకు ఏమైందంటే
న్యూయార్క్ : సీసా సందేశం అనే మాట ఇప్పట్లో వాడుకలో లేదు కాని రాజుల కాలంలో చాలా ఫేమస్ అనే చెప్పొచ్చు. యుద్దాల్లో పాల్గొనడానికి సముద్ర మార్గంలో ప్రయాణించినప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు తమను కాపాడమనో లేక తమ గురించి చరిత్ర తెలుసుకోవాలనో సీసాల్లో సందేశాలు పెట్టి సముద్రంలోకి విసిరేవారు. అలా అవి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎక్కడో ఒకచోట ఒడ్డుకు చేరేవి. ఇప్పుడు అలాంటివి మనం సినిమాల్లో చూస్తున్నాం తప్ప బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా అమెరికాలో మాత్రం సీసా సందేశం అసలు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులను స్నేహితులుగా మార్చింది.(నాసా టాయిలెట్ పోటీ.. గెలిస్తే 26.5 లక్షలు) వివరాలు.. 11 ఏళ్ల వయసున్న సోఫియా, సారా బెత్లు అమెరికాలో ఉంటున్నారు. వాళ్లిద్దరికి ఎలాంటి సంబంధం లేదు. అయితే న్యూయార్క్కి చెందిన సోఫియా సెలవుల్లో ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్కి వెళ్లింది. ఆ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా వ్యాధి విజృంభిస్తోంది. దాంతో సెలవులకని వెళ్లిన సోఫియా అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడికి దగ్గరలోని సముద్రంకు వెళ్లిన సోఫియా సరదాగా ఒక చీటిని రాసి బాటిల్లో పెట్టి విసిరేసింది. తన పేరు సోఫియా అని.. కరోనా వల్ల ఇక్కడే చిక్కుకుపోయానని.. తనకు కరోనా అస్సలు నచ్చలేదని.. స్కూల్ ఫ్రెండ్స్ని మిస్సవుతున్నానని చీటిలో తెలిపింది. ఏదో సరదాగా చేసిన సోఫియాకు దాని నుంచి రిప్లై వస్తుందని బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు. సోఫియా విసిరేసిన ఆ బాటిల్ దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. చివరకు ఉత్తర కరోలినాలోని హాల్డెన్ బీచ్కి చేరింది. అక్కడ ఆ బాటిల్ సారా బెత్కి కనిపించింది. సీసాలో ఏదో ఉండడం గమనించిన సారా బాటిల్ మూత తీసి చీటిని బయటకు తీసింది. ముందు అదేదో చెత్త పేపర్ అని భావించిన సారా దాన్ని పడేయాలనుకుంది. అయితే ఒకసారి చదివితే పోలా అని చీటిని ఓపెన్ చేసింది. చీటీలో ఉన్న సందేశాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తాను ఎక్కడున్నదీ ఆ పేపర్లో సోఫియా చెప్పడంతో సారాబెత్ ఆమెతో మాట్లాడింది. కరోనా తగ్గిపోతుందనీ... బోర్గా ఫీల్ అవ్వొద్దని ధైర్యం చెప్పింది. అలా సీసా సందేశం ముఖ పరిచయం కూడా లేని సోఫియా, సారాబెత్ను స్నేహితులుగా మార్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా తగ్గగానే సోఫియా, సారాలు కలవాలని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా విస్తృతంగా విస్తరిస్తున్న వేళ ఇలా సీసాలో సందేశం పంపడం, దానికి అటు నుంచి రిప్లై రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
‘అండర్వేర్ వేసుకోను.. మాస్క్ ధరించను’
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న తరుణంలో ముఖానికి మాస్కులు ధరించడం అత్యంత ఆవశ్యకంగా మారింది. నేడు రోడ్డుపై ఎక్కడ ఎవరిని చూసిన మూతికి మాస్కుతోనే కనిపిస్తున్నారు. ఈక్రమంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో యాంటీ మాస్క్ పేరుతో కొంత మంది వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాస్కును ధరించడం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే కారణాలను ఎత్తి చూపుతున్నారు. ష్లోరిడాలో బీచ్ కౌంటీ కమిటీ పేరుతో వైద్యులు, వైద్య నిపుణులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాస్కును ధరించకుండా ఉండేందుకు అనేక కారణాలను వాదిస్తున్నారు. (భారత్కు అండగా అమెరికన్ బలగాలు) మానవ శ్వాసను నియంత్రించే అధికారాన్ని తమకు ఎవరిచ్చారని, ఎక్కడ పొందారని ఓ యాంటీ మాస్క్ ప్రచారకుడు ప్రశ్నించాడు. ‘నేను ఎప్పుడూ లోదుస్తులు ధరించను. అలాగే మాస్కు కూడా ధరించను’ అంటూ కమిటీ ముందు మరో ప్రచారకుడు చెప్పాడు. ‘ప్రకృతిని ఆస్వాధించేందుకు దేవుడు మనకు అద్భుతమైన శ్వాస వ్యవస్టను ఇచ్చాడు. మీరందరూ దానిని విస్మరించాలనుకుంటున్నారు. మాస్కును ధరించాలని బలవంతం చేసిన వారందరినీ అరెస్టు చేస్తాం’ అని చెబుతున్నారు. మానవ హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కౌంటీకి హాజరైన వైద్యులు, వైద్య నిపుణులను అరెస్టు చేస్తామని ప్రచారకులు పేర్కొన్నారు. (భారత్లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు) అయితే మాస్కును ధరించడం వల్ల ప్రాణాలకు హానీ కలుగుతుందని యాంటీ మాస్క్ ప్రచారకులు భావిస్తున్నప్పటికీ ఇది వాస్తవానికి పూర్ది విరుద్ధమని నిపుణులు పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు మాస్క్ ధరించడం తప్పనిసరి అంటున్నారు. ఇక కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు యూఎస్లోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 25 లక్షల కేసులు నమోదవ్వగా వైరస్తో 1,26,000 మంది మృత్యువాతపడ్డారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 10 మిలియన్ల మార్కును చేరబోతున్నాయి. (నాడు సరితా కోమటిరెడ్డి.. నేడు విజయ్ శంకర్!) -
చంటి బిడ్డలా మొసలిని మోస్తున్నాడు
-
మొసలిని ఎత్తుకుని రెస్టారెంట్కు వెళ్లి..
ఫ్లోరిడా: పామును పట్టాలంటే ధైర్యం ఉండాలి, మరి మొసలిని పట్టాలంటే.. అంతకు రెట్టింపు గుండె ధైర్యం అవసరం. అలాంటిది.. ఓ వ్యక్తి చంటిపిల్లాడిని చంకనేసుకుని వెళ్లినట్లుగా మొసలిని భుజానికేసున్నాడు. ఓ టిక్టాక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి మొసలిని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా స్వీటీ అని పేరు పెట్టుకున్నాడు. అందంగా కనిపించేందుకు ఎల్లో టీ షర్ట్ కూడా వేసాడండోయ్. దాన్ని ఎత్తుకోగానే అది కూడా ఆనందంగా తోకూపుతూ బుద్ధిగా నడుచుకుంది. అనంతరం అతడు దాన్ని తీసుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్లాడు. (బర్త్డే: కిటికీలో నుంచి దూకుతూ) కాగా ఈ స్వీటీ అడవిలో గాయపడ్డ స్థితిలో మోర్ హెడ్ అనే వ్యక్తి కంట పడింది. దీంతో అతడు దాన్ని రక్షించి సాయం అందించాడు. అదే సమయంలో మొసలికి కళ్లు కనిపించవు అని తెలిసింది. అలాంటి దీన స్థితిలో మొసలిని అడవిలో వదిలిపెట్టడానికి అతనికి మనసొప్పలేదు. దీంతో దాన్ని ఇంటికి తీసుకు వచ్చి కన్నబిడ్డలా పెంచుకుంటున్నాడు. టిక్టాక్లో లైకుల వర్షం కురిపిస్తున్న ఈ వీడియోను చూసి కొందరు అబ్బురపడుతుంటే మరికొందరేమో భయంతో వణికిపోతున్నారు. (హిట్లర్ పెంచుకున్న మొసలి ఇదేనా?) -
జీ7లో భారత్ను చేర్చాలి : ట్రంప్
ఫ్లోరిడా : ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల సమూహాం (జీ7 సమ్మిట్) కు భారత్, మరికొన్ని దేశాలను చేర్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. జూన్12న వైట్ హౌస్లో నిర్వహించనున్న జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేగాక జీ7ను కాలం చెల్లిన గ్రూప్గా ట్రంప్ అభివర్ణించారు. ఎయిర్ ఫోర్స్ వన్లో ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డిసికి వెళుతున్న సమయంలో తనతో పాటు ఉన్న విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ' సెప్టెంబర్ వరకు జీ7ను వాయిదా వేస్తున్నాం. జీ7 వల్ల ప్రపంచంలో ఏమి ఉపయోగం ఉందని నేను భావించడం లేదు. ఇది కాలం చెల్లిన సమూహం. రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారతదేశాలను ఆహ్వానించాలని యోచిస్తున్నాం. జీ7ను విస్తరించే వరకు సమావేశాలు వాయిదా వేయాలని నిర్ణయించాం' అంటూ తెలిపారు. (స్పేస్ ఎక్స్.. నింగిలోకి వ్యోమగాములు) చైనాను భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాలో మాట్లాడటానికి ఈ గ్రూప్ ఏ విధంగా ఉపయోగపడుతుందనేది దేశ సాంప్రదాయ మిత్రులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని వైట్ హౌస్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలిస్సా అలెగ్జాండ్రా ఫరా అన్నారు. అప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి గతి మారితే తప్ప శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయం శనివారం తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, యూకే, కెనడాలు జి. ఈ దేశాల అధిపతులు అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య సమస్యలపై ఏటా సమావేశమవుతారు. శిఖరాగ్ర సమావేశంలోజీ7 అధ్యక్షుడు సాధారణంగా ఒకటి లేదా రెండు దేశాల దేశాధినేతలను ప్రత్యేక ఆహ్వానికంగా సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానిస్తారు ఈ ఏడాది జీ7 అధ్యక్ష భాద్యతను అమెరికా జూన్ 12న నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. (డబ్ల్యూహెచ్ఓతో అమెరికా కటీఫ్) -
కొడుకును చంపి, కిడ్నాప్ డ్రామా
ఫ్లొరిడా : ఆస్టిజం(ఎదుగుదల లోపం)తో బాధపడుతున్న కొడుకును చంపి, కిడ్నాప్ డ్రామా ఆడిందో తల్లి. చివరకు సీసీటీవీల కారణంగా చిక్కి జైలు పాలయింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫ్లోరిడా, మియామీ డేడ్ కౌంటీకి చెందిన పాట్రికా రీప్లే గురువారం రోజు తన కుమారుడు అలెజాన్డ్రో(9)ను ఇద్దరు వ్యక్తులు కిడ్రాప్ చేసి తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాలుడి శవం అక్కడికి దగ్గరలోని సరస్సులో కనిపించింది. ఇదే విషయాన్ని పాట్రికాకు తెలియజేశారు వారు. అయితే పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ( వంటలో ఇసుక వేశాడు: అందుకే చంపా!) పాట్రికా ఫిర్యాదు చేసిన కోణం నుంచి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాట్రియా కుమారుడ్ని సరస్సులోకి తోసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆస్టిజంతో బాధపడుతున్న కుమారుడ్ని నీటిలో తోసి చంపటానికి ఇదివరకే ప్రయత్నించినా స్థానికులు అతడ్ని రక్షించారని, రెండో ప్రయత్నంలో సరస్సు దగ్గర ఎవరూ లేకపోవటంతో బాలుడు మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. -
‘జోక్ చేస్తున్నారు అనుకున్నాం.. కానీ’
ఫ్లోరిడా: పారాచూట్ సరిగా పని చేయకపోవడంతో.. వందల అడుగుల ఎత్తు నుంచి ఇద్దరు స్కైడైవర్స్ నేల మీద పడి పోయారు. ఈ భయానక దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ సంఘటన టైటస్విల్లే, ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు స్కైడైవర్లు ఆకాశంలో ఎగరుతున్నారు. అయితే వారి పారాచూట్ సరిగా పని చేయకపోవడంతో స్కైడైవర్లు ఆకాశంలో ఒకరిని ఒకరు ఢీ కొట్టారు. కింద నుంచి చూస్తున్న ప్రజలు స్కైడైవర్లు జోక్ చేస్తున్నారని అనుకున్నారు. కానీ వారు నియంత్రణ కోల్పోయి నేరుగా నేల మీదకు రాసాగారు. అప్పుడు అక్కడ ఉన్న జనాలు చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేకపోయారు. వారు నేరుగా వెళ్లి ఓ ఇంటి ముందు ఉన్న పెరట్లో పడ్డారు. వీరు కింద పడటం గమనించిన ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ స్కై డైవర్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. -
‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మొసలి’
సాధారణంగా అరుదుగా కనిపించే ఓ అతి పెద్ద మమొసలి రోడ్డు సమీపంలో తిరుగుతూ కనిపించింది. ఫ్లోరిడాలోని కోలియర్ కౌంటీ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం అంతర్జాతీయ రహదారి 75 పక్కన ఉన్న ఆర్మీ కంచె వద్ద మొసలి చక్కర్లు కొడుతూ స్థానికంగా ఉన్న సైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. కంచెకు ఆనుకొని మోసలి సంచరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దాదాపు 7వేల మంది దీన్ని వీక్షించారు. (టీవీ నటుల ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు) Troopers met this large🐊on Alligator Alley in Collier County this morning! Way to atleast stay in the grass shoulder and out of the travel lanes! pic.twitter.com/L9SsC63mDI — FHP SWFL (@FHPSWFL) April 26, 2020 ‘కోలియర్ కంటి సమీపంలో ఈ అలిగేటర్ కనిపించింది. రోడ్డుపై వాహనాలకు అడ్డురాకుండా గడ్డిలో వెళ్లుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తోంది.’ అంటూ అధికారులు మొసలి వీడియోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన అనేక మంది మోసలిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. మొసలి భారీ స్థాయిలో ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఫ్లోరిడా అధికారులు మోసళ్లను వెతకాలని పౌరులను హెచ్చరించారు. ‘ఇది మోసళ్లకు సంభోగం కాలం. ఈ సమయంలో అవి చాలా చురుకుగా ఉంటాయి’ అని తెలిపిన అధికారులు తొమ్మిది అడుగుల పొడవైన మోసలి ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.(నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్) -
బెడ్మీద నుంచే "యువర్ ఆనర్’’ అంటున్నారు..
లాక్డౌన్ అయినా సరే కోర్టులు పని చేయాలి. లేకపోతే ముఖ్యమైన కేసులు ఆగిపోతాయి. అందుకే ఇప్పుడు అన్నీ దేశాల కోర్టులూ ఆన్లైన్లో వాదోపవాదాలు విని తీర్పులు ఇస్తున్నాయి. ఫ్లోరిడాలో మార్చి 16 నుంచి కోర్టులు పని చేయడం లేదు. లాయర్లు, జడ్జిగారు వీడియో కాన్ఫరెన్సులోకి వచ్చి కేసుల పరిష్కారం చేస్తున్నారు. అయితే ఫ్లోరిడా జడ్జి డెన్నిస్ బెయిలీకి తనకై తను పరిష్కరించుకోవలసిన సమస్యొకటి వచ్చి పడింది. లాయర్లు బెడ్ మీద నుంచి లేవకుండానే ఆన్లైన్లో స్క్రీన్ మీద సాక్షాత్కరిస్తున్నారు. కొందరికి ఒంటిమీద తగినన్ని బట్టలు ఉండటం లేదు. ఇంకొందరు కళ్లు నులుముకుని ఆవులిస్తూ, ‘‘యువర్ ఆనర్’’ అంటున్నారు. ‘‘ఆర్గ్యుమెంట్సే వినాలా, మీ అవతారాలను చూడాలా’’ అని అప్పటికీ జడ్జిగారు అన్నారు. ఆ మాటను సరిగా అర్థం చేసుకోలేదో.. స్క్రీన్ మీద కనిపించేదానికి కోటూ, టై ఎందుకు అని అనుకున్నారో.. ఎవరూ స్పందించలేదు. చివరికి విసిగిపోయిన జడ్జి డెన్నిస్.. ఆర్డర్ పాస్ చేసి అందరికీ మెయిల్ పెట్టారు... కోర్టుకు వచ్చినట్లే వీడియో కాన్ఫరెన్స్కీ రావాలని. -
కరోనా : ఆరు నిమిషాల వ్యవధిలోనే
ఫ్లోరిడా : ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 12లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారీన పడగా.. మృతుల సంఖ్య 65వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాకు చెందిన వృద్ధ దంపతులు కరోనా బారీన పడి ఆరు నిమిషాల వ్యవధిలో మృతి చెందడం విషాదాంతంగా మారింది. ఈ విషయాన్ని వారి కొడుకు బడ్డీ బేకర్ ట్విటర్లో షేర్ చేస్తూ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్ల హృదయాన్ని హత్తుకుంటుంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన స్టువర్ట్ బేకర్(74), అడ్రియన్ బేకర్(72)లు 51 ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతూ వస్తున్నారు. ఇంతలో కరోనా వారి జీవితాలను తలకిందులు చేసింది. మార్చి మధ్యలో స్టువర్ట్ దంపతులు అస్వస్థతకు గురవడంతో బడ్డీ వారిని హోం క్వారంటైన్లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత బడ్డీ తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో ఈ విషయం తన తల్లికి చెప్పకుండా స్టువర్ట్ను ఆసుపత్రికి తరలించారు. కాగా స్టువర్ట్ పరిస్థితి విషమంగా మారడంతో బడ్డీ తన తల్లి అండ్రియాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అండ్రియా ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించడంతో ఆమెను కూడా వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స కొనసాగించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి శరీరంలో అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో బడ్డీ వెంటనే తన తల్లిని తండ్రి స్టువర్ట్ ఉన్న రూంకు తీసుకొచ్చాడు. వారిద్దరు ప్రశాంతంగా ఉండాలని ఇద్దరికి వెంటిలేటర్ తొలగించారు. స్టువర్ట్, అండ్రియాలు ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్ననిమిషాల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. 2004లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ మూవీ నోట్బుక్లో నోహా, ఎల్లిస్ పాత్రదారులు సినిమా క్లైమాక్స్లో అచ్చం ఇదే తరహాలో 6 నిమిషాల్లోనే మరణిస్తారు. కాగా ఈ వీడియోను బడ్డీ బేకర్ తన ట్విటర్లో షేర్ చేశాడు. ' మా తల్లిదండ్రులను కోల్పోయాననే విషయాన్ని అంత తేలికగా మరిచిపోలేకపోతున్నా.... కరోనా వైరస్ను ఫ్రాణాంతకంగా భావించి ఎప్పటికప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించండి.. ఇంట్లోనే ఉంటూ మీ ప్రాణాలను కాపాడుకోండి' అంటూ క్యాప్షన్ జత చేశాడు. In loving memory of my mom and dad- please make the tough and right choice and help stop the spreading of this virus. pic.twitter.com/FqVEWjdscq — Buddy Baker (@ESG_Baker) March 31, 2020 -
కరోనాపై వైద్యనిపుణులతో నాట్స్ వెబినార్
టాంప(ఫ్లోరిడా) : అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నడుంబిగించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావడంతో నాట్స్ అప్రమత్తమైంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నాట్స్ వైద్య నిపుణులతో వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు కె.వి. సుందరేశ్, డాక్టర్ మధు కొర్రపాటి కొవిడ్-19 పై ఎంత అప్రమత్తంగా ఉండాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాకుండా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు. అంతే కాకుండా కరోనా పేషంట్లలో ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలు ఏమిటి..? ఎలాంటి వారు మరణానికి దగ్గరవుతున్నారు..? అనే విషయాలపై కూడా వైద్య నిపుణులు తమ అనుభవాలను ఈ వెబినార్ లో పంచుకున్నారు. ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా ఈ మహమ్మారి అమెరికాలో పది లక్షల మందికిపైగా వచ్చే అవకాశముందని హెచ్చరించారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లినా కూడా శుభ్రంగా చేతులు కడుక్కోనే ఇంట్లోకి రావాలని... పట్టుకునే సంచుల నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వైరస్ ను మన ఇంట్లోకి మోసుకొస్తున్నామా...? అనే విషయాన్ని పదే పదే గుర్తుంచుకుని వ్యహారించాలని హెచ్చరించారు. కోవిడ్ బారిన పడ్డ ఒక తెలుగు బాధితుడు కూడా ఈ వెబినార్ ద్వారా అందరూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను తెలియ చేశారు. దాదాపు 500 మంది తెలుగువారు ఈ వెబినార్ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. కరోనాపై తమకు ఉన్న సందేహాలను వైద్య నిపుణుల ద్వారా నివృత్తి చేసుకున్నారు. కరోనా వైరస్ విస్తృతమవుతున్న ఈ తరుణంలో సామాజిక దూరం పాటిస్తూ నాట్స్ వెబినార్ నిర్వహిస్తోంది. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, సలహాకమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ మల్లాది, డా. దుర్గారావు పరిమి, టెంపా నాట్స్ కో ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, సుబ్బా రావు యన్నమని, నాట్స్ గ్లోబల్ టీం నుంచి విష్ణు వీరపనేని తదితరులు ఈ వెబినార్ నిర్వహాణలో తమవంతు సహాయ సహాకారాలు అందించారు. ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్కు వ్యాఖ్యతగా వ్యవహారించారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి టాంప ఫ్లోరిడా చాప్టర్ చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఫ్యాన్ చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపర్
-
లేడీ ఫ్యాన్ చెంప చెళ్లుమనిపించిన ర్యాపర్
ఫ్లోరిడా : గ్రామీ అవార్డు నామినేటెడ్ ర్యాపర్ డాబేబీ ఓ లేడీ ఫ్యాన్ చెంప చెళ్లుమనిపించాడు. శనివారం రాత్రి ఫ్లోరిడా, తాంపాలోని ఓ నైట్క్లబ్లో ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లిన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ర్యాపర్ డాబేబీ శనివారం రాత్రి తాంపాలోని ‘విష్కీ నార్త్’ అనే నైట్క్లబ్లో ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లాడు. స్టేజి మీదకు వెళుతుండగా ఓ లేడీ ఫ్యాన్ అతడితో ఫొటో దిగటానికి ఉత్సాహపడింది. సెల్ఫోన్ను అతడి ముఖం వద్ద ఉంచసాగింది. దీంతో చిర్రెత్తిపోయిన అతడు ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు. రెండు సార్లు ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బలతో లేడీ ఫ్యాన్ సొమ్మసిల్లి కిందపడిపోయింది. డాబేబీ(ఫైల్) అనంతరం అతడు ప్రదర్శన ఇవ్వకుండానే అక్కడినుంచి వెనుదిరిగాడు. డాబేబీ తీరుపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఘటనపై డాబేబీ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. సదరు లేడీ ఫ్యాన్ తనను కంటిపై సెల్ఫోన్తో కొట్టిందని తెలిపాడు. ఆ దృశ్యాలు ఉన్న వీడియో పంపిన వారికి పదివేల డాలర్లు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. కాగా, ఈ సంవత్సరం అతడికి బొత్తిగా అచ్చిరావటం లేదు. ఎప్పుడు చూసినా గొడవలతో కాలం వెళ్లదీస్తున్నాడు. కొన్ని నెలలక్రితం మ్యూజిక్ ప్రమోటర్లతో జరిగిన గొడవ కారణంగా అతడు జైలు పాలయ్యాడు. -
బాయ్ఫ్రెండ్ను సూట్కేసులో పెట్టి తాళం వేసింది
-
బాయ్ఫ్రెండ్ను సూట్కేసులో పెట్టి తాళం..
ఫ్లోరిడా : తన బాయ్ఫ్రెండ్ను సరదాగా ఆట పట్టిద్దామనుకొన్న ఒక మహిళ కటకటాలపాలైన ఘటన ఫ్లోరిడా నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. సారా బూన్ అనే మహిళ తన బాయ్ఫ్రెండ్ జార్జ్ టోర్రెస్ జూనియర్తో కలిసి ఫ్లోరిడా నగరంలో నివసిస్తున్నారు. గత సోమవారం ఇంట్లోనే ఉన్న వీరిద్దరు సరదాగా మద్యం సేవించారు. అనంతరం హైడ్ అండ్ సీక్ పేరుతో సారా బూన్ తన బాయ్ఫ్రెండ్ జార్జ్ను సూట్కేసులో పెట్టి జిప్కు తాళం వేసింది. 'ఈ సూట్కేసులో ఎక్కువ సేపు ఉండలేను.. ప్లీజ్ నన్ను బయటికి రానివ్వు' అని జార్జ్ ఎంత వేడుకున్న బూన్ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో రాత్రంతా సూట్కేసులోనే ఉండిపోవడంతో జార్జ్ ఊపిరాడక చనిపోయాడు. మరుసటి రోజు బూన్ కిందకు వచ్చి సూట్కేస్ తెరిచి చూడడంతో జార్జ్ అప్పటికే మృతి చెందడంతో ఆమె షాక్కు గురైంది. దీంతో బూన్ పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని బూన్ను కస్టడీలోకి తీసుకున్నారు. 'మేము మద్యం తాగిన అనంతరం సరదాగా ఉంటుందని హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుదామని జార్జ్ను అడిగాను. అందుకు జార్జ్ ఒప్పుకోవడంతో అతన్ని సూట్కేసులో ఉంచి దానికి తాళం వేసి నా గదిలోకి వెళ్లిపోయాను. నాకు ఊపిరి ఆడడం లేదు.. బయటికి తీయాలని జార్జ్ వేడుకున్నా.. మద్యం మత్తులో నేను పట్టించుకోలేదు' అని పోలీసులకు వివరించింది. అయితే బూన్ ఫోన్లో రికార్డయిన స్టేట్మెంట్ మాత్రం ఆమె చెప్పిన దానికి పొంతన లేకుండా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆ స్టేట్మెంట్లో జార్జ్ బూన్ను... తనను సూట్కేసు నుంచి బయటికి తీయమని అడిగినప్పుడు.. బూన్ పెద్దగా నవ్వుతూ.. 'నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా ఇలాంటి ఫీలింగే కలిగిందని' ఫోన్లో రికార్డయి ఉంది. బూన్ కావాలనే జార్జ్ను చంపిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. -
కార్ వాష్ ఇలా చేస్తారా..?
-
కార్ వాష్ ఇలా చేస్తారా..?
ఫ్లోరిడా : స్విమ్మింగ్ పూల్లో కారు మునిగిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సదరు కారు డ్రైవర్ అనుకోకుండా ఫ్లోరిడా హోటల్లోని స్విమ్మింగ్పూల్లోకి కారును వెనక్కి తీసుకున్నాడు. దీంతో వాహనం స్విమ్మింగ్ పూల్లో పూర్తిగా నీట మునిగింది. కారు నుంచి ప్రయాణీకుడు, డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. వెస్ట్పామ్ పోలీసులు తమ ఫేస్బుక్ పేజీలో హాలిడేఇన్ ఎక్స్ప్రెస్ హోటల్ స్విమ్మింగ్పూల్లో మునిగిన కారు ఫోటోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వైరల్గా మారిన ఈ ఫోటోలపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. కార్పూలింగ్కు వినూత్న నిర్వచనం ఇచ్చారని ఓ ఫేస్బుక్ యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు పూల్సైడ్ పార్కింగ్కు ఇదే సరైన నిర్వచనమని వ్యాఖ్యానించారు. కార్వాష్కు వెళ్లారని మరో యూజర్ కామెంట్ చేశారు. -
చిలుక అరిచింది.. పోలీసులొచ్చారు!
వాషింగ్టన్: చిలుకలకు మాటలు నేర్పిస్తే అవి బాగా నేర్చకోగలవని తెలిసిందే. అయితే, ఇలా మాటలు నేర్చుకున్న ఓ చిలుక ఏకంగా పోలీసులను పరుగులు పెట్టించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో నాలుగు రోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి నుంచి ఎవరో మహిళ ‘హెల్ప్... హెల్ప్..’అని అరుస్తున్నట్లు వినిపించడంతో పక్కింటాయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఇంటికొచ్చారు. అరుపులు వినిపించిన ఇంటికెళ్లి ఆరాతీశారు. విషయం తెలుసుకొని, నవ్వుకొని వెనుదిరిగారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. సాయం చేయమని అరిచింది ఓ చిలుక! దాని పేరు ర్యాంబో. దాని యజమాని మొదట్లో ఆ చిలుకను పంజరంలో ఉంచి ‘హెల్ప్.. నన్ను బయటకు విడిచిపెట్టండి’అనే పదాలు నేర్పించాడు. కొన్నాళ్లకు దాన్ని పంజరం నుంచి స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. కానీ, అది మాత్రం ఆ పదాలు మరిచిపోలేదు. దీంతో ఆ చిలుక అరుపులు విన్న పొరుగింటి వ్యక్తి ఎవరో మహిళా ప్రమాదంలో ఉందని అనుమానించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు రావడం దగ్గర నుంచి వాళ్లు వెళ్లేంత వరకు జరిగిన ఘటనంతా ఆ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. Our Deputies in Lake Worth Beach came to the help of someone screaming for help. Hilarity ensued. https://t.co/6fO5n3OkxC — PBSO (@PBCountySheriff) January 4, 2020 -
శభాష్ మానస్
ఫ్లోరిడా (అమెరికా): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో జూనియర్ గ్రాండ్స్లామ్ టోర్నీగా పరిగణించే ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్షిప్ లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్గా మానస్ ధామ్నె చరిత్ర సృష్టించాడు. ఫ్లోరిడాలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన అండర్–12 బాలుర సింగిల్స్ ఫైనల్లో పుణేకి చెందిన 11 ఏళ్ల మానస్ 3–6, 6–0, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మాక్స్వెల్ ఎక్స్టెడ్ (అమెరికా)పై విజయం సాధించాడు. డబుల్స్ విభాగంలో మానస్ రన్నరప్గా నిలిచాడు. ఫైనల్లో మానస్ (భారత్)–ఆరవ్ హడా (నేపాల్) జంట 6–7 (5/7), 2–6తో సె హ్యుక్ చో–మిన్సెక్ మాయెంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో ఎడ్డీ హెర్ ఓపెన్, ఆరెంజ్ బౌల్ ఓపెన్ టోర్నీలను గ్రాండ్స్లామ్ టోరీ్నలుగా భావిస్తారు. 2008లో యూకీ బాంబ్రీ ఆరెంజ్ బౌల్ ఓపెన్ విజేతగా నిలిచాడు. అదే ఏడాది ప్రపంచ జూనియర్ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. ఎడ్డీ హెర్ టోర్నీలో 90 దేశాల నుంచి 2 వేల మంది జూనియర్ ఆటగాళ్లు అండర్–12, అండర్–14, అండర్–16 బాలబాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీపడ్డారు. గతంలో షరపోవా (రష్యా), ఆండీ రాడిక్ (అమెరికా) తదితరులు ఈ టోర్నీలో విజేతలుగా నిలిచి ఆ తర్వాత సీనియర్స్ విభాగంలోనూ మెరిపించారు.