Medak District News
-
కాంగ్రెస్తోనే పేదలకు మేలు
మనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్తోనే పేదలకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రంగాయపల్లిలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. లింగారెడ్డిపేట, కాళ్లకల్లో దళితవాడల్లో పర్యటించి లబ్ధిదారుడు వర్గంటి యాదగిరి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ర్యాకల కృష్ణగౌడ్, పెంటాగౌడ్ ఉన్నారు. వైఎస్సార్ బాటలోనే పాలనశివ్వంపేట(నర్సాపూర్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చూపిన బాటలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని డీసీసీ అధ్య క్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిన్నగొట్టిముక్ల నుంచి గోమారం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా గోమారంలో సన్నబియ్యం లబ్ధిదారుడు నాగరాజుయాదవ్ నివాసంలో భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని, ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి, మాధవరెడ్డి, నవీన్గుప్తా, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వర జలం.. అన్నదాతల హర్షం తూప్రాన్: మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రధాన చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి. నెల రోజుల పాటు రైతులు తమ సొంత ఖర్చులతో కాళేశ్వరం జలాల కోసం సమష్టిగా చేసిన కృషి ఫలించడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. తొమ్మిది కిలోమీటర్ల మేర కాలువ పనులను రూ. 4 లక్షల వ్యయంతో చేయించారు. దీంతో చెరువులు నిండడంతో పాటు పంట పొలాలు ఎండిపోకుండా కాపాడుకున్నారు. మూడు చెరువులు అలుగు పారతుండడంతో సోమవారం శనిగచెరువు వద్ద వేద పండితులతో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా మహాసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 26,000 నిర్ణయించి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం కేవల్ కిషన్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు సంతోష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పద్మారావు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లచ్చగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
మెదక్ కలెక్టరేట్: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా, పోస్టాఫీస్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ జీవితాన్ని స్ఫూ ర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి కృషి చేయాలని హితవుపలికారు. అనంతరం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. అయితే కలెక్టర్, అదనపు కలెక్టర్ లేకుండా మహనీయుల జయంతి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. స్పందించిన డీఆర్ఓ భుజంగరావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ మాట్లాడుతూ.. కలెక్టర్ సీఎం సమావేశానికి హైదరాబాద్ వెళ్లగా, తల్లి అనారోగ్యం కారణంగా అదనపు కలెక్టర్ నగేష్ సెలవులో ఉన్నారని తెలిపారు. కార్యక్రమానికి ఎస్పీ వస్తున్నారని సముదాయించగా.. ఆందోళన విరమించారు. ఈసందర్భంగా వక్త లు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా నాయకులు పనిచేయాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత విద్యాభ్యాసం చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, డీఎంహెచ్ఓ శ్రీరామ్, వివిధ కులసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
ఉపాధి.. భవిష్యత్తుకు పునాది
సంగారెడ్డిటౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది సంగారెడ్డిలోని గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారిని ఉన్నత స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ 2010లో జూన్ 7న ఏర్పాటు చేయగా నాటి నుంచి ఎస్బీఐ సౌజన్యంతో యువతీ, యువకులకు ఉపాధి కల్పించే అనేక రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు 435 బ్యాచ్లకు శిక్షణ కల్పించి ఎంతోమంది ఉపాధికి బాటలు వేశారు. శిక్షణతోపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పించడమే కాకుండా వ్యాపార రుణాలను సైతం మంజూరు చేస్తోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ అండగా నిలుస్తూ ఉపాధి కల్పిస్తుండడంతో ఈ శిక్షణ కేంద్రంపై నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో రోజురోజుకు దీనికి ఎంతో ఆదరణ పెరుగుతుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు గత 15 ఏళ్లుగా మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్, మగ్గంవర్క్, కంప్యూటర్ శిక్షణతోపాటు ఇటీవల ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ అందిస్తుండగా పురుషులకు మోటార్ వెహికల్ మెకానిక్, సెల్ఫోన్ రిపేరింగ్, సీసీ టీవీ, ఫొటోగ్రఫీ, కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణతోపాటు ఉచితంగా వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో గ్రామీణ నిరుద్యోగ యువత శిక్షణ తీసుకునేందుకు తరలివస్తున్నారు.సొంతంగా బైక్ మెకానిక్ షాపు పెట్టుకున్న స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా బైక్ మెకానిక్లో శిక్షణ పొంది అనంతరం సొంతంగా గ్రామంలోనే మెకానిక్ షాప్ పెట్టుకుని ఉపాధి పొందుతున్నాను. నెలకు రూ.35 వేల వరకు సంపాదిస్తూ మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. – సురేశ్, మునిపల్లి మండలం కంకోల్ గ్రామంకుటుంబానికి ఆసరాగా నిలుస్తా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు మెషీన్ శిక్షణ తీసుకుంటున్నాను. శిక్షణ అనంతరం ఎస్బీఐ ద్వారా రుణం పొంది సొంతంగా కుట్టు మెషీన్ ప్రారంభించి కుటుంబానికి ఆసరాగా ఉంటాను. – అర్చన, మెదక్ జిల్లా, టేక్మాల్ మండలం, సూరంపల్లి11,545 మందికి ఉచిత శిక్షణ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణతోపాటు బ్యాంకు ద్వారా రుణాలను కల్పిస్తున్నాం. ఉచిత వసతితోపాటు వ్యాపారాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. శిక్షణ ఇవ్వడంతోపాటు సొంతంగా ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. ఇటువంటి అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. – రాజేంద్రప్రసాద్, గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న న్యూస్ పేపర్లో వచ్చిన ఉచిత శిక్షణ ప్రకటనను చూసి సంగారెడ్డి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాను. ఆ తర్వాత ఉచితంగా హాస్టల్లో ఉంటూ బ్యూటీషియన్లో శిక్షణ పొందాను. ప్రస్తుతం సంగారెడ్డి లో పార్లర్ నడుపుతున్నాను. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నాను. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. – అశ్విని రాథోడ్, విట్టునాయక్ తండా, మొగుడంపల్లి మండలంఎస్బీఐ సౌజన్యంతో వ్యాపార రుణాలు 11,545 మందికి ఉచిత శిక్షణ లబ్ధి పొందుతున్న నిరుద్యోగులు30 రోజుల పాటు శిక్షణ 2010 జూన్ 7న ప్రారంభమైన ఈ శిక్షణ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 11,545 శిక్షణ తీసుకోగా అందులో 8,116 మంది స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. 3,303 మందికి బ్యాంకుల ద్వారా రుణాలను అందించారు. 834 మంది వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. శిక్షణలో భాగంగా వ్యక్తిత్వ వికాసం, వ్యాపార సంబంధ బ్యాంకింగ్ విషయాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత భోజనం, ఉచిత నివాసం ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తుంది. 30 రోజులపాటు ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తారు. -
డబుల్ బెడ్రూంలు కేటాయించాలి
చేగుంట(తూప్రాన్): అర్హులకు డబుల్బెడ్రూంలు కేటాయించాలని కోరుతూ మండల కేంద్రంలో సోమవారం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం చేగుంటలో లబ్ధిదారుల సర్వే నిర్వహించి అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఇళ్లు కేటాయించకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎంపిక చేసిన వారికి ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ సమస్య ఏర్పడగా, పోలీసులు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
నీళ్ల చారుతో భోజనమా?
కౌడిపల్లి(నర్సాపూర్): హాస్టల్లో సిబ్బందికి మంచి భోజనం వండి విద్యార్థులకు మాత్రం నీళ్ల చారు పెడతారా..? రెండు నెలలుగా కోడి గుడ్డు లేదు.. మీ ఇంట్లో పిల్లలకు ఇలాంటి భోజనమే ఇస్తారా అంటూ హాస్టల్ వార్డెన్తో పాటు సిబ్బందిపై ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్తో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుకొని సోమవారం కౌడిపల్లి ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్ను సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ గదులు, పరిసరాలు, టాయిలెట్స్ను పరిశీలించారు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. హాస్టల్ సిబ్బంది మంచి భోజనం వండుకొని పిల్లలకు నీళ్ల చారు పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చింతపండు తప్ప ఏ స్టాక్ లేదన్నారు. హాస్టల్ నుంచే కలెక్టర్తో మాట్లాడి సమస్యలను వివరించారు. ఆమె వెంట తహసీల్దార్ ఆంజనేయులు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గణేశ్వర్, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, సీహెచ్సీ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఆర్ఐ శ్రీహరి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు నవీన్గుప్త, నాయకులు పాల్గొన్నారు. మెరుగైన చికిత్స కోసం మెదక్ తరలింపు ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల్లో 11 మందిని సోమవారం సాయంత్రం మెదక్ ఎంసీహెచ్ తరలించారు. ఉదయం మండల వైద్యాధికారి శ్రీకాంత్, సీహెచ్సీ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో హాస్టల్లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 31 మందికి చికిత్స అందించారు. మరో నలుగురికి మందులు పంపిణీ చేశారు. కాగా ఇందులో వివిధ తరగతులకు చెందిన 11 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం 108లో మెదక్ ఎంసీహెచ్కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని, ముందు జాగ్రత్తగా జిల్లా అధికారులు సూచన మేరకు మెదక్ తరలించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మీ పిల్లలకు ఇలాగే పెడతారా.. హాస్టల్ వార్డెన్పై ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్ చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శ సిబ్బందికి మాత్రం నాణ్యమైన ఫుడ్పై ఆరా.. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపర్చాలన్నారు. రోగులతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు..? అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా? అని ఆరా తీశారు. మందులన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. నేడు కలెక్టరేట్లో అంబేడ్కర్ జయంతి మెదక్ కలెక్టరేట్: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్లో కార్యక్రమం ఉంటుందన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నర్సాపూర్: అగ్నిమాపక వారోత్సవాల వాల్పోస్టర్ను ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో అగ్నిమాపక లీగల్ ఫైర్మెన్ ఐలయ్య, ఇతర సిబ్బంది జానారెడ్డి, వెంకటేశం, అనిల్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, బాల్రెడ్డి, ప్రసాద్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మకు మొక్కులు పాపన్నపేట(మెదక్): దుర్గమ్మా... దండాలమ్మ అంటూ వేలాది భక్తులు వేడుకున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. ఒడిబియ్యం పోసి, బోనాలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మండుటెండలో చెట్లకింద సేదదీరి విందు చేసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఎస్ఐ శ్రీని వాస్, ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కేసీఆర్ను కలిసిన భాస్కర్ టేక్మాల్(మెదక్): మండలంలోని బొడ్మట్పల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బేగరి భాస్కర్ ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలను ఆయనకు వివరించారు. అర్హులు ఇందిరమ్మఇళ్లు నిర్మించుకోవాలినారాయణఖేడ్: అర్హులైన ప్రతీ ఒక్కరూ ఇదిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. మనూరు మండలం దుదగొండలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...అర్హులకే ఇళ్లను మంజూరు చేశామన్నారు. అనంతరం గ్రామంలో బీరప్పస్వామి, ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు వినోద్పాటిల్, దిగంబర్రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సంగన్న, శ్రీకాంత్రెడ్డి తదితరులు ఉన్నారు. ఉత్సాహంగా కుస్తీ పోటీలు నారాయణఖేడ్: హనుమాన్ జయంతి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయం ఆవరణలో ఆదివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ కుస్తీపోటీలకు స్థానికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. చివరి కుస్తీ పోటీకి 5 తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందజేశారు. కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్, ఇరక్పల్లి దేవిదాస్ మహారాజ్, గోపాల్, కిషన్, విఠల్నాయక్, రాంచెందర్, దేవీసింగ్, నందు, బక్షిరాం పాల్గొన్నారు. వరంగల్ సభను విజయవంతం చేయాలిఎమ్మెల్యే మాణిక్రావు పిలుపు జహీరాబాద్ టౌన్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు పార్టీ శ్రేణులను కోరారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
కల్లాల ఆశలు కల్లలు
ధాన్యం ఆరబెట్టలేక రైతుల తిప్పలురామాయంపేట(మెదక్): ఆరుగాలం శ్రమించే రైతులకు పంటను ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారుతోంది. కల్లాలు లేక రహదారుల వెంట ఆరబోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రైతులు కల్లాలు నిర్మించుకోవడానికి వీలుగా కేంద్రం ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా పరిధిలో 2,000 మందికి పైగా రైతులు వీటిని నిర్మించుకున్నారు. అయితే గత రెండున్నర ఏళ్ల క్రితం ఈ పథకం రద్దు కావడంతో ఆందోళన చెందుతున్నారు. పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడం, తూర్పార పట్టడానికి సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో తారు రోడ్లు, వ్యవసాయ బోర్ల వద్ద మడుల్లో ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ముఖ్యంగా రోడ్డుపై ఆరబెడుతున్న ధాన్యంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం కుప్పలను ఢీకొని రెండేళ్లలో జిల్లా పరిధిలో ఎనిమిది మందికి పైగా వాహనదారులు మృతిచెందారు. రోడ్డుపై ధాన్యం ఆరబోసినందుకు గాను జిల్లా పరిధిలో కొందరు రైతులపై గతంలో కేసులు సైతం నమోదయ్యాయి. కల్లాలు మంజూరు చేసిన మొదట్లో సరైన అవగాహన లేకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో చాలా మంది పూర్తిస్థాయిలో నిర్మించుకోలేదు. కల్లాలు అత్యవసరమని ఇప్పుడిప్పుడే రైతులు గుర్తిస్తున్న క్రమంలో ఈ పథకం రద్దయింది. కేంద్రం తిరిగి ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. పథకం రద్దయింది గతంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో జిల్లా పరిధిలో చాలా మంది రైతులు వీటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం రద్దయింది. తిరిగి పునరుద్ధరిస్తే రైతులకు మేలు కలుగుతుంది. – శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దాం
నర్సాపూర్ రూరల్: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని అచ్చంపేటలో పార్టీ కార్యకర్తలతో కలిసి స్వచ్ఛభారత్ నిర్వహించారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, యువత, విద్యార్థులు అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. అంబేడ్కర్ దేశంలోని అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని పొందుపరచారన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నగేష్, దళిత మోర్చ నాయకులు అంజి, భిక్షపతి, విక్రం, లడ్డు, నారాయణరెడ్డి, విక్రం పాల్గొన్నారు. -
భూ సమస్యలకు మోక్షం
భూ సమస్యలకు మోక్షం!సర్వేకు నోచుకోని వేలాది ఎకరాలు జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాలకు పైగా భూములు సమస్యల్లో ఉన్నాయి. ఆ భూములు మావి అని రెవెన్యూ శాఖ వారు అంటే, కాదు మావి అంటూ ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలు ఇస్తే, అవి మావంటూ ఫారెస్ట్ అధికారులు లాక్కున్న ఘటనలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ భూములు సర్వేకు నోచుకోకుండా పోయాయి. ధరణి స్థానంలో ‘భూ భారతి’ ● జిల్లావ్యాప్తంగా పార్ట్(బీ)లో 30 వేల ఎకరాలు ● కొత్త మాడ్యూల్స్తో లభించనున్న పరిష్కారం నూతన రెవెన్యూ చట్టం భూ భారతితో భూ సమస్యలకు మోక్షం లభించనుంది. మొన్నటి వరకు ధరణిలో ఎలాంటి భూ సమస్యలున్నా దరఖాస్తు చేసుకుంటే అది కలెక్టర్ లాగిన్కు వచ్చేది. దీంతో చాలా జాప్యం జరగగా.. ఏళ్లుగా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం తీసుకొస్తున్న భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో.. మొత్తంగా జిల్లాలోనే భూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. – మెదక్జోన్ జిల్లాలో సుమారు 30 వేల పైచిలుకు భూములు నిషేధిత పార్ట్ (బీ)లో ఉన్నాయి. గత ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన ధరణి చట్టంలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్కు సైతం అధికారం ఇవ్వకుండా మాడ్యూల్స్ను తయారుచేశారు. ఏ చిన్న సమస్య ఉన్నా, వాటిని వెంటనే పార్ట్(బీ)లో పెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో భూముల క్రయ, విక్రయాలు నిరంతరంగా కొనసాగుతాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించే వీఆర్ఓలను తొలగించారు. గతంలో భూ సమస్యలు ఉత్పన్నం అయితే తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ స్థాయి అధికారుల వద్ద పరిష్కారం లభించేది. ధరణిలో అలాంటివేవి లేకుండా చేశారు. మచ్చుకు కొన్ని.. ● మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబుపేటలో 236, 216, 309 సర్వే నంబర్లలో 800 ఎకరాల పరంపోగు (పట్టా) భూములకు సంబంధించి 250 మంది రైతులకు పట్టాలు ఉన్నాయి. వారు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బోర్లు వేసి పంటలు పండించుకున్నారు. కాగా ధరణి కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఆ గ్రామంలోని మూడు ఈ సర్వే నంబర్లను పరిశీలించగా రికార్డుల్లో 1,000 ఎకరాలు ఉన్నట్లు తెలింది. ధరణి వచ్చాక ఆ గ్రామంలోని 800 ఎకరాలను పార్ట్(బీ)లో పెట్టారు. ఏళ్ల తరబడి ఉన్న పట్టాలను రద్దు చేశారు. అధికారుల తప్పిదంతో రికార్డుల్లో ఎక్కువ భూమిని రాస్తే మా భూములు (పార్ట్ బీ)లో ఎలా పెడతారని పేద రైతులు ప్రశ్నించారు. ● కౌడిపల్లి మండలం మహ్మద్నగర్లో సుమారు 80 ఎకరాల భూములకు సంబంధించి ఆ గ్రామంలోని కొంత మంది రైతులకు పట్టాలు ఉండగా, వారు భూములు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ధరణి చట్టం అమల్లోకి వచ్చాక గతంలో ఆ భూములు ఓ భూస్వామివని తేలింది. అతని పేరు తెరపైకి రావడంతో సదరు వ్యక్తి హైదరాబాద్లో ఉండి మరో వ్యక్తికి భూములు విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి గ్రామానికి వచ్చి భూములు తమవే అని అనడంతో ప్రస్తుతం గ్రామంలో గొడవలు జరుగుతన్నాయి. ● చిన్నశంకరంపేట మండలం జంగరాయి శివారులో 406, 360, 274 సర్వే నంబర్లలో అబ్దుల్ ఖాదర్ భూములు 500 ఎకరాలు ఉండగా.. వాటిని కొంతకాలంగా వందలాది మంది రైతులు పట్టాలు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. ధరణి అమల్లోకి వచ్చాక ఆ మూడు సర్వే నంబర్లను తీసి వేసి ఒకటే సర్వే నంబర్గా మార్చి అసైన్మెంట్ పట్టాలుగా రికార్డుల్లో పొందుపరిచారు. గతంలో ఆ భూములకు సంబంధించి రైతులు క్రయ, విక్రయాలు జరిపారు. ప్రస్తుతం వాటిని అసైన్మెంట్గా మార్చడంతో ఆందోళన చెందుతున్నారు. -
అట్టహాసంగా ధ్వజస్తంభ ఊరేగింపు
పెద్దశంకరంపేట(మెదక్): సీతారాముల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ధ్వజస్తంభం ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమలాపూర్ హనుమాన్ ఆలయం వద్ద ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల నృత్యాలు, మంగళ హారతులు, కేరళ వాయిద్యాలు, డాక్టర్ ఐశ్వర్యరెడ్డి అధ్వర్యంలో సాయితుంబుర వారి కూచిపూడి నృత్యాలు, భారీ హనుమాన్ విగ్రహ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈనెల 21వ తేదీ నుంచి 23 వరకు నూతన ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైద్య వృత్తి మహోన్నతమైనది
మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటఅర్బన్: వైద్య వృత్తి మహోన్నతమైనదని, వృత్తిలో రాణించి తల్లిదండ్రులకు, సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మిట్టపల్లి సమీపంలో సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి గ్రాడ్యుయేషన్ వేడుకలకు మంత్రితో పాటు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్రావు, యూనివర్సిటీ వీసీ నందా కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్దిమందికి మాత్రమే డాక్టర్గా అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కనబడే దేవుళ్లు డాక్టర్లేనని అన్నారు. గతంలో మెడికల్ కాలేజీ లు తక్కువగా ఉండేవని తెలంగాణ వచ్చాక చాలా కాలేజీలు వచ్చాయన్నారు. నేటి విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని, తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడంతో పాటు సామాజిక బాధ్యతతో వైద్యం అందించాలని అన్నారు. డాక్టర్లుగా వెళ్తున్న 2019 బ్యాచ్ విద్యార్థులు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సురభి మెడికల్ కాలేజీ చైర్మన్ హరిందరావు, మహేందర్ రావు, మనోహర్ రావు, డీన్ రఫీ, మెడికల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్సే
సిద్దిపేటజోన్: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగసేనని, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో వరంగల్ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘నాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, వెంకట్, మురళి, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అశోక్నగర్ కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపట్టారు.. రాహుల్ గాంధీని అశోక్ నగర్కు తీసుకొచ్చి ప్రామిస్ చేయించారు. మీకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. కానీ నిరుద్యోగులకు రాలేదు.. ఎందుకు మీ గొంతులు మూగపోయాయని హరీశ్ రావు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాల పేరిట యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీకి నిరుద్యోగుల బాధలు కనబడడం లేదా వినబడడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన నిరుద్యోగ భృతి వట్టి మాటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి యువత కీలకమని, రజతోత్సవ సభకు వరంగల్ వరకు వెయ్యి మంది యువత పాదయాత్ర చేయనున్నారని అన్నారు. సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి వట్టిమాటేనా? ప్రభుత్వ తీరుపై హరీశ్ ఫైర్ -
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
మెదక్ మున్సిపాలిటీ: మత్తుతో జీవితం నాశనం అవుతుందని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్శాఖ డ్రగ్స్ నిర్మూలన కోసం నిరంతరం నిఘా నేత్రాలతో పర్యవేక్షిస్తుందన్నారు. పౌరులు, ప్రజలు బాధ్యతగా సహకరించాలని కో రారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో మార్పు రావాలని అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుందని, భవిష్యత్ అంధకారం అవు తుందని వివరించారు. ఇది దేశ యువశక్తిని నిర్వీ ర్యం చేస్తుందన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా చేయడం తీవ్రమైన నేరమన్నారు. డ్రగ్స్కు అలవాటుపడిన వారి గురించి సమాచారం ఇస్తే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్ నామస్మరణతో మెతుకుసీమ పుర వీధులు మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సాపూర్ రాయరావు చెరువు సమీపంలోని హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్,ఆయా పార్టీల నాయకులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రలో పాల్గొన్నారు. – నర్సాపూర్ -
జీవవైవిధ్యం.. ఆహ్లాదం
125 ఎకరాల్లో అర్బన్ పార్క్రూ. 2 కోట్ల కేంద్రం నిధులతో ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్న పనులు ప్రజల జీవ వైవిధ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. నగర వన యోజన పథకంలో భాగంగా జిల్లాలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో దీని నిర్మాణానికి రూ. రెండు కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. – రామాయంపేట(మెదక్) పట్టణ ప్రజలతో పాటు జాతీయ రహదారి (765 డీజీ)పై ప్రయాణించే వాహనదారులు సేద తీరడానికి వీలుగా రోడ్డును ఆనుకొని అర్బన్ పార్కు నిర్మిస్తున్నారు. ఇది రామాయంపేట మున్సిపాలిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ పూర్తికాగా పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల మేర స్థలం కేటాయించారు. నిర్మాణం పూర్తయిన అనంతరం తాత్కాలిక రుసుముతో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారి వైపు మెయిన్ గేట్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. 125 ఎకరాల చుట్టూ తిరిగి రావడానికి వీలుగా మట్టి రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన స్ధలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. నిర్మించాల్సినవి ఇవే.. నగర వన యోజన పథకంలో భాగంగా వాచ్ టవర్, పగోడ, మెయిన్ గేట్, టాయిలెట్స్, హర్బల్, బొటానికల్ గార్డెన్లు, వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయన్నారు. ఇందులో సోలార్ లైట్లతో పాటు సీసీ కెమెరాలు అమర్చనున్నారు. చెక్ డ్యాంలతో పాటు నీటి కుంటలు, రాళ్ల తెట్టెలు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట పరికరాలు ఏర్పాటు కానున్నాయి. అటవీ ప్రాంతాన్ని వీక్షించడానికి వీలుగా వాచ్టవర్ నిర్మిస్తున్నారు. ఈ పార్కులో అరుదైన ఔషద మొక్కలు నాటనున్నారు. పర్యావరణంపై అవగాహన కొత్తగా నిర్మిస్తున్న అర్బన్ పార్కులో ప్రధానంగా సందర్శకులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఎన్విరాన్మెంట్ సెంటర్ నెలకొల్పుతున్నారు. సందర్శకులకు పర్యావరణం, అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల వివరాలు, వాటి మనుగడ, అడవుల సంరక్షణతో కలిగే లాభాల గురించి అవగాహన కల్పించనున్నారు.పర్యావరణం, జంతువుల సంరక్షణకు పెద్దపీట అక్కన్నపేట అటవీ ప్రాంతంరూ. 2 కోట్లు మంజూరయ్యాయి పట్టణ ప్రజలతో పాటు రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు సేద తీరడానికి గాను కేంద్ర నిధులతో అర్బన్ పార్కు నిర్మిస్తున్నాం. ఈ మేరకు కేంద్రం నుంచి రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల మనుగడ, వాటి జీవన విధానంపై సందర్శకులకు అవగాహన కల్పిస్తాం. – విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారి -
గునపం పట్టి.. కదకం తవ్వి
రామాయంపేట(మెదక్): మండలంలోని పర్వతాపూర్ అటవీలో కొనసాగుతున్న ఉపాధి పనులను శనివారం కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. గ్రామం నుంచి కాలినడకన అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆయన కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గునపం పట్టుకొని తవ్వకం చేపట్టారు. కందకాలను పరిశీలించి కొలతలు సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులతో అటవీ భూమిలో నీటి మట్టం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీ నుంచి 50 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారని, వీరి సంఖ్య 100 పెరగాలని సిబ్బందికి సూచించారు. ఉపాధి కార్డున్న ప్రతి కూలీ పనిలో పాల్గొనాలన్నారు. అనంతరం కాట్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. దారిలో వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. -
రేపటి నుంచి బేతాళస్వామి జాతర
అల్లాదుర్గం(మెదక్): ఏడుపాయల జాతర తర్వాత జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే బేతాళ స్వామి జాతర ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరవుతుంటారు. జాతరలో జంతు బలులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బేతాళస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో 4 వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం. సమీప గ్రామాలకు చెందిన భక్తులు ఎడ్ల బండ్లను అలంకరించి ఆలయం చట్టూ తిప్పుతారు. బేతాళ స్వామిపై భక్తితో అల్లాదుర్గంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు తమ పిల్లలకు బేతయ్య, బేతమ్మ పేర్లను ఎక్కువగా పెట్టుకుంటారు. 14న పోలేరమ్మ దేవతకు, 15న పోచమ్మకు, 16న దుర్గమ్మకు, 17న బేతాళస్వామికి బోనాలు తీయడం అనావాయితీ. 18న ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు తిప్పటం. 19న భాగవతం, 20న భజనలు, 21న వినోద కార్యక్రమాలు, 22న ఉదయం పాచి బండ్లు తిరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. -
ప్రజలకు విస్తృత సేవలు
జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్జహీరాబాద్: పార్లమెంట్ కేంద్రమైన జహీరాబాద్లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత విస్తృతమైన సేవలు అందించనున్నట్లు ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. జహీరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా జహీరాబాద్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ క్యాంపు కార్యాలయ ఇన్చార్జిగా సీనియర్ నాయకుడు పస్తాపూర్కు చెందిన శుక్లవర్ధన్రెడ్డిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, కాంగ్రెస్ నాయకులు పి.నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శౌకత్, భాస్కర్రెడ్డి, మక్సూద్, అర్షద్, అశోక్, అస్మాతబస్సుమ్ పాల్గొన్నారు. -
రజతోత్సవ సభకు తరలిరండి
శివ్వంపేట(నర్సాపూర్): ఈనెల 27న వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని వివిధ కూడళ్లతో పాటు తూప్రాన్– నర్సాపూర్ హైవే పక్కన గల కల్వర్టు గోడపై రాస్తున్న వాల్ రైటింగ్ను శనివారం పరిశీలించారు. ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు మన్సూర్, హన్మంత్రెడ్డి, లాయక్ తదితరులు పాల్గొన్నారు. వన దుర్గమ్మకు పల్లకీ సేవ పాపన్నపేట(మెదక్): పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో శనివారం వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరి ంచుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీపై ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు మనోహరాబాద్(తూప్రాన్): హనుమాన్ జయ ంతి సందర్భంగా శనివారం మండలంలోని కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం, కూచారంలోని హనుమాన్ దేవాలయం, కోదండ రామాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. హనుమంతుడికి ఆమె పట్టువస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మా ట్లాడుతూ.. హనుమాన్ దేవాలయ అభివృద్ధికి గతంలో కేసీఆర్ రూ. 22 లక్షలు అందజేశారని గుర్తుచేశారు. ఆమె వెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ జెడ్పీ మాజీ చైర్పర్సన్ హేమలత, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, స్థానిక నాయకులు కొట్టాల యాదగిరి, పురం రవి, రేణుకుమార్, భిక్షపతి, అర్జున్, దాసరి నరేష్, ఉదయ్రంజన్గౌడ్, ఆంజనేయులు, రాజు తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పంచాయతీ కార్మికులు ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేశారు. న్యాయం చేయండి కొల్చారం(నర్సాపూర్): విధులు నిర్వర్తించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న పాలకమండలి సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని చిన్నఘనాపూర్ పీఏసీఎస్ సీఈఓ సత్యనారాయణరెడ్డి రెండు రోజులుగా కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నారు. పాలకమండలి, సీఈఓ మధ్య మూడేళ్లుగా లావాదేవీల విషయమై వివాదం కొనసాగుతోంది. సంఘానికి చెందిన సొమ్మును సొంతానికి వాడుకున్నారని సీఈఓను పక్కన పెట్టారు. ఈ విషయం సత్యనారాయణరెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టును ఆ శ్రయించగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 44 నెలల పెండింగ్ వేతనం చెల్లించాలని కలెక్టర్, మరో నలుగురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇటీవలే విధుల్లోకి తీసుకున్నా రు. మూడు రోజుల అనంతరం కార్యాలయంలోనికి వెళ్లకుండా పాలకమండలి సభ్యులు గదికి తాళం వేశారు. చేసేది లేక ఆరుబయటే ఉంటూ నిరసన తెలుపుతున్నాడు. డంపింగ్యార్డ్ మాకొద్దు67వ రోజుకు చేరిన నిరసన జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు శనివారం నాటికి 67వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల గ్రామాల్లో రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా కొసాగుతున్నాయి. -
ప్రతి గింజకూ మద్దతు ధర
కొండపాక(గజ్వేల్): ప్రతి గింజకూ మద్దతు ధర అందించేలా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పార పట్టాక పాసింగ్ చేయాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాల్కు మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్రావు, నాయకులు వెంకటేశంగౌడ్, సుదర్శన్, పర్శరాములు, ప్రభాస్, నరేందర్ రావు, నర్సింగరావు, రైతులు, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి -
ఆకస్మిక తనిఖీలతో హడల్
మెదక్జోన్: ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్ హడలెత్తిస్తున్నారు. రిజిస్టర్లో సంతకాలు పెట్టి విధులకు ఎగనామం పెట్టే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ముగ్గురిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. తాజాగా శనివారం జిల్లా కేంద్రంలోని గోల్కొండ వీధి బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో సిబ్బంది పనితీరుపై స్థానికంగా ఆరా తీశారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని తెలుసుకొని మెడికల్ ఆఫీసర్, స్టాఫ్నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా గతేడాది మార్చిలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్రాజ్ క్షేత్రస్థాయి పర్యటనలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలలు, కళా శాలలు, కేజీబీవీలు, గురుకులాలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులతో పాటు మారుమూల గ్రామా ల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ దవాఖానలను వరుసగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఆయా శాఖల సిబ్బంది, అధికారులు సక్రమంగా విధులకు హాజరవుతుండగా, కొంత మందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఫలితంగా కలెక్టర్ ఆగ్రహానికి గురవుతున్నారు. ఉద్యో గులు పనిచేసే చోట ఉండాలని, ఎవరెవరు ఎక్కడ అద్దెకు ఉంటున్నారో పూర్తి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి నిత్యం వచ్చిపోయే అధికారులు సైతం స్థానికంగా నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా ప్రతి అధికారి క్షేత్రస్థాయి పర్యటన తప్పకుండా చేయాలని కూడా సూచించారు. విధులకు ఎగనామం పెట్టే వారిపై కలెక్టర్ రాహుల్రాజ్ వేటు తాజాగా ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్ -
ఆయిల్పామ్ సాగులో మోడల్గా నిలపాలి
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావునంగునూరు(సిద్దిపేట): తెలంగాణకు గుండెకాయగా ఉన్న సిద్దిపేటను ఆయిల్పామ్ సాగులో ఆదర్శంగా నిలపాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. నర్మెటలో 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీ కారం చేయగానే నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే తొలి సంతకం చేశానన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతన మిషన్లు, టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, ఇక్కడే రిఫైనరీ చేస్తారన్నారు. జూన్ నెలాకరు వరకు ఫ్యాక్టరీ ప్రారంభించేలా ఆయిల్ఫెడ్ చైర్మన్, కలెక్టర్ చొరవ తీసుకొని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నారు. నూనె వినియోగం పెరగడంతో లక్ష కోట్ల రూపాయల విదేశీ మారకం వృథాగా మారుతోందని, దీన్ని అరికట్టేందుకు 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
మెదక్ ఎంపీ రఘునందన్రావుమెదక్జోన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులే గెలవాలని, ఆదిశగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో శుక్రవారం పట్టణంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. ఎమ్మెల్సీల గెలుపులో బీజేపీ కార్యకర్తలు, తపస్ నేతల కృషి మరిచి పోలేనిదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపిద్దామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు పట్టణంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, నేతలు ఎంఎల్ఎన్ రెడ్డి, శివ, తదితరులు పాల్గొన్నారు. సీఎం మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్రెడ్డి మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్రావు అన్నారు. తెలంగాణలో బీ జేపీని రానివ్వమని అంటున్నారని, ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వి జయం సాధించిన విషయం ఆయనకు కనబడటంలేదా అని ప్రశ్నించాడు. దేశంలో కాంగ్రెస్ పని అయిపొయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ప్రభుత్వ స్థలాలు విక్రయించిందన్నారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ల కోసం వేలాది ఎకరాల పేదల భూములు లాక్కున్న చరిత్ర వారిదేనని ఆరోపించారు. ప్రస్తుతం భూములు ఎలా అమ్ముతారని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. -
స్కాన్ చెయ్.. టికెట్ తీస్కో..
మెదక్ మున్సిపాలిటీ: ‘టికెట్కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్కు సహకరించగలరు’ అనే నినాదానికి ఇక నుంచి ఆర్టీసీ సంస్థ స్వస్తి పలకనుంది. వేధిస్తున్న చిల్లర సమస్యను తట్టుకునేందుకు బస్సుల్లో నగదు రహిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి బస్సులో ఈ–టిమ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య చిల్లర గొడవ తీరిపోనుంది. గతంలో చిల్లర లేక కండక్టర్లు ఇతర ప్రయాణికులతో డబ్బులు జత చేసి ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. మెదక్ డిపోకు 80 ఈ–టిమ్ మిషన్లు మెదక్ డిపోలో మొత్తం 94 బస్సులు ఉండగా, ఇందులో 39 ప్రభుత్వ, 55 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. వీటి కోసం ఆర్టీసీ యాజమాన్యం 80 నగదు రహిత ఈ–టిమ్ యంత్రాలను మెదక్ డిపోకు కేటాయించినట్లు డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. ఈ యంత్రాలతో (ఫోన్ పే, గూగుల్ పే) నగదు రహిత ఆన్లైన్ యాప్ ద్వారా స్కాన్ చేయవచ్చని తెలిపారు. అలాగే డెబిట్ కార్డులతో స్వైపింగ్ చేసి టికెట్ తీసుకునే సౌకర్యం ఆర్టీసీ కల్పించిందన్నారు. డిపోలో ప్రస్తుతం ఈ–టిమ్ యంత్రాలను సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మిగితా యంత్రాలను త్వరలోనే అన్ని బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. ఆర్టీసీలో నగదు రహిత సేవలు ప్రస్తుతం సూపర్ డీలక్స్ బస్సుల్లో ప్రారంభం దశలవారీగా అన్ని సర్వీసుల్లో అమలు -
మహనీయుడు జ్యోతిబా పూలే
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: కుల, మతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించడానికి యువత నడుం బిగించాలని కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని కలెక్టరేట్లో నిర్వహించగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, వివిధ బీసీ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పూలే దంపతులు సమాజ హితం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ప్రభుత్వం సమీకృత గురుకులాలు ఏర్పాటు చేసి అన్నివర్గాల పిల్లలు విద్యనభ్యసించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా జిల్లాలో సుమారు 4,500 మందికి రూ. 50 కోట్లతో స్వయం ఉపాధి రుణాలు సబ్సిడీతో ఇస్తున్నామన్నారు. అనంతరం సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు జ్యోతిబా పూలే నిరంతరం పోరాడరని తెలిపారు. అంతకుముందు పట్టణంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, సెక్రటరీ రాజ్కుమార్, డీపీఓ యాదయ్య, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి హవేళిఘణాపూర్/మెదక్ కలెక్టరేట్: వర్షాలు కు రిస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు టార్పాలి న్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపులో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో..మెదక్ మున్సిపాలిటీ: కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన గొప్ప మహనీయుడు మహాత్మ జ్యోతిబా పూలే అని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పూలే అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలనకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పనిమంతులు
అతివలే ‘ఉపాధి’ పనుల్లో మహిళలే ఎక్కువ● ఉమ్మడి మెదక్ జిల్లాలో జాబ్ కార్డులు 5.8లక్షలు ● కూలీలు 11.29లక్షలు ● వసతులు కల్పిస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలీ పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. గ్రామీణ నిరుపేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరం లాంటిది. ఉమ్మడి మెదక్ జిల్లా (2024–25)లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని దినాలను ఉపయోగించుకుని భేష్ అనిపించారు. సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 5.8లక్షల జాబ్ కార్డులుండగా 11.29లక్షల మంది ఉపాధి కార్మికులున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన కొత్తల్లో పురుషులే పనులకు వెళ్లేవారు. రానురాను క్రమంగా మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో మహిళలలే ముందు వరుసల్లో నిలిచారు. ఉమ్మడి జిల్లాలో మహిళలు 90,88,784 పని దినాలను, పురుషులు 56,09,316 పని దినాలను ఉపయోగించుకున్నారు. నైపుణ్య శిక్షణ పథకంలో భాగంగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల్లో యువతీ యువకులుంటే వారికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్నతి అనే పథకం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఉన్నతి శిక్షణలో సైతం అనేక రకాల నైపుణ్యాలు నేర్చుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ శిక్షణతో మరింత రాణించి ఆర్థికంగా ముందుకు సాగుతున్నారు. మరిన్ని వసతులు కల్పిస్తే.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు అన్ని వసతులు కల్పిస్తే మహిళల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. రోజుకు 3 నుంచి 5గంటల వ్యవధిలో రూ.307 వరకు సంపాధించుకునే ఆస్కారం ఉండడంతో వ్యవసాయ ఆధారిత కూలీలు సైతం ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి
ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకం అమలు చేస్తూనే పట్టణంలోని అన్ని బోర్లకు మోటార్లు బిగించి, నీటి సరఫరా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ సరిగా చేపట్టకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాగా పట్టణంలో కరెంట్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాయరావు చెరువు పంట కాల్వ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నిరంతర వైద్య సేవలు అందించాలి: డీఎంహెచ్ఓపాపన్నపేట(మెదక్): రోగులకు నిరంతర వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ శ్రీరాం వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం పాపన్నపేట పీహెచ్సీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. జాతీయ కార్యక్రమాలు ఎయిడ్స్, పైలేరియా, కుష్టు, మలేరియా తదితర రోగాల నివారణకు వైద్య సిబ్బంది నిరంతర కృషి చేయాలని చెప్పారు. ఆయన వెంట డాక్టర్ హరిప్రసాద్, అన్వర్, సీహెచ్ఓ చందర్, శ్రీనివాస్రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో శనివారం ఆయా ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మెదక్ విద్యుత్ శాఖ ఏడీఈ మోహన్బాబు, పట్టణ ఏఈ నవీన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో పట్టణ ప్రజలు తమకు సహకరించాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు నర్సాపూర్ రూరల్: రాజకీయ పార్టీలకు కార్యకర్తలే పట్టుగొమ్మలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రమేష్గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దచింతకుంటలో మండల పార్టీ అధ్యక్షుడు నీలి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ క్రియాశీల సభ్యత్వ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజేష్, బూత్ అధ్యక్షులు సాయినాథ్, నాగరాజ్ పాల్గొన్నారు. నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు నర్సాపూర్ రూరల్: పట్టుదలతో పాటు నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. ప్రకాష్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నర్సా పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాలేదని నిరాశ చెందవద్దన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, వైస్ ప్రిన్సిపాల్ సమీరా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సురేష్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. గురువారం కలెక్టర్ మనుచౌదరి, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, వరి, మామిడి పంట లను అకాల వర్షం తీవ్రంగా నష్టపరిచిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూ చించారు. నష్టపోయిన రైతులకు రూ. 20 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే
గజ్వేల్: గ్యాస్ ధరలు తగ్గించేవరకు పోరాటం కొనసాగిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హెచ్చరించారు. గురువారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా గ్యాస్ ధరలను పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విర్తుస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒక్కో సిలిండర్పై రూ.50 ధరను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
రైతులకు అండగా కాంగ్రెస్
ప్యాడీ క్లీనర్తో ధాన్యం శుభ్రం చేయాలికలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాత విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం మెదక్ మండలం పాతూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్యాడీ క్లీనర్తో ధాన్యం శుభ్రం చేయకపోవడం వల్ల రెండు, మూడు కిలోల తరుగుపోతుందన్నారు. రైతులు పంటలు కోసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 నిర్ణయించినందని వెల్లడించారు. జిల్లాలోని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ లక్ష్మణ్బాబు తదితరులు పాల్గొన్నారు.సంగారెడ్డి/జోగిపేట(అందోల్) : రైతులకు అండగా ఉండేది, వ్యవసాయాన్ని పండగగా మా ర్చింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట్ డివిజన్లో గురువారం జరిగిన ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరై చైర్మన్ తిమ్మారెడ్డి గారి మల్లారెడ్డి తో పాటు 23 మంది డైరెక్టర్లను అభినందించారు. అంతకుముందు జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అందోల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ జోగినాథ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా జరిగిన శివ పార్వతుల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వా గతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగూరు లిఫ్టు ప్రాజెక్టు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామ న్నారు. అందులో భాగంగానే రూ.170 కోట్లతో సీసీ లైనింగ్ పనులను చేపడుతున్నట్లు వివరించారు. మంత్రి దామోదర రాజనర్సింహ -
ఆశాలపై వేధింపులు ఆపాలి
మెదక్జోన్: మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రిలో ఆశావర్కర్లకు రెస్ట్ రూంను కేటాయించడంతో పాటు డాక్టర్లు, నర్సులు, హోంగార్డుల వేధింపులు ఆపాలని ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కడారి నర్సమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మెదక్ ఎంసీహెచ్ ఎదుట 4 గంటల పాటు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాతా, శిశు సంక్షేమ ఆసుపత్రికి గర్భిణులు, బాలింతలను ఆరోగ్య తనిఖీలు, డెలివరీలకు గ్రామాల నుంచి ఆశావర్కర్లు తీసుకొస్తారని తెలిపారు. ఆ సమయంలో 2 నుంచి 4 రోజులపాటు ఆస్పత్రి లోనే ఉండాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రి సిబ్బ ంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆశావర్కర్ల సమస్యలను వెంటనే పరి ష్కరించాలని, ఆస్పత్రిలో రెస్ట్రూం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
కొల్చారం(నర్సాపూర్)/కౌడిపల్లి: బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చి, దేశంలోని ప్రజలను మతాలు, కులాల వారీగా విభజించాలని చూస్తోందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. గురువారం మండలంలోని సంగాయిపేట నుంచి రంగంపేట అంబేడ్కర్ విగ్రహం వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్దన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆగంగౌడ్, జిల్లా నాయకుడు శ్రీనివాస్రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చందు, నాయకులు ప్రవీణ్రెడ్డి, అనిల్ మధుసూదన్రెడ్డి, వెంకట్గౌడ్, శేఖర్, మల్లారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో నిర్వహించిన పాదయాత్రలో ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
వాన గుబులు.. రైతు దిగులు
మెదక్జోన్: అకాల వర్షం అన్నదాతను వెంటాడుతోంది. ఏటా మొలకనాడు ఎండ.. కోతనాడు వానతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. గురువారం రేగోడ్లో భారీ వర్షం కురిసింది. మెదక్, చిన్నశంకరంపేట, తూప్రాన్ తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొస్తున్న వేళ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో ఇటీవల ప్రభుత్వం కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వరి పంట కోసిన వారు వాన నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద కాగా కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉంచుతున్నారు. మరికొందరు వరి కోయాలా..? వద్దా అని ఆలోచిస్తున్నారు. వర్షం వస్తే పొలాల్లో పనులు సాగవని, హార్వెస్టర్లు దిగబడటంతో కోతలకు కష్టం అవుతుందంటున్నారు. గతేడాది ఇదే విధంగా వర్షం రావడంతో కొనుగోలు కేంద్రాల్లోనే వందల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్ద అయింది. చాలా మంది రైతులు తడిసిన ధాన్యాన్ని అతి తక్కువ ధరకు మిల్లర్లకు విక్రయించి తీవ్ర నష్టాలు చవి చూశారు. ప్రస్తుత వర్షాలకు తేమశాతం రాకపోవడంతో నానా తంటాలు పడాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాలంటే తేమ శాతం 17 ఉండాలి. లేనిచో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తారు. గత నెలలో కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి జిల్లాలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 386 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా 16 ట్రాన్స్ఫార్మర్లు విరిగిపోయాయి. ట్రాన్స్కోకు సుమారు రూ. 1.80 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే వందలాది రైతుల మోటార్లు కాలిపోయాయి. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి చేగుంట(తూప్రాన్): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వడియారం, అనంతసాగర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్లో వెంటనే నమోదు చేసి సకాలంలో రైతులకు ధాన్యం డబ్బులు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం రుక్మాపూర్లో చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొన్నారు. అలాగే కసాన్పల్లి దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి సరిహద్దులోని రామాయంపేట కెనాల్ను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఉప కాల్వలు పూర్తి చేయించి చెరువుల్లో నీరు నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఎంపీడీఓ చిన్నారెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి నాయకులు పాల్గొన్నారు. -
సంతృప్తిగా సన్నబువ్వ
కలెక్టర్ రాహుల్రాజ్బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలుఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిటేక్మాల్(మెదక్): సన్నబియ్యంతో భోజనం సంతృప్తిని ఇచ్చిందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని చంద్రుతండాలో పంచాయతీ కార్మికుడు రమావత్ పీరియ ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్లలో స్వయంగా ఆనందాన్ని చూశానని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాక్ చేరినట్లు వివరించారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ విఠల్, ఆర్ఐ సాయి శ్రీకాంత్, ఎంపీఓ రియజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రేపు అధికారికంగా పూలే జయంతి మెదక్ కలెక్టరేట్: ఈనెల 11వ తేదీన మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ధ్యాన్చంద్ చౌరస్తాలో గల జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పా ల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో క్రికెట్, మరే ఇతర బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దని యువతకు సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైందని తెలిపారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై నిఘా పెట్టాలన్నారు. ఎవరైన బెట్టింగులకు పాల్పడినట్లుగా తెలిస్తే తక్షణమే డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712657888 నంబర్కు సమా చారం అందించాలని సూచించారు. -
నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: సన్న బియ్యం పంపిణీని తాము స్వాగతిస్తున్నామని, అయితే నాణ్యమైన బియ్యం అందజేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పలు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందజేస్తున్న సన్న బియ్యంలో 30 నుంచి 40 శాతం వరకు నూకలు వస్తున్నాయని తెలిపారు. మరికొన్ని దుకాణాల్లో సన్నబియ్యంలో దొడ్డు రకం బియ్యం కలిసి ఉంటున్నాయని వాపోయారు. నాణ్యమైన సన్న రకం బియ్యమే అందరికీ అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ కొత్త రేషన్కార్డులు ఇచ్చి వారికి సైతం సన్న బియ్యం అందించాలన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల సంఖ్యను కుదించవద్దని కోరారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ దుకాణాలను కాంగ్రెస్ కార్యాలయాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు అశోక్గౌడ్, భిక్షపతి, ప్రసాద్, ఆంజనేయులుగౌడ్, సద్దాం తదితరులు ఉన్నారు. -
జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు
రామాయంపేట(మెదక్): అక్రమార్కుల ధన దాహానికి గుట్టలు కరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ రుసుముకు గండి పడుతోంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిని అనుకొని ఉన్న 1421 సర్వే నంబర్లో 764 ఎకరాల మేర ప్రభుత్వ భూములున్నాయి. పట్టణానికి దూరంగా ఉండటంతో పాటు ఆప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నెలల తరబడి మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెలుతుండటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఈ సర్వే నంబర్లో గుట్ట పైభాగంలో జేసీబీ తవ్వకాలతో పెద్దఎత్తున ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. గతంలో కలెక్టర్ రాహుల్రాజ్ సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి గాను స్థలం ఎంపిక కోసం వచ్చిన క్రమంలో ఈ గుంతలను పరిశీలించారు. కాగా జిల్లా పరిధిలో మట్టి తవ్వకాల విషయమై ఆయా మండలాల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తుండగా, రామాయంపేటలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై తహసీల్దార్ రజనికుమారి వివరణ కోరగా.. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా మట్టి తవ్వితే సదరు వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
లబ్ధిదారులు అప్పుల పాలు కావొద్దు
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుహవేళిఘణాపూర్(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకొని అప్పుల పాలు కావొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న కొచ్చెరువు తండాలో ఆయన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అధికారుల నిబంధనల మేరకు నిర్మించుకుంటే స్థలం సరిపోకుండా ఉందని, చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తే మిగితా డబ్బులు వేసి నిర్మించుకుంటామని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని ప్రజలకు సూచించారు. అనంతరం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, శ్రీనివాస్, తండా వాసులు శ్రీనునాయక్, రెడ్యా, అమ్రియా తదితరులు పాల్గొన్నారు. -
చంద్రశేఖర్కు డాక్టరేట్
తూప్రాన్: పట్టణానికి చెందిన గౌడేల్లి రాములు, యశోద దంపతుల రెండవ కుమారుడు చంద్రశేఖర్ పీహెచ్డీ డాక్టరేట్ పట్టా సాధించాడు. ఆధునిక నావిగేషన్ ఎలక్ట్రానిక్స్లో పరిశోధన కొనసాగించి, ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యున్నత డిగ్రీ అయినా పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందాడు. పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ కలువగా ఆమె ప్రశంసించారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జిల్లాపరిషత్ సీఈఓ ఎల్లయ్య టేక్మాల్(మెదక్): క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతగా పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య హెచ్చరించారు. మంగళవారం టేక్మాల్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, నిర్వహణ సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందరికీ అందేలా చూడాలన్నారు. రికార్డులు ఎప్పటికప్పుడూ పూర్తి చేస్తూ ఆన్లైన్ చేయాలన్నారు. ఆయన వెంట జిల్లాపరిషత్ డిప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ విఠల్ తదితరులు ఉన్నారు. వైద్య సేవలు అందుతున్నాయా? రామాయంపేట(మెదక్): ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం రోగులను ఆరా తీశారు. మంగళవారం మండలంలోని ప్రగతి ధర్మారంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రోగులతో మాట్లాడారు. రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారని, రక్త నమూనాలు సేకరించి మెదక్ ఆసుపత్రికి పంపుతున్నారా? అని సిబ్బందిని ప్రశ్నించారు. సక్రమంగా విధు లు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు రికార్డులు పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిప్రియ, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. నిరంతర సాధన చేయాలి చేగుంట(తూప్రాన్): విద్యార్థులు అనుకున్న లక్ష్యం చేరే వరకు నిరంతర సాధన చేయాలని గ్రూప్ 1 రాష్ట్ర స్థాయి ఎనిమిదో ర్యాంకు సాధించిన నిఖిత అన్నారు. చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆమెకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకు ఎనిమిది గంటలకు పైగా చదువుకోవడంతో ర్యాంకు సాధించానని చెప్పారు. నిఖితను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని ఎంఈఓ నీరజ సూచించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, ఉపాధ్యాయులు రాజేశ్వర్, సుధాకర్రెడ్డి, రాధా, రమ, లక్ష్మణ్, నరేందర్, శారద, వెంకటేశ్, భవానీ, రేఖ, శ్రీవాణి, సరస్వతి, ఉమామహేశ్వరి, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు హవేళిఘణాపూర్(మెదక్): గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు ప్రజలకు మెరుగైన సేవలందించాలని డీపీవో ఎల్లయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తొగిట గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులను, డంపింగ్యార్డు, మురుగునీటి కాలువలు, తాగునీటి సరఫరా గురించి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు చెత్తను బయట వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్తబండిలోనే వేయాలని ఆయన సూచించారు. డీపీవో వెంట పంచాయతీ సెక్రటరీ శారద, సిబ్బంది ఉన్నారు. -
18 రోజులు.. రూ.8లక్షలు
ఇందిరమ్మ ఇళ్లలో నాణ్యతకు ప్రాధాన్యం కలెక్టర్ రాహుల్రాజ్ అధిక బిల్లులు వేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు నర్సాపూర్: తన భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడితే స్థానిక కేఏకే ఆసుపత్రిలో చేర్పించగా అడ్డగోలుగా బిల్లులు వసూలు చేశారని పట్టణానికి చెందిన బైల్పాటి లక్ష్మి ఆరోపించింది. మంగళవారం ఆమె ఆసుపత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. తన భర్త గణేశ్ జనవరి 8న రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైతే స్థానిక కేఏకే ఆసుపత్రిలో చేర్పించగా 18 రోజుల పాటు వైద్యం చేసి రూ.8లక్షల బిల్లు వేశారని తెలిపారు. ఏమాత్రం నయం కాలేదని, బిల్లు మొత్తం చెల్లించి సంగారెడ్డిలోని మరో ఆసుపత్రికి వెళ్లి అక్కడ వారం రోజుల పాటు వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించామని చెప్పింది. కాగా కేఏకే ఆసుపత్రిలో వారిష్టమున్నట్టు టెస్టులు చేయించారని, వాటికి ఎక్కువ ధరలు వసూలు చేశారని ఆమె ఆరోపించారు.అప్పులు చేసి మరీ బిల్లులు చెల్లించామన్నారు. కాగా ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చానని, తమకు జరిగిన అన్యాయం నాయకులకు వివరించి తనకు న్యాయం చేయాలని అభ్యర్థిచండానికి వచ్చానన్నారు. తాను వచ్చే సరికి అందరూ వెళ్లిపోయారని విచారం వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరిగిందని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని లక్ష్మి ప్రభుత్వ అధికారులను, నాయకులను కోరింది. ఈ విషయమై ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ హసన్బాషాను వివరణ కోరగా బైలపాటి గణేశ్ విషయం తనకు తెలియదని, అతనికి వైద్యం చేసిన డాక్లర్లు ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పారు. రామాయంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని దామరచెరువులో ఇళ్ల నిర్మాణం, రామాయంపేటలో నిర్మించిన మాడల్ హౌజ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతగా త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ఈ మేరకు లబ్ధిదారులను చైతన్యపర్చాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకోవాలన్నారు. అనంతరం ఈ పథకానికి సంబంధించి హెల్ప్డెస్క్ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట గృహ నిర్మాణశాఖ పీడీ మాణిక్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ద్రాక్ష.. ఏదీ రక్ష!
ఉమ్మడి జిల్లాలో సాగు కనుమరుగు!● సొంత రాష్ట్రంలో అంతరిస్తున్న దుస్థితి ● పొరుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ‘వైన్ టూరిజం’ ● సాగు పెంపుపై ఉద్యాన, హార్టికల్చర్ ప్రత్యేక కార్యాచరణతెలంగాణలో పుట్టిన ద్రాక్ష కనుమరుగు దశకు చేరుకుంటోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో మాత్రం జోరుగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ‘వైన్ టూరిజం’ పేరిట పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలో పూర్వవైభవానికి ఏం చేద్దాం..? అంటూ ఉద్యాన శాఖ, హార్టీల్చర్ యూనివర్సిటీలు సమష్టి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. గజ్వేల్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే ద్రాక్ష సాగుకు బీజం పడింది. 1890లో ఎనాబ్–ఇ–సాహి ద్రాక్ష రకాన్ని హైదరాబాద్కు చెందిన అబ్దుల్ బక్వీర్ అనే వ్యక్తి సాగు చేశారు. ఆ తర్వాత కాలం 1960లో దివంగత హార్టికల్చరిస్ట్ శంకర్పిల్లై ఇదే రకాన్ని అభివృద్ధి చేసి నగరంలో సాగు చేశారు. హెక్టారుకు 105 టన్నుల దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. దీని ద్వారా ద్రాక్ష సాగుకు తెలంగాణ పుట్టినిల్లుగా మారింది. ఇదే క్రమంలో పదిహేనేళ్ల క్రితం వరకు రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఈ తోటల సాగుకు ఆధారంగా ఉండేవి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొంత విస్తీర్ణం సాగయ్యేది. ఆయా జిల్లాల్లో మొత్తంగా ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటలు సాగులోకి వచ్చేవి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు దోహదపడే రకాలను ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే నిపుణులైన కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని ఎకరాకు రూ.10లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలు బాగానే గడించారు. ఆ తర్వాత కాలంలో తోటలు తెగుళ్ల బారిన పడటం వరుసగా చోటుచేసుకుంది. దీంతో రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కూడా వారికి ప్రోత్సాహాం కరువైంది. ఈ దశలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రైతులు ద్రాక్ష తోటలు తొలగించి ప్లాట్లుగా మార్చారు. కనుమరుగు దశకు.. పదిహేనేళ్ల క్రితం రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్తోపాటు పలు జిల్లాల్లో 50వేల ఎకరాల్లో ఉన్న సాగు.. నేడు 400ఎకరాలకే పరిమితమయ్యింది. గతంలో వేలాది మంది రైతులుండగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 25మంది రైతులు మాత్రమే సాగు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో ద్రాక్ష కనుమరుగు దశకు చేరుకుంటోంది. మహారాష్ట్ర, కర్నాటకల్లో వైన్ టూరిజం..ప్రస్తుతం మన రాష్ట్ర అవసరాలకు మహారాష్ట్ర నుంచి ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం రైతులకు విరివిగా సబ్సిడీలను అందిస్తుండటంతో సాగు క్రమంగా పెరుగుతోంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ‘వైన్ టూరిజం’ ట్రెండ్ కొనసాగుతోంది. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న రైతులు.. తమ తోటలను ‘ఎకో టూరిజం’ ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. తోట ల్లో ఎక్కువగా వైన్ వైరెటీగా చెప్పుకునే రేసిన్ రకం ద్రాక్షను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా తోటల్లోనే వైన్ ఉత్పత్తి యూనిట్లను సైతం ఏర్పాటుచేసి.. తమ తోటల్లో వచ్చే పర్యాటకులకు తక్కువ ధరకు వైన్ అందిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్కు వైన్ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. లిక్కర్లో అల్కాహాల్ శాతం 46శాతం వరకు ఉంటే వైన్లో కేవలం 8–10శాతం అల్కాహాల్ ఉండటం వల్ల ప్రత్యేకించి యువతతోపాటు అన్ని వయసుల వారు వైన్ సేవించడానికి మక్కువ చూపుతున్నారు. తమ కళ్లముంగిటే సహజమైన పద్ధతుల్లో వైన్ దొరుకుతుండటంతో దీనిని ఇష్టంగా సేవిస్తున్నారు. -
చిన్న తరహా పరిశ్రమలతో ఉపాధి
చేగుంట(తూప్రాన్): గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాలిటెక్నిక్తో చదువును ఆపేయాల్సి వస్తే చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందవచ్చని జిల్లా ఇండస్ట్రీయల్ సెంటర్ జీఎం ప్రకాశ్ అన్నారు. చేగుంటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఉపాధి అవకాశాలు ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. నెపుణ్యాలను బట్టి ప్రైవేట్ పరిశ్రమల్లో సైతం ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్తో ఉన్నత చదువులు చదివేవారు మంచి ఉద్యోగం సాధించే వరకు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సంగీత, ప్రిన్సిపాల్ చక్రవర్తి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
డీసీసీబీకి అవార్డు
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట డీసీసీబీ బ్యాంకుకు 2024–25 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది. ఈ మేరకు సోమవారం సంగారెడ్డిలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవెందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్, డీడీఎం కృష్ణ తేజ, నిఖిల్ కుమార్ చేతుల మీదుగా బ్యాంక్ మేనేజర్ కిషన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ తాను పాపన్నపేటలో బాధ్యతలు చేపట్టేనాటికి రూ.31 కోట్ల బిజినెస్ కొనసాగేదని, ఇప్పుడు రూ.51.5 కోట్లు దాటిందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. -
పరిహారం అందించేందుకే సర్వే..
శివ్వంపేట(నర్సాపూర్): ట్రిబుల్ ఆర్ కోసం కేటాయించిన భూముల్లో అధికారులు సర్వే చేశారు. మండలంలోని లింగోజిగూడ, కొత్తపేట, రత్నపూర్, పాంబండ, పోతులబోగూడ, కొంతన్పల్లి గ్రామాల్లో ట్రిబుల్ ఆర్ లో రైతులు భూములు కోల్పోతున్నారు. ఆర్ఐ కిషన్, సర్వేయర్ అరుణ్కుమార్, పంచాయతీ రాజ్ సిబ్బంది మంగళవారం లింగోజిగూడ గ్రామంలో సర్వే చేపట్టారు. ట్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో రైతులకు సంబంధించి బోరుబావులు, పైపులైన్, చెట్ల వివరాలు నమోదు చేశారు. భూములతో పాటు ఇతర కట్టడాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతులకు పరిహారం అందిస్తామని, అందుకు గాను ఆ భూముల్లో సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
చిన్నారులకు వైద్య పరీక్షలు
అంగన్వాడీ కేంద్రాల్లో... ● శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా ● పిల్లల మానసిక స్థితిపై తల్లికి 42 ప్రశ్నలు ● సమస్య ఉన్నట్లు తేలితే వైద్యం ● మూడునెలల పాటు కొనసాగనున్న చెకప్ మెదక్జోన్: అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో పాటు పూర్వ ప్రాఽథమిక విద్య నేర్చుకుంటున్న ఆరేళ్లలోపు చిన్నారులకు వైద్య పరీక్షలు ప్రారంభించారు. కంటిచూపుతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా పరీక్షలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి చిన్నారుల తల్లులకు వైద్య సిబ్బంది 42 ప్రశ్నలు అడుగుతున్నారు. మూడు నెలల పాటు కొనసాగే వైద్య పరీక్షల్లో పిల్లలకు ఏదైనా లోపం ఉన్నట్లు తేలితే వెంటనే వైద్యం అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,076 అంగన్వాడీ కేంద్రాల్లో 52,619 మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. కాగా వారికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో కంటిచూపుతో పాటు శారీరక, మానసిక ఎదుగుదల పై వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారుల తల్లులకు 42 ప్రశ్నలు సంధిస్తూ మీ బాబు, లేదా పాప పాలుతాగడం, వినికిడి శబ్దం ఎలా ఉంది? ఆహారం ఏవిధంగా తీసుకుంటున్నాడు? కారణం లేకుండా ఏడ్వటం, ఫిట్స్, ఆకస్మిక కదలికలు, సృహతప్పటం, ఇతరపిల్లలతో పోల్చితే ముఖకవలికలు భిన్నంగా ఉన్నాయా? శారీరక వైకల్యం ఉందా? ఇలా మొత్తం పలు అంశాలపై తల్లులకు ప్రశ్నలు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్, మే, జూన్లో పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసి ఎలాంటి లోపం ఉన్నా వెంటనే చికిత్స చేస్తారు. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే పెద్దాసుపత్రికి రెఫర్చేసి చికిత్స అందించనున్నారు. గతేడాది 741 మందికి ఎదుగుదల లోపం గతేడాది జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తీవ్ర, అతితీవ్రలోపం పోషణతో 741 మంది చిన్నారులను గుర్తించారు. వారి కోసం ప్రత్యేకంగా గుడ్లు, బాలామృతాన్ని అందించారు. కాగా 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు సాధారణ పిల్లలకు నెలకు 16 గుడ్లతో పాటు బాలామృతాన్ని ఇస్తారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 3నుంచి 6 ఏళ్ల పిల్లలకు రోజుకో గుడ్డుతో పాటు భోజనం వండి పెడతారు. ఆర్బీఎస్కే చిన్నారులకు వరం! ప్రతిఏటా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్యలు ఉన్న వారికి వైద్యం అందిస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 64,933 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,155 మంది కంటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి 2,858 మందికి కళ్లద్దాలను అందజేశారు. మిగతా 297 మంది తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, మరికొన్ని పరీక్షలు నిర్వహించి అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని ఆర్బీఎస్కే సిబ్బంది తెలిపారు. మూడు నెలల్లో పూర్తి... జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటిచూపుతో పాటు శారీరక, మానసిక స్థితిపై వైద్య పరీక్షలను ఈనెల 7న, ప్రారంభించాం. మూడు నెలల్లో పూర్తి చేస్తాం. అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి వైద్యం అందిస్తాం. – మాధురి, ప్రోగ్రాం ఆఫీసర్, ఆర్బీఎస్కే -
ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
సన్న బియ్యం పేదలకు వరంకలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం కొల్చారం(నర్సాపూర్): సన్న బియ్యం పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమ వారం మండల పరిధిలోని రాంపూర్లో పారిశుద్ధ్య కార్మికుడు దుర్గారాజు ఇంటిలో కలెక్టర్ భోజనం చేశారు. కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 7 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యత గల సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకొని బయట విక్రయించే వార న్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీఓ రఫీ ఉన్నిసా, తహసీల్దార్ గఫార్మియా, ఎంపీఓ కష్ణవేణి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. త్వరలోనే ఇంటర్ ఫలితాలు మెదక్జోన్: త్వరలోనే ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని బాలుర జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ మూల్యాంకన సెంటర్ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసిందని.. ప్రస్తుతం రీకౌంటింగ్, రీవాల్యువేషన్ ప్రక్రియ నడుస్తుందన్నారు. కాగా 690 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 1.87 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేశారని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ టెలీ కాన్ఫరెనన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. రాజీవ్యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిజాంపేట(మెదక్): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని కె. వెంకటాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ హయా ంలో నిరుపేదలకు సన్న బియ్యంతో పాటు ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. రామాయంపేటలో రూ. 200 కోట్లతో సమీకృత గురుకులం పనులు ప్రారంభించనున్న ట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్రావు, మండల డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, మండల వ్యవసాయ అధికారి సోమ లింగారెడ్డి, ఎంపీడీఓ రాజిరెడ్డి, నాయకులు మహేందర్, లింగంగౌడ్, అమరసేనారెడ్డి, అజయ్, సామల మహేష్ వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.నర్సాపూర్ రూరల్: మండలంలోని తుజాల్పూర్లో సోమవారం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దానిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్త, బ్లాక్ కాంగ్రెస్ రిజ్వాన్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు సుధీర్గౌడ్, మోహన్దాస్గౌడ్, మాజీ ఎంపీటీసీ మేఘమాల, కిషన్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడాలి
డీబీసీడబ్ల్యూఓ జగదీష్కౌడిపల్లి(నర్సాపూర్): హాస్టల్ విద్యార్థులు శ్రద్ధగా చదివి జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీష్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో వసతిగృహ సంక్షేమాధికారి ప్రణయ్కుమార్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హాస్టల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్తో పాటు పైచదువులు బాగా చదివి తల్లిదండ్రులు, హాస్టల్కు మంచిపేరు తేవాలన్నారు. అనంతరం టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టల్లో మెరుగైన సదుపాయలు ఉన్నాయన్నారు. కార్పొరేట్ స్థాయిలో వార్షికోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో హెచ్డబ్ల్యూఓల సంఘం జిల్లా అధ్యక్షుడు శేషాచారి, ఎస్టీ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజ్, జిల్లాలోని వివిధ హాస్టల్ల హెచ్డబ్ల్యూఓలు శేఖర్, మహేందర్, నవీన్, స్వామి, ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ మాజీ చైర్మన్ జగన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కేతకీ ఆలయాభివృద్ధికి కృషి
● ఎంపీ సురేశ్ షెట్కార్ ● నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ హామీనిచ్చారు. నూతనంగా ఏర్పాటైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఆలయంలో నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయన గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ...ఆలయానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి పాటుపడతానన్నారు. అభివృద్ధి జరిగితేనే మరింతగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, సునీతా పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాస్థానం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణకు మల్లన్న ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అన్నపూర్ణ సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు -
తగ్గని చికెన్ ధరలు
మెదక్ పట్టణం ఆటోనగర్లోని ఓ చికెన్ సెంటర్లో బర్డ్ఫ్లూ వైరస్కు (రెండు నెలల) ముందు నిత్యం 10 క్వింటాళ్ల చికెన్ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం రోజుకు క్వింటాల్ చికెన్ మాత్రమే విక్రయిస్తున్నారు. గతంలోనూ కిలో చికెన్ ధర రూ. 180 పలకగా, ప్రస్తుతం దాని ధర రూ. 210కి చేరింది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 90 శాతం చికెన్ విక్రయాలు పడిపోయాయి. అయినా ధర ఏ మాత్రం తగ్గలేదు. – మెదక్జోన్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా బ్రాయిలర్ కోడి ధర తగ్గేదేలే అంటోంది. మొన్నటి వరకు బర్డ్ఫ్లూ భయంతో చికెన్ మార్కెట్ భారీగా పతనమైన విషయం తెలిసిందే. భారీ నష్టాలతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకానికి దూరం అయ్యారు. దీంతో డిమాండ్కు తగిన సప్లై లేక ఈ మధ్య చికెన్ ధర అమాంతం పెరిగింది. రెండు నెలల క్రితం చికెన్ అంటేనే జనం జంకే పరిస్థితులు ఉండేవి. ఈ క్రమంలో కిలో చికెన్ ధర రూ.150కు పడిపోయింది. బర్డ్ఫ్లూ భయం పోగొట్టేందుకు ఫాల్ట్రీ యజమానులు చికెన్ వంటకాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అయినా మార్కెట్ పుంజుకోలేదు. జిల్లావ్యాప్తంగా 3 వేల పైచిలుకు కోళ్ల ఫారాలు ఉండగా, వీటి ఆధారంగా వేలాది మంది రైతులతో పాటు కూలీలు జీవనం సాగిస్తున్నారు. కాగా ఫిబ్రవరిలో బర్డ్ఫ్లూ కలకలం రేపటంతో చాలా వరకు చికెన్ తినడం మానేశారు. ఇక మార్చిలో అంతుచిక్కని వైరస్తో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. మార్కెట్లో చికెన్ విక్రయాలు తగ్గటంతో సదరు కంపెనీకి చెందిన నిర్వాహకులు సైతం వాటిని ఫారాల్లోనే వదిలేశారు. దీంతో కోళ్ల ఫారం నిర్వాహకులు వైరస్ సోకిన కోళ్లను గుంతలు తీసి పూడ్చిపెట్టారు. అయితే పలు కంపెనీల నిర్వాహకులు కోడి పిల్లలతో పాటు దాణను సమకూరుస్తారు. కోళ్లను పెంచిన ఫౌల్ట్రీ రైతుకు వాటి బరువును బట్టి కమీషన్ ఇస్తుంటారు. కాగా 2 నెలలుగా కోళ్లు చనిపోవటంతో పోషకులకు కమీషన్ ఇవ్వడం మానేశారు. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కోడి పిల్లలు తీసుకోండి.. బర్డ్ఫ్లూతో సుమారు 2 నెలల పాటు కోళ్ల ఫారాలు కూనరిల్లాయి. ఇక వైరస్ పోయింది.. కోడి పిల్లలను తీసుకోవాలని సదరు కంపెనీల నిర్వాహకులు కోళ్లపెంపకం దారులను కోరుతున్నట్లు తెలిసింది. అయితే ఒక బ్యాచ్ కోళ్లు పెరగాలంటే 50 నుంచి 55 రోజుల గడువు పడుతుండటంతో అప్పటిలోగా పూర్తిగా సమసిపోతాయని రైతులకు నచ్చచెబుతున్నారు. అయినప్పటికీ రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రజల్లో పూర్తిస్థాయిలో భయం పోయి చికెన్ తినటం ప్రారంభించినప్పుడే కోళ్లను పెంచటం మంచిదని భావిస్తున్నట్లు తెలిసింది. బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో కోళ్ల పరిశ్రమలకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో 90 శాతం చికెన్ విక్రయాలు తగ్గాయి. అయితే చికెన్ ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. మార్చిలో రంజాన్ నేపథ్యంలో కిలో చికెన్ ధర రూ. 280 పలికింది. హలీం తయారీ కోసం చికెన్ ఎక్కువగా ఉపయోగించటంతో చికెన్ ధర భారీగా పెరిగిందని పలువురు చెబుతున్నారు. అయితే వారం రోజులుగా కాస్త ధర తగ్గి ప్రస్తుతం కిలో ధర రూ. 210 పలుకుతోంది. -
ఎకై ్సజ్ కార్యాలయం ఏదీ?
అల్లాదుర్గం(మెదక్): 2016 పునర్విభజనలో భాగంగా అల్లాదుర్గంలో ఎకై ్సజ్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. తొమ్మిదేళ్లు గడిపోయినా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఎకై ్సజ్ అధికారులు ఇక్కడి రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో కల్తీ కల్లు, గంజాయి విక్రయంపై నిఘా కొరవడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం అల్లాదుర్గంలో సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అల్లాదుర్గం సర్కిల్ కేంద్రంగా టేక్మాల్, రేగోడ్, పెద్దశంకరంపేట మండలాలను కలుపుతూ పోలీస్ సర్కిల్ కార్యాలయం, పంచాయతీరాజ్, ఇరిగేషన్ సబ్ డివిజన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలతో పాటు, జూనియర్ సివిల్ ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పునర్విభజనకు ముందు ఈ మండలాలు జోగిపేట సర్కిల్ పరిధిలో ఉండేవి. కాగా అల్లాదుర్గంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం 2016లోనే ఏర్పాటు చేశారు. ఎకై ్సజ్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. అయితే అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అది కలగానే మిగిలింది. అయితే అల్లాదుర్గంలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి పాత పోలీస్స్టేషన్ భవనం వాడుకోవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భవనం వృథాగా ఉందన్నారు. ఇదే విషయమై జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరగా.. అల్లాదుర్గంలో ఎకై ్సజ్ కార్యాలయం మంజూరుకు గతంలో ప్రతిపాదనలు పంపిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం కొన్నిస్టేషన్లను మంజూరు చేసిందని.. జిల్లాకు మాత్రం మంజూరు కాలేదన్నారు. జిల్లాలో గంజాయి సాగు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్తీ కల్లు విక్రయాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రహదారుల పక్కన కల్లు విక్రయించకూడదని అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం ప్రతిపాదనలు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు -
కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిద్దాం
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుసిద్దిపేటజోన్: కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవస రం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలీల గేయ రామాయణ వాగ్గేయకారుడు రుక్మాభట్ల నరసింహా స్వామిని శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రుక్మాభట్ల గేయ రామాయణం రచించి తన జీవితాన్ని శ్రీ రా ముడికి అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారం తీసుకున్న రుక్మాభట్లకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. -
కల్యాణ వైభోగమే..
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. అలయ పూజారి మధుసూదనాచార్యులు కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు బండ నరేందర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. – మెదక్ మున్సిపాలిటీ -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్కాలువలు నిర్మించే వరకు పోరాటంటేక్మాల్(మెదక్): గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్, మందులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలన్నారు. సమయపాలనతో విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించారు. ఓవర్ లోడింగ్ తదితర విషయాల గురించి విద్యుత్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోతలు లేని విద్యుత్ అందించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి ఆరా తీశారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వేగవంతంగా సన్నబియ్యం సరఫరా పాపన్నపేట(మెదక్): పండుగ పూట కలెక్టర్ తన విధులు నిర్వర్తించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ పాపన్నపపేట సివిల్ సప్లై గోదాం తనిఖీ చేశారు. సన్న బియ్యం నాణ్యత, నిల్వలను పరిశీలించారు. సన్నబియ్యం పంపిణీ నిరాటంకంగా కొనసాగించాలని సూచించారు. స్టేజ్ వన్ కాంట్రాక్టర్లు బియ్యం వేగంగా పంపిణీ చేయాలన్నారు. అంగన్వాడీలు, హాస్టళ్లు, రేషన్ కార్డుదారులకు ఎంత బియ్యం అవసరమవుతాయన్న వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందుకనుగణంగా బియ్యం నిల్వలు ఉంచాలని ఆదేశించారు. దుబ్బాకరూరల్: నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూర్తి చేసేవరకు పోరాడుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పోతా రం గ్రామంలో ఎమ్మెల్యే దంపతులు సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇంకా అక్కడక్కడా కాలువలు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేసే దాకా పోరాడుతానని తెలిపారు. శ్రీరామనవమి రోజున తన సొంత గ్రామమైన పోతారం చెరువుకు నీళ్లు రావడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండా లని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నిండిన చెరువును పరిశీ లించారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
బఫర్లో బరితెగింపు!
దుర్గమ్మ సాక్షిగా భూ దందా ● అక్రమార్కులకు అడ్డాగా టేకులగడ్డ ● ఏడుపాయల్లో అక్రమ నిర్మాణాలు ● ఎన్ఓసీ లేకుండానే కార్యదర్శుల అనుమతులు ఏడుపాయల రియల్ మాఫియాకు కేంద్రంగా మారింది. దుర్గమ్మ సాక్షిగా అవినీతి భూ దందా కొనసాగుతోంది. పచ్చని వనాలతో కళకళలాడిన టేకులగడ్డ.. అక్రమార్కులకు అడ్డాగా మారిపోయింది. మంజీరా తీరాన ఉన్న బఫర్ జోన్లో బరితెగించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎన్ఓసీ లేకుండానే రెవెన్యూ, పంచాయతీ అధికారులు కాసుల వేటలో అడ్డగోలు అనుమతులిస్తున్నారు. 1 నుంచి 8, 144, 145 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమిలో అక్రమ రియల్ భూం కొనసాగుతుంది. – పాపన్నపేట(మెదక్) మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే సుందర ప్రదేశం వనదుర్గానిలయం. తలాపునే 30 వేల ఎకరాలకు సాగు నీరందించే ఘనపురం ప్రాజెక్టు.. దిగువన భక్తులు స్నానాలు చేసేందుకు.. వృధాజలాన్ని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యాం నిర్మించారు. నదికి ఇరువైపులా కొల్చారం మండలంలో 1 నుంచి 8, పాపన్నపేట మండలంలో 144, 145 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమి పచ్చని చెట్లతో కళకళలాడేది. 2015– 16లో పోతంషెట్పల్లి నుంచి వచ్చే దారిలో మంజీరా నదిపై 3 బ్రిడ్జిలు నిర్మించి డివైెడర్లతో కూడిన సీసీ రోడ్లు వేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి ఈ భూములపై పడింది. అప్పట్లో ఎకరాకు రూ. 2.30 లక్షలు ధర పలికిన ఈ భూములు .. ప్రస్తుతం రూ. 2.50 నుంచి రూ. 3 కోట్లు పలుకుతున్నాయి. అవసరానికనుగుణంగా భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు బఫర్ జోన్లో వాణిజ్య నిర్మాణాలు ప్రారంభించారు. అనేక లాడ్జీలు నిర్మించి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. నిర్మాణాలు గుర్తించాం ఏడుపాయల్లో మంజీరా నది తీరాన బఫర్ జోన్లో ఉన్న 8 నిర్మాణాలను గుర్తించాం. సంబంధిత యజమానులకు నోటీసులు అందించాం. ఇంతవరకు ఏడుపాయల్లో ఎలాంటి నిర్మాణాలకు ఇరిగేషన్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ అనుమతి తీసుకోలేదు. పోతంషెట్పల్లి నర్సాపూర్ ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది. బఫర్జోన్లో నాలా చేయొద్దు, నిర్మాణాలు అక్రమం. వీటిపై తగిన చర్యలు తీసుకుంటాం. – విజయ్, ఇరిగేషన్శాఖ ఏఈ -
అనుమతి లేకుండానే నిర్మాణాలు
మంజీరా నది ఒడ్డు నుంచి ఇరువైపులా 100 మీటర్ల మేర బఫర్జోన్లో పరిధిలోకి వస్తుంది. ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. అవసరమైన నిర్మాణం చేయాలనుకుంటే, ఇరిగేషన్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాగే బఫర్ జోన్లో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు నాలాగా మార్చొద్దు. వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయొద్దు. కానీ కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు ఆ పనీ చేశారు. డీటీసీపీ లే అవుట్లు లేకుండానే ఎకరాల కొద్ది భూమిని ప్లాట్లుగా మార్చారు. పంచాయతీ కార్యదర్శులు సైతం అక్రమ నిర్మాణాలకు దర్జాగా అనుమతులిచ్చారు. గతంలో నాగ్సాన్పల్లి కార్యదర్శిగా ఉన్న నవీన్, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న దుర్గాభవాని సుమారు 8 అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చినట్లు తెలిసింది. ఇందులో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. లాడ్జీలు నిర్మించారు. రాళ్ల భూములను చదును చేసే క్రమంలో భారీ బండరాళ్లను నిషేధిత డిటోనేటర్లతో పేల్చారు. పగిలిన రాళ్లను మంజీరా నదిలో వేస్తున్నారు. దీంతో మంజీరా పరివాహ ప్రదేశం తగ్గి వరదలు వచ్చినప్పుడు, దిగువన ఉన్న ఆలయం, పక్కన ఉన్న నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అక్రమ భవనాలకు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు మంజీరా నదిలో కలుస్తుంది. అదే నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. చిత్రమేమిటంటే నది ఒడ్డున దేవాదాయ శాఖ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లకు సైతం ఎన్ఓసీ తీసుకోలేదని సంబంధిత అధికారి తెలిపారు. సర్వే నంబర్ 1 నుంచి 8లో సైతం అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అయితే ఈ విషయమై కొల్చారం మండల అధికారులు విచారణ జరపాలనే డిమాండ్ ఉంది. ఇదే విషయమై నాగ్సాన్పల్లి పంచాయతీ కార్యదర్శి దుర్గాభవానిని వివరణ కోరగా.. నేను ఒక నిర్మాణానికి ఎన్ఓసీ లేకుండా అనుమతి ఇచ్చాను. అంతకుముందు పనిచేసిన నవీన్ ఇతర నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని చెప్పారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం
మనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్తోనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాళ్లకల్, లింగారెడ్డిపేట, కూచారం గ్రామాల్లో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెంటాగౌడ్, వీరబోయిన గోపాల్, సత్యనారాయణ, ర్యా కల కృష్ణాగౌడ్, లక్ష్మీనర్సింలుగౌడ్, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోనాపూర్ పీఏసీఎస్లో నిధుల దుర్వినియోగం! రామాయంపేట(మెదక్): మండలంలోని కోనాపూర్ సహకార సంఘంలో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. సుమారు రూ. 2 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు గ్రామస్తులు గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఫైల్ ముందుకు కదిలింది. సంగారెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారణ అధికారిగా సహకారశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈమేరకు ఆయన పలు దఫాలుగా విచారణ నిర్వహించారు. గ్రామంలో సంఘం డైరెక్టర్లు, మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇదే విషయమై జిల్లా సహకార అధికారి కరుణాకర్ను సంప్రదించగా, తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదన్నారు. విచారణ అధికారిగా నియమితులైన సంగారెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని పేర్కొన్నారు. నియామక ఉత్తర్వులు పాపన్నపేట(మెదక్): మండలంలోని కొడుపాకకు చెందిన పంతుల సంతోష్ ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆయన ఇటీవల వెలువడిన ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించారు. సంతోష్ సోదరుడు టీచర్గా పనిచేస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి డీఏఓగా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దుర్గమ్మా.. దండాలమ్మా పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున అమ్మవారిని పూజారులు పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
బీటీ రణదివెకు నివాళి
మెదక్ కలెక్టరేట్: భారత కార్మికవర్గ ఐక్య పోరాటాల రథసారధి బీటీ రణదివె వర్ధంతిని ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. రణదివె మరణించే వరకూ ట్రేడ్ యూనియన్ ఉద్యమమే ఊపిరిగా సాగిందన్నారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. ఉద్యమాల్లో భాగంగా అనేకసార్లు జైలు జీవితం గడిపారని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత జీవితం పట్ల ఆసక్తి లేని నిస్వార్థ కార్మిక నేత రణదివే అని కొనియాడారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మల్లేశం, సంతోష్, అజయ్, చౌకత్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల చెంత.. సమస్యల చింత
● కనుచూపుమేర గుర్రపు డెక్క ● ప్రజలకు కరువైన ఆహ్లాదం ● చెత్తా చెదారంతో దుర్వాసనమల్లం చెరువుపై వ్యర్థాలు.గుర్రపు డెక్కతో కనుమరుగైన మల్లం చెరువుమెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని చెరువులు ఆహ్లాదానికి దూరంగా, చెత్తాచెదారంతో నిండిపోయాయి. దోమలు, ఈగలు, ప్రాణాంతక కీటకాలకు ఆవాసంగా మారుతున్నాయి. చెరువులను ఆనుకొని ఉన్న ప్రాంతాలు, కాలనీలు కంపుకొడుతున్నాయి. దీంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పట్టణంలోని మల్లం చెరువు కనుచూపు మేర గుర్రపుడెక్కతో నిండిపోయింది. చెరువుపై నాగులమ్మ, కట్టకింద వీరహనుమాన్ ఆలయాలు ఉన్నాయి. చెరువు పరిసరాలు చెత్తమయం కాగా, ఆలయా లకు వచ్చే భక్తులు అనేక అవస్థలు పడుతున్నారు. భక్తులకు ఆహ్లాదం పంచాల్సిన చెరువు కంపుతో స్వాగతం పలుకుతోంది. పట్టణంలోని పిట్లం చెరువుది అదే తీరు. పలు వీధులకు చెందిన మురికి నీరు అందులో కలుస్తోంది. దీంతో ఆహ్లాదం కోసం చెరువు కట్టపైకి వెళ్లే ప్రజలకు కంపు కలవరపెడుతుంది. చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చుదిద్దుతామంటూ పదేళ్లుగా ఊరిస్తున్నా.. పనులు మాత్రం మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు, వ్యాయామం చేయడానికి వస్తుంటారు. దుర్వాసనతో అటు వైపు వెళ్లడానికే జంకుతున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్, విద్యుత్ దీపాలు, వాకింగ్ ట్రాక్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్కులు, చిన్నారులకు ఆటస్థలాలు, సేదతీరటానికి కుర్చీలు, పర్యాటక హంగులు సమకూర్చాలని పలువురు కోరుతున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం మెదక్లోని మల్లం చెరువు, పిట్లం చెరువులో పలు వీధులకు చెందిన మురుగునీరు వచ్చి చేరుతోంది. దీంతో చెరువులు దుర్వాసన వెదజల్లడంతో పాటు గుర్రపు డెక్క పెరుగుతుంది. మున్సిపల్ అధికారులు మురుగునీరు చెరువుల్లో కలువకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. – రాజు, ఇరిగేషన్ డిప్యూటీ డీఈ -
రండి.. చూసొద్దాం
వేసవి సెలవుల్లో ఎటైనా టూర్కు వెళితే బాగుంటుందని అందరూ భావిస్తుంటారు. దూరప్రాంతాల్లో కాకుండా దగ్గర్లో ఉంటే అనువుగా ఉంటుందని కోరుకుంటారు. అలాంటి వారికి జిల్లాలో కొలువుదీరిన ఎన్నో పర్యాటక, దర్శనీయ స్థలాలు రారమ్మని పిలుస్తున్నాయి. సరస్సులు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, అభయారణ్యాలు ఒకటేమిటి.. ఇలా ఎన్నింటినో చూసే వీలుంది. హైదరాబాద్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం.. మెతుకుసీమ పర్యాటక, దర్శనీయ స్థలాలను చుట్టేసేందుకు సిద్ధం కండి. – మెదక్జోన్ మెతుకుసీమలో ఎన్నో పర్యాటక, దర్శనీయ స్థలాలు సొంత వాహనం ఉంటే వెళ్లొచ్చు హాయిగా.. అందుబాటులోనూ బస్సు సౌకర్యంనర్సాపూర్ అర్బన్పార్కు హైదరాబాద్కు అతి సమీపంలో నర్సాపూర్ అర్బన్ పార్కు ఉంది. మండు వేసవిలోనూ పచ్చటి అడవి అందాలు, స్వచ్ఛమైన గాలి ఇక్కడ సొంతం.అడవి లోపలిభాగంలో సహజ సిద్ధ మట్టిరోడ్లు, ఆకాశాన్ని అందుకునే విధంగా పెరిగిన చెట్లు, అడవి అందాలను తిలకించేందుకు నిర్మించిన వాచ్టవర్లు, పార్కును ఆనుకొని తొణకిసలాడే రాయరావు చెరువు చూడదగిన అందాలు.పోచారం అభయారణ్యం మెదక్ పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పోచారం అభయారణ్యం ఉంది. అందులో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం కొనసాగుతోంది. వాటితో పాటు అనేక రకాల జంతువులు ఉన్నాయి. ప్రవేశ రుసుం పెద్దలకు రూ. 100, చిన్న పిల్లలకు రూ. 50 చెల్లించాలి. కెమెరా తీసుకెళ్తే అదనంగా మరో రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. చెంగుచెంగున దుమికే చుక్కల జింకలు, పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, కొండగొర్లు, నీల్గాయిలాంటి ఎన్నో రకాల జంతువులు కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలాగే అభయారణ్యాన్ని ఆనుకొని కొండలు, గుట్టల నడుమ నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు చూడదగినది. దీనిని 1916–1922 మధ్య మంజీరా నదికి ఉపనదిగా ఆలేరుపై నిర్మించారు. రిజర్వాయర్ మధ్యలో ఉన్న ద్వీపం వివిధ జాతుల పొదలకు నిలయం. ప్రఖ్యాతిగాంచిన చర్చి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సందర్శించే చర్చిలలో ఒకటి మెదక్ చర్చి ఒకటి. దీనిని బ్రిటిష్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ నిర్మించారు. 1914 నుంచి 1924 వరకు పదేళ్ల పాటు దీనిని నిర్మించారు. ఇది చరిత్రాక కట్టడం. చర్చి గోపురం ఎత్తు 175.. పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు ఉంటుంది. తూర్పున ఏసు క్రీస్తు జన్మవృత్తాతం, పడమర క్రీస్తును శిలువ వేసిన.. ఉత్తరాన క్రీస్తు చనిపోయి 3వ రోజు సజీవుడైన దృశ్యాలు కనిపిస్తాయి. పైమూడు దృశ్యాలు పగలు మాత్రమే కనిపించడం ప్రత్యేకత.ఏడుపాయల దుర్గమ్మ ఋషులు తపస్సు చేసిన కీకారణ్యం రాతి గుహలో ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వెలిసింది. ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. వనదుర్గమ్మ దర్శనానికి ఏటా 30 లక్షలకుపైగా భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివస్తారు. ఆది, మంగళవారాల్లో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతాయి.మెదక్ ఖిల్లా మెదక్ ఖిల్లా (కోట) ఒక వారసత్వ నిర్మాణం. 2వ శతాబ్దంలో కాకతీయుల ఆఖరిరాజు ప్రతాపరుద్రుడి హయాంలో ఈ కోట నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. దీనిని మొదట తెలుగులో ‘మెతుకుదుర్గం’ అని పిలిచేవారు. ఇది కాకతీయుల తర్వాత కుతుత్షాహిలకు కమాండ్ పోస్టుగా పనిచేసింది. ఈ కోటలో కుతుబ్షాహిస్ నిర్మించిన ప్రాంగణంలో 17వ శతాబ్దపు మసీదు, అలాగే ధాన్యాగారాలు ఉన్నాయి. ఇది భూమట్టం నుంచి సుమారు 90 మీటర్ల ఎత్తులో కొండ ప్రాంతంలో 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి ఒకటిన్నర గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు. -
కార్యకర్తలకు అండగా ఉంటా
నర్సాపూర్: కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె పుట్టిన రోజును పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రాగానే ఆదరించి, వరుసగా మూడుసార్లు గెలిపించారని, ప్రతిపక్షంలో ఉన్నా తన వెన్నంటి ఉంటున్న కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. తనను నిరంతరం ఆదరిస్తున్న ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అక్రమ కేసులకు భయపడవద్దని, అండగా నేనున్నానని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఆయా పథకాలే బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొ స్తాయని జోస్యం చెప్పారు. శనేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెల్మకన్న శనేశ్వరాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ పూజారులు శనేశ్వరునికి పూ జలు చేసి తైలాభిషేకం చేశారు. వివిధ గ్రా మాల నుంచి తరలివచ్చిన భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సన్నబియ్యం.. నూకలే అధికం కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో ఎక్కువగా నూకలే వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అయితే గతంలో కంటే భిన్నంగా ఉగాది నుంచి రేషన్షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. మండల కేంద్రమైన కౌడిపల్లిలో రెండు షాపుల్లో శుక్రవారం రాత్రి నుంచి లబ్ధిదారులకు రేషన్కార్డుపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే బియ్యం బాగున్నాయని.. 24 కిలోల బియ్యంలో 5 కిలోలకుపైగా నూకలు వచ్చాయని వాపోయారు. నూకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ చేస్తే మరింత బాగుంటుందని కోరుతున్నారు. జూన్లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో నంగునూరు మండలం నర్మేటలో నిర్మి స్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జూన్లో ప్రారంభిస్తామని తెలంగాణ ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు, ఎల్లాయిగూడ, రంగ నాయకసాగర్లోని ఆయిల్పామ్ నర్సరీల స్థితిగతులను, పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. సిద్దిపేట, జనగామ జిల్లాల వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన ఆయిల్ గెలలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న నిర్మా ణం పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుకు జనగామ, సిద్దిపేట జిల్లాలోని భూము లు అనువుగా ఉన్నాయని, పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. -
సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండల రైతుల సమస్యలను తెలుసుకున్న హరీశ్.. మంత్రికి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మండలంలోని రైతులు 18 వేల క్వింటాళ్ల దిగుబడి సన్ ఫ్ల్లవర్ సాగు చేసినట్టు పేర్కొన్నారు. అందులో 5 వేల క్వింటాళ్లు పీఏసీఎస్ ద్వారా, మరో 2 వేల క్వింటాళ్లు మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. మిగతా 11 వేల క్వింటాళ్ల సన్ ఫ్ల్లవర్ మిగిలిందని, దీనితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడు చూపిన మార్గం అనుసరణీయం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఆదర్శప్రాయుడు శ్రీరాముడు చూపిన మార్గం మనందరికీ అనుసరణీ య మని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే హరీశ్ విజ్ఞప్తి -
ఒకే తాటిపైకి రెవెన్యూ ఉద్యోగులు
● భూభారతితో రైతులకు మెరుగైన సేవలు ● తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ● ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంసిద్దిపేటఅర్బన్: రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, రెవెన్యూ ఉద్యోగులకూ భరోసా ఉంటుందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సంబంధించి త్వరలోనే ప్రభు త్వం శుభవార్త చెబుతుందని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖల్లోకి వస్తున్న గ్రామ పరిపా లన అధికారులు (జీపీవో) సర్వీసుపరమైన అభద్రతకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వీరందరికి కామన్ సర్వీస్, పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమించడం వల్ల రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయని వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను క్రమంగా సాధించుకుంటున్నామని, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూభారతి చట్టంతో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని, సమస్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకట్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, టీజీజీఏ జనరల్ సెక్రటరీ పూల్సింగ్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కా ర్యదర్శులు రాంరెడ్డి, భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనంగౌడ్ పాల్గొన్నారు. -
రాములోరి కల్యాణానికి వేళాయే
మెదక్జోన్: సీతారాముల కల్యాణ మహోత్సవానికి రామాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయాన్ని నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. ముత్యాల ముగ్గులు, తీరొక్కపూలతో పెళ్లి మండపం కల్యాణ క్రతువుకు సిద్ధమైంది. సిరి కల్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్య, కస్తూరి నామం, పూలజడతో వధువు సీతమ్మ పెళ్లికి ముస్తాబయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తిరు కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఎదుర్కోలు, మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాములోరి పెళ్లి కనుల పండువగా జరగనుంది. కాగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులు సమర్పించనున్నారు.నేడే శ్రీరామనవమి -
మహనీయుడు జగ్జీవన్రామ్
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: నేటి యువతకు బాబు జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కలెక్టర్ రాహుల్రాజ్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించగా.. కలెక్టర్ రాహుల్రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంతకాలం కేబినేట్ మంత్రిగా కొనసాగిన ఘనత అయనకే దక్కిందన్నారు. రక్షణ మంత్రిగా ఇండో–పాక్ యుద్ధ సమయంలో దేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో ఆయన పాత్ర కీలకం అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. జిల్లాలో అంబేడ్కర్ భవన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లతో విద్యలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ భుజంగరావు, ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కార్యదర్శి రాజ్కుమార్, వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో.. మెదక్ మున్సిపాలిటీ: బాబు జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త జగ్జీవన్రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
వన్యప్రాణుల దాహం దాహం
తొనిగండ్ల అటవీ ప్రాంతంలో నీరు లేక ఎండిపోయిన కుంట● నీటి కోసం పంట చేన్లు, గ్రామాల్లోకి వన్యప్రాణులు ● తాజాగా లక్ష్మాపూర్ వద్ద జింకను హతమార్చిన కుక్కలుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం రామాయంపేట రేంజ్ పరిధిలోని వన్యప్రాణులకు తాగు నీరు అందించడానికి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో పంచాయతీ వారి సహకారంతో ట్రాక్టర్లలో నీరు నింపుకొని సాసర్పిట్లలో పోస్తున్నాం. నీటి ఎద్దడి విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారిరామాయంపేట(మెదక్): వన్యప్రాణులు తాగు నీటి కోసం అల్లాడుతున్నాయి. నీటి కోసం వ్యవసాయ బోర్లు, గ్రామాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. తాజాగా శుక్రవారం అటవీ ప్రాంతం నుంచి లక్ష్మాపూర్ గ్రామంలోకి వచ్చిన జింకపై కుక్కలు దాడి చేసి హతమార్చాయి. రామాయంపేట, చేగుంట మండలాల్లో దట్టమైన అటవీప్రాంతం విస్తరించి ఉంది. రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగు నీటి వసతి కల్పనకు గాను 105 సాసర్పిట్లతో పాటు 15 చెక్డ్యాంలు, 27 చిన్నస్థాయి కుంటలున్నాయి. ఏటా వేసవిలో సాసర్పిట్లలో నీరు నింపి వన్యప్రాణుల దాహర్తి తీరుస్తున్నారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశాఖ అధికారులు నీటి సదుపాయం కల్పించలేకపోతున్నారు. ప్రస్తుతం కొన్ని సాసర్పిట్లు పాక్షికంగా ధ్వంసం కాగా రేంజ్ పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో మాత్రం ఆశాఖ అధికారులు పంచాయతీ ట్రాక్టర్తో సాసర్పిట్లలో నీరు పోయిస్తున్నారు. అటవీ ప్రాంతంలో చిరుతలతో పాటు జింకలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, రేసుకుక్కలు, మనుబోతులు, ఇతర జంతువులు ఉన్నాయి. రాయిన్పల్లి చెరువు అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండటంతో రాత్రివేళ పదుల సంఖ్యలో జంతువులు చెరువు వద్దకు వెళ్లి తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. -
కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి
పెద్దశంకరంపేట(మెదక్): ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇసాఖ్ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట బస్టాండ్లో కార్గో సెంటర్ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి తలంబ్రాలు, ము త్యాలను కార్గో ద్వారా ఇంటి వరకు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 20 కార్గో సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ శివశంకర్, రీజినల్ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, పేట కార్గో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోదాం మేనేజర్ సహా మరో నలుగురు అరెస్ట్ మెదక్జోన్: జిల్లా కేంద్రంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించిన ముగ్గురు సిబ్బందితో పాటు వాహన డ్రైవర్, యజమానిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. గత 31వ తేదీన ఎలాంటి అనుమతి లేకుండా సీడబ్ల్యూసీ గోదాం నుంచి 35 క్వింటాళ్ల బియ్యాన్ని ఓ డీసీఎంలో పంపించారు. ఇదే విషయమై ఈనెల 2వ తేదీన సాక్షిలో ‘దొంగ చేతికి తాళం’ అనే కథనం ప్రచురితం కావడంతో డీసీఎం డ్రైవర్తో పాటు దాని యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అయితే గోదాం మేనేజర్, మరో ఇద్దరు సిబ్బంది సహకారంతో బియ్యాన్ని తరలించామని వారు తెలిపారు. గతంలోనూ చాలా సార్లు బియ్యం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో డీసీఎం డ్రైవర్ చందర్, యజమాని సంతోష్తో పాటు మేనేజర్ కోటేశ్వర్రావు, టెక్నికల్ సిబ్బంది శ్యాం, సునీల్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. 7 నుంచి లీగల్ లిటరసీ క్యాంపులు నర్సాపూర్: ఈనెల 7వ తేదీ నుంచి మండలంలో లీగల్ లిటరసీ క్యాంపులు నిర్వహించనున్నట్లు మెదక్ ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సిరి సౌజన్య తెలిపారు. నారాయణపూర్లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 7, నర్సాపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8, 9న మండలంలోని రెడ్డిపల్లి ఇందిర క్రాంతిపథం గ్రూపు మహిళల కోసం క్యాంపులు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఆన్లైన్లో కొత్త పంచాయతీల వివరాలు డీపీఓ యాదయ్య కౌడిపల్లి(నర్సాపూర్): కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల వివరాలను ఆన్లైన్లో త్వరగా నమోదు చేయాలని డీపీఓ యాదయ్య కంప్యూటర్ ఆపరేటర్లను ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో కొత్త గ్రామ పంచాయతీల ఆన్లైన్ వివరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 24 గ్రామ పంచాయతీలు ఏర్పాటైనట్లు తెలిపారు. కాగా పాత పంచాయతీల నుంచి గ్రామ పంచాయతీలకు ఇండ్లు, ఇతర ప్రభుత్వ ప్రదేశాలను వేరుచేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. కౌడిపల్లి మండలంలో ఆరు పంచాయతీలు కొత్తగా ఏర్పాటైనట్లు వివరించారు. నాలుగు పంచాయతీలలో ఆన్లైన్ పూర్తి అయిందని, మిగితా రెండు పంచాయతీల వివరాలు సైతం త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. -
ప్రైవేట్కు పంపితే కఠిన చర్యలు
తూప్రాన్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేట్కు సిఫార్సు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శుక్రవారం తూప్రాన్లోని సీహెచ్సీ నూ తనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ ఆస్ప త్రులకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాలు తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరో 80 అంబులెన్స్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రీజినల్ కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని దృష్టి సారించినట్లు తెలిపారు. తూప్రాన్ ఆసుపత్రిలో ప్రతిరోజు 20 మందికి డయాలసిస్ సేవలు అందించవచ్చని వివరించారు. అనంతరం పట్టణ సమీపంలోని బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పోటాపోటీ నినాదాలు డయాలసిస్ సెంటర్ ప్రారంభ ం సందర్భంగామంత్రి దామోదర, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దీంతో కాంగ్రెస్లో గ్రూపు రాజకీ యాల గుర్తించి పలువురు చర్చించుకున్నారు. -
ప్రతి రికార్డు భద్రంగా ఉండాలి
కౌడిపల్లి(నర్సాపూర్)/రామాయంపేట(మెదక్): కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని శుక్రవారం జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువవికాసం దరఖాస్తుల గడువు ఈనెల 14 వరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు. దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వారీగా ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేసి భద్రపర్చాలని తెలిపారు. ప్రతి రికార్డు భద్రంగా ఉండాలని సూచించారు. అనంతరం మండలంలో ఉపాధిహామీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.జెడ్పీ సీఈఓ ఎల్లయ్య -
అత్యవసర వైద్యం
మరింత చేరువగానర్సాపూర్: వైద్యారోగ్యశాఖలో కొత్త పాలసీని తీసుకొస్తున్నామని, రహదారులపై 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఒక ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7,500 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అంబులెన్స్లు సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించి కాపాడుతామన్నారు. వ్యసనాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. పేదల కడుపు నింపడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా అర్హులైన పేదలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు. మహిళా సాధికారతే ధ్యేయంగా బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. నర్సాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ట్రామా సెంటర్, సీటీస్కాన్ సదుపాయాన్ని త్వరలో ప్రారంభించేందుకు చర్య లు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. చెక్కుల పంపిణీలో ఆరు నెలల పాటు కాలయాపన జరగడంతో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి వెళ్లిన అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మైక్ ఇవ్వాలని అడగ్గా అధికారులు ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగే ష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, ఆర్డీఓ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యం రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యమని మంత్రి దా మోదర అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను, సునీతారెడ్డి మంత్రులుగా కొనసాగామని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నారు. మహోన్నతమైన వ్యక్తిత్వం వైఎస్సార్ సొంతమని కొనియాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలన్నారు. సమన్వయంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం చాలా ముఖ్యమని అన్నారు. త్వరలో ట్రామా కేంద్రాల ఏర్పాటు పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం మంత్రి దామోదర రాజనర్సింహ -
సర్కారు వైద్యం గాలిలో దీపం
పెద్దాస్పత్రిలో అరకొర వైద్య సేవలుమెడికల్ కళాశాల మంజూరైన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపడలేదు. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వచ్చీరాని వైద్యంతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. – మెదక్జోన్ మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన అనిల్కుమార్ గత నెల 5న దాయరవీధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. నైట్డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ముందుగా యూరిన్ పైపు వేసి చికిత్స ప్రారంభిస్తామన్నారు. అయితే మూత్రనాలంలో పైపు వేసేందుకు అరగంట ప్రయత్నించి విరమించుకున్నారు. ఉదయం మూత్రనాలంలో పైపు వేస్తుండగా రక్తం వస్తుందని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్య పరీక్షలు చేసి మూత్రనాలంలో పైపు సరిగా వేయకపోవటంతో తీవ్రగాయం అయిందని చెప్పారు. ఆపరేషన్ చేసి పైపు ద్వారా యూరిన్ బయటకు తీశారు. అనంతరం విరిగిన ఎముకకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. అయితే మొత్తం ఆస్పత్రి ఖర్చు రూ. 2.50 లక్షలు అయిందని బాధితుడు వాపోయారు. కాగా సదరు ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జి సమ్మరిలో యూరిన్ పైపు సరిగా వేయకపోవటంతో మూత్రం నాళం లోపల దెబ్బతిందని ఇచ్చారు. అలాగే చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాదగిరి గత నెల 22న తలకు బలమైన గాయం కావటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరారు. సీటీస్కాన్ చేయించుకొని రావాలని డ్యూటీ డాక్టర్ క్షతగాత్రుడి తలకు పట్టి కట్టి పంపించాడు. రక్తం అలాగే కారుతుండడంతో కుటుంబీకులు సదరు వైద్యుడిపై మండిపడగా అప్పుడు కుట్లు వేసినట్లు తెలిసింది.రోగుల ప్రాణాలతో చెలగాటం! తప్పనిసరి పరిస్థితిలో ‘ప్రైవేట్’కు -
ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం
మెదక్ కలెక్టరేట్: విద్యుత్ సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ, విద్యుత్ మీటర్ సమస్యలు, బిల్లుల్లో సమస్యలు, కొత్త సర్వీస్లు, యాజమాన్య బదిలీ, కనెక్షన్ల పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ పరిష్కార వేదికలో 105 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను 41 రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్, ఇండిపెండెంట్ కమిటీ మెంబర్ వెంకట్, టెక్నికల్ డీఈ శ్రీనివాస్, మెదక్ డీఈ చాంద్పాష, తూప్రాన్ డీఈ గరుత్మంతా రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సీజేఆర్ఎఫ్ చైర్మన్ నాగేశ్వరరావు -
రాజ్యాంగ పరిరక్షణకు కదలిరావాలి
వెల్దుర్తి(తూప్రాన్): అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని, దానిని అడ్డుకుని తీరాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో నాయకులు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ కబంధహస్తాల కింద దేశం నలిగిపోకుండా కాపాడాలన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం ఆవిర్భవించిన పార్టీ అయితే బీజేపీ కేవలం మతపరమైన పార్టీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణు లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, నర్సింహారెడ్డి, సుధాకర్గౌడ్, మల్లేశం, శ్రీశైలం, శేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సన్న బియ్యం నిరుపేదలకు వరం
కలెక్టర్ రాహుల్రాజ్ పాపన్నపేట(మెదక్)/చిన్నశంకరంపేట: సన్న బియ్యం నిరుపేదలకు వరమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం మండలంలో ఎమ్మె ల్యే రోహిత్రావుతో కలిసి లబ్ధిదారులకు సన్నబియ్యం, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 520 రేషన్ షాపులు, 2.13 లక్షల రేషన్కార్డులు ఉండగా, 6.96 లక్షల లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. వీరందరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. సన్న వడ్లు పెట్టిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రయోజనకారిగా ఉందన్నారు. రాజీ వ్ యువ వికాసం స్కీంతో నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆ ర్ఎస్ హయాంలో ధనికులు సన్న బియ్యం తింటే, నిరుపేదలు మాత్రం దొడ్డు బియ్యం తినాల్సి వచ్చేదన్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేలా సీఎం రేవంత్రెడ్డి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, ఎమ్మార్వో సతీష్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప నాయకులు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్లలో వెనకబడిన మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాజు, నాయకులు పాల్గ్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
పెద్దశంకరంపేట(మెదక్): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం అన్నారు. గురువారం మండలంలోని దానంపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి 38 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 5 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మిగితా వారు కూడా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఏఈ విద్యాసాగర్, ఎంపీఓ విఠల్రెడ్డికి సూచించారు. అన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, వాటికి వెంటవెంటనే బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, పెరుమాండ్లుగౌడ్, పంచాయతీ సెక్రటరీ నరేందర్ పాల్గొన్నారు.జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం -
కొనేవారు లేక.. రైతన్న గోస
నిరుపయోగంగా పెద్దశ ంకరంపేట సబ్ మార్కెట్ యార్డు పెద్దశంకరంపేట(మెదక్): రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర మార్కెట్ యార్డుల్లో దొరుకుతుందంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో మాత్రం లోపాలున్నట్లు స్పష్టమవుతోంది. 2016లో పెద్దశంకరంపేటలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సబ్ మార్కెట్ యార్డు లో ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. నాబార్డు నిధులు వెచ్చించి దాదాపు రూ. 4 కోట్లతో 161వ జాతీయ ప్రధాన రహదారిని ఆనుకొని నిర్మించారు. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం ఏర్పాటు చేశారు. కేవలం దీనిని గోదాం లాగానే వినియోగిస్తున్నారు తప్ప, కొనుగోళ్లు చేపట్టడం మరిచారు. దీంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన తూకం వృథాగా మారింది. మార్కెట్ యార్డుగా మారిస్తే మేలు పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా మారుస్తానని గతంలో మాజీ మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంత రైతులు అప్పట్లో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కె ట్ యార్డుకు పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యా ర్డు అనుబంధంగా ఉంది. అప్పట్లో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఎవరూ దీనిని పట్టించుకోలేదు. ప్రస్తుతం మార్కెట్ యార్డుగా మార్చి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పేట మండలాలకు చెందిన రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సబ్మార్కెట్ యార్డ్ అలంకారప్రాయంగా మారింది. కేవ లం సివిల్ సప్లై గోదాంగా మార్చి బియ్యం, వడ్లు మాత్రమే నిల్వ చేస్తున్నారు. కరువైన వసతులు పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డులో సరైన వసతులు కరువయ్యాయి. 161వ జాతీయ రహ దారి విస్తరణలో ప్రహరీ కూల్చివేశారు. నష్ట పరిహారం కింద నిధులు మంజూరైనా ఇప్పటికీ ప్రహరీ నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణం, రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్లా ట్ఫాంలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి వసతులు ఏర్పాటు చేసి వినియోగంలోనికి తేవాలని రైతులు కోరుతున్నారు.కొనుగోళ్లు చేపట్టాలి ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, శనగపంటలు సాగవుతాయి. సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడితే రైతులకు సరిౖన మద్దతు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – మారుతి, రైతు, పెద్దశంకరంపేట ఉన్నతాధికారులకు నివేదిస్తాం పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డును మా ర్కెట్ యార్డుగా మార్చే విషయమై ఉన్నతాఽ దికారులకు నివేదిస్తాం. ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు తగిన చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – సునీల్, జోగిపేట మార్కెట్ యార్డు సెక్రటరీ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
వడ్లకుప్పలను ఢీకొనడంతో ప్రమాదం నిజాంపేట (మెదక్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి నిజాంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాలాపూర్కు చెందిన అబ్దుల్ రహ్మాన్ (50) ఫోన్ రావడంతో చేగుంట మండలం పులిమామిడికి బైక్పై బయలుదేరాడు. గ్రామ శివారులో రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలను ఢీకొనడంతో కింద పడిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. రహ్మాన్ మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.చదవడం, రాయడం తప్పనిసరి చేగుంట(తూప్రాన్): విద్యార్థులకు చదవడం రాయడం వచ్చేలా శిక్షణ ఇవ్వాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం మండలంలోని వడియారం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదవడం, రా యడం ఖచ్చితంగా రావాలన్నారు. గణితంలో చతుర్విద ప్రక్రియలకు అనుగుణంగా బోధించాలని సూచించారు. తొలిమెట్టు మూల్యంకన ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. డీఈఓ వెంట ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు ప్రియదర్శిని, ఉపాధ్యాయులు వసంత, సంతోషిమాత తదితరులు ఉన్నారు. సమగ్ర వివరాలు నమోదు చేయాలి శివ్వంపేట(నర్సాపూర్): రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి సమగ్ర వివరాలు నమోదు చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. గురువారం శివ్వంపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పత్రాలను కార్యాలయంలో తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివరాలు నమోదుకు ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటుచేయాలన్నారు. అలాగే ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచే విధంగా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నరేందర్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ స్వామి, ఏపీఓ అనిల్కుమార్ ఉన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు రామాయంపేట(మెదక్): నాసిరకం విత్తనాలు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్నారాయణ హెచ్చరించారు. గురువారం రైతు వేదికలో డివిజన్ పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన విత్తనాలు, క్రిమి సంహారక మందుల డీలర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విత్తన చట్టాలకు లోబడి డీలర్లు వ్యాపారం నిర్వహించుకోవాలని, నెలవారీ నివేదికలను ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. విత్తనాలు, క్రిమి సంహారక మందులకు సంబంధించి అమ్మకాలు, నిల్వల వివరాలను ప్రతినెల తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. ఏఓలు సోమలింగారెడ్డి, యాదగిరి, ఏఈఓ ప్రవీన్, డీలర్లు పాల్గొన్నారు. మహనీయుడు వాజ్పేయి మెదక్జోన్: దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి గొప్ప నేత అని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి మీసాల చంద్రయ్య అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి శత జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 6వ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షులు నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నేతలు శివ, విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు. -
నెరవేరేనా..!
సొంతింటి కల పేద, మధ్య తరగతి ప్రజలను ఊరిస్తున్న సొంతింటి కల అందని ద్రాక్షగానే మారింది. గత ప్రభుత్వంలో 688 డబుల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడమూ లేదు. ఈ క్రమంలో సొంతింటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించింది. దీంతో ఎంతో మంది అర్హులు అర్జీలు పెట్టుకున్నారు. అయితే ఆ ప్రక్రియ సైతం ముందుకు సాగడం లేదు. – మెదక్జోన్ జిల్లాలో దశాబ్ద కాలంగా ప్రభుత్వం పేదలకు సరిపడా ఇళ్లు మంజూరు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు 4,776 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 3,975 ఇళ్లకు మాత్రమే టెండర్ పూర్తయింది. వీటి నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం రూ. 243 కోట్లను విడుదల చేసింది. టెండర్ అయిన వాటిలో 3,011 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా లబ్ధిదారులకు 2,323 ఇళ్లను మాత్రమే పంపిణీ చేసింది. ఈ లెక్కన నిర్మాణాలు పూర్తయినవి మరో 688 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. వాటికి చిన్నచిన్న మరమ్మతులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలపై మాత్ర మే దృష్టి సారించింది. ప్రజాపాలనలో ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో జిల్లాలో లక్షపై చిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలోని అర్హులకు ఇళ్లు మంజూరు చేశారు. 21 మండలాల పరిధిలోని 21 గ్రామాలను ఎంపిక చేసి 1,555 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వారికి జన వరి 26న మంజూరు పత్రాలను అందించారు. అయితే ఇప్పటివరకు మూడు నెలలు అవుతున్నా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జిల్లాలో 493 గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు కేవలం 21 గ్రామాల్లోనే ఈ పథకాన్ని అమలు చేశారు. మిగితా గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు పూర్తయిన 688 ఇళ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని అడుగుతున్నారు. ఏళ్లుగా తప్పని ఎదురుచూపులు గత ప్రభుత్వంలో నిర్మించిన688 ఇళ్లు పంపిణీకి సిద్ధం వాటి ఊసే ఎత్తని పాలకులు,అధికారులు ముందుకు సాగని ఇందిరమ్మఇళ ్ల నిర్మాణం ఆసక్తి చూపని లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. మూడు నెలల క్రితం జిల్లాలోని 21 గ్రామాలకు 1,555 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 34 మంది లబ్ధిదారులు మాత్రమే బెస్మెంట్ లెవల్ వరకు నిర్మించుకున్నారు. మరో 120 మంది పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇంటిలో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండగా, వాటిని పిల్లర్లతో నిర్మించారు. ఇందిరమ్మ ఇంటిలో కేవలం ఒక బెడ్రూం మాత్రమే ఉండగా, అందులో పిల్లర్లు లేకుండా నిర్దేశించిన డిజైన్లోనే కట్టుకుంటే బాగుంటుందని అధికారులు చెబుతు న్నారు. కనీసం 400 చదరపు అడుగుల నుంచి అత్యధికంగా 600 చదరపు అడుగుల వరకు ఇంటిని నిర్మించుకోవాలని సూచిస్తు న్నారు. అయితే 400 చదరపు అడుగుల ఇంటిని నిర్మించుకుంటే ఏ మాత్రం సరిపోదనే భావనతో చాలా మంది లబ్ధిదారులున్నారు. -
అభివృద్ధి నిరోధకులుగా మారొద్దు
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వం ఎవరిదైనా ఎమ్మె ల్యేగా తాను ప్రపోజల్స్ పంపిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంజూరు వస్తుందని, అధికార పార్టీ నాయకులకు చేతనైతే అదనపు నిధులు తేవాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు పలికారు. గురువారం మాసాయిపేట మండలంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. అయితే రెండు రోజుల తర్వాత మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు తెలపడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా సమాచారం ఇచ్చి అర్ధాంతరంగా చెక్కుల పంపిణీ నిలిపివేసినందుకు నిరసనగా నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేస్తున్నారు, నర్సాపూర్లో మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిధు ల విడుదలలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. తన హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తే చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, భూపాల్రెడ్డి నాయకులు నర్సింలు, నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు -
తూప్రాన్ మున్సిపాలిటీకి అవార్డు
తూప్రాన్: జిల్లాలోనే తూప్రాన్ మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆస్తి పన్ను వసూళ్లలో 82.17 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఈసందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి చేతులమీదుగా కమిషనర్ పాతూరి గణేష్రెడ్డి బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమష్టి కృషి ఫలితంగానే అవార్డు దక్కిందని తెలిపారు. -
పైసలివ్వకుంటే పొద్దు గడిచేదెట్టా?
సంగారెడ్డి జోన్: గ్రామాలలో వలసలు నివారించేందుకు 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసి కూలి డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. పనులు పూర్తిచేసి నెల రోజులు పూర్తి కావస్తున్నా కూలీలకు మాత్రం కూలి చెల్లించడం లేదు. కూలీల కు సరైన సమయంలో డబ్బులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 45 రోజులు... రూ. 36.46 లక్షలు జిల్లాలో గత ఫిబ్రవరి 14 నుంచి మార్చి 31 వరకు ఉపాధి హామీలో పనులు చేసిన కూలీలకు మాత్రం డబ్బులు రాలేదు. సుమారు 45 రోజుల డబ్బులు రూ. 36.46లక్షలు పెండింగ్లో ఉన్నాయి. వాస్తవానికి కూలి పని చేసిన 15 రోజులకు కూలి డబ్బులు రావాల్సి ఉంటుంది. కొలతల ఆధారంగా చెల్లింపు ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పనులకు కొలతలు చేపట్టి చెల్లింపులు చేస్తుంటారు. ప్రతీరోజు పనులు పూర్తికాగానే పని ప్రదేశం వద్దే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ ఆన్లైన్ విధానంలో కూలి హాజరు వేస్తారు. వారం రోజులకొకసారి టెక్నీషియన్ అధికారులు చేసిన పనుల కొలతలు చేపట్టి మెజర్మెంట్ బుక్(ఎం.బీ) రికార్డు చేసి ఆన్లైన్ విధానంలోనే చెల్లింపులు చేస్తుంటారు. కూలీ డబ్బులు చెల్లింపులకు స్లిప్పులు కూలీలు చేసిన పనులకు ఎంత మేర డబ్బులు వస్తాయి? ఎక్కడ పని చేశారు? కూలి పేరుతో పాటు వర్క్ ఐడీ తదితర వివరాలతో కూడిన స్లిప్పు లు కూలీలకు పంపిణీ చేస్తారు. వారానికి ఒకసారి చేసిన పనులకు లెక్కచేసి స్లిప్పులు అందిస్తారు. స్లిప్పులు ఆధారంగానే డబ్బులు వస్తాయి.ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలు01జడ్హెచ్ఆర్73ఎ ఉపాధి కూలీ డబ్బులకు తప్పని నిరీక్షణ రోజులు గడుస్తున్నా అందని కూలి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కూలీలు ప్రతీ వారం డబ్బులు ఇప్పించాలని వినతికూలీలకు తప్పని ఆర్థిక ఇబ్బందులు పనులు పూర్తి చేసి రోజులు గడుస్తున్నా సరైన సమయంలో కూలి డబ్బులు రాకపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పడం లేదని కూలీలు వాపోతున్నారు. తమ అవసరాలకు డబ్బులు లేకపోవడంతో పనులు చేసిన ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. పనులు చేసే సమయంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తారని, డబ్బులు అడిగితే మాత్రం పైనుంచి రావాలని సమాధానం చెబుతున్నారని కూలీలు వివరించారు.జిల్లాలోని ఉపాధి హామీ వివరాలు జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్య 619 జిల్లాలో ఉన్న జాబ్ కార్డుల సంఖ్య 2,19,000 ఉపాధి కూలీల సంఖ్య 4,03,000 జిల్లాలో యాక్టివ్ జాబ్ కార్డులు 1,32,000 జిల్లాలో పెండింగ్ ఉన్న డబ్బులు రూ.36.46 లక్షలుఆరువారాల డబ్బులు రాలేదు ఉపాధి హామీలో ఆరువారాల నుంచి డబ్బులు రాలేదు. మాలాంటి పేదోళ్లం ఉపాధి పనికి పోతున్నాం కానీ డబ్బులివ్వకుంటే బువ్వెలా దొరుక్కుద్ది. అధికారులు ఇప్పటికై నా స్పందించి డబ్బులిప్పించాలి. –సుజాత, గ్రామం.మల్కాపూర్, మం.హత్నూర -
4న విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్ డే
చిన్నశంకరంపేట(మెదక్): ఈనెల 4న మెదక్ విద్యుత్శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఏఈ దినకర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందించవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యుత్ బిల్లు, ఆధార్కార్డు జిరాక్స్ను జతచేయాలని సూచించారు. పోరాటయోధుడు పాపన్నగౌడ్ మెదక్జోన్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం పాపన్నగౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ పరిశ్రమపై చర్యలు తీసుకోండి మనోహరాబాద్(తూప్రాన్): కార్మికుడి మరణానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డిలో డిప్యూటీ లేబర్ కమిషనర్ రవీందర్రెడ్డికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కొండాపూర్ శివారులోని శ్రీయాన్ పాలిమార్స్ పరిశ్రమలో మంగళవారం రఘునాథ్సింగ్ అనే కార్మికుడు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడన్నారు. పరిశ్రమ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పలు పరిశ్రమల్లో కనీస వసతులు లేకుండానే, భద్రతా చర్యలు చేపట్టకుండానే కార్మికులతో 10 నుంచి 12 గంటల చొప్పున పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాకి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మైనర్లకు బైక్లు ఇస్తే కఠిన చర్యలు: ఎస్పీమెదక్ మున్సిపాలిటీ: మైనర్లకు బైక్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించా రు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు బావు లు, చెరువులు, వాగుల్లో ఈతకు వెళ్లే అవకాశం ఉందని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సర దా ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారిని పట్టుకొని వాహన యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు. వేసవిలో క్రీడా శిక్షణ కేంద్రాలకు పంపి మీ పిల్లలలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని కోరారు. ఢిల్లీ వెళ్లిన బీసీ సంఘం నేతలు రామాయంపేట (మెదక్): 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనకు జిల్లాకు చెందిన బీసీ సంఘం నాయకులు భారీగా తరలివెళ్లారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బెట్టింగ్ యాప్లతో జర భద్రం
డీఎస్పీ ప్రసన్నకుమార్పాపన్నపేట(మెదక్): మొబైల్ యాప్లలో వచ్చే ప్రకటనలు నమ్మి, బెట్టింగ్లు పెట్టి ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు తీసుకోవద్దని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి సూచించారు. బుధవారం పాపన్నపేటలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 22 మంది బాధితులకు వాటిని రివకరీ చేసి అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను గుర్తించామన్నారు. మొబైల్ ఫోన్ చోరీకి గురి కాగానే బాధితులు వెంటనే తమ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఐఎంఈఐ నంబర్ను భద్రపర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల రికవరీలో మెదక్ జిల్లా ముందంజలో ఉందని వివరించారు. ఈసందర్భంగా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్, ఏఎస్ఐ సంగన్న, గాలయ్య, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ను అభినందించారు. 02ఎన్ఆర్ఎస్62ఎ: భక్తుల బోనాల ఊరేగింపు -
బియ్యం అమ్మితే రేషన్ కార్డు కట్
కలెక్టర్ రాహుల్రాజ్నర్సాపూర్రూరల్/హవేళిఘణాపూర్(మెదక్): సన్న బియ్యం అమ్మితే లబ్ధిదారుల రేషన్ కార్డు కట్ చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ చేస్తే అందరూ తినగలుగుతారని ఆలోచించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. జిల్లావ్యాప్తంగా 2,13,820 తెల్ల రేషన్కార్డుదారులకు 4430.496 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్, మాజీ కౌన్సిలర్లు లలిత, సరిత, మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్, జైపాల్, నర్సింలు, స్వరూప, ఫహిం తదితరులు పాల్గొన్నారు. అలాగే హవేళిఘణాపూర్లో సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. కొందరు అంత్యోదయ కార్డు ద్వారా 30 కిలోల బియ్యం వచ్చేవని, ప్రస్తుతం రాకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని కలెక్టర్తో మొరపెట్టుకున్నారు. దీంతో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
పేదలకు కడుపునిండా సన్న బువ్వ
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్జోన్/హవేళిఘణాపూర్/రామాయంపేట: రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలోని రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు సన్నబియ్యం తినాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం అన్నారు. సన్నధాన్యం కొనుగోలు చేసి క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలిచిచామన్నారు. అంతేకాకుండా ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో దాదాపు రూ. వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్బాబుతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హవేళిఘణాపూర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడాదిలోపే రైతులకు రుణమాఫీ, రైతు భరోసాను అమలు చేసినట్లు తెలిపారు. అలాగే రామాయంపేట మున్సిపాలిటీలోని రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే నన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. అనంతరం దామరచెరువు గ్రామంలో రూ. 1.95 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు రూ. 14.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సుప్రభాత్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు యుగేందర్రావు, నాయకులు పాల్గొన్నారు. -
పరీక్షలు ముగిశాయోచ్
పాపన్నపేట(మెదక్): విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 21వ తేదీన ప్రారంభమైన పరీక్షలు సాంఘీక శాస్త్రం పరీక్షతో పరిసమాప్తమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10,388 మంది విద్యార్థులకు 10,241 మంది పరీక్షలు రాశారు. 147 మంది వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. చివరి పరీక్ష రాసి కేంద్రాల్లో నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఆనందంగా కన్పించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ పర్యవేక్షణలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. -
గోదాముల్లో గోల్మాల్!
గోదాం ఇన్చార్జిల అక్రమాలు ● ఐదేళ్లలో 11 వేల క్వింటాళ్ల బియ్యం మాయం ● 19 లక్షల గన్నీబస్తాలు విక్రయం ● రూ. 15.67 కోట్ల ప్రభుత్వ సొమ్ము పక్కదారి ● సస్పెండ్ అయిన వారే మళ్లీ విధుల్లోకి.. మెదక్ కేంద్ర గిడ్డంగుల సంస్థకంచె చేను మేసిన చందంగా.. పేద ప్రజలు తినే బియ్యాన్ని నిల్వ ఉంచే ఎంఎల్ఎస్ పాయింట్లకు రక్షణ కల్పించాల్సిన గోదాం ఇన్చార్జిలు అడ్డదారి తొక్కారు. వేలాది క్వింటాళ్ల బియ్యంతో పాటు లక్షలాది గన్నీ బస్తాలను అమ్ముకున్నారు. ఐదేళ్ల వ్యవధిలో రూ. 11.67 కోట్ల విలువ చేసే ప్రభుత్వ సొమ్మును మింగారు. అయినా వారి నుంచి ఆర్ఆర్యాక్ట్ కింద ఒక్కపైసా రికవరీ చేయలేకపోయారు. విచిత్రమేమిటంటే సస్పెండ్ అయిన వారే మళ్లీ విధుల్లో చేరుతున్నారు. – మెదక్జోన్ : జిల్లావ్యాప్తంగా పెద్దశంకరంపేట, పాపన్నపేట, చేగుంట, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్లో మొత్తం 7 ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో గత ఐదేళ్ల కాలంలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట నాలుగు (ఎంఎల్ఎస్) స్టాక్ పాయింట్లలో ఐదుగురు గోదాం ఇన్చార్జిలు విధులు నిర్వర్తించారు. వీరు పోటీ పడి మరి ఐదేళ్ల కాలంలో 11,086.66 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టించారు. అంతేకాకుండా 19,44,200 లక్షల గన్నీ బస్తాలను అమ్ముకున్నారు. వీటి విలువ అక్షరాల రూ. 15,67,90,862 కోట్లు. అయితే ఆలస్యంగా పసిగట్టిన ఉన్నతాధి కారులు విచారణ జరిపి సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈవిషయా న్ని అప్పట్లో బట్టబయలు చేయగా, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైసా రాబట్ట లేదు.. గోదాంల ఇన్చార్జిలు ఐదుగురి నుంచి రూ. 15.67 కోట్ల ప్రజాధనాన్ని ఆర్ఆర్యాక్ట్ ఉపయోగించి తిరిగి కక్కిస్తామని గతంలో అధికారులు చెప్పారు. కానీ ఇప్పటివరకు వారి నుంచి పైసా రికవరీ చేయలేదు. కేసులు నమోదు చేసి జైలుకు పంపగా, బెయిల్పై తిరిగి వచ్చి యథావిధిగా విధుల్లో చేరుతున్నారు. ఐదుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరు విధుల్లో చేరగా, మరో ముగ్గురు ఉద్యోగంలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.తాజాగా 35 క్వింటాళ్ల బియ్యం నమ్మకానికి మారుపేరైనా కేంద్ర గిడ్డంగుల సంస్థ నుంచి తాజాగా మార్చి 31వ తేదీన 35 క్వింటాళ్ల బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా డీసీఎంలో తరలించారు. గమనించిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మెదక్ పట్టణ పోలీసులు వాహనాన్ని వెంబడించి అదుపులోకి తీసుకొన్నారు. తమదైన శైలిలో విచారణ జరిపి డ్రైవర్తో పాటు యజమానిపై కేసు నమోదు చేశారు. కాగా కేంద్ర గిడ్డంగుల అధికారి ఆదేశాల మేరకే తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.గోదాంలో తనిఖీలు కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాం నుంచి మార్చి 31వ తేదీన 35 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలించిన విషయమై మంగళవారం ‘సాక్షి’లో ‘దొంగ చేతికి’ తాళం అనే కథనం ప్రచురితమైంది. దీనిని స్పందించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) సిబ్బంది బుధవారం గోదాంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బియ్యం తక్కువగా వచ్చినట్లు నిర్ధారించారు. ఈ విషయమై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎఫ్సీఐ ఇంటెలిజెన్స్ సిబ్బంది తెలిపారు. కాగా వారి పేర్లు తెలిపేందుకు వారు నిరాకరించారు. -
అదృశ్యమై.. భువనగిరిలో ప్రత్యక్షమై
అధికారులను పరుగులెత్తించిన కేజీబీవీ విద్యార్థిని పాపన్నపేట(మెదక్): కేజీబీవీలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని బుధవారం పాపన్నపేటలో అదృశ్యమై.. భువనగిరిలో ప్రత్యక్షం అయింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్కు చెందిన దంపతులకు ఒక కుమార్తె (15) ఉంది. కొంతకాలం క్రితం తండ్రి మరణించడంతో తల్లి, కూతురు భువనగిరి ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ కూతురును మొదట భువనగిరిలోని కేజీబీవీలో చేర్పించి తర్వాత పట్టించుకోవడం మానేసింది. దీంతో బాలికను అధికారులు కొంతకాలం అక్కడి బాల సదనంలో చేర్పించారు. అక్కడి నుంచి మెదక్ బాలసదనం తీసుకొచ్చారు. ఈఏడాది పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో చేర్పించారు. అయితే జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో బుధవారం అటెండెన్స్ తీసుకున్న అనంతరం అదృశ్యమైంది. వెంటనే విషయాన్ని గుర్తించిన ఎస్ఓ బాలలక్ష్మి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ ప్రతాప్రెడ్డి పాపన్నపేట కేజీబీవీకి చేరుకొని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే సాయంత్రం బాలిక భువనగిరి బాలసదనం చేరుకోవడంతో వారు అక్కడి సఖి కేంద్రంలో అప్పగించారు. విషయాన్ని పోలీసులు, అధికారులు ధృవీకరించారు. పొద్దంతా ఉరుకులు పరుగులతో ఆందోళన చెందిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
సన్న బియ్యం.. సంబురం
చరిత్రాత్మకం: మంత్రి పొన్నంలబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు ● మొదటిరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో 801 టన్నుల బియ్యం పంపిణీ ● 38వేలకుపైగా కార్డుదారులకు అందజేత ● రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు బారులు సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాప్ల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8,83,883 రేషన్ కార్డులుండగా మొదటి రోజు మంగళవారం 694 రేషన్ షాపులలో 38,526 కార్డుదారులకు 801.134 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. హుస్నాబాద్లో సన్నబియ్యం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో.. సంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు అత్యధికంగా రేషన్ కార్డుదారులు సన్న బియ్యం తీసుకున్నారు. అత్యల్పంగా మెదక్ జిల్లాలో పంపిణీ చేశారు. నార్సింగ్, టెక్మాల్, పాపన్నపేట మండలాల్లో రెండు రేషన్షాపుల చొప్పున 6 రేషన్ షాపులలో మాత్రమే బియ్యం పంపిణీ చేయడం గమనార్హం. మరి కొన్ని రేషన్ షాపులకు బియ్యం చేరుకోవాల్సి ఉంది. అలాగే కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తామని పంపిణీని వాయిదా వేశారు. కార్డుదారుల్లో సంతోషం.. కొన్నేళ్లుగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసింది. దీంతో కార్డుదారులు అంతంత మాత్రంగా తీసుకునేందుకు మొగ్గుచూపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని అందజేస్తోంది. కార్డుదారులు సంతోషంగా సన్న బియ్యం తీసుకున్నారు. సన్న బియ్యం ఇస్తుండటంతో బయట కొనడం ఇక తప్పిందని.. అలాగే డబ్బులు కూడా మిగులుతాయని కార్డు దారులు ఆనందం వ్యక్తం చేశారు. హుస్నాబాద్: దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో తెల్లరేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2.91 లక్షల రేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకు అమ్మడం, రేషన్ దుకాణాలకు వాపస్ ఇవ్వడం జరిగేదన్నారు. ఇక నుంచి సన్న బియ్యం అందరూ తీసుకుంటారన్నారు. అందరికీ ఆరోగ్యం బాగుండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సన్న బియ్యం పఽథకం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. మొదటి రోజు పంపిణీ వివరాలు జిల్లా మండలాలు రేషన్ కార్డులు కిలోలు షాపులు మెదక్ 3 06 86 1,960 సిద్దిపేట 25 365 17,933 3,62,138 సంగారెడ్డి 27 323 20,502 4,37,036 -
మహిళా సంఘాలకు గ్రేడింగ్
సంగారెడ్డిటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహకార సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తోంది. మహిళలకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా...స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. సంఘాల్లో సభ్యులు అనుభవమున్న రంగంలో రాణించేలా ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తున్నారు. అందుకే మహిళా సంఘాలలో మరింతమంది సభ్యులుగా చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుతోపాటు శ్రీనిధి రుణాలు సైతం అందుతుండటంతో ఆర్థిక సమస్యలను అధిగమించే దిశగా మహిళా సంఘాల సభ్యులు ముందుకు సాగుతున్నారు. ఈ సంఘాలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో గ్రేడింగ్ విధానాన్ని సైతం అమలు చేస్తోంది. మహిళలకు గ్రేడింగ్ పెరిగేకొద్దీ రుణాలను ఎక్కువగా ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. మహిళా సంఘం సభ్యులు సమావేశాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ఫొటోలను జతచేయాల్సి ఉంటుంది. ఏ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ వరకు పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లాలో మొత్తం 1,95,235 మంది సభ్యులు ఉండగా, మహిళా సంఘాలు 18,208 అందులో 25 మండలాల్లోని 695 గ్రామాలలో గ్రామ సంఘాలలోని మహిళలున్నారు. వారికి గ్రేడ్ల ఆధారంగా రుణాలను అందిస్తున్నారు. మహిళా సంఘాలకు ఒక్కో యూనిట్ విలువను రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిర్ణయించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంశాలవారీగా కేటాయింపు మహిళా సంఘాలకు 12 అంశాల ఆధారంగా ఏ,బీ,సీ,డీ,ఈలతో గ్రేడింగ్ ఇస్తారు. ఒక్కో మహిళా సంఘం 75 శాతానికి పైగా గ్రేడింగ్ను సాధిస్తే ఎక్కువ సంఖ్యలో రుణాలిస్తారు. ఇలా తక్కువ వడ్డీకి ఇచ్చిన రుణాలను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 75 శాతానికి పైగా లక్ష్యాలను సాధిస్తే ఏ గ్రేడ్, 70% నుంచి 74% బీ గ్రేడ్, 60 లోపు సాధిస్తే సీ గ్రేడ్, 50% కంటే తక్కువ ఉంటే డీ గ్రేట్, అంతకంటే తక్కువగా ఉంటే ఈ గ్రేడింగ్ ఇస్తారు. ఏ,బీ,సీ గ్రేడింగ్ సంఘాలకు శ్రీనిధి రుణాలను కేటాయిస్తారు. గ్రామైక్య సంఘాలకు మాత్రమే ఈ గ్రేడింగ్ విధానం అమలులో ఉంది. క్షేత్రస్థాయిలో స్వయం సహాయక సంఘాలకూ ఇదే నిబంధన వర్తించనుంది.గ్రేడింగ్ విధానంతో రుణాలు పెరిగిన పర్యవేక్షణ రగ్రేడ్ పాయింట్ల ఆధార ంగా ప్రాధాన్యంకేటాయించే పద్ధతులు... ప్రతీ నెల రెండు సమావేశాలు ఉంటాయి సమావేశానికి అందరూ హాజరు కావాలి సక్రమంగా శ్రీనిధి రుణ వాయిదాల చెల్లింపుల పద్ధతిలో చేయాలి ప్రతీనెల పొదుపు చెల్లింపులు ఉండాలి గ్రామ సంఘానికి చెల్లించిన రుణ వాయిదాలు, బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపులు సక్రమంగా ఉండాలి వీటన్నింటికీ తగిన మార్కులను కలిపి గ్రేడింగ్ నిర్ణయిస్తారు ఇందిరా మహిళా శక్తి శ్రీనిధి అమలు చేసిన కార్యక్రమాలలో 100% టార్గెట్ను గుమ్మడిదల సమైక్య సంఘం పూర్తి చేసింది మిగతా మండలాలలో కూడా లక్ష్యాలను పూర్తిచేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మహిళా సంఘాల పర్యవేక్షణ పెరిగింది మహిళా సంఘాలలో గ్రేడింగ్ విధానం అమలు చేయడంతో పొదుపు సంఘాలపై పర్యవేక్షణ పెరిగింది. సమావేశాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు లైవ్ఫొటోలను అప్లోడ్ తప్పనిసరిగా చేయాలి. ఎప్పటికప్పుడు అధికారులు సంఘాల వారీగా నివేదికలను తీసుకుని సమీక్ష చేస్తున్నారు. – జంగారెడ్డి, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి. -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
మనోహరాబాద్(తూప్రాన్): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పీహెచ్సీ వైద్య బృందం, సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలు, వసతుల గూర్చి రోగు లు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం అందుబాటులో ఉండాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. క్షయ రోగు లకు పోషణ్ కిట్లను అందించారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వార్డులు, మందు లు, ల్యాబ్లను పరిశీలించారు. పలు రికార్డులతో పాటు హాజరు పట్టికను పరిశీలించి సమస్యలపై సిబ్బందిని ఆరా తీశారు. కలెక్టర్ వెంట సీఎస్ఓ బాల్నర్సయ్య, వైద్యులు తదితరులున్నారు.జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ -
క్షణికావేశంతో జీవితాలు నాశనం
● చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు ● మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్ హవేళిఘణాపూర్(మెదక్): క్షణికావేశంలో ఘర్షణలు పడితే జీవితాలు నాశనమవుతాయని మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. గ్రామాల్లోని ప్రజలందరూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మంగళవారం మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవ పడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆర్డీవో, రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్తోపాటు అధికారులు గ్రామానికి చేరుకొని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని, ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు, పోలీసులు ఉన్నారని తెలిపారు. క్షణికావేశంలో పొరపాట్లు జరిగినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలన్నారు. ప్రతీ పౌరుడు చట్టం పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని, చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతీ ఒక్కరూ ఏదైనా తప్పు జరిగితే రాజీమార్గం వైపు మొగ్గు చూపాలే తప్ప దానిని పెద్దగా చేసి కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకురాకపోవడం మంచిదన్నారు. కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ మురళి, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, గిర్దావర్ లక్ష్మణ్, సెక్రటరీ లింగం, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
వసూళ్లు ఫుల్.. వసతులు నిల్
మెదక్జోన్: తైబజార్ పేరుతో జోరుగా వసూళ్ల దందా సాగుతోంది. వారాంతపు సంతల్లో ఉత్పత్తులను విక్రయించేందుకు వెళితే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లిస్తేనే అనుమతిస్తున్నారు. జిల్లాలోని ఒక్కో వారాంతపు సంత వేలం పాట ద్వారా రూ. 2 లక్షల నుంచి మొదలుకొని రూ. 40 లక్షల వరకు పలుకుతోంది. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు రెండింతలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కానీ సంతల్లో వసతులు మాత్రం కల్పించడం లేదని విక్రయదారులు, ప్రజలు వాపోతున్నారు. తైబజార్ వేలం రూ. 42 లక్షలు మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల కేంద్రంలో ప్రతి శనివారం పశువులు, గొర్రెలు, మేకలతో పాటు కూరగాయల సంత కూడా నిర్వహిస్తారు. మేకలు, గొర్రెలు , పాడి గేదెలు, పశువులు కావాలన్నా టేక్మాల్ అంగడికి వెళ్లాలి. ఇటీవల ఇక్కడ నిర్వహించే పశువుల సంతకు రూ.12 లక్షలు, కూరగాయల సంతకు(తైబజార్)రూ.10 లక్షల వేలం పాట ద్వారా ఆదాయం వచ్చింది. త్వరలో మేకలు, గొర్రెల సంతలను సైతం వేలం వేయనున్నారు. వాటికి మరో రూ. 20 లక్షల పైచిలుకు ఆదాయం వేలం ద్వారా రానుంది. మొత్తం రూ.42 లక్షల ఆదాయం ఈ సంతకు వచ్చే అవకాశం ఉంది. కానీ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాగునీటిని రెండు చోట్ల ఏర్పాటు చేసినా ఎవరికి సరిపోవడం లేదు. అలాగే మూత్రశాలలు ఉన్నా, నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. మరుగుదొడ్లు అసలే లేవు. లక్షల ఆదాయం వస్తున్నా సౌకర్యాల కల్పనను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు మండి పడుతున్నారు.మెదక్ జిల్లాలో 21 మండలాలతో పాటు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 120 పైచిలుకు వారాంతపు సంతలు నిర్వహిస్తుండగా.. కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు లేవు. వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలిలో వణకాల్సిందే. సంత నిర్వహణకు స్థలం కూడా లేక రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సంతల్లో 110 పై చిలుకు కూరగాయల విక్రయాలు జరుగుతుంటే, మరో 10 సంతల్లో మాత్రం పశువులు, మేకల విక్రయాలు జరుగుతున్నాయి. కనీస సౌకర్యాలు లేవు.. కొల్చారం మండలం రంగపేట తైబజార్ వేలంను ఇటీవల నిర్వహించగా రూ. 2 లక్షల ఆదాయం వచ్చింది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తైబజార్ను రూ. 10 లక్షలకు వేలం పాటలో పాడారు. మండలంలోని గవ్వలపల్లిలో రూ. 3 లక్షలు, నిజాంపేట, హవేళిఘణాపూర్తో పాటు మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున సంతలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో రెతు బజార్ను రూ. 6 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించినా అర్ధంతరంగా ఆగిపోయింది. ఫలితంగా రోడ్లపైనే కూర్చొని కూరగాయలు విక్రయిస్తుండటంతో పెద్ద బజారుకు వెళ్లేవారు ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడుతున్నారు. రామాయంపేట సంతలోనూ సౌకర్యాలు లేవు. ఇక్కడ వెజ్, నాన్వెజ్ మార్కెట్ అర్ధంతరంగా ఆగిపోవటంతో రోడ్లపైనే సంత సాగుతోంది. ఇంచు మించు అన్ని మున్సిపాలిటీల్లో ఇదే తంతు జరుగుతోంది. కనీస సౌకర్యాలు లేక పోవటంతో ప్రజలు, విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు పట్టించుకొని వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న అదనపు కలెక్టర్
చిలప్చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులో వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి, సన్మానించారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రేషన్షాపుల్లో ప్రధాని ఫొటో పెట్టాలి మెదక్జోన్: రేషన్ షాపుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను పెట్టాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సన్నబియ్యం పంపిణీకి సంబంధించి సొమ్ము కేంద్రానిది అయితే, పెత్తనం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 27 వరకు బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సుభాష్గౌడ్, సంతోష్రెడ్డి, ఎంఎల్ఎన్ రెడ్డి, సిద్దిరాములు, విజయ్, శంకర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ మున్సిపాలిటీ: యువత, విద్యార్థులు బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్స్ యాప్లు, ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే భ్రమలో యువత వాటికి బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై నిఘా పెట్టాలని సూచించారు. భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్ నారాయణఖేడ్: హెచ్సీయూ భూముల అమ్మకాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. ఖేడ్లో మంగళవారం నిర్వహించిన పార్టీ డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందన్నారు. హెచ్సీయూ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ ఖేడ్ ప్రాంత కార్యదర్శి రమేశ్ మహిపాల్, నర్సింహులు, గణపతి, శివరాజ్ పాల్గొన్నారు.కేతకీలో కర్ణాటక ఎమ్మెల్సీల పూజలు ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక మాజీమంత్రి రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్, భీమ్రావు పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజ లు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్,నాయకులు చంద్రశేఖర్ పాటిల్, మల్ల య్య స్వామి, రుద్రయ్య స్వామి పాల్గొన్నారు. -
హెచ్సీయూ భూముల పరిరక్షణకు కృషి
రామచంద్రాపురం(పటాన్చెరు): గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి తెలిపారు. హెచ్సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళుతున్న ఎమ్మెల్సీని, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరిలను రామచంద్రాపురంలోని వారి నివాసంలో మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం హెచ్సీయూ భూములను అమ్మడం సరికాదన్నారు. ఆ భూములలో ఎంతో వన సంపదతోపాటు అనేక జీవరాశులు జీవిస్తున్నాయని వివరించారు. ఆ భూములను విక్రయించే బదులు మరింత పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీ పూర్వవిద్యార్థులైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు ముఖ్యమంత్రితో మాట్లాడి భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్సీయూ భూముల పరిక్షణకు ఉద్యమిస్తున్న విద్యార్థులకు అండగా నిలిచి పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి టోల్ మోత
తూప్రాన్: మండలంలోని అల్లాపూర్ శివారు 44వ నంబర్ జాతీయ రాహదారిపై ఏర్పాటు చేసిన టోల్గేట్ మీదుగా ప్రయాణం మరింత భారం కానుంది. 5 నుంచి 10 శాతం టోల్ రేట్లు పెంచినట్లు నేషనల్ హైవే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే వాహనదారులు టోల్గేట్ భారం అధికంగా ఉందని గగ్గోలు పెడుతుండగా, మరోమారు రేట్లు పెంచారు. అయితే ఏటా ఏప్రిల్ మొదటి వారంలో ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. పాత ధరలను చెల్లించలేకే కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా వెళ్తున్నారు. నిత్యం ఈ టోల్గేట్ మీదుగా 12 నుంచి 15 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజువారి టోల్ గేట్ రూ. 12 లక్షల నుంచి రూ. 15 వరకు ఆదాయం ఉంటుంది. పెరిగిన ధరలతో వాహనదారుల జేబుకు చిల్లు పడనుంది. కాగా టోల్ప్లాజా ఏర్పాటు చేస్తున్న సమయంలో చుట్టూ 20 కిలోమీటర్ల వరకు వాహనదారులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం రూ. 350 చెల్లించి నెలవారీ పాసులు పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కాని టోల్ప్లాజా సమీప గ్రామాల ప్రజలు నిత్యం తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సామగ్రి కోసం రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇందుకు టోల్ రుసం ఎలా చెల్లించాలని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నేషనల్ హైవే అధికారులు స్పందించి స్థానికులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.వాహనదారులపై మరింత భారం -
స్వయం ఉపాధికి ‘యువవికాసం’
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్జోన్: స్వయం ఉపాధి కల్పించేందుకు చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాన్ని పరిశీలించి ఆన్లైన్ పోర్టల్ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటివరకు హవేళిఘణాపూర్ మండలంలో 68 దరఖాస్తు స్వీకరించినట్లు చెప్పారు. ఈ పథకంలో 75 రకాల యూనిట్ల ఎంపికకు అవకాశం ఉందన్నారు. జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా డీఆర్డీఓ ఉంటారని తెలిపారు. అర్హులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసి ప్రింట్ను ఎంపీడీఓ, మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్కు అందజేయాలని సూచించారు. జిల్లాలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఇదే పథకానికి సంబంధించి సీఎస్ శాంతికుమారి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపడతామనివివరించారు. -
80.76% వసూలు
ఆస్తి పన్నుతూప్రాన్ ప్రథమం..రామాయంపేట చివరిస్థానం ● జిల్లావ్యాప్తంగా బకాయిలురూ. 13.44 కోట్లు ● వసూలు చేసింది రూ. 10.78 కోట్లుజిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో మెదక్ మున్సిపాలిటీ గ్రేడ్– 2 పరిధిలోకి రాగా ఇది 1953లో ఏర్పడింది. జనాభా 50 వేల పైచిలుకు ఉంది. మిగితా మూడు మున్సిపాలిటీలు 2018 ఆగస్టులో ఆవిర్భవించాయి. ఈ మూడు మున్సిపాలిటీలు గ్రేడ్– 3 పరిధిలోకి వస్తాయి. వీటిలో జనాభా 40 వేల లోపు ఉన్నారు. మెదక్ బల్దియాలో రూ. 5.54 కోట్ల వివిధ రకాల పన్నులు వసూలు కావాల్సి ఉండగా, రూ. 4.50 కోట్లు వసూలు కాగా ఇంకా రూ. కోటి బకాయి ఉంది. ఈ లెక్కన వసూ లు అయింది 80 శాతం మాత్రమే. అలాగే తూప్రాన్ మున్సిపాలిటీలో రూ. 2,62,12,000 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ. 2,23,71,000 కోట్లు చెల్లించారు. ఈ లెక్కన 86 శాతం పన్ను పన్ను వసూళ్లతో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. నర్సాపూర్ మున్సిపాలిటీలో రూ. 3,74,97,000 కోట్లకు రూ. 3,06,16,000 కోట్లు సిబ్బంది వసూలు చేశారు. ఈ లెక్కన 82.65 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. రామాయంపేట బల్దియాలో రూ. 1,57,00,000 కోట్లకు రూ. 99 లక్షలు మాత్రమే చెల్లించారు. ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లాలోనే రామాయంపేట ఆఖరు స్థానంలో నిలిచింది. చివరి రోజు రూ. 50 లక్షలు 2024 వార్షిక పన్ను వసూళ్ల కోసం సిబ్బంది అహర్నిశలు శ్రమించారు. మార్చి 31 వరకు పన్ను చెల్లిస్తే పన్నుపై విధించిన వడ్డీకి 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మార్చి 25వ తేదీ నుంచి 31 వరకు పన్ను బకాయి పడిన వారు పెద్ద మొత్తంలో చెల్లించడానికి ముందుకొచ్చారు. ప్రభు త్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకున్నారు. కాగా చివరి రోజు నాలుగు మున్సిపాలిటీల్లో రూ. 50 లక్షల వరకు పన్నులు వసూలు కావడం గమనార్హం.జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి ఈ ఏడాది మార్చి 31 వరకు 80.76 శాతం ఆస్తి పన్ను వసూలైంది. ప్రభుత్వం 90 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడంతో చివరి ఆరు రోజులు పన్ను చెల్లించడానికి ప్రజలు ముందుకొచ్చారు. 86 శాతం ఆస్తి పన్ను వసూళ్లతో తూప్రాన్ మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలవగా.. రెండవ స్థానంలో నర్సాపూర్, మూడో స్థానంలో మెదక్, చివరి స్థానంలో రామాయంపేట నిలిచాయి. – మెదక్జోన్ ప్రభుత్వ బకాయిలే ఎక్కవ.. జిల్లావ్యాప్తంగా రూ. 13.44 కోట్లకు గానూ రూ 10.78 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. మిగితా రూ. 2.65 కోట్లు వసూలు కాలేదు. బకాయిపడిన దాంట్లో 90 శాతం వివిధ ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిన స్పందించ లేదని పేర్కొన్నారు.జిల్లాలో ఆస్తి పన్ను వసూలు ఇలా.. మున్సిపాలిటీ బకాయిలు వసూలైంది చేయాల్సింది మెదక్ రూ. 5.50 కోట్లు రూ. 4.50 కోట్లు రూ. కోటి రామాయంపేట రూ. 1.57 కోట్లు రూ. 99 లక్షలు రూ. 58 లక్షలు నర్సాపూర్ రూ.3,74,97,000 రూ.3,06,16,000 రూ. 68.81 లక్షలు తూప్రాన్ రూ. 2,62,12,000 రూ. 2,23,71,000 రూ. 38.41 లక్షలు -
ధాన్యం సేకరణకు సన్నద్ధం
● ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోళ్లు ● జిల్లాలో 3.89 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ● పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం దళారులకు విక్రయించొద్దు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలి. దళారులకు విక్రయిస్తే తూకంలో మోసంతో పాటు ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఫలితంగా మోసపోయే పరిస్థితి ఏర్పడుతుంది. – జగదీష్కుమార్, సివిల్ సప్లై డీఎంమెదక్జోన్: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ రాహుల్రాజ్ సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఇబ్బందులకు తావు లేకుండా కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 2,46,136 ఎకరాల్లో వరి సాగు జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 2,46,136 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 2,02,550 ఎకరాల్లో దొడ్డు రకం, 43,586 ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. కాగా దొడ్డు రకం ధాన్యం దిగుబడి 4,75,624 మెట్రిక్ టన్నులు రానుందని అధికారులు అంచనా వేశారు. బయటి అవసరాలకు పోనూ కొనుగోలు కేంద్రాలకు 3,32,534 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే సన్నరకం ధాన్యం 91,760 మెట్రిక్ టన్నులు రాగా అందులో నుంచి 34,520 మెట్రిక్ టన్నులు ఇతర అవసరాలకు పోగా కొనుగోలు కేంద్రాలకు 57,240 మెట్రిక్ టన్నులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 480 కొనుగోలు కేంద్రాలు జిల్లావ్యాప్తంగా 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని, అందుకు గానూ 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 127 ఐకేపీ, 324 సహకార సంఘాలు (పీఏసీఎస్), డీసీఎంఎస్ 10, రైతు సంఘం (ఎఫ్పీఓ) పరిధిలో 19 కేంద్రాల చొప్పున మొత్తం 480 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో 390 దొడ్డు ధాన్యం సేకరణకు కేటాయిస్తుండగా, సన్నధాన్యం సేకరణకు 90 కొనుగోలు కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. కాగా గత 2023–24 యాసంగిలో 2.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ యాసంగిలో 1,37,414 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సన్నాలకు రూ. 500 బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 వానాకాలం సీజన్ నుంచి సన్నాలకు క్వింటాల్కు రూ. 500 అదనంగా బోనస్ అందజేస్తోంది. కాగా ఈ యాసంగిలో 43,586 ఎకరాల్లో రైతులు సన్న రకం ధాన్యం సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలకు 57,240 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా దొడ్డు రకం క్వింటాల్కు రూ. 2,320 కాగా, సన్నాలకు బోనస్తో కలుపుకుని క్వింటాల్ ధాన్యానికి రూ. 2,820 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానుంది. -
దుర్గమ్మ సేవలో కలెక్టర్
పాపన్నపేట(మెదక్): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అదివారం కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ వేర్వేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. పాడి పంటలతో వర్థిల్లాలి శివ్వంపేట(నర్సాపూర్): విశ్వావసు నామ సంవత్సరంలో రైతులు, ప్రజలు పాడిపంటలు, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. అ దివారం ఉగాదిని ఆమె సొంత గ్రామం గోమారంలో కు టుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేకంగా పచ్చడి తయారు చేసి పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల ఊరేగింపు నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడలో మల్లన్న కమాన్ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వెంకటేశ్వరశర్మకు ఉగాది విశిష్ట పురస్కారం శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రానికి చెందిన వేద పండితుడు, బగలాముఖీ ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది విశిష్ట పురస్కారం అందుకున్నారు. అదివారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ, కమిషనర్ శ్రీధర్ పురస్కారం అందజేశారు. మల్లన్న ఆలయంలో భక్తుల సందడికొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం ఉగాది పర్వదినం పురష్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేశారు. ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అలరించిన కుస్తీ పోటీలుకల్హేర్(నారాయణఖేడ్): ఉగాది ఉత్సవాల నేపథ్యంలో మండలంలోని మార్డిగ్రామంలో, సిర్గాపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా అలరించాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. చివరి కుస్తీ పోటీ విజేతకు వెండి కడియం అందజేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గుర్రపు మశ్చేందర్, బీఆర్ఎస్ నాయకులు సంజీవరావు, మాజీ ఎంపీటీసీ రాజుకుమార్ సిగ్రె, తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: నూతన తెలుగు సంవత్సరాది నుంచి అందరికీ శుభాలు కలగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. షడ్రుచుల పచ్చడి, బక్ష్యాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖంగా జీవించాలన్నారు. ప్ర జాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరిగేలా భగవంతుడి ఆశీర్వాదం అందాలని కోరారు. ప్లాస్టిక్ను నివారిద్దాం.. ప్లాస్టిక్ను నివారిద్దామని, స్టీల్ గ్లాస్లు మేలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని హోటల్ యాజమానులకు స్టీల్ గ్లాస్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. పట్టణంలో 50 హోటల్స్ ఉన్నాయని, ప్రతి హోటల్కు వంద గ్లాస్ల చొప్పున పంపిణీ చేశామన్నారు. ఉగాది వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ -
ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్జోన్: యాసంగి వరి కోతలు ప్రారంభం కాగానే ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలన్నారు. టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలన్నారు. రైతులు తేమశాతం 17 ఉండేలా చూసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కేంద్రాలకు ధాన్యం తరలించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు ఏ గ్రేడ్ రకం రూ. 2,320 కాగా సాధారణ రకానికి రూ. 2,300 నిర్ణయించినందని వెల్లడించారు. కాగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, సివిల్ సప్లై డీఎం జగదీష్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సివిల్ రైట్స్డే దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ విజిలెనన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించినవి, బాధితులకు అందిన పరిహారం వివరాలను వెల్లడించారు. -
నైపుణ్యం పెంపొందించుకోవాలి
ఓయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విద్యాసాగర్ నర్సాపూర్ రూరల్: ప్రతి విద్యార్థి నైపుణ్యం పెంపొందించుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని రెడ్డిపల్లిలో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, చెడు అలవాట్లతో సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. అనంతరం రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, రాష్ట్ర బ్లడ్ బ్యాంకు నిర్వహణ కమిటీ అడ్వైజర్ సింగం శ్రీనివాస్రావు, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ప్రోగ్రాం అధికారి సురేష్ కుమార్, అధ్యాపకులు రమేష్, శ్రీనివాస్, హేమంత్ పాల్గొన్నారు. -
బెల్ట్షాపులను తొలగించండి
దుబ్బాక: పల్లెల్లో పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విన్నవించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ గ్రామానికి వెళ్లినా బెల్ట్ షాప్లను తొలగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. పల్లెల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో యువత పెడదారి పడుతోందన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే ఆర్థికంగా బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ప్రభుత్వం ముందుగా బెల్ట్షాపులను తొలగించి అండగా నిలవాలన్నారు.అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
పౌల్ట్రీ.. పల్టీ!
జిల్లాలో మూడు వేల పైచిలుకు కోళ్ల ఫారాలు మూత ఈ చిత్రంలోని పౌల్ట్రీ రైతు పేరు ఆరె యాదగిరి. ఇతనిది చిన్నశంకరంపేట మండలం జంగరాయి. ఏడాది క్రితం తన వ్యవసాయ పొలంలో 7.5 వేల కెపాసిటీ గల కోళ్ల ఫారం నిర్మించాడు. ఇందుకు రూ. 15 లక్షలు ఖర్చు కాగా, రూ. 10 లక్షలు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. మిగితా రూ. 5 లక్షలు సొంత నిధులు వెచ్చించాడు. బ్యాంకులో తీసుకున్న అప్పును రెండు నెలలకు రూ. 73 వేల చొప్పున వాయిదాల రూపంలో చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటికే ఐదు బ్యాచ్ల కోళ్లు పెంచి వచ్చిన కమీషన్ డబ్బులు బ్యాంకులో కట్టాడు. కాగా నెల రోజుల క్రితం 7,500 కోడి పిల్లలను పెంచగా, వాటిలో కేవలం 300 కోళ్లు మాత్రమే తీసుకెళ్లిన సదరు కంపెనీ నిర్వాహకులు, మిగితా వాటికి వ్యాధి సోకిందని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక వాటిని గుంతలో పూడ్చి పెట్డాడు. ఈ క్రమంలో బ్యాంకు వాయిదా కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఎలా చెల్లించాలని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇది ఒక్క యాదగిరి పరిస్థితే కాదు. జిల్లాలోని వేలాది మంది పౌల్ట్రీ రైతులది. చిన్నశంకరంపేట: జంగరాయిలో మూత పడిన కోళ్ల ఫారంమెదక్జోన్: జిల్లాలో చెప్పుకోదగిన సాగునీటి వనరులు లేకపోవటంతో వ్యవసాయం సరిగా సాగక మూడు వేల పైచిలుకు రైతులు కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరిలో 90 శాతానికి పైగా రైతులు బ్యాంకుల్లో అప్పు తీసుకున్నారు. కాగా ఒక్క బ్యాచ్ కోళ్లను పెంచేందుకు 45 నుంచి 50 రోజుల సమయం పడుతుంది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈక్రమంలో ఎప్పుడూ లేని విధంగా వింత వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో 95 శాతం ప్రజలు చికెన్ తినటం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలను ఇవ్వటం పూర్తిగా మానేశారు. ఫలితంగా వేలాది కోళ్ల ఫాంలకు తాళాలు పడ్డాయి. వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి బ్యాంకులో తీసుకున్న రుణానికి సకాలంలో వాయిదాలు చెల్లించాలని, లేనిచో వడ్డీ, చక్ర వడ్డీ పడుతుందని బ్యాంకు అధికారులు పౌల్ట్రీ రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలు కోడి పిల్లలు ఇవ్వక పౌల్ట్రీలకు తాళాలు వేశామని, బ్యాంకు వాయిదాలు ఎలా చెల్లించేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ గండం నుంచి ప్రభుత్వం గట్టెక్కించాలని, బ్యాంకులో తీసుకున్న రుణానికి వడ్డీ పడకుండా రెన్యూవల్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. వింత వ్యాధితో మృత్యువాత పడిన కోళ్లు వానాకాలం వరకు పెంపకంవద్దంటున్న అధికారులు వాయిదాలు కట్టాలనిబ్యాంకు అధికారుల నోటీసులుఇది అనువైన సమయం కాదు జిల్లాలో చనిపోయిన కోళ్ల రక్త నమూనాలను ఇప్పటికే రెండు సార్లు ల్యాబ్కు పంపించాం. బర్డ్ ఫ్లూ లేదని తేలింది. కానీ పెద్ద మొత్తంలో కోళ్లు ఎలా చనిపోయాయనేది నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఇది కోళ్ల పెంపకానికి అనువైన సమయం కాదు. వానాకాలం వచ్చే వరకు రైతులు కోళ్ల పెంపకం నిలిపివేస్తేనే మంచిది. – వెంకటయ్య, జిల్లా వెటర్నరీ అధికారి -
క్రమబద్ధీకరణ కష్టాలు
● ఒక్కప్లాటు కోర్టు కేసులో ఉన్నా.. సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లు నిషేధిత జాబితాలోకి ● ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ తీరు.. అంతంతమాత్రంగానే స్పందనసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25 శాతం డిస్కౌంట్ ఇస్తామని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రచారం చేస్తోంది. కానీ ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఇ బ్బందులు పడుతున్నారు. తమ సమస్య లెవల్–1 స్థాయి అధికారుల వద్ద పరిష్కారమవుతుందా.. లెవల్–2 అధికారుల పరిధిలోకి వస్తుందా..? లెవల్–3 అధికారుల వద్దకు వెళ్లాలా తెలియక తికమకపడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిషేధిత జాబితా కష్టాలు.. ఒక లేఅవుట్లోని సర్వేనంబర్లో సుమారు 200 ప్లాట్లు ఉంటే.. అందులో ఒకటీ.. రెండు ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉంటే.. ఆ సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లను నిషేధిత (ప్రొహిబీటెడ్) జాబితాలో చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలామంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ నుంచి ఎన్ఓసీ తీసుకుని ఎల్–1 స్థాయి అధికారులను క లిస్తే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. కనిపించని ఓపెన్ స్పేస్లు.. అనధికారిక వెంచర్లు వేసిన అక్రమార్కులు చాలా చోట్ల ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన 10 శాతం స్థలాలను (టెన్ పర్సెంట్ ల్యాండ్)లను కూడా ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నారు. ఆయా కాలనీల్లో బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కు వంటి వాటి నిర్మాణం కోసం ఈ స్థలాలను కేటాయించాలి. నిబంధనల ప్రకారం ఈ 10 శాతం భూమిని సంబంధిత మున్సిపాలిటీ గానీ, గ్రామపంచాయతీ తన అధీనంలోకి తీసుకోవాలి. కానీ సంబంధిత అధికారులు వెంచర్ నిర్వాహకులతో చేతులు కలపడంతో ఈ ప్రజావసరాల ల్యాండ్ కూడా పరాధీనమైపోయింది. కానీ, ఈ అనధికారిక లేఅవుట్లో ప్లాటు కొన్నందుకు లేని ఓపెన్ స్పేస్కు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దరఖాస్తుదారులకు ఏర్పడింది. డాక్యుమెంట్స్ షార్ట్ఫాల్ పేరుతో.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో చాలామందికి డాక్యుమెంట్ షార్ట్ఫాల్ అని వెబ్సైట్లో చూపుతోంది. అయితే ఏ డాక్యుమెంట్ అవసరమో సాధారణ దరఖాస్తుదారులకు తెలియడం లేదు. సేల్డీడ్, ఈసీ, లింక్డాక్యుమెంట్లు, లేఅవుట్కాపీ డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. వీటిని నీర్ణీత సైజులో స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అయితే అంతగా అవగాహన లేని వారికి ఈ సాకేంతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. హెల్ప్డెస్క్ల్లో సమాచారం అంతంతే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ల్లో పనిచేస్తున్న సిబ్బందికి చాలామందికి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో ఉన్న సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ.. చాలామందిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల నుంచి, మండలాల నుంచి దరఖాస్తుదారులు కలెక్టరేట్లకు తరలివస్తున్నారు. -
రైతులకు పరిహారం చెల్లించండి
నర్సాపూర్: రూ. 7 కోట్ల నిధులు విడుదల చేసి రైతులకు పరిహారం అందజేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలోని కొల్చారం మండలం ఘనపూర్ ఆనకట్ట సామర్థ్యాన్ని 0.3 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారని, అందుకు అనుగుణంగా పనులు సైతం ప్రారంభించారని చెప్పారు. ఇందుకోసం రైతుల నుంచి సుమారు ఎనిమిది వందల ఎకరాల భూములు సేకరించారని వివరించారు. భూములు సేకరించిన ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. దీంతో పంటలు సాగు చేయలేక, పరిహారం అందక ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా రైతులను పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు.అసెంబ్లీలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజా వ్యతిరేకమైన ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాల్సిందేనని, రేవంత్రెడ్డి సర్కార్ ప్రజా ప్రభుత్వం అంటూనే ప్రజల గోడు పట్టించుకోరా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రశ్నించారు. ప్యారానగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాటానికి మద్దతుగా గురువారం సీపీఎం సామూహిక నిరహార దీక్షలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజా ఉద్యమాలను నిర్బంధాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని హెచ్చరించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఏకపక్షంగా డంపింగ్యార్డ్ పెట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని కోరుతూ ప్రజలు పోరాడుతున్నందున వాస్తవ పరిస్థితులను గమనించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్పై ఉందన్నారు. ప్యారానగర్–నల్లవల్లిలో డంపింగ్యార్డ్ పెడితే ఆ ప్రాంతమంతా కాలుష్య కోరల్లో చిక్కి ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఇప్పటికే పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల జిన్నారం, బొంతపల్లి,పటాన్చెరు ప్రాంతమంతా పరిసరాలు, పర్యావరణం దెబ్బతినడం వల్ల అక్కడ ప్రజలు జీవించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
రామాయంపేట(మెదక్)/నిజాంపేట: ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగాలని గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం సూచించారు. మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న దామరచెరువులో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. గృహాల నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామానికి 97 గృహాలు మంజూరు కాగా 20 గృహాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం నిజాంపేట మండల పరిధిలోని పైలెట్ ప్రాజెక్టు గ్రామం నందగోకుల్లోనూ పర్యటించారు. ఎంఈఓపై చర్యలు తీసుకోవాలి మెదక్జోన్: అనుమతి లేకుండా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేసిన చిన్నశంకరంపేట ఎంఈఓ పుష్పవేణిపై చర్యలు తీసుకోవాలని తపస్, ఎస్టీయూ యూనియన్ల జిల్లా అధ్యక్షులు ఎల్లం, రాజ్గోపాల్గౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం డీఈఓ రాధాకిషన్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంఈఓ చిన్నశంకరంపేట మండల పరిధిలోని మోడల్ స్కూల్తో పాటు మీర్జాపల్లి పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లి చీఫ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ల విధులకు ఆటకం కలిగించారని తెలిపారు. అలాగే విద్యార్థుల విలువైన పరీక్ష సమయాన్ని వృథా చేశారని వివరించారు. ఎంఈఓపై శాఖాపరమైనా చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాములు మెదక్జోన్: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది మర్కంటి రాములు ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 90 మంది న్యాయవాదులు పాల్గొనగా, అందులో 87 ఓట్లు పోలయ్యాయి. మర్కంటి రాములుకు 49 ఓట్లు రాగా, షేక్ ఫజల్ అహ్మద్కు 37 ఓట్లు వచ్చాయి. నోటాకు ఒక ఓటు పడింది. రాములు 12 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా ప్రభాకర్ వ్యవహరించారు. ఈసందర్భంగా రాములును న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ శ్రీరామ్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని తనిఖీ చేసినట్లు తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ, డాక్టర్ రవి కుమార్ తదితర సిబ్బంది ఉన్నారు. దరఖాస్తుల గడువు పెంపు ప్రశాంత్నగర్(సిద్దిపేట): స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగించారు. 2024– 25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యకర్తలకు అండగా ఉండాలి నర్సాపూర్: కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ అధిష్టానం సూచించిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో పాటు పలువురు నాయకులు దిశానిర్దేశం చేశారు. -
ిసీటీస్కాన్ సేవలు ఎప్పుడో..?
మెదక్ జోన్: జిల్లా ఆస్పత్రికి ిసీటీస్కాన్ యంత్రం తీసుకొచ్చి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. అయినా ప్రారంభించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇన్స్టాలేషన్ అవుతుందంటూ సమాధానం చెబుతున్నారు. నూతనంగా సీటీస్కాన్ను ఏర్పాటు చేస్తే కేవలం వారం రోజుల్లో ప్రక్రియ అంతా పూర్తవుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఎంతో మంది పేద రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుబాటులో లేని పరికరాలు జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు అయిందని ప్రజలు ఎంతో సంబురపడ్డారు. ఇక నుంచి అత్యవసర వైద్యం అందుబాటులోకి వస్తుందని భావించారు. అన్నిరకాల స్పెషలిస్టులతో పాటు ఎంఆర్ఐ, టూడీఎకో లాంటి పరికరాలు (ల్యాంబ్) అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అవేం అందుబాటులోకి రాలేదు. దీంతో నరాలకు సంబంధించిన సమస్య వస్తే రూ. 8 వేలు చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ చేయించుకోవాల్సి వస్తోంది. అలాగే గుండె సంబంధిత పరీక్ష (టూడీఏకో) రూ. 5 వేలు చెల్లించి పరీక్ష చేయించుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగితే పరీక్ష నిర్ధారణ చేసే యంత్రం (సీ–ఆర్మ్) జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అది చెడిపోయి చాలా కాలం అయింది. దానికి మరమ్మతులు చేయించే నాథుడే కరువయ్యారు. ఫలితంగా దీని పరీక్ష అవసరం వచ్చిందంటే ప్రైవేట్లో చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందని ద్రాక్షగా సర్కారు వైద్యం జిల్లాలో 19 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు, 3 సీహెచ్సీ ఆస్పత్రులు, 1 ఏరియా ఆస్పత్రి, 1 మాతాశిశు ఆస్పత్రితో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రి ఉంది. వీటి పరిధిలో పెద్ద ఆరోగ్య సమస్య ఉత్పన్నమైతే జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. రోగ నిర్ధారణ తరువాతే వైద్యులు చికిత్స ప్రారంభించాల్సి ఉండగా.. అందుకు అవసరమయ్యే అనేక పరికరాలు అందుబాటులో లేవు. వెరసి పేద రోగులకు ప్రభుత్వం వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ చిత్రంలోని వ్యక్తి పేరుయాదగిరి. ఇతనిది చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామం. ఇటీవల తలకు దెబ్బతగలటంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు తలకు బలమైన గాయం అయినందున సీటీస్కాన్ చేయించాలని సూచించారు. ఆస్పత్రిలో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్లో రూ. 2,300 చెల్లించి రిపోర్టు తీసుకొచ్చారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫార్మసిస్ట్ గది, ల్యాబ్, ఓపీ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఇదే సమయంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ అందుబాటులో లేకపోవడంపై ఆరా తీశారు. సబ్సెంటర్ పరిశీలనకు వెళ్లినట్లు సిబ్బంది చెప్పడంతో మూమెంట్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో గ్రామీణ మహిళలను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈసందర్భంగా డాక్టర్ రవికుమార్కు పలు సూచనలు చేశారు. నిరుద్యోగులకు మంచి అవకాశం రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని మీ సేవ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అర్హులైన యువత తెలంగాణ ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసే ప్రక్రియను పరిశీలించారు. మీసేవ నిర్వాహకుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజని, మీ సేవ నిర్వాహకులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
ఆయిల్పామ్తో అధిక లాభాలు
ఆయిల్పామ్ మొక్క నాటుతున్న అధికారులుచిన్నశంకరంపేట(మెదక్): వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్పామ్ పంటను సాగుచేసి అధిక లాభాలు పొందాలని జిల్లా హార్టికల్చర్ జిల్లా అధికారి ప్రతాప్సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని ధరిపల్లిలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్సిడీతో పంటను సాగుచేయవచ్చని, అంతర పంట సాగుకు సైతం ప్రభుత్వ సాయం పొందవచ్చన్నారు. ఇప్పటికైనా ఆయిల్పామ్ పంటను సాగుచేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. హార్టికల్చర్ అధికారులు సంతోష్, రచన, సుజాత, ఆయిపామ్ మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు.జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్ -
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొడ్డు బియ్యం నిల్వలపై డీలర్లు ఆందోళనచెందుతున్నారు. వివరాలు 8లో u
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన తూప్రాన్ మున్సిపాలిటీ సమస్యలతో సతమతమవుతోంది. మౌలిక వసతులు కొరవడి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు కరువయ్యాయి. కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. రోడ్లపై మురుగు నీరు పారి దుర్వాసన వెదజల్లుతోంది. తాగునీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారింది. – తూప్రాన్ తూప్రాన్ మున్సిపాలిటీలోమౌలిక వసతులు కరువు ● ‘సాక్షి’ పరిశీలనలోవెలుగుచూసిన వాస్తవాలుగురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025దశలవారీగా పరిష్కరిస్తాం తూప్రాన్ మున్సిపాలిటీలో సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. పెండింగ్లో ఉన్న పనులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరం ఉన్న కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. – గణేష్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అరకొరగా తాగునీటి సరఫరా కాలనీల్లో మిషన్ భగీరథ ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కానీ అవి అందరికి సరిపోవడం లేదు. ఇప్పటికై నా నల్లాల ద్వారా తాగు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. – ఉపేందర్, తూప్రాన్ వృథాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పట్టణ ప్రజలకు దూరంగా నర్సాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ స్థలంలో రూ. 11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించిన రెండు, మూడు నెలల పాటు క్రయవిక్రయాలు సజావుగా సాగాయి. అయితే మార్కెట్ దూరంగా ఉండడంతో సరుకులు, కూరగాయలు, చేపలు, మాంసం కొనేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రజలు, వ్యాపారుల నుంచి వ్యతిరేకత వచ్చి తిరిగి పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే వ్యాపారులు దుకాణాలను కొనసాగిస్తున్నారు. రహదారిపైనే చిరు వ్యాపారం పట్టణ సమీపంలోని టోల్ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారి పక్కన చిరువ్యాపారుల సౌకర్యార్థం గత ప్రభుత్వం వే సైడ్ మార్కెట్ను రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించింది. అక్కడ వ్యాపారం సరిగా సాగక తిరిగి వ్యాపారులు రహదారి పక్కనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఫలితంగా రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన మార్కెట్ నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వ్యవసాయ మార్కెట్ అలంకారప్రాయంరైతుల సౌకార్యార్థం వ్యవసాయ మార్కెట్ను టోల్ ప్లాజా పక్కన సుమారు 22 ఎకరాల్లో రూ. 6 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా గోడౌన్లు నిర్మించారు. కాని ఏర్పాటు చేసి నాలుగేళ్ల గడుస్తున్నా నేటికీ నూతన మార్కెట్ కమిటీని నియమించలేదు. రహదారి పక్కన అలంకారప్రాయంగా దర్శనమిస్తుంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అసంపూర్తిగా సమీకృత భవనంమండలంలోని ప్రభుత్వ కార్యాయాలను ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు గత ప్రభుత్వం రూ. 8 కోట్లతో సమీకృత భవన నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం ఎంఈఓ, ఐకేపీ, ఈజీఎస్, భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 80 శాతం మేర పనులు పూర్తి కాగా, మిగితా 20 శాతం పనులు నిధుల కొరతో నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇరుకు గదుల్లో ఐకేపీ, ఎంఈఓ, తహసీల్దార్, వ్యవసాయ, ఆర్డీఓ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జాడలేని సేంద్రియ ఎరువునాలుగు విలీన పంచాయతీలతో కలిపి నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో సిబ్బంది నిత్యం 10 మెట్రిక్ టన్నులకు పైగా చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను పట్టణ సమీపంలోని టాటా పరిశ్రమ వెనకాల గుట్టల్లో డంప్ చేస్తున్నారు. చెత్తతో (కంపోస్టు) సేంద్రియ ఎరువు తయారు చేస్తామని లక్షలు ఖర్చు చేశారు. కానీ ఇప్పటివరకు సేంద్రియ ఎరువు తయారీ ఊసే లేదు. సేకరించిన చెత్తను కాల్చివేసి బుగ్గిపాలు చేస్తున్నారు. ఫలితంగా చెత్త నుంచి వచ్చిన పొగతో సమీప గ్రామాలు, రావెల్లి, వెంకటాపూర్ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. న్యూస్రీల్నిలిచిన సుందరీకరణ పనులుపట్టణ సమీపంలోని పెద్ద చెరువు కట్టను మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ. 9 కోట్లతో మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు విస్తరణ పనులు చేపట్టారు. అదనంగా మరో రూ. 75 లక్షలతో సుందరీకరణ కోసం చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, పార్కు, చెరువులో బోటు సదుపాయం, తదితర మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చెరువు కట్ట విస్తరణ పనులు చేపట్టారు కానీ సుందరీకరణ చేయలేదు. చెరువులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతంలో రెండు నెలల పాటు రెండు బోట్లు ఏర్పాటు చేశారు. అనంతరం వాటి వినియోగం భారంగా మారడంతో ఆపేశారు. తూప్రాన్ మున్సిపల్ స్వరూపం జనాభా 21,148 వార్డులు 16 రెవెన్యూ వార్డులు 18 ఇళ్లు 6,605 అవసరమైన తాగునీరు 3.60 ఎంఎల్డీ చెత్త సేకరణ వాహనాలు 10 ఆటోలు, 3 ట్రాక్టర్లు పబ్లిక్ టాయిలెట్లు 05 స్వయం సహాయక సంఘాలు 395 వీధి వ్యాపారులు 946 మందికొందరికే డబుల్ బెడ్రూంలు మున్సిపల్ కేంద్రంలో 2018లో రూ.25 కోట్ల నిధులతో 504 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో కేవలం 422 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. మిగితావి సగం పనులు జరగగా, మరికొన్ని ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లబ్ధిదారులను లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ఇళ్లు అప్పగించారు. అసంపూర్తిగా వదిలేసిన వాటిని సైతం కొందరికీ కేటాయించారు. దీంతో చేసేదేలేక అప్ప చేసి నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. మరికొందరు అలాగే వదిలేశారు. -
మెరుగైన వైద్యం అందించాలి
కొల్చారం(నర్సాపూర్): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించడంతో పాటు అవసరమైన మందుల లభ్యతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కేంద్రం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు. 28న తైబజార్ వేలం రామాయంపేట(మెదక్): Ð]l¬°Þ-´ëÍsîæ ç³Ç-«¨ÌZ° O™ðlº-gêÆŠḥæ ÐólÌS… D¯ðlÌS 28Ð]l ™ól©¯]l Ð]l$«§éÅçßæ²… 12 VýS…r-ÌSMýS$ °Æý‡Ó-íßæ…-^èl-¯]l$-¯]l²r$Ï Ð]l¬°Þ-ç³ÌŒæ MýSÑ$-çÙ¯]lÆŠ‡ §ólÐól…-§ýlÆŠ‡ º$«§ýl-ÐéÆý‡… JMýS {ç³MýSr-¯]lÌZ õ³ÆöP-¯é²Æý‡$. D AÐ]l-M>-Ô>°² çܨ-Ó-°-Äñæ*VýS… ^ólçÜ$-MøÐéÌS° çÜ* _…-^éÆý‡$. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు నర్సాపూర్: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు ఏడీఏ సంధ్యరాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన డివిజన్ పరిధిలోని నర్సాపూర్, శివ్వంపేట, మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె చెప్పారు. ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని, మరిన్ని వివరాలకు మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. పకడ్బందీగా పది పరీక్షలు నర్సాపూర్/కౌడిపల్లి: పదో తరగతి పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేష్ బుధవారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో పరీక్షల నిర్వహణ, సౌకర్యాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ఫైజల్, సీఎస్ శ్రీధర్రెడ్డిఉన్నారు. మీనాక్షి నటరాజన్ను కలిసిన కాంగ్రెస్ నేతలు నర్సాపూర్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను బుధవారం ఢిల్లీలో పలువురు నేతలు కలిశారు. గురువారం డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లిన మెదక్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నిర్మలా జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారని వారు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు కౌడిపల్లి(నర్సాపూర్): అంగన్వాడీ టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీడబ్ల్యూఓ హైమావతి హెచ్చరించారు. బుధవారం కౌడిపల్లిలోని 2, 3, 5వ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా పిల్లలు, బాలింతలు, గర్భి ణుల వివరాలను పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. టీచర్లు సమయపాలన పాటించాలని, మెనూ ప్రకారం వంట చేయించాలని సూచించారు. ఆట పాటల ద్వారా పిల్లలకు విద్యా బోధన చేయాలన్నారు. అలాగే మండలంలోని తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీఓ హేమభార్గవి తనిఖీ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
నీళ్లు లేక నెర్రెలు బారి
నర్సాపూర్రూరల్: పంటలు ఎండుతుండటంతో రైతులు బోరున విలపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తే చేతికందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అవంచ గ్రామానికి చెందిన చిగురు కృష్ణయ్య తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోరు బావితో వరికి నీరందించలేని పరిస్థితి నెలకొంది. రెండు లక్షలు ఖర్చు పెట్టి బోరు వేయించినా చుక్క నీరు పడలేదు. దీంతో పెట్టుబడితో పాటు బోరు అప్పులు మిగిలాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు సన్నకారు రైతులను ఆదుకోవాలని కోరాడు. ఎండుతున్న వరి పంటలు బోరున విలపిస్తున్న రైతులు -
సబ్సిడీ పై సాగు పరికరాలు
● నూతన పద్ధతులలో ప్రోత్సహించేందుకు.. ● ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం రాయితీ ● 27వరకు దరఖాస్తుకు అవకాశం ● మండల కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక టేక్మాల్(మెదక్): ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోంది. నూతన పద్ధతులతో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024–25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సబ్సిడీకి అర్హులు.. ● పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు ● ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% రాయితీ, జనరల్ రైతులకు 40% రాయితీ ● లక్ష కన్నా ఎక్కువ లబ్ధి పొందే రైతు ఖచ్చితంగా ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి యంత్ర పరికరాలు ఇవే.. రైతులకు అందజేయనున్న పరికరాల్లో బ్యాటరీ స్ప్రేయర్లు జనరల్ 2, ఎస్సీలకు1, పవర్ స్ప్రేయర్ జనరల్కు 3, ఎస్సీలకు 1, రోటవేటర్ జనరల్ 1, సీడ్ కమ్ ఫర్టీలైజర్ డ్రిల్ జనరల్ 1, డిస్క్ హ్యారో జనరల్ 2, ఎస్టీలకు 1, ట్రాక్టర్ ఎస్సీలకు 1 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎంపిక విధానం ఇలా.. రైతులు దరఖాస్తు చేసుకున్న అనంతరం మండల స్థాయిలో నియమించిన కమిటీ సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీకి కన్వీనర్గా మండల వ్యవసాయాధికారి, మెంబర్లుగా తహసీల్దార్, ఎంపీడీఓలు వ్యవహరిస్తారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ట్రాక్టర్కు సంబంధించిన పరికరాలకు ఆర్సీ జిరాక్స్, పాస్ ఫొటో, బ్యాంక్ పాసు పుస్తకం కావాలి. భూమి సారానికి సంబంధించిన సాయిల్ హెల్త్ కార్డు తప్పనిసరి జతచేయాలి. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం అందించే రాయితీ పథకాలను గ్రామాల్లోని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకా రం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. రైతులు మరింత సమాచారం కోసం వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలి. – రాంప్రసాద్, ఏఓ, టేక్మాల్ -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సిబ్బంది పూర్తి స్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మంగళవారం శివ్వంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటిస్తూ, ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. అనంతరం గూడూరులోని కస్తూర్బా గాంధీ హాస్టల్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వంటగది నిర్వహణ పరిశుభ్రంగా లేకపోవడంతో సిబ్బంది పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో విద్యా సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. పది అనంతరం ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. 18 ఏండ్లు నిండకుండా మైనర్లకు పెండ్లి చేస్తే వారి తల్లిదండ్రులతో పాటు భాగస్వాములైన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కస్తూర్బా గాంధీ హాస్టల్ తనిఖీ -
ఘనపురం ప్రాజెక్టుకు గ్రహణం
ఘనపురం ప్రాజెక్టు పాపన్నపేట(మెదక్): మెతుకు సీమ రైతన్నలకు బతుకునిచ్చే ఘనపురం ప్రాజెక్టుకు గ్రహణం వీడటం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎత్తు పెంపు, లైనింగ్ పనులు పూర్తి కావడం లేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించి, ఆనకట్ట ఎత్తు పెంపు కోసం మంజూరు చేసిన రూ.43.64 కోట్ల నిధులకు గాను రూ.23.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో భూసేకరణ ఆగిపోయింది. ఎనిమిదేళ్లు గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీంఎసీలకు చేరి మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఫతే నహర్, మహబూబ్ నహర్ కెనాళ్ల లైనింగ్ కోసం 2022లో రూ.50.32 కోట్లు మంజూరయ్యాయి. కాని ఇంత వరకు 50 శాతం పనులే పూర్తయ్యాయి. 1905లో ప్రాజెక్టు నిర్మాణం కరువు నేలలో సిరులు పండించాలన్న ఆశయంతో 1905లో నిజాం ప్రభువు నిర్మించిన ఘనపురం ప్రాజెక్టు 120 ఏళ్లు దాటినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. మంజీరా నదిపై 0.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 21,165 ఎకరాల సాగు లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. ఆనకట్ట పొడవు 725 మీటర్లు కాగా ఇరు వైపులా ఫతేనహర్, మహబూబ్ నహర్ కాలువలు ఉన్నాయి. మట్టి పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 0.135కు పడిపోయింది. దీంతో సింగూరు నుంచి నీరు విడుదల చేసినప్పుడల్లా .. నీరు వృథా అవుతోంది. ఎత్తు పెంపునకు, లైనింగ్కు నిధులు మంజూరు 2014లో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనకట్ట ఎత్తు పెంపు కోసం రూ.43.64 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 462.775 మీటర్ల ఎత్తు ఉన్న ఆనకట్టను 1.725 మీటర్లు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎత్తు పెంపు వల్ల కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్, పాపన్నపేట మండలంలోని నాగ్సాన్పల్లి, కొడుపాక, చిత్రియాల్ గ్రామాలకు చెందిన 191.14 ఎకరాల భూమి నీట మునుగుతోంది. వీరికి రూ.13.10 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ.5 కోట్లు రైతులకు చెల్లించారు. మరో రూ.8.10 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎత్తు పెంపులో భాగంగా ఆనకట్ట పొడవునా యాప్రాన్ పనులు చేశారు. ఈ మేరకు రూ.18.50 కోట్లు చెల్లించారు. 2017 చివరలో పనులు నిలిచిపోయాయి. అధికారులు ప్రతి ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా, ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. అలాగే మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాల్ల లైనింగ్ కోసం 2022లో రూ.50.32 కోట్లు మంజూరయ్యాయి. సుమారు 25 కి.మీ లైనింగ్ కావాలి. మూడేళ్లలో 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఏటా పంటలకు నీరు వదులుతుండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ఎత్తు పెంపు, లైనింగ్ కోసం ప్రతిపాదనలు ఎనిమిదేళ్లయినా విడుదల కాని నిధులు ఆగిన భూసేకరణ..ముందుకెళ్లని పనులు రూ.43.64 కోట్లకు గాను సగం నిధులే విడుదల ఎత్తు పెరిగితే 10 వేల ఎకరాలకు ప్రయోజనం నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు కోసం నిధులు అవసరం. భూసేకరణలో భాగంగా రైతులకు పరిహారం చెల్లించేందుకు సుమారు రూ.8 కోట్లు కావాలి. అలాగే ఎఫ్ఎన్, ఎంఎన్ కెనాళ్ల లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఏటా రెండు పంటల కోసం కాలువల ద్వారా నీరు విడుదల చేయాల్సి వస్తున్నందున పనులు ఆగిపోతున్నాయి. పూర్తి కావడంలో జాప్యం జరుగుతోంది. –శివనాగరాజు, డీఈఈ, ఇరిగేషన్ -
ఈ పాస్ మిషన్ల ద్వారా ఎరువులు
కౌడిపల్లి(నర్సాపూర్): డీలర్లు ఈ పాస్ మిషన్ల ద్వారా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్కుమార్ అన్నారు. మంగళవారం కౌడిపల్లిలోని భాగ్యలక్ష్మి ట్రేడర్స్, మహమ్మద్నగర్లోని పీఏసీఎస్ ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి స్టాక్, రిజిస్టర్, ధరల పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఎరువులు అమ్మాలని సూచించారు. మోతాదుకు మించి ఎరువులు చల్లవద్దని డీలర్లు రైతులకు చెప్పాలన్నారు. సీజన్కు అనుగుణంగా ఎరువులు అందుబా టులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, డీలర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారి విన య్కుమార్పశుగ్రాసం, పండ్లతోటలపై రైతులకు అవగాహన నర్సాపూర్: రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు పలు అంశాలపై మంగళవారం అవగాహన కల్పించారు. స్థానిక రైతు వేదికలో జిల్లా వ్యవసాయాధికారి విన్సెంట్ వినయ్కుమార్ పలువురు రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ను వీక్షించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త బాలాజీనాయక్ వేసవిలో పశుగ్రాస యాజమాన్యం అంశంపై, అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ స్వామి పండ్ల తోటల అంశంపై, ఇప్కో రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్ మాట్లాడుతూ నానో ఎరువుల ప్రయోజనాలు, దిగుబడి పెంపు, నేల ఆరోగ్యం ప్రభావం అనే అంశాలపై వీడియో ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారులు దీపిక, రాజశేఖర్, ఏఈఓలు చంద్రవేణి, రవివర్మ, నిరోష, తేజస్విని, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగానికి పెద్దపీట
నర్సాపూర్: వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వడంలో పెద్ద పీట వేస్తున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) సీఈఓ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం డీసీసీబీ శాఖలో రికవరీ, బ్యాంకు కార్యకలాపాలు పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 50 డీసీసీబీ శాఖల ద్వారా ఏడు వందల కోట్ల డిపాజిట్లు సేకరించామని, 18వందల కోట్ల రుణాలు అందజేశామని తెలిపారు. కాగా రుణాల రికవరీ 84శాతం వసూలు చేశారని చెప్పారు. రైతులకు వ్యవసాయానికే కాకుండా తదితర రుణాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో స్థానిక బ్రాంచ్ మేనేజర్ అభినవ్, ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణాకర్ రావు, ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్ పాల్గొన్నారు. పాఠశాలకు సహాయం థాయిలాండ్ ప్రతినిధుల హామీ చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జంగరాయి ప్రాథమికోన్నత పాఠశాలను థాయిలాండ్కు చెందిన సింజెంటా సీడ్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తమ సంస్థ ద్వారా పాఠశాలకు అవసరమైన సహాయం అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను పరిశీలించారు. పాఠశాలకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరగా, అంగీకరించినట్లు హెచ్ఎం నాగసుజాత తెలిపారు. పశుపోషణపై అవగాహన పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య నర్సాపూర్రూరల్: పశు పోషణపై ప్రతి రైతుకు అవగాహన అవసరమని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నత్నాయిపల్లిలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేతలో మినరల్ మిక్చర్, ఖనిజ మిశ్రమం, కాల్షియం వంటివి ఉండేలా చూసుకోవాలన్నారు. పశువులకు కావాల్సిన మందులు, పశుగ్రాసం విత్తనాలు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఉచితంగా అందజేసింది. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ జనార్దన్, పశువైద్యాధికారులు సౌమిత్, ప్రియాంక, స్వప్న, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సభ్యులు గజేంద్రియన్, రాజకుమార్, రామకృష్ణ, వీరేశ్ పాల్గొన్నారు. మార్కెట్ ప్రకారమే పరిహారం నర్సాపూర్: సంగారెడ్డి కెనాల్లో భూములు కోల్పోతున్న రైతులు మార్కెట్ ప్రకారమే పరిహారం చెల్లించాలని ఆర్డీఓ మహిపాల్ను కోరారు. మంగళవారం శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కుల గ్రామ రైతులతో అవార్డు సమావేశం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆర్డీవో హాజరై మాట్లాడుతూ గ్రామం మీదుగా కెనాల్ వెళ్తుందని, కాల్వ కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తున్నామని చెప్పారు. తమ భూములకు మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కొందరూ, కాల్వ నిర్మాణానికి తమ భూములు తీసుకోవద్దని మరి కొంతమంది రైతులు ఆయనను కోరారు. రైతుల అభ్యర్థనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ వివరించారు. సమావేశంలో తహసీల్దార్ కమలాద్రి, ఆర్ఐ కిషన్ తదితరులు పాల్గొన్నారు. సీల్డ్ టెండర్ల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని 27 పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయడానికి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట డీఈఓ శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ ఫారం ధర రూ.2 వేలు, ఈఎండీ ధర రూ.50 వేలు ఉంటుందన్నారు. టెండర్ ఫారాలు ఈ నెల 28 వరకు విద్యాశాఖ కార్యాలయంలో పొందాలని, పూర్తి చేసిన ఫారాలను బాక్స్లో వేయాలన్నారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 29న ఉదయం 11గంటలకు జేపీసీ కమిటీ ఆధ్వర్యంలో తెరుస్తామని తెలిపారు. -
సన్నబియ్యం సన్నద్ధం
బయట విక్ర యానికి బ్రేక్!మెదక్జోన్: ఆహార భద్రత కార్డులున్న పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని 80శాతం మంది తినలేదు. కేవలం 20 శాతం మాత్రమే తిన్నారు. రేషన్ షాపుల ద్వారా ఉచితంగా తీసుకొని బయట అమ్ముకున్నారు. కానీ ఇక నుంచి పంపిణీ చేసే సన్న బియ్యాన్ని లబ్ధిదారులందరూ తిననున్నారు. జిల్లాలో రెండు లక్షల పై చిలుకు రేషన్ కార్డులు మెదక్ జిల్లాలో 2,14,155 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో ఆహార భద్రత కార్డులు 2,00,229, అంత్యోదయ కార్డులు 13,860, అన్నపూర్ణ కార్డులు 66 ఉండగా వీటికీ నెలకు 4367.538 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 520 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సన్న బియ్యం పథకాన్ని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి చౌకధరల దుకాణం ద్వారా ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వానాకాలంలో 1.5 లక్షల ఎకరాల్లో సాగు ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 2.73 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 1.5 లక్షల ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం క్వింటాల్కు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వడంతో ఎక్కువ మొత్తంలో సన్నాల సాగుకు రైతులు మొగ్గు చూపారు. కాగా ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 93 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 53,660 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరించారు. సీఎంఆర్ కోసం పలు రైస్మిల్లర్లకు ధాన్యం ఇవ్వగా ఇప్పటి వరకు 80 శాతం బియ్యాన్ని మిల్లర్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా 20 శాతం 15 రోజుల్లో రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్తవారు రేషన్కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు వారం పాటు సమయం ఇవ్వగా జిల్లా వ్యాప్తంగా 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుండగా ఇప్పటి వరకు 4 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుందో అధికారులు కచ్చితమైనా డేట్ను నిర్ణయించలేదు. ఒకటి నుంచి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ జిల్లా వ్యాప్తంగా 2.14 లక్షల కార్డులు ప్రతి నెల 4367.538 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు చౌకధరల దుకాణాల ద్వారా అందించిన దొడ్డు బియ్యాన్ని నిరుపేదలైన 20 శాతం జనాలు మాత్రమే తినగా 80 శాతం మంది జనాలు వాటిని విక్రయించారు. రేషన్ బియ్యం ఇచ్చారని తెలియగానే టాటా ఏసీ వాహనాల ద్వారా పలువురు వ్యాపారులు గ్రామాల్లో గద్దల్లా వాలిపోయి ఇండ్లు తిరుగుతూ కిలోకు రూ.15 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసేవారు. ఆ బియ్యాన్ని రైస్మిల్లర్స్ వారి దగ్గర కొనుగోలు చేసి వాటినే తిరిగి ప్రభుత్వానికి (ఎఫ్సీఐ)కి అప్పగించే వారు. ఇలా రొటీన్ పద్ధతిలో పీడీఎస్ రైస్ తిరిగేవి. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ కాబోతుండటంతో వాటిని బయట విక్రయించకుండా ప్రతి కుటుంబం ఇక నుంచి సన్న బియ్యాన్ని తిననున్నారు. -
కూలీలందరికీ ఉపాధి: జెడ్పీ సీఈఓ
● పని చేసే చోట వసతులు కల్పించాలి ● తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు రేగోడ్(మెదక్): ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలందరికీ పని కల్పిస్తామని మెదక్ జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. రేగోడ్ మండల పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ గృహాన్ని పరిశీలించి, ఉపాధిహామీ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ఉపాధిహామీ ద్వారా అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నామని, పని చేసిన వెంటనే కూలీ డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. కూలీలు పని చేస్తున్న ప్రాంతంలో వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా మండలాల్లోని వార్డుల వారీగా సరఫరా సమస్యలను తెలుసుకొని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ సీతారావమ్మ, సూపరింటెండెంట్ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు
డీపీఓ యాదయ్య చిన్నశంకరంపేట(మెదక్): గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీపీఓ యాదయ్య అధికారులకు సూచించారు. మండలంలోని రుద్రారం, చందంపేట గ్రామాల్లో మంగళవారం డీపీఓ ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. అనంతరం గ్రామ కార్యదర్శులు అనురాధ, పద్మలకు పలు సూచనలు చేశారు. -
ఏం చేశాం.. ఎంత ఇచ్చాం!
తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందుకు ఖర్చు చేసిన నిధుల వివరాలను రైతులకు తెలియజేయాలని సర్కారు నిర్ణయించింది. రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను ఫ్లెక్సీల్లో ముద్రించి గ్రామాలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. గ్రామాల వారీగా ఎన్ని కోట్లు ఇచ్చాం.. ఏ రైతుకు ఎంతమేర లబ్ధి చేకూరింది అనే విషయాలను గ్రామస్తులు చర్చించుకునేలా చూడాలని ప్రణాళికలు రచిస్తోంది. ఉగాది నాటికి ఈ పక్రియను పూర్తి చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల సాగుభూములు ఉండగా, వాటిలో ఏటా 3.95 లక్షల ఎకరాలను 2.91 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో కనీసం 300 నుంచి 500 వందలకు తగ్గకుండా రైతులు ఉంటారు. వీరిలో రుణమాఫీ వర్తించిన వారు తక్కువ మంది ఉన్నా, రైతు భరోసా అందిన వారు 90 శాతానికి పైగా ఉంటారు. కాగా ఫ్లెక్సీల్లో రైతు పేరు, తండ్రి పేరు, భూమి, బ్యాంకు అకౌంట్, రుణమాఫీ ఎంత అయింది.. రైతు భరోసా కింద ఎంత జమ అయిందనే పూర్తి సమాచారం ఫ్లెక్సీల్లో ముద్రించనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా ఒక్కో ఫ్లెక్సీ సైజు ఆరు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఉండనుందని తెలిసింది. దీంతో 500 మంది రైతులు ఉన్న గ్రామంలో అందరి పేర్లు ముద్రించాలంటే కనీసం 5 ఫ్లెక్సీలు అవసరం పడనున్నాయి. అలాగే ప్రతి గ్రామంలోని మూడు ప్రధాన కూడళ్ల వద్ద వీటిని ప్రదర్శించాలంటే కనీసం 15 ఫ్లెక్సీలు కావాలి. ఈ లెక్కన జిల్లాలో 493 గ్రామాలకు గానూ 7,393 ఫ్లెక్సీలు అవసరం ఉంటాయి. ఒక్కో ఫ్లెక్సీకి ప్రభుత్వం రూ. 300 చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం. రుణమాఫీ రూ. 654.12 కోట్లు జిల్లాలో 2.91 లక్షల మంది రైతులు ఉండగా, రూ. 2 లక్షల లోపు అర్హులైన 88,683 మంది రైతులకు నాలుగు విడతల్లో కలిపి రూ. 654.12 కోట్ల నిధులు జమ చేసింది. అలాగే ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి 2,54,238 మంది రైతులకు రైతు భరోసా కింద ఒక్కో ఎకరాకు రూ. 6 వేల చొప్పున జిల్లాకు రూ. 193 కోట్ల నిధులు వచ్చాయి. రైతుల ఓట్లే కీలకం! రైతు భరోసా, రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాము చేసిన పనులను ఊరూవాడా చర్చించుకోవాలనే ఈ ఆలోచనకు తెరతీసినట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే రైతుల ఓట్లే కీలకమని భావిస్తోంది. రుణమాఫీ, రైతు భరోసాలబ్ధిదారుల పేర్లు ప్రదర్శన గ్రామాలు, ప్రధాన కూడళ్లలోఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం వ్యవసాయశాఖ అధికారులకుఅందిన ఆదేశాలు ఉగాది నాటికి ఏర్పాటు చేసేలా చర్యలుఆదేశాలు వచ్చాయి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను ఫ్లెక్సీల్లో ముద్రించి గ్రామాల్లో ప్రదర్శించాలని తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనుమతి తీసుకొని ఫ్లెక్సీల్లో లబ్ధిపొందిన రైతుల పేర్లను ముద్రణ చేపడతాం. – వినయ్, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి -
కంటి దీపాలకు కనుచూపెవరు?
సుగుణమ్మ ముగ్గురు కుమారులూ అంధులే● చిన్న కొడుకు నీటి గుంతలో పడి మృతి ● ఇంటి పెద్దను కాటేసిన కేన్సర్ ● అంధులైన కొడుకులకు పిల్లనివ్వని దైన్యం ● నేను కనుమూస్తే నా బిడ్డలకు దిక్కెవరు? ● తల్లడిల్లుతున్న మాతృమూర్తి మెదక్జోన్: ‘పెళ్లయిన మూడేళ్లకు మొదటి సంతానంలో కొడుకు పుట్టాడని ఆనందపడ్డాం. విశ్వనాథం అని కాశీ విశ్వనాథుడి పేరు పెట్టుకున్నాం. బుడిబుడి అడుగులు వేస్తుంటే సంబరపడ్డాం. కానీ.. మా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మా కుమారుడికి కళ్లు కనిపించవని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. వరుసగా మరో ఇద్దరు కొడుకులకు సైతం అంధత్వం రావటంతో మా తలరాత ఇంతే అని సరిపెట్టుకున్నాం. చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ పిల్లలను సాదుకుంటుండగా.. విధి పగ బట్టినట్లుగా కేన్సర్ మహమ్మారి నా భర్తను కాటేసింది. ఐదేళ్లకు చిన్నకొడుకు నీటి గుంతలో పడి మరణించాడు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. ఉన్న ఇద్దరితో ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. నేను పోయాక నా బిడ్డలను ఎవరు చూస్తారో..? తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు’అని ఎనిమిది పదుల వయసులో సుగుణమ్మ ఆందోళన చెందుతుంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా.. మెదక్ పట్టణానికి చెందిన కందుకూరి కృష్ణ, సుగుణమ్మ దంపతులకు ముగ్గురు మగ సంతానం. పెద్ద కొడుకు విశ్వనాథం, రెండో కొడుకు సంతో ష్, చిన్న కొడుకు రాము.. పుట్టిన ముగ్గురు అంధులే కావటంతో తమ బిడ్డల భవిష్యత్ కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్, సరోజినిదేవి, చైన్నెలోని శంకర్ నేత్రాలయం లాంటి ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆశలు వదులుకొని పట్టణంలో చిన్నపాటి హోటల్ ఏర్పాటుచేసి జీవనం సాగించారు. కుటుంబం సాఫీగా సాగుతున్న తరుణంలో.. 2009లో ఇంటి పెద్ద కృష్ణకు కేన్సర్ సోకింది. ఎలాగైనా బతకాలని.. తనకేమైనా జరగరానిది జరిగితే అంధులైన తన బిడ్డల భవిష్యత్ ఏంటని ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినా ఫలితం లేకపోవటంతో కృష్ణ మరణించాడు. దీంతో కుటుంబ బాధ్యత పూర్తిగా సుగుణమ్మపై పడింది. ఉన్న హోటల్ను నడపలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి కిరాణం నడుపుకుంటూ జీవిస్తుండగా.. 2014లో చిన్నకొడుకు రాము ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి స్నేహితుల సహాయంతో వెళ్లాడు. అక్కడ బహిర్భూమికి వెళ్లి నీటి గుంతలో పడి మరణించాడు. పింఛనే పెద్ద ఆసరా ఉన్న ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పెన్షన్తో సాదుకుంటోంది సుగుణమ్మ. ప్రస్తుతం ఆమెకు వృద్ధాప్యం మీద పడుతోంది. వయసు 80 ఏళ్లు. శరీరం సహకరించకున్నా అతికష్టం మీద వారికి వంట చేసి పెడుతోంది. తన తదనంతరం బిడ్డల పరిస్థితి ఏంటని మనోవేదనకు గురవుతోంది. తన పెద్ద కొడుకు విశ్వనాథంకు 40 ఏళ్లు ఉండగా.. పెళ్లి చేయాలని ఎంతగానో ఆరాట పడుతోంది. కానీ అంధులైన ఆమె కొడుకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. మా నాన్న అతికష్టం మీద పదో తరగతి వరకు చదివించారని.. ప్రస్తుతం జీవనోపాధి కష్టంగా మారింది.. చిన్నపాటి అటెండర్ ఉద్యోగం ఇప్పించి జీవనోపాధి కల్పించాలని కొడుకు విశ్వనాథం వేడుకుంటున్నాడు. -
ఆస్పత్రులకు అంబులెన్స్లు
మెదక్జోన్: మెదక్ ఎంపీ రఘునందన్రావు తన జన్మదినాన్ని పురస్కరించుకొని సొంత నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్లను ఆదివారం ఆస్పత్రులకు అందించి ఉదారత చాటుకున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గానికో అంబులెన్స్ చొప్పున ఏడింటిని హైదరాబాద్లోని తన నివాసంలో ఆయా జిల్లాల ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెట్లకు అందించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ లేనందున ఎంపీ అందించిన అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడనుంది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్లో వర్షం హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రమైన హవేళిఘణాపూర్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. చేతికొచ్చిన పంటలు ఏమవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే శనివారం భారీ ఈదురు గాలులతో చెట్లు కిందపడిపోగా, వివిధ పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సిబ్బంది సేవలు భేష్ పాపన్నపేట(మెదక్): ఇటీవల గాలి, వానకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలకు వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన విద్యుత్ అధికారులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కమిషన్ సభ్యుడు పట్లోల్ల శశిధర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మెదక్ నియోజకవర్గంలో వీచిన భారీ గాలులు, వర్షానికి అనేక విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయని, వైర్లు తెగిపోయాయని చెప్పారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్ఈ శంకర్, ఇతర సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేశారని కొనియాడారు. నష్టపోయిన రైతులను ఆదుకోండి: సీపీఎం మెదక్ కలెక్టరేట్: ఎండిపోయిన, అకాలవర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండుతున్న ఎండలతో బోర్లు సరిగా పోయక పంటలు ఎండుతుంటే, అకాల వర్షం కారణంగా వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఇరుకు రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్లుకు నిధులు కేటాయించి, డబుల్ రోడ్డు నిర్మించాలన్నారు. రాజీవ్ యువజన వికాస్ పథకానికి దరఖాస్తు సమయం తక్కువగా ఉందని, గడువు పొడిగించాలని కోరారు. విద్యార్థులు జీవన వైవిధ్యంపై దృష్టి సారించాలి నర్సాపూర్ రూరల్: విద్యార్థులు, యువత గ్రామీణ జీవన వైవిధ్యంపై దృష్టి పెట్టాలని ఎన్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ లైజర్ అధికారి డాక్టర్ భాస్కర్ సూచించారు. ఆదివారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయంతో పాటు కులవృత్తులతో జీవనం కొనసాగిస్తారన్నారు. విద్యార్థులు, యువత వారిని గౌరవించాలన్నారు. ఎన్ఎస్ఎస్ శిబిరం సభ్యులు గ్రామీణ ప్రాంత ప్రజ లకు మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక వనరులపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేష్ కు మార్, పీఆర్ఓ శ్రీనివాస్, అధ్యాపకులు మహేందర్రెడ్డి, రాజు, రాము, సుందర్ పాల్గొన్నారు. -
విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవాలి
నర్సాపూర్: మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ అన్నారు. ఆదివారం కెంటెల్, రిస్క్గార్డ్, ఎస్– హాచ్ సంస్థలు స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీతో కలిసి హైదరాబాద్ టీ– హబ్లో మెంటరెక్స్ కార్యక్రమం నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అథితిగా జయేశ్రంజన్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీ–హబ్ మాజీ సీఈఓ మహంకాళీ శ్రీనివాస్రావు, విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, బీవీ ఆర్ఐటీ ప్రిన్సిపాల్ సంజయ్దూబె తదితరులు మాట్లాడారు. -
ప్రోత్సాహం ఏదీ?
పీఎం విశ్వకర్మలో మూడు పథకాలు అవుట్ ● మూడేళ్లుగా ఆగిన లబ్ధిదారుల ఎంపిక ● ఆందోళనలో వృత్తిదారులు ● జిల్లాలో 1,303 దరఖాస్తులువృత్తిపైనే ఆధారపడి ఉన్నం తాతల కాలం నుంచి వడ్రంగి వృత్తియే ఆధారం. దీనితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రభుత్వ సాయంతో పనిముట్లు కొనుగోలు చేసుకుందామని రెండేళ్ల క్రితం పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ ఎంపిక చేయడం లేదు. ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది. – వడ్ల రవి, అక్కన్నపేట, రామాయంపేట పథకాలు అందించాలి పీఎం విశ్వకర్మలో వడ్రంగి, మేసన్, టైల ర్ వృత్తిదారులకు సంబంధించిన పథకాలు నిలిపివేయడం అన్యాయం. రెండేళ్ల క్రితం ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టి సంక్షేమ పథకాలు అందించాలి. – వడ్ల శ్రీనివాస్, అక్కన్నపేట, రామాయంపేటమెదక్ కలెక్టరేట్: అంతరించిపోతున్న సంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు 2023లో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయం అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పథకం ప్రారంభించిన సమయంలో 18 రకాల వృత్తిదారులను ఎంపిక చేసి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో 2023 నుంచి ఇప్పటివరకు జిల్లాలో వేలాది మంది వృత్తిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొన్ని పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ అందజేశారు. అలాగే బ్యాంకు ద్వారా రూ. 1 లక్ష రుణం ఇచ్చారు. ఈ క్రమంలో ఏడాదిగా పథకంలో మేసన్, వడ్రంగి, టైలర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జిల్లాలో 1,303 మంది లబ్ధిదారులు ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని ఆశగా ఎదుచూస్తున్నారు. ఈ విషయమై జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్ను వివరణ కోరగా మేసన్, వడ్రంగి, టైలర్ పథకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. విశ్వకర్మ పథకంలో అత్యధికంగా ఈ మూడు వృత్తిదారుల దరఖాస్తులు వస్తున్నాయని, దీంతో మిగతా లబ్ధిదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు చెప్పారు. అందుకే వారి ఎంపిక తాత్కాలికంగా నిలిపివేశారని, తిరిగి ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియదని అన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
సిద్దిపేటరూరల్: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు తక్షణం నష్టపరిహారం అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను అంచనా వేసి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కింద ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్లో ఎన్నో మాటలు చెప్పిన కాంగ్రెస్ నేటికీ అమలు చేయలేదన్నారు. రైతులకు రూ.2లక్షలు మాఫీ చేస్తానని చెప్పి పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదన్నారు. రైతు భరోసా పేరిట ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. వెంటనే వర్షాకాలం, యాసంగి పంటల రైతు భరోసా రూ. 15 వేల చొప్పున అందించాలన్నారు. దెబ్బతిన్న పంటలను అంచనా వేయించి వెంటనే రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరారు. మాజీ మంత్రి హరీశ్రావు -
చివరి వారం .. పోటెత్తిన భక్తజనం
ముగిసిన కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు కొమురవెల్లికి భక్తులు పోటెత్తారు. చివరి ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మూడు నెలలుగా కొనసాగిన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అర్ధరాత్రి నిర్వహించిన అగ్నిగుండాలతో వైభవంగా ముగిశాయి. అంతకుముందు పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గంగిరేణు చెట్టువద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలు అత్యంత వైభవంగా జరిగాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
పాఠశాలల్లో పనులు పూర్తి చేయండి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: సంక్షేమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పునః ప్రారంభం నాటికి మరమ్మతులను వెంటనే పూర్తి చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. వసతి గృహాలు, పాఠశాలల్లో సమస్యలుంటే వెంటనే సంబంధిత సీనియర్ అధికారికి వివరించాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, ఎస్సీ సంక్షేమ అధికారి చంద్రకళ, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, సంబంధిత గురుకులాల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి పరిశీలన రామాయంపేట(మెదక్): మెదక్– సిద్దిపేట జాతీయ రహదారిలో తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి నాణ్యతను కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక రోడ్డు త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలని సూచించారు. -
నష్టపోయిన వారిని ఆదుకోండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్/కొల్చారం(నర్సాపూర్): అకాలవర్షంతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి చిరువ్యాపారులు నష్టపోయారని తెలిపారు. చాలా గ్రామాలకు కరెంట్ సరఫరా లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని చిలప్చెడ్, కొల్చారం మండలాల్లో అకాలవర్షం చాలా ప్రభావం చూపిందన్నారు. పోతన్శెట్టిపల్లి, అప్పాజిపల్లి, ఘన్పూర్ గ్రామాలతో పాటు వాటి చుట్టుపక్కల గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయన్నారు. కరెంటు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వివరించారు. కాగా చిన్నఘనపూర్ నుంచి ఏడుపాయలకు వెళ్లే మార్గంలో చిన్న హోటళ్లు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని చాలా మంది వ్యాపారం చేస్తూ బతుకుదెరువు పొందుతున్నారని. ఈదురుగాలులకు డబ్బాల ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోవడంతో బతుకుదెరువు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఆర్థిక సహాయం అందచేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజీవ్ యువవికాస పథకం ద్వారా బాధితులకు బతుకు దెరువు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ అనంతరం పోతంశెట్టిపల్లి శివారు టీ జంక్షన్ వద్దకు చేరుకొని బాధితులను పరామర్శించారు. ఫోన్లో కలెక్టర్తో మాట్లాడి బాధితులను ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ గఫార్మియా, ఎంపీఓ కృష్ణవేణి, ఆర్ఐ ప్రభాకర్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్గుప్తా తదితరులు ఉన్నారు. -
మల్లన్నా.. పూర్తి కమిటీ ఎప్పుడన్నా?
చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న ఆలయ పాలకవర్గం సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి యేడాదిన్నరగా పూర్తిస్థాయి పా లకవర్గం లేకుండానే కొనసాగుతోంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం ఒకటి. చైర్మన్ లేకుండానే.. మల్లికార్జున దేవాలయం కమిటీని గతేడాది డిసెంబరు 3న.. ఎనిమిది మంది డైరెక్టర్లను, ఒక ఎక్స్ ఆఫీషియో సభ్యుడిని నియమించారు. అందులో సీహెచ్ కొమురయ్య, మోహన్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, అల్లం శ్రీనివాస్, అనిరెడ్డి, మామిడ్ల లక్ష్మి, మహేందర్రెడ్డి, జయ ప్రకాశ్రెడ్డి ఉన్నారు. ఆలయ కమిటీతో 14 మంది డైరెక్టర్లతో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యులను నియమించాలి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిని చైర్మన్ చేయాలనుకున్నారు. కానీ ఆ నాయకుడు దరఖాస్తు చేయకపోవడంతో మొదటగా వచ్చిన జాబితాలో డైరెక్టర్గా ఎంపిక కాలేదు. దీంతో చైర్మన్ను నియమించలేదు. మిగతా డైరెక్టర్ల నియామకం కోసం డిసెంబరు 3 నుంచి 20 రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించారు. ఆరుగురు డైరెక్టర్ల కోసం 60 మంది దరఖాస్తు చేశారు. ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయలేదు. చైర్మన్ లేకుండానే నేటితో జాతర ముగుస్తోంది. కమిటీ ఏర్పాటయ్యేనా... డిసెంబరులో నియమించిన డైరెక్టర్ల పదవీకాలం మరో 9 నెలల్లో ముగుస్తుంది. అలాగే జాతర సైతం ముగిసింది. దీంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారా? మళ్లీ జాతర ప్రారంభ సమయంలోనే నియమిస్తారా? అని జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చసాగుతోంది. దేవాలయానికి పూర్తిస్థాయి కమిటీ లేకపోవడంతో వీవీఐపీ పాస్లు ఇష్టారాజ్యంగా అధి కారులు జారీ చేశారని ప్రచారం జరుగు తోంది. ఆ పాస్లను ప్రైవేట్ వ్యక్తులు బయట విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా దేవాదాయ ఉన్న త అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి వీవీఐపీ పాస్లను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. డిసెంబరు 3న 8మంది డైరెక్టర్ల నియామకం అధికారులు ఇష్టారాజ్యంగా వీవీఐపీ పాసుల జారీ -
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాపన్నపేట(మెదక్): జాతీయస్థాయి జూనియర్స్ బాలుర కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి నరేంద్రనాథ్ ఎన్నికై నట్లు జిల్లా కబడ్డీ అ సోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్రెడ్డి, సెక్రటరీ రమేష్ శనివారం తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి 30 వరకు బీహార్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. వికారాబాద్లో జరిగిన పోటీల్లో నరేంద్రనాథ్ ప్రతిభ చూపినట్లు తెలిపారు. ఈసందర్భంగా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ వెల్దుర్తి(తూప్రాన్): ఎస్సీ, ఎస్టీ కేసును విచారించేందుకు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి శనివారం మండలంలోని మెల్లూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన ఇద్దరు ఈనెల 20వ తేదీన కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని శుక్రవారం వెల్దుర్తి పోలీస్స్టేషన్లో దాసరి బాబు ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం డీఎస్పీ వెంకటరెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దాడి జరిగిన గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న గుడిసె వద్ద బాధితులు, సాక్షులను విచారించారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. డీఎస్పీ వెంట వెల్దుర్తి ఎస్సై రాజు ఉన్నారు. 20 మంది గైర్హాజరు మెదక్ కలెక్టరేట్: పదో తరగతి పరీక్షలు రెండోరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 10,384 మంది విద్యార్థులకు గానూ 10,364 మంది హాజరుకాగా, మరో 20 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. డీఈఓ రాధాకిషన్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఎక్కడ మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. అక్రమ అరెస్టులు సరికాదు: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ పిలుపునిచ్చామని తెలిపారు. జిల్లా నుంచి కార్యక్రమానికి వెళ్తున్న సీఐటీయూ నాయకులను ముందస్తుగానే ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా విస్మరిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సంతోష్, అజయ్, నర్సింలు, సాయిలు, గట్టయ్య, రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్లో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్రమ అరెస్టులు సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు అన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించా రు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారీ క్రైం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతి పట్టణం, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుతం ఒంటి పూట బడులు కావడంతో విద్యార్థులు బావులు, వాగులు, వంకలలో ఈతకు వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనించాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు ప్రసన్నకుమార్, వెంకట్రెడ్డి ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో 496 కొనుగోలు కేంద్రాలు
అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో 496 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలిసి హార్వెస్టర్ల యజమానులతో వరి కోతలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పొలం పూర్తిగా కోత దశకు వచ్చిన తర్వాతే యంత్రాలు వినియోగించి పంట కోయించాలని సూచించారు. హార్వెస్టర్ యజమానులు బ్లోయర్ ఆన్లో ఉంచాలన్నారు. పంట పూర్తిగా కోతకు వచ్చిన తర్వాత కోయడం ద్వారా తేమశాతం, తాలు, గడ్డి లేకుండా నాణ్యమైన పంట వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులకు తగు సూచనలు ఇవ్వాలని సూచించారు. రైతులు ధాన్యం శుభ్రపరిచిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని చెప్పారు. -
నష్టం మిగిల్చిన వర్షం
విద్యుత్శాఖకు రూ. 65 లక్షల నష్టం ● విరిగిన 150 కరెంట్ స్తంభాలు ● 14 సబ్స్టేషన్లలో తలెత్తిన సమస్యలు ● పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ ● మరమ్మతులు చేస్తున్న ట్రాన్స్కో సిబ్బంది ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం జిల్లాలో అపారనష్టాన్ని మిగిల్చింది. కరెంట్ స్తంభాలు విరిగిపడగా.. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 14 సబ్స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. మొత్తంగా శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో జిల్లాలో విద్యుత్ శాఖకు రూ. 65 లక్షల మేర నష్టం వాటిల్లింది. – మెదక్జోన్ జిల్లాలోని పలు మండలాల పరిధిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గాలి, వాన బీభత్సం సృష్టించింది. మెదక్, చిన్నశంకరంపేట, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులకు 150కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. 200 వరకు డీపీఆర్లు పగిలిపోయాయి. గద్దెలపై నుంచి ట్రాన్స్ఫార్మర్లు కింద పడిపోయాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. రాత్రి పల్లెలు అంధకారంలో ఉన్నాయి. వందలాది చెట్లు నేలకొరగగా.. ఇళ్లపై రేకులు, పూరి గుడిసెలు ఎగిరిపోయాయి. కేవలం ట్రాన్స్కో శాఖకు ఏకంగా రూ. 65 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సత్వర విద్యుత్ సేవలు పాపన్నపేట(మెదక్): గాలి, వాన బీభత్సంతో ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని సకాలంలో పునరుద్ధరించామని జిల్లా చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. శనివారం మండలంలో ఆయన పర్యటించి మరమ్మతు చర్యలను పర్యవేక్షించారు. మండలంలో 35 విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, అందులో 20 నూతన స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్ సేవలు పునరుద్ధరించామని తెలిపారు. దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఈ శంకర్, డీఈ చాంద్భాషా, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ నర్సింలు ఉన్నారు.కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న సిబ్బంది131 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు జిల్లావ్యాప్తంగా 131 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. అందులో అత్యధికంగా జొన్న పంట 78 ఎకరాల్లో దెబ్బతింది. పెద్దశంకరంపేట, రేగోడ్ మండలాల్లో వడగండ్ల వాన కురవటంతో ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే 28 ఎకరాల్లో మామిడి తోటలు, 18 ఎకరాల్లో మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి పంట చొప్పున మొత్తం 131 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాగా ప్రాథమిక పంటనష్టం అంచనా వేసిన అధికారులు రైతులకు పరిహారం ఇస్తారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. మరమ్మతులు చేస్తున్నాం ఈదురుగాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటుచేస్తున్నాం. అలాగే విరిగిపోయిన డీటీఆర్లు తొలగించి కొత్తవాటిని అమర్చుతున్నాం. సబ్స్టేషన్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిచేస్తూ అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం. – శంకర్, ట్రాన్స్కో ఎస్ఈ మెదక్ -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
మెదక్ మున్సిపాలిటీ: మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఇఫ్తార్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్, తహసీల్దార్ లక్ష్మణ్, ఇతర మత పెద్దలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మజర్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): విదేశి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ పేర్కొన్నారు. మే 19 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దు
మెదక్ మున్సిపాలిటీ: యువత ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్లకు పాల్పడిన, గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని విద్యార్థులు, యువత అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్లకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. వీటి కట్టడికి జిల్లా పోలీస్శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని వివరించారు. అక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు మీ చుట్టూ పక్కల ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 100కు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి
శివ్వంపేట(నర్సాపూర్): యాసంగి వరి పంటలు నీరందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం పరిహా రం ఇచ్చి ఆదుకోవాలని రైతు రక్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు మైసయ్యయాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. పంటలకు పలు చీడ పురుగులు సోకడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోయి ఎండిపోయాయన్నారు. ఎండిన పంటల వివరాలు ప్రభుత్వం సేకరించి ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్న రైతులకు పంట చేతికి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా సైతం రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను అన్ని విధాలుగా అదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దు
మెదక్ మున్సిపాలిటీ: యువత ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్లకు పాల్పడిన, గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని విద్యార్థులు, యువత అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్లకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. వీటి కట్టడికి జిల్లా పోలీస్శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని వివరించారు. అక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు మీ చుట్టూ పక్కల ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 100కు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
ఒకే దేశం.. ఒకే ఎన్నికపై అవగాహన
నర్సాపూర్: ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భారం పడడంతో పాటు సమయం వృథా అవుతుందన్నారు. వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని వివరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రమేష్గౌడ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్, కాలేజీ ప్రిన్సిపాల్ అశోక్ పాల్గొన్నారు. ‘నాసిరకం పనులపై చర్యలు చేపట్టాలి’ పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేటలో అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు చేపట్టిన సీసీ రోడ్డు పనులు నాసిరకంగా ఉన్నాయని, ఆర్అండ్బీ జిల్లా అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ. 80 లక్షలతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు సరిగా చేయకపోవడంతో సీసీ రోడ్డు కుంగిపోయిందన్నారు. అయినప్పటికీ సంబంధిత అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దశంకరంపేటలోని అన్ని వార్డుల్లో రహదారి పనుల వల్ల మిషన్ భగీరథ పైపులైన్ దెబ్బతిందన్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. వెంటనే పైపులైన్కు మరమ్మతులు చేయింది ప్రజలకు తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు పాపన్నపేట(మెదక్): రేషన్ దుకాణాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికలు, కొలతల అధికారి సుధాకర్ హెచ్చరించారు. శుక్రవారం పాపన్నపేట, టేక్మాల్ మండలాల్లోని పలు రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా తూకం యంత్రాలను పరిశీలించారు. తూకంలో డీలర్లు అవకతవకలకు పాల్పడితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాపన్నపేటలో 30, టేక్మాల్లో 20 తూకం యంత్రాలకు స్టాంపింగ్ వేసినట్లు చెప్పారు. వ్యాపారులు తప్పనిసరిగా తూకం నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట రేషన్ డీలర్లు ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనోహరాబాద్(తూప్రాన్): ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్ సూచించారు. శుక్రవారం మండలంలోని కొండాపూర్లో రెడ్క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీఎస్టీ పరిశ్రమ సహకారంతో మల్లారెడ్డి ఆస్పత్రి సిబ్బంది ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాస్రావు, పీహెచ్సీ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. -
16.80 కోట్లు
9రూ.రోజులు..ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ పనులకు గడువు ముంచుకొస్తుంది. కేవలం తొమ్మిది రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో రూ. 16.80 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. లేనిచో ఆ నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. – మెదక్జోన్ జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పని దినాలను బట్టి మెటీరియల్ కాంపోనెట్ నిధులు విడుదల అవుతాయి. ఈసారి జిల్లాకు రూ. 42 కోట్లు విడుదల కాగా, వాటిని ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 31) వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల నుంచి 95 శాతం పల్లెల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేపడుతుండగా, మరో ఐదు శాతం నిధులను పశువుల పాకల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం 60 శాతం.. అనగా రూ. 25.20 కోట్ల పనులు మాత్రమే అధికారులు చేశారు. ఈ లెక్కన ఇంకా రూ. 16.80 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకు కేవలం 9 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆగమేఘాల మీద పనులు చేస్తున్నారు. నేతల ఇళ్ల ముంగిట సీసీ రోడ్లు! గతంలో గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఉండటంతో సర్పంచ్లు గ్రామ సభలు పెట్టి ఏ వీధిలో సీసీరోడ్లు, ఎక్కడ మురికి కాలువల నిర్మాణాలు చేపట్టాలని తీర్మాణం చేసి పనులు చేసే వారు. ప్రస్తుతం సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాది కావొస్తుండటంతో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు పనులు చేపడుతున్నారు. ఇదే అదునుగా వారి ఇళ్ల ఎదుట సీసీ రోడ్లు వేసుకుంటున్నారు. ప్రజాధనంతో పది మంది నడిచే బాటలో సీసీ రోడ్లు వేయాలి, కానీ ప్రజల సొమ్మతో ఇళ్ల ముందు రోడ్లు వేసుకోవటం ఏంటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. హడావుడి పనులు.. నాణ్యత లోపాలు నిధులు ల్యాప్స్ కావొద్దనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు హడావుడిగా చేస్తున్నారు. చాలా చోట్ల ఇసుకకు బదులు రాతి ఫౌడర్ను మిక్స్ చేస్తున్నారు. ఇది చాలా కాలం మన్నికగా ఉండదని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సీసీ రోడ్డు నిర్మించిన అనంతరం కనీసం 28 రోజుల పాటు వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉండగా, కొన్ని చోట్ల వారం కూడా చేయటం లేదని తెలుస్తోంది. దీంతో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కే ఆగమేఘాలపై సీసీ రోడ్ల నిర్మాణాలు ఉపాధి హామీ మెటీరియల్కాంపోనెంట్ పనుల తీరునిధులు ల్యాప్స్ కాకుండా చర్యలు ఉపాధి హామీ పథకంలో మంజూరైన నిధులు ల్యాప్స్ కాకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాకు రూ. 42 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ. 25.20 కోట్ల పనులు పూర్తి చేశాం. మరో రూ. 16.80 కోట్ల పనులు చేయాల్సి ఉంది. – నర్సయ్య, పీఆర్ ఈఈ, మెదక్ -
అడవులను సంరక్షించుకుందాం
నర్సాపూర్ రూరల్: భావితరాల కోసం అటవీ సంపదను సంరక్షించుకుందామని నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాల్సిన బాధ్యత ఉందన్నారు. ఫలితంగా జీవ వైవిద్యం పెరుగుతుందన్నారు. జంతుశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో అత్యధిక జీవ సంపద కలిగి ఉందన్నారు. అడవిలో ఒక్క మొక్కకు, జంతువులకు హాని కలిగిన ఇతర జీవుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. దీని దృష్టిలో పెట్టుకొని అటవీ సంపదను కాపాడుకుని ఇతరులను చైతన్యం చేయాలని విద్యార్థులు సూచించారు. విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోని వృక్షాలను ఆలింగనం చేసుకొని మొక్కలను నాటుదాం, సంరక్షిద్దాం, అడవిని కాపాడుదాం అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వృక్షశాస్త్ర అధ్యాపకురాలు రుక్ముణి, అధ్యాపకులు అదేప్ప, మహేందర్రెడ్డి, రాజు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన జీఎస్టీ అధికారి
● లంచం తీసుకుంటుండగా పట్టివేత ● అరెస్ట్ చేసి నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలింపు మెదక్జోన్: జిల్లా కేంద్రంలోని జీఎస్టీ (కేంద్ర) కార్యాలయ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ ఏసీబీకి చిక్కారు. శుక్రవారం ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటుండగా సీబీఐ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుమారు ఆరుగంటల పాటు విచారించి, సదరు అధికారిని హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి ఆరేళ్లుగా ఎలక్ట్రికల్స్, ఇంజనీర్ హార్డ్వేర్ షాపును కొనసాగిస్తున్నాడు. కాగా ఏటా జీఎస్టీ రిటర్న్ దా ఖలు చేయలేకపోయాడు. దీంతో జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ సదరు వ్యాపారికి ఫోన్ చేసి జీఎస్టీ నంబర్ను వెంటనే పునరుద్ధరించుకోవాలని సూచించారు. దీంతో సదరు వ్యాపారి ఆన్లైన్లో రిటర్న్ చేశారు. కానీ దానిని ఓకే చేసేందుకు సదరు అధికారి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో వ్యాపారి రూ. 8 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారి సూచన మేరకు శుక్రవారం అధికారికి లంచం ఇస్తుండగా, అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారి ధనుంజయ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారిని విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి తీసుకెళ్తునట్లు పట్టణ పోలీసులకు లెటర్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే మీడియాను అనుమతించకపోగా, కనీస సమాచారం ఇవ్వలేదు. -
గాలి, వాన బీభత్సం
● 15 నిమిషాల పాటు అతలాకుతలం ● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు ● నేలకొరిగిన చెట్లు, దెబ్బతిన్న వాహనాలు కొల్చారం(నర్సాపూర్): అప్పటివరకు ఉక్కపో తతో ఇబ్బందిపెట్టిన వాతావరణం అంతలోనే మారిపోయింది.. మండలంలోని పోతంశెట్టిపల్లి శివారులో శుక్రవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టించింది. 15 నిమిషాల పాటు అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారి, మెదక్– జోగిపేట రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగి నిలిచి ఉన్న వాహనాలపై పడడంతో దెబ్బతిన్నాయి. రోడ్డుకు అడ్డంగా పడటంతో అరగంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగి కిందపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏడుపాయల టీ జంక్షన్ ప్రాంతంలోని పలు హోటళ్లపై చెట్టు విరిగిపడింది. రేకుల గాలికి లేచిపోయి సమీప పొలాల్లో పడ్డాయి. సమీపంలోని జాతీయ రహదారి పక్కన పొలాల్లో తాత్కాలిక గుడారాలు వేసుకుని ఉన్న వలస కూలీలపై పడటంతో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇంటిపై పడిన పిడుగు మెదక్జోన్: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మెదక్లోని భవానీనగర్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి వడియారం యాదయ్య ఇంటిపై పిడుగు పడింది. దీంతో భవనం స్వల్పంగా దెబ్బతింది. పిడుగుపాటుకు అతడి మనమరాలు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. కాగా గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో కొంతమేర పంటలకు మేలు జరగగా, కోతకు వచ్చిన వరి పంటలకు నష్టం జరిగింది. -
తొలి రోజు ప్రశాంతం
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025ప్రారంభమైన ‘పది’ పరీక్షలు ● 99.72 శాతం హాజరునీడ లేదు.. వైద్యం జాడలేదు ఉపాధి కూలీలకు నిలువ నీడ కరువైంది. ప్రథమ చికిత్స కిట్లు కానరావడం లేదు. వివరాలు 8లో uమెదక్జోన్: పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 68 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు మొదటి పరీక్ష తెలుగు–1ను ప్రశాంతంగా రాశారు. నిర్దిష్ట సమయం 9.30 గంటల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి లోనికి పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సౌకర్యాలు కల్పించారు. అయితే కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు తిరగక విద్యార్థులు అవస్థలు పడ్డారు. జిల్లావ్యాప్తంగా 10,402 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,373 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 29 మంది గైర్హాజరు కాగా 99.72 హాజరుశాతం నమోదైంది. కొల్చారం మండల కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేటలో డీఈఓ రాధాకిషన్, మెదక్, హవేళిఘణాపూర్, తూప్రాన్, మనోహరాబాద్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్లోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. -
అప్పు తీర్చేందుకు బ్యాంకు రుణాలు
సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ మెదక్ కలెక్టరేట్: రైతుల ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు బ్యాంకులు అదనపు రుణాలు అందిస్తున్నాయని సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తెలిపారు. బుధవారం హవేళిఘణాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు, బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రైవేట్ అప్పుల బాధతో ఉన్న రైతులందరూ, వెంటనే బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మైసయ్య, నాయకులు యాదాగౌడ్, వెంకటేశం, చంద్రశేఖర్, లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింహా, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.