news media
-
నచ్చకపోతే భారత్లో పనిచేయవద్దు: వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై పరువు నష్టం కేసు వేసిన విషయంలో హైకోర్టు.. వికిపీడియాకు గురువారం ‘కోర్టు ధిక్కార నోటీసులు’ జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని హైకోర్టు తెలిపింది.కాగా ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐను వికీపీడియా తన పేజీలో ప్రస్తుత ప్రభుత్వానికి 'ప్రచార సాధనం'గా పేర్కొంది. దీంతో వికీపీడియా తన ప్లాట్ఫారమ్లో సవరణలు చేసుకోవడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. తమ గురించి తప్పుడు సమాచారం ఎడిట్ చేసింది వికీపీడియా, దాని ఎడిటర్లు కాదని, ముగ్గురు బయటి వ్యక్తులు అని పేర్కొంది. ఈ క్రమంలో వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై ఢిల్లీ కోర్టులో రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.అయితే వికీపీడియాలో ఈ సవరణలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు సదరు సంస్తను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలును వెల్లడించలేదని ఏఎన్ఐ తెలిపింది. దీనిపై వికీపీడియా స్పందిస్తూ.. తమ వైపు నుంచి కొన్ని పత్రాల సమర్పణ పెండింగ్లో ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారి వివరాల వెల్లడికి ఆలస్యం అయిందని కోర్టుకు తెలిపింది.అయితే వికీపీడియా సమాధానంపై కోర్టు సంతృప్తి చెందలేదు. ‘ప్రతివాది భారతదేశంలో ఒక సంస్థ కాకపోవడం ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. వికీపీడియాను బ్లాక్ చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతాము.. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి ఇక్కడ పని చేయవద్దు’ అంటూ మండిపడింది.తదుపరి విచారణను అక్టోబర్కు వాయిదా వేసిది. అంతేగాక వచ్చే విచారణలో కంపెనీ ప్రతినిధి తప్పక హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
పూర్తిగా అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా సంస్థ..
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం రాఘవ్ బెహల్ నెలకొల్పిన డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో (క్యూబీఎంఎల్) మిగతా 51 శాతం వాటాను వ్యాపార దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది. తమ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. లావాదేవీ పూర్తయ్యాక ఏఎంఎన్ఎల్కు క్యూఎంఎల్ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. బీక్యూ ప్రైమ్ పేరిట మీడియా ప్లాట్ఫామ్ను నిర్వహించే క్యూబీఎంఎల్లో ఏఎంఎన్ఎల్ గతంలో రూ. 48 కోట్లకు 49% వాటాలను కొనుగోలు చేసింది. గతంలో బ్లూమ్బెర్గ్ క్వింట్గా పిలిచే బీక్యూ ప్రైమ్ను యూఎస్ వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ మీడియా, భారత్కు చెందిన క్వింటిలియన్ మీడియా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అయితే, బ్లూమ్బెర్గ్ గత ఏడాది మార్చిలో ఆ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. -
నెట్వర్క్18 మీడియా క్యూ3 వీక్.. 97 శాతం పతనం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది. చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్కు, వారి కుటుంబ సభ్యులకు.. -
డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’
న్యూఢిల్లీ: దేశీయంగా స్వతంత్ర స్థానిక న్యూస్ స్టార్టప్ల కోసం టెక్ దిగ్గజం జీఎన్ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా పేరిట యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించింది. దీని కింద ఆర్థికంగా, నిర్వహణపరంగా ఆయా అంకుర సంస్థలు నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో నాలుగు నెలల పాటు శిక్షణనిస్తుంది. ఇందుకోసం ఎకోస్, డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్తో జట్టు కట్టింది. భారతీయ భాషల్లో ప్రచురిస్తున్న న్యూస్ స్టార్టప్ సంస్థలేవైనా ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేది అక్టోబర్ 18. తొలి బ్యాచ్ కోసం 10 స్వతంత్ర డిజిటల్ న్యూస్ పబ్లిషింగ్ సంస్థలను ఎంపిక చేస్తారు. -
భారత్లో యాహూ న్యూస్ బంద్
Yahoo News India: వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్లో న్యూస్ ఆపరేషన్స్ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్స్టాప్ పెట్టింది. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్ను పబ్లిష్ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్డౌన్తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్ చేయండి: వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డు.. ఇలా చేయొచ్చు ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్ కంటెంట్.. ముఖ్యంగా యాహూ క్రికెట్పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ముట్టుకోకుండానే ఫోన్ పని చేస్తుందిక -
రాహుల్ ట్విటర్లో మాత్రమే యాక్టివ్గా ఉంటారు: శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘడి కూటమి సర్కార్లో విభేదాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీ ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్గా ఉంటున్నారంటూ శివసేన అధికార పత్రిక సామ్నాలో ఎద్దేవా చేసింది. ఇక మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడంలో ముందున్నప్పటికీ, అది కేవలం ట్విట్టర్కు మాత్రమే పరిమితమైందని అందులో ధ్వజమెత్తారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకభిప్రాయం తీసుకురావడంలో రాహుల్ విఫలమయ్యారని రాసుకొచ్చింది. అదే సమయంలో విపక్షాలను ఏకం చేయడంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ విజయం ప్రశంసలు కురిపించింది. శరద్ పవార్ మాదిరిగా రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉంటే ఆ ప్రతిపక్షం బలంగా ఉండి ఉండేదని వివరించింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీటుగా స్పందించారు. ఈ పరిణామాలను చూస్తుంటే విభేదాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ -
ఫేస్బుక్ వివాదం: మోదీతో ఆస్ట్రేలియా చర్చలు
సిడ్ని: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు.. వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్లోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్ఫామ్పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. దీనిపై ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా పైకి మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నప్పటికీ చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్తో పాటు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరిపింది. దీనిపై ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని వివరించారు. అదే సమయంలో ఫేస్బుక్కు సైతం చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ యథాస్థితిని తీసుకొచ్చేందుకు ఫేస్బుక్ యాజమాన్యం త్వరతగతిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ తరహా యుద్ధం సరైనది కాదని పేర్కొన్నారు. కాగా, ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్ఫామ్కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. కాగా, ఆసీస్ మీడియా అవుట్ లేట్లను, కొత్తకంటెంట్ను కనబడకుండా నిరోధించారని ఫేస్బుక్ కోశాధికారి ఫైడెన్బర్గ్ తెలిపారు. ఆసీస్ ప్రధాని బెదిరింపు ధోరణిని మానుకోవాలని కూడా కోరారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసీస్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఆసీస్ కంటేంట్ను నిలిపడం కన్నావేరే మార్గం కనిపించలేదని అన్నారు. ఇప్పటికే భారత ప్రధాని మోదీతోను, కెనెడాకు చెందిన జెస్టిస్ ట్రూడోతో చర్చించామని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. కాగా , నిషేధం విధించినప్పటి నుంచి స్వదేశీ, విదేశీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ నిషేధ ప్రభావంను ఇంకా ప్రజలు పూర్తిగా ఎదుర్కొలేదని అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మిల్లర్ కోరారు. ఇక్కడ చదవండి: ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా -
రకుల్ పిటిషన్పై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : రియా చక్రవర్తి డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని రకుల్ ప్రీత్సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో తన పేరు మీద వార్తలు రాయడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో రకుల్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టగా రకుల్ తరపున న్యాయవాది అమన్ హింగోరాని తమ వాదనలు వినిపించారు. నటి దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 17న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్చలను తీసుకున్నారో సూచిస్తూ స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. అలాగే మీడియాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్లను జస్టిస్ నవీన్ చావ్లా ఆదేశాలు జారీ చేశారు. అయితే రకుల్ తన పిటిషన్లో డ్రగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసి, తగిన నివేదికను కోర్టు ముందు దాఖలు చేసే వరకు మీడియా తనపై వార్తలు ప్రసారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే దీనిపై తక్షణమే ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను కోర్టు ఆక్టోబర్ 15కు వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా రియా చక్రవర్తిని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయట పడిన విషయం తెలిసిందే. రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్మెంట్ల ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా విచారించింది -
ఫేస్బుక్, గూగుల్కు షాకిచ్చిన ఆస్ట్రేలియా
కాన్బెర్రా: వార్తా కథనాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్ట్రేలియా మీడియాకు చెల్లించాలని ప్రముఖ డిజిటల్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ సంస్థలను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలను జరపాలను ఆర్థిక శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్బర్గ్ శుక్రవారం పేర్కొన్నారు. లేదంటే కోడ్ ఉల్లంఘించిన కారణంగా సదరు కంపెనీలపై దాదాపు 7 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 28 వరకు సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించి చట్టం అమల్లోకి తెస్తామని జోష్ ఫ్రైడెన్బర్గ్ వివరించారు. (అమెరికాలో టిక్టాక్ నిషేధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు) చాలాకాలంగా తమ కంటెంట్ను ఉపయోగిస్తూ డిజిటల్ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఆరోపించాయి. కాపీరైట్ కింద తమకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే తమ కంటెంట్ను వాడి డిజిటల్ సంస్థలు ఉచితంగా డబ్బును కూడగడుతున్నాయని ఫిర్యాదు చేశాయి. తమ ఉద్యోగులు ఎంతో కష్టపడి వార్తా కథనాలు ప్రసారం చేస్తే వాటిని ఇష్టారాజ్యంగా, ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వాడుకుంటున్నాయని పలు మీడియా సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీంతో ఆస్ర్టేలియా ప్రభుత్వం అక్కడి మీడియాకు మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ ముసాయిదా కోడ్ ఫేస్బుక్, గూగుల్ లాంటి అతి పెద్ద డిజిటల్ సంస్థలకే వర్తిస్తాయని, త్వరలోనే మరిన్ని సంస్థలకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (సెక్యూరిటీ గార్డుకు రూ.31 కోట్లు) -
పీసీఐ, ఎడిటర్స్ గిల్డ్పై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ: అత్యాచారాలు, లైంగిక దాడుల వార్తల రిపోర్టింగ్లో నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్డ్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ ముందు హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించాలని గతంలోనే కోర్టు పైన పేర్కొన్న మీడియా నియంత్రణ సంస్థలకు లేఖలు పంపింది. కాగా, గురువారం జరిగిన విచారణకు న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎన్బీఎస్ఏ) తరఫు లాయర్ మాత్రమే హాజరయ్యారు. లైంగిక దాడులు, రేప్ ఘటనలను రిపోర్ట్చేస్తున్న సమయంలో చట్టబద్ధ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని బెంచ్..ఎన్బీఎస్ఏ లాయర్ను ప్రశ్నించింది. -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, అమరావతి : యువనేస్తం పథకం ప్రారంభసభలో విద్యార్థులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు ఖంగుతిన్నారు. ఈ పథకం ఎన్నికల కోసమే పెట్టారా..ఎన్నికలు ముగియగానే ఈ పథకాన్ని మూసేస్తారా అని విద్యార్థులు ప్రశ్నించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) విద్యార్థుల ప్రశ్నలకు ఖంగుతిన్న చంద్రబాబు రేవంత్ గుట్టంతా ఆ హార్డ్డిస్క్లో ఉందా? కోల్కత్తాలో భారీ పేలుడు నోబెల్ : 55 ఏళ్లలో ఫిజిక్స్లో తొలిసారి మహిళకి... నా సినిమా ఆపాలని చూస్తున్నారు ‘ఇక ధోనిపై అంచనాలు తగ్గించుకోండి’ హైదరాబాద్కు భారీగా పెట్టుబడులు! -
బాబూమోహన్.. బంగ్లా ఫ్యాన్స్.. నేటి విశేషాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గజపతినగరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన రాజన్న తనయుడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ బీజేపీలో చేరిపోయారు. అగ్రరాజ్యం అమెరికాలో అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న తెలుగువాళ్లు భాషాపరంగానూ ముందంజలో ఉన్నారని వెల్లడైంది. ఇక బాలీవుడ్లో తనుశ్రీ దత్తా ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆసియాకప్ ఫైనల్లో మూడో అంపైర్ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు సోషల్ మిడియాలో కారాలు-మిరియాలు నూరుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘గజపతి’ నియోజకవర్గంలో ఘన స్వాగతం అమెరికాలో అన్నింటా తెలుగువారే! టీఆర్ఎస్కు మరో షాక్ నవవధువుపై సామూహిక అత్యాచారం మరి అక్షయ్ సంగతేంటి : తనుశ్రీ హవ్వా.. అది అవుటా? -
శబరిమల, రేవంత్.. నేటి ప్రధానాంశాలు
సాక్షి, హైదరాబాద్: శబరిమల ఆలయంలో మహిళలపై ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న పాత విధానాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. మరోవైపు ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు విచారించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కాగా, హైదరాబాద్లోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ నివాసం వద్ద పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. తనుశ్రీ దత్తా ఆరోపణలు, వన్డేల్లో మరో డబుల్ సెంచరీ.. మరిన్ని విశేషాలు మీ కోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) శబరిమల కేసు : సుప్రీంకోర్టు కీలక తీర్పు బాబును ఎందుకు వదిలేస్తున్నారు? రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత ఇమ్రాన్ ఖాన్పై భార్య ప్రశంసలు మరో బాంబు పేల్చిన తనుశ్రీ వన్డేల్లో మరో డబుల్ సెంచరీ -
అయోధ్య.. రేవంత్.. ఈరోజు విశేషాలు
సాక్షి, హైదరాబాద్: అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. తనను ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించగా, తమ ప్రమేయం లేదని టీఆర్ఎస్ పేర్కొంది. అవినీతికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారని వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. సమంత ట్రోలింగ్, వీరేంద్రుడి ట్వీట్ మరిన్ని విశేషాలు మీకోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్ హెచ్ 4 వీసా రద్దు వద్దు సమంత డ్రెస్సింగ్పై మళ్లీ రచ్చ! పాక్ ఓటమి.. సెహ్వాగ్ ట్వీట్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 271వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని లక్కవరపు కోట మండలం రంగరాయపురం నుంచి ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎస్. కోట అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుమారి సొంత ఊరు లక్కవరపుకోటలో జననేతకు జననీరాజనం పలికారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జననేతకు నీరాజనం పలికిన లక్కవరపుకోట కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా దంపతులు ఉగ్ర భయం 40మంది పోలీసుల రాజీనామా అందరూ చూస్తుండగానే అత్తాపూర్లో దారుణ హత్య బోయపాటికి బాలయ్య డెడ్లైన్..! బౌలింగ్ చేస్తావా.. నిన్నే మార్చాలా వివో వి 9 ప్రొ లాంచ్ : స్పెషల్ డిస్కౌంట్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 270వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్త వలస మండలం నుంచి ప్రారంభించారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్ జగన్ను కలిసిన దివ్యాంగులు, జిందాల్ కార్మికులు కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు..! మెగాస్టార్ టైటిల్తో చరణ్..! రాజీవ్ ఖేల్రత్న అందుకున్న కోహ్లి వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్లు మావో హత్యాకాండలో భీమవరం మహిళ! -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజాసంకల్పయాత్రలో నడిచేది తనే అయినా.. నడిపించేది మాత్రం ప్రజల అభిమానమేనని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస అని, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి దాటిందని స్పష్టం చేశారు. 269వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) నడిచేది నేను.. నడిపించేది ప్రజల అభిమానం: వైఎస్ జగన్ మెట్రో సేవలను వినియోగించుకోవాలి: గవర్నర్ అలుపెరుగని బాటసారి @ 3000 కి.మీ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సీనియర్ నటుడు టీ20 సిరీస్ భారత మహిళలదే పేటీఎం మాల్ సేల్ : ల్యాప్టాప్లపై ఆఫర్లు -
ఎమ్మెల్యే కాల్చివేత, వినాయక నిమజ్జనం ఇవే నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి వైఎస్సార్సీపీలో చేరిన రిటైర్డ్ డీఐజీ ఒక్కడే కానీ మూడు గెటప్స్ ఆసియాకప్ : పాక్దే బ్యాటింగ్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్ట్లందరికి ఇళ్లు స్థలాలు మంజూరు చేస్తామని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 267వ రోజు పాదయాత్రలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందచేశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు : వైఎస్ జగన్ హరీశ్రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు! రాఫెల్ డీల్ : రగులుతున్న రగడ నవాబ్ : అన్నదమ్ముల యుద్ధం! ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు: జడేజా జియోలో కొత్త ఐఫోన్లు -
ఈ రోజు ప్రధానాంశాలు.. ఒక్క క్లిక్తో
సాక్షి, హైదరాబాద్: తామేమి మనుషులను తినే పులులం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చూస్తే ఎలా అని మొట్టికాయలేసింది. మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. కుంతియాను దుర్భాషలాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నోటీసులు పంపింది. ప్రణయ్ హత్యపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈరోజు వార్తా విశేషాలు మరిన్ని మీకోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) అక్రమ మైనింగ్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు కోమటిరెడ్డి, వీహెచ్పై అధిష్టానం సీరియస్ అత్యధిక వేతనాలు పొందింది వారే! క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు ప్రణయ్ హత్యపై రాంగోపాల్వర్మ కామెంట్ ‘మా ఆయన కోసం కాదు.. దేశం కోసం చూస్తా’ -
ఒక్క క్లిక్తో.. ఈరోజు వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 24న మరో మైలురాయిని చేరుకోనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చిరస్థాయిలో గుర్తుంచుకునేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ముందుస్తు ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇక ఆసియాకప్లో టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడి స్వదేశానికి పయనమవుతున్నారు. ఈరోజు విశేషాలు మీ కోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) పాదయాత్ర @ 3,000 కిలోమీటర్ల మైలురాయి ఆజాద్ను చుట్టుముట్టిన ఆశావాహులు నా భార్యే కారణం: మనోహరచారి పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు కౌశల్ను సాగనంపేందుకు స్కెచ్? మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఔట్.. -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం సృష్టించింది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) హైదరాబాద్లో మరో మారుతీరావు సుప్రీంకోర్టు ముందుకు ‘ముందస్తు ఎన్నికలు’ ‘కోడెల’ తనయుడి వీరంగం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్కు గ్రీన్సిగ్నల్ బాలీవుడ్కు విజయ్ దేవరకొండ..! ఆ క్యాచ్ శ్రీశాంత్ వదిలేస్తే.. చెంప పగిలేది భలే ఆఫర్ : పెట్రోల్పై 50 శాతం డిస్కౌంట్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు అమరావతిలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కాగా టీచర్లను అరెస్ట్ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) టీచర్ల అరెస్ట్ను ఖండించిన వైఎస్ జగన్ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: రాహుల్ ప్రణయ్ కేసు: మీడియా ముందుకు నిందితులు 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ‘సమంత మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ’ టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన హాంకాంగ్ ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్ : 105జీబీ డేటా -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : భీమిలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడి పాలనపై మండిపడ్డారు. 264వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) భూములు కనిపిస్తే కబ్జా చేస్తున్నారు: వైఎస్ జగన్ ‘కారు’లోనే కొండా దంపతులు విజయ్ దేవరకొండ ‘నోటా’పై వివాదం నైట్రైడర్స్దే టైటిల్ సూ..పర్ సేల్ : రూ.500కే టికెట్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైంది.అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీనిలో భాగంగా బాక్సింగ్ క్రీడాకారిణి బగ్గు మౌనిక జననేతను కలిశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జగన్కు అడుగడుగునా వినతుల వెల్లువ జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్ సోదరుడు ‘షా అవసరం లేదు.. సామాన్యుడు చాలు’ ప్రశాంత్ కిషోర్ రాజకీయ అరంగేట్రం సైరా : ఒక్క సీన్కే 45 కోట్లు అందరివాడు ధోని ఉండగా.. టెన్షన్ ఎందుకు? పెట్రో షాక్ : సెంచరీ దిశగా ఇంధన ధరలు -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : బద్ధ విరోధి అయిన టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ-కాంగ్రెస్ చేతులు కలుపడం ప్రతికూల సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతుందని కాంగ్రెస్ నేతలు మథన పడుతున్నారు. టీడీపీతో పొత్తు ఇబ్బందికర పరిణామమేనని టీ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) టీడీపీతో పొత్తు.. టీ కాంగ్రెస్లో భిన్న స్వరాలు! ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం పంత్ ఇప్పుడే వద్దు: సెహ్వాగ్ కత్రినా హారతి.. నెటిజన్లు ఫైర్ విజయ్ మాల్యాకు ఎవరి సహకారం ? పెట్రో మంటలు : పేటీఎం భారీ ఆఫర్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం అనేక హామీలిచ్చి వాటన్నింటినీ తుగంలో తొక్కారని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దేశంలో ముస్లిలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం విశాఖపట్నంలోని ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ అసెంబ్లీ రద్దుపై హైకోర్టు కీలక తీర్పు బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో ఊరట ‘నా కెరీర్లో అవే చెత్త సినిమాలు’ సిరీస్ పోయినా.. ర్యాంక్ పదిలమే భారీగా పెరిగిన పేటీఎం నష్టాలు -
కొండంత విషాదం.. మహాకూటమి.. ఇవీ నేటి టాప్న్యూస్
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిలో 15 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం! ఎన్నికలకు సర్వం సిద్ధంకండి కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమి ‘అరవింద సమేత’లో బాలీవుడ్ టాప్ స్టార్..! సచిన్పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు జియో ఫోన్లలో వాట్సాప్: రికార్డ్ సేల్స్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు సుముచిత స్థానం కల్పిస్తామని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖలోని సిరిపురంలో బ్రాహ్మణ సంఘాలతో వైఎస్ జగన్ సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) గుడిని..గుడిలోని లింగాన్నీ దోచేశారు టీఆర్ఎస్లో హోరెత్తుతున్న అసమ్మతి మండుతున్న పెట్రోల్ : దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణ దండన వైరల్గా సమంత ‘కర్మ థీమ్’ చాలెంజ్ ఆఖరి ఇన్సింగ్స్లో కుక్ సెంచరీ సెన్సెక్స్ భారీ పతనం -
ముందస్తు హోరు.. వలసల జోరు..నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్రెడ్డి తనయుడు రామ్కుమార్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కండువా కప్పి రామ్కుమార్ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు బీజేపీకి ఝలక్.. కాంగ్రెస్లోకి మరో నేత ఒంటరిగానే పోటీ చేస్తాం 2019 ఎన్నికలు : మళ్లీ ఆయనకే పగ్గాలు! పవన్ మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడా..! ఆసియా కప్ ట్రోఫీ ఆవిష్కరణ రూ.1 కే హానర్ 9ఎన్ -
అసెంబ్లీ రద్దు.. సుప్రీం తీర్పు.. నేటి టాప్ న్యూస్ ఇవే
సాక్షి, హైదరాబాద్ : సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఎందుకు అనర్హులుగా ప్రకటించరని ప్రశ్నించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) అనుకూల మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులు వీరే సుప్రీం తీర్పు : డ్యాన్స్తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్ ‘దిగిపోయేటప్పుడూ కేసీఆర్వి అబద్ధాలే’ జపాన్ను వణికించిన భూకంపం ‘ముఖ్యమంత్రి పదవా.. మ్యూజికల్ చైర్స్ ఆటా?’ ద్రవిడ్ అంగీకరించాడు..కానీ ఆకట్టుకునే ఫీచర్లతో వివో వి11 ప్రొ లాంచ్ -
క్లిక్ చేయండి.. నేటి ముఖ్య వార్తల్ని తెలుసుకోండి..!
సాక్షి, సబ్బవరం : చంద్రబాబుకు విశాఖ భూములపై కన్ను పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బాబు గజానికో కబ్జాకోరును తయారు చేశారని నిప్పులు చెరిగారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) పెదబాబు పర్మిషన్, చినబాబుకు కమిషన్ : వైఎస్ జగన్ సొంత గూటికి డీఎస్! మోదీ, బాబుని సాగనంపే రోజులు వచ్చాయ్ మరోసారి నవ్వుల పాలైన అనుష్క అంచనాలు పెంచేసిన అమలాపాల్..! పెట్రోల్ ధరలు : నీతి ఆయోగ్ నిర్లక్ష్య వ్యాఖ్యలు ప్చ్.. పాతాళానికి రూపాయి పోలీసులపై దాడి చేసి మరీ.. కూతురి కిడ్నాప్! (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్ సెలూన్లకు డొమెస్టిక్ విద్యుత్ టారిఫ్ ఇచ్చానని కేసీఆర్ అబద్దం చెప్పారంటూ ఆయన విమర్శలు చేశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘చెట్ల మీద విస్తరాకుల్లాగా వాగ్దానాలు చేస్తున్నారు’ బాబు వ్యాఖ్యలకు నవ్వాలో, ఏడవాలో: టీజేఆర్ రిసెప్షన్ రోజే నవవరుడు ఆత్మహత్య బాలీవుడ్ సినిమాలో జగపతి బాబు లుక్ రాష్ డ్రైవింగ్పై సుప్రీం కీలక తీర్పు విండీస్తో టీమిండియా షెడ్యూల్ ఇదే.. కొడుకు స్వర్ణ పతకాన్ని చూడకుండానే.. అమెజాన్ ఇండియా సరికొత్త ప్రయోగం (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో... ఈరోజు ప్రధానాంశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ అనే యువకుడికి మృతికి సీఎం చంద్రబాబే కారణమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 2015లో చిత్తూరు జిల్లాలో తొలి బలవన్మరణం జరిగినపుడే సీఎం చంద్రబాబు మేల్కొని ఉంటే ఇలా జరిగేదా? అని ప్రశ్నించారు. మరోవైపు డీఎంకేలో సంస్కరణలకు ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీకారం చుట్టారు. దాస్యపు సంస్కృతికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాగా, టీమిండియా క్రికెటర్ బద్రీనాథ్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీకోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) త్రినాథ్ ఆత్మహత్యకు సీఎం కారణం కాదా? మధ్యయుగపు చక్రవర్తిలా కేసీఆర్ యవ్వారం స్టాలిన్ కాళ్లపై పడొద్దు.. రుణాలపై వడ్డీరేటు పెంచిన ఎస్బీఐ ప్రొఫెషనల్ బ్రదర్స్ క్రికెట్కు బద్రీనాథ్ గుడ్బై -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం వేలం వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం ఆదాయం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పి ..అడవుల్లో ఉన్న పచ్చదనన్నాంత మాఫీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫొటోలపై క్లిక్ చేయండి) ఎర్రచందనం వేలం వెనుక కుట్ర : భూమన 16 మంది సీఎంలు చేయనిది.. కేసీఆర్ చేశారు: డీకే అరుణ భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో ట్విస్ట్! మెగా మెర్జర్ పూర్తి : ఎయిర్టెల్ ఔట్ జయకు మహేష్ బాబు నివాళి కోహ్లి తడాఖ.. సచిన్ రికార్డు బ్రేక్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ‘‘ప్రజాసంకల్పయాత్ర’’ 250వ రోజుకు చేరుకుంది. గత ఏడాది నవంజర్ 6వతేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తైన పాదయాత్ర ప్రస్తుతం 11వ జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు జననేత 2842కి.మీ నడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) మరో మైలురాయిని దాటిన ప్రజాసంకల్పం! అధికార లాంఛనాలతో ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కవిత సీబీఐ కోర్టులో లొంగిపోయిన లాలూ అవార్డు విషయంలో అంగ్సాన్ సూకీకి ఊరట ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ 5 నిమిషాల్లో రూ. 200 కోట్లు ‘@నర్తనశాల’ మూవీ రివ్యూ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్ తనయుడు, రాజకీయ నాయకుడు, నటుడు హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ నడిపిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) నందమూరి హరికృష్ణ దుర్మరణం అనకాపల్లిని జిల్లా చేస్తా: వైఎస్ జగన్ ‘రద్దు చేశారు.. రోడ్డున పడేశారు’ ఏడాదికి 83 లక్షల జీతం! ‘చై విత్ సామ్.. వర్సెస్ కాదు’ టెస్ట్ క్రికెట్ను కాపాడండి: విరాట్ కోహ్లి (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడం సీఎం చంద్రబాబు నాయుడు వల్ల కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వెలిగొండ టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘సంక్రాంతి తర్వాత చంద్రబాబు ఇంటికి’ టీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు! ఆ ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే బీజేపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ మరోసారి దుమ్మురేపిన డ్యాన్సింగ్ అంకుల్ విరసం నేత వరవరరావు అరెస్ట్ ఎన్టీఆర్ బయోపిక్ : మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫైనల్లో ఓడిన సింధు.. రజతంతో సరి మార్కెట్లోకి మరో కంపెనీ : బడ్జెట్ ధర, అద్భుత ఫీచర్లు -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు. ‘ఏయ్ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఏయ్.. నీ అంతు చూస్తా : కాలవ శ్రీనివాసులు ‘మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాలు’ ఈవీఎంలు ఎక్కడ రిపేరు చేస్తున్నారు? 70 ఏళ్ల తర్వాత బయటడింది.. బ్యుటీషియన్ పద్మ కేసు: తెరపైకి నూతన్ భార్య పవర్ కంపెనీలకు భారీ షాక్ ద్యుతీచంద్కు భారీ నజరానా ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నా -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి , హైదరాబాద్ : మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం వెళ్లి ప్రజాసంకల్పయాత్రలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) 2న వైఎస్సార్ సీపీలోకి ఆనం ప్రధానితో కేసీఆర్ సమావేశం ఫొటోగ్రాఫర్కు బెదిరింపులు భారత వైమానిక సంస్థ భారీ విరాళం జగ్గూభాయ్ బయోపిక్! యో-యో టెస్టుపై అంబటి రాయుడు స్పందన ఆన్లైన్లో నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం ‘ఆయనకు బూతు సాహిత్య అవార్డు ఇవ్వాలి’ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 244వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన యలమంచిలి బహిరంగ సభలో ప్రసంగించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా: వైఎస్ జగన్ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు..! కేరళ వరదలు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చరిత్ర గుట్టు విప్పే ఉప్పు గని!! ఆధార్ "ఫేషియల్ రికగ్నిషన్" త్వరలో టీమిండియాలో కాకినాడ కుర్రాడు నేడు విడుదలైన సినిమాల రివ్యూలు -
ఒక్క క్లిక్తో నేటి వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఆయనకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ గురువారం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఆంధ్రకేసరికి వైఎస్ జగన్ ఘన నివాళి ఆయనతో విభేదాలు నిజమే: డీకే అరుణ యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి హెరిటేజ్, రత్నదీప్ షాప్లపై కేసు నమోదు మళ్లీ టాప్ లేపిన విరాట్ కోహ్లి సెన్సెక్స్ రికార్డు.. నిఫ్టీ ఫ్లాట్ ‘గోవిందుడు’ని మెచ్చుకున్న ఎంపీ కవిత -
ఈరోజు ప్రధానాంశాలు.. ఒక్క క్లిక్తో
సాక్షి, హైదరాబాద్: హస్తం పార్టీతో దోస్తీకి ‘సైకిల్’ అధినేత సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ నాయకుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్- చంద్రబాబు మధ్య రేవంత్రెడ్డి మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు వరదలతో అల్లాడుతున్న కేరళలో నకిలీ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక క్రికెట్లో కోహ్లి సేన భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీ కోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) చంద్రబాబు-రాహుల్ మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం ఏడాదికి రూ.70 లక్షల వేతనం చిరుకు పవన్ శుభాకాంక్షలు కేరళ వరదలు: అభిమానుల అత్యుత్సాహం! 2018 ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్ మూడో టెస్ట్: భారత్ ఘనవిజయం -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఆయనను కలిసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. ప్రజల కోసం వైఎస్ జగన్ పడుతున్న కష్టాలను చూసి పలువురు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్బాబు, టీడీపీ నాయకులు గెడ్డమూరి రమణ, మునగాడ చిరంజీవితోపాటు 200మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీలో పలువురి చేరిక తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట మోదీకే జనం జేజేలు కేరళకు భారీ విరాళమిచ్చిన ఎన్ఆర్ఐ వ్యాపారి యూపీ : భార్యను చంపి ఫ్రిజ్లో, పిల్లల్ని సూట్కేసులో.. విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ టీజర్ ఏషియన్ గేమ్స్: ‘రజత’ రాజ్పుత్ నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ లాంచ్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేశారని.. తాజాగా కాంగ్రెస్తో పెళ్లికి సిద్దమయ్యారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. విశాఖ జిల్లాలో 241వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన కోటవురట్ల బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఐదు పెళ్లిళ్లు చేసుకొని వదిలేశారు: వైఎస్ జగన్ కేరళ అప్డేట్స్ : బాబా రాందేవ్ రూ. 50 లక్షల సాయం రైతులపై మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు డెలివరీ కోసం సైకిల్పై వెళ్లిన మంత్రి! స్టోర్లోనే పేలిన ఐప్యాడ్ బ్యాటరీ బాలీవుడ్ సినిమాలపై ‘గోవిందుడి’ దెబ్బ విరాట్ కోహ్లి మరో రికార్డు (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని మండిపడ్డారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా? టీచర్స్ ట్రాన్స్ఫర్లలోనూ అవినీతి బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి ఆ టైమ్ దాటితే ఏటీఎంల్లో నగదు నింపరు.. రియల్ హీరో.. ఓ బాలుడిని కాపాడేందుకు బిగ్బాస్లో ‘అర్జున్ రెడ్డి’ టీమిండియా ఆలౌట్.. రికార్డు సొంతం (వార్తాల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయడి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ‘మరణమా నా కెందుకు భయమంటూ’ దివికేగారు. ఇక సెలవంటూ యమునా నది తీరంలోని స్మృతి స్థల్లో సేద తీరారు. అశేష జనవాహిని, ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఇక సెలవంటూ సేదతీరిన కర్మయోగి భారత్కు విదేశీ నేతలు 20 లక్షల ఉద్యోగాలన్నారు.. ఏమైంది? 167కు చేరిన కేరళ వరద మృతులు ఆయన శాంతికోసం కృషి చేశారు: ఇమ్రాన్ ఖాన్ డేటా స్టోరేజీపై.. వాట్సాప్ గుడ్ న్యూస్ ‘ఝాన్సీ’ మూవీ రివ్యూ మహిళా క్రికెట్లో ఓ అద్భుతం (వార్తాల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయడి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్ : దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శం : కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్ కేరళ కకావికలం : ఓనం ఉత్సవాలు రద్దు అమెరికా టెక్ దిగ్గజాలకే షాకిచ్చాడు! జియోఫోన్: యూట్యూబ్ వస్తోంది, మరి వాట్సాప్.. ‘గీత గోవిందం’ మూవీ రివ్యూ రవిశాస్త్రి వద్దు.. ద్రవిడ్ ముద్దు! (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై స్థానిక పీసీసీలదే తుది నిర్ణయమని ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) టీడీపీతో పొత్తు అవకాశాలు: రాహుల్ రజనీకాంత్ పార్టీలోకి కరుణానిధి కుమారుడు? హజ్ యాత్రికులతో చంద్రబాబు పార్టీ స్లోగన్స్ జమిలిపై తేల్చేసిన ఈసీ ‘మోదీకి పెళ్లి సంబంధం చూస్తాను’ బ్యాంకుకు హ్యాకర్ల భారీ షాక్.. 94 కోట్లు లూటీ! క్రికెట్లో అత్యంత అరుదైన సందర్భం తన సీమంతంలో డ్యాన్స్తో అదరగొట్టిన నటి (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ(89) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కోల్కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) సోమ్నాథ్ చటర్జీ కన్నుమూత చంద్రబాబే డాన్ జీఎస్టీ అంటే తెలుసా?: రాహుల్ జయలలిత, కరుణానిధికి భారతరత్న? ఉమర్ ఖలీద్పై కాల్పులు.. హై సెక్యూరిటీ జోన్లో ఘటన! వరద నీటిలో వచ్చిన పెళ్లి కూతురు, వైరల్ కాజల్, అల్లుడు శీను వెరైటీ ‘కీకీ’ వీడియో పోరాడకుండానే లొంగిపోతే ఎలా?: సెహ్వాగ్ (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
‘తనే నా హీరో’
సోనాలీ బింద్రే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక షో షూటంగ్ నిమిత్తం న్యూయార్క్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోనాలీని కలిశారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘నేను సోనాలీతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించాను. బయట కూడా చాలాసార్లు తనని కలిశాను. తనేప్పుడు నవ్వుతూ.. ప్రశాంతంగా ఉండేది. కానీ నేను ఇన్ని రోజుల చూసిన సోనాలీకి.. ఓ 15 రోజులుగా చూస్తోన్న సోనాలీకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను ‘తనే నా హీరో’ అని’ అంటూ ట్వీట్ చేశారు. I have done few films with @iamsonalibendre. We’ve met socially many times in Mumbai. She always has been bright & a very warm person. But it is only in the last 15days that I got the opportunity to spend some quality time with her in NY. And I can easily say,”She is my HERO.”😍 pic.twitter.com/z6iBe2s7fy — Anupam Kher (@AnupamPKher) August 12, 2018 ట్వీట్తో పాటు చికిత్సకు ముందు సోనాలీ జుట్టు కత్తిరించుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటోను కూడా అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. గతంలో వీరిద్దరు కలిసి ‘హమరా దిల్ ఆప్నే పాస్ హై’, ‘దిల్ హై దిల్ మైనే’,‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ వైద్య నేపధ్యంలో సాగే డ్రామా ‘న్యూ ఆమస్టర్డ్యామ్’ చిత్రకరణ నిమిత్తం న్యూయార్క్లో ఉన్నారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్, బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఒక్క క్లిక్తో నేటి వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : అధికార టీడీపీ నాయకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు అయితే ఈడీ కేసు ఎందుకు పెట్టిందని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నాయకులు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై అంబటి ఫైర్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధర్మపురి సంజయ్ అరెస్ట్.. భారీ వసూళ్లు సాధిస్తోన్న ‘విశ్వరూపం 2’ బాబు గోగినేని కథ ముగిసింది! కోహ్లి ఒక్కడి వల్ల కాదు సారీ..! ఇమ్రాన్ : గావస్కర్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయమని... ఇసుక, మట్టి, గుడి భూములు సహా దేన్నీ వదలడం లేదని.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగలబెట్టించిన ఘనుడు ఏపీ సీఎం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం తుని పట్టణానికి చేరుకుంది. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) రైలు తగలబెట్టించిన ఘనుడు చంద్రబాబు ఇనుప కంచెలను దాటుకుని వెళ్తాం స్టాలిన్కు పట్టాభిషేకం మాకూ జీవించే హక్కుంది; పవన్ కల్యాణ్ ‘నిన్ను చాలా మిస్సవుతున్నా.. కానీ ఏం చేయను’ కోహ్లి ఒక లెజెండ్ 10వేల కంటే తక్కువకే 3 స్మార్ట్ఫోన్లు ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్ డే’ సేల్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : హోదా పదేళ్లు ఇస్తామని మోదీ, కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రగల్భాలు పలికి రాష్ట్రాన్ని మోసం చేసి, మరో సారి ప్రజలను వంచించేందుకు నడుంబిగించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేయడం కోసం గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా సాధ్యం’ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి! జర్నలిస్టు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా.. కేరళను వణికిస్తున్న వరదలు దూసుకుపోతున్న ‘మహర్షి’ టీజర్ ఐపీఎల్ విలువ రూ. 43 వేల కోట్లు పేటీఎం మాల్ ‘ఫ్రీడం క్యాష్బ్యాక్’ సేల్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై మెరీనా బీచ్లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరిగాయి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) కరుణానిధి అంత్యక్రియలు వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్ ఎన్డీఏ అభ్యర్థికే సేన మద్దతు షావోమి కొత్త ఫోన్ విశ్వరూపం-2 వాయిదా! కోహ్లి సరికొత్త చాలెంజ్ వాట్సాప్లో ఆ ఫీచర్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి ‘ఉగ్ర’ కలకలం రేగింది. పాతబస్తీలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించి ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ ముష్కరులు ఏదైనా ఘాతుకానికి పాల్పడనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీలో చేరిన నటుడు కృష్ణుడు అవును..ఉద్యోగాలు ఎక్కడున్నాయ్..? ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం! ఎఫ్డీలపై వడ్డీ రేటు పెంచిన హెచ్డీఎఫ్సీ శుభలేఖ పంపండి.. పట్టు వస్త్రాలు పొందండి! కోహ్లిని అవమానించే యత్నం.. వైరల్ (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోల మీద క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి ప్రధాన వార్తలు..!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బోనాల సందడి వెల్లివిరిసింది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. లాల్దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నేటి మరిన్ని వార్తాకథనాలు ఇవి.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) మోదీ అవినీతిని బయటపెడదాం ‘అప్పుడు దళితులు.. ఇప్పుడు కాపుల వంతు’ వారి గుండెల్లో వణుకు మొదలైంది: మలాల ప్రపంచ చాంపియన్షిప్లో సింధుకు పరాభవం పాండ్యాతో పెళ్లి.. కన్ఫ్యూజ్ చేసిన ఈషా ప్రైవేటు స్కూల్స్, కాలేజీల ఫీజులకు కళ్లెం: వైఎస్ జగన్ ఘనంగా బోనాలు.. క్యూ కట్టిన ప్రముఖులు! (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి 11 వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇరువురు నేతలు 45 నిమిషాలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారన్నది తెలియాల్సి ఉంది. హైకోర్టు విభజనను త్వరగా పూర్తి చేయాలని, కొత్త జోన్ల విధానానికి కేంద్రం ఆమోదం తెలపాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) 11 వినతిపత్రాలు.. కేసీఆర్-మోదీ ఏకాంత భేటీ! ‘బాబు అవినీతిలో మీకు భాగస్వామ్యం లేదా?’ ఏకైక మహిళా సీఎం పేరు కూడా గల్లంతు! ‘సీఎంను చంపేస్తా’.. కత్తితో హల్చల్ జమ్మూకశ్మీర్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. వాట్సాప్ యాడ్.. హీలర్ భాస్కర్ అరెస్ట్ భారీ విస్పోటనం.. అంతుచిక్కని సిగ్నల్స్! కోర్టు ఆదేశాలు : సల్మాన్ ఆశలు ఆవిరి! తొలి టెస్టులో టీమిండియాకు షాక్ ఆ నెంబర్ మా పొరపాటే : గూగుల్ (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: గత లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై నెగ్గి, ఫిరాయించిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత వి. విజయసాయిరెడ్డి కోరారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి’ సొంత ప్రభుత్వంపై సిద్ధు సంచలన వ్యాఖ్యలు! షెల్టర్ షేమ్పై స్పందించిన నితీష్ కుమార్ రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది దక్షిణాఫ్రికా సంచలన నిర్ణయం ఇండిపెండెన్స్ డే సేల్ : స్మార్ట్ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు సచిన్ రికార్డ్ మళ్లీ బ్రేక్ చేసిన కోహ్లి ‘గూఢచారి’ రివ్యూ : ఇండియన్ జేమ్స్ బాండ్ మూవీ (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా ప్రపంచం
సాక్షి, హైదరాబాద్: తమ సామాజిక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుష్క వాగ్దానాలు చేయకుండా, నికార్సైన హామీలు ఇచ్చిన రాజన్న తనయుడిని మనసారా అభినందిస్తున్నారు. ‘అబద్ధాలు చెప్పలేను.. ఏం చేయగలనో అదే చెబుతానంటూ’ జనవాహిని సాక్షిగా ప్రమాణం చేసిన జననేతకు ధన్యవాదాలు చెబుతున్నారు. వైఎస్ జగన్కు సన్మానం జగన్ వల్లే హోదా సజీవం ‘తెలంగాణలొ నేరం చేయాలంటే భయపడాల్సిందే’ రామగుండం మేయర్పై నెగ్గిన అవిశ్వాసం ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును చేపడతాం : రాజ్నాథ్ సరికొత్త ఫీచర్లతో బ్లాక్బెర్రీ స్మార్ట్ఫోన్లు కేసు నమోదు : చిక్కుల్లో బిగ్బాస్ 2 ఇమ్రాన్ కోసం పాక్కు వెళ్తాం : భారత దిగ్గజ క్రికెటర్లు అశ్విన్ ‘తొలి’ ఘనత వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: ఓట్లను దండుకోవడానికే 2014 ఎన్నికల్లో టీడీపీ కాపుల రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చి మాట తప్పిన చంద్రబాబు మోసగాడని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లపై ఉద్యమం చేపట్టిన తర్వాతే చంద్రబాబు కమిషన్ వేశాడని గుర్తు చేశారు. ‘ఎన్నికల వేళ కాపులంటే బాబుకు ప్రాణం’ మోదీ ఇస్తున్నారు..బాబు తీసేస్తున్నారు గడ్డం తీసుకోకపోతే సన్నాసుల్లో కలిసిపోతారు అద్వానీతో దీదీ భేటీ లాటరీలో భారతీయునికి రూ.6.8 కోట్లు దాని దూకుడు ముందు శాంసంగ్, ఆపిల్ ఔట్ గొడవపై క్లారిటీ ఇచ్చిన ఫిదా హీరోయిన్ కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆసీస్ మీడియా వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి -
ఒక్క క్లిక్తో నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని తీర్పు వెలువరించింది. తమకు విధించిన ఉరి శిక్షను రద్దు చేసి, జీవిత ఖైదుగా మార్చాలంటూ నిర్భయ కేసు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కింద కోర్టులు విధించిన ఉరి శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దోషులు చేసింది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. నిర్భయ కేసు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని తీర్పు వెలువరించింది. ప్రజా సొమ్ము వృథా కూడా అవినీతే! సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్లోని జైపూర్లో శనివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ప్రభుత్వం నిధులను భారీగా ఖర్చు చేయడం ఎంత మేరకు భావ్యమని విజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో అమిత్ షాకు చేదు అనుభవం సాక్షి, చెన్నై : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు తమిళనాడులో ఊహించని షాక్ తగిలింది. తాజ్ వద్ద నమాజ్ వద్దు: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : ‘తాజ్మహల్ ఏడో ప్రపంచ వింత.. కాబట్టి ఇక మీదట అక్కడ వద్ద నమాజ్ చేయరాద’ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్లలో బాబు చేసిందేమీ లేదు: కన్నా సాక్షి, ప్రకాశం: చంద్రబాబు నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డిని, పవన్ కల్యాణ్ని తిట్టుకుంటూ బతకడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. కత్తి మహేశ్ను అందుకే బహిష్కరించాం : డీజీపీ సాక్షి, హైదరాబాద్ : గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు అవిశ్వాసం ఆపేయండి! సాక్షి, పెద్దపల్లి: రామగుండం అవిశ్వాస రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది భారత్ నుంచి ఆ దేశానికే అత్యధిక వలసలు సాక్షి, న్యూఢిల్లీ : నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలపై ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన తాజా నివేదిక కోహ్లిసేనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్! బ్రిస్టల్ : భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాగన్ ఫైర్ అయ్యాడు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’ ముంబై: సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. -
అమ్మా..నాన్న.. ఓ సెల్ఫోన్!
న్యూయార్క్ : తల్లిదండ్రులు.. మీరు సెల్ఫోన్కు దగ్గరవుతున్నారా?.. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయాన్ని సెల్ఫోన్ వాడుతూ వృథా చేస్తున్నారా?.. అయితే మీ పిల్లలు మీకు దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దలు పిల్లలతో హాయిగా గడపాల్సిన సమయంలో సెల్ఫోన్ వాడుతూ ఉంటే పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా పిల్లలు క్రూరప్రవర్తన, చెడు ప్రవర్తనకు అలవాటుపడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ప్రతిరోజు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ముఖాముఖి సంభాషణలు లేకపోవటాన్ని ‘టెక్నోఫెరెన్స్’ అని నామకరణం చేశారు. పిల్లల చెడు ప్రవర్తన నుంచి తప్పించుకోవాలని తల్లిదండ్రులు సెల్ఫోన్ను ఆశ్రయిస్తే అది వారిని మరింత నాశనం చేస్తుందంటున్నారు. రోజులో కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించటం ద్వారా వారు తల్లిదండ్రులకు మరింత దగ్గరవుతారని, వారికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ కనబరుస్తూ ఉండటం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుందని అంటున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమస్యలు ఎక్కువవ్వటానికి గల ముఖ్య కారణం సెల్ఫోన్ వాడకమేనని పేర్కొన్నారు. -
న్యూస్ రీడర్లకు భాషతో పాటు సమయస్ఫూర్తి ముఖ్యం
వివేక్నగర్ : టీవీలో వార్తలు చదివేవారికి స్పష్టమైన ఉచ్ఛారణతోపాటు భాష మీద పట్టు, సమయస్ఫూర్తి ముఖ్యమని వక్తలు అన్నారు. లలిత కళా స్రవంతి ఈవీ రాజయ్య అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో టీవీ న్యూస్ రీడర్లు, యాంకర్లకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి డి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతతతోపాటు స్నేహ సంబంధాలు బలపడతాయన్నారు. అవార్డులు ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని అవి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. సాక్షి టీవీ న్యూస్ రీడర్ అనుశ్రీతోపాటు పలువురిని సత్కరించారు. సభలో జి.అన్నప దీక్షితులు, జి.సుజయ బాల, ఇ.విశ్వేశ్వరరావు, ఇ.శైలజ, ఎ.మహేష్బాబు, యం.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఎన్.రమాదేవి విష్య బృందం భరత నాట్య ప్రదర్శన ఇచ్చింది.వరంగల్ కు చెందిన యు.లక్ష్మణాచారి శిష్య బృందం అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. -
సగం కోడి.. సగం మనిషి!
వాషింగ్టన్: ఇదేదో కామిక్ క్యారెక్టరో, సూపర్ హీరో ఫీచరో కాదు! పిండం ఎలా అభివృద్ది చెందుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చేపట్టిన అరుదైన, వినూత్న ప్రయోగం. అయితే ఫలితం సైంటిస్టులు ఊహించిన విధంగా కాకుండా మరోలా వచ్చింది. అలా ‘సగం కోడి-సగం మనిషి’ ఆకారం దర్శనమిచ్చింది! వింతగొలిపేలా ఉన్న ఈ ప్రయోగఫలంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, జోకులు పేలుతున్నాయి కూడా!! ఇక వివరాల్లోకి వెళితే... అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల రాక్ఫెల్లర్ యూనివర్సిటీలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇటీవలి కాలంలో ఆ యూనివర్సిటీ.. బయోలాజికల్, మెడికల్ సైంటిఫిక్ రీసెర్చ్లకు కేంద్రంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. కోడి గర్భస్థ పిండంలోకి మానవ కణాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు.. తద్వారా పిండం ఎలా అభివృద్ధి చెందుతుందో అధ్యయనం చేయాలనుకున్నారు. ప్రొఫెసర్ అలీ బ్రివ్యానులౌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఆ ప్రయోగం కాస్త చివరకు సగం మనిషి-సగం కోడి పిండంగా రూపాంతరం చెందింది. ఈ ప్రయోగం సఫలమైనట్లుగానీ, విఫలమైనట్లుగానీ పేర్కొనని శాస్త్రవేత్తలు.. సగం మనిషి-సగం కోడి పిండ రూపం మాత్రం అరుదైనదిగా చెబుతున్నారు. -
మీడియా రంగంలోకి ఎలన్ మస్క్....?
న్యూయార్క్ : ‘జర్నలిజం అతి పురాతనమైన, పవిత్రమైన వృత్తి. ఒకప్పుడు వార్తాపత్రిక అంటే విశ్వసనీయతకు మారుపేరు. మరి నేడు.. అధికారంలో ఎవరూ ఉంటే వారికి కొమ్ముకాసి, భజన చేసి ప్రజల దృష్టిలో వారిని దేవుళ్లను చేసి అసలు నిజాలను ప్రజలకు తెలియకుండా.. తాము చెప్పిందే అక్షరసత్యంగా భ్రమింపచేసే అందమైన అబద్ధంగా మారింది. సమాజంలో ఉన్న అన్ని పత్రికలు ఇలానే ఉంటాయని చెప్పడం లేదు. కానీ ఎక్కువ శాతం ఇలానే ఉంటాయనేది బహిరంగ రహస్యం. పత్రికలకైనా, విలేకరులకైనా ముఖ్యంగా ఉండాల్సింది విశ్వసనీయత. కానీ నేడది నేతి బీరకాయ చందంగా తయారైంది. విలువలు పాటించడంలో తమకు సాటి మరెవరూ లేరని బీరాలు పలికే పత్రికా యజమాన్యాల అసలు రూపం అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి నేను ఒక నూతన మార్గాన్ని కనుగొన్నాను. ఇందుకు గాను నేను ఒక వెబ్సైట్ రూపొందిస్తున్నాను. ఇక్కడ మీరు ప్రతి జర్నలిస్టు విశ్వసనీయతకు మార్కులు ఇవ్వొచ్చు. మీరు చదివే ప్రతి కథనానికి సంబంధించి అసలు వాస్తవాలను తెలపవచ్చు. దాని ఆధారంగా సదరు పత్రిక, దాని యాజమాన్యం, ఆ విలేకరి విశ్వసనీయతను విశ్లేషించి మార్కులు ఇవ్వొచ్చు’ అంటున్నారు ప్రపంచ బిలియనీర్, స్పేస్ ఎక్స్ కంపెనీ యజమాని, టెస్లా ఇంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలన్ మస్క్. ఎలన్కు మీడియా మీద ఇంత కోపం రావడానికి కారణం.. కొన్ని నెలలుగా టెస్లా కంపెనీ విడుదల చేసిన సెడాన్ మోడల్ 3 కార్ల గురించి మీడియాలో వరుసగా ప్రతికూల కథనాలు ప్రచురితమవుతున్నాయి. పోయిన వారం కూడా ఒక ప్రముఖ వార్త పత్రిక టెస్లా కంపెనీ సెడాన్ మోడల్ 3 కార్లో బ్రేకింగ్ వ్యవస్థ సరిగా లేదని.. అంతేకాక సెడాన్ మోడల్ 3 కార్లు ఎక్కువగా క్రాష్ అవుతున్నాయని ప్రచురించింది. దీనిపై స్పందిస్తూ ఎలన్ త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ప్రమాణం చేశారు. తమ కార్లకు సంబంధించి ఎన్నో మంచి విషయాలు ఉన్నా కూడా మీడియా సంస్థలు లోపాలనే ఎక్కువగా ప్రచురించి ప్రజల్లో కంపెనీ పట్ల ఉన్న నమ్మకాన్ని నీరుగార్చటంతో తానే స్వయంగా మీడియా రంగంలోకి ప్రవేశించాలని భావించారు మస్క్. దాన్ని గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు. పత్రికల వారికి అసలు నిజాలు తెలిసినప్పటికీ వారు చక్కర పూత పూసిన తియ్యని అబద్దాలనే ప్రచారం చేస్తారు. ఎందుకంటే తమ వెబ్సైట్లను/ పత్రికలను ఎక్కువ మంది చూడాలని వారు కోరుకుంటారు. ఎంత ఎక్కువ మంది తమ వెబ్సైట్/పత్రికను చూస్తే వారికి అంత ఎక్కువ మొత్తంలో ప్రకటనలు వస్తాయి. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. అందుకే వారు ఎక్కువగా అహేతుకమైన వాటినే ప్రచురిస్తారని మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి తాను ఒక వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఆలోచన తనకు పోయిన ఏడాదిలో వచ్చిందని వెంటనే తన ఆలోచనను తమ న్యూరాలింక్ కంపెనీ అధ్యక్షుడితో పంచుకున్నానన్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మేము ‘ప్రావ్దా క్రాప్(సత్యం) వెబ్ సైట్ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రావ్దాను కాలిఫోర్నియాలో రిజిస్టర్ చేయించడం కూడా జరిగిందన్నారు. ఈ విషయాన్ని మస్క్ తన ట్విటర్లో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే దాదాపు 54 వేల మంది ఎలెన్కు తమ మద్దతును తెలిపారు. అయితే ఎలన్ వెబ్సైట్ గురించి టెక్ వెబ్సైట్లో ట్రాన్స్పోర్టేషన్ రిపోర్టర్గా పనిచేసే ఆండ్రూ జే. హకిన్స్ ట్రంప్ గురించి ప్రచారం చేయడానికి మరో కొత్త మీడియా రంగంలోకి ప్రవేశిస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ ఎలన్ ‘అంటే ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని(మీడియా) విమర్శిస్తే మీరు వారిని ట్రంప్తో పోలుస్తారన్నమాట. మంచిది మరి ఎన్నికల సమయంలో మీరు ట్రంప్ గురించి ఎంత చెడుగా ప్రచారం చేసిన అతనే గెలిచారు. ఇది ఎందువల్ల జరిగిందో మీకు తెలుసా ఎందుకంటే ప్రజలకు మీ మీద విశ్వాసం లేదు. ఎన్నో ఏళ్ల క్రితమే మీరు దానిని కోల్పోయారు’ అని రీట్విట్ చేశారు. -
25వ అంతస్తు నుంచి దూకేసిన ప్లేబాయ్ మోడల్
న్యూయార్క్ : మరో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్లేబాయ్ మోడల్, రచయిత స్టెఫానీ ఆడమ్స్ తన ఏడేళ్ల కొడుకుతో కలిసి 25వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మిడ్టైన్ మాన్హాటన్లోని గౌతమ్ హోటల్ పై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 25వ అంతస్తు పెంట్హౌజ్ నుంచి కొడుకుతో పాటు దూకిన స్టెఫానీ, రెండో ఫ్లోర్లో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయినట్టు అక్కడి పోలీస్ అధికారులు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్యనా? హత్యనా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. హోటల్ మేనేజ్మెంట్ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. స్టెఫానీ తన భర్త చార్లెస్ నికోలైతో విడిపోయారు. కొన్ని నెలల క్రితమే వారు విడిపోయినట్టు ఆడమ్స్ తరుఫున విడాకుల కేసు వాదించిన న్యాయవాది తెలిపారు. అయితే ఆమెను డిప్రెషన్ వెన్నాడటం లేదని, కానీ కొన్ని సమస్యలతో ఆమెను ఇటీవల ఊపిరి పీల్చుకోనియకుండా చేస్తున్నాయని చెప్పారు. దీనిలో సమస్యలతో పాటు డిప్రెషన్ కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఆమె అంత మంచి వ్యక్తిని(స్వీటెస్ట్ పర్సన్) ఇప్పటి వరకు తాను కలువలేదని తెలిపారు. ఆడమ్స్ ప్లే బాయ్స్ ‘మిస్ నవంబర్’గా 1992లో నిలిచారు. ఆమెకు రెండు బిజినెస్ డిగ్రీలున్నాయి. పలు పుస్తకాలను కూడా రాశారు. ఆన్లైన్ బ్యూటీ ప్రొడక్ట్ల కంపెనీ నిర్వహించారు. తన భర్త ఆఫీసులో ఆమె ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వారు. కానీ కొన్ని నెలల క్రితమే ఈ ఇరువురు విడిపోయారు. -
గూగుల్ న్యూస్ మార్పులు గమనించారా
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన ప్లే న్యూస్ స్టాండ్ యాప్ను న్యూస్ యాప్గా మార్చింది. ఈ న్యూస్ యాప్లో కొత్త ఫీచర్లను జత చేసింది. డెవలపర్ కాన్ఫరెన్స్లో ఇటీవల చేసిన వాగ్దానం నేపథ్యంలో గూగుల్ అధికారికంగా ఐవోఎస్కోసం "గూగుల్ న్యూస్" యాప్ ను ప్రారంభించింది. న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యాప్ను మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీతో రూపొందించింది. ఈ కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్ఫాంలపై వచ్చే వారం నుంచి లభ్యం కానుంది. ఫర్ యు, ఫుల్ కవరేజ్, న్యూస్ స్టాండ్ అనే మూడు ఎంపికలతో వస్తుంది, ఈ క్రమంలో, 2014 లో ప్రారంభించిన గూగుల్ ప్లే న్యూస్ స్టాండ్ను యూజర్లు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారంలో ఈ కొత్త యాప్ అప్డేట్ 127 దేశాల యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది. గూగుల్ న్యూస్ యాప్ పూర్తిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తుంది. యూజర్లకు చెందిన ప్రాంతం, భాష తదితర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అందుకు తగిన విధంగా న్యూస్ అప్డేట్లను సదరు యాప్లో అందిస్తుంది. ఫర్ యూ అనే ఫీచర్ సహాయంతో యూజర్లు అత్యంత ముఖ్యమైన వార్తలు ఐదింటిని తెలుసుకోవచ్చు. యూజర్ అభిరుచులకు అనుగుణంగా ఇవి యాప్లో కనిపిస్తాయి. అలాగే ఫుల్ కవరేజ్ అనే మరో ఫీచర్ కూడా ఈ యాప్లో లభిస్తుంది. దీని వల్ల ఏదైనా అంశం గురించి లోతుగా పూర్తి సమాచారాన్ని రియల్ టైంలో యూజర్లు తెలుసుకోవచ్చు. ఎక్కువగా స్థానిక వార్తలు యూజర్లకు తెలిసేలా న్యూస్ యాప్లో సదుపాయం కల్పించారు. దీని వల్ల యూజర్లకు తమ చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం. న్యూస్ స్టాండ్ ఆప్షన్లో , వెబ్ వార్త కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం స్పెషల్ స్ప్లాష్ పేజీని క్రియేట్ చేసింది. తద్వారా మొబైల్ బ్రౌజర్ ద్వారా బౌన్సింగ్ బెడద లేకుండా చాలా క్విక్ అండ్ క్లీన్గా వార్తలను లోడ్ చేస్తుంది. అంతేకాదు ఫేవరేట్ సెక్షన్ అనే మరో ఆప్షన్ను కూడా జోడించింది. దీని ద్వారా అభిమాన స్టార్ల వార్తలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు కంటెంట్ను సేవ్ చేసుకుని తీరిక ఉన్నపుడు చదువుకునే అవకాశం ఉంది. -
ఇక అమెజాన్లో బాడీ త్రీడీ స్కానింగ్
ముంబై : ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీది ఆన్లైన్లోనే కొనడం అలవాటైంది. అయితే ఆన్లైన్లో ఎక్కువ మంది ఎలాక్ట్రానిక్, కాస్మోటిక్ ఉత్పత్తులనే కొనడానికి మొగ్గు చూపుతారు. బట్టలు, చెప్పులు వంటివి కొనాలంటే మాత్రం కాస్త ఆలోచిస్తారు. కారణం... సరైన సైజు దొరకదని, రంగు వంటి వాటి విషయాల్లోను తేడాలు ఉంటాయని. అయితే ఇక మీదట ఈ ఇబ్బందులు ఉండవంటోంది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. ఈ ఇబ్బందులకు పరిష్కారాన్ని కనుక్కోవడం కోసం అమెజాన్ ఒక నూతన సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. త్వరలో అమెజాన్ త్రీడీ బాడీ స్కానింగ్ ఆప్షన్ను తీసుకురానున్నట్లు తెలిపింది. అమెజాన్ రూపొందిస్తున్న ఈ నూతన టెక్నాలజీ ద్వారా వినియోగదారుల శరీరాన్ని త్రీడీ స్కానింగ్ చేసి వారికి సరిగ్గా సరిపోయే దుస్తులు, చెప్పులు వంటి వాటిని సూచిస్తుంది. దీనిని పరీక్షించడం కోసం స్వచ్చంద సహాయకులను ఆహ్వానించింది. వీరంతా నెలకు రెండు సార్లు న్యూయార్క్లో ఉన్న అమెజాన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. వీరిని ఇలా స్కాన్ చేయడం ద్వారా తాము రూపొందిచబోయే నూతన సాంకేతికతకు మానవ శరీరంలో జరిగే మార్పులును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇలా వచ్చే సహాయకులకు 250 డాలర్ల విలువ చేసే గిఫ్ట్ కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక ఆన్లైన్లోనే వినియోగదారులు తమకు నప్పే దుస్తులు, చెప్పులను ఎంచుకోవచ్చని, ఫలితంగా రిటర్న్ వచ్చే ఆర్డర్ల సంఖ్య బాగా తగ్గుతుందని తెలిపారు. -
నాన్ స్టాప్ విమానాలు వచ్చేస్తున్నాయ్
సింగపూర్ : నాన్-స్టాప్ బస్సులు, రైళ్లే కాదు ఇక మీదట నాన్-స్టాప్ విమానాలు రానున్నాయి. అవును ప్రపంచంలోనే తొలి నాన్-స్టాప్ విమానాన్ని ప్రారంభించనున్నట్లు సింగపూర్ విమానయాన సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ విమానం ఏకధాటిగా 20 గంటల పాటు గాలిలోనే ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. సింగపూర్ విమానయాన సంస్థ నూతనంగా ప్రారంభించబోయే ‘ఎయిర్బస్ ఏ350 - 900 యూఎల్ఆర్’(అల్ట్రా లాంగ్ రేంజ్) విమానం ఈ ఘనతను సాధించబోతుందని పేర్కొన్నారు. ఈ విమానం సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకూ 20 గంటల పాటు ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని గురువారం నాడు అధికారులు ప్రకటించారు. గతంలో 9 వేల మైళ్ల దూరాన ఉన్న న్యూయార్క్ వెళ్లడానికి ఈ విమానయాన సంస్థ గ్యాస్తో నడిచే నాలుగు ఇంజిన్లు గల ‘ఏ340 - 500’ విమానాలను ఉపయోగించేది. అయితే ఈ విమానంలో కేవలం వంద బిజినెస్ క్లాస్ సీట్లు మాత్రమే ఉండేవి. అంతేకాక వీటి సేవలు కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో సింగపూర్ విమానయాన సంస్థ వీటిని 2013లో రద్దు చేసింది. ఈ ‘ఎయిర్బస్ ఏ340 - 500’ స్థానంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న ‘ఎయిర్బస్ ఏ350 - 900’లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలాంటివి మొత్తం ఏడు అల్ట్రా లాంగ్ రెంజ్ విమానాల కొనుగోలుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏ350 - 900 విమానాన్ని ఈ నెల 23న దాదాపు ఐదు గంటల పాటు పరీక్షించిన అనంతరం ఫ్రాన్స్లోని టౌలాస్ విమానాశ్రయంలో లాండ్ చేశారు. వాస్తవానికి అల్ట్రా లాంగ్ రేంజ్ విమానాలు ఏకధాటిగా దాదాపు 11,160 మైళ్లే ప్రయాణిస్తాయని, కానీ ప్రస్తుతం రూపొందించిన ఏ350లో ఈ సామర్థ్యాన్ని మరో 1800 మైళ్లను పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత దూరం ఏకధాటిగా ప్రయాణించే విమానయాన సంస్థగా సింగపూర్ రికార్డు సృష్టించనుంది. ‘ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రూపొందించబోయే ఏ350 విమానాల్లో అనేక మార్పులు చేయనున్నాం. పాత విమనాల్లో క్యాబిన్ పొడవైన గొట్టం మాదిరిగా ఉండేది. కానీ ప్రస్తుతం తీసుకురానున్న ఏ350 ఎయిర్బస్లలో క్యాబిన్ పూర్తిగా మార్చివేసి ఒక గదిలాగా డిజైన్ చేయనున్నాం. అంతేకాక విమానం లోపల అధునాతన ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థతో పాటు తక్కువ శబ్దం వచ్చేలా మార్పులు చేయనున్నాం’ అని ఎయిర్బస్ ఎయిర్క్రాఫ్ట్ ఇంటీరియర్ మార్కెటింగ్ డైరెక్టర్ ఫ్లారెంట్ పెటేని తెలిపారు. -
ఐపీఎల్లో తెలుగమ్మాయి
పోచారం: న్యూస్ రీడర్గా కెరీర్ను ప్రారంభించిన ఆమె యాంకర్గా మారారు. ఇప్పుడు ఐపీఎల్ హోస్ట్గా క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది వింధ్య విశాఖ. ఐపీఎల్ సీజన్–11లో తొలిసారిగా తెలుగు కామెంటరీకి శ్రీకారం చుట్టి తెలుగు భాషను గౌరవించింది స్టార్ సంస్థ. దాదాపు 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఐపీఎల్లో 30 మ్యాచ్లకు హోస్ట్గా వ్యవహరించనున్నారు. గత సంవత్సరం ప్రోకబడ్డీకి వ్యాఖ్యాతగా వ్యవహరించి స్టార్ స్పోర్ట్స్లోకి అడుగుపెట్టి తొలిసారి క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు. యాంకరింగ్తో సంతృప్తి చెందుతూ.. ఈ రంగంలోనే మరింత రాణించాలని ఆశిస్తున్నానని నారపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చెప్పారు. చదువులో చురుకుదనం.. వింధ్య ఘట్కేసర్కు చెందిన మేడపాటి వెంకటరెడి,్డ శేషారత్నం మనవరాలు మమతా సత్తిరెడ్డి కుమార్తె. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్లో మాస్టర్స్ చేశారు. చిన్నప్పటి నుంచి అటు చదువులోను, ఇటు ఆటల్లోను చురుకుగా ఉండే వింధ్య, హైదరాబాద్లోని కస్తూర్బా గాంధీ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అన్నా హజారే లోక్పాల్ బిల్లు కోసం చేసిన ఉద్యమానికి వలంటీర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈమె ప్రసంగాన్ని మెచ్చుకుని తొలిసారి హెచ్ఎంటీవీలో న్యూస్ రీడర్గా అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత మోడల్గానూ అడుగులు వేశారు. మా మ్యూజిక్ ఛానల్లో ‘ఛాయ్ బిస్కెట్’, టీవీ–9లో హాట్ వీల్స్, ఈటీవీ 2లో సఖీ, మా టీవీలో మా ఊరి వంట వంటి కార్యక్రమాలతో పాటు పలువురు సినీరంగ సెలబ్రిటీల ఇంటర్వ్యూలను అందించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వింద్య. పేదలకు చేయూతనివ్వాలని.. తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిస్తే కెరీర్లో రాణించగలరని, ముఖ్యంగా తాను ఎంచుకున్న రంగంలో ప్యామిలీ సపోర్ట్ ఎంతో ఉందని విద్య తెలిపారు. యాంకరింగ్ చేస్తూనే స్వచ్ఛ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించి, పేదలకు చేయూతనిస్తూ సేవాభావం చాటుకుంటున్నారామె. -
పాట మరిచిపోయింది.. నవ్వుల పాలు
న్యూయార్క్ : ఆమె పాడే పాటలకు వేలాది మంది అభిమానులు.. తను ఇచ్చే మ్యూజిక్ షోలతో అభిమానులకు, ఈవెంట్ ప్రొడ్యూసర్లకు పండగే. ఈ సింగర్ మైకు చేత పట్టి పాట పాడితే అవార్డులు సైతం దాసోహం అవుతాయి. ఆమె ఎవరో కాదు మూడు గ్రామీ పురస్కారాల గ్రహీత, అమెరికన్ పాప్ సింగర్, రచయిత అలిసియా బెత్ మూర్(పింక్). ఓ ఈవెంట్ సంస్థ న్కూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో పింక్ బృందంతో మ్యూజికల్ షోను ఏర్పాటు చేసింది. ఈ షోలో సొంతంగా కంపోజ్ చేసి, ఇప్పటికే ఎన్నో స్టేజిల మీద పాడి విజయవంతమైన పాటను పాడటానికి పింక్ సిద్ధం అయ్యారు. తన టీంతో కలిసి పాట పాడటం ప్రారంభించిన పింక్ మధ్యలో తడబడ్డారు. పాట చరణాలు మరిచిపోయి కోరస్ బృందం సహాయంతో పాట పూర్తి చేశారు. ఆ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు నవ్వుతూ ఉండటంతో పాట పాడటం అయిపోయాక క్షమించండి పాట మరిచిపోయాను అని పింక్ తెలిపింది. -
న్యూస్ రీడర్ మృతితో విషాదఛాయలు
తూప్రాన్: వీ 6 చానెల్లో న్యూస్రీడర్గా పనిచేసిన రాధిక ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. వెల్దుర్తి మండలం మానెపల్లికి చెందిన వెంకన్నగారి మాణిక్యరెడ్డి, ఊర్మిల దంపతుల కుమార్తె రాధిక(36) వీ6 చానెల్ న్యూస్రీడర్గా పనిచేసింది. హైదరాబాద్లోని మూసాపేటలోని అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు టీవీల్లో చూసిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తమ గ్రామ యువతి టీవీ లో వార్తలు చదవడం తమకెంతో గర్వంగా ఉండేదన్నారు. రాధిక కుటుంబ సభ్యులు పదిహేనేళ్లకు ముందు హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారన్నారు. గ్రామంలో వారికున్న ఐదెకరాల పొలాన్ని ఆమె తండ్రి మాణిక్యరెడ్డి ఇతరులకు కౌలుకు ఇచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతురాలు రాధిక 10వ తరగతి వరకు గ్రామ సమీపంలోని మంగళపర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు తెలిపారు. తన తోటి విద్యార్థులు సైతం రాధిక మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాం తిని వ్యక్తం చేశారు. గ్రామంలో వారు ఉంటున్న ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కూలిపోయింది. పదిహేనేళ్లుగా వారు గ్రామానికి రావడం లేదన్నారు. -
రాధిక ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: వీ6 న్యూస్ రీడర్ వెంకన్నగారి రాధిక ఆత్మహత్య కేసులో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. రాధిక తన ఫోన్ ద్వారా నెల రోజులుగా ఎవరెవరితో సంభాషించిందనే కాల్ డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందా..? లేక మరే ఇతర ఒత్తిళ్లయినా ఉన్నాయా? అనే కోణంలో దృష్టి సారించారు. రాధిక ఇంటి సమీపంలో ఉండే స్నేహితులు, పరిచయస్తులతో పాటు కార్యాలయంలో తోటి ఉద్యోగులతో ఎలా ఉండేదనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. మూసాపేటలో శ్రీసువిల అపార్ట్మెంట్లో ఐదేళ్లుగా రాధిక తన తండ్రి, కుమారుడు, సోదరితో ఉంటోంది. ఆరు నెలల క్రితం భర్త నుండి విడాకులు పొందిన రాధిక ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. రాధిక గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోందని సహ ఉద్యోగులు పేర్కొన్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాధిక రాత్రి 10.40 నిమిషాల సమయంలో అపార్ట్మెంట్ ఆరో అంతస్తుపైకి వెళ్లింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన వాచ్మన్ అపార్ట్మెంట్లోని వారికి సమాచారమిచ్చాడు. ముఖం ఛిద్రం కావడంతో తొలుత మృతురాలు ఎవరనేది గుర్తించలేకపోయారు. రాధిక సోదరి వచ్చి మృతురాలిని గుర్తించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ‘నా బ్రెయినే నా శత్రువు’అంటూ రాధిక రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం ఈఎస్ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. కాగా, రాధిక మృతదేహానికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు నివాళులర్పించారు. -
ఎనిమిదేళ్ల క్రితం ఎక్కడ మొదలైందో..!
న్యూయార్క్ : మధుర క్షణాలు అందించిన ప్రాంతాలకు మరల వెళ్లి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత చేస్తున్నది అదే. పెళ్లి చేసుకున్న తర్వాత షూటింగులతో బిజీగా ఉండటంతో చేతూసామ్లు కలిసి ఎక్కడికీ వెళ్లలేకపోయారు. ప్రస్తుతం షూటింగ్లకు కాస్త విరామమిచ్చి ఎంజాయ్ చేయడానికై వారి ప్రేమ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్లారు. ‘ఏ మాయ చేసావే’ సినిమా షూటింగ్ సమయంలో న్యూయర్క్ లోని సెంట్రల్ పార్క్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కట్ చేస్తే ఎనిమిది సంత్సరాల తర్వాత వీరు భార్యభర్తలుగా ఆ ప్రాంతాన్ని సందర్శించి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. సెంట్రల్పార్క్ దగ్గర దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సమంత.. ‘‘సాధారణంగా సెల్ఫీలు దిగటం అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి మధుర క్షణాలు ఫోటోలో బంధిస్తేనే బాగుంటుంది. ఎనిమిదేళ్ల క్రితం మా ప్రేమ ఇక్కడే మొదలైంది.. థ్యాంక్యూ సెంట్రల్ పార్క్ అని’’ సమంత పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్గా మారింది. రంగస్థలం భారీ హిట్ కావడం, తన నటనతో విమర్శకులతో సైతం మెప్పించుకోవడంతో సమంత ఫుల్ హ్యపీగా ఉంది. ఇక సవ్యసాచి సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న నాగచైతన్య కాస్త విరామం దొరకడంతో సమంతతో కలిసి న్యూయార్క్లో విహరిస్తున్నాడు. Usually hate selfies but this had to be done .. 💕 Central Park .. where it all began . 8 years ago.. Thankyou for the magic ..just had to come back and say Thankyouuu❤️ #whatsmeanttobewillbe #lovewillfindaway #NewyorkNewyork💕 #familyiseverything #chaylove #happilyeverafter #YMC A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Mar 31, 2018 at 3:52pm PDT -
నేటి ప్రధాన వార్తలు
అనగనగ ఒక దొంగ.. జగన్ చెప్పిన పిట్టకథ! ‘అనగనగనగా.. ఒక దొంగ ఉన్నాడు. అతను దొంగతనానికి వెళ్లి.. అడ్డగోలుగా తప్పుడు పనులు చేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. చంద్రబాబుకు అమిత్షా స్ట్రాంగ్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరున్నారు.. హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు డీజీపీని కోరారు. ‘సాక్షి’ ప్రజల పక్షం : వైఎస్ భారతీ రెడ్డి ఉన్నత ఆశయాలతో ప్రారంభమైన ‘సాక్షి’ దినపత్రిక కాలక్రమంలో యావత్ సమాజానికి నమ్మకంగా నిలిచిందని సంస్థ చైర్పర్సన్ వైఎస్ భారతీ రెడ్డి చెప్పారు. ఏపీ రాజకీయాలపై తలసాని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు. కార్తీ చిదంబరానికి మరో ఊరట ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఊరట లభించిన కార్తీ చిదంబరానికి, ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో కూడా మరో ఊరట లభించింది. తీవ్ర విషాదం: తీరానికి కొట్టుకొచ్చాయి.. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని హమెలిన్ సముద్ర తీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. దాదాపు 150 వేల్స్ ఒడ్డుకు కొట్టుకువచ్చి ప్రాణాలు విడిచాయి. భారీగా సంపద కోల్పోయిన జుకర్బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ భారీగా తన సంపదను కోల్పోయారు. కాబోయే భర్త అంటూ అనౌన్స్ చేసేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. టెస్టు చరిత్రలోనే రెండో క్రికెటర్! ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. -
పార్కింగ్ ఫీజుతోనే న్యూయార్క్లో భారీ ఆదాయం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్లో రెండో అతిపెద్ద ఆదాయ వనరు పార్కింగ్ ఫీజేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెయిడ్ పార్కింగ్ ద్వారా వస్తున్న వార్షికాదాయం రూ.96 లక్షలేనని, అందుకే దాన్ని ఉచితం చేసి వాహనదారులకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి రూపొందించిన పార్కింగ్ విధానం హైదరాబాద్కే కాకుండా రాష్ట్రం లోని అన్ని పట్టణాలకూ వర్తింపజేస్తామన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు కేటీఆర్ సమాధానమిస్తూ.. పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, మెట్రో రైల్ సంస్థల ఆధ్వ ర్యంలో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సాయంత్రం ఖాళీగా ఉండే ప్రభుత్వ భవన ప్రాంగణాలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని, స్మార్ట్ యాప్నూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చెరకుకు 2 సార్లు ‘పెట్టుబడి’: పోచారం ‘రామ రాజ్యం, అశోక రాజ్యం, కాకతీయ రాజ్యం.. రాజ్యమేదైనా రైతు నుంచి శిస్తు వసూలు చేశారు. కానీ కేసీఆర్ రాజ్యంలో శిస్తు లేదు సరికదా రైతుకే ఎదురు పెట్టుబడి ఇస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధానం అమలు చేస్తున్నాం. ఇది అద్భుత పథకం’ అని వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు రూ.4 వేల పెట్టుబడి పథకంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల వివాద రహిత భూములు గుర్తించి వాటికి పెట్టుబడి పథకం వర్తింపచేస్తున్నాం. ఇతర ప్రధాన పంటలతోపాటు శనగ పంటకూ సాయం ఇస్తున్నాం. 12 నెలల పంట చెరకును రెండు పం టలుగా పరిగణించి రూ.4 వేలను రెండు పర్యాయాలు చెల్లిస్తాం. ఉద్యాన పంటలకూ ఇలానే అందిస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తం భూముల్లో వివాదాస్పద భూములు 4 శాతమే ఉన్నాయని, సమస్యలు పరిష్కారమైతే వాటికీ పెట్టుబడి వర్తింపజేస్తామన్నారు. -
టాటా ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’
న్యూయార్క్ : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (టాటా) ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’ చారిటీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. న్యూయార్క్లోని రొనాల్డ్ మెక్డొనాల్డ్ హౌజ్లో ఈ చారిటీ విందును ఏర్పాటు చేశారు. పసందైన వంటకాలతో వచ్చిన వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పీ.మల్లారెడ్డి, వీ.సుధాకర్, మాధవ రెడ్డి మిగతావారికి టాటా వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పాపిరెడ్డి, కో ఆర్డినేటర్ సత్యారెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఆర్.పవన్, టాటా బోర్డ్ డైరెక్టర్స్ రంజిత్, శరత్, పణిభూషన్, మహిళా స్టాండింగ్ కమిటీ కో చైర్ పర్సన్ మాధవి, స్టాండింగ్ కమిటీ కో చైర్మెన్ అశోక్, కో ఆర్డినేటర్స్ ఉషా, మల్లిక్, సత్యారెడ్డి, యోగి, ప్రహ్లాద, హేమంత్, రమా, జయప్రకాష్, వాలంటీర్లు నాగశ్రీ, మౌనిక, శ్వేత, కరుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కూలిన హెలికాప్టర్...ఇద్దరు మృతి
న్యూయార్క్ : అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికన్ విమానయాన అధికారి ఒకరు మాట్లాడుతూ యూరోకోప్టర్ ఏఎస్350 విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:15 నిమిషాలకు రూజ్వెల్ట్ ఐలాండ్కు ఉత్తరంగా ఉన్న నదిలో పడిపోయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియలేదు. పోలీసులు, నౌకాశ్రయ సిబ్బంది ఘటనా స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
‘అణు’ విమానం
ఈ ఫొటోలో ఉన్నది ఓ విమానం. అంతరిక్షంలోకి వెళ్లే నౌకలా ఉందనుకుంటున్నారా.. అయితే సాధారణ మానవులు ప్రయాణించేందుకే దీన్ని రూపొందించారు. అసలు విశేషమేం టంటే ఇది మామూలు విమానాలు నడిచే ఇంధనంతో కాకుండా అణుశక్తితో నడుస్తుంది. అంటే విమానయాన రంగంలో ఇదొక సంచలనంగా చెప్పుకోవచ్చు. దీని వేగం ఎంతో తెలుసా? గంటకు 1,852 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. దీని నుంచి కొంచెం కూడా కార్బన్ వెలువడదట. ఈ విమానాన్ని డిజైనర్ ఆస్కార్ వినల్స్ రూపొందించారు. దీనికి పెట్టిన పేరు ‘మాగ్నావమ్’ అంటే పెద్ద పక్షి అని అర్థం. ప్రస్తుతం సాధారణ విమానాల్లో లండన్ నుంచి న్యూయార్క్కు 3 గంటల్లోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించొచ్చట. రియాక్టర్ దీనికి కావాల్సిన ఇంధనాన్ని సమకూరుస్తుందట. ఇందులో దాదాపు 500 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చని చెబుతున్నారు. అయితే ఇది మన ముందుకు రావాలంటే ఇంకో పదేళ్లు పడుతుందట. -
నేటి వార్తల విహంగ వీక్షణం
సాక్షి, వెబ్ డెస్క్ : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ను చూసి చంద్రబాబు విలవిలలాడిపోయారని.. ఆయన అనుకూల మీడియా ఊదరగొడుతోందని, ఆయన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ----------------- రాష్ట్రీయం ----------------- ఆ ముద్దాయిలాంటివాడే చంద్రబాబు..! ‘అమెరికాలో పరువు తీసిన లోకేష్’ ‘రూ. 5 లక్షల వడ్డీలేని రుణం’ సోము వీర్రాజుకు టీడీపీ నేత హెచ్చరిక ----------------- జాతీయం ----------------- భారతీయ నేవీకి ఎఫ్/ఏ-18 హార్నెట్ జెట్లు..! ‘మరో కుమారుడు ఉంటే ఆర్మీలోకి పంపేదాన్ని’ అగ్గిపెట్టె తిరిగివ్వకపోతే చర్యలు తీసుకోబడును! ---------------- అంతర్జాతీయం ------------- భారత్ దాడి.. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు..! 300 అస్థిపంజరాలు వైకింగ్ ఆర్మీవే పెళ్లిలో కూడా డ్యూటీ చేసిన జర్నలిస్టు ----------------- బిజినెస్ ----------------- బంగారం దిగుమతుల భారీ పతనం టీవీఎస్ కొత్త స్కూటర్... ప్రత్యేకతలివే డైమండ్ కింగ్ మోదీకి సీబీఐ షాక్ ----------------- క్రీడలు ----------------- ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ కుర్రాళ్లంతా స్టార్ క్రికెటర్లే! హ్యాట్సాఫ్.. ఉన్ముక్త్ ! -
మోడల్కు విమానంలో తీవ్ర అవమానం
న్యూయార్క్ : అమెరికా ప్రముఖ ఫిట్నెస్ మోడల్ జెన్ సెల్టర్కు తీవ్ర అవమానం జరిగింది. న్యూయార్క్కు చెందిన విమానంలో నుంచి ఆమెను అర్థాంతరంగా, అకారణంగా దించివేశారు. అది కూడా ఓ ఐదారుగురు పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా దింపేశారు. ఇది తన జీవితంలోనే అత్యంత పెద్ద అవమానం అని సదరు ఎయిర్లైన్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రమ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలలో ఫిట్నెస్కు సంబంధించిన టిప్స్ చెబుతూ తన ఫొటోలను జెన్ సెల్టర్ పెడుతుంటారు. పైగా ఈమె ఫిట్నెస్ మోడల్ కూడా. అయితే, శనివారం రోజు మియామిలో న్యూయార్క్కు చెందిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో జెన్ తన సీట్లో కూర్చున్నారు. అప్పటికే విమానం బయలుదేరకుండా రెండున్నరగంటలు ఆలస్యం అయింది. అయితే, ఎలాగో విమానం బయలుదేరడం లేదు కదా కాసేపు నిల్చొని తన కోటును తీసేసి విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. అయితే, ఆమె నిల్చోగని విమాన సిబ్బంది ఆమెను కూర్చోవాలని చెప్పారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. విమానంలో నుంచి దిగిపోవాలని వారు గొడవపడ్డారు. పైలట్కు కూడా ఈ విషయం సిబ్బంది చెప్పగా అతడు ఎయిర్పోర్ట్ అధికారులకు చెప్పారు. దాంతో ఓ ఐదారుగురు పోలీసులు విమానంలోకి వచ్చి ఆమెను బలవంతంగా దించేశారు. ఆమె పక్కన ఉన్నవాళ్లు ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించినా ఆమెను ఫ్లైట్లో ఉంచకుండా దింపేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఆమె పంచుకున్నారు. Just like that, 5 cops coming at me. Worst experience American Air ✌🏼 pic.twitter.com/1LY1NrAQ3k — Jen Selter (@JenSelter) 28 January 2018 Current situation @AmericanAir .. insane. pic.twitter.com/kIOh3VysnU — Jen Selter (@JenSelter) 28 January 2018 Here is a video of an innocent passenger who on her own decided to get off the plane based on how badly @AmericanAir treated us all. pic.twitter.com/DZ4kkHOlox — Jen Selter (@JenSelter) 28 January 2018 -
'హలో పోలీసులా.. నేను ఫుల్లుగా తాగి నడుపుతున్నా'
న్యూయార్క్ : అది కొత్త సంవత్సర ప్రారంభానికి కొన్ని ఘడియల ముందు. ఆ రోజు ఎక్కడికక్కడ సందడి వాతావరణం నెలకొని ఉండటంతోపాటు పార్టీలు, లైటింగ్ ఫెస్టివల్స్తో అంతటా రోడ్లపై కూడా బిజీబిజీగా గజిబిజిగా ఉంది. ఎక్కడ ఏ సంఘటన వినాల్సి వస్తుందో అనే పోలీసులంతా తమ కంట్రోల్ రూమ్ వద్ద చాలా అప్రమత్తంగా ఉన్నారు. వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో మైఖెల్ లెస్టర్ అనే ఓ 35 ఏళ్ల వ్యక్తి నుంచి పోలీసుల అత్యవసర ఫోన్ నెంబర్ 911కు ఫోన్ వచ్చింది. అది లిఫ్ట్ చేసిన మహిళా పోలీసు అధికారిణి '911, మీ అత్యవసర పరిస్థితి ఏమిటి?' అని అడిగారు. వెంటనే బదులిచ్చిన మైఖెల్ నేను ఫుల్లుగా తాగి నా కారు నడుపుతున్నాను అని చెప్పాడు. దాంతో అవాక్కయిన ఆమె వెంటనే తేరుకొని ఇప్పుడెక్కడ నుంచి సరిగ్గా మాట్లాడుతున్నావని ప్రశ్నింగా తనకు అదంతా అర్థం కావడం లేదని, ఎక్కడబడితే అక్కడ తిరుగుతున్నానని, అది కూడా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్నానని తాఫీగా చెప్పాడు. దాంతో మరింత కంగారు పడిన ఆమె అతడి నుంచి వివరాలు రాబట్టేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అతడు ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండానే, తనకు హానీ కలగజేసుకోకుండానే కారును ఓ చోట ఆపేశాడు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దానికి సంబంధించిన ఆడియోను ఇప్పుడు అధికారులు విడుదల చేశారు. ఇది చూసైనా తాగి వాహనం నడిపేవారికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలా తాగి నడిపిన మైఖెల్ది ఫ్లోరిడా అని, ఇప్పటికే నాలుగుసార్లు అతడు ఇలా నేరాలు చేశాడని పోలీసులు చెప్పారు. -
హమ్మయ్యా! తెరిచే ఉంటాయ్
సాక్షి, చెన్నై: కొత్త సంవత్సరం వేళ రాత్రి వేళ ఆలయాలు తెరచి ఉంచేందుకు ఎలాంటి ఆటంకాలు లేనట్టే. ఆలయాల మూసివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మద్రాసు హైకోర్టు స్పందించలేదు. స్టే ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఏటా ఆంగ్ల కొత్త సంవత్సరాదిని ఆహ్వానించే రీతిలో వేడుకలు మిన్నంటుతూ వస్తున్నాయి. ప్రధానంగా 31వ తేదీ రాత్రి సాగే హంగమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఆ రోజు రాత్రంతా ఆలయాలు తెరిచే ఉంటాయి. కొత్త ఏడాది తొలిరోజు దైవ దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి వేళ జనం ఆలయాల వద్ద బారులు తీరుతుంటారు. అయితే, ఇది ఆగమ విరుద్ధమని చాలామంది ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో అశ్వర్థామ అనే న్యాయవాది బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఆగమ నిబంధనల్నివివరిస్తూ ఆరోజు రాత్రి ఆలయాలను మూసివేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆగమ శాస్త్రం మేరకు రాత్రి తొమ్మిది గంటలకు ఆలయాల్లో ఏకాంత సేవ ముగించాలని, మరుసటి రోజు ఉదయం 4.30-6.30 గంటల మధ్య సుప్రభాత సేవ నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే, కొత్త సంవత్సర వేడుకలంటూ 31వ తేదీ ఆలయాలను మూయడం లేదని, ఇది ఆగమ విరుద్దమని కోర్టుకు వివరించారు. వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి వేళ, శివాలయాలు శివరాత్రి వేళ మాత్రం రాత్రుల్లో తెరచి ఉంచేందుకు వీలుందని, అయితే, ఆంగ్ల సంవత్సరాదిని ఆహ్వానించే విధంగా ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆగమ నిబంధనల మేరకు ఆలయాలను మూసిఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, స్వామినాథన్ బెంచ్ గురువారం విచారించింది. పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ముందుగా ఈ వ్యవహారంలో దేవాదాయ శాఖ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాల్సి ఉందన్నారు. ఈ దృష్ట్యా, వారి వివరణకు నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణ జనవరి 8వ తేదీకి వాయిదా వేశారు. అలాగే, పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఆలయాల విషయంలో ఎలాంటి ఉత్తర్వులను తాము ఇవ్వబోమని బెంచ్ స్పష్టం చేసింది. దీంతో పరోక్షంగా కొత్త వేడుక వేళ రాత్రుల్లో ఆలయాలు తెరిచే ఉంచుకునేందుకు అనుమతి లభించినట్టు అయింది. ఇదిలా ఉండగా ఆలయాలను తెరచి ఉంచడమా, లేదా మూసివేయడమా అనే విషయం తేల్చుకోలేక దేవాదాయ శాఖ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. -
31నైట్.. తాగి నడిపితే.. అంతే సంగతులు!
సాక్షి, హైదరాబాద్ : ఆదివారం రాత్రి జరుగనున్న కొత్త సంవత్సరం వేడుకుల నేపథ్యంలో నగరాన్ని జీరో యాక్సిండెంట్ నైట్గా చేయాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రధాన సమస్య, ముప్పు అయిన డ్రంక్ అండ్ డ్రైవ్కు చెక్ చెప్పేందుకు ఆ రోజు రాత్రంతా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు డీసీపీ ఏవీ రంగనాథ్ మంగళవారం వెల్లడించారు. సాధారణ రోజుల్లో ఈ తనిఖీలు రాత్రి 10 నుంచి తెల్లవారుజాము ఒంటి గంట వరకు మాత్రమే సాగుతాయి. అయితే డిసెంబర్ 31న దృష్టిలో పెట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్ని ఆదివారం 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు రంగనాథ్ తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు దాదాపు ప్రతి వారాంతంలోనూ ఈ తనిఖీలు చేపడుతున్నారు. అయితే సాధారణ రోజుల్లో ట్రాఫిక్ ఠాణాల వారీగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే ట్రాఫిక్ టీమ్స్ తనిఖీలు చేస్తాయి. ఆదివారం మాత్రం ఇలా ఒకేచోట ఉండి పనిచేసే స్టాటిక్ బృందాలతోపాటు నగరవ్యాప్తంగా సంచరిస్తూ అవసరమైనచోట ఆకస్మిక తనిఖీలు చేయడానికి అనువుగా మొబైల్ టీమ్స్ను.. వాహనచోదకుల్లో కలిసి సంచరిస్తూ, డ్రైవింగ్ చేస్తున్న మందుబాబుల్ని పట్టుకోవడానికి ఉద్దేశించిన డెకాయ్ టీమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తమ్మీద నగరవ్యాప్తంగా 100 బృందాలు విధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఎవరైనా మద్యం తాగిన స్థితిలో వాహనాలు నడుపుతూ చిక్కితే వారిపై కేసు నమోదు చేయడంతోపాటు తక్షణం వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకుంటారు. -
ఆలయాల్లో కొత్త సంవత్సరం వేడుకలు వద్దు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్లేయులు అలవాటు చేసిన నూతన సంవత్సరాదిని నిర్వహించుకోవటం భారతీయ వైదిక విధానం కాదని అందులో పేర్కొన్నారు. అందుకే కొత్త సంవత్సరం రోజున ఆలయాల్ని అలంకరించటం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయటం, శుభాకాంక్షలు తెలపడం సరికాదని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకే అలాంటి కార్యక్రమాలేవీ చేయవద్దని రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సందేశం పంపారు. భారతీయ సంప్రదాయం కానివాటి కోసం హిందూ ఆలయాల్లో డబ్బు ఖర్చు చేయడం సరికాదని అధికారుల అభిప్రాయం. తెలుగు సంవత్సరాది ప్రకారం ఉగాది రోజున మాత్రమే వేడుకలు జరపాలని దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ సూచించారు. ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని ఆలయాల కార్యనిర్వహణాధికారులతో పాటు సహాయక కమిషనర్లు, ఉప కమిషనర్లు, మేనేజర్లకు సమాచారమిచ్చారు. -
మస్త్.. ముమైత్
న్యూఇయర్ హంగామాకు సిటీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ ముద్దుగుమ్మలు డ్యాన్స్లతో హోరెత్తిస్తారని కంట్రీక్లబ్ సీఎండీ వై.రాజీవ్రెడ్డి తెలిపారు. క్లబ్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హీరోయిన్లు మనారాచోప్రా, ముమైత్ఖాన్, షెఫాలీ జరీవాలా, మరియం జకారియాలతో కలిసి న్యూఇయర్ ఈవెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. -
న్యూయార్క్లో ట్రక్కు బీభత్సం
న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలోని మ్యాన్హట్టన్లో బుధవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెమోరియల్ దగ్గరలో సైకిళ్లు, పాదాచారులు వెళ్లే పాత్పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఆ తర్వాత ఆగి ఉన్న స్కూల్ బస్సును కూడా ట్రక్కుతో ఢీ కొట్టి పారిపోతున్న దుండగుడిని అమెరికన్ పోలీసులు తుపాకీతో కాల్చారు. పొత్తికడుపులో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ట్రక్కు నుంచి దిగి పారిపోతూ అల్లా హూ అక్బర్ అని వ్యక్తి అరిచినట్లు సమాచారం. కాగా, ఘటనపై స్పందించిన న్యూయార్క్ రాష్ట్ర మేయర్ ఉగ్రదాడేనని ప్రకటించారు. సెప్టెంబర్ 2011 తర్వాత న్యూయార్క్ రాష్ట్రంలో ఇదే అతి పెద్ద దాడిగా న్యూయార్క్ పోలీసులు అభివర్ణించారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఉజ్బుకిస్థాన్కు చెందిన సైపోవ్గా అధికారులు గుర్తించారు. 2010లో అమెరికాకు వచ్చిన అతనికి గ్రీన్ కార్డు కూడా ఉందని చెప్పారు. ట్రక్కును న్యూజెర్సీలోని ఓ డిపోట్ నుంచి అద్దెకు తీసుకుని దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇలా కూడా శిక్షిస్తారా..? దారుణం
న్యూయార్క్: ఓ చిన్నారి సత్ప్రవర్తన కలిగిలేదని ఓ మహిళ దారుణ శిక్ష విధించింది. ఆ శిక్ష కాస్త ఆ చిన్నారి ప్రాణాలను తీసింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వేరోనిక పోసీ(64) అనే మహిళ హత్య ఆరోపణ కేసు ఎదుర్కొంటుంది. అయితే ఈ హత్య దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయం వెల్లడైంది. 145 కిలోల బరువున్నవేరోనిక కజిన్ 9 ఏళ్ల డెరికా లిండ్సే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించదనే ఆగ్రహాంతో ఆమెపై కూర్చోంది. దీంతో ఆ చిన్నారి ఊపిరి ఆడక మరణించింది. ఆ చిన్నారి మూడు ఫీట్ల ఎత్తుతో 33 కిలోల బరువు మాత్రమే ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఆచిన్నారి బరువు నిందుతిరాలి బరువుకన్నా 4 రెట్లు ఎక్కువని, ఈఘటన గత శనివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ.,. తన కూతురు అమర్యాధకంగా ప్రవర్తించడంతో మా కోడలైన వేరొనికాను పిలిచాని తెలిపింది. అయితే వేరొనికాకు ఎన్నేళ్లు శిక్ష పడే అవకాశం ఉందనే విషయం తెలియలేదు. -
గుండె లోతుల్లో కత్తి.. ప్రాణం కోసం...
సాక్షి : ఊహించని విపత్తులు ఎదురైనప్పుడు స్పందించే సమయం కూడా మనిషికి దొరకదు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి ఎలాగైనా సరే తన ప్రాణాలు కాపాడుకోవాలని చేసిన యత్నం వార్తల్లోకి ఎక్కింది. న్యూయార్క్ కు చెందిన ముహ్మద్ రమీరాజ్ (35)పై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు. కిందపడేసి కత్తిపోట్లతో అతని ఒళ్లంతా హూనం చేశారు. చివరకు ఓ కత్తిని అతన్ని గుండెల్లో దింపి పారిపోయారు. అయితే ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో రమీరాజ్ లేచి నిల్చున్నాడు. రక్తం ధారలుగా కారుతున్నా.. ఏ మాత్రం ఆందోళన చెందకుండా ముందుకు నడవసాగాడు. ఆ పక్కనే ఐదుబ్లాకుల తరువాత ఉన్న క్వీన్స్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ముందు అతన్ని చూసి షాక్ తిన్న వైద్యులు.. వెంటనే కోలుకొని హుటాహుటిన అతనికి వైద్యమందించారు. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. కత్తి చివర కొన గుండెకు తీవ్ర గాయం చేయటంతో అతను బతికే అవకాశాలు చాలా తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. ఇంతలో పోలీసులు అతనిని కత్తితో పొడించింది ఎవరు? అన్న విషయం ఆరాతీసేందుకు సీసీటీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. సోమవారం మక్నిష్ వీధిలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
మీడియాకు ట్రంప్ బెదిరింపులు
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మండిపడ్డారు. తాను తీసుకొచ్చిన అణు విధానంపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని ఎన్బీసీ న్యూస్పై ధ్వజమెత్తారు. సదరు న్యూస్ నెట్వర్క్ల లైసెన్స్ను రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అణు సామర్థ్యాన్ని పది రెట్లు పెంచాలని కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారని ఎన్బీసీ కథనాన్ని ప్రసారం చేసింది. జాతీయ భద్రతా ఉన్నతాధికారులతో గత వేసవిలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యానించారని కథనంలో పేర్కొంది. మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికన్ల భయం న్యూయార్క్: ఉత్తర కొరియాతో తరచూ గొడవలు, ఆ దేశంతో ట్రంప్ తొందరపాటు ధోరణి వల్ల మూడో ప్రపంచ యుద్ధం రావచ్చేమోనని అమెరికన్లు భయపడుతున్నారని ఒక సర్వే తేల్చింది. అమెరికాలోని చాప్మేన్ వర్సిటీ నిర్వహించిన ‘సర్వే ఆఫ్ అమెరికన్ ఫియర్స్ 2017’లో అమెరికన్లు ప్రపంచ యుద్ధం గురించి ఎక్కువ భయపడుతున్నట్లు వెల్లడైంది. -
టుడే న్యూస్ రౌండప్
నేటి మరిన్ని వార్తావిశేషాలు.. డ్రగ్స్ కేసు: సినిమా ప్రముఖుల పేర్లు వెల్లడి! డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. మంత్రి లోకేష్కు మరో చేదు అనుభవం రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు ఏదో సందర్భంలో ప్రశ్నిస్తున్నారు. కొనసాగుతున్న డ్రగ్స్ కలకలం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో పోలీసులు చురుగ్గా విచారణ కొనసాగిస్తున్నారు. ఐటీ లైఫ్.. కల చెదిరిందా? ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ కన్స ల్టెంట్గా పని చేస్తున్న విక్రమ్రెడ్డి హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకున్నాడు. <<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>> ఎమ్మెల్యే సీటు కింద బాంబు కలకలం.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే సీటు కింద బాంబు లభించడం కలకలం సృష్టిస్తోంది. బీజేపీ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారో వారంతా తమ ఇళ్లలోని మహిళలను బెంగాల్కు పంపించాలని, అలా పంపిస్తే కచ్చితంగా వారిపై 15 రోజుల్లో అత్యాచారం జరుగుతుందని.. భారీ ఎత్తున ఆ సైట్లపై కొరడా అశ్లీల వెబ్ సైట్లపై కొరడా ఝుళిపించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. <<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>> మూన్పై మట్టి కోసం శాటిలైట్ ట్రాక్టర్లు చందమామ.. మన ఎనిమిదో ఖండం! అక్కడ మనుషులు లేరు.. పైగా మనకు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది... జెట్ ఇంజిన్ బ్లాస్ట్.. బీచ్లో మహిళ మృతి సముద్రతీరంలో సేదతీరుతూ, దగ్గరి నుంచి విమానాన్ని చూస్తూ జెట్ ఇంజిన్ బ్లాస్ట్ అనుభూతిని ఆస్వాధించాలని వేల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చిన ఓ పర్యాటకురాలు మృతిచెందింది. <<<<<<<<<<<<<<<<< బిజినెస్ >>>>>>>>>>>>>>>>>> మాల్యా కేసు నిరవధిక వాయిదా దేశంలో వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాల్లో జల్సాలు చేస్తున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ 84జీబీ డేటా ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు నువ్వానేనా అంటూ మార్కెట్లో విపరీతంగా పోటీపడుతున్నాయి. అమెరికాను ఓవర్టేక్ చేసిన భారత్ అగ్రరాజ్యం అమెరికాను భారత్ ఓవర్టేక్ చేసింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు, ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. <<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>> 'పటేల్ సర్' మూవీ రివ్యూ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేశాలతో ఫుల్ బిజీగా ఉన్న జగపతిబాబు, మరోసారి హీరోగా చేసిన ప్రయత్నమే పటేల్ సర్. కొందరికి నోటీసులు రావడం నిజమే : మా అధ్యక్షుడు తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: హీరో నవదీప్ సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. <<<<<<<<<<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>>>>>>>>>>>> ధోనిని వదులుకోం! వచ్చే ఐపీఎల్పై చెన్నై టీమ్ ప్రతినిధి జార్జ్ జాన్ మాట్లాడుతూ... 'కాంట్రాక్టు ముగియడంతో ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలి. ఫోన్ పగలగొట్టిన సంగక్కర..! అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి రెండు సంత్సరాలు అయినా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తన బ్యాటింగ్ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. -
'నా లవ్తో బ్రేక్ చాలా అవసరం'
న్యూయార్క్: ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు న్యూయార్క్లో వాలాయి. న్యూయార్క్ నగర వీధుల్లోని గాలిలో ప్రేయసితో కలిసి తిరుగుతుండటం కోహ్లికి బాగా ఊరటనిస్తున్నట్లుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్లలో వరుసగా మ్యాచ్లలో పాల్గొన్న విరాట్.. మచ్ నీడెడ్ బ్రేక్ విత్ మై లవ్ అంటూ ఇన్స్టాగ్రామ్లో అనుష్కతో కలిసివున్న ఓ ఫోటోను పోస్టు చేశాడు. ఈ ఫొటో సోషల్మీడియాలో వైరలైంది. నెటిజన్లు ‘విరుష్క’ చక్కటి జంట అంటూ లైకులు, కామెంట్స్ పెడుతున్నారు. అనుష్క.. న్యూయార్క్లో జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం నిమిత్తం వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. జులై 15న న్యూయార్క్లోని మెట్లైఫ్ స్టేడియంలో ఐఫా ఈవెంట్ జరగబోతోంది. మరోవైపు విరాట్ వెస్టిండీస్ టూర్ ముగించుకుని అటు నుంచి యూఎస్ వచ్చినట్లు తెలుస్తోంది. -
జీఎస్టీ కొత్త రీటైల్ ధరలను పత్రికల్లో ప్రకటిస్తాం
న్యూఢిల్లీ: రెవెన్యూ సెక్రటరీ హస్ముక్ ఆదియా,ఇతర సీబీఈసీ అధికారులు న్యూఢిల్లీలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎస్టీ అమలుకు సంబంధించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. జమ్ము కశ్మీర్ తప్ప మిగతారాష్ట్రాలన్నీ జీఎస్టీకి ఆమోదం తెలిపినట్టు రెవిన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా ప్రకటించారు. ముఖ్యంగా జీఎస్టీఎన్లో సుమారు 2 లక్షల క్రొత్త రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని చెప్పారు. వీటిల్లో 39వేలు ఇప్పటికే ఆమోదం పొందాయన్నారు. రానున్న మూడు రోజుల్లో మిగిలినవాటిని కూడా ఆమోదించినున్నట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికపుడు కేంద్రప్రభుత్వం మానిటర్ చేస్తోందని చెప్పారు. జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటివరకూ ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని చెప్పారు. ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో ఫీడ్ బ్యాక్ అండ్ యాక్షన్ రూంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సోమవారం క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఒక కమిటి నియమించినట్టు తెలిపారు. వివిధ డిపార్ట్మెంట్లలో సెక్రటరీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. టాప్ కార్యదర్శులతో కూడిన 15మందితో సెంట్రల్ పర్యవేక్షణ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఒక్కో అధికారికి నాలుగు, అయిదు జిల్లాల బాధ్యతలను అప్పగించామని చెప్పారు. ప్రతి మంగళవారం భేటీ ఉంటుందని తెలిపారు. తద్వారా వివిధ జిల్లాలనుంచి జీఎస్టీపై అమలు తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకొని సమీక్షించనున్నునట్టు చెప్పారు. 20 లక్షల లోపు పన్నులు పరిస్థితి, బిల్లులు ఎలా యిస్తారనే దానిపై అనేక ప్రశ్నలు తమకెదురైనట్టు చెప్పారు. వీటికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే త్వరలోనే ఏ ఏ వస్తువుపై జీఎస్టీకి ముందు, అమలు తర్వాతి ధరలను స్పష్టంగా వివరించ నున్నట్టు తెలిపారు. ధరల మార్పు, సవరించిన ధర పాత ధర వివరాలను తయారీదారులు వార్తాపత్రికల్లో ప్రకటించాలని స్పష్టం చేశారు. టోల్, మండి చార్జీలు, రాష్ట్రాలకు వాహనాల ఎంట్రీపై ఫీజు కొనసాగుతుందనీ,అయితే సరుకులపై ఎంట్రీ పన్నుపై ఎటువంటి లెవీ ఉండదని తెలిపారు. రెవిన్యూ సీసీజీఎస్టీ అమలు తీరుపై వివిధ అంశాలపై డీడీ లైవ్ లో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించారు. మీడియాకోసం, వ్యాపారస్తులు, ఇతర ప్రజల కోసం 6రోజుల పాటు దూదర్శన్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మొదటి మూడురోజులు హిందీలో, తరువాత ఆంగ్లంలోఉంటుందనీ, ఈ కార్యక్రమానికి ప్రశ్నలను ముందుగానే పంపవచ్చని చెప్పారు. -
టుడే న్యూస్ రౌండప్
నిజమైన నేస్తం మోదీ: ట్రంప్ కితాబు రెండు రోజుల పర్యటన కోసం శనివారం రాత్రి అమెరికాకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘రియల్ ఫ్రెండ్’ అంటూ కీర్తించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సోమవారం వైట్హౌస్లో ఇరుదేశాధినేతలు పలు వ్యూహాత్మక అంశాలపై చర్చించనున్నారు. ‘అఫ్ఘాన్- ఇండియా’ డ్యాంపై ఉగ్రదాడి ప్రతిష్టాత్మక సల్మా డ్యామ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10మంది అఫ్ఘాన్ సైనికులు మృత్యువాతపడ్డారు. భారత యాత్రికులకు చైనా అడ్డంకి కైలాస మానస సరోవర్ యాత్రకు బయలుదేరిన భారత యాత్రికుల తొలి బృందాన్ని చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలోనే నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 100 జీఎస్టీ క్లినిక్లు వ్యాపారుల్లో వస్తుసేవల పన్నుపై మరింత అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా 100 జీఎస్టీ క్లినిక్లను నిర్వహించనున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) తెలిపింది. బెడ్రూమ్లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్! గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు. ప్రధాని నోట విజయనగరం తన మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఏపీలోని విజయనగరం జిల్లా ప్రజలను అభినందించారు. ఎందుకంటే..(హెడ్డింగ్పై క్లిక్ చేయండి) <<<<<<<లోకల్ న్యూస్>>>>>>>>> హీరో రవితేజ సోదరుడి దుర్మరణం శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(46) దుర్మరణం చెందారు. నుజ్జు నుజ్జైన భరత్ కారు నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరుపున రంగంలోకి దింపుతున్నట్లు వైఎస్సార్సీపీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. 'జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు' వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. (బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే!) మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్ సాయం అనారోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్ను కలిశారు. <<<<<< ఫీచర్స్ >>>>>>> శ్రీదేవిని రాజమౌళి ఎందుకు... ఇప్పుడు శ్రీదేవిని రాజమౌళి ఎందుకలా అన్నాడు? అనే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది. రాజమౌళి అన్న మాటలు శ్రీదేవిని కూడా చాలా బాధించాయి.. చాలా వేధించాయి. నన్నడగొద్దు ప్లీజ్ నేను ఒక అమ్మాయిని లవ్చేస్తున్నా. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలియడం లేదు. కానీ.. <<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>> కిడాంబి శ్రీకాంత్ సంచలనం ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. (శ్రీకాంత్ కు వైఎస్ జగన్ అభినందనలు) యువరాజ్ మరో మైలురాయి! ఇటీవల మూడొందల వన్డే మ్యాచ్ ను ఆడటం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న భారత వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఖాతాలో మరో మైలురాయి కూడా చేరింది. ధోని, యువరాజ్లు కష్టమేనా? 2019 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు, మేనేజ్మెంట్ ఈ దిశగా ఆలోచించాలని.. -
టుడే న్యూస్ రౌండప్
కేంద్ర ప్రభుత్వం రద్దైన పాతనోట్లను మార్చుకునే అవకాశాన్ని బ్యాంకులు, పోస్టాపీసులకు, జిల్లా సహకార బ్యాంకులకు కల్పించింది. మరోవైపు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు బుధవారం కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేశారు. కాగా ఐవైఆర్ ను ఉద్దేశపూర్వకంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలగించారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప మహిళలపై రెచ్చిపోయారు. టీడీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు పీకేస్తామని బెదిరించారు. ఇంకా ఈ రోజు టాప్ న్యూస్ మీకోసం ... 1.పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్ ఛాన్స్ బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు రిజర్వ్బ్యాంక్ ఆఫ్ఇండియా, కేంద్ర ప్రభుత్వం మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2. ఐవైఆర్ పోస్టింగ్లు... షేరింగ్లు జగన్నాథ రథచక్రం పేరుతో మే 12న ఫేస్బుక్లో అకౌంట్ పబ్లిష్ అయిన దాన్ని ఐవైఆర్ కృష్ణారావు షేర్ చేశారు. 3. హవ్వా.. మత్తులో ఇలా కూడా చేస్తారా..? మద్యం, పొగ, మత్తుపదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానీకరం అంటారు. 4. మహిళలపై హోం మంత్రి రాజప్ప చిందులు వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తామని సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది. 5. ‘టీఎస్పీఎస్సీ’ మాకు క్లారిటీ ఇవ్వదా? టీఎస్పీఎస్సీ లాంగ్వేజ్ పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6. 'గౌతమిపుత్ర'పై ప్రశ్నించడమే ఐవైఆర్ తప్పా?' ఐవైఆర్ కృష్ణారావును ఉద్దేశపూర్వకంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలగించారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. 7. ‘అఖిలేశ్’కు రామమందిర నిర్మాణం ఇష్టం లేదు’ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఆయా ప్రాంతాల నుంచి శిలలను సేకరిస్తోంది. 8. ‘స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా మార్చారు’ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే విశాఖలో భూ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. 9. సోనియాకు నితీష్ ఝలక్.. మోదీకే జై అనుకున్నదే అయింది. కేంద్రంలో విపక్షాలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఝలక్ ఇచ్చారు. సినిమా- ఎంటర్టైన్మెంట్ 1. సూపర్ స్టార్తో అల్లరోడు..? ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా ఫైనల్ చేశాడు. 2. పవన్ లుక్కు సూపర్ రెస్పాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 3. ఆడియో వేడుకకే కళ్లు చెదిరే ఖర్చు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 2.0. 4. బన్ని ఫ్యాన్స్కు నిరాశేనా..! అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ 1. ఎయిరిండియాపై కన్నేసిన టాటా సింగపూర్ ఎయిర్ లైన్ భాగస్వామ్యంతో ఎయిరిండియాను కొనుగోలుచేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్టు ఓ ఇంగ్లీష్ ఛానల్ రిపోర్టు చేసింది. 2. ఇన్ఫోసిస్ నెత్తిన మరో పిడుగు జాతి వివక్ష, సీనియర్ అధికారుల వేధింపులు, మేనేజ్మెంట్ కక్షపూరిత వైఖరి తదితర ఆరోపణలు గుప్పిస్తూ అమెరికా ఇమ్మిగ్రేషన్ మాజీ హెడ్ ఎరిన్ గ్రీన్ ఇన్ఫోసిస్ కంపెనీపై దావా వేశారు. 3. పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్ ఛాన్స్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లేదా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు తమ దగ్గర ఉన్న పాతనోట్లను రిజర్వ్ బ్యాంక్ ఏ కార్యాలయంలో అయినా మార్పిడి చేసుకోవచ్చని కేంద్రప్రభుత్వం తెలిపింది. 4. హోండా 'క్లిక్' లాంచ్..సరసమైన ధరలో దేశీయ అతిపెద్ద స్కూటర్ తయారీదారు హోండా మరో గేర్ లెస్ స్కూటర్ 'క్లిక్' ను అతి తక్కువ ధరలో మార్కెట్లోకి విడుదల చేసింది. స్పోర్ట్స్.. 1. ఉతప్ప అనూహ్య నిర్ణయం సొంత టీమ్ తో 15 ఏళ్లు అనుబంధాన్ని క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెంచుకోనున్నాడు. 2. కోహ్లి అహంభావమే కారణం..! ఏడాదిపాటు భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ అర్ధంతరంగా కోచ్ పదవి నుంచి క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే తప్పుకోవడం వెనుక.. 3. ఫైనల్ తర్వాత క్లాస్ పీకాడనే.. తీసేశారా? గత ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాయాది పాకిస్థాన్ చేతిలో 180 పరుగుల తేడాతో టీమిండియా బిత్తరపోయేరీతిలో ఓటమి తర్వాత.. -
టుడే న్యూస్ రౌండప్
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు తెలపాలా? లేక మరో అభ్యర్థిని పోటీకి నిలుపాలా? అన్నది ప్రతిపక్షాలు చర్చించుకుంటుండగా.. ప్రతిపక్షాలను విస్మయపరుస్తూ కోవింద్కు మద్దతిచ్చేదిశగా బిహార్ సీఎం నితీశ్కుమార్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇక, బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తనను తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తనపై పెద్ద అభాండం వేసి పదవి నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుకు సంబంధించి ఇప్పటివరకు టాప్ కథనాలు ఇవి.. 1.రాష్ట్రపతి అభ్యర్థిపై విపక్షాల సందిగ్ధం రాష్ట్రపతి అభ్యర్థిగా ఓ దళితుడిని ఖరారు చేయడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్షాన్ని సందిగ్ధంలో పడేసింది. 2. ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు సోషల్ మీడియాలో ఐవైఆర్ కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు సర్కార్ తొలగించింది. 3. మీరు చస్తే.. పాక్లో సమాధి చేస్తారా? చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పరాజయంపై సంబరాలు చేసుకుంటున్నవారికి ప్రశ్న.. 4. విపక్షాలకు షాక్ ఇచ్చి.. కోవింద్కు జై! బీజేపీ ఊహించినట్టుగానే కొత్త రాష్ట్రపతి విషయంలో విపక్షాల్లో చీలిక.. 5.నా మీద పెద్ద అభాండం వేశారు: ఐవైఆర్ బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. 6. కొత్త ‘రాష్ట్రపతి’ గతంలో రెండుసార్లు ఓడారు ఎవ్వరూ ఊహించని విధంగా బిహార్ గవర్నర్, దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఎన్డీయే అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది 7. శివసేన ఏం చేయనుంది? మళ్లీ ఝలకా! తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ రామ్నాథ్ కోవింద్ను ఎన్డీయే ప్రకటించిన నేపథ్యంలో శివసేన పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 8. కాంగ్రెస్ కూడా ‘రాష్ట్రపతి’గా దళిత వ్యక్తినేనా? దళిత వర్గానికి చెందిన బిహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దళిత వ్యక్తినే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 9. కార్యకర్తకు చెంపదెబ్బ! మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రైతు హత్యలపై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు. 10. వేటుకు ఐవైఆర్ ఫేస్బుక్ పోస్టులే కారణమా? తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఎంత సీనియర్ ఐఏఎస్ అధికారులైనా వేటు తప్పదన్నట్లుగా తయారైంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి. 11. ఆత్మాహుతి దాడికి సిద్ధం.. అంతలో పట్టేశారు లెబనాన్లో ఓ ఉగ్రవాది జాడలను అక్కడి భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టాయి. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన అతడిని చాలా చక్యంగా బంధించాయి. 12. రూ.73 కోట్లు ‘చెత్త’లో.. మండూరు పాలికె చెత్త సేకరణ కేంద్రం నుంచి విద్యుత్, ఇంధన ఉత్పత్తి పథకంలో భారీఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఏ.బీ మాలకరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన శాసనసభ స్థాయీ సమితి స్పష్టం చేసింది. .............. క్రీడలు.... 1. మాకు దేశభక్తి ఏమిటి?: క్రికెటర్ క్రికెటర్లు నిజమైన స్టార్లు కాదంటున్నాడు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా. డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడే తమను నిజమైన స్టార్లుగా ఎలా గుర్తిస్తారంటూ ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టాడు. 2. 'బూమ్రాను చాలాకాలం బాధిస్తుంది' చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో భారత ఓటమికి పేసర్ జస్ఫిత్ బూమ్రా వేసిన నో బాల్ కూడా ఒక కారణం. 3. ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు! ప్రస్తుతం భారత అండర్ -19 , భారత్ -ఎ క్రికెట్ జట్లకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. ............... బిజినెస్... 1. జూన్ 30 అర్థరాత్రి జీఎస్టీ లాంచ్ ఒక దేశం ఒక పన్ను విధానంలో భాగంగా జూలై 1నుంచి జీఎస్టీ అమలుకు కేంద్రం కసరత్తును పూర్తి చేసింది. . 2. మోటో ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ మోటో ఫ్యాన్స్ కు కోసం ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను తీసుకొచ్చింది. 3. పసిడి ధరలు వెల వెల దేశీ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. వరుసగా సెషన్లుగా క్షీణిస్తున్న పుత్తడి ధరలు మంగళవారం మరింత దిగి వచ్చాయి. 4. ఆ విద్యార్థులకు సగటు వేతనం రూ.22లక్షలు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) హైదరాబాద్ తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ విద్యార్థుల ఫైనల్ ప్లేస్ మెంట్లను విజయవంతంగా పూర్తిచేసింది.. .................... ఎంటర్టైన్మెంట్.. 14. కట్టప్ప తరహాలో ప్రభాస్కు మరో వెన్నుపోటు! బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది చాలాకాలం వేధించిన ప్రశ్న. 15. నా కూతురు పెళ్లి చేసుకుంటేనే ఆనందం! అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. -
అమెరికాలో భారత విద్యార్థి మృతదేహం లభ్యం
న్యూయార్క్: అమెరికాలో బుధవారం అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్ నరసిపురా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఇట్హాచా జలపాతం సమీపంలోని ఫాల్ క్రీక్లో శనివారం నరసిపురా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నరసిపురా కార్నెల్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని..ఇంకా నిందితులెవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. నరసిపురా మృతిపై వర్సిటీ క్యాంపస్ ఉపాధ్యక్షుడు రెయాన్ లంబార్డీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతను కార్నెల్ వర్సిటీలోనే ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ పూర్తిచేయాలనుకున్నాడని తెలిపారు. -
భర్త మరణ వార్తనే చదవాల్సి వచ్చింది
రాయ్పూర్: ఛత్తీస్గఢ్కు చెందిన సుప్రీత్ కౌర్ (28) అనే న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది. బులెటిన్ ప్రారంభమైన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విషయాలు చెప్పాల్సి వచ్చింది. మరిన్ని వివరాల కోసం స్థానిక విలేకరిని సంప్రదించింది. మహాసముండ్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించారని అతను చెప్పినా, ఆ సమయంలో వారి పేర్లు వెల్లడించలేకపోయాడు. అయితే, విలేకరి చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రమాదంలో మృతిచెందిన వారిలో తన భర్త కూడా ఉన్నాడని, తన భర్త మరణ వార్తనే ప్రత్యక్షప్రసారంలో చదివానని కొద్దిక్షణాల్లో ఆమె గ్రహించింది. వెంటనే సంభాలించుకుని బులెటిన్ను కొనసాగించినా, కెమెరా ఆపేయగానే బోరున విలపించింది. శనివారం ఉదయం ఐబీసీ24 చానెల్లో ఇది ప్రసారమైంది. ఈ ఘటన సంస్థ కార్యాలయంలో పలువురిని కలచివేసింది. -
ఫెస్బుక్ ‘వర్క్ ప్లేస్’ ఉచితం!
న్యూయర్క్: ఫెస్బుక్ తన ‘వర్క్ప్లేస్’ టూల్ను త్వరలోనే ఉచితంగా అందించనుంది. వ్యాపారులు, ఉద్యోగులు, ప్రత్యేకంగా చాట్ చేసుకోవడానికి, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించుకోడానికి ఫేస్బుక్ 2016లో ఈ సాధనాన్ని తీసుకొచ్చింది. అయితే అప్పట్లో వర్క్ప్లేస్ను వాడుకోవాలంటే ఫేస్బుక్కు డబ్బు చెల్లించాలి. ఫేస్బుక్కు పోటీగా ఇవే తరహా సేవలందిస్తున్న మరో సాధనం ‘స్లాక్’కు చెక్ పెట్టేందుకుగాను వర్క్ప్లేస్ను ఉచితంగా అందివ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. -
ఇక అంతరిక్షంలోనూ షికార్లు చేయొచ్చు!
అంతరిక్షంలో షికారు కొట్టే రోజులు దగ్గరకొచ్చేస్తున్నాయి. అందుకు తార్కాణం ఈ ఫొటోలే. ఏంటివి? అంటున్నారా? మీకు అమెజాన్ కంపెనీ గురించి తెలుసు కదా.. దాని ఓనర్ జెఫ్ బెజోస్. ఈయన గారికి బ్లూ ఆరిజన్ అనే ఇంకో కంపెనీ కూడా ఉంది. త్వరలోనే ఈ కంపెనీ ద్వారా అంతరిక్షానికి కొందరు టూరిస్టులను తీసుకెళ్లనున్నారు. అలా తీసుకెళ్లే అంతరిక్ష నౌక ఫొటోలే పక్కనున్నవి. పేరు న్యూషెపర్డ్. కొలరాడో స్ప్రింగ్స్ (అమెరికా)లో సోమవారం నుంచి మొదలుకానున్న 33వ స్పేస్ సింపోజియంలో దీని ప్రదర్శించనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే దీంట్లో వచ్చే ఏడాదే కొంతమందిని భూమికి వంద కిలోమీటర్ల ఎత్తువరకూ తీసుకెళ్లనుంది. భూ వాతావరణానికి, అంతరిక్షానికి సరిహద్దులాంటి ఈ ప్రాంతాన్ని కార్మన్ లైన్ అంటారు. న్యూషెపర్డ్ ద్వారా ఇక్కడికి చేరుకున్న పర్యాటకులు అక్కడే కొన్ని నిమిషాలపాటు భార రహిత స్థితిని అనుభవిస్తారు. విశాలమైన కిటికీల గుండా అంతరిక్షం అందాలను ఎంచక్కా గమనించవచ్చు. ఆ తరువాత ఈ క్యాప్సూల్ నుంచి బూస్టర్ రాకెట్ కూడా విడిపోతుంది. ఆ వెంటనే కొన్ని నిమిషాలపాటు ఇది నేలకేసి ఫ్రీగా పడిపోతూ వస్తుంది. ఆ తరువాత పారాచూట్ల సాయంతో ల్యాండ్ అవుతుంది. మరోవైపు బూస్టర్ రాకెట్ కూడా తనంతట తాను విడిగా నేలకొచ్చి దిగుతుంది. న్యూషెపర్డ్లో మొత్తం ఆరుగురు కూర్చోగలిగితే.. అందరికీ ఓ కిటికీ ఉంటుంది. ఈ అంతరిక్ష నౌకను ఇప్పటికే ఐదుసార్లు విజయవంతంగా పరీక్షించి చూశారు. స్పేస్ ఎక్స్ సంస్థ సిద్ధం చేసిన క్రూడ్రాగన్ క్యాప్సూల్ కంటే న్యూషెపర్డ్ కొంచెం భిన్నంగా ఉంటుంది. డ్రాగన్లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలుంది. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి మోసుకెళ్లేందుకు మాత్రమే ఉద్దేశించినది కాబట్టి దీంట్లోని కిటికీలూ చిన్న సైజువి ఉన్నాయి. ఇంకో విషయం.. క్రూడ్రాగన్ కూడా వచ్చే ఏడాదే పనిచేయడం మొదలవుతుంది. మొత్తానికి ఇంకో అంతరిక్ష పోటీకి రంగం సిద్ధమైందన్నమాట! - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చీమలున్నాయని ఇంటికి నిప్పుపెట్టాడు..!
న్యూయార్క్: ఇంట్లో చీమల బెడద భరించలేక ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం వికటించింది. చివరికి అతని ఇల్లే తగలబడిపోయింది. ఈ ఘటన న్యూయార్క్లోని మైన్ నగరంలోని ఓల్డ్ ఆర్చర్డ్ బీచ్ ప్రాంతంలో జరిగింది. డెవోన్ డౌసెట్ అనే వ్యక్తి తన తల్లిదండ్రుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే, ఆ ఇంటి బేస్మెంట్లో చీమలు పుట్టలు పెట్టాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని అక్కడి నుంచి తరిమేయడం సాధ్యం కాలేదు. దీంతో శనివారం బేస్మెంట్ వద్ద ఉన్న చీమల పుట్ట చుట్టూ కొద్దిగా మంట పెట్టాడు. ఒక్కసారిగా ఎగిసిన మంటలు పక్కనే ఉన్న చెత్తకు అంటుకుని ఇంటి మొత్తానికి వ్యాపించాయి. ఆ సమయంలో ఒక్కడే ఉండటంతో ఇంట్లోని కొన్ని వస్తువులను బయటకు తెచ్చుకునేందుకు యత్నించి గాయపడ్డాడు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు డౌసెట్ను ఆసుపత్రికి తరలించారు. కాగా, డౌసెట్ సోదరి తమకు సాయం చేయాలంటూ ఓ ఫండ్ వెబ్సైట్లో ఘటన వివరాలు పోస్టు చేయగా.. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇప్పటివరకూ పది వేల డాలర్లు విరాళాల రూపంలో పొగయ్యాయి. డబ్బుతో పాటు ఆ కుటుంబానికి అవసరమయ్యే కొన్ని వస్తువులను కూడా కొందరు సమకూర్చారు. -
చనిపోతూ ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్!
న్యూయార్క్: ట్రాఫిక్ స్టాప్ వద్ద పోలీసుల ఆజ్ఞలను పట్టించుకోకుండా అనుచితంగా వ్యవహరించడంతోపాటు వాహనంతో ఢీకొట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై పోలీసు కాల్పులు జరపడం ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. అమెరికాకు చెందిన రోడ్నీ జేమ్స్ హెస్ గురువారం తనపై పోలీసులు కాల్పులు జరిపినపుడు ఫేస్బుక్ లైవ్లో ఉన్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. వెస్ట్ టెన్నెస్సీలోని అలమో పట్టణం సమీపంలోని హైవేపై వాహనాన్ని అడ్డంగా పార్క్ చేయడంతో హెస్ వాహనం దగ్గరకు పోలీసులు వెళ్లారని, అయితే వారి ఆజ్ఞలను అతడు పట్టించుకోలేదని టెన్నెసీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి జోష్ డివినె తెలిపారు. అంతేకాకుండా పోలీసులను వాహనంతో ఢీకొట్టేందుకు ప్రయత్నించడంతో ఓ పోలీస్ అధికారి అతడిపై కాల్పులు జరిపాడని వివరించారు. మా ఆంటీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. నేను వెంటనే ఫేస్బుక్లో లాగిన్ అయి ఆ వీడియో చూశాను అని హెస్ కాబోయే భార్య తెలిపారు. హెస్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన ఉండాలని ఆమె అన్నారు. పోలీసులు టైర్లపై షూట్ చేయాల్సింది లేదా ఇంకోలా డీల్ చేయాల్సింది. అతడిపై కాల్పులు జరిపి ఉండాల్సింది కాదు అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
29 కంపెనీల పరువు తీసేందుకు సిద్ధం
న్యూఢిల్లీ: పన్నులు చెల్లించని కంపెనీల పరువు తీసేందుకు ఐటీ శాఖ సిద్ధమౌతోంది. ఐటీ శాఖకు చెల్లించాల్సిన రూ.448.02 కోట్లను చెల్లించని 29 కంపెనీల లిస్టును శనివారం అధికారులు విడుదల చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో 29 కంపెనీల పేర్లను అడ్వర్టెయిజ్మెంట్ల ద్వారా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ గతంలో కూడా పన్ను కట్టని 67 కంపెనీల పేర్లను జాతీయ పత్రికల్లో ప్రకటించింది. వీరి నుంచి పన్ను వసూలు చేయడానికి ఆస్తులు ఏమీ లేవని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. పత్రికల్లో ప్రకటన అనంతరం ఐటీ శాఖ వెబ్సైట్లో కూడా పన్ను ఎగ్గొట్టిన కంపెనీల పేర్లు ఉంచుతారు. -
ఆ మీడియాపై వైట్హౌస్ నిషేధం!
న్యూయార్క్ టైమ్స్, బీబీసీలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వాషింగ్టన్ : అమెరికాలోని మెజారిటీ వార్తా సంస్థలు అమెరికన్లకు శత్రువుల్లా పనిచేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల తరువాత, వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పైసర్స్ కార్యాలయంలో జరిగే రోజువారీ సమావేశానికి సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ద లాస్ఏంజిల్స్ టైమ్స్, బీబీసీ, ద గార్డియన్ వంటి ప్రముఖ వార్తా సంస్థలకు ఆహ్వానం అందలేదు. ఈ వార్తా సంస్థల ప్రతినిధులు సమావేశ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా జాబితాలో ఈ సంస్థల పేర్లు లేవని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలో ప్రతిరోజూ జరిగే ఈ సమావేశం టీవీల్లో ప్రసారం కావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుతం దీన్ని ఆఫ్ కెమెరా పద్ధతిలో నిర్వహించారు. సమావేశంలో స్పైసర్ మాట్లాడుతూ మీడియా నుంచి వచ్చే వాస్తవ దూరమైన కథనాలను ట్రంప్ సర్కార్ బలంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను అంగీకరించ లేమని సీఎన్ ఎన్ వాస్తవాలు వారికి నచ్చకపోవడం వల్లే ఇటువంటి చర్యలు తీసుకున్నారని, అయినా వాస్తవాలు వెల్లడించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధమైన పత్రికా స్వేచ్ఛపై వైట్హౌస్ వర్గాలు విషప్రచారం చేస్తున్నాయని, ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయమని నేషనల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పేర్కొన్నారు. కాగా, వ్యాపార నిర్వహణలో ఉద్యోగాల కల్పనకు అవరోధంగా ఉన్న నిబంధనల్ని తొలగించే లక్ష్యంతో టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పచ్చజెండా ఊపారు. -
‘సాక్షి’ న్యూస్ రీడర్కు పురస్కారం
వివేక్నగర్: వార్తల సేకరణ, వాటిని చదవటం కష్టమైన పని అని, న్యూస్రీడర్స్కు స్పష్టమైన ఉచ్చారణ, సమయస్ఫూర్తి ముఖ్యమని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆరాధన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీత్యాగరాయ గానసభలో జరిగిన టీవీ న్యూస్ రీడర్స్ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిం చారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ న్యూస్ రీడర్ సిద్ధేశ్వరరెడ్డిని ఉత్తమ న్యూస్ రీడర్ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఇదే వేదికపై వివిధ తెలుగు టీవీ చానళ్లకు చెందిన టీవీ న్యూస్ రీడర్లకు ఉత్తమ న్యూస్ రీడర్స్ పురస్కారం ప్రదానం చేశారు. సీనియర్ న్యూస్ రీడర్స్ దీప్తి వాజ్పేయి, నాగశ్రీలను స్వర్ణ ప తకాలతో సత్కరించారు. సభలో సాహితీవేత్త డా. ద్వా.నా శాస్త్రి,గుదిబండి వెంకటరెడ్డి, వైకే నాగేశ్వరరావు, న్యూస్ రీడర్ కోట విజయలక్ష్మి, జి.హనుమంతరావు, జయప్రకాష్రెడ్డి, అ వార్డు గ్రహీతలు ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు జరిగిన సినీ సంగీత విభావరి ఆహూతులను అలరించింది. -
శుభాకాంక్షల వెల్లువ
- నూతన సంవత్సర వేడుకల్లో నాయకులు, అధికారులు - కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్న వైనం - కలెక్టర్కు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు కర్నూలు అగ్రికల్చర్: నూతన సంవత్సరం సందర్భంగా నేతలు, ఉద్యోగులు ఆదివారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు తమ అభిమాన నేతలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు, మరో వైపు ఉన్నతాధికారులకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేందుకు కర్నూలుకు తరలివచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, నేతల గృహాలు కిటకిటలాడాయి. జిల్లా యంత్రాంగం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు , వివిధ స్థాయి ఉద్యోగులు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ను కలిసి 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టర్ చేత క్యాలెండర్లు ఆవిష్కరించారు. నూతన సంవత్సర కేకులను కలెక్టర్ చేత కట్ చేయించారు. అలాగే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి దంపతులు, డోన్లో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి అభిమానులు బొకేలు అందించి శుభకాంక్షలు తెలిపారు. జిల్లాను ప్రగతిపథంలో నిలుపుదాం కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పని చేసి జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జిల్లాను అభివృద్దిలో మొదటి స్థానానికి తీసుకెళ్దాన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసి–2 రామస్వామి, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్కుమార్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, ట్రెజరీ డీడీ శివఅర్జన్కుమార్, జడ్పీ సీఈఓ ఈశ్వర్, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, విద్యుత్ ఎస్ఈ బార్గవరాముడు , శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, హౌసింగ్ పీడీ హుసేన్సాహెబ్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, గొర్రెల సంఘం అధ్యక్షడు నాగేశ్వరయాదవ్, ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్రెడ్డి, ఓబులేసు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, మిగిలిన శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు తరలివచ్చి కలెక్టర్కు బొకేలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు: జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్.వెంగళ్రెడ్డి, జవహార్లాల్, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్బాబు, గిరికుమార్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టిఎండీ హుస్సేన్, జిల్లా నేతలు రామన్న, వేణుగోపాల్, నాగమణి ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ హమీద్, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితర ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు కూడా కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. - జాయింట్ కలెక్టర్ హరికిరణ్ను వివిధ శాఖల అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. - జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్గౌడుకు ఆర్డీఓలు, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, వివిదశాఖల అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
కమాండ్ కంట్రోల్ సెంటర్లో న్యూ ఇయర్ వేడుకలు
కర్నూలు: జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పోలీసు అధికారులు ఆదివారం ఉదయం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలిరావడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ కిటకిటలాడింది. జేసీ హరికిరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటిబాబురావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ప్రతినిధి బృందం శేఖర్బాబు, రామకృష్ణ, నాగభూషణం, హోంగార్డు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయరత్నం డీఎస్పీలు రమణమూర్తి, బాబా ఫకృద్దీన్, సుప్రజ, వీరరాఘవరెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, బాబుప్రసాద్, హరినాథరెడ్డి ఎస్పీని కలిసి పూలబోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సబ్డివిజన్ అధికారులతో పాటు సీఐలు కూడా ఎస్పీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీ.క్యాంపులో నివాసం ఉంటున్న డీఐజీ బంగ్లా, జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయం కూడా పోలీసు అధికారులతో కిటకిటలాడాయి. ఏపీఎస్పీ రెండో పటాలంలో పనిచేస్తున్న పలువురు అధికారులు కమాండెంట్ విజయకుమార్ను కలిసి పూలబొకే ఇచ్చిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -
మైస్టాంప్స్లోనే గ్రీటింగ్కు అవకాశం
- తపాలా వినియోగదారులకు నూతన సంవత్సర కానుక - పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు వెల్లడి కర్నూలు (ఓల్డ్సిటీ): తపాలా వినియోగదారులకు ఆ శాఖ అధికారులు నూతన సంవత్సర కానుకగా 'మైస్టాంప్'లో సొంత ఫొటోతో పాటు గ్రీటింగ్స్ చెప్పుకునే సదుపాయం కూడా కల్పించారు. పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు శుక్రవారం తన ఛాంబరులో మొదటి ఇద్దరు వినియోగదారులకు వారి ఫొటోలతో ఉన్న గ్రీటింగ్ మైస్టాంప్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాలకే పరిమితమైన పోస్టల్ శాఖ కాలానుగుణంగా నిత్యనూతన సేవలను అందిస్తోందన్నారు. కొత్త సంవత్సరంలో బంధు మిత్రులకు గ్రీటింగ్స్ పంపించుకుంటారని, అయితే ఆ గ్రీటింగ్ కవర్పై అతికించిన స్టాంపులు సైతం సొంత ఫొటోతో ఉండటం, ఆపై అందులో 'హ్యాపీ న్యూఇయర్' అంటూ గ్రీటింగ్స్ కూడా ముద్రించి ఉండటం వినియోగదారులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. వినియోగదారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
హద్దు మీరితే నాన్ బెయిలబుల్ కేసులు
- నూతన సంవత్సర వేడుకలపై ఎస్పీ హెచ్చరిక కర్నూలు: నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఆకే రవికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విద్యార్థులు, యువకులు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి శబ్దాలు చేస్తూ నడపడం, రహదారులపై ఫీట్లు, రేసులు నిర్వహించడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతర వాహన చోదకులకు, మహిళలకు, ప్రజలకు ఇబ్బందులు కలుగజేసే విధంగా వ్యవహరిస్తే నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. డీఎస్పీ కార్యాలయం ఆకస్మిక తనిఖీ వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం నగరంలోని కర్నూలు సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఓరల్ ఎంక్వైరీలు, క్రైం చాప్టర్, క్రైం రేటుకు సంబంధించిన సబ్ డివిజన్ కార్యాలయ ఫైళ్లను పరిశీలించారు. ప్రాపర్టీ క్రైం, చైన్ స్నాచింగ్ నేరాల రేటు తగ్గే విధంగా చర్యలు చేపట్టాలని డీఎస్పీ రమణమూర్తికి సూచించారు. రాత్రి గస్తీలలో ఈ–బీట్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పట్లో పెట్టరంట!
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డోనాల్డ్ ట్రంప్ తన తొలి పత్రికా సమావేశాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. ఇప్పట్లో ప్రెస్ మీట్ నిర్వహించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. జనవరి వరకు మీడియా ముందుకు రాకూడదని ట్రంప్ అనుకున్నారని ప్రస్తుతం శ్వేత సౌదం నుంచి అధికార బదిలీ వ్యవహారాలు చూస్తున్న ట్రంప్ అధికార ప్రతినిధి హోప్ హిక్స్ తెలిపారు. వాస్తవానికి అధికార బదిలీ నేపథ్యంలో ట్రంప్ ఈ గురువారం తొలి పత్రికా సమావేశం నిర్వహిస్తారని, అందులో ఆయన వ్యూహాలు, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కొత్తగా సిద్ధం చేసిన విధానాలు, వివాదాల విషయంలో తీసుకోబోయే పరిష్కార మార్గాలు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ ప్రకటనతో ఇప్పటివరకు తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా ఈ ఒక్క ప్రకటనతో తనవైపునకు తిప్పుకునేలా పత్రికా సమావేశానికి కావాల్సిన సమాచారం సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే, జనవరి వరకు అలాంటి కార్యక్రమం పెట్టుకోవద్దని ట్రంప్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. ట్రంప్ అధ్యక్షుడిగా జనవరిలోనే ప్రమాణం చేయనున్నారు. -
ప్యాంటులో పేలిన ఈ-సిగరెట్
సిగరెట్లు కాల్చే అలవాటు మానుకోవాలంటే ముందుగా ఈ-సిగరెట్లు అలవాటు చేసుకుంటారు కొంతమంది. ఇవి అంతగా ప్రమాదకరం కాకపోవడం, దుష్ప్రభావాలు లేకపోవడంతో పాటు.. దాదాపుగా సిగరెట్ తాగినంత మజా వస్తుందని చాలామంది అంటుంటారు. కానీ.. న్యూయార్క్లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రాంతంలో షాపింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ప్యాంటులో ఉన్న ఈ-సిగరెట్ పేలింది. దాంతో అతడి కాలికి, చేతికి గాయాలయ్యాయి. ఉన్నట్టుండి ఏదో బాణసంచా కాల్పుల్లా తనకు అనిపించిందని, తీరా చూస్తే ఒక వ్యక్తి ప్యాంటులోంచి మంటలు రావడం చూశానని సెంట్రల్ సెల్లార్స్ ఉద్యోగి జాన్ లీ చెప్పారు. బాధితుడిని వెంటనే ఒక ప్రైవేటు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అతడికి చిన్నపాటి గాయాలే అయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. అయితే దీనివల్ల అక్కడ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదు. సాధారణంగా బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ సిగరెట్లకు మంటలు అంటవు. అప్పుడప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది. ఈ సిగరెట్లు ప్యాక్ చేసుకుని ప్రయాణించడాన్ని నిషేధిస్తూ అమెరికా రవాణా గత సంవత్సరం ఓ నిబంధన విధించింది. -
నోట్ల రద్దు దెబ్బకు మూతపడుతున్న పత్రికలు
పెద్ద నోట్ల రద్దు దెబ్బకు ప్రజానికానికి సమాచారం అందించే పత్రికలు సైతం మూతపడుతున్నాయి. కేంద్రప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ఈ రద్దు నిర్ణయంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పత్రికా కార్యకలాపాలు నిర్వహించడానికి డబ్బులు లేక, బలవంతంగా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. పరిస్థితి సర్దుమణిగి, అన్నీ కరెన్సీ నోట్లు సులభతరంగా చలామణిలోకి వచ్చేంతవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని కాంగ్లా పావ్ డైలీ సంపాదకుడు, యజమాని పోనమ్ లబాంగ్ మన్గ్యాంగ్ తెలిపారు. ప్రకటనదారుల వద్ద కొత్త కరెన్సీ నోట్లు రూ.500, రూ.2000 లేవని, యాజమాన్యాలు పాత నోట్లను తీసుకునేందుకు అంగీకరించడం లేదని మన్గ్యాంగ్ చెప్పారు. గురువారం అత్యవసరంగా నిర్వహించిన ఆల్ మణిపూర్ న్యూస్పేపర్స్ పబ్లిషర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పత్రికా కార్యాలయాలు మూసివేయాలని అక్కడి యాజమాన్యాలు నిర్ణయించాయి. చట్టపరమైన లావాదేవీలు జరిపే పొజిషన్లో కూడా లేకపోవడంతో గురువారం నుంచి ఆఫీసులు మూతవేయనున్నట్టు ఈ అసోషియన్ ప్రకటించింది. నగదు లేకపోవడంతో న్యూస్పేపర్ షట్టర్స్ సైతం మూతపడుతున్నట్టు పేర్కొంది. జనవరిలో జరుగుబోయే ఎన్నికల్లో నోట్ల రద్దు దుర్బలమైన ప్రభావం చూపుతుందని, పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని అసలు ఊహించలేమని సీనియర్ బీజేపీ లీడర్ నిమాయిచంద్ లువాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి సరిపడ కరెన్సీని డిమాండ్ చేయడంలో విఫలమవుతుందని విమర్శించారు. అంతేకాక భద్రతా కారణాల ఆదోళనలతో బ్యాంకు శాఖల వద్ద నగదు లావాదేవీలు జరుగడం లేదని లువాంగ్ తెలిపారు. పెట్రోల్ కొనడానికి కూడా తమదగ్గర డబ్బులు ఉండటం లేదని రిపోర్టర్లు చెబుతున్నారు. స్కూల్స్ సైతం ఈ దెబ్బకు మూతపడుతున్నాయి. -
త్రీ ఇన్ వన్... స్తంభం
ఒక్క దెబ్బకు మూడు పిట్టలంటే... ఇదే. పర్యావరణ కాలుష్యం తగ్గించాలని అందరూ అనుకుంటున్నారా! ఇంకోపక్క విద్యుత్తుతో నడిచే కార్లు, మోటర్బైక్ల వాడకమూ కొద్దోగొప్పో పెరుగుతోందా! త్రీజీ, 4జీల అవసరమూ ఎక్కువవుతోందా! అవునండీ అవును... అన్నీ నిజమే. కానీ, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఒక్క దెబ్బకు మూడు పిట్టలంటే... ఇదే. పర్యావరణ కాలుష్యం తగ్గించాలని అందరూ అనుకుంటున్నారా! ఇంకోపక్క విద్యుత్తుతో నడిచే కార్లు, మోటర్బైక్ల వాడకమూ కొద్దోగొప్పో పెరుగుతోందా! త్రీజీ, 4జీల అవసరమూ ఎక్కువవుతోందా! అవునండీ అవును... అన్నీ నిజమే. కానీ, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నారా? అక్కడికే వస్తున్నాం. నగరాల్లో ఈ మూడు చిక్కుముళ్లను ఠక్కున విడదీసేందుకు మా స్తంభాల్ని వాడండి అంటోంది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ టోటెమ్! పక్క ఫొటోలో కనిపిస్తున్నవి అవే. ఏంటి దీని ప్రత్యేకత అంటే... స్తంభం పైభాగంలో పువ్వుల రేకుల్లాంటి షేపుంది చూశారూ.... వాటిపైన సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వాటి అడుగున ఉన్న ప్లేస్లో శక్తిమంతమైన ఎల్ఈడీ లైట్లు ఉంటాయన్నమాట. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతో ఇవి పనిచేస్తాయి. మొత్తం 5 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగల ప్యానెల్స్ ఉన్నాయి. అవసరానికి మించి విద్యుత్తు ఉత్పత్తి అయ్యిందనుకోండి. దాన్ని కాస్తా స్తంభం లోపల ఉండే 50 కిలోవాట్ల సామర్థ్యమున్న బ్యాటరీల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే కాదు... ఈ ప్రాంతంలోనే త్రీజీ, 4జీ ఇంటర్నెట్ మొబైల్ సేవలు అందించే పరికరాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే... వీధి దీపాలుగా, బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లుగా, వై–ఫై, మొబైల్ టవర్లుగా ఈ స్తంభాలు పనిచేస్తా యన్నమాట. ఒక్కో స్తంభం నుంచి రెండు విద్యుత్ వాహనాల్ని ఛార్జ్ చేసుకునే వీలుందని కంపెనీ చెబుతోంది. ఎల్ఈడీ లైటింగ్ విషయానికొస్తే ఇందులో ఏర్పాటు చేసిన లైటింగ్ సెన్సర్ల కారణంగా వీధి దీపాలను ఆన్/ఆఫ్ చేయడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చీకటిపడ్డా... లేదంటే మేఘాల కారణంగా వెలుతురు తగ్గినా... ఈ సెన్సర్లు గుర్తించి లైట్లు ఆన్ చేసేస్తాయి. వెలుతురు పెరిగినప్పుడు ఆఫ్ చేస్తాయి కూడా! -
టుడే న్యూస్ డైరీ
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ సేవలు: గురునానక్ జయంతి సందర్భంగా నేడు బ్యాంకు లకు సెలవు. కానీ తెలుగు రాష్ట్రాల్లోమాత్రం పరిమిత సేవలు కొనసాగుతాయని ఆయా శాఖలు ప్రకటించాయి. ఏపీలో అన్ని బ్యాంకులు, ట్రెరజరీల సేవలు సోమవారం కూడా కొనసాగుతాయని, పాతనోట్లతో పన్నులు చెల్లించేందుకు నేడు ఆఖరి గడువని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటు తెలంగాణలో 113 ఎస్ బీహెచ్ శాఖలు పనిచేయనున్నాయి. కానీ నోట్ల చెల్లింపులు ఉండవని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో నేడు కూడా పాత నోట్లతో పన్నులు చెల్లింపులు స్వీకరిస్తారు. నోట్ల రద్దుపై ఏంచేద్దాం?: రూ.500. రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడంతో దేశంలో నెలకొన్న పరిస్థితులు, సామాన్యుడి కష్టాలపై చర్చించి జాతీయస్థాయిలో ఉద్యమం ప్రారంభించాలా, వద్దా అనే అంశాలపై చర్చించేందుకు నేడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎంలు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నాయి. నోట్ల రద్దుపై కాంగ్రెస్ నిరసన: పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్: నేటి నుంచి ఢిల్లీలో అంతర్జాతీయ వాణిజ్య మేళా ప్రారంభం కానుంది. కార్తీక శోభ: కార్తీక సోమవారం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలంలో నేటిసాయంత్రం జ్వాలా తోరణ దర్శనం, పుణ్య నదీ హారతి కార్యక్రమాలు ఉంటాయి. చెవిరెడ్డి ధర్నా: చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేడు ధర్నా చేయనున్నారు. -
మరో రెండు చానళ్లపై వేటు
న్యూఢిల్లీ: ‘ఎన్డీటీవీ ఇండియా’ చానల్పై నిషేధం విధించడాన్ని విపక్షాలు తప్పుబడుతుండగానే కేంద్ర ప్రభుత్వం మరో రెండు చానళ్లపై వేటు వేసింది. ‘న్యూస్ టైం అస్సాం’ చానల్ పలుసార్లు మార్గదర్శకాలను ఉల్లంఘించి, క్షమాపణ కోరుతూ సవరణ ప్రసారం చేయమన్నా చేయలేదు. దీంతో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి 10 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. యజమాని చేతిలో దారుణ చిత్రహింసలకు గురైన పని పిల్లవాడి గుర్తింపు తెలిపేలా ఈ చానల్ ప్రసారాలు చేసి, అతని గౌరవానికి భంగం కలిగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2013లోనే చానెల్పై నిషేధం విధించాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినా అప్పట్లో అమలు కాలేదు. మరో ఉత్తర్వులో ‘కేర్ వరల్డ్ టీవీ’ అనే చానల్ను కూడా ప్రభుత్వం నిషేధించింది. అభ్యంతరకర దృశ్యాలను చూపించడంతో నవంబరు 9 నుంచి ఈ చానల్ ప్రసారాలను వారం రోజులపాటు నిషేధించింది. -
'కొత్త జిల్లాల ప్రకటనను వాయిదా వేయాలి’
హైదరాబాద్: శాసనసభలో చర్చించి, నిర్ణయం తీసుకునే వరకు జిల్లాల విభజనపై తుది ప్రకటనను వాయిదా వేయాలని బీజే ఎల్పీనేత జి.కిషన్రెడ్డి డిమాండ్చేశారు. ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం విశ్వాసమున్నా జిల్లాల ఏర్పాటు ఏకపక్షంగా జరపొద్దన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వీటిపై అసెంబ్లీలో చర్చించకుండా జిల్లాల ప్రకటన చేయవద్దని గట్టిగా సూచించారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాలులో విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 20 నుంచి పది పనిదినాలు అసెంబ్లీ జరిగే విధంగా స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించగా, దానిని కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని ప్రొరోగ్ చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దీనిపై బీఏసీలో, ఇతర పక్షాలతో చర్చించకుండా సీఎం ఇచ్చిన మాటను ఆయనే ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, శాసనసభ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ధ్వజమెత్తారు. స్పీకర్ను అవమానించేలా వ్యవహరించిందన్నారు. అసెంబ్లీ ద్వారా కాకుండా ఆర్డినెన్స్ల ద్వారా భూసేకరణ చట్టానికి సవరణలు, బీసీ కమిషన్ ఏర్పాటు, నిజామాబాద్,కరీంనగర్ కమిషనరేట్ల ఏర్పాటునకు ప్రభుత్వం ఈ చర్యకు దిగిందన్నారు. పార్టీ పిరాయింపులపై హైకోర్టు చేసిన సూచనలను స్పీకర్ పరిగణలోకి తీసుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా ఉంది.. రోడ్లు పూర్తిగా దెబ్బతిని, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా తయారైందని కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ రోడ్లు నరకానికి దారులుగా మారాయన్నారు. మున్సిపల్ మంత్రి ఉత్తర కుమార ప్రగల్భాల మాదిరిగా రోడ్లను అదిచేస్తాం ఇది చేస్తామన్నారే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. వంద రోజుల్లో మొత్తం పరిస్థితిని మార్చేస్తామని, రోడ్లను అద్దంగా మారుస్తామని మంత్రి చెప్పారన్నారు. కొత్త రోడ్లు వేయడం మాట అటుంచి, కనీసం రోడ్లపై పడిన గుంతలను పూడ్చడానికి ఏమైందని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం లేదా మంత్రి వైఫల్యమా లేక జీహేచ్ఎంసీ యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదా అని నిలదీశారు. -
'కాపుల్లో చిచ్చుపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది'
హైదరాబాద్ : కాపుల్లో చిచ్చుపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఓ ప్రైవేట్ చానల్ ఎండీ సాయిసుధాకర్ ఆరోపించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...తుని ఘటనపై విచారణ పేరుతో కావాలనే కొందర్ని వేధిస్తున్నారన్నారు. సీఐడీ విచారణలో తాను చెప్పిన దానికి, పత్రికల్లో వచ్చిన దానికి తేడా ఉందన్నారు. విచారణ వివరాలు ఒక పత్రికకు మాత్రమే ఎలా వచ్చాయో పోలీసులు చెప్పాలన్నారు. ఆ పత్రికలో వచ్చిన వార్తలపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. విచారణ ఫుటేజీని బయటపెట్టాలని సాయిసుధాకర్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సోమవారం సీఐడీ విచారణకు ఆయన హాజరైన విషయం తెలిసిందే. -
అమెరికాలో భారీ పేలుడు
న్యూయార్క్: అమెరికాలోని మాన్ హటన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో చెత్తకుండీలో విస్ఫోటనం సంభవించడంతో దాదాపు 25మంది గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోని తీసుకున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతలోని చుట్టుపక్కల షాపులు, రెస్టారెంట్లను మూసివేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించించనట్లు చెప్పారు. న్యూజెర్సీలో పైప్ లైన్ పేలుడు జరిగిన కొద్ది గంటల్లో మాన్ హటన్ లో పేలుడు సంభవించింది. -
సన్నీలియోన్.. పొట్టిగా, లావుగా ఉండేదట!
'నువ్వు లావుగా.. పొట్టిగా ఉన్నావు, మోడలింగ్కు పనికిరావు' ఈ కామెంట్ ఎవరి గురించి వచ్చిందో తెలుసా.. బాలీవుడ్లో హీరోయిన్గా దాదాపు స్థిరపడిపోయిన సన్నీ లియోన్ గురించట! న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ మీద నడిచిన మొట్టమొదటి బాలీవుడ్ నటిగా సన్నీలియోన్ పేరు సంపాదించింది. ఐశ్వర్యారాయ్ లాంటివాళ్లకు సైతం దక్కని అవకాశం సన్నీకి దక్కిందంటే చిన్నవిషయం కాదు. అలాంటి సన్నీ మొదట్లో, అంటే సుమారు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మోడలింగ్ కోసం ప్రయత్నిస్తే, ఆమెకు ఎదురైన సమాధానం అది. చిన్నప్పటి నుంచి తనకు మోడల్ అవ్వాలనే ఉండేదని, దాంతో 18 ఏళ్లు రాగానే తాను ప్రయత్నాలు మొదలుపెట్టానని సన్నీ లియోన్ చెప్పింది. కానీ అప్పట్లో తనకు అన్నీ తిరస్కారాలే ఎదురయ్యాయని తెలిపింది. అలాంటి పొట్టి, లావు అమ్మాయి ఇప్పుడు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద నడిచిందని ఆమె ఆనందంగా వివరించింది. ర్యాంప్ మీద నడుస్తుంటే జారిపడిపోతానేమోనని భయం వేసిందని, అయితే అదృష్టం కొద్దీ అలాంటివేమీ జరగలేదని చెప్పింది. ఇదే ర్యాంపు మీద యాసిడ్ దాడి బాధితురాలు రేష్మా ఖురేషీ కూడా నడిచిన విషయం తెలిసిందే. రేష్మాను కలిసి ఆమెతో మాట్లాడానని, ఆమె అచ్చం ఒక బొమ్మలా ఉందని.. ఆమె ధైర్యం, పట్టుదల చూసి తాను చాలా ఆనందించానని తెలిపింది. -
నదీతీరంలో మది పులకించే విందు
పాతనీ, కొత్తనీ కలిపి సరికొత్తగా సృష్టించడం ఇప్పటి ట్రెండ్. పాత నిర్మాణాలను అలాగే ఉంచేస్తారు, ఆ నిర్మాణాలకు ఏ మాత్రం భంగం కలగకుండా కొత్త నిర్మాణాలను వాటికి జోడిస్తారు. న్యూయార్క్లో ఇలాంటిదే ఒక సరికొత్త నిర్మాణం... రెస్టారెంట్గా కనువిందు చేయబోతోంది. పసందైన విందునీ ఇవ్వబోతోంది. గాల్లో తేలినట్టుందే... ఒళ్లు తూలినట్టుందే.. పాట గుర్తొస్తోందా? ప్రియురాలి కోసం హీరో పాడిన ఆ పాట సంగతేమోగానీ... ఈ ఫొటోలో కనిపిస్తున్న అద్దాల గదిలోకి వెళితే మాత్రం ఒళ్లు తూలినట్టు కావడం ఖాయం. ఎందుకంటే ఇది భూమికి 800 అడుగుల ఎత్తులో ఉంటుంది కాబట్టి. న్యూయార్క్ మహానగరంలో హడ్సన్ నది తీరంలో త్వరలో ఏర్పాటు కానున్న హైటెక్ రెస్టారెంట్ డిజైన్ ఇది. బిగ్ఫుట్ డెవలపర్స్ అనే సంస్థ దీన్ని నిర్మించనుంది. పాతకాలపు గ్లెన్వుడ్ విద్యుత్ కేంద్రం భవనాన్ని అలాగే ఉంచి, దాని పొగ గొట్టాల మధ్యలో ఈ భారీ సైజు గాజు గదిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పొగగొట్టాల నుంచి ఉక్కు తీగల ద్వారా వేలాడే ఈ హోటల్ నాలుగు గోడలూ అద్దాలే. అంతేకాదు.. 44 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పు ఉండే ఈ రెస్టారెంట్ను చేరుకోవాలంటే ఒక పొగ గొట్టం మధ్యభాగం నుంచి ఓ గాజు బ్రిడ్జిపై వెళ్లాల్సి ఉంటుంది. ఇక రెస్టారెంట్ మధ్యభాగంలో పచ్చగా కనిపిస్తోందే.. అది ఈ హోటల్ తాలూకు వంటగది. ఉపరితలంపై పచ్చటి మొక్కలు ఏర్పాటు చేస్తారు అంతే. ఒకవైపు నది, ఇంకోవైపు ఆకాశహర్మ్యాల వెలుగులు ఉన్న ఈ రెస్టారెంట్లో ఒకసారికి దాదాపు 48 మంది కూర్చుని విందారగించవచ్చు. ఇది వినూత్నమైన అనుభూతి మిగులుస్తుందనడంలో సందేహం లేదుగానీ... నేలవైపున చూస్తే మాత్రం హార్ట్బీట్ పెరిగిపోవడం గ్యారంటీ! -
సన్నీలియోన్కు మరో ఘనత!!
బాలీవుడ్ బాంబ్షెల్ సన్నీలియోన్ మరో అరుదైన ఘనతను సాధించబోతోంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ మీద నడవబోతున్న మొట్టమొదటి బాలీవుడ్ నటిగా ఆమె గుర్తింపు పొందబోతోంది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంత పెద్ద ఈవెంట్లో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు ఆమె ఉబ్బి తబ్బిబ్బు అయిపోతోంది. ప్రముఖ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన వస్త్రాలను ధరించి ర్యాంప్ మీద ఓపెనింగ్ షోలో తాను నడవబోతున్నట్లు సన్నీ ట్వీట్ చేసింది. ఇక ఇదే విషయం గురించి డిజైనర్ అర్చనా కొచ్చర్ కూడా ట్వీట్ చేసింది. తాను భారతదేశంలో పర్యటించినప్పుడు పొందిన అనుభూతులతో రూపొందించిన 'ఎ టేల్ ఆఫ్ టూ ట్రావెల్స్' అనే డిజైనర్ దుస్తులను సన్నీ కోసం అర్చన ఇస్తున్నారు. Woohoo!! Dreams really do come true! Thank you @Archana_Kochhar pic.twitter.com/5M9ACJdRXI — Sunny Leone (@SunnyLeone) 4 September 2016 So excited!A dream come true...I'm walking NewYork Fashion Week SS17 for Archana Kochhar Opening Show on the 8th Sep 2016 @Archana_Kochhar — Sunny Leone (@SunnyLeone) 4 September 2016 The count down begins ! 8th September #NYFW16 #ArchanaKochhar #NYFW #FTLMODA #couture #fashionshow pic.twitter.com/jJ6EewhXpp — Archana Kochhar (@Archana_Kochhar) 1 September 2016 -
ఆర్నబ్ ఏం అడిగాడు.. సెహ్వాగ్ ఏం చెప్పాడు!
రియో ఒలింపిక్స్లో భారత ప్రదర్శనపై చెత్త వ్యాఖ్యలు చేసి బ్రిటిష్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ వార్తలో నిలిచిన సంగతి తెలిసిందే. ’120 కోట్లమంది జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోంది. ఎంత చిరాకు కలిగించే విషయమిది’ అని మోర్గాన్ నోరు పారేసుకున్నాడు. నోటి దురుసుతనం బాగా ఎక్కువైన ఈ సీఎన్ఎన్ మాజీ ప్రజెంటర్కు ట్విట్టర్లో భారతీయులు ఓ రేంజ్లో కౌంటరిచ్చారు. మాజీ డ్యాషింగ్ క్రికెటర్ సెహ్వాగ్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఇప్పటివరకు క్రికెట్లో వరల్డ్ కప్ గెలువని మీరా (ఇంగ్లండ్) మాగురించి మాట్లాడేదని దెప్పిపొడిచాడు. దీంతో రోషం పొడుచుకొచ్చిన మోర్గాన్ ఏకంగా సెహ్వాగ్కే సవాల్ విసిరాడు. ’హాయ్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇండియా మరో ఒలింపిక్స్ మెడల్ గెలిచేలోపే ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్ కొడుతోంది. నాతో రూ. 10 లక్షల బెట్టు కాస్తావా’ అని సవాల్ చేశాడు. ఈ సవాల్ను లైట్ తీసుకున్న సెహ్వాగ్.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి తన షో 'న్యూస్ అవర్'లో మోర్గాన్పై మాట్లాడమని అడిగారని, కానీ, టీవీలో ప్రసారమయ్యేంత సీన్ ఆయనకు లేదని తాను తోసిపుచ్చానని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సున్నితమైన హాస్యంతో కూడిన ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Arnab Goswami wants me to speak on that British guys views on India on NewsHour,but that man doesnt deserve any airtime,hence I have denied — Virender Sehwag (@virendersehwag) 2 September 2016 -
మోదీ మళ్ళీ రావాలి..!
న్యూఢిల్లీః నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 లోనూ అధికారంలోకి రావాలని 70 శాతం మంది భారత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత.. మోదీనే మళ్ళీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్సాప్ సహకారంతో ఓ న్యూస్ యాప్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ కొత్త అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. న్యూస్ యాప్ ద్వారా నిర్వహించిన ఆన్ లైన్ పోల్ కు స్పందించిన మొత్తం 63,141 వినియోగదారుల్లో నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావాలని 79 శాతం మంది ఓటు వేయగా, 17 శాతం మంది వద్దని, 13 శాతం మంది మాత్రం ఇంకా నిర్ణయించలేదంటూ స్పందించారు. అయితే మిగిలిన మద్దతుదారులతో పోలిస్తే మహిళల నుంచి మాత్రం మద్దతు స్వల్పంగా తగ్గి 64 శాతంగా నమోదైంది. యూత్ ఆఫ్ ద నేషనల్ పోల్ రెండో ఎడిషన్ ప్రకారం 64 శాతం మంది మహిళలు మద్దతు పలుకగా... 18 శాతంమంది వద్దని, మరో 18 శాతం మంది నిర్ణయించలేదని ఓట్ చేశారు. జూలై 25 నుంచి ఆగస్లు 7 వరకూ నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది 35 సంవత్సరాల వయసు లోపు వారే పాల్గొన్నారు. అయితే పోల్ లో పాల్గొన్న సగంకంటే ఎక్కువ (57 శాతం) మంది కొన్ని రాష్ట్రాల్లో మద్య నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. కళాశాల ప్రాంగణాల్లో విద్యార్థుల రాజకీయాలను నిషేధించడంపై అడిగిన ప్రశ్నకు 61 శాతం మంది అవును అని, 32 శాతం మంది కాదని, 7 శాత మంది మాత్రం చెప్పలేమని అన్నారు. అలాగే గత రెండు సంవత్సరాల్లో దళితులు, మైనారిటీల అత్యాచారాల పెరుగుదలపై 33 శాతం మంది నిజమని, 46 శాతం మంది కాదని, 21 శాతం మంది మాత్రం చెప్పలేమని ఓటు వేశారు. ముఖ్యంగా తాము నిర్వహించిన పోల్ లో యువత, విద్యావంతులు మోదీ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నట్లు వ్యక్తమౌతున్నదని, కాశ్మీర్లో బుర్హాన్ వాని మరణం అనంతరం నిరసనలు.. ప్రభుత్వం అనుసరించిన విధానాలను వారు ఆమోదించినట్లు ఇప్సాస్ ఇండియా సీఈవో అమిత్ అదార్కర్ తెలిపారు. -
పరువు నష్టం దావా వేసిన ట్రంప్ భార్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ను ఇటీవల కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థల్లో ప్రచురితమైన కథనాలు తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. మెలానియా ట్రంప్ గత జీవితం, ఆమె అమెరికాకు వచ్చి ట్రంప్ భార్యగా మారిన క్రమం లాంటి తదితర వివరాలను వెల్లడిస్తూ ఇటీవల 'డెయిలీ మెయిల్'లో కథనం ప్రచురితమైంది. ఓ స్లోవేకియన్ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ డెయిలీ మెయిల్ ఈ కథనాన్ని ప్రచురించింది. అందులో.. గతంలో మెలానియా ట్రంప్ మోడలింగ్ చేసిన ఏజెన్సీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు మోడలింగ్ ఏజెన్సీ సంపన్నులకు మహిళలను సరఫరా చేసేదంటూ డెయిలీ మెయిల్ ఆరోపణలు చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన మెలానియా డెయిలీ మెయిల్తో పాటు అలాటి కథనాన్నే ప్రచురించిన మరో మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశారు. డెయిలీ మెయిల్ వెల్లడించిన కథనం వంద శాతం అసత్యమని.. అది తన వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉందని మెలానియా ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిపై మేరీలాండ్లోని మోంట్గోమరీ కోర్టులో గురువారం పరువునష్టం దావా వేసినట్లు ఆమె ప్రతినిథి చార్లెస్ హార్డర్ తెలిపారు. 150 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఆమె డిమాండ్ చేశారు. మెలానియా పరువునష్టం దావా వేసిన రెండు గంటల్లోనే డెయిలీ మెయిల్ తన కథనాన్ని ఉపసంహరించుకోవడం విశేషం. అంతేకాదు.. తాము ప్రచురించిన కథనం ఉద్దేశం మెలానియా 'ఎస్కార్ట్'గా పనిచేశారని కాదని డెయిలీ మెయిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పాటల్లాగే వార్తలూ వినొచ్చు!
న్యూస్ ప్లేయర్ను పరిచయం చేసిన న్యూస్డిస్టిల్ అన్ని పత్రికలు, చానళ్ల వార్తలు ఒకే వేదికగా 25 విభాగాలు.. 8 భాషల్లో సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ రోజుల్లో ఆన్లైన్లో వార్తలు చదవటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే దాదాపు అన్ని పత్రికలూ ఈ-పేపర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. కానీ, ఒకే వేదికగా అన్ని పత్రికలూ, టీవీ చానెళ్ల వార్తలు అందుబాటులో ఉండే వాటి గురించి మాత్రం ప్రస్తావించాల్సిందే? ఒక వార్తను ఏ ఏ మాధ్యమాలు ఎలా విశ్లేషించాయో తెలుసుకునే వీలుంటే?.. బ్లూ టూత్ ద్వారా ఫోన్లోని పాటలను విన్నట్టే.. వార్తలనూ వినే అవకాశమే ఉంటే?? .. ఇదిగో అచ్చం ఇలాంటి సేవలనే అందిస్తోంది స్టార్టప్ కంపెనీ ‘న్యూస్డిస్టిల్’. సంస్థల సేవల గురించి మరిన్ని వివరాలు న్యూస్డిస్టిల్ కో-ఫౌండర్ నరసింహారెడ్డి మాటల్లోనే.. నా స్నేహితులు వంశీ, భాస్కర్రెడ్డితో కలసి రూ.10 లక్షల పెట్టుబడితో గతేడాది ఏప్రిల్లో న్యూస్డిస్టిల్ను ప్రారంభించాం. ఒక వార్తపై భిన్నమైన పార్శ్వాలను పాఠకులకు పరిచయం చేయడమే న్యూస్డిస్టిల్ పని. వార్తలను చదవటమే కాక వినే వీలునూ కల్పించడం మా ప్రత్యేకత. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా న్యూస్ప్లేయర్ను అభివృద్ధి చేశాం. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాం కూడా. న్యూస్ప్లేయర్లో బ్లూ టూత్ సహాయంతో పాఠకుడు కోరుకున్న ఆర్టికల్ లేదా నచ్చిన శీర్షిక ప్రకారం వార్తలను వినొచ్చు. అంతేకాదు ఒకవైపు ఆర్టికల్ను వింటూనే మరోవైపు మరో ఆర్టికల్ను బ్రౌజ్ చేయవచ్చు కూడా. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే న్యూస్ ప్లేయర్ అందుబాటులో ఉంది. మరో రెండు నెలల్లో తెలుగు, మరాఠీ భాషల్లోనూ వినే వీలును కల్పిస్తాం. న్యూస్ ప్లేయర్ మాత్రమే కాదు!! పాకెట్, రికమెండేషన్, మై ఫీడ్, న్యూస్ కంపారిజన్, పర్సనలైజ్డ్ ఫిల్టరింగ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నాం. {పస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం, మరాఠీ, కన్నడ, మలయాళం, బెంగాలీ 8 భాషల్లో వార్తలను చదువుకోవచ్చు. 550 న్యూస్ పోర్టల్స్ నుంచి వార్తలను సంగ్రహించి నిర్ణీత క్రమపద్ధతిలో అమరుస్తాం. దీంతో పాఠకుడు తనకు నచ్చిన అంశంపై వివిధ మాధ్యమాల్లోని వార్తలను తక్కువ సమయంలో చదువుకునే వీలుంటుంది. ఇలా జాతీయ, అంతర్జాతీయ, విజ్ఞానం, వినోదం, క్రీడలు, ఆరోగ్యం, విద్యా, వైద్యం.. వంటి 25 విభాగాల వార్తలను ఎంపిక చేసుకునే వీలుంది. ఇప్పటివరకు 2.50 లక్షల యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. నెలకు 25 మిలియన్ల పేజీ వ్యూలొస్తాయి. సీడ్రౌండ్లో భాగంగా నిధులు సమీకరిస్తున్నాం. డ్రాప్బాక్స్ వైస్ ప్రెసిడెంట్ గణేశ్, ఓలా వైస్ ప్రెసిడెంట్ సునీల్, ఉబర్ ప్రకటన విభాగం ఉద్యోగి సుధీర్ ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం. ఇప్పటివరకు రెవిన్యూ మోడల్లోకి వెళ్లలేదు. 100 మిలియన్ల యూజర్లకు చేరుకున్నాక డిస్ప్లే యాడ్స్, క్లిప్పింగ్స్ వంటి వాటితో ఆదాయ మార్గాల్ని తెరుస్తాం. -
ఎప్పటికీ అమరుడే
- ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన జర్నలిస్ట్ - అవయవదానంతో పలువురికి ప్రాణంపోసిన కుటుంబ సభ్యులు కొరుక్కుపేట(తమిళనాడు) చనిపోతూకూడా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాడు 35 ఏళ్ల యువకుడు సుదర్శన్. తమిళ టీవీ చానల్ పుదియ తలైమురై టీవీలో సీనియర్ న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్న సుదర్శన్(35) ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. ఈ కారణంగా బ్రెయిన్డెడ్కావడంతో అతని కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చి, సుదర్శన్ అవయవాలను దానం చేశారు. వివరాలు.. సీనియర్ న్యూస్ ఎడిటర్ సుదర్శన్ ఈనెల 16 వతేది పుదుచ్చేరి నుంచి చెన్నైకు టెంపోట్రావెల్లో వస్తుండగా ఆ రోజు సరిగ్గా 3:30 గంటల సమయంలో టెంపోట్రావెల్ను బస్సు ఢీ కొట్టింది. దీంతో సుదర్శన్తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పుదుచ్చేరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆ రోజు రాత్రి 9:30 గంటల సమయంలో చెన్నై వడలపనిలోని సిమ్స్ ఆసుపత్రిలో న్యూరో ఐసీయూలో ఉంచి చికిత్స చేపట్టారు. సుదర్శన్కు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని దీంతో ఈనెల 23వ తేదీ సాయంత్రం 4:54 గంటలకు బ్రెయిన్డెడ్ అయినట్లు న్యూరాలజిస్టులు నిర్ధారించారని సిమ్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీస్ డెరైక్టర్ డాక్టర్ విజయకుమార్ చోక్కాన్ తెలిపారు. దీంతో సుదర్శన్ కుటుంబసభ్యులతో అవయువదానంపై చర్చించగా వారు సుదర్శన్ అవ యవాలను దానం చేసేందుకు ముందుకు వాచ్చారు. తమిళనాడు కేడవెర్ ట్రాన్స్ప్లాంట్ పోగ్రామ్ అథారిటీస్ అనుమతితో సిమ్స్ వైద్యులు సుదర్శన్ అవయువాలు లివర్,కిడ్నీ, ,హర్ట్వాల్వలు, నేత్రాలు, స్కిన్ను తీసుకున్నారు. లివర్, ఒక కిడ్నీని ఈనెల 23వతేదీన సిమ్స్ ఆసుపత్రిలోని రోగులకు ట్రాన్స్ప్లాంట్ చేయగా, మిగిలిన కిడ్నీ,హర్ట్, పాంక్రియాస్లు చెన్నైలోని పలు అసుపత్రులకు అందించారు. బ్రెయిన్ డెడ్ కు గురైన సుదర్శన్ కు భార్య దీపాతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అవయువదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, సుదర్శన్ కుటుంబ సభ్యులు అవ యవదానం చేసేందుకు ముందుకు రావడంపై సిమ్స్ వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
పత్రికా రంగంలో ఎఫ్డీఐల పెంపులేదట!
న్యూఢిల్లీ : వార్తాపత్రికలు, పీరియాడికల్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 26శాతం నుంచి 49శాతానికి పెంచకూడదని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వార్తలు, కరెంట్ అఫైర్స్ ప్రచురించే వార్తాపత్రికలు, పీరియాడికల్స్ లో ప్రస్తుతమున్న 26 శాతం వరకు ఎఫ్డీఐల పరిమితిని అలాగే ఉంచాలని నిర్ణయించింది. పత్రికా రంగంలోకి ఎఫ్డీఐలు రావాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటోంది. ప్రింట్ మీడియా రంగంలో ఎఫ్డీఐల పరిమితిని పెంచే ప్రతిపాదన చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది. ఆర్థికవ్యవహారాల విభాగం(డీఈఏ) ఈ ప్రతిపాదనను సమీక్షించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ను(డీఐపీపీ) తాజాగా మరోసారి కోరింది. డీఈఏ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని సమీక్షించిన డీఐపీపీ, పత్రికరంగంలో ఎఫ్డీఐ క్యాప్ ను పెంచేందుకు విముఖత వ్యక్తంచేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత నవంబర్ నుంచి పత్రికారంగంలో ఎఫ్డీఐ క్యాప్ ను సడలించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ఇటీవల ఎనిమిది రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బార్ల తలుపులు తెరిచిన కేంద్రప్రభుత్వం పత్రికా రంగంలో మాత్రం ఈ పరిమితులను పెంచలేదు. సివిల్ ఏవియేషన్, డిఫెన్స్, ప్రైవేట్ సెక్యురిటీ ఏజెన్సీలు, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రిలో ప్రభుత్వం ఎఫ్డీఐ నిబంధనలను సడలించింది. విదేశీ ఫండ్స్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ప్రభుత్వం ఇటీవల ఈ నిబంధనలను సడలించినట్టు పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ప్రవేశించిన ఎఫ్ డీఐలు 29శాతం పెరిగి, 40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
‘మా పెళ్లి రద్దయింది.. ఎవరూ రాకండి’
శ్రీనగర్: కశ్మీర్ అల్లర్ల కలకలంతో ఆయా పత్రికల్లోని ప్రకటనలు భిన్నంగా దర్శనం ఇచ్చాయి. సాధారణంగా ఆహ్వానాల రూపంలో దర్శనమిచ్చే క్లాసిఫైడ్స్ కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో మాత్రం ఆహ్వానాలు రద్దు అని దర్శనమిచ్చాయి. దాదాపు అన్ని పత్రికల్లో ఇలాంటి వింత క్లాసిఫైడ్స్ కనిపించాయి. ఈ మేనియా గత ఆదివారం నుంచి మొదలైంది. ఈ రంజాన్ నేపథ్యంలోనే కశ్మీర్లో పలు వివాహ కార్యక్రమాలు జరగాల్సి ఉంది. పలువురు పెళ్లిల్ల తేదీలను కూడా నిర్ణయించారు. బంధువులకు కబుర్లు కూడా చేశారు. అయితే, ప్రస్తుతం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని శాంతిభద్రతలు గడ్డుగా ఉన్న నేపథ్యంలో బంధువులకు పెళ్లిల్లు రద్దయ్యాయనే విషయం చెప్పడంకోసం వారంతా ఆయా పత్రికల క్లాసిఫైడ్స్ని ఆశ్రయించారు. దీంతో దాదాపు అన్ని పేపర్లలో ‘పదుల సంఖ్యలో పెళ్లి రద్దయ్యాయి. దయచేసి అర్థం చేసుకోగలరు. మేం ఇచ్చిన ఆహ్వానం ప్రస్తుతానికి రద్దు చేస్తున్నాం. ఇందుకు చింతిస్తున్నాం’ అంటూ పలు ప్రకటనలు క్లాసిఫైడ్స్ రూపంలో ఇచ్చారు. -
మత్తులో చెప్పలేని పనులు చేశారు..!
న్యూయార్క్: తప్పతాగి మత్తులో జోగే వ్యక్తులను అప్పుడప్పుడు మనం రోడ్లపై చూస్తూనే ఉంటాం. అడుగుతీసి అడుగేయలేని స్థితిలో ఉండే అలాంటి వారు చేసే హంగామాను జనం వింతగా చూడటం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి ఘటనే న్యూయార్క్లో చోటు చేసుకుంది. కాకాపోతే, అలాంటివారు ఒకరిద్దరు కాదు.. ఒకేసారి ముప్పై మందికి పైగానే. తీసుకున్న మాదకద్రవ్యాలు కాస్త ఎక్కువ పనిచేయటంతో వీరంతా రోడ్లపై సృష్టించిన హడావిడి అంతాఇంతా కాదు. ఆ మత్తులో కొందరైతే నడిరోడ్డుపైనే చెప్పలేని పనులు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. నియంత్రణ కోల్పోయి వీధుల్లో నానా వీరంగం సృష్టిస్తున్న వీరిని అధికారులు తంటాలు పడి ఆసుపత్రికి తరలించారు. ఇలా ప్రవర్తించిన వీరంతా ప్రమాదకరమైన మత్తుపదార్థం సింథటిక్ మారిజోనాను ఒకేచోట కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అయితే.. వీరు తీసుకున్న బ్యాచ్లో మోతాదుకాస్త మించి ఉంటుందని భావిస్తున్నారు. రోడ్లపై వాంతులు చేస్తూ.. తూగుతూ.. కిందపడి పొర్లుతూ వారు చేసిన హంగామా చూసిన వీధిలోని జనాలు భయపడిపోయారు. వారు తీసుకున్న మత్తు పదార్థం తక్కువ ధరకే లభిస్తుందని, అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని వైద్యులు వెల్లడించారు. -
అక్షరాలు నేర్పిస్తాయి
నెయిల్ ఆర్ట్ ఇది న్యూస్ పేపర్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి తెలుపు, గులాబి, ట్రాన్స్పరెంట్, ఆకుపచ్చ రంగుల నెయిల్ పాలిష్లు, కొన్ని న్యూస్ పేపర్ ముక్కలు ఉంటే సరిపోతుంది. ఎన్నోరకాల నెయిల్ ఆర్ట్ డిజైన్స్లో ఇదొకటి. ఈ ఆర్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ న్యూస్ పేపర్ డిజైన్కు కొన్ని గులాబి అందాలు జోడిస్తే.. మీ గోళ్ల అందం మరింత పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం..ఈ డిజైన్ను మీరూ వేసుకోండి. ఎలా అంటే... 1. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని.. అందంగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటికి పూర్తిగా తెలుపు రంగు నెయిల్ పాలిష్ పూయాలి. 2. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా న్యూస్పేపర్ ముక్కలను సిద్ధం చేసుకోవాలి. 3. ఆపైన వెనిగర్లో ముంచిన దూది ఉండను గోళ్లపై రాయాలి. (వెనిగర్కు బదులుగా నీళ్లను కూడా వాడొచ్చు. కాకపోతే గోళ్లపై న్యూస్ప్రింట్ లైట్గా పడుతుంది) 4. ఆ వెనిగర్ ఆరకముందే.. న్యూస్పేపర్ ముక్కను గోరుపై పెట్టి ప్రెస్ చేయాలి. అర నిమిషం తర్వాత ఆ పేపర్ను తొలగిస్తే.. పేపర్పై అక్షరాలు మీ గోళ్లపై ప్రత్యక్షమవుతాయి. 5. ఇప్పుడు ఆ ప్రింటెడ్ గోళ్లపై గులాబిరంగు పాలిష్తో పెద్ద సైజు చుక్కలు పెట్టుకోవాలి. 6. తర్వాత తెలుపురంగు పాలిష్తో ఆ చుక్కలపై అక్కడక్కడా పూయాలి. (అది గులాబి పువ్వు ఆకారంలోకి వచ్చేలా గీయాలి) 7. చివరగా ఆకుపచ్చ రంగు పాలిష్తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఆకులు గీసుకోవాలి. వాటి మధ్యలో వైట్పాలిష్తో ఓ లైన్ గీస్తే సరి. పువ్వులు, ఆకులు, అక్షరాలతో మీ గోళ్లు ఎంతో అందంగా కనిపిస్తాయి. -
టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో హైకోర్టు విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. -
టుడే న్యూస్ డైరీ
ఏపీ తాత్కాలిక సచివాలయం: వెలగపూడిలో నిర్మించిన ఏపీ తాత్కాలిక సచివాలయ భవనాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ నేడు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:59కి ముహూర్తం ఖరారు. తొలుత పంచాయితీ రాజ్, గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్యాశాఖలను వెలగపూడికి తరలించాలని సర్కారు నిర్ణయం. తెలంగాణలో న్యాయమూర్తుల నిరసన: ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్లు కల్పించడాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయమూర్తులు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. ఆప్షన్ల ఉపసంహరణ, ప్రత్యేక హైకోర్టు, 11 మంది జడ్జీలపై సస్సెంన్షన్ ఎత్తివేతను డిమాండ్ చేస్తూ నేటి జడ్జీలు సామూహిక సెలవులపై వెళ్లనున్నారు. 15 రోజులపాటు విధులకు దూరంగా ఉండి తమ నిరసన తెలియజేస్తారు. టీఆర్ఎస్ పీపీ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు తెలంగాణ భవన్ లో జరగనుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ కూడా హాజరవుతారు. కీలకమైన హైకోర్టు విభజన అంశంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు, సాగు నీటి ప్రాజెక్టులపై నేతలు చర్చిస్తారు. కేంద్ర కేబినెట్ సమావేశం: ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ భేటీ జరగనుంది. క్షిపణి పరీక్ష: భారత్- ఇజ్రాయెల్ లు సంయుక్తంగా రూపొందించిన క్షిపణిని నేడు ప్రయోగించనున్నారు. క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో సభ్యత్వం పొందిన తర్వాత భారత్ చేపడుతోన్న మొదటి క్షిపణి పరీక్ష ఇది. సీసీపీఏ: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో నేడు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) భేటీ జరగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సింగపూర్ కు కేటీఆర్: సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నేడు సింగపూర్ వెళ్లనున్నారు. బెల్లంపల్లి బంద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నేడు బంద్ కు పిలుపునిచ్చింది. నేటి ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లు తెలుగు టైటాన్స్ X జైపూర్ పింక్ పాంథర్స్ యు ముంబా X పట్నా పైరేట్స్ -
కొడుక్కి తెలియకుండా కోడలికోసం..!
లాస్ ఏంజిల్స్: అమెరికాలో ఓ పెద్దాయన తన కొడుక్కి ఎలాగైనా భార్యను తీసుకురావాలని పెద్ద ఉపాయమే చేశాడు. స్థానిక వార్తా పత్రికలో కోడలు కోసం ఓ ఫుల్పేజీ యాడ్ ఇచ్చాడు. అందులో కొడుకు ఫోటోతో పాటు.. తనకు కోడలిగా రాబోయే అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చాడు. ఆసక్తి ఉన్న వారిని ఇంటర్వ్యూకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. సాల్ట్ లేక్ పట్టణానికి చెందిన 48 ఏళ్ల బిజినెస్మ్యాన్ బ్రూక్స్ తనకు తెలియకుండా తన తండ్రి ఇచ్చిన ఈ యాడ్ చూసి షాక్ తిన్నాడు. యాడ్ గురించి మీడియా బ్రూక్స్ను సంప్రదించగా.. తనకు తెలియకుండా తన తండ్రి ఆర్దర్ చేసిన ఈ పనిని గురించి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదని 'ఒకసారి బాంబు వదిలిన తరువాత దాని గురించి బాధపడి ఏం ప్రయోజనం' అని చెప్పుకొచ్చాడు. పేపర్లో ఇచ్చిన ప్రకటనలో కోడలికి ఉండాల్సిన వయసు, ఎత్తు, అర్హతలతో పాటు.. ఒబామాకు ఓటేసిన, హిల్లరీకి ఓటేయాలనుకుంటున్న వారైతే ఇంటర్వ్యూకు రావాల్సిన అవసరం లేదని ఆర్దర్ పేర్కొన్నాడు. తండ్రి తనకు తెలియకుండా ఈ యాడ్ ఇచ్చినా.. ఇంటర్వ్యూలు ముగిసిన తరువాత దీని గురించి తండ్రితో చర్చిస్తానని బ్రూక్స్ తెలిపాడు. వ్యాధితో బాధపడుతున్న తండ్రి..తనకు పెళ్లి చేసి ఓ మనువడిని పొందాలని కోరుకుంటున్నాడని.. అయితే దానికి ఈ పని చేస్తాడని ఊహించలేదని బ్రూక్స్ తెలిపాడు. -
బలిపీఠంపై భావ ప్రకటనా స్వేచ్ఛ
దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచంలో పలుచోట్ల కూడా వివిధ స్థాయిలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో పాత్రికేయులు, విలేకరులు, సంపాదకులపైన పాలక వర్గాలు కన్నెర్ర చేస్తూ అధికార గణంతో దాడులు, అరెస్టులు చేయించడం చూస్తున్నాం. వారి ఈ అహంకారానికీ, అసహనానికీ చేదోడు వాదోడవుతున్న మూలం ఏది? ఈ ప్రశ్నకు జర్మనీ రాజధాని బాన్లో పాత్రికేయ శిఖరాగ్ర సభను నిర్వహించిన ప్రపంచ సంస్థ గ్లోబల్ మీడియా ఫోరమ్ చర్చల సారాంశంలో దీటైన సమాధానం దొరుకుతుంది. ‘‘దేశాల అభ్యుదయానికి సంబంధించిన సకల అంశాలలో పారదర్శకత ద్వారా అవినీతిని, లంచగొండితనాన్ని అదుపు చేయడానికీ; పౌర సమాజాన్ని నిర్మించడానికి, న్యాయ చట్టాల ద్వారా చట్టబద్ధ పాలనను స్థిరపరచడానికీ మీడియా (పత్రికలు, టీవీ మాధ్యమాలు) అత్యవసరం, అనివార్యం. పాలక వ్యవస్థ ప్రయోజనాలతో నిమిత్తం లేని ప్రచార ప్రసార మాధ్యమాలు ఏ మేరకు స్వేచ్ఛగా ఉండగలవో ఆ మేరకు దేశాల స్వేచ్ఛాస్వాతంత్య్రాల ఉనికి ఆధారపడి ఉంటుంది. ఈ మీడియా స్వేచ్ఛ మనుగడ అనేది దఫదఫాలుగా జరిగే ఎన్నికల కన్నా కూడా దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సరైన కొలమానంగా భావించాలి.’’ - డేవిడ్ హాఫ్మన్ (ఇంటర్ న్యూస్ మీడియా నిర్మాత, ఎమిరిటస్ ప్రెసిడెంట్, ఎమ్మీ అవార్డు గ్రహీత, సిటిజన్స్ రైజింగ్ గ్రంథకర్త) ‘అబద్ధాల అంకయ్యకు అర వీశెడు సున్నం నోట్లో కొడితేగానీ వాయి ముడవడు’ అన్నది సామెత. మహజర్లూ, విజ్ఞాపనలూ, సంప్రదింపుల ద్వారా దీర్ఘకాలం పాటు ఉద్యమించి; పాలకుల మొండితనం వల్ల సమస్య ఒక కొలిక్కి రానప్పుడు, ఒక సామాజిక వర్గం సమస్యకు అంతిమ పరిష్కా రంగా మచ్చలేని నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరశన తలపెట్టడం ఏమిటి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం తలెత్తే ఆందోళనలను, ఉద్యమా లను, ఉద్రేకాలను; ఆఖరికి ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యకలాపాలతో సహా అన్నింటినీ అటు అక్షరబద్ధంగానూ, ఇటు దృశ్య మాధ్యమంతోనూ ఆవి ష్కరించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సాక్షి’ మీడియా చానల్ ప్రసా రాలను నిషేధించడం ఏమిటి? ఆ రెండింటికీ సంబంధం ఏమిటి? ప్రాథమిక హక్కు అన్న సంగతి మరచిపోవద్దు పై ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు పాలకుల నుంచి రాలేదు. కానీ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాత్రం ‘ముద్ర గడ దీక్ష నేపథ్యంలో ఈ ప్రసారాలను మేమే నిలిపివేశాం’ అని స్వయంగా ప్రకటించారు. నిత్యమూ తాము ‘ప్రజాస్వామ్యం’ కోసమే, దాని ‘పరిరక్షణ’ కోసమే పాటుపడుతున్నామని గుండెలు బాదుకునే పాలకులను గతంలోనూ చూశాం. ఇప్పుడూ చూస్తున్నాం. నిజానికి, ప్రజాస్వామ్యమన్నా, అది పని చేసే తీరన్నా, లేదా పార్లమెంటరీ వ్యవస్థలో భిన్నాభిప్రాయానికి చోటు ఉండి తీరాలన్న ప్రాథమిక విలువన్నా - కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ఆధునిక పాలకులకు గౌరవం లేదు. దీనిని నిరూపించేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చివరకు భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా పరిగణించే రాజ్యాంగ విరుద్ధ సంస్కృతిని కూడా ప్రవేశపెడుతున్నారు. వివిధ స్థాయిలలో రాష్ట్ర, జాతీయ పాత్రికేయ సంస్థలు, పాత్రికేయులు ‘సాక్షి’ ప్రసారాలను నిలిపివేయడం మీద ఇటు గవర్నర్కు, అటు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్కు నివేదించాయి. దీని మీద ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ చానల్ ప్రసారాల నిలిపివేత మీద ఎంత విస్మయం ప్రకటించినా; ప్రసారాల పునరు ద్ధరణకు కౌన్సిల్ పరిధిలో చేపట్టగల చర్యలకు గల అవకాశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అంటే లోగడ చైర్మన్ల మాదిరిగానే మాటమాత్రంగా ఆ సంగతి చెప్పారు. కానీ రాజ్యాంగం గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు, వృత్తి వ్యాపార రక్షణ ప్రాథమిక హక్కుగా గుర్తించిన ప్రకటనకు పూచీ పడుతూ, వాటిని అమలు చేయించడంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన పాల కులను శిక్షించే క్రిమినల్ నిబంధనలను అమలు చేయించే అవకాశం కౌన్సి ల్కు మాత్రం లేదు. అందుకే పాలకుల ఆగడాలు అనంతంగా కొనసాగ డానికి అసలు కారణమని పత్రికా రచయితలు మరచిపోరాదు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కౌన్సిల్ కలగచేసుకుని శిక్షించే అధికారాన్ని దఖలు పరుస్తూ ప్రెస్ కౌన్సిల్ చట్టాలను సవరించాలని, పార్లమెంట్ చొరవ చూపాలని ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ జస్టిస్ కట్జూ పదే పదే విజ్ఞప్తి చేశారు. కొత్త సవాళ్ల కాలం దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచంలో పలుచోట్ల కూడా వివిధ స్థాయిలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో పాత్రికేయులు, విలేకరులు, సంపాదకులపైన పాలక వర్గాలు కన్నెర్ర చేస్తూ అధికార గణంతో దాడులు, అరెస్టులు చేయించడం చూస్తున్నాం. వారి ఈ అహంకారానికీ, అసహనానికీ చేదోడు వాదోడవుతున్న మూలం ఏది? ఈ ప్రశ్నకు జర్మనీ రాజధాని బాన్లో పాత్రికేయ శిఖరాగ్ర సభ (2016)ను నిర్వహించిన ప్రపంచ సంస్థ గ్లోబల్ మీడియా ఫోరమ్ చర్చల సారాంశంలో దీటైన సమాధానం దొరుకుతుంది. నేడు సమాచార సాంకేతిక వ్యవస్థ, డిజిటల్ విప్లవం శరవేగాన దూసుకు రావడంతో పాత్రికేయ వృత్తికి పాలక వర్గాల నుంచి ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఆ ఫోరమ్ చర్చించింది. ఈ సదస్సులోనే టర్కిష్ దినపత్రిక ‘హురి యత్’ ప్రధాన సంపాదకుడు సీదత్ ఎర్గిన్కు ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పుర స్కారాన్ని కాయే డీక్మాన్ (ప్రసిద్ధ జర్మనీ పత్రిక ‘బిల్’ అధినేత) ప్రదానం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రకటించినందుకు, విమర్శనాత్మక వ్యాస పరంపరను వెలువరించినందుకు సీదత్ను టర్కిష్ పాలకులు నాలుగేళ్ల పాటు ఎలా కారాగార ం పాలు చేశారో ఆ సందర్భంగా డీక్మాన్ గుర్తు చేశారు. మితవాద పాలకవర్గ పార్టీ కార్యకర్తలు గుంపుగా ఎర్గిన్ పత్రికా కార్యాల యంపై దాడులు చేసి, మరొక వ్యాసకర్తను ఏవిధంగా తీవ్రంగా గాయ పరిచిందీ కూడా ఆ సదస్సులో వెల్లడించాడు. యూరప్లో మితవాదపక్షాలు అధికారంలో ఉన్న దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛపైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వివరించారు. ఎర్గిన్ ప్రసంగిస్తూ, ‘ నిరంకుశ ధోరణులకు అలవాటుపడిన పాలకులు ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కడానికి ఓటింగ్ ద్వారా ప్రజా ప్రతినిధుల్ని ఎంపిక చేసుకునే సౌలభ్యానికి అవకాశం కల్పించిన ఎలక్టోరల్ ప్రజాస్వామ్యం అనే ఓ బిల్లును తెరగా పెట్టుకుంటున్నారని, ఈ ధోరణి ప్రజా స్వామ్య మనుగడకు అత్యంత ప్రమాదకరం’అని ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిం చాడు. అలాగే ఎక్కడికక్కడ పౌర సమాజాలు చైతన్యం పొంది రంగంలోకి దిగి ఉద్యమించడం ద్వారానే భావ స్వేచ్ఛనూ, భిన్నాభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛనూ తద్వారా ప్రజాస్వామ్య విలువల్ని రక్షించుకోగల్గుతారని ‘ఇంటర్ న్యూస్’ వ్యవస్థాపకుడు డేవిడ్ హాఫ్మాన్ ‘తిరగబడుతున్న పౌరులు’ అన్న తాజా గ్రంథంలో పేర్కొన్నాడు. అంతేగాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలలో గానీ లేదా తలుపులు మూసివేసుకునే మూస వ్యవస్థలలో గానీ - ప్రజా బాహుళ్యం సత్తా, వారి అధికారం ఏదో ఒక రూపంలో ఒక్క ప్రసార మాధ్య మాల ద్వారా మాత్రమే వ్యక్తమవుతూ ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల పుట్టుపూర్వోత్తరాలను తడుముతూ హాఫ్మాన్ మరొక విషయం కూడా వెల్లడించాడు: ‘‘శరవేగాన ఆవిష్కరించుకుంటున్న, పరి వ్యాప్తమవుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞాన వేదికలు, భారీస్థాయిలో ప్రజా స్వామీకరణ పొందుతున్న మీడియా నేడు ఎలాంటి నిరంకుశ పాలనా వ్యవస్థనైనా ‘ఢీ’ కొనగల సవాళ్లను విసరగల్గుతోంది. గత వంద సంవత్సరా లుగా నిరంకుశ అహంకార పాలనా వ్యవస్థలు యుద్ధాల మీద ఆధారపడి ఉనికిని కాపాడుకుంటూ వచ్చాయి. కాగా నూతనంగా దూసుకువచ్చిన సమాచార సాంకేతిక విప్లవం ఈ 21వ శతాబ్దాన్ని తీర్చిదిద్దే సైద్ధాంతిక శక్తి కాబోతున్నది’’. ఎందుకంటే, దాపరికం లేని సమాచార వ్యవస్థ అనేది మానవ స్వేచ్ఛకు పరిపూర్ణతను కల్పించడానికి ఒక కీలక సాధనం అని సామా జిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల సమాచార స్రవంతికి అడ్డుకట్టలు వేయడం ద్వారా మానవ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అణచివేయడమే అవు తుందని వారి ఆవేదన. అయితే ఎటుతిరిగీ వచ్చిపడుతున్న చిక్కంతా, దురదృష్టవశాత్తూ ‘‘ఎన్నికల ప్రజాస్వామ్యం’’ అనే ముసుగు కింద అయిదేళ్ల పాలనతో మురిసిపోయి రకరకాల ప్రలోభాల ద్వారా మీడియాలో ఒక వర్గాన్ని (విలేకరులు, సంపాదకుల్ని) తాత్కాలిక పదవుల కోసం ‘సాకుతో’ పాత్రికేయుల మధ్య ఐక్యతను గండికొట్టడానికి పాలకులు అలవాటుపడ్డారు. పత్రికా రచయితలకు ఎరలు గతంలో దుబాయ్, కువైట్, మలేసియా, సింగపూర్ విహారయాత్రల ద్వారా కొందరు పాత్రికేయుల్ని తిప్పుకొచ్చింది పాలకవర్గం, వారిని బానిసలుగా మార్చడం కోసం. అలాంటి వారి పేర్లను ఒకవైపున ఆనాటి (1995-2003) ‘బ్లిట్జ్’, ‘టెలిగ్రాఫ్’ పత్రికలు ప్రకటించిన విషయాన్ని మరవరాదు. లేకపోతే కొందరు పాత్రికేయులు సొంత చానళ్లు ప్రారంభించగల కోట్ల ఆర్జన ఎక్కడి నుంచి సంక్రమించిందో చెప్పగలగాలి. ఈ రకమైన వాతావరణంలో పరి ణామాల ప్రభావంవల్ల పాత్రికేయ వృత్తిలో ‘కుక్కమూతి పిందెలు’ తలెత్తడం సహజం. పైగా రాజకీయాలు, ప్రధాన స్రవంతిలో ఉన్న మాస్మీడియా పరస్పరం చేతులు కలుపుతున్నచోట్ల పత్రికా రంగంలో విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రష్యన్ మీడియా చరిత్రకారుడు, జర్నలిస్టు ఇవాన్ జసోర్స్కీ ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లు అమలులోకి వచ్చిన తర్వాత నేటి రష్యాలో మీడియా పరిస్థితిని సమీక్షిస్తూ వెల్లడించాడు. రాజకీయ ఫ్యాక్షన్లు ఎలా రకరకాల నేషనల్ చానల్స్గా ఏర్పడి వార్తా స్రవంతి వాస్తవ పరిణామాలను గుర్తించకుండా తప్పించుకు తిరుగాడుతున్నాయో రాశాడు. ఈ ‘సంస్కరణల’ ప్రభావంలోనే ఆంగ్లో-అమెరికన్, ఆస్ట్రేలియన్ మీడియా గుత్త సంస్థలు ఇండియాలోకి మిడతల దండులా ప్రకాశించడానికి, విదేశీ మీడియా గుత్త కంపెనీలు ప్రత్యక్ష పెట్టుబడులతో భారత పత్రికా రంగాన్ని అల్లకల్లోలం చేయడానికి రూపర్డ్ మర్దోక్, కెర్రీపాకర్లు కాంగ్రెస్, బీజేపీల ఆరెస్సెస్ల సాయంతో రెక్కలు కట్టుకుని వాలారని మరచిపోరాదు! abkprasad2006@yahoo.co.in - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
చుక్క ఇంధనం లేకుండానే ప్రపంచాన్నే చుట్టేస్తోంది..
న్యూయార్క్(అమెరికా): న్యూయార్క్కి రెండు వారాల్లో ఓ విమానం రానుంది. వేలాది విమానాలు నగరానికి వస్తుంటాయి, పోతుంటాయి.. అలాంటప్పుడు ఈ విమానం గొప్పతనం ఏంటా అనుకుంటున్నారా. అయితే అక్కడికి రానుంది 'సొలార్ ఇంపల్స్2'. దీని ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఒక్కచుక్క ఇంధనాన్ని కూడా వినియోగించకుండానే కేవలం సౌరశక్తితో మాత్రమే సగం ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ విమానం బరువు 2,300 కిలోలు మాత్రమే. అయితే దీని రెక్కలు బోయింగ్ విమానం కన్నా వెడల్పు. వీటిపై అమర్చిన 17,000 పైచిలుకు ఫలకాల ద్వారా ఇది సౌరశక్తిని గ్రహించి 4 లిథియం పాలిమర్ బ్యాటరీల్లో నిల్వచేస్తుంది. పగలు సౌరశక్తిని బాగా గ్రహిం చేందుకు 9,000 మీటర్ల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లిన పెలైట్ రాత్రిపూట ఇంధనాన్ని ఆదా చేసేందుకు 1,000 మీటర్ల ఎత్తులో ఎగిరేవారు. దీని కాక్పిట్లో ఒక్కరే పడతారు. పెలైట్ సీటునే టాయిలెట్గానూ వాడుకొనేలా డిజైన్ చేశారు. అండ్రూ బోర్ష్బెర్గ్(స్విట్జర్లాండ్), బెర్ట్రాండ్ పికార్డ్లు ఒకరి తర్వాత మరొకరు దీనికి పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. తిండి, నిద్ర అన్నీ ఆ కుర్చీలోనే. నిద్రపోవాలనుకుంటే సీటు కాస్త వెనక్కి వంచుకొని కునుకుతీయాలి. విమానాన్ని ఆటోపెలైట్ మోడ్లో పెట్టి... పైలెట్ 20 నిమిషాల చొప్పున నిద్రపోయేవాడు. విమానం లో సాంకేతికలోపమొస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అవకాశం లేదు. పెలైట్ ప్యారాచూట్ సాయంతో సముద్రంలో దిగితే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి చెక్కబల్ల (లైఫ్బోట్లాగా పనిచేస్తుంది) కాక్పిట్లో ఉంది. 'సోలార్ ఇంపల్స్2' ఒకే పైలెట్తో ఎక్కువ దూరం ప్రయాణించిన రికార్డును కూడా బద్దలుకొట్టింది. జపాన్లోని నగోయా నుంచి బయలుదేరిన ఈ సౌర విమానం ఏకబిగిన 120 గంటలు... 7,900 కిలోమీటర్లు ప్రయాణించి అమెరికాలోని హవాయి దీవుల వరకు వెళ్లింది. నిరంతరాయంగా సుదీర్ఘసమయం ప్రయాణించిన రికార్డు ఇంతకుమునుపు స్టీవ్ ఫోసెట్ పేరిట ఉంది. న్యూయార్క్ చేరుకున్న తర్వాత మరో పెద్ద లక్ష్యం సొలార్ ఇంపల్స్2 ముందు ఉంది. అక్కడి నుంచి బయలుదేరి అట్లాంటిక్ సముద్రాన్ని దాటనుంది. సౌర ఇంధనంపై అవగాహన కల్పించేందుకే ఈ జైత్రయాత్ర చేపట్టామని దీని పైలట్లు చెబుతున్నారు. 'పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఇంధనం లేకుండా ప్రపంచాన్ని చుట్టామంటే 'వావ్' అంటారు' అంటూ విమాన రూపకర్తల్లో ఒకరు, పైలెటైన బెర్ట్రాండ్ పికార్డ్ అంటున్నారు. -
ఫేస్ బుక్ పై మహిళ సంచలన ఆరోపణలు
మంచి జీతం, ఉచిత భోజనం, అన్నింటికీ మించి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో ఉద్యోగం... ఫేస్ బుక్ లో జాబ్ అనగానే మదిలో మెదిలే భావన ఇది. సోషల్ మీడియా దిగ్గజ సంస్థలో పని వాతావరణం ఊహించిన దాని కంటే భిన్నంగా ఉంటుందని ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కోపం, నిరుత్సాహం, మాట్లాడడానికి విల్లేని విధంగా ఆఫీస్ వాతావరణం ఉంటుందని ఫేస్ బుక్ ట్రెండింగ్ టీమ్ లో కాంట్రాక్టర్ గా పనిచేసిన మహిళా ఒకరు వెల్లడించారు. న్యూస్ క్యూరేటర్ గా పనిచేసిన ఆమె ఫేస్ బుక్ కార్యాలయంలోని పూర్ మేనేజ్ మెంట్ గురించి దిగ్బ్రాంతికర విషయాలు చెప్పింది. భయం, పక్షపాతం, లింగ వివక్ష కారణంగా 2014 నుంచి 40 నుంచి 50 మంది ఉండే ట్రెండింగ్ టీమ్ నుంచి 15 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారని తెలిపింది. ట్రెండింగ్ టీమ్ లో 10 మంది మహిళలు ఉండేవారని, కానీ ఎక్కువగా మగాళ్లనే ప్రోత్సహిస్తుంటారని 'గార్డియన్' పత్రికతో చెప్పారు. మాట్లాడేందుకు మహిళలకు అవకాశాలు తక్కువని, మగాళ్లు మాట్లాడుతున్నప్పుడు తామంతా నోరు తెరవడానికి వీల్లేదన్నారు. మహిళా ఉద్యోగులను మేనేజర్లు, ఎడిటర్లు వేధిస్తుంటారని చెప్పారు. అయితే రాజకీయ పక్షపాతం లేదని వెల్లడించారు. ట్విటర్ వాడకుండా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారని వెల్లడించారు. సరైన షెడ్యూలు, సమాచారం ఇవ్వకుండానే టార్గెట్ సాధన కోసం ఒత్తిడి తెస్తారన్నారు. ఫేస్ బుక్ ఇంటర్నల్ టీమ్స్ చెప్పినట్టే నడుచుకోవాలని, ఎదురు అసలు వీల్లేదన్నారు. మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలపై ఫేస్ బుక్ స్పందించింది. ఆమె లేవనెత్తిన అంశాలు చాలా ప్రధానమైనవని, దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. -
10 ఏళ్ల వేధింపులకు.. 19 ఏళ్ల శిక్ష..
వాషింగ్టన్: ఢిల్లీ నుంచి అమెరికాలోని టెక్సాస్ వరకు సుమారు 10 ఏళ్లపాటు ఓ యువతి వెంటపడుతూ, వేధించిన వ్యక్తికి అమెరికా కోర్టు 19 ఏళ్ల జైలు శిక్షను విధించింది. తనతో పాటు చదువుకున్న సహచర విద్యార్థిని వేధిస్తున్న జితేందర్ సింగ్ కు ఈ శిక్షను విధిస్తున్నట్లు కొల్లిన్ కంట్రీ జిల్లా అటార్నీ గ్రేగ్ విల్లీస్ తీర్పులో పేర్కొన్నారు. కోర్టు ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి.. ఢిల్లీకి చెందిన జితేందర్ చదువుకునే సమయంలో ఓ యువతి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడంతో 2006లో ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ కోరాడు. ఆ యువతి తిరస్కరించడంతో జితేందర్ తన చదువు పూర్తి అయ్యేవరకు వేధిస్తూనే ఉన్నాడు. 2007లో ఆమె ఎంఎస్ చేసేందుకు న్యూయార్క్ యూనివర్సిటీలో చేరినా.. అక్కడ కూడా జితేందర్ ఆ యువతిని వదల్లేదు. అంతేకాకుండా ఇండియాలో ఆమె తండ్రిని హింసించాడు. దీంతో యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. జైలు ఊచలు లెక్కపెట్టిన అతడు మరోసారి యువతి జోలికి వెళ్లనని చెప్పటంతో వదిలిపెట్టారు. ఆ తర్వాత అమెరికాలో ఆ యువతి అమ్మాయి చదువుతున్న యూనివర్సిటీలోనే సీటు కోసం ప్రయత్నించి విఫలం చెందిన జితేందర్ ఇంటర్న్ షిప్ కోసం ఆమె కాలిఫోర్నియా వెళ్లినట్లు తెలుసుకుని అక్కడికీ చేరుకున్నారు. ఆతర్వాత నుంచి యువతిని జితేందర్ ఫోన్లో వేధిస్తుండేవాడు. ఆమె ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్లి యువతి పాస్ పోర్టు, ఇతర డాక్యుమెంట్లు, నగలను తీసుకోవడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జితేందర్ ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతగాడికి 19ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. కాగా బాధిత యువతి వివరాలను కోర్టు గోప్యంగా ఉంచింది. -
వరస్ట్ జాబ్ ఏదో తెలుసా?
వాషింగ్టన్: ఉద్యోగాల్లో బెస్ట్, వరస్ట్ జాబ్స్ ఏవో తెలుసా? న్యూస్ పేపర్ రిపోర్టర్ చెత్త ఉద్యోగమని సర్వేలో తేల్చారు. డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని బెస్ట్ జాబ్ గా గుర్తించారు. అమెరికాకు చెందిన జాబ్స్ వెబ్ సైట్ 'కెరీర్ కాస్ట్' 200 ఉద్యోగాలను సర్వే చేసి ఈ నిర్ధారణకు వచ్చింది. 28వ వార్షిక ఉద్యోగాల రేటింట్ రిపోర్ట్ ను 'కెరీర్ కాస్ట్' తాజాగా విడుదల చేసింది. పనివాతావరణం, ఆదాయం, దృష్టి కోణం, ఒత్తడి తదితర అంశాలను ఉద్యోగాలకు రేటింగ్ ఇచ్చింది. ఇందులో న్యూస్ పేపర్ రిపోర్టర్ ఉద్యోగం వరుసగా మూడో ఏడాది చెత్త జాబ్ గా నిలిచింది. న్యూస్ పేపర్ రిపోర్టర్ వార్షిక వేతనం 37,200 డాలర్లుగా గుర్తించింది. దశాబ్ద కాలంగా ప్రింట్ మీడియా క్రేజ్ తగ్గుతూ వస్తోందని, ఈ ప్రభావం సిబ్బందిపై పడుతోందని సర్వే వెల్లడించింది. వాణిజ్య ప్రకటనల ఆదాయం బాగా తగ్గడం ప్రింట్ మీడియా కుంగుబాటు కారణమని తెలిపింది. పెస్ట్ కంట్రోల్ వర్కర్, ఫైర్ ఫైటర్, మిలటరీ సర్వీస్ లు వరస్ట్ ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెక్యురిటీ ఎనలిస్ట్, ఆడియాలజిస్ట్, డయాగ్నస్టిక్ మెడికల్ సోనోగ్రాఫర్ బెస్ట్ జాబ్స్ లిస్టులో చోటు సంపాదించాయి. -
స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లో వైఫై వేగం పెరగనుందా..?
న్యూయార్క్: మీరు వైఫైను ఉపయోగిస్తున్నారా? అది స్లోగా ఉంటోందా? ఇక మీ నెట్ కష్టాలు తీరిపోయినట్టే! భారత సంతతి చెందిన వ్యక్తి తాజా పరిశోధన టెలీకమ్యూనికేషన్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ఐఐటీ-మద్రాసు నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పట్టా పొందిన కృష్ణరామస్వామి.. ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన నాన్ రెసిప్రోకల్ సర్కులేటర్, ఫుల్ డూప్లెక్స్ రేడియోలను నానో స్కేల్ సిలికాన్ చిప్ లతో అనుసంధానించడం ద్వారా వేగంగా సమాచారాన్ని పంపే సిస్టంను కనుగొన్నారు. మొదటిసారి ఒక సర్కులేటర్ను సిలికాన్ చిప్తో అనుసంధానించామని, దీని ద్వారా మునుపటి కంటే అత్యుత్తమ పనితనాన్ని మనం గమనించవచ్చని ఆయన అన్నారు. గత సంవత్సరం కొలంబియా పరిశోధకులు ఫుల్ డూప్లెక్స్ రేడియో ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ టెక్నాలజీని ఆవిష్కరించారు. దాని ఫలితంగా ఒకే ఫ్రీక్వెన్సీ వద్ద ట్రాన్స్మిషన్, రిసెప్షన్లతో వైర్ లెస్ రేడియోలను వినియోగించడానికి అవకాశం ఏర్పడింది. రెండు యాంటెనాల సాయంతో ఒకే ఫ్రీక్వెన్సీతో సమాచారాన్ని చేరవేయడం సులభతరమయింది. ప్రస్తుత పరిశోధన వల్ల వైఫై టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఒకే యాంటెనా సాయంతో వైఫై కెపాసిటీని డబుల్ చేయడం వల్ల స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ఒకే చిప్ మీద సర్కులేటర్ను ఉంచడం వల్ల మిగిలిన రేడియో భాగాలు సైజులో బాగా తగ్గిపోయి పనితనం పెరిగిందని మరో పరిశోధకుడు జిన్ జోహు వివరించారు. ఈ విజయాన్ని సాధించడానికి కృష్ణస్వామి టీమ్ లారెంజ్ రెసిప్రోసిటీను బ్రేక్ చేయవలసి వచ్చింది (ఎలక్ర్టోమ్యాగ్నటిక్ ఫోర్సెస్ ముందుకు, వెనుకకు ఒకే సమయంలో ప్రయాణించేలా చేయాల్సి వచ్చింది). భావి తరాలకు చెందిన గ్రాడ్యుయేట్లకు ఇటువంటి పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని భారత సంతతికి చెందిన మరో ఇంజనీర్ తెలిపారు. 2016 ఐఈఈఈ నిర్వహించిన ఇంటర్నేషనల్ సాలిడ్ స్టేట్ సర్కూట్స్ కాన్ఫరెన్స్లో ఈ పేపర్ను ప్రచురించారు. -
పేపర్ బాయ్ పై రైల్వే పోలీసుల దాడి
♦ వికారాబాద్ పీఎస్లో బాధితుడి ఫిర్యాదు ♦ డబ్బులు ఇవ్వకపోవడంతో కొట్టారని ఆరోపణ వికారాబాద్ రూరల్: రైలులో వార్త పత్రికలు విక్రయించే యువకున్ని రైల్వే పోలీసులు చితక బాదిన సంఘటన వికారాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన యువకుడు ఫార్జన్ ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాశాడు. రైల్వే స్టేషన్లో వార్త పత్రికలు విక్రయిస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఉదయం యశ్వంత్పూర్ రైలులో వార్త పత్రికలు అమ్ముతూ తాండూరు నుంచి వికారాబాద్ వైపు వస్తున్నాడు. రైల్లో తాను పేపర్లు అమ్ముతూ వస్తున్న సమయంలో ఇద్దరు రైల్వే కానిస్టేబుళ్లు అతన్ని రూ.2 వేలు లంచంగా అడిగారని ఫిర్యాదు చేశాడు. తాను డబ్బులు ఇవ్వకపోవడంతో విచక్షణా రహితంగా చితకబాదారని పేర్కొన్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇష్టానుసారంగా దాడిచేశారని బోరుమన్నాడు. -
టుడే న్యూస్ డైరీ
మండే ఎండలు: నేటి నుంచి ఉత్తర తెలంగాణ, రాయలసీమల్లో పెరగనున్న ఎండతీవ్రత. వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ. ప్రజలు ఎండలో తిరగొద్దని సూచన పులివెందులకు వైఎస్ జగన్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. మంగళ, బుధవారాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. కృష్ణాపై కీలక భేటీ: కృష్ణా జలాల వినియోగం, ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారం కోసం ఏర్పాటయిన కృష్ణ్యా ట్రిబ్యూనల్ నేటి నుంచి వరుసగా మూడురోజులపాటు సమావేశం కానుంది. ఈ సమావేశానికి కృష్ణా పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు చెందిన ఉన్నతాధికారులు హాజరవుతారు. ఆర్ బీఐ పాలసీ ప్రకటన: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు పాలసీని సమీక్షించుకోనుంది. రెపో, రివర్స్ రెపో రేట్లపై పావు నుంచి అరశాతం కోతపడే అవకాశం ఉంటుందని అంచనా. ఢిల్లీ: రెండోరోజు కొనసాగనున్న జల వారోత్సవాలు గాటిమన్: దేశంలోనే వేగంగా నడిచే రైలుగా రికార్డులకెక్కనున్న గాటిమన్ రైలు సర్వీసు నేటి నుంచి ప్రారంభంకానుంది. రీ డిజైనింగ్ కమిటీ భేటీ: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై ఏర్పాటయిన కేబినెట్ సబ్ కమిటీ నేడు సమావేశంకానుంది. ఉగాది వేడుకలు: నేటినుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం, ఇప్పటికే లక్షలాదిగా తరలివచ్చిన కర్ణాటక భక్తులు -
టుడే న్యూస్ డైరీ
నూతన ఐటీ పాలసీ: తెలంగాణ నేడు నూతన ఐటీ పాలసీని ఆవిష్కరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ కొత్త ఐటీ విధానాన్ని ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నర్సింహన్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హాజరుకానున్నారు. పాలసీలో ఐటీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు ప్రకటించనుంది తెలంగాణ ప్రభుత్వం. నేడు తొలిదశ పోలింగ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలిదశ పోలింగ్ జరగనుంది. బెంగాల్ లోని 18 నియోజకవర్గాలు, అసోంలోని 65 స్థానాల్లో ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. దేశంలో తొలి ముస్లిం మహిళా సీఎం: జమ్ముకశ్మీర్ 13వ ముఖ్యమంత్రిగా మొహబూబా ముఫ్తీ సయీద్ నేడు ప్రమాణస్వీకారం చేస్తారు. దేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా సీఎంగా ఆమె రికార్డు నెలకొల్పారు. డీఎంకే- కాంగ్రెస్ పొత్తు కుదిరేనా: సీట్ల సర్దుబాటు విషయమై డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరగనున్నాయి. డీఎంకే అధినేత కరుణానిధిని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నేడు కలవనున్నారు. టీపీసీసీ భేటీ: గాంధీ భవన్ లో ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంజరగనుంది. జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి వేడుకలు, తాజా రాయకీయ పరిణామాలపై చర్చ నేడు తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం పీజీ కళాశాల విద్యార్థులపై దాడిని నిరసిస్తూ నేడు పాలమూరు వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు వాటర్ వీక్: నేటి నుంచి ఢిల్లీలో ఇండియన్ వాటార్ వీక్ కార్యక్రమం ప్రారంభం. హాజరుకానున్న 20 దేశాల ప్రతినిధులు. మిషన్ కాకతీయ పై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం -
టాప్ టెక్నాలజీ సంపన్నులెవరో తెలుసా..
న్యూయార్క్: సాధారణంగా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల వార్షిక నివేదికను ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. 2016కు కూడా వందలమందితో ఆ జాబితాను ప్రకటించింది. అయితే, వీరిలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కుబేరులుగా ఎదిగినవారు చాలామంది ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విలువ ఈ రోజుల్లో అంతాఇంతా కాదు. ఇది వ్యక్తుల అవసరాలు తీర్చడంలో ఎంత వేగంగా ఉపయోగపడుతుందో అంతేవేగంగా దీనిని అందించేవారికి సంపదను కూడా ఆర్జించి పెడుతుంది. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రపంచంలోనే కుబేరులైనవారు ఎంతోమంది ఉన్నారు. వారిలో టాప్ టెన్ జాబితా ఒకసారి పరిశీలిస్తే అందులో తొమ్మిదిమంది అమెరికన్లు ఉండగా చైనా నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒకసారి వివరాలు పరిశీలిస్తే.. 1. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు (సంపద 75 బిలియన్ డాలర్లు, అమెరికా) 2. జెఫ్ బెజోస్, అమెజాన్ స్థాపకుడు, సీఈవో (సంపద 45.2బిలియన్ డాలర్లు, అమెరికా) 3. మార్క్ జూకర్ బర్గ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు (సంపద 45.6 బిలియన్ డాలర్లు, అమెరికా) 4. లారీ ఎల్లిసన్, ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు (సంపద 43.6 బిలియన్ డాలర్లు, అమెరికా) 5. లారీ పేజ్, గూగుల్ వ్యవస్థాపకుడు, ఆల్పాబెట్ సీఈవో, (సంపద 35.2డాలర్లు, అమెరికా) 6. సెర్జీ బ్రిన్, అల్పాబెట్ అధ్యక్షుడు (సంపద 34.4 బిలియన్ డాలర్లు, అమెరికా) 7. స్టీవ్ బామర్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో (సంపద 23.5 బిలియన్ డాలర్లు, అమెరికా) 8. జాక్ మా, అలీబాబా వ్యవస్థాపకుడు (సంపద 20.5 బిలియన్ డాలర్లు, అమెరికా) 9. మైఖెల్ డెల్, డెల్ కంపెనీ బోర్డు చైర్మన్ (సంపద 19.8 బిలియన్ డాలర్లు, అమెరికా) 10. మా హువాతెంగ్, టెన్సెంట్ హోల్డింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు (సంపద 16.6 బిలియన్ డాలర్లు, చైనా -
బ్రెస్ట్ క్యాన్సర్కు కొత్త చికిత్స!
న్యూయార్క్: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనిని గుర్తించడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఓ కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కేవలం 11 రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ను ఈ కొత్త ఔషధం ప్రభావవంతంగా తొలగిస్తుందని బ్రెస్ట్ క్యాన్సర్ యురోపియన్ అసోసియేషన్ సదస్సులో పరిశోధకులు వెల్లడించారు. హెచ్ఈఆర్2 రకానికి చెందిన బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలపై హెర్సెప్టిన్, లాపాటినిబ్ ఫార్ములాతో ఉన్న కొత్త ఔషధం మంచి ఫలితాలను ఇచ్చిందని సదస్సు చీఫ్ ఎగ్జిక్యుటీవ్ సమియా అల్ ఖాదీ మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్తో కూడిన చికిత్స విధానాలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధక బృందం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు హెచ్ఈఆర్2 బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడిన సుమారు 250 మందిపై పరిశోధనలు జరిపి ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నిర్థారించారు. -
టుడే న్యూస్ డైరీ
తెలంగాణ అసెంబ్లీ: శని, ఆదివారాలు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వాహిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపింది తెలంగాణ సర్కార్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా శనివారం ఉద్యోగ నియామకాలపై రగడ చెలరేగిన సంగతి తెలిసిందే. నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. టీ కేబినెట్ భేటీ: ఆదివారం సాయంత్రం తెలంగాణ మంత్రివర్గం సమావేశంకానుంది. ఈ నెల 14న సమర్పించనున్న బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. టెట్ నోటిఫికేషన్: నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టు మొదటి యూనిట్ సింక్రనైనేషన్ కు నేడు శ్రీకారం అలహాబాద్ హైకోర్టుకు 150 ఏళ్లు: ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో హైకోర్టు ఏర్పాటుచేసి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్: నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్ తో నెదర్లాండ్స్ ఢీ, రాత్రి 7 గంటలకు బంగ్లాదేశ్ తో తలపడున్న ఒమన్ జట్టు. -
టుడే న్యూస్ డైరీ
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫెస్ట్: అనేక వివాదాల నడుమ ఢిల్లీలోని యమునా నదీ తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తలపెట్టిన ప్రపంచ సంస్కృతిక ఉత్సవాలు(వరల్డ్ కల్చరల్ ఫెస్ట్) నేడు ప్రారంభంకానుంది. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 190 దేశాలకు చెందిన 35 లక్షల మంది ప్రతినిధులు వేడుకలో పాల్గొంటారు. ఏపీ అసెంబ్లీ: వాడీవేడిగా సాగుతోన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు కూడా కొనసాగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ: గురువారంనాటి గవర్నర్ ప్రసంగం అనంతరం తెలంగాణ శాసనసభ నేడు తిరిగా ప్రారంభం కానుంది. ఉదయం బీఏసీ సమావేశం అనంతరం సభాకార్యకలాపాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సభ ప్రారంభం కాగానే దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట రెడ్డికి నివాళులు అర్పిస్తారు. టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ మధుసుదనాచారి టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తించిన నేపథ్యంలో వారికి నేడు సీట్లు కేటాయించనున్నారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం: తనపై విధించిన ఏడాది సస్సెన్షన్ ను సవాలు చేస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్ నేడు విచారణకురానుంది. భద్రాద్రి: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు శ్రీరామ మహాక్రతువు ప్రారంభంకానుంది. యాగశాలలో పండితులు హోమాగ్నితో అగ్నిప్రతిష్టచేయనున్నారు. సాయంత్రం రామాయణ పారాయణం ఉంటుంది. టీ20 వరల్డ్ కప్: నేడు పాకిస్థాన్ జట్టు భారత్ కు రాక. -
టుడే న్యూస్ డైరీ
సూర్యగ్రహణం: నేడు సూర్యగ్రహణం సదర్భంగా తీరుమల శ్రీవారి ఆలయం మూసివేత. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం. పార్లమెంట్ సమావేశాలు: నేడు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై మాట్లాడనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మున్నిపల్ ఎన్నికల ఫలితాలు: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. ఉదయం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితాలు వెలువడే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ అంసెంబ్లీ: అసెంబ్లీలో నేడు ప్రశ్నోత్తరాలపై చర్చ అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై విపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్: రవిశంకర్ సాస్కృతిక సమ్మేళనానికి అనుమతులివ్వడంపై గ్రీన్ ట్రిబ్యునల్లో ఇవాళ విచారణ కొనసాగనుంది. సాస్కృతిక సమ్మేళనానికి అనుమతుల జారీపై అధికారులను గ్రీన్ ట్రిబ్యునల్ నిలదీసిన విషయం తెలిసిందే. రావెల సుశీల్ కేసు: రావెల సుశీల్కుమార్ను బంజారా హిల్స్ పోలీసులు నేడు విచారించనున్నారు. సుశీల్ను రెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ: ఎస్సీ వర్గీకరణను కోరుతూ నేడు నారావారిపల్లి నుంచి ఆందోళనను ప్రాంరభించనున్న ఎమ్ఆర్పీఎస్ -
టుడే న్యూస్ డైరీ
మహిళా దినోత్సవం: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా పలు దేశాల్లోని మహిళా సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు: మూడురోజుల విరామం అనంతరం మంగళవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు: శనివారంనాటి గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదాపడిన ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు నేటి నుంచి తిరిగి కొనసాగనున్నాయి. మహా ఒప్పందం: గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన ఐదు ఆనకట్టల విషయమై మహారాష్ట్ర సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం నేడు ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇందుకోసం సోమవారమే ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్.. మంగళవారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో సమావేశం కానున్నారు. కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. పాలిసెట్: నేటి నుంచి పాలిసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 10 లోగా దరఖాస్తులు పూరించి పంపాల్సిఉంటుంది. ఏప్రిల్ 21న పరీక్ష నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు చంద్రబాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. పీఎస్ఎల్ వీ: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఎల్లుండి ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ 32 ఉపగ్రహ ప్రయోగానికి నేటి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. టీ20 క్రికెట్ వరల్డ్ కప్: నేటి నుంచి టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల క్వాలిఫయర్ మ్యాచ్ లు ప్రారంభం. బ్యాడ్మింటన్: నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేయిఉన్నారు. కాలినడకన వచ్చే భక్తులు మూడు గంటల్లోగా స్వామివారిని దర్శించుకునే వీలంఉంది. సూర్యగ్రహణం: బుధవారం సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో నేటి రాత్రి నుంచి రేపు ఉదయం వరకు ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. -
టుడే న్యూస్ డైరీ
మహాశివరాత్రి: నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. వేములవాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, కాళహస్తీశ్వర ఆలయాల్లో విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ముంబైకి కేసీఆర్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఐదు బ్యారేజీల విషయంలో ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్రతో కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సీఎం కేసీఆర్ నేడు ముంబై వెళ్లనున్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఇతర ఉన్నతాధికారులూ వెళతారు. ఏడుపాయల జాతర: మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయలలో నేటి నుంచి జాతర ప్రారంభంకానుంది. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర మూడు రోజులపాటు కొనసాగనుంది. స్టాక్స్ క్లోజ్: మహాశివరాత్రి పండుగ సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు