Paytm
-
పేటీఎమ్ మహాకుంభ్ సౌండ్బాక్స్
పేటీఎమ్ బ్రాండ్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా డిస్ప్లేతోకూడిన మహాకుంభ్ సౌండ్బాక్స్ను విడుదల చేసింది. దేశీయంగా తయారైన డిస్ప్లే సౌండ్బాక్స్ను కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ శుక్రవారం విడుదల చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ లాభాల్లోకి ప్రవేశించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు కీలక బిజినెస్లు దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త విభాగాలలో పెట్టుబడులు చేపడుతున్నట్లు తెలియజేశారు.ప్రీమియం మర్చంట్ల అభిప్రాయాలమేరకు కస్టమర్ల చెల్లింపులను ఇతరులు వినకుండా డిస్ప్లేతోకూడిన సౌండ్బాక్స్ను రూపొందించినట్లు వివరించారు. అధిక విలువగల కొనుగోళ్లకు వీలున్న భారీ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు తదితర పెద్ద షాపులు లక్ష్యంగా వీటిని తయారు చేసినట్లు తెలియజేశారు. -
పేటీఎంకు ఈడీ నోటీస్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పేటీఎం మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’కు (ఓసీఎల్) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు జారీ చేసింది. వన్97 కమ్యూనికేషన్స్తోపాటు, సంస్థ చైర్మన్, ఎండీ విజయ్ శేఖర్ శర్మ, సబ్సిడరీ కంపెనీలైన లిటిల్ ఇంటర్నెట్, నియర్బై ఇండియాకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.611 కోట్ల విలువకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్టు దర్యాప్తులో తేలడంతో న్యాయపరమైన చర్యలకు ముందు ఈడీ స్పెషల్ డైరెక్టర్ ఈ నోటీసు జారీ చేశారు. నియంత్రణ ప్రక్రియలు, చట్టబద్ధమైన మార్గా ల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని పేటీఎం అధికార ప్రతినిధి ప్రకటించారు. ఓసీఎల్ సింగపూర్లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని ఆర్బీఐకి వెల్లడించలేదని దర్యాప్తులో గుర్తించినట్టు ఈడీ ప్రకటించింది. ఆర్బీఐ నిర్దేశిత ధరల మార్గదర్శకాలను అనుసరించకుండా, ఓసీఎల్ సబ్సిడరీ అయిన లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేటు లిమిటెడ్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అందుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ రెండు కంపెనీలను తాము 2017లో దక్కించుకున్నామని, వీటికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన తమ సబ్సిడరీలు కాకముందు జరిగినవిగా పేటీఎం స్పష్టత ఇచి్చంది. పేటీఎం షేరు ఎన్ఎస్ఈలో 4% పడి, ఇంట్రాడే కనిష్టానికి (రూ.684) దిగజారింది. చివరికి 2 శాతం లాభంతో రూ.729 వద్ద ముగిసింది. -
అంకుర సంస్థలకు ప్రభుత్వ తోడ్పాటు
తయారీ, ఫిన్టెక్ స్టార్టప్ల అభివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పేటీఎంతో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంకుర సంస్థలు కార్యకలాపాలు విస్తరించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు అవసరమైన మెంటార్షిప్, మార్కెట్ యాక్సెస్, నిధుల అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపరంగా మద్దతునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.ఈ చర్యల్లో భాగంగా నియంత్రణ నిబంధనలను పాటించడంపై, పెట్టుబడులను సమకూర్చుకోవడానికి ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్షాప్లను నిర్వహిస్తారు. పేటీఎం విస్తృత మర్చంట్ నెట్వర్క్ను ఉపయోగించుకుని స్టార్టప్లు తమ ఉత్పత్తులను టెస్ట్ చేసేందుకు, వేలిడేట్ చేసేందుకు, వాటిని మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలు, మార్కెట్ యాక్సెస్కి సంబంధించిన మద్దతు లభిస్తుంది. మెంటార్షిప్, ఆర్థిక సాయం, అధునాతన టెక్నాలజీ ద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సాధికారత కలి్పంచేందుకు పేటీఎం కట్టుబడి ఉందని సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. పేటీఎం ఫిన్టెక్ అనుభవాన్ని, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, కార్యకలాపాలను విస్తరించడంలో, సవాళ్లను అధిగమించడంలో స్టార్టప్లను తోడ్పాటు అందిస్తామని డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు.హెచ్బీఎన్ డెయిరీస్కు నోసెబీ తాజా హెచ్చరికక్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్బీఎన్ డెయిరీస్కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దంటూ పబ్లిక్ను హెచ్చరించింది. హెచ్బీఎన్ డెయిరీస్ అండ్ అలైడ్ లిమిటెడ్కు చెందిన ఎలాంటి ప్రాపర్టీ కొనుగోలు లేదా లావాదేవీలు చేపట్టవద్దంటూ పేర్కొంది. వీటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా సూచించింది. కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు తప్పుడు సమాచారం(వదంతులు) ప్రచారం చేస్తూ హెచ్బీఎన్ ప్రాపర్టీస్ వేలాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని తెలియజేసింది. సెబీ అధికారులుగా చెప్పుకుంటూ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా నిజమైన కొనుగోలుదారులను పక్కదారి పట్టించడంతోపాటు.. సెబీ ఈవేలం విధానానికి అడ్డుతగులుతున్నట్లు వివరించింది. హెచ్బీఎన్ ప్రాపరీ్టస్లో.. సంస్థ డైరెక్టర్లు, సంబంధిత అనుబంధ, సహచర సంస్థలు తదితరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి హక్కులూ లేవని స్పష్టం చేసింది. వెరసి హెచ్బీఎన్ ఆస్తుల విషయంలో సంస్థకు సంబంధించిన ఏ వ్యక్తినీ లేదా ఏ సంస్థనూ చట్ట విరుద్ధంగా అనుమతించబోమని పేర్కొంది. -
పేటీఎం కొత్త ఫీచర్.. యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు..
పేటీఎం తన వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘రిసీవ్ మనీ క్యూఆర్ విడ్జెట్’ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ పేటీఎం క్యూఆర్ కోడ్ను నేరుగా తమ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్పై డిస్ ప్లే చేసుకోవచ్చు. ప్రతిసారి యాప్ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇన్స్టంట్ పేమెంట్ కనెక్షన్కు వీలు కల్పించింది.లావాదేవీలను సరళతరం చేయడంలో భాగంగా గతంలో ఐఓఎస్ యూజర్లకు ఈ క్యూఆర్ విడ్జెట్ను పేటీఎం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ సర్వీసును ఆండ్రాయిడ్కు విస్తరించినట్లు ప్రకటించింది. ఇది చిన్న వ్యాపారాలు, దుకాణదారులు.. వంటివారికి నిరాటంకంగా చెల్లింపులను స్వీకరించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సర్వీసు ద్వారా పేటీఎం చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.రియల్ టైమ్ అలర్ట్లుయూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు పేటీఎం ప్రత్యేకమైన కాయిన్ డ్రాప్ సౌండ్ నోటిఫికేషన్ను ప్రవేశపెట్టింది. ఈ రియల్ టైమ్ అలర్ట్ యూజర్ అందుకున్న చెల్లింపుల ధ్రువీకరణను నిర్ధారిస్తుంది. వినియోగదారులు యాప్ను తనిఖీ చేయకుండానే లావాదేవీల గురించి తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపుల్లో నమ్మకాన్ని, పారదర్శకతను పెంచుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: బడ్జెట్లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..క్యూఆర్ విడ్జెట్ను ఎలా యాడ్ చేయాలంటే..ఆండ్రాయిడ్ ఫోన్లో సులభంగానే హోమ్ స్క్రీన్పై క్యూఆర్ విడ్జెట్ను సెటప్ చేసుకోవచ్చు.పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.ఎగువ ఎడమవైపు ఉన్న ప్రొఫైల్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి.క్యూఆర్ కోడ్ దిగువన ‘యాడ్ క్యూఆర్ టు హోమ్ స్క్రీన్’ ఆప్షన్ ఎంచుకోండి.దాన్ని కన్ఫర్మ్ చేయాలి. వెంటనే విడ్జెట్ హోమ్ స్క్రీన్పై వస్తుంది.పేటీఎం యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ విడ్జెట్ ద్వారా చెల్లింపులు స్వీకరించవచ్చు. -
ఎన్పీసీఐ ప్రకటన.. పేటీఎం షేర్లు ఢమాల్!
యూపీఐ ప్రొవైడర్లకు సంబంధించిన 30 శాతం మార్కెట్ షేర్ పరిమితిని పాటించేందుకు గడువును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో రెండేళ్లు పొడిగించింది. ఈ ప్రకటన తర్వాత బుధవారం (జనవరి 1) ట్రేడింగ్ సెషన్లో పేటీఎం (Paytm) షేర్లు బీఎస్ఈ (BSE)లో దాదాపు 4 శాతం పడిపోయి రూ. 976.5కి చేరుకున్నాయి.యూపీఐ ప్రొవైడర్ల డిజిటల్ లావాదేవీల పరిమాణం వాటి మార్కెట్ షేర్లో 30 శాతానికి మించకూడదని ఎన్పీసీఐ నిబంధన విధించింది. దీనికి ఇదివరకు 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా దీన్ని 2026 డిసెంబర్ 31 వరకు మరో రెండేళ్లు పొడిగించింది. "వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) సమ్మతి గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నాము" అని ఎన్పీసీఐ తన ప్రకటనలో తెలిపింది.పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,626 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ రూ.310 కాగా, 52 వారాల గరిష్టం రూ.1,063. జనవరి 1న బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇది ఒకటి.కాగా ఎన్పీసీఐ నిర్ణయం వల్ల వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫోన్పే (PhonePe), గూగుల్ పే (Google Pay)కి స్వల్పకాలిక ఉపశమనం లభించనుంది. రెండూ కలిసి యూపీఐ (UPI) చెల్లింపుల మార్కెట్లో 85 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొత్త పరిమితిని పాటించడానికి వాటికి అదనపు సమయం లభించింది.రెగ్యులేటరీ డేటా ప్రకారం.. 2024 నవంబర్లో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్పే 47.8% వాటాను కలిగి ఉండగా గూగుల్ పే 37 శాతం వాటాను కలిగి ఉంది. రెండు కంపెనీలు కలిసి ఆ నెలలో 13.1 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి. -
తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్థులు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్పే, జీపే వంటి థర్డ్పార్టీ మోబైల్ యాప్ల ద్వారా నగదు లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ నుంచి మెసేజ్లు, లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు చిన్నమొత్తాల్లో ఖాతాల్లోకి డబ్బు పంపించి తిరిగి ఆ ఖాతాలను లూటీ చేసేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల సైబర్ మోసగాళ్లు ఫోన్పే, జీపే, పేటీఎం వంటి థర్డ్పార్టీ పేమెంట్ యాప్ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్న వారికి మెసేజ్ వస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నమ్మించి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్పై క్లిక్ చేయండి’అంటూ మెసేజ్లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే పిన్ జనరేట్ చేయమనేలా అడుగుతుంది. పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్పర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చాట్జీపీటీ సేవల్లో అంతరాయంఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బు జమ అవుతుందంటే అనుమానించాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన మేసేజ్లను, లింక్లను ఓపెన్ చేయకుండా నేరుగా డెలిట్ చేయాలని చెబుతున్నారు. -
మరో బిజినెస్ నుంచి తప్పుకోనున్న పేటీఎం
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అప్రధాన్య వ్యాపారాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. సినిమా, ఈవెంట్ టికెట్లను విక్రయించే పేటీఎం ఇన్సైడర్ను ఇటీవలే జొమాటోకు విక్రయించడం ద్వారా రూ.2,048 కోట్లు సమకూర్చుకున్న పేటీఎం.. తాజాగా జపాన్కు చెందిన పేపే కార్పొరేషన్లో తనకున్న వాటాలను విక్రయించాలని నిర్ణయించింది.ఈ వాటాల వలువ 236 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,000 కోట్లు) ఉంటుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ల అంచనా. పే పే కార్పొరేషన్లో వన్97 కమ్యూనికేషన్స్కు 7.2 శాతం వాటా ఉంది. ‘‘జపాన్కు చెందిన పే పే కార్పొరేషన్లో స్టాక్ అక్విజిషన్ రైట్స్ (ఎస్ఏఆర్)ను విక్రయించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు వన్97 కమ్యూనికేషన్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి సమాచారం వచ్చింది’’అని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు పేటీఎం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.930 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ టికెట్ బిజినెస్ ద్వారా భారీ లాభాలు అందుకుంది. కంపెనీ రెవెన్యూ 10.5 శాతం పెరిగింది. ఇటీవలే గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సైతం ఈ స్టాక్ కొత్త టార్గెట్ ప్రైస్ రూ.1000గా పేర్కొంది.కాగా పేటీఎం షేర్లు గత ఆరు నెలలుగా మంచి లాభాలు అందిస్తున్నాయి. నష్టాల్లోకి జారుకున్నప్పటికీ సహనంతో కొనసాగినందుకు మదుపర్లకు ప్రతిఫలాలు లభిస్తున్నాయి. గడిచిన ఆరు నెలల కాలంలో ఏటీఎం షేరు ఏకంగా 140 శాతం మేర పెరిగింది. దీంతో లక్ష రూపాయలు పెట్టిన వారికి ఆరు నెలల్లో రూ.2.40 లక్షలు అందించింది. -
విదేశాల్లోనూ పేటీఎం యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ప్రయాణించే తమ యూజర్లు .. యూపీఐ మాధ్యమంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును ఆర్థిక సేవల సంస్థ పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్లోని నిర్దిష్ట ప్రాంతాల్లో దీన్ని వినియోగించుకోవచ్చని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది.షాపింగ్, డైనింగ్ సహా వివిధ అవసరాలకు చెల్లింపుల కోసం ఈ ఫీచరు ఉపయోగపడగలదని పేర్కొంది. రానున్న హాలిడే సీజన్లో తమ యూజర్లు మరింత సౌకర్యవంతంగా విదేశీ ప్రయాణాలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొంది. -
పేటీఎంకు ఎన్పీసీఐ ఊరట
న్యూఢిల్లీ: ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంకు ఊరటనిస్తూ కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుమతించింది. నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనలను పాటించడాన్ని బట్టి అనుమతులు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొన్నట్లు ఎక్సే్చంజీలకు ఇచి్చన సమాచారంలో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు గాను కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఈ ఏడాది జనవరిలో అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను (పీపీబీఎల్) ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుమతుల వార్తలతో బుధవారం ఓసీఎల్ షేరు ధర 8 శాతం లాభంతో రూ. 745 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం ఎగబాకింది. -
పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!
కష్టాల్లో కూరుకుపోయిన ఫిక్ టెక్ కంపెనీ పేటీఎంకి భారీ ఊరట లభించింది. కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతినిచ్చింది. ఆగస్ట్లో కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు ఎన్పీసీఐ అనుమతిని మంజూరు చేసిందని పేటీఎం తెలిపింది.నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా ఎన్పీసీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోకుండా పేటీఎంపై నిషేధించింది. తాజాగా పేటీఎం అభ్యర్థన మేరకు రెగ్యులేటరీ నిబంధనలు, ప్రోటోకాల్స్లను సమీక్షించి కొత్తగా యూజర్లను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి మాత్రమే.ఇదీ చదవండి: అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!ఆర్బీఐ చర్యల తర్వాత ఇప్పటివరకూ పేటీఎం షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 34 శాతం క్షీణత, నెలవారీ లావాదేవీల వినియోగదారులలో 25 శాతం తగ్గుదలని నివేదించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి. -
టాటాకు సంతాపం తెలుపుతూ ట్వీట్.. కాసేపటికే డిలిట్!
రతన్ టాటా మృతిపట్ల సంతాపం తెలుపుతూ పేటీఎం సీఈఓ విజయ్శేఖర్ శర్మ చేసిన ట్వీట్పై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. టాటా మరణవార్త విని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పేటీఎం సీఈఓ విజయ్శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా టాటాకు సంతాపం ప్రకటించారు. అయితే తన ట్వీట్లోని చివరి లైన్లపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవడంతో వెంటనే ఆ ట్వీట్ను తొలగించారు.‘భవిష్యత్తు తరం వ్యాపారులు టాటా ఇచ్చే సలహాలు, సూచనలను మిస్ అవుతారు. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ టాటా. సెల్యూట్ సర్.. ఓకే టాటా బైబై’ అని విజయ్శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ చివరి లైన్ ‘ఓకే టాటా బైబై’పై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాసేపటికే శర్మ ఆ పోస్ట్ను తొలగించారు.wtf is the last line pic.twitter.com/dOrIeMQH7c— Shivam Sourav Jha (@ShivamSouravJha) October 10, 2024ఇదీ చదవండి: టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్, సంజీవ్ గోయెంకా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, కుమారమంగళం బిర్లా, హిందుజా గ్రూప్ చైర్మన్. జీపీ హిందుజా, ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండిగో) ఎండీ రాహుల్ భాటియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ ఉన్సూకిమ్..వంటి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. -
'లాభాల్లోకి వస్తాం.. ఇదే మా సంకల్పం': పేటీఎం సీఈవో
న్యూఢిల్లీ: నిర్వహణ లాభం కంటే నికర లాభంపై పేటీఎం దృష్టి సారించినట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈసాప్ (ఉద్యోగులకు స్టాక్స్) వ్యయాలకు ముందు ఎబిట్డా పాజిటివ్ సాధిస్తామని పేటీఎం గతంలో ప్రకటించడం గమనార్హం. ‘‘ఈసాప్కు ముందు ఎబిట్డా కంటే నికర లాభం గురించే చెప్పాలంటూ కంపెనీ బోర్డు సభ్యుడు ఒకరు నాకు సూచించారు. ఇప్పుడు ఈసాప్ వ్యయాలకు ముందు ఎబిట్డా ఒక్కటే కాకుండా, నికర లాభాన్ని నమోదు చేయాలని అనుకుంటున్నాం. ఇదే మా కొత్త సంకల్పం’’అని శర్మ తెలిపారు.పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా వాటాదారులకు ఈ వివరాలు వెల్లడించారు. జూన్తో ముగిసిన త్రైమాసికంలో పేటీఎం రూ.840 కోట్ల నష్టాలను నమోదు చేయడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.358 కోట్లుగా ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేయడం తదనంతర పరిణామాలతో కంపెనీల నష్టాలు పెరిగాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంకృత్రిమ మేథ ప్రభావాన్ని ఈ సందర్భంగా శర్మ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో ఏఐ ఎన్నో మార్పులకు కారణమవుతోందంటూ.. వచ్చే ఐదేళ్లలో ఆటోమేటెడ్ కార్లు పెరిగిపోవచ్చన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఎదిగిన భారత్, ఏఐ టెక్నాజీలోనూ ఇదే విధంగా అవకాశాలను సొంతం చేసుకోవాలన్నారు. రిస్క్ నిర్వహణలో ఏఐ సాంకేతికతకు పేటీఎం ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు శర్మ చెప్పారు. -
పేటీఎం పేమెంట్స్లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్లో (పీపీఎస్ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది. -
పేటీఎమ్కు సెబీ ఝలక్
న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్(పీపీబీఎల్)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్97 కమ్యూనికేషన్స్ సంబంధ ఫైనాన్షియల్ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్పీటీలలో పేటీఎమ్ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్97 బీఎస్ఈకి తెలియజేసింది. -
పేటీఎమ్ నుంచి సాఫ్ట్బ్యాంక్ ఔట్
న్యూఢిల్లీ: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ నుంచి పెట్టుబడుల జపనీస్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ పూర్తిగా వైదొలగింది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ పేమెంట్ తదితర సేవలందించే వన్97లో సాఫ్ట్బ్యాంక్ 2017లో దశలవారీగా 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,525 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. అయితే ఈ పెట్టుబడులపై 10–12 శాతం నష్టానికి పేటీఎమ్ నుంచి పూర్తిగా బయటపడినట్లు తెలుస్తోంది. వెరసి పెట్టుబడులపై 15 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,250 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలుత భారీ వాటా సాఫ్ట్బ్యాంక్ తొలుత అంటే 2021 పబ్లిక్ ఇష్యూకి ముందు పేటీఎమ్లో 18.5 శాతం వాటా పొందింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్(కేమన్) ద్వారా 17.3 శాతం, ఎస్వీఎఫ్ పాంథర్(కేమన్) లిమిటెడ్ ద్వారా మరో 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఐపీవోలో పూర్తి వాటాను ఎస్వీఎఫ్ పాంథర్ 22.5 కోట్ల డాలర్ల(రూ. 1,689 కోట్లు)కు విక్రయించింది. ఈ సమయంలోనే సొంత ప్రణాళికలకు అనుగుణంగా సాఫ్ట్బ్యాంక్ 24 నెలల్లోగా మిగిలిన వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి పేటీఎమ్లో వాటాను షేరుకి రూ. 800 సగటు ధరలో సాఫ్ట్బ్యాంక్ చేజిక్కించుకుంది. లిస్టింగ్లో డీలా ఇష్యూ ధర షేరుకి రూ. 2,150కాగా.. పేటీఎమ్ 9 శాతం తక్కువగా రూ. 1,955 ధరలో లిస్టయ్యింది. తదుపరి ధర పతనమవుతూ వచ్చింది. సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్)ను ఆర్బీఐ నిõÙధించడంతో షేరు ధర మరింత దిగజారింది. ఈ ఏడాది మే 9న చరిత్రాత్మక కనిష్టం రూ. 310ను తాకింది. పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం నేపథ్యంలో గతేడాది(2023–24) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 550 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ కాలంలో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల భవిష్యత్ అనిశ్చితుల రీత్యా పీపీబీఎల్లో రూ. 227 కోట్ల పెట్టుబడుల(39 శాతం వాటా)ను రద్దు చేసింది. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 1,422 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అయితే అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 1,776 కోట్లకుపైగా నష్టం వాటిల్లిన విషయం విదితమే. కాగా.. 7 నెలల క్రితం యూఎస్ బిలియనీర్ వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హాథవే సైతం పేటీఎమ్ నుంచి నష్టాలకు వైదొలగడం గమనార్హం! షేరుకి దాదాపు రూ. 1,280 ధరలో కొనుగోలు చేసిన బెర్క్షైర్ నవంబర్లో రూ. 877.3 సగటు ధరలో అమ్మివేసింది. దీంతో రూ. 2,179 కోట్ల పెట్టుబడులకుగాను రూ. 1,371 కోట్లు అందుకుంది.గత వారాంతాన పేటీఎమ్ షేరు బీఎస్ఈలో 2.5 % నష్టంతో రూ. 467 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
పేటీఎంను పూర్తిగా వదిలించుకున్న సాఫ్ట్బ్యాంక్
ఫిన్టెక్ మేజర్ పేటీఎం (Paytm) నుంచి జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ నిష్క్రమించింది. సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడి విభాగం సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ (SVF) జూన్ త్రైమాసికంలో సుమారు 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.సాఫ్ట్బ్యాంక్ 2017లో పేటీఎం బ్రాండ్ యజమాన్య సంస్థ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్'లో సుమారు 1.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10-12 శాతం నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎం ఐపీఓకి ముందు సాఫ్ట్బ్యాంక్ పేటీఎంలో దాదాపు 18.5 శాతం వాటాను కలిగి ఉంది.సాఫ్ట్బ్యాంక్ ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 17.3 శాతం వాటాను, ఎస్వీఎఫ్ పాంథర్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఎస్వీఎఫ్ పాంథర్ ఐపీఓ సమయంలో తన మొత్తం వాటాను రూ.1,689 కోట్లకు అంటే దాదాపు 225 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ పేటీఎంలో తన మిగిలిన 1.4 శాతం వాటాను విక్రయించింది.ఐపీఓ జరిగిన 24 నెలల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించనున్నట్లు గతంలోనే సాఫ్ట్బ్యాంక్ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు బయటకు వచ్చేసింది. అయితే, ఆ సమయంలోనే కంపెనీ నష్టాన్ని అంచనా వేసిందని కంపెనీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. అప్పట్లో సాఫ్ట్బ్యాంక్ పేటీఎం షేర్లను సగటున రూ.800 చొప్పున కొనుగోలు చేసింది. -
'నా బిడ్డ ప్రమాదానికి గురైంది.. ఐసీయూలో ఉంది': పేటీఎం ఫౌండర్
పేటీఎం సంక్షోభం గురించి జేఐఐఎఫ్ ఫౌండేషన్ డే ఈవెంట్లో సంస్థ ఫౌండర్ అండ్ ఎండీ 'విజయ్ శేఖర్ శర్మ' కీలక వ్యాఖ్యలు చేశారు. పేటీఎం ప్రమాదంలో పడి ఇప్పుడు ఐసీయూలో ఉన్న నా కుమార్తె లాంటిదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.పేటీఎం నాకు బిడ్డ లాంటిది. మేము కలిసి ఎదిగాము, లాభాలను చవిచూసాము, ఫ్రీ క్యాష్ కూడా జనరేట్ చేశాము. జీవితంలో నా బిడ్డ ఉన్నతమైన స్థానానికి చేరుతుందని భావించాను, కానీ ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష కోసం వెళుతున్నప్పుడు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఐసీయూలో ఉందని అన్నారు.ఈ ఏడాది ప్రారంభంలో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కేవైసీ నిబంధనలను పాటించలేదని, తద్వారా మనీ ల్యాండరింగ్ జరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావించింది. దీంతో 2024 ఫిబ్రవరి 29 తరువాత కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. డిపాజిట్, క్రెడిట్ సౌకర్యాలు, ప్రీపెయిడ్ అండ్ పోస్ట్-పెయిడ్ ఖాతాలపై టాప్ అప్ చేయకూడదని, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ & యూపీఐ లావాదేవీలు వంటి వాటిని కూడా ఆర్బీఐ నిషేదించింది.పేటీఎంపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది కంపెనీ హోల్డర్లకు కూడా నష్టాన్నే మిగిల్చింది. ఐపీఓలోనే ఈ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే పయనిస్తున్న పేటీఎం ఇప్పుడు కూడా సంక్షోభంలోనే నడుస్తోంది. -
రూ.35లకే పేటీఎం ప్రత్యేక హెల్త్ ప్లాన్.. ప్రయోజనాలు ఇవే..
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం తమ మర్చంట్ పార్టనర్స్ కోసం ప్రత్యేక హెల్త్ ప్లాన్ను తీసుకొచ్చింది. 'పేటీఎం ఫర్ బిజినెస్' యాప్లో 'పేటీఎం హెల్త్ సాథీ' అనే ప్రత్యేక హెల్త్ అండ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్ను పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది.తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం ద్వారా తమ విస్తారమైన వ్యాపార భాగస్వాముల నెట్వర్క్కు తోడ్పాటు అందించడానికి పేటీఎం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చొరవ ఒక భాగం. వ్యాపార భాగస్వాముల శ్రేయస్సును పరిరక్షించడం, వారి ఆరోగ్యం, వ్యాపార కొనసాగింపును నిర్ధారించడం 'పేటీఎం హెల్త్ సాథీ' లక్ష్యం.పేటీఎం హెల్త్ సాథీ ప్రయోజనాలునెలవారీ సబ్ స్క్రిప్షన్ పై నెలకు కేవలం రూ.35తో ప్రారంభమయ్యే పేటీఎం హెల్త్ సాథీ తన భాగస్వామ్య నెట్ వర్క్ పరిధిలో అపరిమిత డాక్టర్ టెలీ కన్సల్టేషన్, ఇన్ పర్సనల్ డాక్టర్ విజిట్స్ (ఓపీడీ) వంటి సేవలను అందిస్తోంది.వరదలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, సమ్మెలు వంటి వాటి కారణంగా వ్యాపార అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆదాయ రక్షణ కవరేజీని కూడా ఇది అందిస్తుంది.డాక్టర్ టెలీ కన్సల్టేషన్ సర్వీస్తోపాటు ప్రముఖ ఫార్మసీలలో డిస్కౌంట్లు, రోగనిర్ధారణ పరీక్షలలో తగ్గింపులు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.క్లెయిమ్ ప్రాసెస్ను కూడా సులభతరం చేసింది. యాప్లోనే దీన్ని పూర్తి చేయవచ్చు.'పేటీఎం హెల్త్ సాథీ' పైలట్ సర్వీస్ మే నెలలోనే ప్రారంభమైంది. ఇప్పటికే 3000 మందికి పైగా మర్చంట్ భాగస్వాములు ఉపయోగించుకున్నారు. ఇది విజయవంతం కావడంతో కంపెనీ ఈనెల ప్రారంభంలో తన వ్యాపారులందరికీ ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. -
ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్పార్టీ యాప్ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్పీడీసీఎల్ లేదా ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024ఆర్బీఐ నిబంధనలు..జులై 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్ను ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్పార్టీ యాప్ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు. -
TGSPDCL: ఫోన్పే, పేటీఎంలో కరెంటు బిల్లులు చెల్లించకండి
సాక్షి,హైదరాబాద్: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారా ఈజీగా విద్యుత్ బిల్లులు చెల్లించే ఛాన్సు ఇక లేదు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు యూపీఐ యాపుల్లో పే చేయడం కుదరదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే యూపీఐ పేమెంట్ యాప్స్ ఈ సేవలను నిలిపి వేశాయి. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ రెండింటి ద్వారానే ఈ నెల కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఆ సంస్థ ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. ఒక్క దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాకుండా ఉత్తర తెలంగాణకు సంబంధించిన టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థది అదే పరిస్థితని తెలుస్తోంది. Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024 -
జొమాటో చేతికి ఆ పేటీఎం బిజినెస్.. పురోగతిలో చర్చలు!
పేటీఎంకు సంబంధించిన మూవీ టికెటింగ్ అండ్ ఈవెంట్స్ బిజినెస్ను ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కొనుగోలు చేయబోతోంది. రూ.1,500 కోట్లకు ఈ బిజినెస్ను కొనుగోలు చేసేందుకు జొమాటో చర్చలు జరుపుతోందని, ఈ చర్చలు పురోగతిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.పేటీఎం ఈవెంట్లు, మూవీ టికెటింగ్ వ్యాపారంపై జొమాటో ఆసక్తి వ్యూహాత్మకంగా సరిపోతుందని, ఆహారం, కిరాణా, వినోదంతో సహా వివిధ కేటగిరీల్లో వినియోగదారుల డిమాండ్ను చేజిక్కించుకోవడమే దాని విస్తృత లక్ష్యమని ఈటీ నివేదిక పేర్కొంది. ఈ కొనుగోలు ఖరారైతే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్)ను కొనుగోలు చేసిన తర్వాత జొమాటోకి ఇది రెండో అతిపెద్ద కొనుగోలు అవుతుంది. 2022లో రూ.4,447 కోట్ల విలువైన బ్లింకిట్ను జొమాటో కొనుగోలు చేసింది.క్విక్ కామర్స్ విభాగంలో పోటీ పెరిగిన నేపథ్యంలో జొమాటో తన క్విక్ కామర్స్ అనుబంధ సంస్థ బ్లింకిట్ లోకి రూ.300 కోట్లు చొప్పించనుంది. తాజా విడతలో బ్లింకిట్ లో జొమాటో మొత్తం పెట్టుబడులు రూ.2,300 కోట్లకు చేరినట్లు టోఫ్లర్ నుంచి లభించిన ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది. పేటీఎం తన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ బిజినెస్కు సంబంధించిన వ్యాపార గణాంకాలను వెల్లడించలేదు. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం తన మార్కెటింగ్ సేవల వ్యాపారంలో రూ .1,740 కోట్లు వార్షిక అమ్మకాలను నివేదించింది, ఇందులో సినిమా, ఈవెంట్లు, క్రెడిట్ కార్డ్ మార్కెటింగ్, గిఫ్ట్ వోచర్లు ఉన్నాయి. -
పేటీఎంలో ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఫిన్టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ మరోమారు ఉద్యోగుల్లో కోత విధించింది. వీరికి ఔట్ప్లేస్మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రెజ్యూమే రూపకల్పనకు సాయం చేయడంతోపాటు ఇంటర్వ్యూకు సన్నద్ధం చేయడం, మెళకువలు నేర్పడం, మార్కెట్లో ఉన్న ఉద్యోగావకాశాలను తెలియజేయడం వంటివి ఔట్ప్లేస్మెంట్ సపోర్ట్ అంటారు. తీసివేతకు గురైన సిబ్బందికి సాయం చేసేందుకు.. మార్కెట్లో నియామకాలు చేపడుతున్న 30 కంపెనీలతో పేటీఎం మానవ వనరుల విభాగం చేతులు కలిపింది. కాగా, ఎంత మందిని తొలగించిందీ అన్న విషయం మాత్రం వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించలేదు. -
లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ
పేటీఎం పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా ప్రకటించింది. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులకు కొత్త కొలువులు వచ్చేలా కంపెనీ మద్దతు ఇస్తుందని చెప్పింది.కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ మే నెలలో సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను ప్రారంభించారు. సంస్థ ఖర్చులు తగ్గించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టెక్ కంపెనీకి ప్రధానంగా టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సాంకేతిక సదుపాయాలు), ఉద్యోగుల వేతనాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి చాలా కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇటీవల పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మేనెలలో కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు కంపెనీ చెప్పింది. అయితే ఎంతమందిని ఉద్యోగాల్లోనుంచి తొలగించిందో మాత్రం తెలియజేయలేదు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్విజయ్శేఖర్ శర్మ మే 22న షేర్హోల్డర్లకు రాసిన లేఖలో..‘సంస్థ తన ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారిస్తోంది. సంభావ్య తొలగింపులకు(పొటెన్షియల్ లేఆఫ్స్) సిద్ధమైంది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల ఖర్చులను తగ్గించడం ద్వారా ఏటా రూ.400కోట్లు-రూ.500 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (పీజీఐఎల్) సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.దీంతో ఇకపై పీజీఐఎల్ ఇన్సూరెన్స్ నేరుగా తన కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మేందుకు వీలు లేదు. థర్డ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. అంటే ఇతర ఇన్సూరెన్స్ పాలసీల నిర్వహణ, అమ్మకాలు చేయొచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్సు కోసం దరఖాస్తును ఉపసంహరించుకోవడం ద్వారా మాతృ సంస్థ రూ. 950 కోట్ల నగదును ఆదా చేసుకునేందుకు వీలు అవుతుందని పేటీఎం తెలిపింది. ఆ మొత్తాన్ని పీజీఐఎల్లో పెట్టుబడి పెట్టేందుకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. మరో అనుబంధ సంస్థ పేటీఎం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం వినియోగదారులకు, చిరు వ్యాపారులకు ఇతర పరిశ్రమలకు ఇన్సూరెన్స్ సేవల్ని అందించడంపై దృష్టి సారిస్తామని తెలిపింది. -
పేటీఎంకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ క్యూ4లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 168 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు చేరింది. పేటీఎం బ్రాండ్ కంపెనీ మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లకు పరిమితమైంది. యూపీఐ లావాదేవీలు తదితరాలలో తాత్కాలిక అవరోధాలు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీఎల్)కు శాశ్వత అంతరాయం కారణంగా పనితీరు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంక్ భవిష్యత్ బిజినెస్పై అనిశ్చితి కొనసాగనున్న నేపథ్యంలో పీపీబీఎల్లో 39 శాతం వాటాకుగాను క్యూ4లో రూ. 227 కోట్ల పెట్టుబడులను రద్దు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లను తాకినట్లు తెలియజేశారు. 2022–23లో రూ. 2,465 కోట్ల టర్నోవర్ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక గతేడాది నికర నష్టం రూ. 1,422 కోట్లకు చేరగా.. 2022–23లో రూ. 1,777 కోట్ల నష్టం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్చేసి రూ. 369 వద్ద ముగిసింది. -
పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్.. త్వరలోనే లేఆఫ్స్
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు షాకివ్వనుంది. త్వరలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీలోని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగులకు చెల్లించే జీతాల ఖర్చులు గణనీయంగా పెరిగాయని, కాబట్టే సంస్థ ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక పెట్టుబడులు కొనసాగుతుండగా ఉద్యోగుల ఖర్చులను తగ్గించేందుకు కూడా సంస్థ చర్యలు తీసుకుంటుందని, ఈ నిర్ణయంతో సంస్థకు ఏటా రూ. 400-500 కోట్ల వరకు ఆదా అవుతుందని పేటీఎం సీఈఓ చెప్పారు. రాబోయే సంవత్సరానికి, మేం బిజినెస్ సేల్స్ విభాగంతో పాటు రిస్క్ అండ్ కంప్లైయన్స్ ఫంక్షన్లలో పెట్టుబడులు కొనసాగిస్తూనే.. లేఆఫ్స్తో ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు.. ఫలితంగా ఏడాదికి రూ.400 నుంచి రూ. 500 కోట్లు ఆదా అవుతుందని మేం ఆశిస్తున్నట్లు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. అంతేకాదు కంపెనీ తన కస్టమర్ కేర్ను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోందని, ఆదాయాన్ని పెంచుకుంటూనే ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
పేటీఎం కొత్త వ్యూహం
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఇటీవల తన పేమెంట్స్ బ్యాంక్ను రద్దు చేయడంతో తమకు తిరుగులేదని ప్రత్యర్థి కంపెనీలు సంబరపడిపోయాయి. కానీ వాటికి దీటైన సమాధానం ఇస్తూ తిరిగి మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు పేటీఎం సరికొత్త ప్లాన్ చేసింది. థర్డ్ పార్టీ పేమెంట్ సేవల కోసం ప్రముఖ బ్యాంకులతో జతకట్టింది. యాప్లో యూపీఐ లావాదేవీలు చేస్తే ఏకంగా రూ.100 వరకు క్యాష్బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది.పెద్దనోట్ల రద్దు సమయంలో దాదాపు దేశం అంతటా ఆన్లైన్ పేమెంట్ సేవలందించిన పేటీఎం..క్రమంగా తన సబ్స్రైబర్లను పెంచుకుంది. వారికి మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా పేమెంట్స్ బ్యాంక్ను ప్రారంభించింది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల నుంచి షాపింగ్ వరకు డబ్బుతో ముడిపడిన చాలా కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. నేరుగా క్రెడిట్కార్డులు ఇచ్చే స్థాయికి చేరింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) లావాదేవీల్లో ముందువరుసలో నిలిచింది. టోల్గేట్ల వద్ద ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం తన వినియోగదారులకు ఫ్యాస్టాగ్ సర్వీస్ను అందించింది.ఇటీవల కొంతమంది పేటీఎం యూజర్ల ఖాతాల్లో పరిమితులకు మించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. దాంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తన వినియోగదారులు పేమెంట్స్ బ్యాంక్ ద్వారానే యూపీఐ సేవలు వినియోగించుకునేవారు. ఒక్కసారిగా దాన్ని రద్దు చేయడంతో ప్రత్యర్థి కంపెనీలు ఒకింత సంబరపడిపోయాయి. వాటికి ధీటైన సమాధానం చెబుతూ ఎన్పీసీఐ ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్స్ను సంపాదించింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద పేటీఎం బ్రాండ్పైనా యూపీఐ సేవలందిస్తోంది.బ్యాంకింగ్ సేవలిందిస్తున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్లు పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఉన్న మర్చంట్స్కు, కొత్త మర్చంట్స్కు యస్ బ్యాంక్ సేవలందిస్తోంది. @paytm యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చంట్ పేమెంట్స్ యస్ బ్యాంక్కు రీడైరెక్ట్ అయ్యాయి.ఇదీ చదవండి: ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!మార్కెట్లో తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకునేలా యూజర్లు క్యాష్బ్యాంక్ ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు చేస్తూ రూ.100 వరకు క్యాష్బ్యాక్ను పొందేలా వీలుకల్పిస్తుంది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్పేలతో సహా ఇప్పటికే దేశంలో 22 థర్డ్ పార్టీ పేమెంట్ యాప్లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి.#Paytm is India’s favourite payment app! 🚀 Now, better with power of 4 banks Get assured Rs 100 cashback on UPI payments using Paytm app. Download now: https://t.co/750WzmXs4E #PaytmKaro @YESBANK @AxisBank @HDFC_Bank @TheOfficialSBI pic.twitter.com/5MpOIj8owT— Paytm (@Paytm) May 3, 2024 -
పేటీఎంకు 'భవేష్ గుప్తా' గుడ్బై.. కారణం ఇదే
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'భవేష్ గుప్తా' తన పదవికి రాజీనామా చేశారు. కెరీర్లో విరామం తీసుకోవాలనే వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుప్తా పేర్కొన్నారు.మే 31న కంపెనీ నుంచి ఆయన రిలీవ్ కానున్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. గుప్తా ఏడాది చివరి వరకు పేటీఎం కార్యక్రమాలకు మార్గదర్శకత్వం చేస్తూ సలహాదారుగా ఉండే అవకాశం ఉందని సమాచారం.గుప్తా పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించేవారు. కొత్త లావాదేవీలను కొనసాగించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ నిషేధం విధించడం వల్ల ఆయన నేతృత్వంలోని లావాదేవీలన్నీ కూడా ప్రతికూల ప్రభావానికి లోనయ్యాయి.రాకేష్ సింగ్ ఇటీవలే పేటీఎం మనీ లిమిటెడ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఈయన గతంలో ఫిస్డమ్లో స్టాక్ బ్రోకింగ్కు సీఈఓగా ఉన్నారు. అంతే కాకుండా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్లో కీలకమైన పదవులను నిర్వహించినట్లు తెలుస్తోంది.We're excited to announce leadership changes as we double down on our payments & financial services offerings. Strengthening succession planning, Bhavesh Gupta transitions to advisory role while Varun Sridhar becomes CEO of Paytm Services Pvt Ltd. Welcome aboard Rakesh Singh,…— Paytm (@Paytm) May 4, 2024 -
కొత్త సౌండ్బాక్స్లు ప్రారంభించిన పేటీఎం.. ప్రత్యేకతలివే..
ఫిన్టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్కార్డుల కోసం కొత్త సౌండ్బాక్స్లను తీసుకొచ్చింది. ఈ పరికరాలు మేడ్ఇన్ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సౌండ్బాక్స్లు 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆడియో డివైజ్ల బ్యాటరీ లైఫ్ 10 రోజులుంటుందని చెప్పింది. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, తెలుగు, తమిళంతో సహా 11 భాషల్లో నోటిఫికేషన్లను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సౌండ్బాక్స్లు లాంచ్ చేసేందుకు ఏర్పాటు చేసిన వెబ్నార్లో పేటీఎం వ్యవస్థాపకులు, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ..‘కొత్త సౌండ్బాక్స్లు భారతదేశంలోనే తయారు చేశాం. ఇవి స్పష్టమైన సౌండ్ను అందిస్తాయి. భారతీయ పరిస్థితులకు ఇవి బాగా సరిపోతాయి. అధిక శబ్దం వచ్చే పరిస్థితుల్లోనూ పేటీఎం కస్టమర్లకు స్పష్టమైన నోటిఫికేషన్ను అందిస్తాయి’ అన్నారు. ఇదీ చదవండి: గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను రద్దు చేసిన తర్వాత యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం థర్డ్పార్టీ పేమెంట్ గేట్వేల కోసం ప్రయత్నించింది. పేటీఎం వినియోదారులకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ (పీఎస్పీ) బ్యాంక్ హ్యాండిల్స్ను మార్చారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్లతో పేటీఎం పీఎస్పీను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 17న ఈ పీఎస్పీ బ్యాంకులకు కస్టమర్ మైగ్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. -
Surinder Chawla : పేటీఎం పేమెంట్ బ్యాంక్కు మరో షాక్!
ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) సీఈఓ పదవికి సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చావ్లా తెలిపారు. మెరుగైన కెరీర్ కోసం అవకాశాలను అన్వేషించాలని ఉద్దేశంతో పీపీబీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు స్టాక్ మార్కెట్ ఫైలింగ్లో వెల్లడించారు. పీపీబీఎల్లో చావ్లా జూన్ 26 వరకు కొనసాగనున్నారు. గత ఏడాది జనవరి 9న చావ్లా పేమెంట్ బ్యాంక్లో చేరారు. అంతకు ముందు ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్గా ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్తో పాటు ఇతర సంస్థలలో పనిచేసిన చావ్లాకు బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్పై ఆరోపణలు పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లతో పాటు ఇతర లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ గడువు తేదీని మార్చి 15వరకు పొడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇతర యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్పే తరహాలో సేవలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి పీపీబీఎల్ నుంచి విడిపోయిన పేటీఎం ఆర్బీఐ ఆదేశాల మేరకు పీపీబీఎల్ నుంచి పేటీఎం వ్యాపార లావాదేవీలకు స్వస్తి చెప్పింది. బ్యాంక్ బోర్డు స్వతంత్ర చైర్పర్సన్తో పాటు ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్లతో పునర్నిర్మించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. -
పేటీఎంకు భారీ ఊరట..
-
పేటీఎంకు భారీ ఊరట.. ఇకపై యథావిధిగా ప్రముఖ సేవలు.. కానీ..
పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్కు భారీ ఊరట లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్స్ను ఇటీవల మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద ఇకపై పేటీఎం బ్రాండ్పైనా యూపీఐ సేవలందిస్తుంది. లైనెన్స్లో వివరాల ప్రకారం..బ్యాంకింగ్ సేవలిందిస్తున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్లు ఇకపై పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంక్స్గా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఉన్న మర్చంట్స్కు, కొత్త మర్చంట్స్కు యస్ బ్యాంక్ ఇకపై సేవలందిస్తుంది. అంటే @paytm యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చంట్ పేమెంట్స్ ఇకపై యస్ బ్యాంక్కు రీడైరెక్ట్ అవుతాయి. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చు తగ్గడానికి బెస్ట్ ప్లాన్..! చాలా డబ్బు ఆదా.. ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటో పే మ్యాండెట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం వీలు పడుతుందని ఎన్పీసీఐ తెలిపింది. పేటీఎం కూడా కొత్త పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులకు తమ హ్యాండిళ్లను మైగ్రేట్ చేయాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు, మర్చంట్స్ మార్చి 15లోగా తమ అకౌంట్లను వేరే బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్సైట్లోని ఎఫ్ఏక్యూ సెక్షన్ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
85 శాతం మందికి అంతరాయం లేదు
న్యూఢిల్లీ: నియంత్రణ చర్యల కారణంగా 80–85 శాతం పేటీఎం వాలెట్ వినియోగదార్లు ఎటువంటి అంతరాయాన్ని ఎదురుకోరని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు. మిగిలిన వినియోగదారులు తమ యాప్లను ఇతర బ్యాంకులకు లింక్ చేయాలని సూచించామని అన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో జతచేయబడిన వాలెట్ను ఇతర బ్యాంకులతో లింక్ చేయడానికి ఆర్బీఐ మార్చి 15 వరకు గడువు ఇచి్చంది. ఇచి్చన గడువు సరిపోతుందని, తదుపరి పొడిగింపు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 80–85 శాతం పేటీఎం వాలెట్లు ఇతర బ్యాంకులతో అనుసంధానం అయ్యాయని చెప్పారు. నియంత్రిత సంస్థపై మాత్రమే ఆర్బీఐ చర్య తీసుకుందని, ఫిన్టెక్ కంపెనీలకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఫిన్టెక్ సంస్థలకు పూర్తి మద్దతునిస్తామని, వీటి వృద్ధికి ఆర్బీఐ అండగా ఉంటుందని వివరించారు. -
పేటీఎంకు కేంద్రం భారీ షాక్
ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (ppbl)కు భారీ షాక్ తగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా(FIU-IND) పీపీబీఎల్కు భారీ జరిమానా విధించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది. మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది . కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 1న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్లైన్లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై దృష్టిసారించాం. తాము చేసిన విచారణలో పీపీబీఎల్లోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి వచ్చిన డబ్బు అంటే అసాంఘీక కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పలు అకౌంట్లకు మళ్ళించిటన్లు తాము గుర్తించామని’, కాబట్టే చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అందించిన పలు ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐయూ-ఐఎన్డీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్ధిక వెల్లడించింది. -
పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మకు భారీ ఊరట!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అయితే, ఆ ఆంక్షలు పేటీఎంపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గురుగావ్కు కేంద్రంగా బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ కంపెనీ డేటామ్ (Datum Intelligence) ఇంటెలిజెన్స్.. పీపీబీఎల్పై ఆర్బీఐ చర్యలు పేటీఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోయాయని తెలిపింది. ఇప్పటికీ 59 శాతం మంది వ్యాపారస్తులు పేటీఎంనే వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. డేటామ్ ఇంటెలిజెన్స్ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు 12 నగరాల్లో 2వేల మందిని సర్వే చేసింది. అందులో ఈ ఫలితాలు వచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు ఈ సర్వేలో పీపీబీఎల్పై ఆర్బీఐ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుందోనని తెలుసుకునేందుకు 21శాతం మంది వ్యాపారస్థులు ఎదురు చూస్తున్నారు. 13 శాతం మంది పేటీఎం నుంచి ఇతర పేమెంట్ అప్లికేషన్లను వినియోగించేందుకు సిద్ధమయ్యారు. పేటీఎంకే మా మద్దతు దీంతో పాటు 76 శాతం మంది నగదు చెల్లింపుల కోసం పేటీఎంను ఉపయోగించేందుకు మద్దతు పలుకుతుండగా 41 శాతం మంది ఫోన్పే, 33 శాతం మంది గూగుల్పే, 18 శాతం మంది భారత్ పేని ఉపయోగిస్తున్నారు. సర్వే చేసిన 58 శాతం వ్యాపారులకు పేటీఎంకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత ఫోన్పేకి 23 శాతం, గూగుల్ పేకి 12 శాతం, మూడు శాతం భారత్పే వైపు మొగ్గు చూపుతున్నారు. పేటీఎంపై నమ్మకం.. కారణం అదే ఆర్బీఐ వరుస కఠిన నిర్ణయాలతో పేటీఎం భారీగా నష్టపోతుంది. అయినప్పటికీ ఆర్బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం ప్రతినిధులు వ్యాపారస్థులతో వరుసగా భేటీ అవుతున్నారు. దీంతో వ్యాపారుల్లో పేటీఎంపై నమ్మకం కొనసాగడానికి కారణమని సర్వే నివేదిక హైలెట్ చేసింది. పరిమితంగానే ప్రభావం ఇక 71 శాతం మంది వ్యాపారులు పేటీఎం ప్రతినిధిని సంప్రదించిన తర్వాత చెల్లింపుల కోసం పేటీఎంని ఉపయోగించడం కొనసాగించాలనే నమ్మకంతో ఉన్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే పేటీఎంపై నమ్మకం సన్నగిల్లింది. మిగిలిన 14 శాతం మంది ఇప్పటికీ మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు’ అని డేటామ్ ఇంటెలిజెన్స్ సర్వే తెలిపింది. దీన్ని బట్టి ఆర్బీఐ చర్యల ప్రభావం పేటీఎంపై పరిమితంగా ఉంది. నష్టాన్ని తగ్గించడానికి పేటీఎం వ్యాపారులతో మంతనాలు జరుపుతుండగా.. వ్యాపారులు సైతం ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకునే ముందు వేచి చూసే ధోరణి కొనసాగుతుంది. -
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా
-
చైర్మన్ పదవికి పేటీఎం బాస్ రాజీనామా.. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీరే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలతో సతమతమవుతున్న డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంస్థ ఫౌండర్ 'విజయ్ శేఖర్ శర్మ' తన వ్యాపారాన్ని ముగించడానికి ఇచ్చిన డేట్ ఇంకా పూర్తి కాకముందే తన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి స్వస్తి పలికారు. ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కూడా పునర్నియమించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజనీ సేఖ్రీ సిబల్ ఉన్నట్లు సమాచారం. కాగా కంపెనీ త్వరలోనే కొత్త చైర్మన్ను నియమించనున్నట్లు వెల్లడించింది. కొత్త బోర్డు సభ్యుల నైపుణ్యం మా పాలనా నిర్మాణాలు, కార్యాచరణ ప్రమాణాలను పెంపొందించడంలో మాత్రమే కాకుండా.. మాకు మార్గనిర్దేశం చేయడంలో కూడా ఉపయోగపడుతుంద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ సురీందర్ చావ్లా తెలిపారు. ఫిబ్రవరి 29 తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఫిన్టెక్ సంస్థను ఆదేశించింది, కానీ ప్రస్తుతం ఈ గడువు 2024 మార్చి 15 వరకు పొడిగించింది. ఇదీ చదవండి: ఫుడ్ కోసం తగ్గిన ఖర్చు.. అంతా వాటికోసమే!.. సర్వేలో వెల్లడైన విషయాలు -
‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి
ముంబై: యూపీఐ హ్యాండిల్ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కి ఆర్బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్ వెబ్సైట్ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థను ఎన్పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్ను మైగ్రేట్ చేసే క్రమంలో పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్లుగా (పీఎస్పీ) 4–5 బ్యాంకులను ఎన్పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది. తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్కు మాత్రమే మైగ్రేషన్ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. -
పేటీఎంకు బైబై.. సంబరపడిపోతున్న ప్రత్యర్థులు!
పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు వ్యాపారం, ఇటు వినియోగదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఫలితంగా పేటీఎం వినియోగాన్ని తగ్గించి ప్రత్యర్ధి సంస్థల యాప్లను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 1న పేటీఎం యాప్ రోజువారి డౌన్లోడ్లు భారీగా తగ్గాయి. ఈ సమయంలో భీమ్ యూపీఐ యాప్ డౌన్లోడ్లు 49 శాతం పెరిగాయి. గూగుల్ పే యాప్ రోజువారీ డౌన్లోడ్లు 10.6 శాతం తగ్గాయి. న్యూయార్క్లోని మొబైల్ అనలిటిక్స్, ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారమ్ Appfigures షేర్ చేసిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 1న 135,139గా ఉన్న పేటీఎం యాప్ డౌన్లోడ్లు ఫిబ్రవరి 19న 55 శాతం క్షీణించి 60,627కి పడిపోయాయి. ♦ భీమ్ యూపీఐ డౌన్లోడ్లు ఈ నెల మొదటి రోజున 222,439 నుండి ఫిబ్రవరి 19న 331,781కి పెరిగాయి. ♦ గూగుల్ పే రోజువారీ యాప్ డౌన్లోడ్లు 105,296 నుండి 94,163కి పడిపోయాయి. ♦ ఫోన్ పే డౌన్లోడ్లు ఫిబ్రవరి 1న 317,522 నుండి ఫిబ్రవరి 7న 503,436కి పెరిగాయి. ఫిబ్రవరి 19న 163,011కి తగ్గాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల కోసం వ్యాపారులు ఇతర యాప్లు, బ్యాంక్ అకౌంట్లకు మారడం ప్రారంభించారు. ఢిల్లీలోని బులియన్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ మాట్లాడుతూ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై వార్తలు వచ్చినప్పటి నుండి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్లకు మారారు. ‘ఈ చర్య కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై మాత్రమేనని, పేటీఎం యాప్పై ఎటువంటి ప్రభావం లేదని మాకు తెలుసు. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా మేము మా ఖాతాలను ఇతర చెల్లింపు అగ్రిగేటర్లకు తరలిస్తున్నాము. చూడండి, వ్యాపారంలో నమ్మకం అనేది అత్యంత ముఖ్యమైన విషయం’అని సింఘాల్ అన్నారు. ఈ సందర్భంగా ‘పేటీఎం యాప్ డౌన్లోడ్లలో క్షీణత వినియోగదారుల మధ్య అనిశ్చితి, నమ్మకం కోల్పోవడం ప్రతిధ్వనిస్తుంది’అని ఇండియా బ్లాక్చెయిన్ ఫోరమ్ కో-ఫౌండర్ శరత్ చంద్ర అన్నారు. -
టెక్ దిగ్గజం కీలక ప్రకటన.. పేటీఎంకు గూగుల్ భారీ షాక్!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు గూగుల్ భారీ షాకిచ్చింది. త్వరలో భారత్లో మిలియన్ల మంది చిరు వ్యాపారులు ఆడియో అలర్ట్లతో క్యూఆర్ కోడ్ సాయంతో లావాదేవీలు జరిపేందుకు గాను స్పీకర్ సౌండ్ పాడ్స్(SoundPods)ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది దేశంలో పేటీఎం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర ఫిన్ టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పేటీఎం యూజర్లు ఇతర యూపీఐ పేమెంట్స్, చిరు వ్యాపారులు సౌండ్బాక్స్లను వినియోగిస్తున్నారు. తరుణంలో గూగుల్ గత ఏడాది తన సౌండ్బాక్స్లను పరిమిత యూజర్లకు అందించింది. బాక్స్ పనితీరు ఎలా ఉంది? లావా దేవీలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై వ్యాపారుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. గూగుల్ విడుదల చేసిన సౌండ్ బాక్స్ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సౌండ్ బాక్స్ లను వినియోగంలోకి తెస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇంగ్లీషుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీతో సహా ఆరు భారతీయ భాషలలో ఆడియో అలెర్ట్ లను అందించే గూగుల్ సౌండ్ పాడ్స్ కోసం వ్యాపారులు గూగుల్ ప్లే యాప్ ద్వారా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ రోజువారి లేదంటే,ఏడాది ప్లాన్ అనంతరం ఈ ఆడియో డివైజ్ పొందవచ్చు. రోజువారీ ప్లాన్లో, వ్యాపారులు వన్ టైమ్ సబ్ స్క్రిప్షన్ కింద రూ. 499 చెల్లించాలి. ఆ తర్వాత వారి సెటిల్మెంట్ ఖాతా నుండి నెలలో 25 రోజుల పాటు రోజుకు రూ.5 డిడక్ట్ అవుతుంది. ఏడాది ప్లాన్లో వ్యాపారి సెటిల్మెంట్ అకౌంట్ నుండి రూ.1,499 డిడక్ట్ అవుతుందని గూగుల్ తెలిపింది. గూగుల్ తన సొంత క్యూ ఆర్ కోడ్ల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఆడియో నోటిఫికేషన్ సేవలను పొందుతున్న వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. గూగుల్ పే క్యూఆర్ కోడ్ల ద్వారా నెలలో రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగిన తర్వాత రూ. 125 క్యాష్బ్యాక్ను పొందవచ్చని గూగుల్ వెల్లడించింది. -
పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదా..? డీయాక్టివేషన్ ఎలా..? కొత్తది ఎలా తీసుకోవాలి..?
-
సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే..
నియంత్రణ సంస్థలు మరీ సంప్రదాయకంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆర్థిక రంగంలో ప్రమాదాలకు వేగంగా స్పందించాల్సిందేనని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. కేవైసీ నిబంధనల అమలులో వైఫల్యానికి గాను ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ నిషేధం విధించడం తెలిసిందే. ఈ తరుణంలో ఉదయ్ కోటక్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అసలు ప్రమాదాలే లేని విధానం ప్రమాదకరమైంది. వేగంగా వృద్ధి చెందాలని కోరుకునేట్టు అయితే, చక్కని నియంత్రణలు కూడా అవసరమే. కొన్ని ప్రమాదాలు తలెత్తొచ్చు. కానీ, ఎంత వేగంగా స్పందించాం, చక్కదిద్దామన్నదే కీలకం’’అని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ ఆసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన సమావేశంలో భాగంగా ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: పిల్లల కోసం ‘ఎల్ఐసీ అమృత్బాల్’.. ప్రత్యేకతలివే.. గతం తాలూకూ మచ్చలు నియంత్రణ సంస్థలను మరింత రక్షణాత్మకంగా లేదా అప్రమత్తంగా మార్చకూడదంటూ, అదే సమయంలో మెరుగైన నియంత్రణ వాతావరణం అవసరమేనన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ గురించి ప్రస్తావన రాగా, ‘‘విడిగా వేరే కంపెనీ గురించి నేను వ్యాఖ్యానించను. కానీ, ఆర్బీకి మీ కంటే, నా కంటే ఎక్కువే తెలుసు’’అని పేర్కొన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మార్చి 15 తర్వాత నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించరాదని ఆర్బీఐ నిషేధించడం తెలిసిందే. -
వచ్చే వారం ఫిన్టెక్ చీఫ్లతో ఆర్థిక మంత్రి భేటీ
న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్టెక్ సంస్థ– పేటీఎం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే వారం ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల అధిపతులతో సమావేశం కానున్నారు. నియంత్రణ నిబంధనలను కచి్చతంగా పాటించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆమె వివరించనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అలాగే ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను కూడా ఆరి్థకమంత్రి ఈ సందర్భంగా తెలుసుకుని, వాటి పరిష్కారంపై దృష్టి సారించనున్నారు. ఈ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్, ఆరి్థక మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం– అంతర్గత వాణిజ్యం తదితర శాఖల సీనియర్ అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. -
మార్చి 15 తర్వాత పని చేసేవి.. పని చేయనివి ఇవే..
ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముందుగా 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన ఆర్బీఐ తేదీని సవరించింది. ఈ నేపథ్యంలో ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఇటీవల ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్థానంలో యాక్సిస్ బ్యాంక్తో ఒన్97 కమ్యునికేషన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రీఛార్జ్లు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు పేటీఎంను ఉపయోగించవచ్చా? ప్రజలు అన్ని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్ల కోసం పేటీఎం యాప్ని ఉపయోగించవచ్చని కంపెనీ తన FAQ పేజీలో ధ్రువీకరించింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ.. వంటి అధీకృత బ్యాంకులకు తమ పేటీఎంను లింక్ చేసిన వారిపై తాజా నిషేధం ఎలాంటి ప్రభావం చూపదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఖాతా తెరిచిన వినియోగదారులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్బాక్స్, కార్డ్ మెషిన్ ఎప్పటిలాగే పని చేస్తాయా? కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పేటీఎం క్యూఆర్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్లపై ఎలాంటి ప్రభావం చూపదు. మార్చి 15 తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ని ఉపయోగించవచ్చా? పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు.. ఉపసంహరించుకోవచ్చు.. మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. మార్చి 15, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు మాత్రం చేయలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని ఉపయోగించవచ్చా? ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని ఉపయోగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత రీఛార్జ్ చేయలేరు. అందులో డబ్బును డిపాజిట్ చేయలేరు. అందులో ఉన్న నగదును ఉపయోగించవచ్చు. లేదా గడువులోపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని మూసివేయవచ్చు. అందులో ఉన్న నగదు రీఫండ్ కోసం బ్యాంక్ని కోరవచ్చు. ఇదీ చదవండి: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే.. పేటీఎం పేమెంట్ బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ ఎలా? వాలెట్లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్ డ్రాయిల్ లేదా, బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. డిపాజిట్ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. -
ఫిన్టెక్ కంపెనీ పేటీఎంకు మరో భారీ షాక్!.. ఇదే తొలిసారి
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎంకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జెఫరీస్ రేటింగ్ను తగ్గించింది.పేటీఎం ఆదాయం ఏటేటా 28 శాతం క్షీణించిందని, ఇది 'తక్కువ పనితీరు' నుంచి 'నాట్ రేటింగ్'కు మారిందని జెఫరీస్ తెలిపింది. ఒకవేళ ఆర్బీఐ పేటీఎంపై చర్యలు తీసుకోకపోయినట్లైతే రెవెన్యూ ట్రాక్షన్, వ్యయ నియంత్రణల నుండి ఉత్పన్నమయ్యే సానుకూల, ప్రతికూలతల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే పేటీఎంపై ఆర్బీఐ చర్యలు కొనసాగుతున్నట్లు వస్తున్న నివేదికల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెఫరీస్ తన నోట్లో పేర్కొంది. రేటింగ్ ఎందుకు కార్పొరేట్ రంగంలో ఆయా కంపెనీల తీరు ఎలా ఉంది? ఆర్ధికంగా సదరు సంస్థ సామర్ధ్యాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఇండిపెండెంట్ క్రెడింగ్ రేటింగ్ ఏజెన్సీలు రేటింగ్స్ ఇస్తుంటాయి. ఆ రేటింగ్స్ ఆధారంగా సంస్థల్లో పెట్టుబడులు, వినియోగదారుల్లో నమ్మకం ఉందని అర్ధం. అలా కాకుండా ఏ మాత్రం నెగిటీవ్ రేటింగ్ ఇస్తే సంబంధిత కంపెనీపై నమ్మకం సన్నగిల్లుతుంది. -
పుంజుకుంటున్న ప్రముఖ కంపెనీ షేరు ధర.. కారణం ఇదే..
పేటీఎం కంపెనీ షేరు ధర ఇటీవల భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయమే కారణమని నిపుణులు తెలిపారు. అయితే వరుసగా రెండో రోజు సోమవారం వన్97 కమ్యూనికేషన్స్ షేరు (పేటీఎం) భారీగా పుంజుకుంది. బీఎస్ఈలో షేరుధర సోమవారం ఐదు శాతం పెరిగి రూ.358.55 దగ్గర అప్పర్ సర్క్యూట్ను చేరింది. మర్చంట్ సెటిల్మెంట్ల కోసం యాక్సిస్ బ్యాంక్తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కంపెనీ షేర్లు లాభాల బాటపట్టాయి. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చింది. ఇందువల్ల పేటీఎం క్యూఆర్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తరవాత కూడా యథావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు - ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. పీపీబీఎల్పై ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లు, ఎన్సీఎంసీల్లోకి డిపాజిట్లు, టాప్-అప్లు స్వీకరించొద్దని ఆదేశించింది. తాజాగా ఆ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఆర్బీఐ ఆంక్షల ప్రకటన తర్వాత కంపెనీ షేర్లలో పతనం కొనసాగుతూ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం నేపథ్యంలో శుక్రవారం నుంచి కాస్త ఉపశమనం లభించింది. సోమవారం కూడా ఆ ర్యాలీ కొనసాగినట్లు తెలిసింది. -
బోరుమంటున్న పేటీఎం ఇన్వెస్టర్లు
-
పేటీఎంతో శాలరీ లింక్.. రకరకాల ప్రశ్నలు.. అన్నింటికీ క్లారిటీ ఇదిగో..
పేటీఎం ( Paytm )పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో లక్షలాది యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. రకరకాల సందేహాలు వారిని వేధిస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానంగా.. యూజర్లకు సహాయకరంగా స్పష్టత ఇచ్చేందుకు ఆర్బీఐ తాజాగా తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) సమగ్ర సెట్ను ప్రచురించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై జనవరి 31న ఆర్బీఐ నిషేధాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి వీల్లేదంటూ ఆదేశించింది. అయితే అన్ని లావాదేవీలను నిలిపివేసే గడువును మార్చి 15 వరకు పొడిగించడం ద్వారా వ్యాపారాలకు కొంత ఊరటను అందించింది. ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తర్వాత ఏం జరుగుతుంది.. ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి ఇలాంటి 30 ప్రశ్నలపై సెంట్రల్ బ్యాంక్ ఎఫ్ఏక్యూ సమగ్ర సెట్ను ప్రచురించింది. ఈ ఎఫ్ఏక్యూ పత్రం వాటాదారుల అన్ని ఆందోళనలను పరిష్కరించడానికి ఉద్దేశించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. పేటీఎంపై ఆర్బీఐ ఎఫ్ఏక్యూ సెట్లోని కొన్ని ప్రశ్నలు.. కరెంట్, సేవింగ్స్ ఖాతాదారుల పరిస్థితి ఏంటి? ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాదారులు 2024 మార్చి 15 తర్వాత ఈ ఖాతా నుంచి నిధులను విత్డ్రా చేయడం లేదా బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మీ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు నిధులను ఉపసంహరించుకోవడానికి లేదా బదిలీ చేయడానికి డెబిట్ కార్డ్ని ఉపయోగించవచ్చు. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లోని మీ ఖాతాలో డబ్బును జమ చేయలేరు. వడ్డీ, క్యాష్బ్యాక్లు, భాగస్వామ్య బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్ లేదా రీఫండ్లు మినహా ఇతర క్రెడిట్లు లేదా డిపాజిట్లు క్రెడిట్ చేయడానికి వీల్లేదు. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో రీఫండ్? అవును.. రీఫండ్లు, క్యాష్బ్యాక్లు, భాగస్వామి బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్లు లేదా వడ్డీలు మార్చి 15 తర్వాత కూడా మీ ఖాతాలోకి క్రెడిట్ అయ్యేందుకు అనుమతి ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో జీతం, ఈఎంఐ లింక్ అయితే ఎలా? మార్చి 15 తర్వాత, వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి ఎలాంటి జీతం క్రెడిట్లను పొందలేరు. అసౌకర్యాన్ని నివారించడానికి మీరు మార్చి 15 లోపు మరొక బ్యాంకుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్, విద్యుత్ బిల్లులు, రివార్డ్లు? మీ ఖాతాలో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు ఆటోమేటిక్ యూపీఐ మ్యాండేట్ ద్వారా ఉపసంహరణ/డెబిట్కు వీలుంటుంది. అయితే మార్చి 15 తర్వాత మీ ఖాతాల్లో క్రెడిట్ లేదా డిపాజిట్ అనుమతించబడదు. అసౌకర్యం లేదా అంతరాయాన్ని నివారించడానికి మార్చి 15 లోపు మరొక బ్యాంకు ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ లేదా డీబీటీ? మార్చి 15 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో మీ ఖాతాలోకి అలాంటి క్రెడిట్ను స్వీకరించలేరు. ఏదైనా అసౌకర్యం లేదా అంతరాయాన్ని నివారించడానికి దయచేసి మార్చి 15 లోపు మీ లింక్ చేయబడిన ఖాతాను మరొక బ్యాంకుకు మార్చడానికి ఏర్పాట్లు చేసుకోండి పేటీఎం వాలెట్ గురించి? వినియోగదారులు వాలెట్లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు ఉపయోగించడం, ఉపసంహరించుకోవడం లేదా మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం కొనసాగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే మార్చి 15 తర్వాత వినియోగదారులు ఈ వాలెట్లోకి క్యాష్బ్యాక్లు లేదా రీఫండ్లు కాకుండా మరే ఇతర క్రెడిట్లను టాప్-అప్ చేయలేరు లేదా వాలెట్లోకి బదిలీ చేయలేరు. -
వినియోగదారులకు పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ విజ్ఞప్తి!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎంలో భాగమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఫిబ్రవరి 29 విధించిన ఆంక్షల్ని మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. మార్చి15 తర్వాత పేటీఎం, సౌండ్బాక్స్, కార్డ్ మెషిన్ సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవని, కార్యకలాపాలు కొనసాగుతాయని పేటీఎం ఫౌండర్ తెలిపారు. ఆర్బీఐ ఆంక్షలు ప్రభావితం చూపవని అని అన్నారు. మార్చి 15, 2024 వరకు ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్లు మొదలైన వాటిలో డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్లు అనుమతించబడతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందు ఈ గడువు తేదీ ఫిబ్రవరి 29, 2024 ఉండగా.. తాజాగా ఆ తేదీని మార్చి 15కి పొడిగించింది. Paytm QR, Soundbox and EDC (card machine) will continue to work like always, even after March 15. The latest FAQ issued by RBI on point #21 clarifies it unambiguously. Do not fall for any rumour or let anyone deter you to championing Digital India ! https://t.co/ts5Vqmr6qh — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 16, 2024 ‘పేటీఎం క్యూఆర్ కోడ్ , సౌండ్బాక్స్, ఈడీసీ(కార్డ్ మెషీన్) మార్చి 15 తర్వాత కూడా ఎప్పటిలాగే పని చేస్తూనే ఉంటాయి. తాజా జారీ చేసిన ఎఫ్ఏక్యూ (Frequently Asked Questions)పాయింట్ 21లో ఆర్బీఐ ఇదే స్పష్టం చేసింది. ఎటువంటి పుకార్లకు లొంగిపోకండి. మిమ్మల్ని డిజిటల్ ఇండియా ఛాంపియన్గా నిలబెట్టేందు చేసే ప్రయత్నాలకు మీరు అనుమతించకండి’ అంటూ ఎక్స్ పోస్ట్లో తెలిపారు. To every Paytmer, Your favourite app is working, will keep working beyond 29 February as usual. I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full… — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024 అవధులు లేని మీ సపోర్ట్కు ఈ జనవరిలో ఆర్బీఐ పేటీఎంపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పేటీఎం బాస్ ఎక్స్.కామ్లో ట్వీట్ చేశారు. అవధులులేని మీ సపోర్ట్కు ధన్యవాదాలు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యాప్ పనిచేస్తుందని యూజర్లకు హామీ ఇచ్చారు. ప్రతి సవాలుకు, ఒక పరిష్కారం ఉంది. ఫిన్ రంగం తరుపున దేశానికి సేవ చేసేందుకు మేం కట్టుబడి ఉన్నామని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. చదవండి👉 : పేటీఎంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు! -
కస్టమర్లకు ఊరట.. దిగ్గజ బ్యాంక్తో పేటీఎం ఒప్పందం!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ppbl)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షల గడువును పెంచింది. మార్చి 15 పీపీబీఎల్ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది. ఈ తరుణంలో ప్రస్తుతం తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు పేటీఎం అధినేత విజయ్ కుమార్ శర్మ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ సంస్థ (పేటీఎం) నోడల్ అకౌంట్ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది పేటీఎం. తద్వారా ఆర్బీఐ పొడిగించిన తర్వాత అంటే మార్చి 15 తర్వాత వినియోగదారులు తమ కార్యకలాపాల్ని యధావిధిగా కొనసాగించవచ్చు. పేటీఎం క్యూఆర్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తరవాతా వ్యాపారులకు యధావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. నోడల్ ఖాతా అంటే, సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలన్నింటినీ ఈ ఖాతా ద్వారా సెటిల్మెంట్ చేస్తారు. వినియోగదారులకు ఆర్బీఐ సలహా కస్టమర్ల సౌకర్యార్థం పీపీబీఎల్తో లావాదేవీలపై గల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎఫ్ఏక్యూలను (సాధారణంగా తలెత్తే ప్రశ్నలు, జవాబులు) కూడా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. వాటి ప్రకారం.. మార్చి 15 తర్వాత జీతాలు, పెన్షన్లు పీపీబీఎల్ ఖాతాల్లో జమ కావు. పీపీబీఎల్ ద్వారా ఈఎంఐలు లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కడుతున్న వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. పీపీబీఎల్ వాలెట్ ఉన్న వారు అందులోని బ్యాలెన్స్ మొత్తం అయిపోయే వరకు మార్చి 15 తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు. ఫాస్టాగ్స్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. కానీ మార్చి 15 తర్వాత టాప్అప్ చేయ డానికి ఉండదు. డెడ్లైన్లోగా ఇతర బ్యాంకుల నుంచి కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. పీపీబీఎల్ అకౌంట్ లేదా వాలెట్తో అనుసంధానమైన పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్బాక్స్, పీవోఎస్ టెర్మినల్స్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్న వ్యాపారులు .. మరో బ్యాంకు అకౌంటు లేదా వాలెట్ని తీసుకోవాలి. ఇప్పటికే అవి వేరే బ్యాంకుతో అనుసంధానమై ఉంటే ఈ అవసరం ఉండదు. -
పేటీఎంకు భారీ ఊరట..ఆంక్షలపై ఆర్బీఐ మరో కీలక ప్రకటన!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం, ఆ సంస్థ అధినేత విజయ్ శేఖర్ శర్మకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ ఊరట ఇచ్చింది. ఇటీవల ఆర్బీఐ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. వినియోగదారులు అధికారిక వెబ్సైట్లో అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమాధానాలిస్తుంది. పేటీఎంపై ఆంక్షలు విధించిన తరుణంలో యూజర్ల అనుమానాల్ని ఆర్బీఐ నివృత్తి చేసింది. అందులో పలువురు యూజర్లు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ను వినియోగించొచ్చా? ఫాస్టాగ్లో ఉన్న మొత్తాన్ని మీరు టోల్ చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే, మార్చి 15, 2024న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్లకు ఇకపై ఫైనాన్సింగ్ లేదా టాప్ అప్లకు అర్హత పొందలేవు. ఫాస్టాగ్ ప్రొడక్ట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఫీచర్ అందుబాటులో లేదు. కాబట్టి, మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ పాత ఫాస్టాగ్ను మూసివేసి, రీఫండ్ కోసం బ్యాంక్ని అభ్యర్థించాలి. మార్చి 15, 2024 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ ఫాస్టాగ్ను రీఛార్జ్ చేయలేరు.ఈ ఇబ్బందుల నుంచి సురక్షితంగా ఉండేందుకు నిర్ధేశించిన గడువులోపు మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్టాగ్ పొందాలి అని ఆర్బీఐ సూచించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ ఎలా? మీరు వాలెట్లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్ డ్రాయిల్ లేదా, బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. డిపాజిట్ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. నేను పీపీబీఎల్ వాలెట్ని మూసివేసి, బ్యాలెన్స్ని మరొక బ్యాంక్లో నా బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేయవచ్చా? మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని సంప్రదించాలి. లేదంటే దాని బ్యాంకింగ్ యాప్ని ఉపయోగించి మీ వాలెట్ని బ్లాక్ చేయొచ్చు. కేవైసీ వాలెట్ల విషయంలో బ్యాలెన్స్ని మరొక బ్యాంక్లో ఉపయోగించే అకౌంట్కు బదిలీ చేసుకోవచ్చు. -
పేటీఎం ద్వారా ఫాస్టాగ్ టోల్ చెల్లిస్తున్నారా.. ఎన్హెచ్ఏఐ కీలక అప్డేట్
పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)ను తొలగించారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) తరఫున టోల్ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ(ఐహెచ్ఎంసీఎల్) ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము తెలిపిన బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు కొనుగోలు చేయాలని చెప్పింది. ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న జాబితా ఇదే.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిటీ యూనియన్ బ్యాంక్ కాస్మోస్ బ్యాంక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ జె అండ్ కె బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ కరూర్ వైశ్యా బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ నాగ్పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారస్వత్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిసూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ యుకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యెస్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాప్-అప్లు స్వీకరించవద్దని పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న నగదును మాత్రం గడువులోపు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఫాస్ట్ట్యాగ్ అనేది వాహనం కదులుతున్నపుడు నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ పరికరం. దేశవ్యాప్తంగా 100కి పైగా రాష్ట్ర రహదారి టోల్ ప్లాజాలు సహా అన్ని జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో కలిపి 750కి పైగా టోల్లు పనిచేస్తున్నాయి. -
పాపం పేటీఎం ఇన్వెస్టర్లు.. రూ. 27,000 కోట్లు ఆవిరి!
పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్ ప్రతినిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్లో వన్97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం.. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది. -
పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మకు మరో ఊహించని ఎదురు దెబ్బ!
న్యూఢిల్లీ : పేటీఎంపై నెలకొన్న అనిశ్చితి వేళ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (pbbl)కు వ్యతిరేకంగా మనీ ల్యాండరింగ్పై విచారణ చేపట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ అధికారుల విచారణతో పేటీఎం బాస్కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. గత నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల ఆర్బీఐ..పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆ తర్వాత ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పీపీబీఎల్ పై ప్రకటించిన చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేయడంతో తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు విజయ్ శేఖర్ శర్మ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఈడీ అధికారులు విచారణ చేపట్టడం ఫిన్టెక్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. చదవండి👉 పేటీఎంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు! -
ఆర్బీఐ ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరవుతున్న పేటీఎం బాస్కు బంపరాఫర్!
పేటీఎంపై ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బంపరాఫర్ ఇచ్చింది. ఆర్బీఐ ఒప్పుకుంటే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ప్రకటించారు. ‘వినియోగదారులు యూపీఐ పేమెంట్ కోసం పేటీఎంను వినియోగిస్తున్నారు. తద్వారా సంస్థ స్థూల విక్రయాల విలువ (గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ ) 75 శాతంగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ అనుమతిస్తే పేటీఎంతో కలుస్తాం. వారితో కలిసి పని చేస్తాం’ అని అమితామ్ చౌదరి చెప్పారు. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ యూపీఐ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు ఏ బ్యాంక్తో కలిసి పనిచేయడం లేదు. కానీ ఆర్బీఐ పేటీంఎపై తీసుకున్న చర్యల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ యూపీఐ పేమెంట్స్పై దృష్టి సారించింది. కలిసి పనిచేసేందుకు పేటీఎంతో చర్చలు జరుపుతోంది. అయితే, చర్చలు సాధారణ వ్యాపారం కోసమేనని, ఇతర కార్యకలాపాలకు సంబంధించినవి కావని ఆయన స్పష్టం చేశారు. మరి దీనిపై ఆర్బీఐ, పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. -
పేటీఎంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేటీఎంపై ఆర్బీఐ నియంత్రణ చర్యల్ని సమీక్షించబోమని తెలిపారు. ఇటీవల ఆర్బీఐ..పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. యూజర్ల అకౌంట్లు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు,ఫాస్టాట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్అప్లు చేయకూడాదని ఆర్బీఐ తెలిపింది. వినియోగదారుల భద్రతే ఆర్బీఐ లక్ష్యం ఈ ఆంక్షల నేపథ్యంలో ఫిబ్రవరి 12న (నేడు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో శక్తికాంత దాస్ సైతం పాల్గొన్నారు. అనంతరం ఆర్బీఐ సమావేశం గురించి శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియంత్రిత సంస్థలపై (పేటీఎంను ఉద్దేశిస్తూ) సెంట్రల్ బ్యాంక్ క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు.ఆర్బీఐ ఫిన్టెక్ రంగానికి మద్దతు ఇస్తూనే, కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే పేటీఎం ఆర్ధికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందా? లేదంటే ఫైనాన్షియల్ సిస్టమ్పై ఏవైనా చిక్కులు ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ‘పేటీఎం అంశంపై తీసుకున్న నిర్ణయాలపై ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం. అంతేకాదు, ఈ వారంలో ఎఫ్ఏక్యూ జారీ చేస్తామని, అప్పటి వరకు అందరూ వేచి చూడాలని కోరారు. ఆర్బీఐ నిబంధనల్ని పేటీఎం పట్టించుకోలేదు గత వారం జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో పలు అంశాల గురించి మాట్లాడారు. ఆర్బీఐ ఏదైనా సంస్థను నియంత్రించాలంటే ముందుగా దిద్దుబాటు చర్యల వైపే మొగ్గచూపుతుంది. ఇందుకోసం సదరు సంస్థలకు తగినంత సమయం ఇస్తుంది. పేటీఎం విషయంలోనూ ఇదే జరిగింది. గత కొన్నేళ్లుగా పేటీఎం ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోలేదు. నిబంధనల్ని ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ‘‘ఆర్బీఐ సంస్థలపై చర్యలు తీసుకునే ముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు తగింనంత సమయం ఇస్తాం. కొన్నిసార్లు ఇది తగినంత సమయం కంటే ఎక్కువగా ఉంటుంది. సంస్థల పట్ల మేం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. ఆర్బీఐ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తే.. మాకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది?’ అని శక్తికాంత దాస్ ప్రశ్నించారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే కాగా, సంస్థపై ఆంక్షలు విధించడంతో తలెత్తిన అనిశ్చితి నుంచి బయటపడేందుకు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఆర్బీఐతో సంప్రదింపులు జరిపారు. ఈ భేటీ తర్వాత ఆర్బీఐ తన నిర్ణయంపై సమీక్షించవచ్చని ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. కానీ అనూహ్యంగా శక్తికాంత దాస్ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందనేలా మాట్లాడడం ఫిన్ టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. -
చైనా ఎఫ్డీఐలపై ప్రభుత్వ పరిశీలన..
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చాలాకంపెనీలు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని అనుకుంటాయి. అందుకు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు కోరుతుంటాయి. అయితే కంపెనీలో ఏదైనా అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం అయితే ఆ కంపెనీ, ఇన్వెస్టర్లకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర విచారణ చేపడుతుంది. తాజాగా పేటీఎంలో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ గుర్తించిన విషయం తెలిసిందే. దాంతో కంపెనీపై చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పేటీఎంలో పెట్టుబడి పెట్టిన చైనా ఎఫ్డీఐలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వన్97 కమ్యూనికేషన్స్ చెల్లింపు విభాగమైన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ (పీపీఎస్ఎల్)లో పెట్టుబడి పెట్టిన చైనా ఎఫ్డీఐలను ప్రభుత్వం పరిశీలించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిశీలనలు పూర్తయిన తర్వాత కమిటీ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్వేల నియంత్రణపై ఉన్న మార్గదర్శకాల కింద ‘పేమెంట్ అగ్రిగేటర్గా సేవలందించేందుకు అనుమతులు కోరుతూ’ 2020 నవంబరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దగ్గర పీపీఎస్ఎల్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. 2022 నవంబరులో పీపీఎస్ఎల్ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఎఫ్డీఐ నిబంధనల కింద ప్రెస్ నోట్ 3 నిబంధనలను పాటిస్తూ, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. వన్97 కమ్యూనికేషన్స్లో చైనా సంస్థ యాంట్ గ్రూప్ పెట్టుబడులు ఉండటమే ఇందుకు కారణం. ప్రెస్ నోట్ 3 ప్రకారం.. చైనా సహా, భారత్తో సరిహద్దు పంచుకున్న దేశాల నుంచి ఏ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులకు అయినా కేంద్రప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇదీ చదవండి: సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్.. సరికొత్త ప్లాన్లో పేటీఎం! కొవిడ్-19 పరిణామాల్లో, దేశీయ సంస్థలను విదేశీయులు బలవంతంగా టేకోవర్ చేసుకుంటారనే ఉద్దేశంతో అటువంటివి నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్గానిస్థాన్ దేశాలకు ఇది వర్తిస్తుంది. అనంతరం 2022 డిసెంబరు 14న కంపెనీ మళ్లీ దరఖాస్తు చేసుకుంది. ఆన్లైన్ మర్చంట్స్ కోసం పీపీఎస్ఎల్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ దరఖాస్తు చేసుకుందని, గత పెట్టుబడుల వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ తెలిపినట్లు పేటీఎం అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్.. సరికొత్త ప్లాన్లో పేటీఎం!
సంక్షోభంలో చిక్కుకున్న ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం మూతపడుతుందని, ఇక తమకు తిరుగులేదని సంబరపడిపోతున్న ప్రత్యర్థి కంపెనీలకు పేటీఎం షాక్ ఇవ్వబోతోంది. తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ఈ ఫిన్టెక్ సరికొత్త ప్లాన్ చేస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం (Paytm) మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తమ కస్టమర్లకు యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ - UPI ) సేవలు అందుబాటులో ఉండేలా థర్డ్-పార్టీ పేమెంట్ యాప్ (TPAP) మార్గంపై దృష్టి సారిస్తోంది. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు "పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చెల్లింపు సేవలను నిలిపివేస్తుంది కాబట్టి, ఇతర బ్యాంకుల ద్వారా యూపీఐని ఏకీకృతం చేస్తూ ముందుకు సాగే థర్డ్-పార్టీ యాప్గా మారుతుంది" అని పేటీఎంలో పరిణామాల గురించి తెలిసిన ఒక వ్యక్తి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. దేశంలో యూపీఐ వ్యవస్థను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మారనున్న వీపీఏ ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం యూజర్లు @paytmతో ముగిసే వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) కలిగి ఉన్నారు. అయితే, మార్చి 1 తర్వాత ఈ వీపీఏలు వేరే బ్యాంక్ హ్యాండిల్కి మారుతున్నాయి. పేటీఎం యూపీఐ సర్వీస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) కిందకు వస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ల నుంచి డబ్బు తీసుకోకుండా ఆర్బీఐ జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని నిషేధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం తమ యూపీఐ కస్టమర్లకు కొత్త వీపీఏల కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకోనుందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. అమెజాన్ పే, గూగుల్ పే (Google Pay), ఫోన్పే (PhonePe)లతో సహా ఇప్పటికే 22 థర్డ్-పార్టీ పేమెంట్ యాప్లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు థర్డ్-పార్టీ రూట్ ద్వారా ఇలాంటి ఫిన్టెక్లకు సహకారం అందిస్తున్నాయి. సాధారణంగా వీపీఏను బ్యాంక్, ఫిన్టెక్ రెండింటి బ్రాండ్ పేర్లను కలిపి రూపొందిస్తారు. -
పేటీఎంలో మరో కీలక పరిణామం..
ఆర్బీఐ ఆంక్షల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేసేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి డైరెక్టర్లు షింజినీ కుమార్, మంజు అగర్వాల్ వైదొలిగినట్లుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో అరవింద్ కుమార్ జైన్, పంకజ్ వైష్, రమేష్ అభిషేక్ అనే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు మాత్రమే మిగిలారు. షింజినీ కుమార్ గతంలో సిటీ బ్యాంక్, పీడబ్ల్యూసీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వంటి సంస్థల్లో సీనియర్ పదవులను నిర్వహించారు. మంజు అగర్వాల్ ఎస్బీఐలో 34 ఏళ్లపాటు పనిచేశారు. అక్కడ ఆమె చివరి అసైన్మెంట్ డిప్యూటీ ఎండీ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో ఇప్పుడు మిగిలిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లలో అరవింద్ కుమార్ జైన్ మాజీ పంజాబ్ & సింద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పంకజ్ వైష్ యాక్సెంచర్ మాజీ ఎండీ కాగా రమేష్ అభిషేక్ డీపీఐఐటీ మాజీ కార్యదర్శి. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు -
ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు
ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఏదో ఒక అంశంలో రోజూ వార్తల్లో నిలుస్తోంది. దీని షేరు విలువ రెండు రోజుల్లో 15 శాతం పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులు బయటి అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ వారికో చిక్కు వచ్చిపడింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్లలో అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిన పేటీఎం.. ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. పరిశ్రమ సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్లు పేటీఎం ఉద్యోగులపై దృష్టి పెట్టాయి. కానీ వారికి జీతాలే సమస్యగా మారాయి. వెనకాడుతున్న స్టార్టప్లు రిక్రూట్మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం, పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పేటీఎం ఉద్యోగుల పాలిట శాపమైందని, దీని కారణంగానే చాలా స్టార్టప్లు పేటీఎం ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతున్నారని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. పేటీఎం ప్రస్తుతం తమ కార్యకలాపాలపై నియంత్రణాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైన పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్లను నిర్వహించవద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పేటీఎం బ్రాండ్ అయిన One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్కి అనుబంధ సంస్థ. -
పేటీఎం ఈ–కామర్స్ ఇక పాయ్ ప్లాట్ఫామ్స్
న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్ పేరు పాయ్ ప్లాట్ఫామ్స్గా మారింది. పేరు మార్పు కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరి 8న రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించిందని సంస్థ శుక్రవారం తెలిపింది. పేటీఎం ఈ–కామర్స్లో ఎలివేషన్ క్యాపిటల్కు మెజారిటీ వాటా ఉంది. పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మతోపాటు సాఫ్ట్ బ్యాంక్, ఈబే సైతం ఈ కంపెనీలో పెట్టుబడి చేశాయి. అలాగే ఓఎన్డీసీ వేదికగా విక్రయాలు సాగిస్తున్న ఇన్నోబిట్స్ సొల్యూషన్స్ (బిట్సిలా) అనే కంపెనీని పేటీఎం ఈ–కామర్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 2020లో బిట్సిలా కార్యకలాపాలు ప్రారంభించింది. ఓఎన్డీసీలో టాప్ –3 సెల్లర్ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా నిలిచింది. నిబంధనలు పాటించడంపై కమిటీ: పేటీఎం అసోసియేట్ పేమెంటు బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో నిబంధనల పాటింపు, నియంత్రణపరమైన వ్యవహారాలపై తగు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేటీఎం బ్రాండు మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం దామోదరన్ నేతృత్వం వహిస్తారని వివరించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మాజీ ప్రెసిడెంట్ ఎంఎం చితాలే, ఆంధ్రా బ్యాంక్ మాజీ సీఎండీ ఆర్ రామచంద్రన్ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. -
పేటీఎం, ఫాస్టాగ్పై ఆందోళనలు.. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పేటీఎంపై ఆర్బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ వచ్చే వారం ఎన్హెచ్ఏఐ, ఎన్సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ మన దేశంలోని టోల్ వసూళ్ల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపులపై ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు. -
పేటీఎంపై నిషేధం.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై నిషేధం విధించడం పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టకేలకు మౌనం వీడింది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం వల్లే పేటీఎంపై చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. అయితే పేటీఎంపై చర్యలకు దారితీసిన నిర్దిష్టమైన లోపాలను మాత్రం వెల్లడించలేదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లను స్వీకరించకుండా నిరోధించడం పర్యవేక్షక చర్యలో భాగమని, పరిమితులకుమించి లావాదేవీలు గుర్తించినట్లు ఒక ఆర్బీఐ సీనియర్ అధికారి తెలిపారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ మాట్లాడుతూ.. ఆర్బీఐ చర్యలు తీసుకోక ముందు నుంచే సంబంధిత సంస్థకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. పొరపాటు జరగకుండా వాటికి దిద్దుబాటు చర్చలు తీసుకోవాలని సంస్థకు అప్పటికే చాలా సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
పేటీఎంలో సంక్షోభం..‘10 నిమిషాల్లో’ తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ, కోఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తన సంస్థపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో విజయ్ కుమార్ శర్మ.. కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. విజయ్ శేఖర్ శర్మ మాట్లాడిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే సాధ్యమైనంత వరకు సమస్య మరింత జఠిలం కాకుండా ఆర్బీఐతో మీరే మాట్లాడి పరిష్కరించుకుంటే బాగుంటుందనే సలహా కూడా ఇచ్చారని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. ఆర్బీఐ అధికారులతో భేటీ అయిన విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తరువాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని జారీ చేసిన ఆదేశాల్ని పొడిగించాలని కోరినట్లు సమాచారం. పేటీఎం అధినేత విజ్ఞప్తిపై ఆర్బీఐ ఎలా స్పందించిందనే తెలియాల్సి ఉంది. ఆర్బీఐ-పేటీఎం వివాదం నేపథ్యంలో ఇటీవలే నిర్మలా సీతారామన్ ఓ కార్యక్రమంలో స్పందించారు. పేటీఎంపై విధించిన ఆంక్షలు గురించి పేటీఎం-ఆర్బీఐలు పరిష్కరించుకోవాల్సిన అంశంమని అన్నారు. -
సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్..
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) ప్రస్తుతం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. దాని ప్రత్యర్థులు గణనీయమైన వృద్ధి పొందుతున్నాయి. దీంతో పేటీఎం యూజర్లు చాలామంది గూగుల్ పే, ఫోన్పే, BHIM యాప్ల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఫిబ్రవరి 3 వరకు ఫోన్పే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను పొందిందని యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఒక నివేదికలో వెల్లడించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్లు 24.1 శాతం పెరిగి 10.4 లక్షలకు చేరుకుంది. యూజర్లను ఆకర్శించడానికి ఫోన్పే కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. దీని ఫలితంగా భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఫ్రీ యాప్ విభాగంలో కంపెనీ అగ్రస్థానానికి చేరుకుంది. యాప్ ర్యాంకింగ్లలో కూడా ఈ యాప్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఎక్కువ మంది యూజర్లు విరివిగా ఫోన్పే డౌన్లోడ్ చేసుకుంటున్న కారణంగా గూగుల్ ప్లేలో 188వ స్థానంలో ఉన్న కంపెనీ ఫిబ్రవరి 5 నాటికి 33వ స్థానానికి, యాప్ స్టోర్లలో 227వ స్థానం నుంచి 72వ స్థానానికి చేరింది. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ కూడా ఫిబ్రవరి 3న 1.35 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను సాధించి, 21.5 శాతం వృద్ధి కైవసం చేసుకుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల్లో.. 50 శాతం పెరిగి 5.93 లక్షల డౌన్లోడ్స్ పొందింది. దీంతో 356వ స్థానంలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లేలో 7వ స్థానానికి, యాప్ స్టోర్లలో 171 స్థానం నుంచి 40వ స్థానానికి చేరింది. ఇదీ చదవండి: భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్ ధరలు - కారణం ఇదే.. గూగుల్ పే విషయానికి వస్తే.. ఈ యాప్ డౌన్లోడ్ల విషయంలో స్వల్ప వృద్ధిని సాధించింది. ఇది ఫిబ్రవరి 3న 1.09 లక్షల డౌన్లోడ్లను సాధించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్స్ 8.4 శాతం పెరిగి 3.95 లక్షలకు చేరుకుంది. -
ఆ కంపెనీ ఉద్యోగుల జాబ్స్ పోయినట్టేనా? సీఈఓ ఏమన్నారంటే..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలు పోతాయేమో అని భయపడుతున్నారు. కంపెనీ భవిష్యత్తు గురించి, ఉద్యోగుల ఉద్యోగాల గురించి సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు కోసం ఆర్బీఐతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ ఉన్నతి కోసం పలు బ్యాంకులతో చర్చలు జరపడానికి కూడా సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని సీఈఓ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత.. కంపెనీ సీఈఓ తన ఉద్యోగులతో సమావేశమై.. పేటీఎం కుటుంబంలో ఉద్యోగులు చాలా ముఖ్యమైన భాగమని, వారు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఇక నుంచి కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పూర్తిగా పాటిస్తోందని, కాబట్టి ఉద్యోగులు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. -
అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ తమ వాలెట్ బిజినెస్ ముకేశ్ అంబానీకి చెందిన NBFCతో పాటు HDFC బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తీవ్ర సంక్షోభంలో ఉన్న కంపెనీ తమ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీకి విక్రయిస్తుందనే పుకార్లు వెల్లువెత్తడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 14 శాతం పెరిగి 288.75 రూపాయల గరిష్ఠానికి చేరుకున్నాయి. పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్లు ముందున్నాయని, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ బృందం ఈ విషయాన్నే.. గత నవంబర్ నుంచి జియో ఫైనాన్షియల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. RBI నిషేధానికి ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి జియో కూడా సుముఖత చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్బీఐ పేటీఎం లైసెన్స్ రద్దు చేస్తుందా.. పేటీఎంలో మనీలాండరింగ్, కేవైసీ ఉల్లంఘనల కారణంగా బ్యాంకింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేసే విషయాన్ని RBI పరిశీలిస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు.. ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్లను స్వీకరించకూడదనే నియమాలు అమలులోకి వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. పేటీఎం సీఈఓ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని, ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువ మంది దీని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ ఛాంపియన్గా నిలుస్తుందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే.. -
‘‘పేటీఎంపై సీబీఐ, ఈడీల మౌనం అందుకేనా’’
న్యూఢిల్లీ: పేటీఎం సబ్సిడరీ కంపెనీ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై మనీలాండరింగ్ ఆరోపణల తర్వాత కూడా సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎందుకు మౌనంగా ఉన్నాయో చెప్పాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేసింది. ‘పేటిఎం వ్యవస్థాపకుడు ప్రధాని మోదీ భక్తుడు. ప్రధానితో సెల్ఫీలు దిగడమే కాకుండా ప్రధానికి అనుకూలంగా ప్రకటనలు కూడా ఇచ్చాడు. ఎన్నికల ర్యాలీల్లోనూ పేటీఎంకు అనుకూలంగా మోదీ మాట్లాడారు. ఏడేళ్లుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సహకారం అందింది. ఇప్పుడు కంపెనీపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పేమెంట్ బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నాయని ఆర్బీఐ ఆంక్షలు విధించిన తర్వాత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు మౌనంగా ఉంది. పీఎం మోదీకి సంబంధించిన వాళ్లపై దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా షినేట్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. నిబంధనలు పాటించడం లేదన్న కారణంగా ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంకు ఎలాంటి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని, వాలెట్లలో డబ్బు రీఫిల్ చేయడం కుదరదని ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించింది. దీంతో పేటీఎం షేరు స్టాక్మార్కెట్లలో కుప్పకూలుతూ వస్తోంది. ఈ నాలుగైదు రోజుల్లో ఆ షేరు సుమారు 50 శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. #WATCH | On RBI's restrictions on Paytm Payments Bank, Congress leader Supriya Shrinate says, "RBI has restricted Paytm payments bank & there will be no existence of it after 29 February...There are very serious charges levelled by the RBI. The irregularities started in… pic.twitter.com/VFJph2tU2s — ANI (@ANI) February 5, 2024 ఇదీచదవండి.. భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్ -
Paytm: భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్
పేటీఎం షేర్ రోజురోజుకు దారుణంగా పడిపోతుంది. వరుసగా కేవలం నాలుగు రోజుల్లో దాదాపు 45 శాతం నష్టాలపాలయింది. తాజాగా సోమవారం 10 శాతం కంపెనీ షేర్లు నష్టపోయాయి. ఈరోజు 48.70 పాయింట్లు నష్టపోయి ప్రస్తుతం షేర్ ధర రూ.438.50 వద్దకు చేరింది. ఐదు రోజులకింద ఈ ధర రూ.760.65గా ఉండేది. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్అప్లు కూడా అప్పటి నుంచి చేయకూడదు’ అని ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్లో తేలినందునే ఆర్బీఐ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై విజయ్శేఖర్శర్మ స్పందిస్తూ పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో శర్మ పోస్ట్ చేశారు. మరోవైపు, పేటీఎం సౌండ్బాక్స్ వంటి సర్వీసులు అందించే ఆఫ్లైన్ వ్యాపారులపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. 2021లో రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2,150 ఇష్యూ ధరతో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.18,300 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.8,300 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, రూ.10,000 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో సేకరించింది. నవంబరు 18న ఎన్ఎస్ఈలో రూ.రూ.1,950 వద్ద, బీఎస్ఈలో రూ.1,955 వద్ద నమోదైంది. అదే రోజున రూ.1,560 కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు షేరు సుమారు 77 శాతం నష్టపోయినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం.. విజయ్ శేఖర్ శర్మ 2009లో ప్రారంభించిన పేటీఎంకు మొదటినుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. విజయ్ అలీబాబా గ్రూప్నకు చెందిన జాక్మా, సాఫ్ట్బ్యాంక్ నుంచి నిధులు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచి పేటీఎంకు కొంత లాభాలు వచ్చాయి. ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులకు మారి, పేటీఎంను అధికంగా వినియోగించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో విజయ్కు 51 శాతం ఉండగా, మిగతాది ఒన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధీనంలో ఉంది. -
యూజర్లకు అలెర్ట్.. ‘పేటీఎం’ ఇక కనిపించదా?
ప్రముఖ దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం మనీ ల్యాండరింగ్తో పాటు వందల కోట్లలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని గుర్తించిన ఆర్బీఐ పేటీఎంపై పలు ఆంక్షలు విధించింది. ఫలితంగా పేటీఎం భవిష్యత్ మరింత గందరగోళంగా మారింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదంటే స్తంభించి పోతుందా? ఇలాంటి అనేక ప్రశ్నల పరంపరకు స్పష్టత రావాలంటే అప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఆర్బీఐ ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)కు పలు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు చెల్లించడం, డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఇలా అన్నీ రకాల ఆర్ధిక లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 29 తర్వాత ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 29 లోపు వినియోగదారులు డిపాజిట్లు చేయడంతో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదా? అనేది ఆర్బీఐ మీద ఆధారపడింది. అప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తున్న విచారణలో లోపాలు తలెత్తితే మాత్రం పేటీఎంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు పేటీఎం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున అవకతవకలు పలు నివేదికల ప్రకారం.. పేటీఎం వినియోగిస్తున్న లక్షల కస్టమర్లకు కేవైసీ లేదు. పైగా మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్స్కు ఒకటే పాన్ కార్డ్ ఉండటం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో దాదాపు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉన్నాయి. ఇందులో, దాదాపు 31 కోట్ల అకౌంట్లు పనిచేయడం లేదు. కేవలం 4 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ లేదా చిన్న నిల్వలతో నిర్వహణలో ఉన్నాయి. కాబట్టి కేవైసీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇది ఖాతాదారులు, డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్లను తీవ్రమైన ప్రమాదానికి గురి చేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2021 నుంచి ఇదే తంతు పేటీఎం నిబంధనలు ఉల్లంఘించిన కార్యకలాపాలు నిర్వహించడం ఇదేమీ తొలిసారి కాదు. 2021లో ఈ ఫిన్ టెక్ కంపెనీకి ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎంలో అనేక అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది. కేవైసీ లేకపోవడం, మనీల్యాండరింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వెంటనే లోపాల్ని సవరించాలని సూచించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ కస్టమర్లకు సేవలందించారు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. ఇక ఈ లోపాలన్నీ ఆయా బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా పేటీఎంలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు తేలడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. 40 శాతం క్షీణించిన షేర్లు ఆర్బీఐ ఆదేశాలతో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు గత రెండు రోజుల్లో 40 శాతం క్షీణించాయి. శుక్రవారం బీఎస్ఈలో ఈ షేరు 20 శాతం నష్టపోయి రూ. 487.05కి చేరుకుంది. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.17,378.41 కోట్లు తగ్గి రూ.30,931.59 కోట్లకు చేరుకుంది. -
కుప్పకూలిన పేటిఎమ్ షేర్
-
ఫిబ్రవరి తర్వాత కూడా యథావిధిగా పేటీఎం సేవలు
న్యూఢిల్లీ: పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని డిజిటల్ పేమెంట్స్, సేవల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో శర్మ పోస్ట్ చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు గాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్కి (ఓసీఎల్) పీపీబీఎల్లో 49% వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాల కారణంగా పేటీఎం కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉంటుందని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పేటీఎం సౌండ్బాక్స్ వంటి సరీ్వసులు అందించే ఆఫ్లైన్ వ్యాపారులపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. తమ ప్లాట్ఫాంపై కొత్త వ్యాపారులను చేర్చుకునే ప్రక్రియ య«థావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. -
లాభాలపై రూ. 500 కోట్ల ప్రభావం
న్యూఢిల్లీ: పేటీఎం పేమెట్స్ బ్యాంక్పై (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల వల్ల తమ వార్షిక నిర్వహణ లాభాలపై రూ. 300–500 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చని ఫిన్టెక్ సంస్థ పేటీఎం అంచనా వేసింది. పీపీబీఎల్ డిపాజిట్లను స్వీకరించకుండా విధించిన ఆంక్షలతో, కస్టమర్లు తమ వాలెట్లలో డబ్బును డిపాజిట్ చేసే అవకాశం లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. అయితే, లాభదాయకతను మెరుగుపర్చుకునే దిశగా తమ ప్రయాణం ముందుకు కొనసాగుతుందని వివరించింది. డిసెంబర్లో పీపీబీఎల్ ద్వారా 41 కోట్ల యూపీఐ రెమిటెన్సుల లావాదేవీలు జరిగాయి. పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్కి (ఓసీఎల్) పీపీబీఎల్లో 49 శాతం వాటాలు ఉన్నాయి. 50 శాతం లోపు మైనారిటీ వాటాలే ఉన్నందున దాన్ని అనుబంధ సంస్థగా కాకుండా అసోసియేట్ సంస్థగా పరిగణిస్తోంది. ఒక పేమెంట్స్ కంపెనీగా పీపీబీఎల్తో పాటు వివిధ బ్యాంకులతో ఓసీఎల్ కలిసి పని చేస్తోందని పేటీఎం తెలిపింది. తాజా పరిణామం కారణంగా ఇకపై పీపీబీఎల్తో కాకుండా ఇతర బ్యాంకులతో మాత్రమే ఓసీఎల్ పని చేస్తుందని వివరించింది. పదే పదే నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఫిబ్రవరి 29 నుంచి కస్టమర్ల ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్లు మొదలైన వాటిల్లో డిపాజిట్లు, టాప్అప్లను స్వీకరించరాదంటూ పీపీబీఎల్పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పని చేయదా..! సీఈఓ ఏమన్నారంటే?
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm)కి చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాకిచ్చింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్లను స్వీకరించకూడదని ఆదేశించింది. దీనిపైన పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ కీలక ప్రకటనలు చేశారు. మీ ఫెవరేట్ పేటీఎం యాప్ ఎప్పటిలాగే పనిచేస్తుందని, తమకు మద్దతు తెలిపిన యూజర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువమంది దీనిని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ చాంపియన్గా నిలుస్తుందని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో 40 శాతం పడిన షేర్ ధర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల ఫలితంగా పేటీఎం తీవ్ర అంతరాయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, దీంతో సంస్థ షేర్స్ కూడా రెండు రోజుల్లో 40 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం 487 రూపాయల దగ్గర షేర్ డ్రేట్ అవుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ ఒక్క రోజే పేటీఎం షేరు 20 శాతం అంటే 121 రూపాయలు తగ్గింది. ఫిబ్రవరి 1వ తేదీ కూడా 20 శాతం పడిపోయింది. జనవరి 31వ తేదీ 761 రూపాయలుగా ఉన్న ఒక్కో షేరు ధర.. ఫిబ్రవరి 2వ తేదీన 487 రూపాయలకు చేరింది. ఎన్ఎస్ఈలో నిన్న 19.99% నష్టపోయి లోయర్ సర్క్యూట్ రూ.609కు చేరి, అక్కడే ముగిసింది. ఫలితంగా పేటీఎం మార్కెట్ విలువ రూ.9,646.31 కోట్లు ఆవిరై రూ.38,663.69 కోట్లకు పరిమితమైంది. To every Paytmer, Your favourite app is working, will keep working beyond 29 February as usual. I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full… — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024 -
పేటీఎం, గూగుల్ పే నుండి అయోధ్య రాముడికి విరాళం..
-
Ayodhya: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి. అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే.. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. -
నష్టాలను తగ్గించుకున్న పేటీఎం
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ, పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.222 కోట్లకు తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.392 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.2,850 కోట్లకు దూసుకుపోయింది. సబ్్రస్కిప్షన్ ఆదాయం గణనీయమైన వృద్ధిని చూసిందని, మార్జిన్లు మెరుగుపడ్డాయని, చెల్లింపుల వ్యాపారం ఆదాయం పెరిగినట్టు పేటీఎం ప్రకటించింది. వర్తకులు వినియోగించే పేటీఎం పేమెంట్ డివైజ్లు డిసెంబర్ చివరికి 1.06 కోట్లకు పెరిగాయి. పేమెంట్స్ వ్యాపారం ఆదాయం 45 శాతం పెరిగి రూ.1,730 కోట్లు, నికర చెల్లింపుల మార్జిన్ 63 శాతం పెరిగి రూ.748 కోట్లుగా ఉన్నాయి. మర్చంట్స్ పేమెంట్స్ వ్యాల్యూమ్ (జీఎంవీ) 47 శాతం వృద్ధితో రూ.5.10 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్షియల్ సరీ్వసుల ద్వారా ఆదాయం 36 శాతం పెరిగి రూ.607 కోట్లుగా నమోదైంది. డిసెంబర్ త్రైమాసికంలో రూ.15,535 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో 56 శాతం వృద్ధిని చూపించింది. గడిచిన ఏడాదిలో పేటీఎం ద్వారా రుణాలను తీసుకునే యూజర్లు 44 లక్షలు పెరిగి మొత్తం 1.25 కోట్లకు చేరారు. -
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు అలర్ట్!
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు వాడుతున్నారా..? ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్లు వినియోగిస్తున్నారా..? అయితే మీకో ముఖ్యమైన సమాచారం. కొన్ని యూపీఐ ఐడీలు డిసెంబర్ 31 నుంచి పనిచేయవు. అవేంటి.. ఎందుకు పనిచేయవు.. ఇక్కడ తెలుసుకోండి.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్స్ విస్తృతమయ్యాయి. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ యాప్లను ఉపయోగించే చెల్లింపులు చేస్తున్నారు. చిరు దుకాణాల దగ్గర నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకూ యూపీఐ చెల్లింపులే అత్యధికం ఉంటున్నాయి. ప్రస్తుతం ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటివాటితోపాటు ఇంకా మరికొన్ని యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆయా యాప్లు రకరకాల ఆఫర్లు, క్యాష్బ్యాక్లు వంటివి అందిస్తున్నాయి. దీంతో చాలా మంది వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి గురించి మరిచిపోతున్నారు. ఇలా 2023 డిసెంబర్ 31 నాటికి ఒక సంవత్సరం పాటు ఇన్యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆయా యాప్లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కోరింది. కారణం ఇదే.. బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసిన ఫోన్ నంబర్లను డీలింక్ చేయకుండా కస్టమర్లు ఫోన్ నంబర్లను మార్చినప్పుడు పాత నంబర్ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్ లక్ష్యమని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాల ప్రకారం, 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్స్క్రైబర్లకు టెల్కోలు డియాక్టివేటెడ్ నంబర్లను జారీ చేస్తుంటాయి. బ్యాంక్తో లింక్ చేసిన పాత మొబైల్ నంబర్ను కస్టమర్ అప్డేట్ చేసుకోకపోతే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 2023 డిసెంబర్ 31 లోపు ఈ విషయంపై తగిన చర్య తీసుకోవాలని ఎన్పీసీఐ కోరినట్లు సమాచారం. -
ఏఐ మాయలో ‘పేటీఎం’ ఏం చేయబోతోందంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ జాబ్ మార్కెట్లో అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే అధిక సంఖ్యలో కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి. న్యూ ఇయర్ 2024లో ఏఐ టూల్స్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వచ్చే ఏడాది తన గోల్ పేటీఎం సంస్థలో ఏఐని వినియోగించడం లక్ష్యమంటూ ఆ కంపెనీ అధినేత విజయ్ శేఖర్ శర్మ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఖర్చు తగ్గించుకునే ప్రణాళిల్లో భాగంగా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్తో భర్తీ చేయనుంది. ఈ తరుణంలో పేటీఎం యాప్లో చోటు చేసుకోనున్న మార్పుల గురించి ఆ సంస్థ అధినేత విజయ్ శేఖర్ శర్మ ఎక్స్.కామ్లో ప్రస్తావించారు. Making my todo list for 2024. 📋 What will you like to change/ upgrade in Paytm app ? 📲 We have changed new Paytm app’s Home Screen. Paytm Payments Bank and Other group entities’ offerings are clearly separated now. Makes it cleaner view. ✅ Expanding AI led customer care.… — Vijay Shekhar Sharma (@vijayshekhar) December 24, 2023 యూజర్ల ఎక్స్పీరియన్స్ కోసం ఇందులో భాగంగా పేటీఎం యాప్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్తో పాటు ఇతర పేమెంట్స్ బ్యాంక్స్ అనే కలిపే ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లో నుంచి పేటీఎం పేటీఎం బ్యాంక్ను విడిగా హోమ్ స్క్రీన్లో అప్డేట్ చేయనున్నట్లు తెలిపారు. పేటీఎం ఉద్యోగులకు ఎఫెక్ట్ 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న టెక్నాలజీ, ప్రొడక్ట్, ఇంజినీరింగ్ విభాగాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ టూల్స్ను వినియోగమే తన లక్ష్యమంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఎప్పుడైతే పేటీఎంలో ఏఐ వినియోగం ఎక్కువైతే ఆ యాప్లో రిపీట్గా ఒకే పని చేసే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. అదే సమయంలో పేటీఎం అనుసంధానంగా ఉన్న విభాగాల్లో మ్యాన్ పవర్ను పెంచనుంది. ఊహించిన దానికంటే ఎక్కువ పేటీంఎ యాప్లో ఏఐ ఉపయోగిస్తే ప్రొడక్ట్ డెవలప్ మెంట్ విభాగం మరింత సమర్ధవంతంగా మారే అవకాశం ఉందని భావిస్తుంది. అదే జరిగితే వారాల్లో జరిగే పని కేవలం రోజుల్లో జరగవచ్చని సీఈవో విజయ్ శేఖర్ శర్మ విశ్లేషిస్తున్నారు. బయపడుతున్న ఉద్యోగులు అయితే సీఈఓ పరిణామం ఎటు దారితీస్తుందోనని పేటీఎం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏఐ టూల్స్ వినియోగంతో భారీ మొత్తంలో ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అదే ఏఐని వచ్చే ఏడాది మరింత విస్తృతంగా వాడుకుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని బయపడుతున్నారు. -
పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్!
ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం.. కాస్ట్ కటింగ్లో భాగంగా దేశంలో పలు ప్రాంతాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని పేటీఎం తొలగించినట్లు సమాచారం. ఈ మొత్తం సంఖ్య 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే గత రెండు మూడేళ్ల క్రితం పేటీఎం ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకుంది. ఇప్పుడు ఉద్వాసన పలికిన ఉద్యోగుల్లో వీళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. ఉద్యోగుల తొలగింపుతో ఖాళీ అయిన విభాగాల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఇక వచ్చే ఏడాది పేటీఎం మరో 15వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనుంది. పేటీఎం తన పని విధానంలో ఏఐ ఆధారిత ఆటోమేషన్తో మారుస్తోందని, సంస్థ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పెరిగేందుకు దోహదం చేసేందుకు వీలుండే ఉద్యోగులకు పింక్ స్లిప్లు జారీ చేసినట్లు పేటీఎం ప్రతినిధి వెల్లడించారు. -
పేటీఎమ్ నుంచి బెర్క్షైర్ ఔట్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్లోగల మొత్తం 2.46 శాతం వాటాను ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్షైర్ హాథవే తాజాగా విక్రయించింది. ఓపెన్ మార్కెట్ ద్వారా పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్లోగల 1.56 కోట్లకుపైగా షేర్లను ఆఫ్లోడ్ చేసింది. షేరుకి రూ. 877.29 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ దాదాపు రూ. 1,371 కోట్లు. అనుబంధ సంస్థ బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ద్వారా మొత్తం వాటాను విక్రయించింది. కాగా.. దీనిలో 1.19 శాతం వాటాకు సమానమైన 75,75,529 షేర్లను కాప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు చేయగా.. 42.75 లక్షల షేర్ల(0.67 శాతం వాటా)ను ఘిసల్లో మాస్టర్ ఫండ్ ఎల్పీ సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 877.2 సగటు ధరలో దాదాపు రూ. 1,040 కోట్లు వెచ్చించాయి. ఈ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 895 వద్ద ముగిసింది. -
సీటు గ్యారంటీ! పేటీఎంలో రైలు టికెట్ బుకింగ్పై కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రైలు టికెట్ల బుకింగ్పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ పొందొచ్చని వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది. కన్ఫర్మ్డ్ టికెట్ కోసం ఒకటికి మించిన రైలు ఆప్షన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం యూజర్లు పేటీఎం యాప్పై రైలు టికెట్ బుకింగ్ సమయంలో ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఎంపిక చేసుకున్న రైలులో టికెట్లకు వెయిట్ లిస్ట్ చూపిస్తే, అప్పుడు ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సమీప స్టేషన్లకు ఏ రైలులో టికెట్లు అందుబాటులో ఉన్నది చూపిస్తుంది. దీనివల్ల సీటు లేదన్న ఆందోళన ఉండదని పేటీఎం తెలిపింది. -
Movie Tickets: రూ.99కే సినిమా టిక్కెట్లు!
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 13, శుక్రవారం రోజున మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.99కే సినిమా టిక్కెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫ్ర్ కేవలం ఇండియా సినిమాలకే కాకుండా ది ఎక్సార్సిస్ట్:బిలీవర్, పాపెట్రోల్ వంటి హాలీవుడ్ సినిమాలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. జవాన్, గదర్2, మిషన్ రాణిగంజ్ వంటి బాలీవుడ్ సినిమాలతో సహా అన్ని నేషనల్ మూవీస్కు రూ.99 టిక్కెట్ అందుబాటులో ఉంటుంది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్లు కూడా తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త రూ.99 ఆఫర్ను ప్రచారం చేస్తున్నారు. #NationalCinemaDay par aap sab ke liye ek bahut khaas tohfaa, only for the love of cinema! Iss 13th October, jaiye aur dekhiye Jawan at just Rs. 99! Book your tickets now!https://t.co/fLEcPK9UQT Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/uS3LfpcTNb — Shah Rukh Khan (@iamsrk) October 12, 2023 సినిమా టిక్కెట్లను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో లేదా బాక్సాఫీస్ వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే వారు మాత్రం సంబంధిత మల్టీప్లక్స్లు అందించే వెబ్సైట్ల్లోకి వెళ్లి ఫుడ్, బేవరేజెస్ వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున రికార్డు స్థాయిలో థియేటర్లో 6.5 మిలియన్ల అడ్మిషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం 4000 స్క్రీన్లలో ఈ ఆఫర్ ఉండనుంది. పీవీఆర్ ఐనాక్స్, సినోపోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీటైం, వేవ్, ఎం2కే, డెలైట్ వంటి మల్టీప్లెక్స్ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. This cheer right here is why we do what we do... Thank you fans for the full houses & full hearts filled with love. Nothing matters beyond YOU. HAPPY NATIONAL CINEMA DAY. pic.twitter.com/R7h5v6xKZa — Ajay Devgn (@ajaydevgn) October 13, 2023 -
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్కు రూ.5.39 కోట్లు జరిమానా - కారణం ఇదే!
ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను ఉల్లఘించిన బ్యాంకుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ తాజాగా 'పేటీఎమ్ పేమెంట్స్' బ్యాంక్కు భారీ జరిమానా విధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కేవైసీ (KYC) నిబంధనలను ఉల్లఘించిన కారణంగా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్కు ఆర్బీఐ రూ. 5.39 కోట్లు పెనాల్టీ విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 46(4)(i), 47A(1)(c) నిబంధనల ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు! పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్ లైసెన్స్కు సంబంధించిన RBI మార్గదర్శకాలను, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విఫలం కావడాన్ని గుర్తించడంతో ఆర్బీఐ ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
తత్కాల్ టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్.. రైలు ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు సేవల సంస్థ పేటీఎం.. తన ప్లాట్ఫామ్ ‘పేటీఎం యాప్’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ను పొందొచ్చని తెలిపింది. న్యూమనీ సేవింగ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. తత్కాల్ సహా సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్ అకౌంట్ (చెల్లింపులు చేసిన బ్యాంక్ ఖాతా లేదా కార్డ్)కు రిఫండ్ పొందొచ్చని ప్రకటించింది. రిఫండ్ కోసం రోజులకొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రైలు ప్రారంభానికి ఆరు గంటల ముందు లేదంటే చార్ట్ రూపొందించడానికి (వీటిలో ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది) ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ‘‘మొబైల్ చెల్లింపులు, క్యూఆర్ టెక్నాలజీలో ప్రముఖ సంస్థగా ఉన్న పేటీఎం, ట్రావెల్ బుకింగ్లకు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉన్న ఫళంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే వారికి ఈ కొత్త సుదపాయం ఉపశమనాన్ని ఇస్తుంది’’అని పేటీఎం అధికార ప్రతినిధి తెలిపారు. రైలు టికెట్లు బుకింగ్కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే గేట్వే ఫీజు వసూలు చేయడం లేదని పేటీఎం తెలిపింది. -
భవిష్యత్తులో పేటీఎంకు నిధుల అవసరం ఉండదు - మాధుర్ దియోర
న్యూఢిల్లీ: సమీప కాలంలో పేటీఎంకు నిధుల అవసరం లేదని, స్థిరమైన సానుకూల నగదు ప్రవాహాలను సాధిస్తామనే నమ్మకం ఉందని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధుర్ దియోర తెలిపారు. రుణ భారం సున్నా అని, బ్యాలన్స్షీటు ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. రూ.8,300 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయంటూ, ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్సీఎఫ్) విషయంలో నమ్మకంతో ఉన్నట్టు ప్రకటించారు. పేటీఎం 23వ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా దియోర ఈ వివరాలు వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రసంగిస్తూ.. కంపెనీ వృద్ధి భారత్ శక్తితో ముడిపడి ఉన్నట్టు ప్రకటించారు. ‘‘పేటీఎం వృద్ధి చెందుతుందంటే భారత్ కూడా వృద్ధి సాధిస్తున్నట్టే. దేశంలో చిన్న వ్యాపారుల ఛాంపియన్స్ మేము. సరైన టెక్నాలజీ, ఆర్థిక సేవలను ఒక్కసారి చిన్న వర్తకుడికి పరిచయం చేస్తే భారత్కు అసలైన వృద్ధి ఇంజన్ ఏర్పడినట్టే. ఉపాధి అవకాశాలతోపాటు, దేశంలో సమ్మిళిత ఆర్థిక సేవలకు మేము మార్గం చూపిస్తున్నాం’’అని శర్మ పేర్కొన్నారు. ఇటీవలి జీ20 సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా ఎక్స్పీరియెన్స్ జోన్లో పేటీఎం తన టెక్నాలజీని ఇతర దేశాల నేతలకు పరిచయడం చేయడం గమనార్హం. పేటీఎం రూపొందించిన ఏఐ సాఫ్ట్వేర్ స్టాక్ వ్యయాలను తగ్గిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సురక్షితంగా మారుస్తుందన్నారు. ‘‘మనం త్వరలోనే ప్రపంచ సూపర్ పవర్గా మారతాం. పేటీఎం దీనికి నాయకత్వం వహిస్తుంది’’అని శర్మ పేర్కొన్నారు. -
వారి కోసం పేటీఎం ‘సౌండ్ బ్యాక్స్’ లాంచ్, ధర ఎంతంటే?
చెల్లింపు సేవా సంస్థ పేటీఎం తన వినియోగదారులకు తీపి కబురు అందించింది. ముఖ్యంగా తన ప్లాట్ఫాంలో చిన్న వ్యాపారుల డిజిటల్ చెల్లింపుల కోసం సౌండ్ బాక్స్ ను లాంచ్ చేసింది. డిఫాల్ట్ గా వచ్చే'ట్యాప్ అండ్ పే' ఫీచర్తో ఐకానిక్ సౌండ్బాక్స్ ద్వారా అన్ని వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, రూపే నెట్వర్క్లలో మొబైల్, కార్డ్ చెల్లింపులను చేయవచ్చు. ఈ తరహా సౌకర్యాన్ని అందించే తొలి సంస్థ తామేనని పేటీఎం ప్రకటించింది. 999 రూపాయల (12.08డాలర్లు) 'కార్డ్ సౌండ్బాక్స్' ను లాంచ్ చేసింది. దీని ద్వారా వ్యాపారులు రూ.5,000 వరకు కార్డ్ చెల్లింపులను ఆమోదించగలరు. మేడ్ ఇన్ ఇండియా డివైస్ 4G నెట్వర్క్ కనెక్టివిటీతో వేగవంతమైన పేమెంట్స్ అలర్ట్స్ అందిస్తుంది. తమ సౌండ్బాక్స్ లేదా మొబైల్ చెల్లింపులతో కాంటాక్ట్లెస్ డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కలపడం ద్వారా వ్యాపారులకు చెల్లింపుల సౌలభ్యాన్ని విస్తరించడం ద్వారా డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతం లభిస్తుందని తెలిపింది. పేటీఎం క్యూఆర్ కోడ్తో మొబైల్ చెల్లింపుల మాదిరిగానే వ్యాపారులు, వినియోగదారులకు కార్డ్ ఆమోదం అవసరమని, పేటీఎం సరికొత్త సౌండ్బాక్స్ ద్వారా కస్టమర్కు LCD డిస్ప్లే ద్వారా ఆడియో, దృశ్య చెల్లింపు నిర్ధారణ రెండింటినీ అందిస్తుంది. విభిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ డివైస్ 11 భాషల్లో హెచ్చరికలను అందిస్తుందని, వీటిని వ్యాపారి Paytm ఫర్ బిజినెస్ యాప్ ద్వారా మార్చుకోవచ్చని పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. చెల్లింపు సేవలు, ఆర్థిక సేవల సమస్యల్ని పరిష్కరించడంలో Paytm కార్డ్ సౌండ్బాక్స్ మరో ముందడుగు అని చెప్పారు. ట్యాప్ ఫీచర్ని ఉపయోగించి వారి ఫోన్ల ద్వారా కూడా చెల్లింపులు చేసుకో వచ్చన్నారు. India’s first Soundbox with Card Payments is here! 🚀 With contactless payments and long lasting 5 day battery, we are proud to be back with yet another pioneering device to drive in-store payments!#Paytm #PaytmKaro #PaytmSeUPI pic.twitter.com/taP5JmXCd2 — Paytm (@Paytm) September 4, 2023 Paytm కార్డ్ సౌండ్బాక్స్ చిన్న వ్యాపారులు కాంటాక్ట్లెస్ కార్డ్ చెల్లింపులను సులభంగా ఆమోదించడం ద్వారా వారి కస్టమర్లకు అంతరాయం లేని డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని అందించడానికి వీలు కల్పించే మరో ఆవిష్కరణ అన్నారు మాస్టర్కార్డ్, దక్షిణాసియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్. ప్రతి లావాదేవీని ప్రత్యేకంగా ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా చెల్లింపులు నష్టం లేదా నకిలీ , డబుల్ బిల్లింగ్ లాంటివి తగ్గుతాయన్నారు. Paytm కార్డ్ సౌండ్బాక్స్ తరహాలోనే ఇప్పటికే పైన్ ల్యాబ్స్ PhonePe వంటి కంపెనీలు సౌండ్బాక్స్ లాంటివాటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్! ఇకపై మరింత..
ముంబై: ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్లలో యూపీఐ లైట్ ( UPI Lite ) వాలెట్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ( RBI ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి ఆఫ్లైన్ చెల్లింపు లావాదేవీ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 200 నుంచి రూ. 500కు పెంచింది. యూపీఐ ప్లాట్ఫామ్పై చిన్న మొత్తాల చెల్లింపును వేగవంతం చేసేందుకు 2022 సెప్టెంబర్లో యూపీఐ లైట్ను ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ అంతంత మాత్రంగా ఉండే ప్రాంతాలు, అలాగే అసలు నెట్ ఉండని ప్రదేశాల్లో కూడా రిటైల్ డిజిటల్ చెల్లింపు లావాదేవీల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే, బ్యాంకుల ప్రాసెసింగ్ వ్యవస్థలపై కూడా భారం తగ్గించడం వల్ల లావాదేవీలు విఫలమయ్యే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం దీని ద్వారా నెలకు 1 కోటికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. -
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కొత్త వ్యూహం
న్యూఢిల్లీ: ఆర్టిఫియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ స్టాక్ అభివృద్ధికి ఏఐపై పెట్టుబడులు పెడుతున్నట్టు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. మార్కెట్కు సేవలు అందించడం, దీర్ఘకాలం పాటు లాభదాయక వ్యాపారంగా పేటీఎంను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. భారత్లో 50 కోట్ల చెల్లింపుల కస్టమర్లు, 10 కోట్ల వర్తకుల లక్ష్యం ఎంతో దూరంలో లేదన్నారు. వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి రాసిన లేఖలో శర్మ ఈ విషయాలు తెలియజేశారు. ఏఐ విస్తరణతో రిస్క్లు, మోసాల నుంచి ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్కు రక్షణ ఏర్పడుతుందన్నారు. చెల్లింపుల సాంకేతికత, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఎగుమతి చేయడానికి భారత్ ముందు అవకాశాలున్నట్టు చెప్పారు. ఈ మార్గంలో పేటీఎం ముందుంటుందని ప్రకటించారు. (హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్!) పేటీఎం ల్యాబ్ ఎప్పటికప్పుడు ఏఐ, బిగ్ డేటా ఫీచర్లను అభివృద్ధి చేస్తోందని చెబుతూ.. వినియోగదారులు, వర్తకులు పేటీఎం వినియోగించే విషయంలో విశ్వసనీయతకు ఇది దారితీస్తున్నట్టు చెప్పారు. చెల్లింపులు, రుణ సేవలకే పరిమితం కాకుండా, ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో లభించే వ్యాపార అవకాశాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు శర్మ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఇందుకు సంబంధించి మంచి ఫలితాలను చూస్తారని వాటాదారులకు భరోసా ఇచ్చారు. ఈ దిశగా పేటీఎం నిపుణులు పనిచేస్తున్నట్టు చెప్పారు. -
పేటీఎమ్లో విజయ్కు అదనపు వాటా
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మకు అదనపు వాటా లభించింది. చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ఫిన్ విజయ్కు పేటీఎమ్లోగల 10.3 శాతం వాటాను బదిలీ చేసింది. అయితే ఈ వాటాకు సంబంధించిన ఆరి్థక హక్కులు(ఎకనమిక్ రైట్స్) యాంట్ఫిన్వద్దనే కొనసాగనున్నాయి. కంపెనీ వాటాదారుల్లో ఒకటైన యాంట్ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్ బీవీ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం 6,53,35,101 షేర్లను బదిలీ చేసినట్లు పేటీఎమ్ పేర్కొంది. దీంతో పేటీఎమ్లో యాంట్ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.49 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఇదే సమయంలో విజయ్ వాటా 19.55 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. వెరసి పేటీఎమ్లో విజయ్ అతిపెద్ద వాటాదారుగా నిలిచినట్లు పేర్కొంది. వాటా బదిలీకిగాను యాంట్ఫిన్.. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఓసీడీలు)ను పొందనుంది. ఈ డీల్లో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపోగా.. షేరుకి రూ. 795 ధరలో వాటా బదిలీ చేపట్టింది. -
యాంటిఫిన్ వాటా కొనుగోలు.. రూ. 53,957 కోట్లకు చేరిన పేటీఎం వ్యాల్యూ
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండు ఫిన్టెక్ దిగ్గజం.. వన్97 కమ్యూనికేషన్స్లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనుంది. యాంట్ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్స్ నుంచి 10.3 శాతం వాటాను విజయ్ సొంతం చేసుకోనున్నట్లు పేటీఎం తాజాగా పేర్కొంది. ఇందుకు ఎలాంటి నగదు చెల్లింపు ఉండదని, ఆఫ్మార్కెట్ లావాదేవీ ద్వారా వాటా బదిలీ ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ వాటా ఎకనమిక్ రైట్స్ యాంట్ఫిన్ వద్దనే కొనసాగుతాయని వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా విదేశీ సొంత సంస్థ రెజిలియంట్ అసెట్ మేనేజ్మెంట్ బీవీ ద్వారా వాటాను శర్మ కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. దీనికి బదులుగా మార్పిడికి వీలయ్యే(ఆప్షనల్లీ కన్వర్టిబుల్) డిబెంచర్లను యాంట్ఫిన్కు రెజిలియంట్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీ కారణంగా కంపెనీ యాజమాన్య నియంత్రణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ లావాదేవీతో పేటీఎంలో శర్మ వాటా 19.42 శాతానికి చేరనుంది. వెరసి కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలవనున్నారు. మరోపక్క యాంట్ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.5 శాతానికి తగ్గనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పేటీఎం బోర్డులో యాంట్ఫిన్ నామినీ ఉండబోరు. యాంట్ఫిన్.. చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ అనుబంధ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. షేరు జూమ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనున్న వార్తల నేపథ్యంలో ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం కౌంటర్లో లావాదేవీలు ఊపందుకున్నాయి. షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 7 శాతం జంప్చేసి రూ. 851 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 888కు చేరింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,511 కోట్లు ఎగసి రూ. 53,957 కోట్లను అధిగమించింది. -
టమాటాలు కేజీ రూ. 70 - ఆర్డర్ చేస్తే ఇంటికే!
How To Buy Tomatoes Rs.70 KG: భారతదేశంలో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటున్నాయి. రైతులు మంచి లాభాలు పొందుతున్నప్పటికీ సామాన్యులకు ఇది పెనుభారంగా మారిపోయింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ. 200 దాటినట్లు సమాచారం. భారీ ధర వద్ద లభించే టమాటాలను తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టమాటా ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆన్లైన్లో సరసమైన ధరకే విక్రయించడం ప్రారంభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కేవలం వారం రోజుల్లో ఏకంగా 10,000 కేజీల టమాటాలు అమ్ముడు కావడం గమనార్హం. ఇది ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉంది. రూ. 70కే పేటీఎమ్ భాగస్వామ్యంతో ఓఎన్డీసీ విక్రయిస్తోంది. పేటీఎమ్, మ్యాజిక్ పిన్, మై స్టోర్ వంటి యాప్స్ ద్వారా కూడా టమాటాలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఒక కస్టమర్ వారానికి కేవలం 2 కేజీల టమాటాలు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తే డోర్ డెలివరీ పొందవచ్చు. దీనికి ఎటువండి అడిషినల్ ఛార్జెస్ ఉండవు. ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి.. పేటీఎమ్లో ఆర్డర్ చేసే విధానం.. స్మార్ట్ఫోన్లో లోకేష్ ఆన్ చేసుకున్న తరువాత, యాప్లో ఓఎన్డీసీ ఫుడ్ అని సర్చ్ చేయాలి. ఓఎన్డీసీ ఓపెన్ అయిన తరువాత సమీపంలో ఉన్న స్టోర్స్ కనిపిస్తాయి, ఇందులో దాదాపు అన్నీ మీ లొకేషన్కు సమీపంలో ఉన్నవే ఉంటాయి. ఇందులో మీ దగ్గరగా ఉన్న ఒక స్టోర్ ఎంచుకోవాలి, ఆ తరువాత ఆర్డర్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత డెలివరీ పొందాల్సిన అడ్రస్ సెట్ చేసుకుని, ఆ తరువాత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాగే మీరు మ్యాజిక్పిన్ ద్వారా కూడా టమాటాలు ఆర్డర్ చేసుకోవచ్చు. -
పేటీఎం నుంచి పాకెట్ సౌండ్ బాక్స్.. దీంతో ఏం చేయొచ్చంటే
హైదరాబాద్: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వర్తకుల కోసం రెండు వినూత్న చెల్లింపుల సాధనాలను విడుదల చేసింది. 4జీ ఆధారిత పేటీఎం పాకెట్ సౌండ్ బాక్స్, పేటీఎం మ్యూజిక్ సౌండ్ బాక్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పేటీఎం పాకెట్ సౌండ్బాక్స్ అనేది చెల్లింపుల ఆధారిత తొలి పోర్టబుల్ పరికంగా కంపెనీ పేర్కొంది. డెబిట్ కార్డ్ పరిమాణంలో పాకెట్లో పట్టేస్తుందని, డ్రైవర్లు, డెలివరీ, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఇప్పటికే మార్కెట్లో ఉన్న పేటీఎం సౌండ్బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని వెంట తీసుకెళ్లడం సౌకర్యంగా ఉండదు. తరచూ వాహనాలపై ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని పేటీఎం పాకెట్ సౌండ్బాక్స్ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, పేటీఎం మ్యూజిక్ సౌండ్బాక్స్ అనేది వర్తకులకు చెల్లింపుల సమాచారాన్ని వాయిస్ రూపంలో వినిపించడమే కాకుండా, బ్లూటూత్తో ఫోన్ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యూజిక్ వినడం, మ్యాచ్ కామెంటరీ వినొచ్చని పేటీఎం తెలిపింది. వర్తకుల సౌకర్యం కోసమే ఈ రెండు ఉత్పత్తులను తీసుకొచ్చినట్టు పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. ఇందులో పాకెట్ సౌండ్బాక్స్ చెల్లింపుల పరిశ్రమలో ఎంతో మార్పును తీసుకొస్తుందన్నారు. ఈ ఏడాది జూన్ చివరికి పేటీఎంకు 79 లక్షల సౌండ్బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ల చందాదారులు ఉన్నారు. -
‘ఎస్బీఐ యోనో’ ఇక అందరిది.. ఆ యూపీఐ యాప్లకు గట్టిపోటీ!
SBI YONO App: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యోనో మొబైల్ యాప్ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకపై ఈ యాప్ను ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేని వారు కూడా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని స్టేట్ బ్యాంక్ కల్పించింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఫీచర్ను ఎస్బీఐ తీసుకొచ్చినట్లు చెబుతోంది. ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ చొరవ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ సేవలను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా పొందవచ్చని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. యూపీఐ సేవలతో పాటు కార్డ్ లెస్ క్యాష్ విత్డ్రాయల్ సౌకర్యాన్ని కూడా ఎస్బీఐ కల్పించింది. ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంలలో ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్బీఐ యోనో యాప్లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేనివారికి కూడా యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫేన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్ను ఉపయోగించండిలా.. ఎస్బీఐ యోన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ‘న్యూ టు ఎస్బీఐ’ను క్లిక్ చేసి ‘రిజిస్టర్ నౌ’పై నమోదు చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్ను ధ్రువీకరించి యూపీఐ చెల్లింపులకు నమోదు చేసుకోండి యూపీఐ ఐడీని సృష్టించడానికి మీ బ్యాంక్ని ఎంచుకోండి ఎస్బీఐ పే కోసం రిజిస్ట్రేషన్ని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీ మొబైల్కు వస్తుంది అందించిన ఆప్షన్ల నుంచి ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా ఎస్బీఐ యూపీఐ హ్యాండిల్ను సృష్టించండి లాగిన్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ఆరు అంకెల శాశ్వత ఎంపిన్ను సెట్ చేసుకోండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, కాంటాక్ట్స్కు డబ్బు పంపడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం వంటివి ప్రారంభించండి ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు -
ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఎలా అంటే?
మనం ఇప్పటి వరకు చాలా సక్సెస్ స్టోరీలు చదువుకున్నాం. పేదరికం నుంచి కుబేరులైన వ్యక్తుల గురించి.. ఉన్నత చదువులు వదిలి సక్సెస్ సాధించినవారు గురించి ఇలా ఎన్నెన్నో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ కొడుకు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతడు సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించిన 'విజయ్ శేఖర్ శర్మ' (Vijay Shekhar Sharma) స్కూల్ టీచర్ అయిన 'సులోమ్ ప్రకాష్' మూడవ కుమారుడు. చిన్నప్పుడు అలీఘర్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న ప్రాంతంతో పాఠశాల విద్యను ప్రారంభించి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బిటెక్ పూర్తి చేసాడు. కంప్యూటర్ పట్ల ఆకర్షణ.. చదువుకునే రోజుల్లోనే విజయ్ను కంప్యూటర్ బాగా ఆకర్శించింది. దీంతో చాలా సమయం కంప్యూటర్లతోనే కాలం గడిపేవాడు. అయితే మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీ అతన్ని ఎంతగానో ఆకర్శించింది. ఇది అతన్ని ఒక కొత్త ఆలోచనలోకి తీసుకెళ్లింది. తత్ఫలితంగా 'పేటీఎమ్' (Paytm) యాప్ సృష్టించి కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆన్లైన్ పోర్టల్ ప్రారంభం.. అసాధారణ విజయాలన్నీ సాధారణ వ్యక్తుల నుంచి పుట్టుకొస్తాయనే మాట నిజం చేస్తూ.. విజయ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఎన్నెన్నో ఆటంకాలు, అపజయాలు చవి చూసిన తరువాత ఈ రోజు గొప్ప స్థాయికి చేరినట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. చదువు పూర్తయిన తరువాత తన క్లాస్మేట్తో కలిసి ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి దాన్ని అతి తక్కువ కాలంలోనే ఇతరులకు విక్రయించారు. ఆ తరువాత 'వన్97 కమ్యూనికేషన్' పోర్టల్ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది క్రికెట్ రేటింగ్ వంటి సమాచారం అందించేది. ఈ వెబ్సైట్ అనుకున్నంత సక్సెస్ పొందలేకపోయింది. తద్వారా.. తీవ్ర నష్టాలను మిగిల్చింది. దెబ్బతో అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం పోయింది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) రూ. 10 వేలకు ఉద్యోగం & పేటీఎమ్ స్థాపన.. అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బు పోవడంతో అప్పుడు చేయాల్సి వచ్చింది. రోజువారీ అవసరాలకు చిన్న చిన్న ఉద్యోగాలు రూ. 10 వేల జీతానికి పనిచేసినట్లు తెలిసింది. అయితే టెక్నాలజీని ఏ మాత్రం వదలకుండా 2011లో పేటీఎమ్ స్థాపించాడు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇది భారీ సక్సెస్ సాధించింది. కేవలం ఏడాది కాలంలో లక్షల సంఖ్యలో పేటీఎమ్ వ్యాలెట్స్ క్రియేట్ అయ్యాయి. అంతే కాకుండా మొదటి సారి జరిగిన పెద్ద నోట్ల ఈ యాప్కి మరింత గిరాకీ పెంచింది. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన హ్యుందాయ్ ఎక్స్టర్ - టాటా పంచ్ ప్రత్యర్థిగా నిలుస్తుందా?) కొన్ని నివేదికల ప్రకారం, భారతదేశంలో పేటీఎమ్ ఉపయోగిస్తున్న భారతీయులు సుమారు 30 కోట్లు కంటే ఎక్కువ. అంతే కాకుండా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్కు కూడా విపరీతమైన ఆధారణ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ యాప్లతో పేటీఎమ్ పోటీ పడుతోంది. ఈ యాప్ స్థాపించిన తరువాత విజయ్ ఆస్తులు విలువ రూ. 8,222 కోట్లకి చేరినట్లు, సంస్థ విలువ రూ. 55 వేల కోట్లు అని తెలుస్తోంది. -
క్యూ1లో పేటీఎమ్ జోరు: జీఎంవీ 37 శాతం జూమ్
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండు ఫిన్టెక్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో స్థూల వాణిజ్య విలువ(జీఎంవీ) 37 శాతం జంప్చేసి రూ. 4.05 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది (2022-23) క్యూ1లో రూ. 2.96 లక్షల కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాపారస్తుల(మర్చంట్స్)కు జరిగిన చెల్లింపుల విలువను జీఎంవీగా పేర్కొనే సంగతి తెలిసిందే. (రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్) కాగా.. పేటీఎమ్ ద్వారా పంపిణీ అయిన రుణాలు 2.5 రెట్లు ఎగసి రూ. 14,845 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది క్యూ1లో రూ. 5,554 కోట్ల రుణాలు పంపిణీకాగా.. వీటి పరిమాణం సైతం 85 లక్షల నుంచి 51 శాతం జంప్చేసి 1.28 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. మరిన్ని బిజినెస్ వార్తలు అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
డేటా లోకలైజేషన్ వివాదంపై.. పేటీఎం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాలు సాగించే కంపెనీలు ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. పౌరుల డేటాను కాపాడాల్సిన బాధ్యత వాటికి ఉంటుందని స్పష్టం చేశారు. స్టార్టప్20 శిఖర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డేటా లోకలైజేషన్ వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ సంఖ్యలో యూజర్లున్న భారత మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని శర్మ చెప్పారు. భారతీయ పౌరుల డేటాను పొందే టెక్ కంపెనీలు.. ఇక్కడి నియమ నిబంధనలను పాటించబోమనేందుకు ఆస్కారం ఉండబోదని ఆయన తెలిపారు. భారత యూజర్ల డేటాను దేశీయంగానే భద్రపర్చాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు వాదిస్తుండగా.. విదేశీ కంపెనీలు మాత్రం ఇతర దేశాల్లో భద్రపర్చే స్వేచ్ఛ కావాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్పరమైన లోపాలపై స్పందిస్తూ.. ఇది స్టార్టప్లకు మాత్రమే పరిమితం కాదని ప్రతి రంగంలోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు. స్టార్టప్లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంపై మాట్లాడుతూ.. వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న ఆవిష్కరణలు చేసే సంస్థలకు నిధుల కొరత లేదన్నారు. -
శ్రీరామ్ ఫైనాన్స్తో పేటీఎం జట్టు
చెన్నై: ఫిన్టెక్ సంస్థ పేటీఎం తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్తో జట్టు కట్టింది. పేటీఎం నెట్వర్క్లోని వ్యాపారులు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి రుణాలు పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. తర్వాత దశల్లో వినియోగదారులకు కూడా రుణాలను అందించేలా దీన్ని విస్తరించనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రేవాంకర్ తెలిపారు. దేశీయంగా రిటైల్ రుణాలకు భారీగా డిమా ండ్ నెలకొందని, రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన వివరించారు. రుణాల పంపిణీ వ్యవస్థను మరింతగా విస్తరించేందుకు శ్రీరా మ్ ఫైనాన్స్తో ఒప్పందం దోహదపడగలదని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్శేఖర్శర్మ పేర్కొన్నారు. తమ ప్లాట్ ఫాంపై చిన్న వ్యాపారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలతో పాటు ఇతరత్రా డిజిటల్ ఆర్థి క సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడగలదని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్శేఖర్శర్మ పేర్కొన్నారు. దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల అసెట్స్ను నిర్వహిస్తూ.. 2,922 శాఖలు, 64,052 మంది ఉద్యోగులతో శ్రీరామ్ ఫైనాన్స్ దేశీయంగా అతి పెద్ద రిటైల్ ఎన్బీఎఫ్సీ కంపెనీల్లో ఒకటిగా ఉంది. -
ఒడిశా విషాదం:పేటీఎం కీలక నిర్ణయం..నెటిజన్ల ప్రశంసలు
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఒడిశా రైలు ప్రమాదంలో బాధితుల సహాయార్థం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం ద్వారా యూజర్లు అందించిన విరాళాలకు సమాన మొత్తంలో తాను కూడా చెల్లించ నుంది. ప్రమాదంలో బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నారు. (జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం) ఈ మేరకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రతిజ్ఞ చేశారు. వినియోగదారులు చెల్లించిన ప్రతీ రూపాయిక మరో రూపాయి జోడించి.. ఇలా సేకరించిన నిధులను ఒడిశా ముఖ్యమంత్రి సహాయనిధి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని ప్రకటించారు. "విరాళం ఇచ్చిన మొత్తంపై 80జీ పన్ను మినహాయింపు పొందవచ్చు. Paytm యాప్లోని 'ఆర్డర్ & బుకింగ్స్' విభాగం నుండి రసీదులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే తమ డొనేష్లనకుసంబంధించిన స్క్రీన్షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. (రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఇదీ చదవండి: నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం Help the victims of the Odisha train tragedy 🙏 Paytm Foundation will match your contribution ₹ to ₹. A small donation can make a big difference❤️ Donate now on Paytm App: https://t.co/av9bdffnwS — Paytm (@Paytm) June 6, 2023 కాగా జూన్ 2న జరిగిన ప్రమాదంలో దాదాపు 288 మంది చనిపోయారని ఒడిశా ప్రభుత్వం తాజాగా ధృవీకరించింది. ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. దాదాపు 1,100 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కోసం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Contribute to Odisha Train tragedy victims through Paytm. We will match all your contributions ₹ to ₹. Thanks for your contributions 🙏🏼 https://t.co/QTQM1LhS4H — Vijay Shekhar Sharma (@vijayshekhar) June 5, 2023 -
పేటీఎం రీ‘సౌండ్’! భారీగా పెరిగిన సౌండ్ బాక్స్ సబ్స్క్రైబర్లు
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ పేమెంట్ పరికరాల (సౌండ్ బాక్స్లు) ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మే నెల చివరి నాటికి సౌండ్బాక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్యను ఏకంగా 118 శాతం పెంచుకుంది. సౌండ్బాక్స్, పాయింట్-ఆఫ్-సేల్ (పీవోఎస్) మెషీన్ల వంటి పరికరాల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలలో 75 లక్షలకు పెరిగినట్లు ఓ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వన్97 సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే ఏప్రిల్, మే నెలల్లో సబ్స్క్రైబర్ల సంఖ్య 34 లక్షలు ఉండేది. ఈ సంవత్సరం మే నెలలోనే 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరడం గమనార్హం. మార్చి త్రైమాసికంతో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించిన పేటీఎం అంతకుముందు ఆర్థక సంవత్సరంలో 29 లక్షల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండేది. అంటే 134 శాతం వృద్ధిని సాధించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు కాకుండా అదనపు చెల్లింపు మానిటైజేషన్ ఛానెల్ని ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో పేటీఎం ఈ వృద్ధిని సాధించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే వివిధ చెల్లింపు పద్ధతుల ద్వారా డిజిటల్ చెల్లింపులను అంగీకరించినందుకు వ్యాపారుల నుంచి వసూలు చేసే రేటు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం మర్చంట్ చెల్లింపులు 35 శాతం వృద్ధితో రూ. 2.65 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం అందించిన రుణాలు రూ. 9,618 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇవే నెలల్లో రూ. 3,576 కోట్లు ఉండగా 169 శాతం పెరిగాయి. ఇదీ చదవండి: ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఫోన్ పే గూగుల్ పే పేటియంల కొంపముంచిన జొమాాటో
-
పేటీఎం బంపరాఫర్.. యూజర్లకు 75వేల వరకు స్పెషల్ బెన్ఫిట్స్!
ముంబై: రూపే నెట్వర్క్పై కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టే దిశగా పేటీఎం, ఎస్బీఐ కార్డ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) చేతులు కలిపాయి. రూపే ఆధారిత పేటీఎం ఎస్బీఐ కార్డ్ను ఆవిష్కరించాయి. యూపీఐ క్యూఆర్ కోడ్లపై కూడా రూపే క్రెడిట్ కార్డులు పని చేయనున్నందున మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు మరింతగా పెరగగలవని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఇందులో ప్లాటినం కేటగిరీ కార్డుహోల్డర్లకు 1 శాతం ఇంధన సర్చార్జి మినహాయింపు, రూ. 1,00,000 వరకు సైబర్ ఫ్రాడ్ బీమా కవరేజీ ఉంటుంది. వెల్కం ఆఫర్ కింద పేటీఎం ఫస్ట్ సభ్యత్వం, ఓటీటీ ప్లాట్ఫాం మెంబర్షిప్ సహా రూ. 75,000 వరకు విలువ చేసే ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే పేటీఎం యాప్లో ఈ కార్డుతో సినిమా, ట్రావెల్ టికెట్లపై 3 శాతం, ఇతర కొనుగోళ్లపై 2 శాతం, బైట జరిపే లావాదేవీలపై 1 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. -
ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలకు షాక్!
Zomato UPI: ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ సంస్థలకు షాక్ ఇస్తూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా సొంతంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి పేమెంట్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పడు ఇలా కాకుండా జొమాటోనే సొంతంగా యూపీఐ సర్వీస్ను తీసుకువచ్చింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! కస్టమర్లు చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడకుండా జొమాటో ఈ కొత్త సర్వీసును తీసుకువచ్చింది. దీని వల్ల కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగుతుంది. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు పేమెంట్ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్ ని ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. నేరుగా జొమాటో యూపీఐ ద్వారానే కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్ నుంచి సులువుగా డబ్బులు చెల్లించొచ్చు. జొమాటో కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్తో భాగస్వామ్యంతో ఈ కొత్త యూపీఐ సర్వీస్ ని తీసుకువచ్చింది. జొమాటో యూజర్లు యూపీఐ సేవలని ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద జొమాటో ఈ యూపీఐ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అందువల్ల ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. త్వరలో ఈ యూపీఐ సర్వీస్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా?
డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లో ట్రావెల్ నౌ పే లేటర్ (TNPL) ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం క్యాషీ (CASHe)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయంతో ప్రయాణికులు తమ రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. టికెట్ మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలలలో ఈఎంఐల ద్వారా తర్వాత చెల్లించవచ్చు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం పేటీఎంలో పోస్ట్పెయిడ్ సదుపాయం ఉండటం వల్ల రైల్వే టికెటింగ్ సర్వీసుల్లో బుక్ నౌ పే లేటర్ ఆప్షన్ ను పేటీఎం యూజర్లు వినియోగించుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇటీవలి కాలంలో పేటీఎం తమ యూజర్ల కోసం టికెట్ల బుకింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, షాపింగ్ లలో బై నౌ పే లేటర్ సదుపాయాన్ని విరివిగా కల్పిస్తోంది. పేటీఎం పోస్ట్పెయిడ్ వినియోగదారులకు 30 రోజుల వ్యవధికి రూ. 60 వేల వరకు వడ్డీ రహిత రుణాన్ని అందిస్తోంది. టికెట్ బుకింగ్ ఇలా.. ఐఆర్సీటీసీ అధికారిక పోర్టల్ లేదా మొబైల్లో ఐఆర్సీటీసీ యాప్లో లాగిన్ అవ్వాలి. మీ వెళ్లాల్సిన ప్రాంతం, ప్రయాణ తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి. తర్వాత చెల్లింపు విభాగానికి వెళ్లి 'పే లేటర్'పై క్లిక్ చేయండి. పేటీఎం పోస్ట్పెయిడ్ని ఎంచుకుని, మీ పేటీఎం వివరాలతో లాగిన్ చేయండి. తర్వాత OTPని నమోదు చేస్తే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! -
పేటీఎంలో సరికొత్త ఫీచర్లు..
ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం (Paytm) సరి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన iOSలో యూపీఐ లైట్ ఫీచర్, యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్ యాడింగ్, స్ప్లిట్ బిల్, మొబైల్ నంబర్లకు బదులుగా పేటీఎం యాప్లో ప్రత్యామ్నాయ యూపీఐ ఐడీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (PPBL) నిర్వహించిన సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్లో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ, బోర్డు సభ్యుడు భవేష్ గుప్తా, PPBL సీఈవో సురిందర్ చావ్లా కంపెనీ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను ప్రకటించారు. పేటీఎం కొత్త ఫీచర్లు ఇవే.. పేటీఎం యూజర్లు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్ను పేటీఎం యాప్లో యూపీఐ ఐడీతో లింక్ చేసుకోవచ్చు. అన్నింటి ముఖ్యమైన విప్లవాత్మక ఫీచర్.. స్ప్లిట్ బిల్. అంటే ఏదైనా బిల్లును స్నేహితుల సమూహంలో విభజించి పంచుకోవచ్చు. అలాగే పేటీఎంలో చేసిన అన్ని చెల్లింపులను ట్యాగ్ చేయవచ్చు. అదేవిధంగా ట్యాగ్ చేసిన చెల్లింపులను ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇక ఫిబ్రవరిలో ప్రారంభించిన సంచలనాత్మక యూపీఐ లైట్ ఫీచర్ తాజాగా యాపిల్ ఐఓఎస్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. చెల్లింపులను క్రమబద్ధీకరించడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యను తొలగించడం దీని ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా ఇప్పుడు పిన్ను నమోదు చేయకుండానే రూ. 200 వరకు చెల్లింపులు చేయవచ్చు. టూపీఐ లైట్కి రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2,000 జోడించుకోవచ్చు. ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కేంద్రం శుభవార్త, త్వరలో.. -
అలర్ట్: ‘ఫోన్పే’లో అందుబాటులోకి వచ్చిన ఫీచర్ ఏంటో తెలుసా?
ప్రముఖ దేశీయ ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే యూపీఐ పేమెంట్ కోసం లైట్ పేమెంట్స్ ఫీచర్ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ వల్ల రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీల కోసం ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పటికే ఫోన్పే ప్రత్యర్ధి సంస్థ పేటీఎం ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో యూపీఐ లైట్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్పే సైతం ఈ సరికొత్త సేవల్ని వినియోగించేలా యూజర్లకు అవకాశం కల్పించింది. చిన్న చెల్లింపుల కోసం ముందుగానే యూపీఐ లైట్లో రూ.2,000 వరకు జమ చేసుకోవచ్చని ఫోన్పే తెలిపింది. ఫలితంగా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా వేగంగా చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులు జరిగే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండవని వెల్లడించింది. అన్నీ బ్యాంకుల సపోర్ట్ ఫోన్పే యూపీఐ లైట్కు దేశంలో అన్నీ బ్యాంకుల్లో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ సీఈవో సమీర్ నిఘమ్ చెప్పారు. యూపీఐ మర్చంట్, క్యూఆర్ కోడ్ చెల్లింపులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్తో పనిలేదు వీటితో పాటు యూపీఐ లైట్ వినియోగంతో ఆయా ట్రాన్సాక్షన్లపై యూజర్లకు మెసేజ్ అలెర్ట్ వెళ్లనుంది. యూజర్లు ఏ రోజు ఎన్ని లావాదేవీలు జరిపారో తెలుసుకునేందుకు వీలుగా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడొచ్చు. దీనికి సంబంధించి మెసేజ్ అలెర్ట్ పొందవచ్చు. తద్వారా చెల్లింపులపై బ్యాంక్ స్టేట్మెంట్, పాస్బుక్ అవసరం తీరిపోనుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. చెల్లింపుల్ని సులభతరం చేసేందుకే అయితే ఈ యూపీఐ లైట్ ఫీచర్ ద్వారా దేశంలో ప్రతి రోజు జరిగే చిన్న చిన్న లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఫోన్పేలో ఈ కొత్త ఆప్షన్ను అభివృద్ది చేసినట్లు ఫోన్పే కో- ఫౌండర్, సీటీవో రాహుల్ చారి చెప్పినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్సీపీఐ నిర్ణయం.. యూపీఐ లైట్కి ఊతం ఇటీవల కాలంలో ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలలో జరిపే లావాదేవీల సమయంలో నెట్వర్క్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేలా గత ఏడాది డిసెంబర్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్సీపీఐ) నెట్వర్క్ లేకపోయినా రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీలు జరిపేలా అనుమతిచ్చింది. చదవండి👉 కొనసాగుతున్న తొలగింపులు.. దిగ్గజ ఐటీ కంపెనీలో 600 మందిపై వేటు! -
పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ (బిహు, వైశాఖి) పురస్కరించుకుని ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తాజాగా ఏప్రిల్ 17 నుంచి 19 మధ్య ట్రావెల్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. బస్ టికెట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంటు అందించనున్నట్లు తెలిపింది. అలాగే రూ. 3,000 వరకు క్యాష్బ్యాక్, 1 బస్ టికెట్ కొంటే 1 టికెట్ ఉతం వంటి ఆఫర్లను కూడా పొందేందుకు అవకాశం ఉందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వివరింంది. 2,500 పైలుకు బస్ ఆపరేటర్ల నుంచి తక్కువ చార్జీలకే టికెట్లు పొందవచ్చని తెలిపింది. -
4జీ కనెక్టివితో పేటీఎం 3.0 సౌండ్బాక్స్
ముంబై: చెల్లింపుల ప్రక్రియను మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు పేమెంట్స్, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం 4జీ ఆధారిత సౌండ్బాక్స్ 3.0 ని ఆవిష్కరించింది. రియల్ టైమ్ పేమెంట్ పరిశ్రమలో అలర్టుల కోసం స్థిరమైన కనెక్టివిటీ ఉపయోగించి తయారుచేసిన మొట్టమొదటి 4జీ సౌండ్బాక్స్ ఇది. వాటర్ ప్రూఫ్ ఫీచర్ కలిగిన ఈ మేడిన్ ఇండియా ప్రాడెక్ట్ బ్యాటరీ జీవిత కాలం ఏడురోజులుగా ఉంది. పరిసర ప్రాంతాల్లో 4జీ నెట్వర్క్ పనిచేయకపోతే, చెల్లింపులకు ఎలాంటి అంతరాతయం కలగకుండా ఆటోమేటిక్గా 2జీకి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఇందులో మొత్తం 11 భాషలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు స్వీకరించిన పేమెంట్స్పై కచ్చితమైన క్యాష్బ్యాక్ పొందవచ్చు. అలాగే 24 గంటల హెల్ప్లైన్, ఒక గంట కాల్ బ్యాక్ పాలసీ అందిస్తుంది. పేటీఎం మెర్క్యూ లెండింగ్ భాగస్వాముల ద్వారా తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. -
పేటీఎం అమ్మకాల్లో 40 శాతం వృద్ధి..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తమ ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన స్థూల అమ్మకాలు (జీఎంవీ) 40 శాతం వృద్ధి చెందాయి. విలువపరంగా క్రితం క్యూ4లో రూ. 2.59 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి రూ. 3.62 లక్షల కోట్లకు పెరిగాయి. సమీక్షాకాలంలో నెలవారీ లావాదేవీలు నిర్వహించే యూజర్ల సంఖ్య (ఎంటీయూ) 27 శాతం పెరిగి 9 కోట్లకు చేరిందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. పేమెంట్ డివైజ్ల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య 2022 డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే 10 లక్షలు పెరిగి 68 లక్షలకు చేరినట్లు వివరించింది. పేటీఎం ప్లాట్ఫాం ద్వారా రుణ వితరణ పరిమాణం రూ. 3,553 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ. 12,554 కోట్లకు ఎగిసిందని తెలిపింది. -
యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు..
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్పే, గూగుల్పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్కైనా చెల్లింపులు ఆన్లైన్ వాలెట్లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్చేంజ్ రుసుము విధించేందుకు ఎన్పీసీఐ ప్రతిపాదనలు చేసిన విషయం నిజమే. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. ఇంటర్చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్పే, గూగుల్పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్కి చెల్లించాలి. మర్చెంట్స్ ప్రొఫైల్ను బట్టి ఇంటర్ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. వివిధ పరిశ్రమలకు ఇంటర్ఛేంజ్ రుసుము వేరువేరుగా ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొంది. -
పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్..
ముంబై: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వ్యాలెట్ యూజర్లకు మంచి సదుపాయాన్ని తీసుకొచ్చింది. వ్యాలెట్ నుంచి క్యూఆర్ కోడ్ సాయంతో ఏ మర్చంట్కైనా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రకటించింది. అలాగే, ఆన్లైన్లోనూ యూపీఐ చెల్లింపులను అనుమతించే చోట పేటీఎం వ్యాలెట్ నుంచి చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. కేవైసీ పూర్తి చేసిన వ్యాలెట్ యూజర్లకే ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు 10 కోట్ల వ్యాలెట్ కస్టమర్లు ఉన్నారు. వివిధ సంస్థల వ్యాలెట్ల మధ్య ఇంటర్ ఆపరేబులిటీకి ఎన్పీసీఐ అవకాశం కల్పించడంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. -
పిన్ అవసరం లేదు!.. పేమెంట్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు!
దేశీయ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన పేటీఎం యూపీఐ లైట్ (Paytm UPI LITE) యాప్ ద్వారా వన్ ట్యాప్ రియల్ టైమ్ యూపీఐ చెల్లింపులను ప్రారంభించింది. దీనివల్ల లావాదేవీలు ఎక్కువగా ఉండే సమయాల్లో చిన్న మొత్తంలో చేసే ఈ చెల్లింపులు విఫలమయ్యే ఆస్కారం ఉండదు. యూపీఐ పీర్ టు మర్చంట్ (పీ2ఎం) చెల్లింపులలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అగ్రగామిగా ఉంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! పేటీఎం తాజాగా ప్రారంభించిన యూపీఐ లైట్ యాప్ ఆన్లైన్ లావాదేవీలను వేగవంతం చేయడానికి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను 'ఆన్-డివైస్' వాలెట్తో భర్తీ చేస్తుంది. అంటే పేటీఎం యూజర్లు లావాదేవీలు చేయడానికి వారి పేటీఎం వాలెట్ లాగే యూపీఐ లైట్ వాలెట్కు కూడా డబ్బును జోడించుకోవచ్చు. ఒకసారికి ఎంత మొత్తం చేయొచ్చు? ఈ సర్వీస్ను సెటప్ చేసుకున్న యూజర్లు పేటీఎం యూపీఐ లైట్ ద్వారా రూ. 200 వరకు తక్షణ చెల్లింపులు చేయవచ్చు. ఇందు కోసం ఎటువంటి పిన్ అవసరం లేదు. పేటీఎం యూపీఐ లైట్ యూజర్లు రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2,000 జోడించుకోవచ్చు. అంటే మొత్తంగా రూ. 4,000 యాడ్ చేసుకోవచ్చు. అయితే ఒకసారికి గరిష్టంగా రూ.200 వరకు మాత్రమే చెల్లింపు చేయవచ్చు. ఏయే బ్యాంకులు? పేటీఎం యూపీఐ లైట్ యాప్కు ప్రస్తుతం 10 బ్యాంకులు మాత్రమే మద్దతిస్తున్నాయి. అవి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సగానికి పైగా చిన్న మొత్తాలే.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) 2022 మేలో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీలలో 50 శాతం రూ. 200 అంతకంటే తక్కువ మొత్తానివే. ఇటువంటి చిన్న మొత్తం లావాదేవీలు భారీ సంఖ్యలో ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థను ఆక్రమించాయి. దీంతో యూపీఐ లావాదేవీలు కొన్ని సార్లు నిలిచిపోతున్నాయి. రూ. 100 క్యాష్బ్యాక్ చిన్న మొత్తాల్లో చేసిన యూపీఐ చెల్లింపులు కస్టమర్ల బ్యాంక్ పాస్బుక్లను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ లైట్ ద్వారా చేసే చెల్లింపులు బ్యాంక్ పాస్బుక్లో కనిపించవు. ఈ చెల్లింపులను పేటీఎం బ్యాలెన్స్, హిస్టరీ విభాగంలో చూసుకోవచ్చు. పేటీఎం యూపీఐ లైట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. యూపీఐ లైట్ సర్వీస్ను యాక్టివేట్ చేసుకునే యూజర్లకు పేటీఎం రూ. 100 క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది. ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్! నిజమేనా? -
జోరుగా పేటీఎం లావాదేవీలు.. 8.9 కోట్లకు చేరిన యూజర్ల సంఖ్య!
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తన వృద్ధిని జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ కొనసాగించింది. ఈ రెండు నెలల్లో నెలవారీ లావాదేవీలు నిర్వహించిన సగటు యూజర్ల సంఖ్య 8.9 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా మర్చంట్ల వద్ద పేటీఎం సౌండ్బాక్స్ డివైజ్ల సంఖ్య 64 లక్షలకు చేరుకుంది. వీరు నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించే చందాదారులు. ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేసిన డివైజ్ల సంఖ్య 3 లక్షలుగా నమోదైంది. వర్తకుల వద్ద చెల్లింపుల లావాదేవీలు కూడా పెరిగాయి. స్థూల మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) జనవరి, ఫిబ్రవరి నెలల్లో కలిపి రూ.2.34 లక్షల కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే 41 శాతం వృద్ధి కనిపించింది. రుణ వితరణ వ్యాపారం కూడా తన జోరును కొనసాగించింది. తన ప్లాట్ఫామ్తో ఒప్పందం చేసుకున్న రుణదాతల ద్వారా రెండు నెలల్లో రూ.8,086 కోట్లను మంజూరు చేసింది. వార్షికంగా ఇది 286 శాతం వృద్ధి కావడం గమనించొచ్చు. రెండు నెలల్లో జారీ చేసిన రుణాల సంఖ్య 79 లక్షలుగా ఉంది. చదవండి👉 పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
పేటీఎంపై సునీల్ మిట్టల్ కన్ను!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్.. డిజిటల్ చెల్లింపుల సేవల్లోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్.. పేమెంట్స్ బ్యాంక్ను పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో విలీనం చేయడం ద్వారా వాటా పొందాలనుకుంటున్నట్టు.. అలాగే, పేటీఎంలో ప్రస్తుతం వాటాలు ఉన్న ఇతరుల నుంచి కొంత కొనుగోలు చేసేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. పేమెంట్ బ్యాంకుల్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లాభాలతో నడుస్తోంది. కానీ, పేటీఎం మాత్రం నష్టాల్లో ఉన్న కంపెనీ. కాకపోతే గతేడాది రూ.2,150 ఐపీవో జారీ ధరతో పోలిస్తే పేటీఎం షేరు 75 శాతం వరకు నష్టపోయి ట్రేడ్ అవుతోంది. వ్యాల్యూషన్ల పరంగా చౌకగా ఉండడంతో భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్కు ఆసక్తి ఏర్పడినట్టు తెలుస్తోంది. -
Valentines day 2023:పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ చూశారా..!
సాక్షి,ముంబై: వాలెంటైన్ డే సందర్బంగా పేమెంట్ సంస్థ పేటీఎం లవర్స్కు వాలెంటైన్ క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రకటించింది రూ.140 దాకా క్యాష్బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ చెల్లింపుల ద్వారా ఒక్కొక్కటి మూడు చొప్పున మూడు రకాల కార్డులను అందిస్తోంది. లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంటర్టైన్మెంట్, డిన్నర్ కార్డ్ పేరుతో ఉన్న ఈ తొమ్మిది కార్డ్లను సేకరించిన తర్వాత, వినియోగదారులు రూ. 140 విలువైన 14,000 పేటీఎం క్యాష్బ్యాక్ పాయింట్లను పొందుతారు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 20 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కార్డ్లను పొందాలంటే పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు డబ్బులు స్వీకరించినా, డబ్బును బదిలీ చేసినా, మొబైల్కి రీఛార్జ్, యుటిలిటీ బిల్లులను చెల్లించినప్పుడు పాయింట్లను సంపాదించవచ్చు నన్న సంగతి తెలిసిందే. వాలెంటెన్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే పేమెంట్ తరువాత పేటీఎం క్యాష్బ్యాక్ ఆఫర్పై క్లిక్ చేయండి క్రిందికి స్క్రోల్ చేసి, 14వేల క్యాష్బ్యాక్ పాయింట్ల బ్యానర్లో ప్లే అండ్ విన్ నొక్కండి. ఇలా వచ్చిన మొత్తం 9 తొమ్మిది కార్డ్లను స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు స్నేహితులనుంచి అదనపు కార్డ్ను తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు. అన్లాక్ చేయకుంటే స్క్రాచ్ కార్డ్లు స్వీకరించిన 3 రోజుల తర్వాత పనికిరావు This Valentine's, win over love & cashback with #PaytmValentinesCashback!🤩 Send money, recharge, pay bills & more to collect cards & win up to 14000 Cashback points!* Play now to win: https://t.co/fE1siDe2Ko *Offer ends on 20th February 2023 #PaytmSeUPI — Paytm (@Paytm) February 13, 2023 -
పేటీఎమ్లో అలీబాబా వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్లో మిగిలిన ప్రత్యక్ష వాటాను సైతం చైనీస్ కంపెనీ అలీబాబా తాజాగా విక్రయించింది. పేటీఎమ్ బ్రాండుతో సర్వీసులందించే వన్97లో బ్లాక్డీల్ ద్వారా 3.16 శాతం వాటాను అమ్మివేసినట్లు తెలుస్తోంది. డీల్ విలువ రూ. 1,360 కోట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో అలీబాబాకు పేటీఎమ్లో ప్రత్యక్షంగా ఎలాంటి వాటా మిగల్లేదని తెలియజేశాయి. 2022 డిసెంబర్కల్లా 6.26 శాతం ప్రత్యక్ష వాటాను కలిగి ఉన్న అలీబాబా తొలుత ఈ జనవరిలో 3.1 శాతం వాటాను విక్రయించింది. కాగా.. గ్రూప్ సంస్థ యాంట్(ఏఎన్టీ) ఫైనాన్షియల్ ద్వారా పేటీఎమ్లో 25 శాతం వాటాను అలీబాబా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్డీల్ ద్వారా శుక్రవారం(10న) మొత్తం 2.8 కోట్ల పేటీఎమ్ షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అలీబాబాతోపాటు ఇతరులు సైతం లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూ. 645–655 ధరలో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. బ్లాక్డీల్ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 8% పతనమై రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 640 వరకూ క్షీణించింది. -
పేటీఎంకు అలీబాబా షాక్: కంపెనీ నుంచి ఔట్
సాక్షి,ముంబై: చైనీస్ ఈ-కామర్స్, రిటైల్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం అలీబాబా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. One97 కమ్యూని కేషన్స్ (పేటీఎం) నుంచి పూర్తిగా నిష్క్రమించింది. బ్లాక్డీల్ ద్వారా రెండు కోట్లకు పైగా పేటీఎం షేర్లను విక్రయించింది. ఇండియా ఈకామర్స్ బిజినెస్లోకి భారీ పెట్టుబడులతో దూసుకొచ్చిన అలీబాబా (పేటీఎం)లో తన మొత్తం వాటాలను అమ్మేసింది. తాజా నివేదికల ప్రకారం బ్లాక్డీల్ ద్వారా శుక్రవారం మొత్తం 3.4 శాతం ఈక్విటీ లేదా 2.1 కోట్ల షేర్లను విక్రయించింది. జొమాటో, బిగ్బాస్కెట్ తరువాత తాజాగా అలీబాబా వాటాలను పూర్తిగి సెల్ చేసింది. ఎన్ఎస్ఈలో మొత్తం 4.73 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా చూపించింది. మొత్తం టర్నోవర్ రూ.3,097 కోట్లుగా ఉంది. రెండు వారాల సగటు 8 లక్షల షేర్లకు వ్యతిరేకంగా మొత్తం 19.61 లక్షల పేటీం షేర్లు బీఎస్ఈలో చేతులు మారాయి. ఫలితంగా పేటీఎం షేరు 7.85 శాతం తగ్గి రూ.650.75 వద్ద ముగిసింది. కాగా 2023లో ఇప్పటివరకు స్క్రిప్ 22 శాతం పెరిగింది. పేటీఎంలోని 6.26 శాతం ఈక్విటీ వాటా ఉన్న అలీబాబా జనవరిలో 3.1 శాతం విక్రయించింది. విజయ్ శేఖర్శర్మ నేతృత్వంలోని కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.778.5 కోట్ల నష్టంతో పోలిస్తే 50 శాతం తగ్గి, డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.392 కోట్లకు తగ్గించుకుంది. సాఫ్ట్బ్యాంక్ మద్దతున్న పేటీఎం ఆదాయం గత ఏడాది త్రైమాసికంలో రూ.1,456 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లను ఆర్జించింది. -
పేటీఎంతో ట్రైన్ టికెట్స్.. ఇంకా చాలా ఫీచర్స్
-
మీ ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయిందా? పేటీఎంలో చెక్ చేయండిలా!
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పేటీఎం ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్, బుకింగ్ మూవీ టికెట్స్, పలు రకాలైన సేవల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే ఫీచర్ను పేటీఎం తన యాప్లో జత చేసింది. ఐఆర్సీటీసీ భాగస్వామ్యంతో ప్రయాణికులకు ఇకపై సులభం తత్కాల్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వీటితో పాటు పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్, క్యాన్సిలేషన్పై టికెట్లపై ఇన్స్టంట్ రీఫండ్, ఫ్లాట్ ఫామ్ నెంబర్ను ట్రాక్ చేయడంతో పాటు ఐటీఆర్సీటీసీ బుకింగ్స్ సంబంధించిన అన్నీరకాల సర్వీసుల్ని యూజర్లు వినియోగించుకోవచ్చని పేటీఎం ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు మీరు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ కన్ఫామ్ లేదా అని తెలిపేలా ప్రిడిక్షన్స్ సైతం చూపిస్తుంది. అదే సమయంలో మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతానికి అదే సమయానికి ఏయే ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. ఉంటే సదరు ట్రైన్లలో సీట్లను కేటాయిస్తామని పేటీఎం హామీ ఇచ్చింది. ఐఆర్సీటీసీ ప్రయాణికులు సైతం పేటీఎం యాప్లో సమీప రైల్వే స్టేషన్లను, ట్రైన్ టికెట్లపై పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ట్రైన్ సమయపాలనలో అంతరాయం ఉంటే ముందే చెప్పేస్తుంది. 24*7 పేటీఎం యాప్లో 10 లాంగ్వేజ్లలో సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణికులకు అనుగుణంగా వారికి కావాల్సిన విధంగా టికెట్ ధరల్ని అందిస్తుంది. పేటీఎంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? 👉యాప్ లో పేటీఎంలోకి లాగిన్ అవ్వండి లేదా paytm.com/train-tickets సందర్శించండి 👉మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి 👉ఆ తర్వాత జర్నీ డేట్ ఎంటర్ చేసి ఏయే ట్రైన్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు సెర్చ్ ఆప్షన్పై ట్యాప్ చేయండి. 👉ఇప్పుడు మీ ట్రైన్, అందులో సీటు సదుపాయం ఉందో లేదో చెక్ చేసుకొని మీకు కావాల్సిన సీటు, తరగతి, తేదీని ఎంపిక చేసుకోవాలి. 👉టికెట్లు బుక్ చేసుకోవడానికి బుక్ బటన్ మీద క్లిక్ చేసి, మీ ఐఆర్సీటీసీ లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి. 👉మీకు లాగిన్ ఐడీ లేకపోతే ‘సైన్ అప్ విత్ ఐఆర్సీటీసీ’ ఆప్షన్పై ట్యాప్ చేయడం లేదా, ఐఆర్సీటీసీ ఫర్ గెట్ పాస్వర్డ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఐఆర్సీటీసీ ఐడీని రీసెట్ చేసుకోవచ్చు. 👉తరువాత, ట్రైన్ వివరాల్ని జత చేసి ‘బుక్’ ఆప్షన్మీద ట్యాప్ చేయండి. 👉ఇప్పుడు మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు చెల్లించండి. 👉మీ బుకింగ్ పూర్తి చేయడానికి ఐఆర్సీటీసీ వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. 👉ధృవీకరించడానికి పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి 👉టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేటీఎం మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి మీ టికెట్ల ఇమెయిల్ కూడా పంపుతుంది. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
హైదరాబాద్లో భారత్- న్యూజిలాండ్ తొలి వన్డే.. ఆన్లైన్లో టికెట్స్
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జనవరి18న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేకు సంబంధించిన టికెట్లను పేటీఎంలో అందుబాటులో ఉంచినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తెలిపింది. ఓవరాల్గా 29 వేల టికెట్స్ను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు హెచ్సీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే తొలి రోజు (జనవరి13) కేవలం 6వేల టికెట్స్ను మాత్రమే హెచ్సీఎ అందుబాటులో ఉంచింది. ఈ నెల 16 వరకు ఆన్లైన్లో టికెట్స్ను బుక్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారు క్యూ ఆర్ కోడ్ చూపించి ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని హెచ్సీఏ అధికారులు తెలిపారు. కాగా ఫిజికల్ టికెట్లు జనవరి 15 నుంచి 18 వరకు పొందవచ్చు. కాగా గతేడాది జింఖానా గ్రౌండ్లో టికెట్లు కోసం జరిగిన తొక్కిసలాట ను దృష్టిలో పెట్టుకున్న హెచ్సీఎ ఈసారి మొత్తం టికెట్లను ఆన్లైన్లోనే విక్రయించనుంది. చదవండి: మహిళా క్రికెటర్ అనుమానస్పద మృతి.. అడవిలో మృతదేహం! -
పేటీఎంలో ఆలీబాబా వాటాల విక్రయం
న్యూఢిల్లీ: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ దాదాపు 3 శాతం వాటాలను విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 1,031 కోట్లు. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ డేటా ప్రకారం ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ 1.92 కోట్ల షేర్లను (సుమారు 2.95 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 536.95 రేటుకి విక్రయించింది. దీనితో వన్97లో ఆలీబాబా మొత్తం వాటాలు 31.14 శాతం నుంచి 28.19 శాతానికి తగ్గాయి. గురువారం పేటీఎం షేర్లు 6 శాతం క్షీణించి రూ. 543.50 వద్ద ముగిశాయి. పేటీఎం రుణ వృద్ధి 4 రెట్లు కాగా, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనితో డిసెంబర్ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్ క్యాపిటల్, పిరమల్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. -
జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న పేటీఎం.. ఏకంగా నాలుగు రెట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనితో డిసెంబర్ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్ క్యాపిటల్, పిరమల్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. చదవండి: నాలుగేళ్ల జీతం బోనస్ బొనాంజా: ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ? -
పేటీఎం యూజర్లకు బంపరాఫర్
హైదరాబాద్: చెల్లింపులు, ఆర్థిక సేవల్లోని ప్రముఖ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) ఫ్లయిట్ టికెట్ బుకింగ్లపై తగ్గింపులను ప్రకటించింది. దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి టికెట్ బుకింగ్లపై, కొత్త కస్టమర్లకే ఈ డిస్కౌంట్ ఆఫర్లు పరిమితమని పేటీఎం తెలిపింది. విస్తార, స్పైస్జెట్, ఎయిరేషియా, గోఫస్ట్, ఇండిగో, ఎయిర్ ఇండియా దేశీ సర్వీసులపై ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. మొదటి ఫ్లయిట్ టికెట్ బుకింగ్పై 14 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ.1,000కి పరిమితం అవుతుంది. కనీస ఆర్డర్ విలువ వంటి షరతు లేదు. యూజర్లు టికెట్లను రద్దు చేసుకుంటే నూరు శాతం రిఫండ్ వచ్చే రక్షణ ఉంటుందని పేటీఎం తెలిపింది. -
ఫోన్పే,గూగుల్పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్, అంతకు మించితే!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రాకతో నగదు భారత్లోని చెల్లింపుల వ్యవస్థనే మార్చివేయడమే కాదు ఈ విభాగంలో సరికొత్త విప్లవానికి దారితీసింది. అందుకే ఇటీవల ఎక్కువగా ఉపయోగించే రోజువారీ చెల్లింపు పద్ధతిగా మారింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు పద్ధతి దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉంది. దీని రాకతో బయటకు వెళ్లే సమయంలో ప్రజలు నగదు లేదా వాలెట్ను మోసుకెళ్లే భారం తప్పిందనే చెప్పాలి.. కేవలం జేబులో స్మార్ట్ఫోన్ అందులో గూగుల్ పే (Google Pay), ఫోన్పే (PhonePe), పేటీఎం (Paytm), అమెజాన్ పే (Amazon Pay) వంటి వివిధ యాప్ల ఉంటే బ్యాంక్ ఖాతా, యూపీఐ, ఈ యాప్లు ఉండే ఎవరికైనా చిటికెలో నగదు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. మీ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే మొత్తంపై పరిమితి ఉందని మీకు తెలుసా? యూపీఐ చెల్లింపులు.. లిమిట్ ఇదే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, ఒక వినియోగదారుడు ఒక రోజులో యూపీఐ ద్వారా రూ. 1 లక్ష వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. ఇది కాకుండా, మీరు ఒక రోజులో యూపీఐ ద్వారా డబ్బులు బదిలీ చేయాలంటే అది మీ బ్యాంక్, మీరు ఉపయోగిస్తున్న యాప్పై ఆధారపడి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం! గూగుల్పే గూగుల్ పే (Google Pay) లేదా జీపే (GPay) వినియోగదారులు యూపీఐ (UPI) ద్వారా ఒక్క రోజులో రూ. 1 లక్ష కంటే ఎక్కువ చెల్లింపులు చేయలేరు. ఇది కాకుండా, యాప్ వినియోగదారులను ఒక రోజులో 10 కంటే ఎక్కువ లావాదేవీలు కూడా చేసేందుకు అనుమతి ఉండదు. దీనర్థం జీ పే యూజర్లు ఒకే సారి ఒక లక్ష రుపాయల లావాదేవీ లేదా వివిధ మొత్తాలలో 10 లావాదేవీల వరకు చేయవచ్చు. ఆపై ఈ యాప్ నుంచి పేమెంట్స్ చేయలేము. పేటీఎం ఎన్పీసీఐ (NPCI) ప్రకారం, పేటీఎం ( Paytm )కూడా ఒక రోజులో రూ. 1 లక్ష వరకు మాత్రమే చెల్లింపును అనుమతిస్తుంది. కాకపోతే యూపీఐ చెల్లింపుల విషయంలో పేటీఎంకి ఎలాంటి పరిమితి లేదు. ఫోన్పే ఫోన్పే (PhonePe) గూగుల్ పే (Google Pay) తరహాలోనే ఒక రోజుకు చెల్లింపు పరిమితి రూ. 1 లక్ష ఉంటుంది. అయితే ఇందులో ఒక రోజులో 10 లావాదేవీలు మాత్రమే చేయాలనే పరిమితి లేదు. ఒక రోజులో రూ.లక్ష విలువ మించకుండా వినియోగదారులు ఎన్ని పేమెంట్స్ అయినా చేసుకోవచ్చు. అమెజాన్ పే అమేజాన్ పే (Amazon Pay) UPI ద్వారా రూ. 1 లక్ష వరకు చెల్లింపులు చేయవచ్చు. లేదా ఒక రోజులో 20 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. కొత్త కస్టమర్లు మొదటి 24 గంటల్లో రూ. 5,000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
పేటీఎంపై రూ.30కే రూ.10వేల కవరేజీ
ముంబై: పేటీఎం పేరిట చెల్లింపులు, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సహా సమగ్ర ఆర్థిక సేవల్లోని వన్97 కమ్యూనికేషన్స్.. హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ‘పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్’ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది గ్రూపు ఇన్సూరెన్స్ ప్లాన్. యూపీఐ ద్వారా యాప్లు, వ్యాలెట్ల నుంచి నిర్వహించే అన్ని రకాల లావాదేవీలకు ఇది రక్షణ కల్పిస్తుందని పేటీఎం తెలిపింది. ఏడాదికి కేవలం రూ.30 చెల్లించడం ద్వారా.. రూ.10,000 వరకు కవరేజీ పొందొచ్చని పేర్కొంది. యూపీఐ లావాదేవీల్లో మోసాల వల్ల నష్టపోయిన వారికి ఈ ప్లాన్ కింద గరిష్టంగా రూ.10వేల పరిహారం లభించనుంది. త్వరలోనే ఇదే ప్లాన్ కింద రూ.లక్ష వరకు రక్షణ కవరేజీని ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. పరిశ్రమలో ఈ తరహా ఉత్పత్తి ఇదే మొదటిది అని, డిజిటల్ చెల్లింపుల పట్ల నమ్మకాన్ని పెంచడంతోపాటు, డిజిటల్ చెల్లింపులను మరింత మందికి చేరువ చేయడం ఈ ఉత్పత్తి లక్ష్యమని పేర్కొంది. -
పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో!
ఓ కాలేజీ కుర్రాడికి మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఆ ఆలోచనకు సృజనాత్మకతను జోడించాడు. ఎంతో కష్టపడి పనిచేశాడు. అంతే ఆ బిజినెస్ పెద్ద హిట్ అయ్యింది. ఇదిగో సక్సెస్ అయిన ప్రతి కంపెనీ గురించి విన్నా, లేదంటే ఎవరైనా చెప్పినా..క్రియేటీవ్ థాట్స్ ఉండాలి. ఎవరూ స్టార్ట్ చేయని బిజినెస్ నేను స్టార్ట్ చేస్తే 100 శాతం అది క్లిక్ అవుతుంది’ అని చాలా మంది నమ్ముతారు. కానీ అది కరెక్ట్ కాదని అంటున్నారు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ. నిత్యం మనంరోజూ వారి జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపించే బిజినెస్ ఐడియాతో వందల కోట్లు సంపాదించవచ్చని చెబుతున్నారు. అలాగే తనకు ఎదురైన ఓ సమస్యతో పేటీఎం బిజినెస్ను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఓ సమావేశంలో వెల్లడించారు. పేటీఎంకు చిన్న సైజు ఏటీఎం పేటీఎం లాంటి యూపీఐ పేమెంట్స్ యాప్స్ వచ్చినప్పుడు వాటిని నమ్మడం చాలా కష్టమైంది. ఆ తర్వాత ఫోన్ పే, గూగుల్ పేలాంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక పేటీఎం అప్ అండ్ డౌన్స్ గురించి వినే ఉంటున్నాం. వాటిల్లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే? మనం కిరాణా షాపులు, పాన్ షాపుల్లోకి వెళితే ఓ డబ్బా నుంచి రిసీవ్డ్ అమౌంట్ ఆఫ్ సో అండ్ సో అనే ఆడియో వినపడుతుంది కదా. అది బ్రాండింగ్ కోసం పెట్టారని అనుకుంటాం. కానీ అది బ్రాండింగ్ కోసం పెట్టిన బాక్స్ కాదు. పేటీఎంకు కోట్లు కురిపించే ఓ చిన్న సైజ్ ఏటీఎం. గేమ్ ఛేంజర్ సౌండ్ బాక్స్ ఫిన్ టెక్ కంపెనీల్లో సౌండ్ బాక్స్ అనేది ఓ గేమ్ ఛేంజర్. ముఖ్యంగా షాపుల్లో రద్దీగా ఉన్న సమయంలో యజమానికి కస్టమర్ ఎంత చెల్లించారో చెప్పేలా అన్నీ స్థానిక భాషల్లో అలెర్ట్ ఇస్తుంది. అయితే ఆ సౌండ్ బాక్స్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉందని మీకు తెలుసా. పాలబూత్లో చేదు అనుభవం పేటీఎం సౌండ్బాక్స్ పై విజయ్ శేఖర్ శర్మ తన వ్యక్తిగతంగా ఎదురైన అనుభవం నుంచి ఐడియా పుట్టింది. ముంబైలోని గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో మాట్లాడుతూ.. విజయ్ ఈ గేమ్ ఛేంజర్ ఇన్నోవేషన్ గురించి స్పందించారు. తన ఇంటి సమీపంలో ఉన్న పాల బూత్లో పాల ప్యాకెట్ కొనేందుకు వెళ్లారు. పాల బూత్లో పాల ప్యాకెట్ కొన్నారు. పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్ చేశారు. కానీ పేమెంట్ చేసినట్లు మెసేజ్ రాకపోవడంతో సదరు షాపు యజమాని విజయ్ శేఖర్ శర్మని అడ్డగించాడు. పాల ప్యాకెట్కు డబ్బులు చెల్లించకుండా వెళతున్నారని అన్నారు. దీంతో కంగుతిన్న పేటీఎం సీఈవో సదరు పాల బూత్ యజమానిని ఫోన్ చూసుకోండి. పేమెంట్ చేశానని చెప్పారు. కానీ సదరు పాల వ్యాపారి ఫోన్ మెసేజ్ ఇన్ బాక్స్ నిండిపోవడంతో పేటీఎం సీఈవో చేసిన పేమెంట్ మెసేజ్ అలెర్ట్ రాలేదు. దీంతో మెసేజ్ ఇన్బాక్స్లో కొన్ని మెసేజ్లు డిలీట్ చేయడంతో విజయ్ శేఖర్ శర్మ పాల ప్యాకెట్కు పేమెంట్ చేసినట్లు మెసేజ్ వచ్చింది. అదిగో అప్పుడే పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. వాట్ ఏన్ ఐడియా సర్జీ పాల బూత్లో తనకు ఎదురైన సమస్యను పరిష్కరించాలని అనుకున్నారు. కస్టమర్లు పేమెంట్ చేసిన వెంటనే సౌండ్ అలర్ట్ వచ్చేలా వ్యాపారి, కస్టమర్ కు అనుసంధానం చేస్తూ ఓ డివైజ్ ను తయారు చేస్తే ఎలా ఉంటుందోనని అని ఆలోచించారు. అనేక తర్జన బర్జనల తర్వాత వచ్చిందే ఈ పేటీఎం సౌండ్ బాక్స్ ఐడియా. అలా పాల ప్యాకెట్ (పరోక్షంగా) తెచ్చిన అదృష్టంతో పేటీఎం సీఈవో వందల కోట్లు సంపాదించడం నిజంగా ఆశ్చర్యమే కదా. వందల కోట్లు సంపాదన ఎలా? కిరాణా స్టోర్లో పేటీఎం సౌండ్ బాక్స్ పెట్టుకుంటే నెలకు రూ.125 రెంట్ కట్టాల్సి ఉంది. ఆ లెక్కన మొత్తం మన దేశంలో 2.1 మిలియన్ల మంది ఆ సౌండ్ బాక్స్ వినియోగిస్తుంటే యావరజ్గా రూ.125 చెల్లిస్తే.. నెలకు వందల కోట్లు అర్జిస్తున్నట్లే కదా. -
వాట్సాప్కు మరో భారీ షాక్..పేమెంట్స్ హెడ్ గుడ్బై!
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు భారీ షాక్ తగిలింది. వాట్సాప్లో చేరిన నాలుగు నెలల్లోనే వాట్సాప్ పే హెడ్ వినయ్ చొలెట్టి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్కు గల కారణాలేంటనేది స్పష్టతలేదు. అయితే వినయ్ వాట్సాప్ పేమెంట్స్ హెడ్ మనేశ్ మహేత్మే నిష్క్రమణతో వాట్సాప్ పే బాధ్యతలను ఈ ఏడాది సెప్టెంబర్లో వినయ్ అందుకున్నారు. అనూహ్యంగా నాలుగు నెలలకే తన పదవి నుంచి వైదొలిగడం ఆసక్తికరంగా మారింది. వాట్సాప్ పే అసాధారణం వాట్సాప్ పేకు రాజీనామా చేసిన వినయ్ తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించలేదు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్ని అసాధారణంగా మార్చగల శక్తి వాట్సాప్కి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాబోయే సంవత్సరాల్లో దాని సామర్థం ప్రపంచానికి చాటి చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను’ అని పోస్ట్లో పేర్కొన్నారు. మరోవైపు భారత్లో వాట్సాప్ యూపీఐ పేమెంట్స్ ఆశించినంత స్థాయిలో లేదనేది మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్ను వినియోగిస్తున్నారు. కానీ వాట్సాప్పే ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంది. మిగిలిన యూపీఐ లావాదేవీలు నిర్వహించే ఫోన్ పే 47.2 శాతం, గూగుల్ పే 34.2 శాతం దూసుకెళ్తుండగా.. వాట్సాప్ పేమెంట్స్ మాత్రం 0.1 ఆ స్థాయిలో వినియోగదారుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. -
గుడ్న్యూస్: గ్యాస్ సిలిండర్ బుకింగ్పై 4 ఆఫర్లు, రూ.1000 వరకు తగ్గింపు!
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్న్యూస్. సిలిండర్ బుకింగ్పై మీకోసం పలు రకాల ఆఫర్లను తీసుకొచ్చింది ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm). ఈ యాప్ను ఉపయోగించి ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ద్వారా రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్పై 4 రకాల ఆఫర్లను ప్రవేశపెట్టింది పేటీఎం. వీటిని ఉపయోగించి కస్టమర్లు రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. అనగా రూ. 5 నుంచి రూ. 1000 వరకు మధ్యలో ఎంతైనా రావొచ్చు. ఈ ఆఫర్లను పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం! మొదటి క్యాష్బ్యాక్ ఆఫర్ కోసం ప్రోమోకోడ్ GAS1000. ఈ ప్రోమోకోడ్ని ఉపయోగించి కస్టమర్ రూ.5 నుంచి రూ.1000 వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. సిలిండర్ బుకింగ్ సమయంలో ఈ ప్రోమో కోడ్ వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా FREEGAS ప్రోమోకోడ్తో గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్న ప్రతి 500వ వినియోగదారునికి రూ. 1000 వరకు క్యాష్బ్యాక్ అందుకోవచ్చు. ఏయూ క్రెడిట్ కార్డ్తో (AU Credit card) సిలిండర్ను చెల్లింపుపై పేటీఎం రూ.50 వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ ఆఫర్ ప్రోమోకోడ్ AUCC50. వీటితో పాటు యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో (YES Bank Credit Card) గ్యాస్ సిలిండర్ చెల్లింపుపై రూ.30 తగ్గింపు లభిస్తుంది. దీని కోసం బుకింగ్ చేసేటప్పుడు GASYESCC ప్రోమోకోడ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా వీటి ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత మీకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. కాగా ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే ఉండే అవకాశం ఉంది. చదవండి భారత్లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు రూ. 850 కోట్లవరకూ వెచ్చించనుంది. షేరుకి రూ. 810 ధర మించకుండా ఓపెన్ మార్కెట్ ద్వారా 10.5 మిలియన్ల సొంత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు ‘పేటీఎమ్’ బ్రాండ్ కంపెనీ తాజాగా వెల్లడించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఆరు నెలల్లోపు బైబ్యాక్ను పూర్తిచేయగలమని భావిస్తున్నట్లు తెలియజేసింది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! మంగళవారం(13న) సమావేశమైన బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనను అనుమతించినట్లు పేర్కొంది. స్వతంత్ర డైరెక్టర్లతోపాటు బోర్డు మొత్తం ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 538 వద్ద ముగిసింది. -
పేటీఎం జోరు.. నాలుగింతలు పైకి, ఏకంగా రూ. 6,292 కోట్లు
డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎం నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా రూ.6,292 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రుణాలు నాలుగింతలు అయ్యాయి. గత నెలలో రుణాలు అందుకున్న వారి సంఖ్య 27 లక్షల నుంచి 68 లక్షలకు ఎగసింది. అక్టోబర్–నవంబరులో రూ.2.28 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు పేటీఎం వేదిక ద్వారా జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ రెండు నెలల్లో లావాదేవీలు జరిపిన సగటు వినియోగదార్ల సంఖ్య 33 శాతం అధికమై 8.4 కోట్లకు చేరింది. డిజిటల్ రూపంలో నగదును స్వీకరించే పేటీఎం వర్తకుల సంఖ్య 55 లక్షలు ఉంది. చదవండి ‘మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా’..పిచాయ్ వార్నింగ్..ఆందోళనలో గూగుల్ ఉద్యోగులు! -
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
Viral Video: నగదు లేకున్నా పర్లేదు పేటీఎం చెయి! ఉద్యోగికి షాకిచ్చిన కోర్టు
ప్రపంచమంతా డిజిటల్మయమవడంతో ‘చిల్లర’కు కొరత ఏర్పడింది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఎంత మొత్తమైనా ఆన్లైన్లో చెల్లించేస్తున్నారు చాలామంది. మామూలుగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేక సేవలు పొందినప్పుడు డబ్బులు ఆన్లైన్ చెల్లింపు యాప్ల ద్వారా చేయడం తెలిసిందే. కానీ, ‘మామూలు’ కూడా ఆన్లైన్గా మారడం ఇక్కడ ప్రత్యేకం. అలహాబాద్ హైకోర్టులో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైకోర్టుకు పనుల నిమిత్తం వచ్చే లాయర్ల వద్ద అక్కడ పనిచేసే జమాదార్ (బండిల్స్ ఎత్తేవాడు) ‘టిప్పు’ వసూలు చేసేవాడు. అయితే, ఇటీవల కాలంలో చాలామంది చెల్లింపులు ఆన్లోనే చేస్తున్నారు. అందువల్ల చిన్న నోట్ల కరెన్సీకి కొరత ఏర్పడింది. దీంతో జమాదార్ రాజేంద్ర కుమార్ ఆన్లైన్ సేవలను వాడుకోవాలనుకున్నాడు. నగదు లేకుంటే పేటీఎం ద్వారా చెల్లించినా సరేనంటూ వాళ్లకు ఆఫర్ ఇచ్చాడు. అంతేకాకుండా పేటీఎం క్యూ ఆర్ కోడ్ను ఏకంగా యూనిఫారంకు తగిలించుకుని కోర్టు విధులకు హాజరయ్యాడు. కానీ, ఈ తతంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగుచూసింది. రాజేంద్ర కుమార్పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టగా విషయం నిజమేనని తేలింది. దీంతో రాజేంద్ర కుమార్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సాధారణంగా కేసులో విజయం సాధించిన లాయర్లు జమాదార్కు కొంత చిల్లర టిప్పుగా ఇస్తారని కొందరు హైకోర్టు ఉద్యోగులు చెప్పుకొచ్చారు. కానీ, రాజేంద్ర కుమార్ కోర్టు పరిసరాల్లో, అది కూడా యూనిఫాంకు పేటీఎం స్టికర్ను అంటించుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. (చదవండి: వీడియో కాల్తో విపత్తు.. ఫోన్ లిఫ్ట్ చేశామో పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి..) -
పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్పై తగ్గింపు!
దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు శుభవార్త చెప్పింది. భారత్ గ్యాస్ (Bharatgas), ఇండేన్ (Indane), హెచ్పీ( HP) సంస్థల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్లపై అద్భుతమైన క్యాష్బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది పేటీఎం. వినియోగదారులు మొదటి గ్యాస్ బుకింగ్పై ఫ్లాట్ రూ. 15 క్యాష్బ్యాక్, అదే Paytm వాలెట్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేస్తే రూ. 50 వరకు క్యాష్బ్యాక్ను అందిస్తోంది. వీటితో పాటు అదనంగా, యూజర్లు తమ బుకింగ్ను ట్రాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఈ ఆఫర్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ వర్తిస్తుందని ప్రకటించింది. కొత్త వినియోగదారులు రూ. 15 క్యాష్బ్యాక్ పొందడానికి "FIRSTGAS" కోడ్, పేటీఎం వాలెట్ని ఉపయోగించి సిలిండర్ల బుకింగ్ చేసే యూజర్లు "WALLET50GAS" కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, మొదటి బుకింగ్ తర్వాత, యాప్ బుకింగ్ వివరాలను కూడా సేవ్ చేస్తుంది, తద్వారా తదుపరి బుకింగ్ కోసం యూజర్లు 17-అంకెల ఎల్పీజీ ఐడీ(LPG ID) తదితర వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుకింగ్ ప్రక్రియ పూర్తవగానే మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు 2-3 రోజుల్లో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ ద్వారా డెలివరీ చేస్తుంది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
పేటీఎంకు ఆర్బీఐ భారీ షాక్
ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. పేమెంట్ ఆగ్రిగేటర్ సర్వీసుల కోసం కొత్తగా లైసెన్స్ అప్లయ్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించినట్లు పేటీఎం తన రెగ్యులరేటరీ ఫైలింగ్లో తెలిపింది. పేటీఎం బ్రాండ్తో వన్97 కమ్యూనికేషన్స్ చెల్లింపు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 2020లో పేమెంట్ ఆగ్రిగేటర్ సర్వీసుల్ని పేటీఎం పేమెంట్స్ సర్వీస్కు (పీపీఎస్ఎల్)కు బదిలి చేయాలని ఆర్బీఐని కోరింది. అందుకు సంబంధిత డాక్యుమెంట్లను 2021లో సబ్మిట్ చేసింది. ఆ డాక్యుమెంట్లపై ఆర్బీఐ తాజాగా స్పందించింది. Update: Our 100% subsidiary, Paytm Payments Services Limited will be resubmitting application to RBI for authorization to provide payment aggregator services for online merchants. This has no material impact on our business and revenues. More details: https://t.co/TXh2ABvdBH — Paytm (@Paytm) November 25, 2022 పేటీఎం బదిలీ అనుమతి పొందాలంటే వన్ 97 కమ్యూనికేషన్ గతంలో పెట్టిన పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్డీఐ) చట్టాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. అప్పటి వరకు అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది. దీనిపై పేటీఎం స్పందించింది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తమ వ్యాపారంపై పెద్దగా ప్రభావం ఉండబోదని పేర్కొంది. -
షాకింగ్: గూగుల్ పే, పోన్పేలాంటి యాప్స్లో ఇక ఆ లావాదేవీలకు చెక్?
సాక్షి,ముంబై: డిజిటల్ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని భావిస్తున్నారు. త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం. యూపీఐ డిజిటల్ సిస్టమ్లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాల్యూమ్ క్యాప్ను పరిమితం చేయనుంది. ఈ మేరకు వాల్యూమ్ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై రిజర్వ్ బ్యాంక్తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలని ఇప్పటికే ఫోన్పే అభ్యర్థించింది. మరికొందరైతే ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్ల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్పే మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
నష్టాల్లో పేటీఎం..లక్ష కోట్లు హాంఫట్!
ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం భారీగా నష్టపోతుంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ మంగళవారం స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.476.65లతో ఆల్టైం కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.477.1 వద్ద నిలిచింది. గత సెషన్తో పోలిస్తే 11 శాతానికి పైగా పేటీఎం షేర్ పతనమైంది. దీంతో గతేడాది నవంబర్18న స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ కేపిటల్ వ్యాల్యూని పోగొట్టుకుంది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం నాటికి రూ.30,971 కోట్లగా ఉంది. -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్: ఈ విషయం తెలుసా మీకు?
సాక్షి,ముంబై: దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం వినియోగదారులు యూపీఐ ద్వారా ఏ మొబైల్ నంబరుకైనా డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. అంతేకాదు రిసీవర్ పేటీఎంలో రిజిస్టర్ కాక పోయినా కూడా వారి యూపీఐ ఐడీద్వారా ఏదైనా మొబైల్ నంబర్కు డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించ వచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్డ్ UPI IDతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సార్వత్రిక డేటాబేస్ను యాక్సెస్కు, యూపీఎల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టు తెలిపింది. (వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!) పేటీఎం యూపీఐ ద్వారా నగదు ఎలా పంపాలి ♦ Paytm యాప్లోని ‘UPI మనీ ట్రాన్స్ఫర్’ విభాగంలో, ‘ టూ UPI యాప్స్’ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ♦ ఇక్కడ మొబైల్ నంబర్ను నమోదు చే గ్రహీత మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. ♦ నగదును నమోదు చేసి, తక్షణ నగదు బదిలీ కోసం ‘పే నౌ ’ బటన్ క్లిక్ చేయాలి. యూపీఐ నెట్ వర్క్ ఇదొక కీలక పరిణామామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపింది. ఇది తమ వినియోగదారులుమ రింత మంది వినియోగదారులు ఏదైనా UPI యాప్ ద్వారా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుందని, అంతరాయం లేని, సురక్షితమైన చెల్లింపులకవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిపారు. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) కాగా ఎన్పీసీఐ తాజా నివేదిక ప్రకారం, పేటీఎం లబ్ధిదారు బ్యాంకుగా PPBL 1,614 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది, రెమిటర్ బ్యాంక్గా, అక్టోబర్ 2022లో 362 మిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది.అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ UPI లావాదేవీల పరిమాణంలో అతిపెద్ద లబ్ధిదారుల బ్యాంక్గా టాప్లో ఉంది. అక్టోబర్ 2022లో 1,614 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కంపెనీ పేర్కొంది. -
పేటీఎం ట్రావెల్ సేల్
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) ‘ట్రావెల్ సేల్’ను ప్రకటించింది. 18వ తేదీ వరకు ఈ సేల్ అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి పలు ఆఫర్లు ప్రకటించింది. గోఫస్ట్, విస్తారా, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టికెట్లపై 18 శాతం, ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టికెట్లపై 12 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్, అమెక్స్ కార్డ్లతో చెల్లింపులు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ పొందొచ్చని సూచించింది. విద్యార్థులు, వృద్ధులు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక ఆఫర్లను సైతం ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్వీనియన్స్ ఫీజు చెల్లించే పని లేదని తెలిపింది. చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా! -
సాఫ్ట్బ్యాంక్.. పేటీఎం వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో 4.5 శాతం వాటా విక్రయానికి సాఫ్ట్బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. బ్లాక్డీల్ ద్వారా ఈ వాటాను 20 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 1,627 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ ద్వారా పేటీఎంలో సాఫ్ట్బ్యాంక్ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. షేరుకి రూ. 555–601.55 ధరల శ్రేణిలో వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. పేటీఎమ్ ఐపీవో తదుపరి లాకిన్ గడువు ముగియడంతో సాఫ్ట్బ్యాక్ వాటా విక్రయ సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షేరు పతనం బీఎస్ఈలో పేటీఎం షేరు బుధవారం(16న) 4 శాతం పతనమై రూ. 601.55 వద్ద ముగిసింది. ఈ ధరలో షేర్లను విక్రయిస్తే సాఫ్ట్బ్యాంక్కు 21.5 కోట్ల డాలర్లు లభిస్తాయి. 2017 చివరి త్రైమాసికంలో సాఫ్ట్బ్యాంక్ 160 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి ఐపీవోలో 22 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీని విక్రయించింది. పేటీఎమ్లో ప్రస్తుత సాఫ్ట్బ్యాంక్ వాటా విలువ 83.5 కోట్ల డాలర్లుగా లెక్కతేలుతోంది! చదవండి: భారత్లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
లాభాలను చేరుకునే మార్గంలోనే పేటీఎం
న్యూఢిల్లీ: పేటీఎం పేరుతో డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలను అందించే వన్97 కమ్యూనికేషన్స్.. లాభాలు, సానుకూల నగదు ప్రవాహాలను నమోదు చేసేందుకు సరైన మార్గంలోనే ప్రయాణం చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వాటాదారులకు ఒక లేఖ రాశారు. తద్వారా సంస్థ భవిష్యత్తు పనితీరుపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. అక్టోబర్ నెలలకు సంబంధించి పనితీరు గణాంకాలను తెలియజేశారు. దేశంలో ఎంతో అధిక డిమాండ్ ఉన్న రుణ వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్టు చెప్పారు. ‘‘ఏడాది క్రితం పబ్లిక్ మార్కెట్ (ఐపీవో, లిస్టింగ్)కు వచ్చాం. పేటీఎం విషయంలో ఉన్న అంచనాలపై మాకు అవగాహన ఉంది. లాభదాయకత, మిగులు నగదు ప్రవాహాల నమోదు దిశగా కంపెనీ సరైన మార్గంలో వెళుతోంది. మరింత విస్తరించతగిన, లాభదాయక ఆర్థిక సేవల వ్యాపారం ఇప్పుడే మొదలైంది’’అని తన లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ త్రైమాసికానికి పేటీఎం రూ.571 కోట్ల నష్టాలను ప్రకటించడం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రయాణంపై ఎంతో ఆసక్తి ఉందంటూ, ఎబిట్డా లాభం, ఫ్రీక్యాష్ ఫ్లో సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ‘‘మన దేశంలో రుణాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. తక్కువ మందికే రుణ సదుపాయం చేరువ కావడం, రుణ వ్యాపారంలో ఉన్న కాంపౌండింగ్ స్వభావం దృష్ట్యా, దీనిపై మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం’’అని శర్మ తెలిపారు. -
మార్కెట్లో న్యూఏజ్ టెక్ షేర్ల వెల్లువ.. జాబితాలో పేటీఎం, జొమాటో, నైకా
గత కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలకు వచ్చి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన పలు కొత్తతరం(న్యూఏజ్) టెక్ కంపెనీల షేర్లు కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ఐపీవోకు ముందు కంపెనీలో ఇన్వెస్ట్చేసిన సంస్థల షేర్లపై లాకిన్ గడువు తీరనుండటం కారణమవుతోంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవోకు ముందు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లేదా 20 శాతానికి మించిన ప్రమోటర్ల వాటాకు లాకిన్ గడువును ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వివరాలు చూద్దాం.. గతేడాది నవంబర్ మొదలు ఈ ఏడాది మే నెలవరకూ పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన పలు న్యూఏజ్, ఫిన్టెక్ కంపెనీలు, స్టార్టప్ల షేర్లకు లాకిన్ గడువు ఈ నెలలో ముగియనుంది. 12 నెలల నుంచి 6 నెలల గడువు తీరనుండటమే దీనికి కారణం. నేటి నుంచి క్యాంపస్ యాక్టివ్వేర్ షేర్లు అందుబాటులోకి రానుండగా.. ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ షేర్లకు రేపు(10న) లాకిన్ గడువు తీరనుంది. ఈ జాబితాలో ఫినో పేమెంట్స్ బ్యాంక్(12న), పీబీ ఫిన్టెక్(15న), పేటీఎమ్, శాఫైర్ ఫుడ్స్(18న), డెల్హివరీ(24న), టార్సన్ ప్రొడక్ట్స్(26న) పారదీప్ ఫాస్ఫేట్స్(27న), గో ఫ్యాషన్ ఇండియా(30న) తదితరాలున్నాయి. దీంతో ఈ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలను తాకనున్నాయి. వెరసి పలు కంపెనీల కౌంటర్లలో అందుబాటులోని ఈక్విటీ ఒక్కసారిగా పెరగనుంది. అయితే నైకా, రెయిన్బో చిల్డ్రన్స్, క్యాంపస్ యాక్టివ్వేర్, శాఫైర్ ఫుడ్స్, గోకలర్స్ తదితర కొన్ని కౌంటర్లు ఐపీవో ధరతో పోలిస్తే భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐపీవోకు ముందు ఇన్వెస్ట్చేసిన సంస్థలు ఆయా షేర్లను విక్రయించేందుకు ఆసక్తి చూపేదీ లేనిదీ వేచి చూడవలసి ఉన్నట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. జొమాటో ఎఫెక్ట్ ఈ ఏడాది జులైలో లాకిన్ గడువు ముగిసిన వెంటనే జొమాటో షేర్లు జులైలో 22 శాతం పతనంకావడం గమనార్హం. ప్రీఐపీవో ఇన్వెస్టర్లు ఉబర్, టైగర్ గ్లోబల్ తదితరాలు షేర్లను విక్రయించడం ప్రభావం చూపింది. ఒక అంచనా ప్రకారం 14 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,15,000 కోట్లు) విలువైన షేర్లకు లాకిన్ గడువు తీరనుంది. వీటిలో నైకా 31.9 కోట్ల షేర్లు, పాలసీ బజార్ 2.8 కోట్ల షేర్లు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. దీంతో పలు కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పేటీఎమ్ షేరు ఐపీవో ధరతో పోలిస్తే 70 శాతం పతనంకాగా.. గత నెల రోజుల్లోనే డెల్హివరీ 35 శాతం, పీబీ ఫిన్టెక్ 26 శాతం, ఫినో పేమెంట్స్ బ్యాంక్ 21 శాతం చొప్పున డీలా పడ్డాయి. చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
పేటీఎంకు భారీ షాక్
బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిజిటల్ చెల్లింపుల దేశీ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు పెరిగి రూ. 594 కోట్లను తాకాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 481 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 76 శాతం జంప్చేసి రూ. 1,914 కోట్లను తాకింది. గత క్యూ2లో కేవలం రూ. 1,086 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆదాయంలో 18% వాటాను ఆక్రమిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసులు, ఇతర బిజినెస్ల నుంచి 293 శాతం అధికంగా రూ. 349 కోట్లు సమకూరినట్లు కంపెనీ తెలియజేసింది. రుణదాత భాగస్వాముల ద్వారా మొత్తం రూ. 7,313 కోట్ల రుణాలందించినట్లు వెల్లడించింది. ఇది 482 శాతం వృద్ధిగా తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పేటీఎమ్ షేరు స్వల్పంగా లాభపడి రూ. 652 వద్ద ముగిసింది. -
వామ్మో రూ.12.11 లక్షల కోట్లు.. ఏం వాడకం రా బాబు!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్పులు చోటు చేసుకోవడం సహజం. గతంలో చెల్లింపులు నగదు లేదా చెక్ రూపంలో చేస్తున్న ప్రజలు, ఇటీవల డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కరోనా నుంచి ఈ డిజిటిల్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీల సంఖ్య అక్టోబర్లో 7.7 శాతం పెరిగి 730 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లు రికార్డ్ స్థాయిలో జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. సెప్టెంబర్లో 678 కోట్ల లావాదేవీలకుగాను విలువ రూ.11.16 లక్షల కోట్లుగా ఉంది. ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు కాగా, వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ఎన్ఈటీసీ ఫాస్టాగ్ లావాదేవీల విలువ రూ.4,452 కోట్లకు చేరుకుంది. సురక్షితమైన, వేగంతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఆధార్ కార్డ్ని ఏఈపీఎస్తో అనుసంధానించగా.. గత నెలలో 10.27 కోట్లు ఉండగా అక్టోబర్లో ఇవి 11.77 కోట్లకు చేరుకుంది. ఏఈపీఎస్ లావాదేవీల విలువ రూ.26,665.58 కోట్ల నుంచి రూ.31,112.63 కోట్లకు పెరిగింది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్! -
బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్ ఏంటీ స్పీడ్!
పేటీఎం.. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం కస్టమర్లకు అనుగుణంగా సేవలందిస్తు తన వ్యాపారాంలో జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. మొదట్లో డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫాం వంటి సేవలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన పేటీఎంలో ఇటీవల మరికొన్ని సేవలతో పాటు బ్యాంకుల తరహాలో లోన్ సదుపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బ్యాంకులే షాక్ తినేలా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది పేటీఎం. వన్ కమ్యూనికేషన్స్(One97 communications) మాతృసంస్థగా పనిచేస్తున్న పేటీఎం కంపెనీ దేశంలోని ఇతర బ్యాంకింగ్ సంస్థలతో కలిసి కొన్ని త్రైమాసికాల క్రితం రుణ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సేవలను ప్రారంభించిన కొత్తలో కొన్ని అవాంతరాలు ఎదురైన వాటిని తట్టుకుని తగ్గేదేలే అన్నట్లుగా రుణ వితరణ రంగంలో తాజాగా భారీ వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ తక్కువ కాలంలోనే తన లోన్ బుక్ను అనేక రెట్లు పెంచుకుంది. కంపెనీ రుణ వితరణ వార్షిక ప్రాతిపదికన సెప్టెంబరులో రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఈ విషయాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. పేటీఎం నివేదికలో.. సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో వెలువడిన ఫలితాల పరంగా.. గతేడాది పోలిస్తే ఈ సారి పంపిణీ చేసిన మొత్తం రుణాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తెలిపింది. గత సంవత్సరంలో ఈ సంఖ్య 28.41 లక్షలు ఉండగా ఈ సారి 92 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. అదే క్రమంలో Paytm ద్వారా పంపిణీ చేసిన లోన్ల విలువ.. గత సెప్టెంబరు 2021 త్రైమాసికంలో రూ. 1,257 కోట్లు ఉండగా, ప్రస్తుతం సెప్టంబర్లో ఆరు రెట్లు పెరిగి రూ.7,313 కోట్లకు చేరుకుంది. నెలవారీ వృద్ధి చూస్తే కంపెనీ ఈ ఏడాది సగటున రూ.7.97 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 39 శాతం పెరిగింది. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
‘నేను అవినీతి ఉద్యోగిని కాను’.. అని బోర్డు పెట్టి..
బనశంకరి(కర్ణాటక): రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పే సీఎం అభియాన్ పేరుతో అవినీతి ఆరోపణలు గుప్పించడంతో బొమ్మై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. పేసీఎంకు సమాధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ వ్యతిరేక ప్రచారోత్సవం చేపట్టనుంది. నాకు ఎవరూ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అవినీతి ఉద్యోగి/ అధికారిని కాదు అనే నినాదంతో అక్టోబరు 2 నుంచి 20వ తేదీ వరకు అభియానను నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పై నినాదంతో అన్ని ఆఫీసుల్లో బోర్డులు పెట్టాలని తెలిపారు. కాగా ఇటీవల యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోన్ని ముద్రించిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకుంది. ఈ ఫోటోని క్యూఆర్ కోడ్తో ‘పేసీఎం’ పోస్టర్ల లా ప్రింట్రింగ్ చేసి బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్సైట్కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్సైట్ను కాంగ్రెస్ ప్రారంభిన సంగతి తెలిసందే. చదవండి: కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్లో నటుడి ఫోటో.. కోర్టుకెళ్తానని వార్నింగ్ -
ఆన్లైన్ బుకింగ్ చేసినవాళ్లకే జింఖానాలోకి ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం రసాభాసాగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇవ్వాలని హెస్సీఏ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత టికెట్లు ఇవ్వనున్నారు. అలాగే.. ఆఫ్లైన్ టికెట్ల కోసమంటూ గ్రౌండ్ వైపు ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు. గురువారం నాటి తొక్కిసలాట, లాఠీఛార్జీ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. జింఖానా వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ కో నిల్చోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే ఆన్లైన్ బుకింగ్ ఉన్నవాళ్లకు మాత్రమే జింఖానాలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గ్రౌండ్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక హెచ్సీఏ తీరుతో క్రికెట్ చూడటం అభిమానులకు అందని ద్రాక్షేనా అనే ప్రశ్న మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లోపించిందని, లోగుట్టుగా నడిచిన మ్యాచ్ టికెట్ విక్రయాల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కాంప్లిమెంటరీ పాసుల కోసం బడాబాబులు, వీఐపీలు కక్కుర్తి పడుతున్నట్లు తేలింది. అసలు ఆఫ్ లైన్ టికెట్లు సైతం ఎన్ని విక్రయించారో అజార్ క్లారిటీ ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్ల నిర్వహణ సాఫీగా సాగుతున్న వేళ.. టికెట్ విక్రయాల కోసం హెచ్సీఏ సతమతం కావడంపై చర్చ నడుస్తోంది. ఒకరకంగా జింఖానా తొక్కిసలాట ఘటనతో నగర ఈమేజ్ దెబ్బతిందనే మాట సైతం వినిపిస్తోంది. హెచ్సీఏ అధ్యక్షుడు అజార్ ఒంటెద్దు పోకడతోనే ఈ స్థితి కి కారణమంటున్నారు కొందరు. ఇదీ చదవండి: జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే? -
పేటీఎం తరహాలో ‘పేసీఎం’.. క్యూఆర్ కోడ్తో నేరుగా..!
బెంగళూరు: కర్ణాటక అధికార పార్టీ బీజేపీపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖచిత్రం, క్యూఆర్ కోడ్తో ‘పేసీఎం’ పోస్టర్లను బెంగళూరు మొత్తం ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్సైట్కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్సైట్ను కాంగ్రెస్ ప్రారంభించింది. కొద్ది రోజులుగా బీజేపీ పాలనలో 40 శాతం కమిషన్ తప్పనిసరిగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 40 శాతం కమిషన్ను ఎత్తిచూపేలా ఈ వెబ్సైట్, పోస్టర్లను డిజైన్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టేందుకు గత వారమే ప్రచారం మొదలు పెట్టింది కాంగ్రెస్. 40percentsarkara.com ద్వారా ప్రభుత్వ అవినీతిని నివేదించాలని, వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది. రాష్ట్ర పరిపాలన విభాగం 40శాతం కమిషన్తో నడుస్తోందని, దోపిడీదారులతో నిండిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితమే ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నోరు విప్పే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్ -
ఫ్లిప్కార్ట్ పేటీఎంతో డీల్: ఇన్స్టంట్ క్యాష్బ్యాక్
సాక్షి,ముంబై: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై 80 శాతందాకా డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఆపిల్ ఐఫోన్13, నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ఫోన్లు సహా ప్రముఖ స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు పేటీఎం ద్వారా ఆకర్షణీయమైన క్యాష్బ్యాక్లను అందించనుంది. పేటీఎం యూపీఐ, పేటీఎం వాలెట్ చెల్లింపులపై ఆఫర్లను అందివ్వనుంది. ఇందుకోసం పేటీఎంతో డీల్ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా, ఫ్లిప్కార్ట్లో రూ. 250 అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసినట్లయితే రూ.25 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ను, పేటీఎం యూపీఐ, వాలెట్ 500 రూపాయలు అంతకంటే ఎక్కువున్న చెల్లింపులపై రూ. 50 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022తో భాగస్వామ్యంపై పేటీఎం ప్రతినిధి సంతోషం ప్రకటించారు. దీని ద్వారా భారతదేశంలోని చిన్న నగరాలు పట్టణాల్లోని మిలియన్ల మంది షాపర్లకు సురక్షితమైన చెల్లింపుల అనుభవాన్ని అందించనున్నామన్నారు. బిగ్ బిలియన్ డే 2022 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై డిస్కౌంట్లను, ఇంకా దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్, బ్యూటీ ఉత్పత్తులు, బొమ్మలు తదితర అనేక ఉత్పత్తులపై ఆఫర్లను కూడా పొందవచ్చు. ఇప్పటికే ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్కొనుగోళ్లపై 10శాతం, గరిష్టంగా రూ.1500 దాకా ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. -
ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లలో డిజిటల్ పేమెంట్లు
సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో ఏర్పాటు చేస్తోన్న రిటైల్ అవుట్లెట్లలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో పేటీఎం సంస్థతో రాష్ట్ర మత్స్యసహకార సంస్థ మంగళవారం ఒప్పందం చేసుకోనుంది. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు సమక్షంలో మత్స్యసహకార సంస్థ చైర్మన్ కె.అనిల్బాబు, పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ్శర్మ ఒప్పందం చేసుకోనున్నారు. ఒప్పందం మేరకు రూ.22 వేల విలువైన పాయింట్ ఆఫ్ సేల్, క్యూ ఆర్ కోడ్తో కూడిన పేమెంట్ ఆడియో సౌండ్ బాక్సులను పేటీఎం సంస్థ ఉచితంగా సమకూర్చనుంది. వీటిని ఫిష్ ఆంధ్ర యాప్తో అనుసంధానం చేస్తారు. ఒప్పందం మేరకు ఈ నెలాఖరుకల్లా 2వేల రిటైల్ అవుట్లెట్లలో పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన వాటికి కూడా అందజేస్తారు.