Abortion
-
ప్రాణం తీసిన గర్భస్రావ మాత్ర
ఖలీల్వాడి (నిజామాబాద్ జిల్లా): గర్భస్రావం మాత్రలు రిఫర్ చేసి ఓ యువతి మరణానికి కారణమైన పీఎంపీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏసీపీ బుధవారం వెల్లడించారు. మాక్లూర్ మండలానికి చెందిన యువతి, మెండోరా మండలం సావెల్కు చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా యువతి గర్భం (2 నుంచి 3 నెలలు) దాల్చడంతో యువకుడు తన గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్న ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన పీఎంపీ హరికృష్ణచారిని ఈనెల 4న సంప్రదించాడు. పీఎంపీ సూచించిన మాత్రలను యువకుడు అదే రోజు యువతికి ఇవ్వగా మూడు రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పితోపాటు బ్లీడింగ్ అయ్యింది. దీంతో యువతిని ఆమె తల్లి నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. యువతికి గర్భస్రావమైందని, కిడ్నీ, లివర్కు ఇన్ఫెక్షన్ వచ్చిందని హైదరాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 10న హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో యువతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎంపీని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. -
అబార్షన్ మాత్రలను ఎగబడి కొంటున్నారు.. ఎందుకంటే?
-
USA Elections Results 2024: ఆ నాలుగు వద్దు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులైన మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. గర్భస్రావ హక్కులకు వ్యతిరేకి అయిన ట్రంప్ రాక పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పురుషుల ఓట్లతోనే ఆయన గెలిచారని వారు భావిస్తున్నారు. ట్రంప్కు ఓటేసి గెలిపించినందుకు ప్రతీకారంగా పురుషులను పూర్తిగా దూరం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు! ఈ దిశగా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ‘4బీ’ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఆ మగవాళ్లను దూరంగా పెడతాం. వారితో శృంగారం, పెళ్లి, పిల్లలను కనడం వంటి సంబంధాలేవీ పెట్టుకోబోం’’అని కరాఖండిగా చెబుతుండటం విశేషం! దక్షిణ కొరియాలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ట్రంప్ విజయం తర్వాత బాగా ట్రెండింగ్గా మారింది. ట్రంప్ మహిళల వ్యతిరేకి అని, స్త్రీవాదమంటే ఆయనకు పడదని డెమొక్రటిక్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. గర్భస్రావ హక్కులకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయంపై మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ విజయంతో ఆవేదనకు గురై వారు కన్నీరుపెట్టారు. తమ బాధను సోషల్ మీడియాలో పంచుకోవడంతోపాటు 4బీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పొడవునా మహిళల హక్కులపై ట్రంప్, హారిస్ మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం సాగింది. 4బీ ఉద్యమం దానికి కొనసాగింపని చెబుతున్నారు. ఇది మహిళల విముక్తి పోరాటమంటూ పోస్టు పెడు తున్నారు. ‘‘తరాలుగా సాగుతున్న పురుషాధిక్యత, అణచివేతపై ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాం’’ అంటున్నారు. 4బీ పోరాటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. పోస్టులు, లైక్లు, షేరింగ్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రాడికల్ ఫెమినిస్ట్ ఉద్యమం నానాటికీ బలం పుంజుకోంటుంది. ఏమిటీ 4బీ ఉద్యమం?ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ’ఉద్యమం తర్వాత అదే తరహాలో దక్షిణ కొరియాలో 2018లో 4బీ ఉద్యమం మొదలైంది. ఓ మహిళ తన ఆర్ట్ క్లాస్లో భాగంగా నగ్నంగా ఉన్న పురుషున్ని ఫొటో తీసినందుకు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీనిపై మహిళల ఆగ్రహావేశాలు 4బీ ఉద్యమానికి దారితీశాయి. బీ అంటే కొరియా భాషలో సంక్షిప్తంగా నో (వద్దని) చెప్పడం. పురుషులతో డేటింగ్, పెళ్లి, శృంగారం, పిల్లలను కనడం. ప్రధానంగా ఈ నాలుగింటికి నో చెప్పడమే 4బీ ఉద్యమం. దీన్ని అణచివేసేందుకు కొరియా ప్రభుత్వం ప్రయతి్నంచింది. స్త్రీ పురుషుల ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి ఉద్యమాలు దెబ్బతీస్తాయని అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ 2021లో చెప్పారు. ఇప్పుడక్కడ 4బీ గొడవ కాస్త సద్దుమణిగినప్పటికీ ప్రజలపై దాని ప్రభావం ఇంకా బలంగానే ఉంది. దాంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. 4బీ ఉద్యమమే దీనికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
7 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కుల విజయం
వాషింగ్టన్: అబార్షన్ హక్కులు ఏడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. అత్యంత నిర్బంధ గర్భస్రావం నిషేధాన్ని రద్దు చేయడానికి మిస్సోరి ఓటర్లు మార్గం సుగమం చేశారు. అరిజోనా, కొలరాడో, మేరీల్యాండ్, మోంటానాలో అబార్షన్ హక్కుల సవరణలు కూడా ఆమోదం పొందాయి. నెవాడా ఓటర్లు ఒక సవరణను ఆమోదించారు. అది అమల్లోకి రావాలంటే వారు దానిని 2026లో మళ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాల ఓటర్లు మాత్రం రాజ్యాంగ సవరణపై విముఖత వ్యక్తం చేశారు. అబార్షన్ నిషేధాన్ని రద్దు చేసిన రో వర్సెస్ వేడ్ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న చాలా రాష్ట్రాల్లో నిషేధాలు అమల్లోకి రావడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం 13 రాష్ట్రాలు కొన్ని మినహాయింపులతో గర్భధారణ అన్ని దశలలో నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆరు వారాలు, మరికొన్ని నాలుగు వారాల తరువాత గర్భస్రావాన్ని నిషేధించాయి. అబార్షన్ రాష్ట్రాలకు వదిలేయాల్సిన అంశమని రిపబ్లికన్ అభ్యరి్థగా పదేపదే చెప్పిన ట్రంప్... ఇప్పుడు అధ్యక్షుడిగా కార్యనిర్వాహక చర్య ద్వారా అబార్షన్ హక్కులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిషేధాన్ని ఎత్తేసిన మిస్సోరీ.. ఏ దశలోనైనా గర్భస్రావానికి హక్కును కలి్పస్తూ, అబార్షన్పై నిషేధాన్ని ఎత్తివేసే మొదటి రాష్ట్రంగా మిస్సోరి నిలిచింది. గర్భస్రావం, జనన నియంత్రణ, గర్భధారణ చుట్టూ నిర్ణయాలు వ్యక్తిగతమైనవని, వాటిని రాజకీయాలు కాకుండా వ్యక్తులకే వదిలేయాలనే హక్కులకు ఓటేసి మిస్సోరియన్లు చరిత్రను సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో ఆంక్షలుఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాలు అబార్షన్పై నిషేధాన్ని సమరి్ధంచాయి. అబార్షన్ వ్యతిరేకులు బ్యాలెట్ పద్ధతిలో విజయం సాధించారు. ఫలితంగా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిశాంటిస్కు రాజకీయ విజయం లభించింది. ఈ ఫలితం ఫ్లోరిడాలో, మొత్తం దేశానికి ఒక ముఖ్యమైన విజయమని జాతీయ గర్భస్రావ వ్యతిరేక గ్రూపు ఎస్బీఏ ప్రో–లైఫ్ అమెరికా అధ్యక్షుడు మార్జోరీ డాన్నెన్ఫెల్సెర్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు మినహా గర్భస్రావంపై నిషేధం ఉన్న మరో రాష్ట్రమైన సౌత్ డకోటా సైతం అబార్షన్ హక్కులకు వ్యతిరేకంగా ఓటేసింది. అబార్షన్ హక్కులను కల్పించే రాజ్యాంగ సవరణను నెబ్రాస్కా ఓటర్లు తిరస్కరించారు. ఆమోదం తెలిపిన ఏడు రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలు అబార్షన్ హక్కుల చట్ట సవరణకు ఆమోదం తెలిపాయి. గర్భం దాలి్చన మొదటి 15 వారాల తర్వాత అబార్షన్ను నిషేధించే ప్రస్తుత చట్టాన్ని సవరణకు అరిజోనా ఆమోదం తెలిపింది. గర్భస్రావ హక్కులను ఇప్పటికే అనుమతించిన మేరీలాండ్లో ఈ ఫలితాలు పెద్ద తేడాను చూపవు. మిస్సోరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ గర్భస్రావం ఇప్పటికే చట్టబద్ధమైనది. కొలరాడోలో 55% ఓటర్లు అబార్షన్ హక్కులకు మద్దతును ప్రకటించారు. గర్భస్రావం కోసం రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను ఉపయోగించడాన్ని నిషేధించిన గత సవరణను కూడా ఇది రద్దు చేయనుంది. స్టేట్ మెడికేడ్, ప్రభుత్వ ఉద్యోగుల భీమా పథకాలు గర్భస్రావాన్ని కవర్ చేసే అవకాశాన్ని కూడా ఇది కలి్పంచనుంది. న్యూయార్క్ సమాన హక్కుల చట్టం కూడా ఆమోదం పొందింది. ఇందులో ‘గర్భస్రావం’అనే పదం లేకపోయినా.. గర్భధారణ ఫలితాలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, స్వయంప్రతిపత్తి ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది న్యూయార్క్ వాసులందరికీ గొప్ప విజయమని ఈక్వల్ రైట్స్ క్యాంపెయిన్ డైరెక్టర్ సాషా అహుజా ప్రకటించారు. -
అబార్షన్ మా హక్కు
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అబార్షన్ హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది మహిళలు రాజధాని వాషింగ్టన్తో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ర్యాలీలతో హోరెత్తించారు. వాషింగ్టన్ వీధుల్లో నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పురుషులు కూడా నిరసనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాకుండా అబార్షన్ హక్కుల సవరణల బ్యాలెట్పైనా ఓటేయాలని ప్రజలను కోరారు. వాషింగ్టన్లో జరిగిన విమెన్స్ మార్చ్లో స్త్రీవాద ఉద్యమకారిణి ఫన్నీ గోమెజ్ లూగో అబార్షన్ బ్యాలెట్ ఉన్న 10 రాష్ట్రాల జాబితాను చదివి వినిపించారు. మిస్సోరీలోని కాన్సాస్ సిటీలో జరిగిన ర్యాలీలో అబార్షన్ హక్కుల చట్టం కోసం ప్రజలు సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ అభ్యరి్థగా హారిస్ బరిలోకి దిగినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు మహిళల అబార్షన్ హక్కులు ప్రధానాంశంగా మారాయి. అబార్షన్ హక్కును రద్దు చేసి, దానిపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుకు నిరసనగా కార్యక్రమాలు పెరిగాయి. -
గర్భ విచ్ఛిత్తికి ఆర్ఎంపీల ప్రోత్సాహం
ఎంజీఎం: ఆర్ఎంపీ, పీఎంపీల వైద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రి నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నరేష్, ఐఎంఏ అధ్యక్షుడు అన్వర్ ఆదివారం విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన నాలుగు నెలల గర్భిణి అక్టోబర్ 3న మంగపేటకు చెందిన ఆర్ఎంపీ రామును కలవగా, గర్భ విచ్ఛిత్తికి మందులు ఇచ్చాడు. కడుపు నొప్పి రావడంతో మరిన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా.. కొంత ఉపశమనం కలిగినా, మళ్లీ నొప్పి తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఈనెల 1న హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గర్భాశయం పగలడంతోపాటు శరీరంలోని రక్తం విషతుల్యమైందని నిర్ధారించారు. గర్భసంచి తొలగించి వెంటిలేటర్ చికిత్స అందించడానికి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీ బృందం గుర్తించింది. ఈ ఘటనపై ములుగు జిల్లా వైదారోగ్యశాఖ అధికారులు, పోలీసులకు సదరు ఆర్ఎంపీపై ఫిర్యాదు చేయనున్నట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు.సిద్దిపేట జిల్లా అక్కంపేట మండలానికి చెందిన మరో గర్భిణికి సైతం కేశవపూర్కు చెందిన రమణాచారి అనే నకిలీ వైద్యుడు గర్భ విచ్ఛిత్తికి మందులు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయస్థితికి చేరుకుందని చెప్పారు. ఆమె ప్రాణాలను కాపాడిన వైద్యులు టీజీఎంసీ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు అతడిపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.ములుగులో మెడికల్ స్టోర్ యజమాని సొంత వైద్యం ములుగు జిల్లా వెంకటాపూర్కు చెందిన మరో గర్భిణికి జిల్లా కేంద్రం బస్టాండ్ సమీపాన ఉన్న మెడికల్ స్టోర్ యజమాని ఇచ్చిన గర్భ విచ్ఛిత్తి మందులు వేసుకున్నాక..ఆమె స్పృహ కోల్పోవడంతో హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు. వైద్యులు సత్వర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.బాధిత మహిళ షాపు పేరు చెప్పకపోవడంతో ములుగు జిల్లా బస్టాండ్ ప్రాంతంలో అన్ని మందుల దుకాణాలను తనిఖీ చేసి సదరు మెడికల్ స్టోర్లపై చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు అనుమతి
ముంబై: పదకొండేళ్ల రేప్ బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. 11 ఏళ్ల చిన్నారి అబార్షన్కు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉందని వైద్య నిపుణుల బృందం చెప్పడాన్ని పరిగణలోకి తీసుకొని 30 వారాల గర్భవిచ్ఛిత్తికి హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నారి పొత్తికడుపు గట్టిపడిందని భావించామని, థానే ఆసుపత్రిలోనూ డాక్టర్లు అలాగే భావించి మందులు రాసిచ్చారని తండ్రి కోర్టుకు తెలిపారు. అయినా బాలిక పరిస్థితిలో మార్పేమీ రాకపోవడంతో అక్టోబరు 24న ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ బాలిక గర్భం దాల్చిందనే విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారని ఆమె తండ్రి కోర్టుకు విన్నవించారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోర్టును కోరడంతో 30 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతిస్తూ జస్టిస్ షర్మిల దేశ్ముఖ్, జస్టిస్ జితేంద్ర జైన్ల ధర్మాసనం తీర్పునిచ్చింది. -
USA Presidential Elections 2024: తేల్చేది అబార్షనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్తో పాటు అబార్షన్ హక్కులపైనా తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ (4) అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్లో పొందుపరిచాయి.గర్భస్రావాన్ని నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరంగా మారిపోయింది. 1880వ దశకం చివర్లలో పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి. జేన్ రో అనే మహిళ దీన్ని వ్యతిరేస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలని వాదించారు. దాంతో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ‘రోవర్సెస్ వేడ్’ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి. పోప్ వ్యాఖ్యలతో.. అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. ‘‘గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కుంది. ఆ బిడ్డనిచ్చింది దేవుడు. అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలు కాదు’’ అంటూ సందేశమిచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోడానికి రిపబ్లికన్ పార్టీని మాధ్యమంగా అవి ఎంచుకున్నాయి. ఫలితంగా 1970వ దశకంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968–88 మధ్య ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఐదింటిలో విజయం సాధించింది. జడ్జీల ద్వారా ఎత్తులు 1983లో పార్లమెంటులో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సంప్రదాయవాద జడ్జిలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి. అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జీలు, డెమొక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించే వాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జీల నియామకం ఎక్కువగా జరిగింది. దాంతో అబార్షన్ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.మెజారిటీ అమెరికన్ల వ్యతిరేకత 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వే లు చెబుతున్నాయి. కానీ డెమొక్రాట్ల అభ్యర్థి, కమలా హారిస్ మాత్రం తన ప్రచా రంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదేపదే పేర్కొంటున్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటున్నారు.డెమొక్రాట్లకే సానుకూలం ఫ్లోరిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరి, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాల్లో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయమై ఓటర్లు నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్తో పాటుగా జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా. ఫ్లోరిడా ఓటర్లలో 46 శాతం మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38 శాతం వ్యతిరేకంగా, 16 మంది తటస్థంగా ఉన్నారని అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా ఏకంగా 28 శాతం మంది ఓటర్లు చూస్తున్నట్టు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14 శాతమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12 శాతం మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
శుక్రవారం మాది..
నేటి కాలంలో ఆడపిల్ల కడుపున పడినప్పటి నుంచీ కష్టాలే. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడం నుంచి కిశోర బాలికలకు, బాలింతలకు పోషకాహారం అందకపోవడం దాకా ఎన్నో సమస్యలు. మహిళలు కేన్సర్లు సహా ఎన్నో శారీరక రుగ్మతలకు లోనైనా కప్పిపుచ్చుకుంటూ జీవిస్తున్న పరిస్థితి. పిల్లలను అంగన్వాడీలకు పంపడం లేదు. తెలియక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేలా, మహిళల్లో అవగాహన కల్పించేలా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, స్వయం సహాయక సంఘాలను ఒకే తాటిపై తీసుకువచ్చారు. ‘శుక్రవారం సభ’పేరిట ప్రభుత్వ సేవలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ముందు మా సేవలు చూడండి నేటి కాలంలో మహిళలు కూడా ఏదో ఒక పనిచేస్తున్నారు. పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు. అనారోగ్యమొస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఈ క్రమంలో ‘ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని ఎదగండి. చిన్నారులకు అంగన్వాడీలలో అందించే బాలామృతం, కిశోర బాలికలకు రక్తహీనతను తగ్గించే పోషకాహారం, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం, మధ్య వయసు స్త్రీలకు ప్రతీ 3 నెలలకోసారి ప్రభుత్వ ఆస్పత్రిలో ‘ఆరోగ్య మహిళ’ పేరిట లభించే 52 ఉచిత పరీక్షల వివరాలు తెలుసుకోండి. ఈ సేవలన్నీ ప్రభుత్వం వద్ద ఉచితంగా అందుతాయి..’అంటూ ‘శుక్రవారం సభ’పేరిట వారానికి ఒక మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడే గర్భవతులకు సీమంతం, బాలింతలకు పోషకాహార పంపిణీ వంటివాటిని కలెక్టర్ స్వయంగా చేపడుతుండటం గమనార్హం. పీసీవోడీ, కేన్సర్, భ్రూణహత్యలపైనా.. నడి వయసు మహిళలకు ఆరోగ్య మహిళా పథకం ద్వారా పీసీవోడీ (గర్భాశయంలో కణతులు), కేన్సర్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ముప్పును ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని.. అవే పరీక్షలు, చికిత్సలు ప్రైవేటులో చేస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందని కలెక్టర్ సత్పతి మహిళలకు భరోసా కల్పిస్తున్నారు. మహిళలు తీవ్ర అనారోగ్యాల పాలైతే వారి కుటుంబాలు ఆగమవుతాయని సూచిస్తున్నారు. పిల్లల మానసిక వికాసానికి వీలుగా అంగన్వాడీలను ఆహ్లాద వాతావరణం ఉండేలా మారుస్తున్నారు. భ్రూణహత్యలను అరికట్టేలా మహిళల్లో చైతన్యం కల్పిస్తున్నారు. పోషకాహారం ప్రాధాన్యం తెలిసింది.. కలెక్టర్ సత్పతి మేడం మొదలుపెట్టిన శుక్రవారం సభ మాలో చైతన్యం తెచ్చింది. బాలింతలకు, గర్భవతుల సంక్షేమం కోసం మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మాలో రక్తహీనత నివారించేలా అవగాహన కల్పించారు. తల్లి పాల ప్రాముఖ్యత, అంగన్వాడీలలో లభించే సేవల గురించి చక్కగా వివరించారు. –అనిత, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్కేన్సర్ ముప్పు గురించి చెప్పారు కలెక్టర్ మేడం పీసీవోడీ, కేన్సర్ ఎలా వస్తాయో వివరించారు. మా ముందు తరాల వారు పనిలో పడి ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ప్రాణాలు పొగొట్టుకున్నారు. కలెక్టర్ మేడం తల్లిలా మాపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆడపిల్లల ప్రాధాన్యం వివరించి భ్రూణహత్యల నివారణపైనా అవగాహన కల్పించారు. – అఖిల, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్ -
‘అగ్ర’రాజ్యంలో అదే చర్చ
స్త్రీ హక్కులను గుర్తిస్తే.. వాళ్ల నిర్ణయా«ధికారాన్ని సమ్మతించినట్లే! వాళ్ల సాధికారతను గౌరవించినట్లే! అయితే ఇప్పుడు పేచీ అంతా అక్కడే.. మ్యారిటల్ రేప్ నుంచి అబార్షన్ కేస్ వరకు.. అమె చాయిస్ను అడిగేవాళ్లు లేరు సరికదా.. ఆమె అలా అడగడమే సరికాదని వాదిస్తున్నారు.. అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు! అనిత (పేరు మార్చాం) ఎకనామిక్ ఎనలిస్ట్. ఆంట్రప్రెన్యూర్ కావాలనేది ఆమె లక్ష్యం. అందుకోసం పెళ్లి, పిల్లలనే జంఝాటాలూ వద్దనుకుంది. కానీ తనంటే చాలా ఇష్టపడే ఓ ఇన్వెస్టర్ పెళ్లి ప్రపోజల్ తేవడంతో, ఇంట్లో వాళ్లూ బలవంత పెట్టడంతో పెళ్లికి ఒప్పుకుంది.. తనకున్న లక్ష్యాన్ని వివరించి, పిల్లల్ని కనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసి మరీ! అందుకు సరే అంటూ అనిత చేయి అందుకున్నాడు అతను. అయితే ఫ్యామిలీ ΄్లానింగ్ ఫెయిలై అనిత గర్భం దాల్చింది. అబార్షన్ ఆప్షన్ను ఎంచుకుంది. పెళ్లికి కాంప్రమైజ్ అయినట్టుగా, ప్రెగ్నెన్సీకీ కాంప్రమైజ్ అవమని ఒత్తిడి తెచ్చాడు భర్త. అలా కుదరదని తేల్చిచెప్పి, అబార్షన్ కోసం ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించింది. ‘భర్త అంగీకారం ఉంటేనేప్రోసీడ్ అవుతాను’ అంది డాక్టర్. హతాశురాలైంది అనిత! బాగా చదువుకున్నవాడు, లోకం తెలిసిన అనిత భర్తకే భార్య హక్కు గురించి తెలియకపోతే.. మిగిలిన వాళ్ల పరిస్థితేంటి! తొమ్మిది నెలలు మోసి, కని, పెంచే ఆమె అన్నిరకాలుగా సిద్ధంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి! ఎందుకంటే ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ అధికారం! హర్ బాడీ.. హర్ చాయిస్! అందుకే ఇష్టం లేని గర్భాన్ని అవసరంలేదనుకునే హక్కు ఆమెకు ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇదే ప్రధానాంశం అయింది. దీనిమీద.. అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్, కమలా హ్యారిస్ల మధ్య వేడిగావాడిగా చర్చ సాగుతోంది. డెమోక్రాట్స్ అభ్యర్థి కమలా హ్యారిస్.. స్త్రీలకు అబార్షన్ హక్కు ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది స్త్రీ నిర్ణయాధికారాన్ని, సాధికారతను సూచిస్తుందని ఆమె అభి్రపాయపడుతున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపేమో దీనికి సంబంధించి తన వైఖరిని మాటిమాటికీ మారుస్తూ వస్తున్నారు. నిన్నమొన్న జరిగిన డిబేట్లో కూడా ‘అబార్షన్ రైట్’ అంశాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టాలనే నిర్ణయానికి మద్దతిచ్చాడు. ట్రంప్ మాటల మీద మిగతా వాళ్ల అభి్రపాయాలెలా ఉన్నా.. స్వయానా ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అబార్షన్ అనేది స్త్రీ ఇష్టానికే వదిలిపెట్టాలి, అది ఆమె హక్కు.. ఈ విషయంలో రాజీకి చోటే లేదంటూ స్పష్టంగా చె΄్పారు. అంతేకాదు, ప్రాథమిక హక్కయిన వ్యక్తి స్వేచ్ఛను నేను సంరక్షిస్తాను’ అని చె΄్పారు. దీంతో ఆమె మాటలు వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కన్ను వేసి ఉంచిన ప్రపంచం యావత్తూ దీని మీద చర్చనూ మొదలుపెట్టింది. అసలు ఈ అబార్షన్ రైట్ అనేది స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు నెలవైన అమెరికాలో ఎందుకంత వివాదమవుతోంది? ఆ నేపథ్యం ఏంటంటే.. అమెరికాలో అబార్షన్కి సంబంధించి స్త్రీ స్వేచ్ఛను సవాలు చేసేలా ఉన్న నియమ నిబంధనల మీద 1969ప్రాంతంలో పెద్ద ఉద్యమమే సాగింది ‘మై బాడీ.. మై చాయిస్’ నినాదంతో. ఈ క్రమంలో 1973లో ఆ దేశ సుప్రీంకోర్ట్.. రో (ఖ్ఛౌ) వర్సెస్ వేడ్ (గ్చిఛ్ఛీ) కేసులో గర్భస్రావం హక్కునుప్రాథమిక/ రాజ్యాంగ హక్కుగా తీర్పునిచ్చింది. అయితే అదే అమెరికా సుప్రీంకోర్ట్ 2022లో ఆ తీర్పును తిరగరాస్తూ అబార్షన్పై 1973 కంటే ముందున్న నియమ నిబంధనలే సరైనవని వ్యాఖ్యానిస్తూ మరో తీర్పునిచ్చింది. దీని మీద అమెరికా అంతటా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి.ఆ తీర్పు తర్వాత దాదాపు రెండువందల మందికి పైగా మహిళల మీద అబార్షన్ నేరం కింద కేసులు నమోదైనట్టు ఓ నివేదిక తెలిపింది. అప్పటి నుంచి అబార్షన్ రైట్ కోసం అమెరికాలోపోరాటం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు, వాటిని వ్యతిరేకిస్తూ మెలానియా వెలిబుచ్చిన తన అభి్రపాయంతో మళ్లీ ఒకసారి ప్రపంచంలోని దేశాలన్నీ అబార్షన్కి సంబంధించి తమ దేశాల్లోని చట్టాలు, అవి మహిళలకు ఇస్తున్న వెసులుబాటు, వాళ్ల హక్కుల్ని గౌరవిస్తున్న తీరుతెన్నులను పరిశీలించుకుంటున్నాయి. మనమూ మన దగ్గరున్న చట్టాన్ని ఒకసారి పరికిద్దాం!గర్భం దాల్చాలా? వద్దా? అనేది మహిళే నిర్ణయించుకోవాల్సిన విషయం. దీన్ని ఆమె స్వేచ్ఛకే వదిలేయాలని మన చట్టం చెబుతోంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, సెక్షన్ 3 ప్రకారం.. గర్భస్రావం తప్పనిసరైనప్పుడు దానికి గర్భిణి అంగీకారం మాత్రమే చాలు. 2017లో అనిల్కుమార్ వర్సెస్ అజయ్ పశ్రీచా కేసులో ‘గర్భం దాల్చాలా వద్దా అనే అంశంలో తుది నిర్ణయం మహిళదే. వైవాహిక బంధానికి సమ్మతించినంత మాత్రాన ఆ పురుషుడి బిడ్డకు తల్లినౌతానని ఆమె అంగీకరించినట్టు కాదు’ అని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. దీన్నిబట్టి అబార్షన్ సమయంలో పురుషుడి అనుమతి అవసరం లేదు. స్త్రీ అంగీకారం మాత్రమే చాలు అని అర్థమవుతోంది. అయితే భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేయించుకుంటే అది నేరం కాకపోయినప్పటికీ, ఆ కారణాన్ని చూపి భర్త విడాకులు కోరే అవకాశం ఉంటుంది.మొత్తంగా చూస్తే.. అబార్షన్కి సంబంధించిన చట్టాల్లో మనం అమెరికా కంటే మెరుగే అని తెలుస్తోంది. ఆ విషయంలో మన చట్టం.. స్త్రీ హక్కును గౌరవిస్తోంది. ఆచరణలో మటుకు సమాజం ఇంకా చైతన్యవంతం కావాలి. – సరస్వతి రమఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలిమదర్హుడ్ అంటే ఒకరకంగా స్త్రీల మీద టాక్సేషన్ లాంటిదే! ఎందుకంటే తొమ్మిది నెలలు మాత్రమే కాదు పిల్లలు పెరిగి, వాళ్లు ఇండిపెండెంట్ అయ్యే వరకు కూడా స్త్రీల కెరీర్పాజ్లోనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉద్యోగాల సొసైటీలో ఇదంతా అవరోధంగానే ఉంటుంది. ఇలాంటప్పుడే మదర్హుడ్ కావాలా? కెరీర్ కావాలా అని ఎంచుకునే పరిస్థితి ఎదురవుతుంది. రెండూ కావాలనుకునేవాళ్లు ఎన్నోరకాల ఒత్తిడికి లోనవుతుంటారు. ఆర్థికంగా, సామాజికంగా ఆమెకు ఎన్నో సౌలభ్యాలు సమకూర్చితే తప్ప ఆమె రెండు ఆప్షన్స్ను ఎంచుకునే వీలుండదు. కానీ ఈ వెసులుబాట్లేమీ లేవు, ఉండవు. అలాంటప్పుడు ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛను ఆమెకివ్వడమే కరెక్ట్. అబార్షన్ను ఆమె హక్కుగా గుర్తించి, గౌరవించాలి. – అపర్ణ తోట, జెండర్ కన్సల్టెంట్, ది పర్పుల్ వరండాస్త్రీ యంత్రం కాదుస్త్రీ శరీరం ఒక యంత్రం కాదు. బిడ్డను మోసి, కని, పెంచేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధపడి ఉండాలి. అందుకే అది పూర్తిగా ఆమె స్వేచ్ఛకు సంబంధించిన అంశం. పురుషుడికి ఆ విషయంలో ఎటువంటి హక్కు ఉండదు, ఉండకూడదు. నా ఉద్దేశంలో ఖ్ఛౌ ఠిట. గ్చిఛ్ఛీ కేసును అమెరికా సుప్రీంకోర్టు తిరగరాయడం సమంజసం కాదు. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్కలవరపెట్టే విషయం..ఈ మధ్యకాలంలో డోనాల్డ్ ట్రంప్, కమల హారిస్ మధ్య ట్ఛౌ ఠిటఠ్చీఛ్ఛీ పై జరిగిన చర్చ డెవలప్డ్ కంట్రీ అనే పిలవబడే అమెరికా, అక్కడి రాజకీయాల్లోని ఆలోచన ధోరణుల్లోని వ్యత్యాసాన్ని తెలుపుతోంది. అబార్షన్ హక్కులను పరిమితం చేయడానికి ఒత్తిడి తెచ్చిన వాళ్లలో ట్రంప్ ఒకడు. అతని హయాంలో అబార్షన్ హక్కులను పరిమితం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. Roe vs. Wade ఉద్యమానికి అతను మద్దతు ఇచ్చాడు. మరోవైపు పునరుత్పాదక హక్కులు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకి, అలాగే హెల్త్ కేర్ యాక్సెస్కిప్రాథమికం అనే ప్రగతిశీల దృక్పథం కమలది. బిడ్డని కనాలా వద్దా అని నిర్ణయం తీసుకునే హక్కు ఆడవాళ్ళ అధికారాన్ని సమానత్వాన్ని సూచిస్తుందని ఆమె వాదన. అబార్షన్ హక్కులు లేకపోవడం వలన వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రజారోగ్యం మీద, సోషియో ఎకనామిక్ స్టేటస్ పైనా ప్రభావం ఉంటుందనే ముఖ్యమైన అంశాన్ని ఆమె లేవనెత్తింది. ఈ చర్చలో వచ్చినవి వ్యక్తిగత అభి్రపాయాలే కాదు, భవిష్యత్తులో అమెరికన్ సమాజం ఎలా ఉండబోతుందో కూడా తెలుపుతున్నాయి. అబార్షన్ హక్కు లేకపోవడం వల్ల ఎంతోమంది మహిళలుప్రాణాలు కూడా కోల్పోయారు. మహిళల జననాంగాల గురించి పబ్లిగ్గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన ట్రంప్ లాంటి పురుషహంకారులకు మహిళల స్వేచ్ఛ ఎలాగూ అర్థం కాదు. ఐతే ఇటువంటి వాదనలను సమర్థించే వాళ్లలో చదువుకున్న వాళ్లు, స్త్రీలూ కూడా ఉండడం కలవరపెట్టే విషయం. – దీప్తి శిర్ల, జెండర్ యాక్టివిస్ట్ -
ఇంట్లోనే అబార్షన్.. గర్భిణీ మృతి
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణికి ఇంట్లోనే అబార్షన్ చేయడం వల్ల 24 ఏళ్ల మహిళ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్త, మామలను పోలీసులు అరెస్ట్ చేయగా.. అత్తపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అబార్షన్ చేసేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొచి విచారిస్తున్నారు. నాలుగు నెలల పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టినట్లు తేలింది.వివరాలు.. 2017లో యువతికి వివాహం జరిగింది. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు( ఒక బాలిక, బాలుడు) ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. అయితే కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మహిళకు ఇంట్లోనే అబార్షన్ చేయాని ప్లాన్ చేశారు. ఇందుకు ఓ వైద్యుడిని కూడా పిలిపించారు. నాలుగు నెలల గర్బిణీకి ఇంట్లోనే అబార్షన్ చేయించారు. పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టారు. అనంతరం అధిక రక్తస్రావం కారణంగా మహిళ పరిస్థితి విషమంగా మారింది. మరుసటి రోజు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించింది.మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమె భర్త, మామలను అరెస్ట్ చేశారు. పొలం నుంచి పిండాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అబార్షన్ చేసేందుకు పిలిచిన ఓ ప్రైవేట్ వైద్యుడిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఇందాపూర్ పోలీసులు పేర్కొన్నారు. -
సూర్యాపేటలో ఘోరం: ఆడపిల్ల అని తెలిసి అబార్షన్, వైద్యం వికటించి..
సూర్యాపేటటౌన్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి భార్యకు ఆర్ఎంపీతో భర్త అబార్షన్ చేయించగా, వైద్యం వికటించి ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్కు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాముతండాకు చెందిన సుహాసిని(26)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుహాసిని మూడోసారి గర్భవతి కాగా, స్కానింగ్లో ఆడపిల్ల అని తెలియడంతో హరిసింగ్ సుహాసినికి అబార్షన్ చేయించాలనుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ సలహా తీసుకోగా.. ఏడో నెలలో అబార్షన్ చేయిస్తే తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పింది. అయినా, సుహాసినిని రెండురోజుల క్రితం బలవంతంగా హరిసింగ్ హుజూర్నగర్ ప్రాంతంలో ఓ ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. అయితే వైద్యం వికటించి సుహాసిని పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం కోదాడకు, ఆపై ఖమ్మంకు అక్కడ నుంచి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా ఆమె మృతి చెందింది. అయితే సుహాసిని మృతిచెందిన విషయాన్ని హరిసింగ్ కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎంజీనగర్ తండాకు తీసుకొచ్చాడని, గ్రామస్తులు గమనించి విషయం తమకు తెలిపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. సూర్యాపేటటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పంపించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పీహెచ్డీ చేసిన హరిసింగ్.. హరిసింగ్ నెలరోజుల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తే బలవంతంగా అబార్షన్ చేయించి సుహాసిని మృతికి కారణమయ్యాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
సమస్య తొమ్మిది నెలలేనా?
ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్ను నేరంగా పరిగణించడాన్ని నిలిపి వేయాలి. గర్భం వయసుపై పరిమితులు తొలగించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకునే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం 2021లో ఒక తీర్పునిచ్చింది. పిండం వయసు గరిష్ఠంగా 24 వారా లున్నా పీడిత మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. వైకల్యమున్నప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు సిఫారసుతో అబార్ష¯Œ కు అనుమతించే పాత చట్టం నుంచి వీరికి విముక్తిని ప్రసాదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు అబార్షన్కు అనుమతించే విషయంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ మార్పులు వచ్చాయి. అంతకుముందు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) యాక్ట్ (1971) ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) గర్భం ధరించిన 20 వారాల వరకూ అబార్షన్ చేసేందుకు అనుమతులుండేవి. 2021 నాటి సవరణ తీర్పు తరువాత కూడా చాలామంది మహిళలు వైద్యులు అబార్షన్కు నిరాకరించిన సందర్భాల్లో... కోర్టు నిర్దేశించిన సమయం దాటినా అఅబార్షన్కు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే ఓ వివాహిత మహిళ 26 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ తరువాత కోర్టు అందుకు నిరాకరించడం తెలిసిన విషయాలే. పాలిచ్చే సమయంలో కొంతకాలం రుతుస్రావం జరగదు. అయితే ఈ మహిళ పాలిచ్చే సమ యంలోనే గర్భం ధరించింది. ఇది సహజం అనుకోవడంతో గర్భం ధరించినట్లు గుర్తించలేకపోయింది. ఏడాది క్రితమే బిడ్డకు జన్మనిచ్చి పోస్ట్పార్టమ్ సైకోసిస్కు చికిత్స తీసుకుంటున్న ఈ మహిళ మరోసారి గర్భం ధరించడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం అంతకుముందు పిటీషన్ను అనుమతిస్తూ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. 2021 సవరణలకు ముందు అబార్షన్ కోసం కోర్టుకు ఎక్కిన కేసుల్లో అత్యధికం మానభంగం లేదా పిండాల వైకల్యం ఉన్నవారికి సంబంధించినవి. పైగా చాలావాటిల్లో గర్భం వయసు 20 వారాల కంటే ఎక్కువే. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు కొంచెం లేటైనా అబార్షన్ అనేది అవసరమవుతుంది. తొలినాళ్లలోనే అబార్షన్ చేసేందుకు వైద్యపరంగా అవకాశాల్లేకపోవడం వీటిల్లో ఒకటి. లైంగిక దాడి, గృహహింస, జైలు వంటివి ఇతర కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులు (భాగస్వామి సాయం లేక పోవడం, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగం వంటివి), శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ లేదా లాక్టేషనల్ అమెనోరియా (పాలిచ్చే సమయంలో రుతుస్రావం నిలిచిపోవడం) కూడా అబార్షన్కు తగిన కారణాలని చెప్పాలి. అబార్షన్లకు సంబంధించి 2021 నాటి సుప్రీంకోర్టు సవరణ గర్భం తాలూకూ వయో పరిమితిని పెంచింది మినహా ఇతర మార్పులేవీ చేయలేదు. దీనివల్ల ప్రయోజనం కొద్దిమందికే. తల్లి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఓ ఆర్ఎంపీ ఏ దశలోనైనా గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఉండగా చాలామంది కేసుల భయంతో ఆ పని చేసేందుకు జంకు తున్నారు. ఫలితంగా మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టులకు వెళ్లడం ఇష్టం లేని వారైతే గర్భాన్ని కొనసాగిస్తున్నారు లేదా ముతక పద్ధతులతో అబార్షన్ కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. పలుమార్లు వైద్యపరీక్షల అవసరం ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతోంది. ఒకవేళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా న్యాయవాదుల ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా ఒక సమస్య. గత వారం సుప్రీంకోర్టులోనూ ఇలాంటి స్థితి ఎదురు కావడం చెప్పుకోవాల్సిన అంశం. అబార్షన్ కోరిన మహిళ మానసిక పరిస్థితి బాగాలేదనీ, కౌన్సెలింగ్ తీసు కోవాలనీ పలుమార్లు న్యాయవాదులు సూచించారు. ఇంతటి కష్టా నికి, ఇబ్బందికి ఓర్చినా తుది ఫలితం అనుకూలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అయితే ఒక్క విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అబార్షన్కు సంబంధించి భారతీయ చట్టాలు కొంత ఉదారంగానే ఉన్నాయని చెప్పాలి. అయినా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, అబార్షన్లో అత్యుత్తమ విధానాల విషయంలో మాత్రం అంత గొప్పగా ఏమీ లేవన్నదీ సుస్పష్టం. గత ఏడాది ‘ఎక్స్’ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మధ్య జరిగిన ఒక కేసు విషయంలో వైద్యపరమైన చట్టాలను అవసరాలకు తగ్గట్టుగా అర్థ వివరణ తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించింది. ఆ కేసులో 24 వారాల వయసు గర్భంతో ఉన్న అవివాహిత మహిళకు అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ మహిళకు ఉన్న హక్కుల ఆధారంగా వైద్యపరమైన పరీక్షలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం, ఎంటీపీ చట్టాలపై లక్ష్యాధారిత అర్థ వివరణ తీసు కోవడం గమనార్హం. మహిళల వాస్తవిక జీవన పరిస్థితులు, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకుని మరీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. అబార్షన్కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్ను నేరంగా పరిగణించడాన్ని నిలిపివేయాలి. గర్భం వయసుపై పరిమితులు, ఇతర నియంత్రణలను కూడా తొలగించాలి. దీనివల్ల అందరికీ వివక్ష లేని అబార్షన్ సేవలు అందుతాయి. ఏ సమయంలోనైనా సురక్షితంగా గర్భాన్ని తొలగించేందుకు ఉన్న పద్ధతులను ఉపయోగించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచించాయి. అబార్షన్ పై అడ్డంకులు విధాన పరమైన అడ్డంకులుగా మారుతున్నాయనీ, ఏ రకమైన శాస్త్రీయ ఆధా రాలు లేనివిగా మారాయనీ కూడా అవి వ్యాఖ్యానించాయి. గత వారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్నల ముందు విచారణకు వచ్చిన కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ తీర్పుతో విభేదించిన విషయం తెలిసిందే. ‘ఎక్స్’ కేసును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న గర్భం విషయంలో ఆ మహిళకు ఉన్న హక్కును గుర్తు చేశారు. మహిళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ గర్భం అవాంఛితమైతే తొలగించుకునే హక్కు ఆ మహిళకు ఉందని స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించాలని కోరడం ఆ మహిళ ఆరో గ్యాన్ని పణంగా పెట్టడం అవుతుందనీ, ఇది ఆర్టికల్ 21, 15 (3)లను అతిక్రమించినట్లు అనీ వివరించారు. అయితే చివరకు ఈ మహిళకు ‘ఎక్స్’ మాదిరిగా అబార్షన్ చేయించుకునే అవకాశం కలగకపోవడం గమనార్హం. ‘ఎక్స్’ కేసులో అవాంఛిత గర్భం తాలూకూ ప్రభావాన్ని అర్థం చేసుకున్న కోర్టు... ఇంకో మహిళ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అబార్షన్ను తొమ్మిది నెలల వ్యవహారా నికి పరిమితం చేసేసింది. అవాంఛిత గర్భం కారణంగా ఆ మహిళ కాన్పు తరువాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది గుర్తించకపోవడం దురదృష్టకరం. వాదనల సందర్భంగానూ న్యాయమూర్తులు, ప్రభుత్వం పలుమార్లు ఈ కేసుకు ఇతర కేసులకు మధ్య తేడాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అబార్షన్కు గల కార ణాల విలువ ఒకరికి ఎక్కువ? ఇంకొరికి తక్కువగా ఉంటాయా? -వ్యాసకర్త బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) బోధకులు -
ఆ ఊపిరి ఆపలేం!
న్యూఢిల్లీ: 26 వారాల ఐదు రోజుల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు ఓ వివాహిత పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ‘‘ఆమె ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతుండటం వాస్తమేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు తేలి్చంది. అయితే గర్భస్థ శిశువు బాగానే ఉందని, ఆరోగ్యపరంగా అసాధారణ పరిస్థితులేమీ లేవని బోర్డు స్పష్టం చేసింది. ఆమె వాడుతున్న మందులు కూడా పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపేవేమీ కావని వెల్లడించింది. అంతేగాక పిండం వయసు వైద్యపరంగా అబార్షన్ (ఎంటీపీ)కి అనుమతించిన 24 వారాల గరిష్ట గడువును కూడా దాటేసింది. కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం’’ అని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇప్పుడు అబార్షన్కు అనుమతించడం భ్రూణ హత్యతో సమానం. ఎంపీటీ చట్టంలోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే. సదరు మహిళ ఆస్పత్రి ఖర్చులన్నింటినీ ఎయిమ్సే భరిస్తుంది. చిన్నారిని పెంచుకోవడమా, దత్తతకివ్వడమా అనేది ప్రసవానంతరం తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. ఇప్పటికే తనకిద్దరు పిల్లలని, 2022 సెపె్టంబర్లో రెండో కాన్పు అనంతరం కుంగుబాటుకు గురయ్యానని పేర్కొంటూ ఓ 27 ఏళ్ల గర్భిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడో బిడ్డను కని పెంచే శారీరక, ఆర్థిక, భావోద్వేగపరమైన స్తోమత లేనందున అబార్షన్కు అనుమతించాలని కోరింది. ఆమెను పరీక్షించిన ఎయిమ్స్ బృందం నివేదిక ఆధారంగా ఆమె 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అక్టోబర్ 9న సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం పిటిషన్ వేసింది. పిండం బాగానే ఉందని, చక్కగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటూ ఎయిమ్స్ బృందంలోని ఒక వైద్యుడు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 6న పంపిన ఈ మెయిల్ను ఉటంకించింది. ఈ నేపథ్యంలో దీనిపై పునరి్వచారణ జరిపిన జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి.నాగరత్న ద్విసభ్య ధర్మాసనం తొలుత అబార్షన్కు అనుమతించినా, బుధవారం భిన్నమైన తీర్పు వెలువరించింది. దాంతో కేసు సీజేఐ ధర్మాసనం ముందుకొచి్చంది. చట్టమూ అంగీకరించదు... వివాహితలకు అబార్షన్ చేసుకునేందుకు ఎంటీపీ చట్టం ప్రకారం అనుమతించిన గరిష్ట గడువు 24 వారాలు. అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్ల వంటి బాధిత మహిళలకు ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఈ గడువును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విడిగా విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఆమె గర్భం తొలగింపునకు అనుమతించం: సుప్రీం కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆమె విజ్ఞప్తిని భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తిరస్కరించింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని, వైద్య నివేదిక ఆధారంగా గర్భవిచ్చిత్తికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. ‘‘గర్భం 26 వారాలు మరియు 5 రోజులు. ఇది పిండం అసాధారణతకు సంబంధించింది కాదు. ఏ రకంగానూ తల్లికి తక్షణ ప్రమాదమూ లేదు. కాబట్టి.. గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ తీర్పు ఇస్తే.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లోని సెక్షన్ 3, సెక్షన్ 5లను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి.. ఆ గుండె చప్పుడును ఆపలేం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బిడ్డ పుట్టాక బాధ్యతల్ని ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారాయన. తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని.. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. ఈ పిటిషన్పై తొలుత విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. అయితే, ఆ మరుసటిరోజే ‘‘పిండం బతికే అవకాశాలు ఉన్నాయి’’ అని ఎయిమ్స్ వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఎయిమ్స్ నివేదికపై ద్విసభ్య ధర్మాసనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో.. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. ఈ క్రమంలోనే గర్భవిచ్ఛిత్తి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణ కొనసాగించింది. ‘‘తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది. బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురుచూశారు. ఇంకొన్ని వారాలు మోయలేరా? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించింది. తదనంతర వాదనలు.. పిండంలో ఎలాంటి అసాధారణతలు లేవని ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గర్భవిచ్చిత్తికి మహిళను అనుమతించబోమంటూ తీర్పు ఇవాళ ఇచ్చింది. SC declines request for Medical Termination of Pregnancy. Says foetus is 26 weeks and 5 days old and medical report shows no abnormality to it. AIIMS to conduct delivery at appropriate time @IndianExpress https://t.co/o4oNHZXzNx — Ananthakrishnan G (@axidentaljourno) October 16, 2023 భిన్న తీర్పులు.. కీలక వ్యాఖ్యలు అక్టోబర్ 9వ తేదీన మహిళ గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 10వ తేదీన ఎయిమ్స్ వైద్య బృందంలోకి ఓ డాక్టర్ కీలకాంశం వెల్లడించారు. పిండం బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. దీంతో.. ఈ అంశం ద్విసభ్య ధర్మాసనం ముందుకు మళ్లీ వచ్చింది. అయితే ఈ మధ్యలోనే ద్విసభ్య ధర్మాసనం తీర్పుపై కేంద్రం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వెళ్లింది. గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి పిటిషన్ వేశారు. ఈ పరిణామంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది సుప్రీం కోర్టు. ఇందులో ఏ బెంచ్ అయినా కీలకమే. మేం తీర్పు ఇచ్చాక.. మళ్లీ ఇదే పరిధిలోని బెంచ్ ముందుకు వెళ్లడం ఏంటి?. కేంద్రమే ఇలా చేస్తే.. రేపు ప్రైవేట్ వ్యక్తులు ఇలా చేయరా?’’ అని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో పిండం బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికపై ఇద్దరు మహిళా జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్నాగరత్న.. మహిళ మానసిక స్థితి ఆధారంగా గర్భవిచ్చిత్తికి అనుమతించిన గత తీర్పునే సమర్థించగా.. జస్టిస్ హిమా కోహ్లీ మాత్రం అంతరాత్మను అనుసరించి అందుకు అంగీకరించబోనని, గర్భంలోని పిండానికి హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్.. ప్రకారం 24 వారాల్లోపు అబార్షన్కు అనుమతి ఉంటుంది. అంతకు మించి అబార్షన్ జరగాలంటే.. దివ్యాంగులు, మైనర్ బాలికలు, రేప్ బాధితురాలు, మానసిక స్థితి సరిగా లేనివాళ్లు .. ఇలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చట్టం అనుమతిస్తుంది. -
పిండం ఎదుగుదల ఎలా ఉంది?
న్యూఢిల్లీ: వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో ఆమె గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆ మహిళ ప్రసవానంతర మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటోందని గర్భాన్ని మోయడానికి ఆమె సిద్ధంగా లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్ని çపరిగణనలోకి తీసుకుంది. మానసిక సమస్యలకు ఆ మహిళ తీసుకుంటున్న మందులు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయో పూర్తిగా పరీక్షలు చేసి వివరంగా కోర్టుకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ శారీరక, మానసిక స్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ‘‘ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లయిన ఆ మహిళ ప్రసవానంతరం వచ్చే మానసిక సమస్యలతో బాధపడుతోందని పరీక్షల్లో తేలితే ప్రత్యామ్నాయంగా మరేౖవైనా మందులు ఇవ్వొచ్చా పరిశీలించాలి’’ అని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యులకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. -
వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో... సుప్రీం భిన్న తీర్పులు
న్యూఢిల్లీ: గర్భ విచ్చిత్తికి సంబంధించిన ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. సుప్రీం కోర్టులో ద్విసభ్య బెంచ్ బుధవారం భిన్న తీర్పుల్ని వెలువరించింది ఒక వివాహిత గర్భం దాలి్చన 26 వారాలకు గర్భవిచ్చిత్తి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎయిమ్స్ ఇచి్చన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచ్లోని న్యాయమూర్తి జస్టిస్ హిమ కొహ్లి పిండం గుండె ఆపేయాలని ఏ కోర్టు అయినా ఎందుకు చెబుతుందని ప్రశి్నస్తూ గర్భవిచ్ఛిత్తికి నిరాకరించారు. సుప్రీం బెంచ్లో మరో న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న దాంతో విభేదించారు. మహిళ నిర్ణయాన్ని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. వివరాల్లోకి వెళితే........ ఇద్దరు పిల్లలున్న ఒక వివాహిత మూడోసారి గర్భం దాల్చింది. అప్పటికే కుంగుబాటు సమస్యతో బాధపడుతున్న ఆమె మానసికంగా, ఆర్థికంగా తాను మరో పిల్లని పెంచడానికి సంసిద్ధంగా లేనని, అందుకే గర్భవిచ్చిత్తికి అనుమతినివ్వాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గర్భం దాల్చి 26 వారాల కావడంతో ఎయిమ్స్లో వైద్యులు ఆమెని పరీక్షించి అబార్షన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అక్టోబర్ 6న నివేదిక కూడా ఇచ్చారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ అక్టోబర్ 9న తీర్పు చెప్పింది.ఆ మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ వైద్యాధికారుల్ని ఆదేశించింది. అబార్షన్కు ముందు ఎయిమ్స్ డాక్టర్లు ఆమెని పరీక్షించి గర్భవిచ్చిన్నం చేసినా శిశువు సజీవంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరో నివేదిక ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గర్భవిచ్చిత్తి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అక్టోబర్ 10న మరో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా బుధవారం ఆ పిటిషన్ను విచారించిన సుప్రీం బెంచ్ తొలుత ఎయిమ్స్లో మరో వైద్య బృందం గర్భవిచ్చిత్తి వల్ల వచ్చే ప్రమాదేమేమీ లేదని ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. అక్టోబర్ 6 న అబార్షన్కు ప్రమాదం లేదని వైద్యులు ఎందుకు నివేదిక ఇచ్చారు ? ఎందుకు ఆ దాపరికం ? నాలుగు రోజుల్లోనే ఎలా పరిస్థితి మారింది ? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. గర్భ విచ్చిన్నం చేసినా శిశువు బతికే ఉంటుందని అంటే ఏ కోర్టు అయినా పిండం గుండె ఆపేయమని ఎందుకు చెబుతుంది ? అంటూ జస్టిస్ హిమాకొహ్లీ ప్రశ్నించారు. నా వరకు నేనైతే అలాంటి పని చేయలేనన్న జస్టిస్ హిమ గర్భవిచ్చిత్తికి నిరాకరించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుని ప్రస్తావించారు. ఇప్పటికీ ఆ మహిళ గర్భం తీసివేయడం పట్ల సుముఖంగా ఉన్నందున ఆమె నిర్ణయాన్ని గౌరవించాలంటూ గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ తీర్పు చెప్పారు. ఆ మహిళ సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు ఆమె శారీరక, మానసిక పరిస్థితుల దృష్ట్యా గర్భవిచ్చిత్తి చేయడమే సరైనదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఈ కేసుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు పరిశీలనకు సిఫారసు చేశారు. -
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. బాజీఘర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ హిందీతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లోనూ నటించింది. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె సుఖీ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్) అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిల్పా శెట్టి తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత అయిన తన తల్లి సునందశెట్టి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మా అమ్మకు నేను కడుపులో ఉండగా.. గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పారని శిల్పాశెట్టి వెల్లడించారు. ఈ విషయాన్ని అమ్మ తనకు చెప్పిందని తెలిపింది. శిల్పా మాట్లాడుతూ.. 'మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. తాను నన్ను కోల్పోతుందని వైద్యులు చెప్పారట. తాను గర్భంలో ఉన్నప్పుజే అమ్మ పరిస్థితి చాలా కష్టంగా ఉన్నందున అబార్షన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మిస్ క్యారేజ్ అవుతుందని అమ్మ భయపడింది. తరచుగా అలా జరగడంతో అబార్షన్ తప్పదనుకున్నారు. కానీ నేను పుట్టాను. ఇది ఒక విధంగా నాకు పునర్జన్మే. అందుకే నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కారణంతో పుట్టానని అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో జీవితంలో ప్రేరణ ఇచ్చే మేసేజ్లు చేస్తుంటా. లైఫ్ అనేది ఎవరికీ కూడా అంతా ఈజీ కాదు. " అంటూ చెప్పుకొచ్చింది. సుఖీ చిత్రం ద్వారా సోనాల్ జోషి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, కుషా కపిల, పావ్లీన్ గుజ్రాల్, దిల్నాజ్ ఇరానీ, చైతన్య చౌదరి, జ్యోతి కపూర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మలు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. (ఇది చదవండి: 'బిగ్బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!) -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
కూతురు అబార్షన్కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇంటికే పరిమితం చేసినా లాక్ డౌన్ సమయంలో అమెరికాకు చెందిన ఒక యువతి చట్ట విరుద్ధమైన పనికి పాల్పడింది. సంతానం వద్దనుకున్న కారణంగా ఓ యువతి అబార్షన్ చేసి కడుపులోని బిడ్డని కడతేర్చింది. నెబ్రాస్కాలో 20 నెలల గర్భస్థ శిశువును చంపడం నేరం కాగా ఆమె 28 వారాలు నిండిన తర్వాత ఈ ఘోరానికి పాల్పడింది. దీంతో ఈ నేరం కింద అరెస్టైన ఆ యువతికి కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు అదనంగా మరో రెండేళ్ల ప్రొబేషన్ కూడా విధించింది. . వివరాల్లోకి వెళితే.. నెబ్రాస్కాకు చెందిన సెలెస్టె బర్గస్(19) లాక్ డౌన్ సమయంలో కడుపులోని 28 నెలల పిండాన్ని చంపుకుంది. అందుకు ఆమె తల్లి జెస్సికా బర్గస్(42) సహకరించింది. కానీ నెబ్రాస్కా దేశ చట్టం ప్రకారం 20 నెలల పిండాన్ని అబార్షన్ చేస్తే అది చట్టరీత్యా నేరం. అయితే ఆ యువతి గర్భాన్ని తొలగించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. చివరకు తన తల్లి సాయంతో అబార్షన్కు పాల్పడి కటకటాల పాలయ్యింది. తన కూతురు గర్భాన్ని తొలగించడానికి సాయం చేసిన ఆ తల్లిపైన కూడా కేసు నమోదు చేశారు నెబ్రాస్కా పోలీసులు. నిజాన్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కూతురిపైనా.. సాక్ష్యాధారాలు లేకుండా చేసినందుకు తల్లిపైనా అభియోగాలు మోపారు నెబ్రాస్కా పోలీసులు. ఇద్దరికీ శిక్ష ఖరారు కాగా సెప్టెంబరు నుండి అమల్లోకి వస్తుంది. మొదట పోలీసు విచారణలో డెలివరీ అయ్యిందని, కానీ మృత శిశువు జన్మించిందని అబద్ధం చెప్పింది ఆ యువతి. తీరా ఆమె ఫేస్బుక్ మెసేజులు పరిశిలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్లో గర్బనిరోధక మాత్రలు గురించి, పిండాన్ని మాయ చేసే ఉపాయం గురించి తన తల్లితో చేసిన చాటింగ్ను పోలీసులు కనుగొనడంతో ఈ విషయం బయటపడింది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
ఆంక్షలు ఉన్నా.. విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన రమిత (పేరు మార్చాం) ప్రస్తుతం రెండో నెల గర్భిణి. ఇటీవల హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె బలహీనతకు కారణాలపై ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఆమె.. మగపిల్లాడి కోసం ఆరు నెలల గర్భం సహా ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఈసారీ లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధమైంది. లింగ నిర్ధారణపై నిషేధం, కఠిన ఆంక్షలు ఉన్నా.. ఇన్నిసార్లు నిర్ధారణ, అబార్షన్లు ఎలా సాధ్యమయ్యాయి? ఓవైపు డయాగ్నొస్టిక్స్ కేంద్రాల అక్రమాలు, మరోవైపు విదేశాలకు వెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడుతున్న తీరు పెరుగుతుండటం ఆందోళన రేపుతున్నాయి. విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తూ.. మన దేశంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. ఒకవేళ అక్రమంగా పరీక్షలు చేస్తున్నా.. సాధారణ డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయడానికి కనీసం గర్భం దాల్చిన 16 వారాల వరకు ఆగాల్సి వస్తోంది. అదే యూకే, అమెరికా, సింగపూర్ వంటి చాలా దేశాల్లో లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధమేదీ లేదు. పైగా 8 నుంచి 10 వారాల వ్యవధిలోనే నిర్ధారణ చేస్తుండటం, దీనిని రాతపూర్వకంగా కూడా వెల్లడిస్తుంటారు. మగ పిల్లలు కావాలనుకునే జంటలు దీనిని సావకాశంగా తీసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి 9–10 వారాల గర్భిణులు విదేశాలకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు. ఇక్కడ అబార్షన్లు చేయించుకుంటూ.. మన దేశంలో గర్భిణులకు 12 వారాల వరకు అబార్షన్ చేయడానికి చట్టబద్ధంగా వెసులుబాటు ఉంది. విదేశాల్లో లింగ నిర్ధారణ చేయించుకున్నవారు ఆడపిల్ల అని తేలితే.. ఇక్కడికి తిరిగి వచ్చాక ఆస్పత్రులకు వెళ్లి అబార్షన్ చేయించుకుంటున్నారు. ‘కండోమ్ ఫెయిల్యూర్, గర్భం రాకుండా వేసుకునే మందులు తీసుకోవడం మర్చిపోవడం’ అంటూ ఏదో కారణం చెప్తున్నారు. కొందరైతే లింగ నిర్ధారణతోపాటు అబార్షన్ కూడా విదేశాల్లోనే చేయించుకుని వస్తున్నారు. ఇందు కోసం థాయ్లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తున్నారు. ‘‘డబ్బున్నవాళ్లు లిఖితపూర్వకంగా లింగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఇచ్చే దేశాలకు వెళ్తున్నారు. కొందరు మధ్యతరగతి వారు కూడా మగ పిల్లలు కావాలన్న ఆశతో ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్ను నడిపించే వారి సంఖ్య పెరుగుతోంది’’ అని ప్రసూతి, గైనకాలజీ సొసైటీకి చెందిన డాక్టర్ శాంత కుమారి చెప్పారు. చైతన్యం కలిగించడమే మార్గం.. ‘‘తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు మన దేశంలో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేసుకోవడానికి రూ.25,000 నుంచి రూ. 45,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. విదేశాలలోనూ చట్టబద్ధంగా కూడా దాదాపు ఇదే ఖర్చు అవుతుంది. ప్రయాణ ఖర్చులే అదనం. విదేశాల్లో పరిశుభ్రమైన పరిస్థితులలో, సరైన మెడికల్ బ్యాకప్తో జరుగుతుంది. దీనితో కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి దేశం దాటుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి అవకాశం లేదు. జంటలలో అవగాహన పెంచడం, చైతన్యం కలిగించడం తప్ప మరోదారి కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఏజెంట్లు, మధ్యవర్తుల వ్యవహారం లింగ నిర్ధారణ, తర్వాత అబార్షన్, నేరుగా అవాంఛనీయ గర్భాన్ని గానీ తొలగించుకోవాలనుకునే వారి కోసం.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు, ఆస్పత్రులకు మధ్య ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ, విషయం బయటికి తెలియకుండా ‘పని’ కానిచ్చేస్తూ.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాల వారికి, ఆస్పత్రులకు వీరే సొమ్ము ముట్టజెప్తుంటారు. ఇలాంటి ఏజెంట్లు, దళారుల వల్ల భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. కొడుకు కావాలనే కోరికతో.. మగ పిల్లలు కావాలనే కోరికతో లింగ నిర్ధారణ పరీక్షలకు వెంపర్లాడే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటారనేది సాధారణ నమ్మకం. ఈ విషయంలో సంపన్నులు, బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. పెరుగుతున్న ఖర్చులతో ఒకరిద్దరు పిల్లలు మాత్రమే కావాలనుకోవడం, అందులోనూ వంశాన్ని కొనసాగించడానికి కొడుకు ఉండాలన్న ఆలోచన, ఆ దిశగా ఇళ్లలో పెద్దల ఒత్తిళ్లు వంటివి.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడానికి, ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయించేందుకు తెగబడటానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. ఇది కూడా చదవండి: పుడమి తల్లికి తూట్లు! -
కరీంనగర్లో అబార్షన్ల కలకలం
కరీంనగర్టౌన్: గర్భంతో ఉన్న తన కోడలుకు క్లినిక్ నిర్వాహకురాలు అబార్షన్ చేసిందంటూ అత్తామామలు ఆసుపత్రిలో గొడవకు దిగి, దాడిచేసిన ఘటన మంగళవారం కరీంనగర్లో కలకలం రేపింది. వివరాల్లోకెళితే... పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన ఓ వివాహిత జ్యోతినగర్లోని ఓ క్లినిక్కు రాగా అత్తామామలు సైతం ఆమెను వెతుక్కుంటూ అక్కడికి చేరుకొని తన కోడలు గర్భం తీయించుకుందని గొడవకు దిగారు. నిర్వాహకురాలితో పాటు కోడలి తల్లిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, దాడికి పాల్పడ్డారు. అయితే తనకు రక్తస్రావం అవుతుంటే చికిత్స చేయించుకునేందుకు వచ్చాను తప్ప.. అబార్షన్ చేయించుకోలేదని కోడలు చెప్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు జ్యోతినగర్ క్లినిక్ వెళ్లి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు సదరు క్లినిక్పై 2019 నవంబర్ 7న వైద్యారోగ్యశాఖ అధికారులు దాడి చేసి అబార్షన్లు జరుగుతున్న విషయంపై ఆరా తీయగా, పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసి, క్లినిక్ను మూసివేశారు. తాజాగా మంగళవారం జరిగిన ఈ ఘటనతో మళ్లీ ఆ క్లినిక్లో విచ్చలవిడిగా అబార్షన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ట్రీట్మెంట్ చేయించుకునేందుకు నగరంలో ప్రముఖ గైనకాలజిస్టులు ఉన్నప్పటికీ ధర్మారం మండలం నుంచి ప్రత్యేకంగా పేషెంట్ జ్యోతినగర్లో ఉన్న సాధారణ క్లినిక్కు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
బాలిక 32 వారాల గర్భ విచ్ఛిత్తికి కేరళ హైకోర్టు అనుమతి
కొచ్చిన్: సొంత సోదరుడి అఘాయిత్యానికి బలై గర్భం దాల్చిన బాలికకు కేరళ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆమె 32 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి మంజూరు చేసింది. ‘బాధిత బాలిక(15) శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లు వైద్య నివేదికను బట్టి తెలుస్తోంది. గర్భం కొనసాగింపు వల్ల ఆమె సామాజిక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వాలని నిర్ణయిస్తున్నాం’ అని జస్టిస్ జియాద్ రహ్మన్ ఈ నెల 19న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన చర్యలను అమలు చేసి, వారంలోగా పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని మలప్పురం జిల్లా వైద్యాధికారి, మంజేరి మెడికల్ కాలేజి హాస్పిటల్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. -
మహిళ మృతికి అబార్షన్ ట్యాబ్లెట్లే కారణమా?
ఖమ్మం: మండలంలోని మాలబంజర గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ ఘటనపై సుజాతనగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భూక్యా దివ్య (26)కు అదే గ్రామానికి చెందిన జగపతితో వివాహం జరిగింది. దివ్యకు మొదటి, రెండు కాన్పుల్లో మగ పిల్లలే జన్మించారు. మూడు నెలలుగా రుతుస్రావం కాకపోవడంతో ఈ నెల 5న రుతుస్రావం కోసం ట్యాబెట్లు వేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం రక్తస్రావానికి గురికాగా వైద్యం నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు కొత్తగూడెం తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, కాన్పు ఇష్టం లేక గర్భాన్ని తొలగించుకోవాలనే ఉద్దేశంతో అబార్షన్ ట్యాబెట్లు వేసుకొందనే ప్రచారం జరుగుతోంది. చండ్రుగొండ మండలం మేకలబండకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు గర్భస్రావం ట్యాబ్లెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.తిరుపతిరావు తెలిపారు. -
ఇన్స్టాగ్రామ్ పరిచయమే కొంప ముంచింది! క్లాస్రూంలోనే బీటెక్ విద్యార్థిని
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రేమ ఆ విద్యార్థిని పాలిట యమపాశమైంది. నయవంచకుడి మాటలకు మోసపోయిన ఆమె గర్భం ధరించింది. తర్వాత ప్రేమికుడు ముఖం చాటేశాడు. పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాననే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడింది. హాస్టల్ గదిలోనే స్వీయ గర్భస్రావానికి ఒడిగట్టి అపస్మారక స్థితికి చేరుకోగా.. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కక చివరకు ప్రాణాలొదిలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన మధు దంపతుల ఏకైక కుమార్తె కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అధిక రక్తస్రావం కావడంతో.. కాగా, ఈ నెల 7, 8 తేదీల్లో ఆ విద్యార్థిని తరగతులకు హాజరుకాకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. అదేమని అడిగితే ఆరోగ్యం బాగాలేదని సహచర విద్యార్థినులకు చెప్పింది. 8వ తేదీన మధ్యాహ్నం భోజన సమయంలో అదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థిని భోజనం తీసుకు వెళ్లగా.. ఆమె తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో పడి ఉంది. గది నిండా రక్తం ఉండటం, డస్ట్బిన్లో పిండం పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థిని కేకలు వేయడంతో మరికొందరు గదిలోకి వెళ్లారు. వెంటనే అధ్యాపకులకు తెలియజేయడంతో వారు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆమెను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జీజీహెచ్కు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. స్వీయ గర్భస్రావానికి ప్రయతి్నంచిన విద్యార్థిని అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. సీఐ పి.శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఎస్ఐ కోటిరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్ఫోన్ కాల్ డీటైల్స్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలికి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ శశికుమార్తో పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం శశికుమార్కు ఆమె ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాగా.. అది కాస్తా ప్రేమకు దారితీసిందని తెలిసింది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి చివరకు ఆమె గర్భం దాల్చిందని సమాచారం. పరువు పోతుందన్న భయంతోనే ఆ విద్యార్థిని స్వీయ గర్భస్రావానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని వైద్యులు, పోలీస్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని గర్భవతి అయిన విషయంలో ఎవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. మరో ఇద్దరు అనుమానితులు కూడా ఉన్నట్టు సమాచారం. లేకలేక పుట్టిన సంతానం మృతురాలి తల్లి పోలియో బాధితురాలు కాగా.. తండ్రి వ్యవసాయ కూలీ. పెళ్లయిన పదేళ్ల తర్వాత పుట్టిన ఏకైక గారాలపట్టి కావడంతో చిన్నతనం నుంచే తల్లిదండ్రులు ఆమెను గారాబంగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇచ్చేవారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఆ విద్యార్థిని చదువుల్లో రాణిస్తోంది. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడుతుందని భావిస్తున్న తమ కలల్ని కల్లలుగా మార్చి ఒక్కగానొక్క కుమార్తె తమకు గర్భశోకం మిగిల్చిందని తల్లిదండ్రులు బావురుమంటున్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. నా భార్యతోనే చనువుగా ఉంటావా అంటూ.. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఇంటికి వచ్చిందని.. బంధుమిత్రులతో సందడి చేసిందని గ్రామస్తులు తెలిపారు. చివరకు ఆమె విగతజీవిగా గ్రామానికి రావడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ప్రేమ పేరుతో యువతిని వంచించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరారు. -
భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర తీసుకున్న మహిళ.. చివరకు..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రీతి కుశ్వాహా అనే 33 ఏళ్ల మహిళ భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్రం తీసుకుంది. దీని వల్ల సమస్యలు తలెత్తి తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. అయితే ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రీతి మళ్లీ గర్బం దాల్చినట్లు తేలింది. ఇప్పటికే చిన్న పాప ఉన్నందున ఇంత త్వరగా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసింది. అబార్షన్ చేయించుకుంటానని భర్తకు చెప్పగా.. అందుకు అతను ఒప్పుకోలేదు. అయితే సోమవారం సాయత్రం భర్త బయటకు వాకింగ్కు వెళ్లినప్పుడు ప్రీతి అబార్షన్ మాత్ర తెచ్చుకుని వేసుకుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భరించలేని కడుపునొప్పితో పాటు రక్తస్రావమైంది. భర్త ఆస్పత్రికి తీసుకెళ్తానంటే ఆమె వద్దంది. కానీ మంగళవారం ఉదయం ప్రీతి స్పృహ తప్పి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. అయితే ప్రీతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబార్షన్ మాత్ర వల్లే మహిళ చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఏమీ కన్పించడంలేదని పేర్కొన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
Hyderabad: గర్భిణీకి బలవంతంగా గర్భస్రావం మాత్రలిచ్చిన భర్త
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో ఆరు నెలల గర్భిణీ అయిన భార్య కడుపులోని శిశువు హత్యకు కారణమైన భర్త, అత్తలను కంచన్బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. హఫీజ్బాబానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహమూద్, తబస్సుమ్ బేగంలు దంపతులు. వీరికి 18 నెలల పాప సంతానం ఉంది. ప్రస్తుతం తబస్సుమ్ ఆరు నెలల గర్భిణీ. అయితే భర్త మహమూద్ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో ఈ నెల 14వ తేదీన రాత్రి తబస్సుమ్కు బలవంతంగా అబార్షన్ మందులు అందించాడు. దీంతో ఈ నెల 15వ తేదీన తబస్సుమ్ తీవ్ర రక్తస్రానికి గురై ఇంట్లోనే చనిపోయిన శిశువుకు జన్మనిచ్చింది. దీంతో మహమూద్ కుటుంబ సభ్యులు మృత శిశువుని హఫీజ్బాబానగర్లోనే పాతిపెట్టారు. అనంతరం తబస్సుమ్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో చాంద్రాయణగుట్టలోని లిమ్రా ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలను అందించాడు. ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం తబస్సుమ్ను భర్త మహమూద్, కుటుంబ సభ్యులు తలాబ్కట్టాలో నివాసముండే తల్లిగారింటికి పంపించారు. దీంతో తబస్సుమ్ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. తబస్సుమ్ కుటుంబ సభ్యులు ఈ నెల 17వ తేదీన కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో భర్త మహమూద్, అత్త షమీమ్ బేగం, ఆడ పడుచు షహనాజ్లపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా బండ్లగూడ మండల తహసీల్దార్ నవీన్, ఫొరెన్సిక్ వైద్య సిబ్బంది సమక్షంలో హఫీజ్బాబానగర్లో పాతిపెట్టిన శిశువుని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శిశువు మృతికి కారణమైన మహమూద్, షమీమ్ బేగంలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఈ కేసులో మరో నిందితులు ఆడపడుచు షహనాజ్ పరారీలో ఉంది. -
మూడోసారి ఆడపిల్లేనని.. గర్భస్రావానికి మాత్రలు మింగిన యువతి మృతి
సాక్షి, చెన్నై: మూడోసారి గర్భంలోనూ ఆడపిల్లే ఉందన్న బాధతో ఓ యువతి గర్భస్రావం చేసు కోవడానికి మాత్రలు మింగడంతో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని కీళకురిచ్చి గ్రామానికి చెందిన గోవిందరాజ్, అముద (27) దంపతులు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అముద మూడోసారి గర్భం దాల్చింది. కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డా, ఆడబిడ్డా అని అముద తెలుసుకోవాలనుకుంది. దీనికి సంబంధించి పరీక్షలు చేయించుకునేందుకు గత 17వ తేదీ అముద కల్లకురిచ్చి జిల్లా అసకలత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఉన్న ఆస్పత్రి యజమాని, అముద కడుపుని స్కాన్ చేసి, ఆమె ఆడపిల్లను మోస్తున్నట్లు చెప్పింది. మూడోసారి ఆడబిడ్డకు జన్మనివ్వడానికి ఇష్టం లేని అముద అబార్షన్ చేయమని కోరింది. ఆ తర్వాత అముదకు అదే ఫార్మసీలో అబార్షన్ మాత్రలు ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత వేపూర్ సమీపంలోని నిరామణిలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 2 రోజులు అక్కడే ఉన్న ఆమెకు శనివారం సాయంత్రం తీవ్ర రక్తస్రావం అయింది. కొద్దిసేపటికి స్పృహతప్పి పడిపోయింది. దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు, బంధువులు వెంటనే అముదను చికిత్స నిమిత్తం వేపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అముద అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి వేపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రభుత్వ టీచర్గా హిజ్రా.. చదువుపై ఇష్టంతో.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. -
లోపలి శత్రువు
ప్రతి మనిషికీ అంతరంగంలో ఆరుగురు శత్రువులు ఉంటారని చెబుతారు. ఆ శత్రువును ఓడించి అదుపులో పెట్టగలిగినప్పుడు ఆ మనిషికి పురోగతి సాధ్యమవుతుంది. అదుపులో పెట్టలేకపోతే పతనం తప్పదు. ఇది మనకు చిరకాలంగా వినిపిస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేవి విడివిడిగా వ్యక్తులకు ఉండే ఆరుగురు అంతః శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటున్నాము. వ్యక్తులపై కాకుండా సమూహాలపై దాడి చేసే అంతః శత్రువులు కూడా ఉంటారు. ఈ శత్రువులు సామాజిక విలువల రూపంలో కూడా ఉండవచ్చు. కట్టుబాట్ల రూపంలో ఉండవచ్చు. ఆచార సంప్రదాయాల రూపంలో కూడా ఉండవచ్చు. ఈ సంప్రదాయాలు మన మెదళ్లలో తిష్ఠ వేసుకొని ఆలోచనలను తమ గుప్పెట్లోకి తీసుకుంటూ ఉండవచ్చు. సమాజం గతిశీలమైనది. నిరంతర చలనం దాని స్వభావం. వస్తుగత మార్పులను ఎప్పటికప్పుడు అది ఆహ్వానిస్తూనే ఉంటుంది. సామాజిక చైతన్యాన్ని శాశ్వత విలువలతో, కట్లుబాట్లతో నియంత్రించడం సాధ్యం కాదు. ఒకప్పుడు సదాచారాలు అనుకున్నవి కాలక్రమంలో దురాచారాలుగా పరిగణించవచ్చు. అటువంటి దురాచారాలను క్రమానుగతంగా మన సమాజం తొలగించుకుంటూ పురోగమిస్తున్నది. అట్లా తొలగించుకోలేక మిగిలిపోయిన దురాచారాలే సమాజ వికాసానికి ప్రతిబంధకాలవుతున్నాయి. కాలానుగుణమైన మార్పుల్ని ఆహ్వానించడం ఒక పురోగామి సూత్రం. అటువంటి మార్పులు మన ఆలోచనల్లో రావాలి. మనం ఏర్పరచుకున్న చట్టాల్లో కూడా రావాలి. మొన్న ఒక అబార్షన్ సంబంధిత కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం చెప్పింది ఇదే. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం మహిళలకు ఉండే తిరుగులేని హక్కుగా సమున్నత న్యాయస్థానం గుర్తించింది. ఇది వైవాహిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలందరికీ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మనదేశంలో పెళ్లి కాకుండానే గర్భం దాలుస్తున్న బాలికలు, యువతుల సంఖ్యకు లెక్కలేదు. ఇటువంటి అవాంఛిత గర్భాలకు వారినే బాధ్యులుగా చేయటం దుర్మార్గం. తాము ఎదిరించలేని వారు, తమ వారు అనుకున్న వారి అఘాయిత్యాల బారిన పడుతున్న యువతులు ఎంతో మంది ఉంటున్నారు. కామాంధుల అత్యాచారాలకు గురవు తున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. వీరే కాదు, వ్యక్తిగత కారణాల రీత్యా వివాహానికి దూరంగా ఉండదలచిన వారు, విడాకులు తీసుకున్న వారు కూడా చాలామంది ఉంటారు. ఇష్టపూర్వకమైన కలయికలు చట్టవిరుద్ధం కాదని గతంలోనే న్యాయస్థానం తీర్పు చెప్పింది. కలయిక చట్టవిరుద్ధం కానప్పుడు గర్భస్రావం మాత్రం ఎట్లా చట్టవిరుద్ధమవుతుంది? ఈ వైరుద్ధ్యాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన స్త్రీలకు పునరుత్పాదక హక్కులనేవి సహజ హక్కులు. ఈ సత్యాన్ని న్యాయస్థానం గుర్తించినట్లయింది. మన న్యాయస్థానాలు అప్పుడప్పుడు ఇటువంటి ప్రగతి శీలమైన తీర్పులనివ్వడం ద్వారా సామాజిక వికాసానికి దోహదం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే అమెరికా సుప్రీంకోర్టు ఇదే విషయంలో భిన్నమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో మన సుప్రీం తీర్పు గర్వకారణం. అయితే మన న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో సామాజికాంశాలకు సంబంధించి ప్రగతి నిరోధకమైన తీర్పుల్ని ఇవ్వకపోలేదు. న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కనుక సామాజిక విలువలుగా చలామణిలో ఉన్న భావజాల ప్రభావం వారిపై కూడా ఉండవచ్చు. పితృస్వామిక వ్యవస్థ భావజాల ప్రభావం నుంచి చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా తప్పించు కోలేకపోతున్నారు. పదేళ్ల కిందట సుప్రీంకోర్టులోనే ఒక విడాకుల పిటిషన్ మీద ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా సరే భర్త బదిలీపై వెళ్ళినప్పుడు భార్య తన ఉద్యోగాన్ని వదిలేసైనా సరే వెళ్లాలని కోర్టు చెప్పింది. సీతాదేవి శ్రీరాముడిని అనుసరించి వెళ్లినట్లు భార్య కూడా భర్తను అనుసరించి వెళ్లాలని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాదు, భార్యల సంపాదనను ‘లిప్స్టిక్ మనీ’గా కూడా పోల్చింది. 2018లో కేరళ హైకోర్టులో మరో న్యాయమూర్తి ఒక తీర్పును ఇస్తూ చేసిన వ్యాఖ్యానం మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నది. భార్యకు ఉండవలసిన లక్షణాలను చెప్పడానికి ఆయన ఒక సంస్కృత∙శ్లోకాన్ని ఉదహరించారు. పితృస్వామిక భావజాలానికి పరాకాష్ఠ ఈ శ్లోకం. బాగా పాపులర్. పురుషుల్లో చాలామందికి నచ్చుతుంది కూడా! ‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి...’! భార్య చూడటానికి లక్ష్మీదేవిలా ఉండా లట! భర్తకు దాసి లాగా సేవ చేయాలి. మంత్రిలా సలహా లివ్వాలి. అమ్మలా తినిపించాలి. రంభలా శయనించాలి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. పురుషాధిక్య సమాజం కనుక పురుషుని కోణం నుంచి, కోర్కెల నుంచి అల్లిన శ్లోకం బాగానే ఉన్నది. కానీ దీన్నే తిరగేసి స్త్రీల కోణం నుంచి కొత్త శ్లోకం అల్లితే? తమ పురుషునిలో స్త్రీ కోరుకునే లక్షణాలపై పరీక్ష పెడితే ఎంతమంది పురుష పుంగవులు పాస్ మార్కులు తెచ్చు కోగలరు? చెప్పడం కష్టం. ఇటువంటి కాలం చెల్లిన మౌఢ్యాన్ని సమాజం వదిలించుకోలేకపోతే ఇప్పుడు మనకు అవసరమైన పురోగతిని సాధించటం సాధ్యం కాదు. అండపిండ బ్రహ్మాండమైన విశ్వంలో భూగోళమే ఒక పిపీలికం. మన పిపీలికం ఉన్న పాలపుంత ఈ చివరి నుంచి ఆ చివరవరకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తే లక్ష సంవత్సరాలు పడుతుందట! ఈ పాలపుంతను పోలిన గెలాక్సీలు విశ్వంలో వందల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నరజాతి సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రతిభ ఎక్కడున్నట్టు? విశ్వ రహః పేటికా విపాటన లక్ష్యం సాధించేది ఎప్పుడు? భూగోళంలో తన చరిత్రను తాను ఇప్పటికీ మానవుడు పూర్తిగా ఆవిష్కరించలేదు. క్రీస్తు పుట్టిన తర్వాత రెండు వేల యేళ్లు, అంతకుముందో వెయ్యేళ్లు తప్ప అంతకుమించి మనకున్నది అరకొర జ్ఞానమే. ఎన్నో మహో న్నతమైన నాగరికతలు ఎందుకు అంతరించాయో తెలియదు. ఆ నాగరికతల పూర్తి వివరాలూ తెలియవు. మూడున్నర వేల ఏళ్లకు పూర్వమే మహిళలకు సురక్షితమైన గర్భస్రావ విధానాలు ఎటువంటి వివక్ష లేకుండా అందుబాటులో ఉన్నాయని ఆధారాలు కూడా ఈజిప్టులో దొరికాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు మనం సుప్రీంకోర్టు తీర్పును గొప్ప ముందడుగుగా వర్ణించుకునే దుఃస్థితిలో ఉన్నాము. ఎటువంటి అరమరికలు, విభేదాలు లేనప్పుడే, ప్రజలం దరూ ఐక్యమైనప్పుడే, విజ్ఞానవంతులైనప్పుడే మానవజాతి శాస్త్ర సాంకేతిక పురోగతి సాధించగలుగుతుంది. కానీ మతాన్ని సంకుచితంగా అన్వయించి, మౌఢ్యంగా అనువదించి విసురు తున్న కత్తులతో, పారిస్తున్న నెత్తురుతో నరజాతి శత్రు శిబిరాలుగా విడిపోతున్నది. మనదేశంలో కులోన్మాదం కలిగిస్తున్న నష్టం ఇంతా అంతా కాదు. వీటితో పాటు ఇంకా మన మెదళ్లలో తిష్ఠవేసిన పితృస్వామిక భావజాలం సగం జనాభాలోని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చంపేస్తున్నది. ఈ పితృస్వామిక భావజాలం ఓ సైలెంట్ కిల్లర్. మతాలు, కులాలు, దురాచారాలు చేసిన నష్టం కంటే ఎక్కువ నష్టాన్ని నిశ్శబ్దంగా చేసుకుపోతున్నది. అభ్యుదయవాదులు, విప్లవకారు లుగా చెప్పుకునే వాళ్లు కూడా దీని కనికట్టు పట్టులో చిక్కుకుంటు న్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. మన టెలివిజన్లలో వచ్చే కార్యక్రమాల్లో చెత్త కార్యక్రమాలు కోకొల్లలు. సకుటుంబ సపరివార సీరియళ్ల పేరుతో కొన్ని సీరియళ్లు బోలెడంత సామాజిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇన్ని చెత్తల్లో ఒక చెత్త ‘బిగ్ బాస్’. కానీ మన అభ్యుదయవాదుల టార్గెట్ మాత్రం ‘బిగ్ బాస్’ ఒక్కటే. ఎందుకంటే అందులో ఓ పదిమంది అమ్మాయిలు, ఓ పదిమంది అబ్బాయిలు కొంత కాలం పాటు కలిసి ఉంటారట! ఎంతో పరిణతి పొందిన యువతీ యువకులు వీరు. చదువుకున్న వాళ్ళు, స్వతంత్రంగా జీవన గమనాన్ని సాగిస్తున్న వారు. వాళ్ళంతా కలిసి కొన్ని రోజులపాటు ఒకే ఇంట్లో ఉండి ఆటలాడినంత మాత్రాన ఏదో ప్రళయం ముంచుకొస్తుందట! ఆకాశం కుంగిపోతుందట! అగ్ని పర్వతాలు బద్దలవుతాయట! మన సంస్కృతీ సంప్రదాయా లను ఈ కార్యక్రమం మంటగలుపుతున్నదని విమర్శించేవాళ్లు ఉన్నారు. ఏ సంస్కృతిని? కార్యేషు దాసి సంస్కృతినేనా? అది మంటగలిస్తేనే మానవజాతి విముక్తి సాధించగలుగుతుంది. ‘బిగ్బాస్’ అనేది సమాజానికి పనికి వచ్చే గొప్ప కార్యక్రమం కాకపోవచ్చు. అంతమాత్రాన అందులో పాల్గొం టున్న యువతీ యువకుల క్యారెక్టర్ను దెబ్బతీసే కామెంట్లు చేయడం న్యాయం కాదు. వాళ్ల మీద వేస్తున్న నిందలు అమానుషం. ముఖ్యంగా చాలామంది యువతులు ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని, ఎన్నో మూతివిరుపుల్ని అధిగమించి స్పాట్లైట్లోకి దూసుకొస్తున్నారు. సమాన స్థాయి కోసం ప్రపంచం మీదకు దండెత్తి వస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో, నవ చైతన్యంతో కదం తొక్కుతూ వస్తున్నారు. వీళ్ళూ అందులో భాగమే! వీలైతే స్వాగతిద్దాం. కాకపోతే చచ్చుబడిన మోకాళ్ళను అడ్డం పెట్టకుండా పక్కకు తప్పుకుందాం. మహిళా సాధికారత సాధ్యం కాకుండా ముందు ముందు మరే గొప్ప నాగరికత నిర్మాణం కాబోదు. ఆ సాధికారత సాధ్యం కావాలంటే పితృస్వామిక భావజాలాన్ని ఓడించక తప్పదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మహిళకు ‘సుప్రీం’ భరోసా
గర్భవిచ్ఛిత్తి విషయంలో మహిళకు స్వేచ్ఛనీయని సమాజం కపటత్వంలో బతుకుతున్నట్టేనని నార్వే మాజీ ప్రధాని బ్రంట్లాండ్ ఒక సందర్భంలో అన్నారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలన్న తేడా లేకుండా చాలా సమాజాలు స్త్రీలకు ఉండాల్సిన పునరుత్పాదక హక్కుల సంగతి వచ్చేసరికి వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తున్న వేళ గురువారం మన సర్వోన్నత న్యాయస్థానం వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్టాన్ని విస్తృతపరుస్తూ ఇచ్చిన తీర్పు స్వాగతించదగ్గది. సురక్షిత అబార్షన్ వారి వారి వైవాహిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఉండే తిరుగులేని హక్కని ఈ తీర్పు తేల్చిచెప్పింది. అవాంఛిత గర్భం పొందిన సందర్భాల్లో గర్భస్రావం చేయించుకునే హక్కు వివాహితతోపాటు సహజీవన సంబంధంలో ఉండే మహిళలకు సైతం ఉంటుందని తెలిపింది. వైవాహిక సంబంధాల్లో మహిళ ఇష్టం లేకుండా లైంగిక సంపర్కంలో పాల్గొ నటం అత్యాచారంగా పరిగణించాలా లేదా అనే అంశం మరో ధర్మాసనం పరిశీలనలో ఉండగానే అటువంటి సందర్భాల్లో సైతం అబార్షన్కు మహిళకు అవకాశమీయడం కొనియాడదగింది. ‘మహిళ’ నిర్వచనాన్ని కూడా విస్తృతీకరించటం ఈ తీర్పు విశిష్టత. జన్మతహా గుర్తించే జెండర్ని మాత్రమే పరిగణించే పద్ధతిని మార్చి ‘గర్భం ధరించగల వ్యక్తులందరికీ’ పునరుత్పాదక హక్కులు సమానంగా వర్తిస్తాయని తీర్పు విశదీకరించింది. ఇందువల్ల లింగనిర్ధారణ చట్రంలో ఇమడని ట్రాన్స్జెండర్, నాన్ బైనరీ జెండర్లకు సంబంధించిన వ్యక్తులకు కూడా గర్భవిచ్ఛిత్తి హక్కులు సమకూరుతాయి. 24 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలంటూ చేసుకున్న వినతిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ఒక అవివాహిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. నైతిక విలువల మాటెలా ఉన్నా మారుతున్న సమాజ పోకడల వల్ల పెళ్లికాకుండా తల్లులవు తున్నవారి సంఖ్య గణనీయంగానే ఉంటున్నది. పర్యవసానాలు తెలియని అమాయకత్వం వల్లనో లేదా ఆప్తులనుకున్నవారి లైంగిక నేరాల వల్లనో, అపరిచిత వ్యక్తుల అఘాయిత్యాలవల్లనో బాలికలు గర్భవతులవుతున్నారు. అలాంటివారు వేరే దారిలేక నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇక వైవాహిక బంధానికి వెళ్లకుండా ఒంటరిగా ఉందామనుకునేవారికి సైతం ప్రస్తుత చట్ట నిబంధనలు పెద్ద ఆటంకంగా మారాయి. గర్భస్రావానికి సిద్ధపడాలో లేదో తేల్చుకోవాల్సింది సంబంధిత మహిళే తప్ప ఆమె కుటుంబం కాదని అనటం, డాక్యుమెంట్లు, న్యాయపరమైన అనుమతి అవసరమనటం సరికాదని ధర్మాసనం చెప్పటం ఎందరికో ఊరటనిస్తుంది. పితృస్వామిక భావజాల చట్రం పరిధి లోనే ప్రభుత్వాలూ, కింది కోర్టులూ ఆలోచించిన కారణంగా అవాంఛిత గర్భాలను తొలగించు కోవటం మహిళలకు కష్టంగా మారింది. 2003లో వచ్చిన ఎంటీపీ నిబంధనలు సహజీవన సంబంధంలో ఉన్న మహిళ గర్భవిచ్ఛిత్తి చేసుకోవటం విషయంలో మౌనం వహించాయి. ఢిల్లీ హైకోర్టు ఆ నిబంధనలను ప్రాతిపదికగా తీసుకుని ఆమె పిటిషన్ను తోసిపుచ్చింది. చట్టాలు, నిబంధనలు చేసినప్పుడు ప్రస్తావనకు రాని అంశాలు ఆచరణలో సమస్యాత్మకం కావటం విడ్డూర మేమీ కాదు. అటువంటప్పుడు సృజనాత్మకంగా అన్వయించటం, చట్టం లేదా నిబంధనల పరిధిని విస్తృతపరచటం న్యాయస్థానాల బాధ్యత. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆ పని చేసింది. అంతేకాదు... పునరుత్పత్తి హక్కుల విషయంలో ప్రభుత్వాల బాధ్యతను కూడా గుర్తుచేసింది. అందరికీ సురక్షిత లైంగిక విధానాలు, గర్భనిరోధక సాధనాల ప్రాముఖ్యతను తెలియజేయటం ప్రభుత్వాల విధి అనీ, తగిన వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉంచటం అవసరమనీ సూచించటం మెచ్చ దగింది. తాను శారీరకంగా, మానసికంగా గర్భస్రావాన్ని తట్టుకోగల స్థితిలో ఉన్నానో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛ మహిళకే ఇచ్చి, మెడికల్ బోర్డుల పెత్తనాన్ని తొలగించటం ఈ తీర్పులోని మరో కీలకాంశం. ఏ మహిళైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మెడికల్ బోర్డు ఏర్పాటుచేయటం ఆనవాయితీగా మారింది. ఆ బోర్డు సభ్యులు రకరకాల పరీక్షలతో కాలయాపన చేయటం, చివరకు గర్భం కొనసాగించక తప్పకపోవటం రివాజయింది. ఎంతో ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే అమెరికాలోని సుప్రీంకోర్టు అబార్షన్ హక్కుల విషయంలో ఈమధ్య ఎంతటి సంకుచితమైన తీర్పునిచ్చిందో అందరికీ తెలుసు. 1973, 1992 కేసుల్లో మహిళలకు లభించిన అబార్షన్ హక్కుల్ని అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు కాల రాసింది. ఢిల్లీ హైకోర్టు సైతం ఆ తోవనే వెళ్లటంతో కొందరు మహిళా సంఘ నేతలు మన సుప్రీంకోర్టు నిర్ణయంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ తాజా తీర్పు మహిళలకు భరోసాగా నిలిచింది. మహిళకు తన శరీ రంపై పూర్తి హక్కు ఉంటుందనీ, పిల్లల్ని కనాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆమెదేననీ చెప్పటం అత్యంత విలువైన మాట. అయితే గర్భవిచ్ఛిత్తి చట్టపరంగా మాత్రమే కాదు... సామాజికంగా కూడా ఆమోదనీయమయ్యేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. ఎంటీపీ చట్ట నిబంధనల వెలుపల గర్భస్రావం చేయించుకోవటం ఇప్పటికీ నేరంగానే పరిగణిస్తున్నారు. జిందాల్ లా స్కూల్ నివేదిక సూచించినట్టు తగినంతమంది రేడియాలజిస్టులు, ప్రసూతి వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపు ణులు, గైనకాలజిస్టులు అందుబాటులో ఉండేలా చేస్తేనే గర్భస్రావం ప్రాణాంతకమయ్యే స్థితి నుంచి మహిళలు బయటపడతారు. ఆ దిశగా చర్యలు అవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి. -
అబార్షన్ రూల్స్.. ఏ దేశంలో ఎలా?
సరిగ్గా మూడు నెలలు క్రితం అగ్రరాజ్యమైన అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్లపై రాజ్యాంగబద్ధంగా మహిళలకు వచ్చిన హక్కుల్ని తోసిపుచ్చుతూ తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. 1973లో రియో వర్సెస్ వేడ్ కేసు ద్వారా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుని 50 ఏళ్ల తర్వాత కొట్టేసింది. ఫలితంగా కొన్ని పరిమితుల మధ్య అబార్షన్ చేయించుకునే దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే అమెరికాలో రాష్ట్రాలే శక్తిమంతం కావడంతో ఆయా రాష్ట్రాల నిబంధనల ఆధారంగా మహిళలకు అబార్షన్పై హక్కులు వస్తాయి. యూరప్ దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం అత్యంత సులభమైతే, ఆఫ్రికా దేశాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. చైనాలో 1953 నుంచి అబార్షన్ చట్టబద్ధం. జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో 1970 తర్వాత బలవంతపు అబార్షన్లని కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు వృద్ధులు పెరిగిపోతూ ఉండడంతో అనవసరంగా అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదంటూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూరప్ దేశాల్లో... యూరప్లోని అత్యధిక దేశాల్లో మహిళలకు గర్భ విచి్ఛత్తిపై హక్కులున్నాయి. 12–14 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం పూర్తిగా మహిళల ఇష్టమే. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్లో 1967లో చట్టం చేశారు. 24 వారాలవరకు అబార్షన్ చేయించుకోవచ్చు. యూకేలో గర్భంలో శిశువు సరిగా ఎదగలేదని తేలితే ఎన్నో నెలలో అయినా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకి ఉంది. కెనడాలో గర్భవిచ్ఛిన్నానికి ప్రత్యేకంగా చట్టం లేకపోయినప్పటికీ ఏ దశలోనైనా అబార్షన్ చేయించుకోవచ్చు. యూరప్, లాటిన్ అమెరికా సంప్రదాయ కేథలిక్ దేశాల్లో కూడా మహిళా కార్యకర్తల ఉద్యమాలతో అబార్షన్పై హక్కులు కల్పించారు. గత ఏడాది కొలంబియాలో 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం చట్టబద్ధం చేశారు. ఐర్లాండ్లో అబార్షన్ చట్టాలకు పరిమితులు విధించడంపై 2018లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మహిళలు తిరస్కరించారు. 12 వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునే హక్కు వారికి ఉంది. న్యూజిలాండ్లో 2020లోనే మహిళలకు అబార్షన్లపై హక్కులు వచ్చాయి. 24 దేశాల్లో అబార్షన్ చట్టవిరుద్ధం ప్రపంచంలోని 24 దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం చట్టవిరుద్ధం. వీటిలో అత్యధికంగా ఆఫ్రికా దేశాలుంటే ఆసియా, సెంట్రల్ అమెరికా, యూరప్కు చెందిన దేశాలు వీటిలో ఉన్నాయి. సెనగల్, మార్షినియా, ఈజిప్టు, లావోస్, ఫిలిప్పైన్స్, ఎల్ సాల్వోడర్, హోండరస్, పోలాండ్, మాల్టాలో మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకోలేరు. కొన్ని దేశాల్లో అబార్షన్ చేయించుకుంటే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. ఎల్ సాల్వేడర్లో మహిళలు అబార్షన్ చేయించుకుంటే దోషిగా నిర్ధారించి జైలు శిక్ష కూడా విధిస్తారు. పోలాండ్ గత ఏడాదే అబార్షన్లపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది.పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన వయసులో ఉండే ప్రపంచ మహిళా జనాభాలో 5% మంది ఈ 24 దేశాల్లోనే ఉన్నారు. అంటే దాదాపుగా 9 కోట్ల మందికి మహిళలకి అబార్షన్ చేయించుకునే హక్కు లేదని సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ రైట్స్ సంస్థ నివేదికలో వెల్లడైంది. 50 దేశాల్లో పరిమితులతో హక్కులు దాదాపుగా 50 దేశాల్లో అబార్షన్ చేయించుకునే హక్కు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులున్నాయి. లిబియా, ఇండోనేసియా, నైజీరియా, ఇరాన్, వెనిజులాలో తల్లి ప్రాణాలు ప్రమాదం ఉంటే మాత్రమే అబార్షన్ చేయించుకోచ్చు. మిగిలిన దేశాల్లో అత్యాచారం, అవాంఛిత గర్భధారణ, గర్భంలో శిశువు ఎదుగుదలలో లోపాలుంటే అబార్షన్ చేయించుకోవడానికి అనుమతినిస్తారు. బ్రెజిల్లో అత్యాచారం వల్ల గర్భం వచి్చనా, గర్భస్థ పిండం ఎదగకపోయినా గర్భస్రావానికి అనుమతిస్తారు కానీ వైద్యులు, వైద్య రంగంలో కనీసం ముగ్గురు అనుమతి తప్పనిసరి. - సాక్షి, నేషనల్ డెస్క్ -
International Safe Abortion Day: ఈ దేహం నాది ఈ గర్భసంచి నాది
ఒక శిశువు గర్భసంచిలో ఊపిరి పోసుకుంటుంది. ఆ గర్భసంచి మీద హక్కు ఎవరిది? ఒక శిశువు ప్రసవ వేదనను ఇచ్చి భూమ్మీదకు వస్తుంది. ఆ ప్రసవవేదన కలిగించే నొప్పి ఎవరిది? ఒక శిశువు కళ్లు విప్పిన వెంటనే పాలకై ఎద దగ్గర నోరు తెరుస్తుంది. పాలు కుడిపే ఆ ఎద ఎవరిది? దేహం ఎవరిదో వారిది. స్త్రీది. మహిళది. యువతిది. వివాహితది. అవివాహితది. ఆమె వితంతువు కావచ్చు. డైవోర్సీ కావచ్చు. ఆమె ఎవరైనా బిడ్డకు జన్మనిచ్చేది ఆమెనే. మరి ఆమె శరీరం మీద హక్కు ఆమెకు ఉందా? ఎప్పుడు కనాలో ఎప్పుడు వద్దనుకోవాలో నిర్ణయించుకుంటోందా? అవాంఛిత గర్భం వస్తే ‘ఈ గర్భం నాకు వద్దు’ అని గట్టిగా చెప్పి తొలగించుకుంటోందా? ఎన్నో అడ్డంకులు నిన్న మొన్న వరకూ ఉన్నాయి. ఇవాళ ఆ సకల ఇబ్బందులను, అడ్డంకులను, చట్టపరమైన చికాకులను, సాంఘికపరమైన మూసను సుప్రీంకోర్టు బద్దలు కొట్టింది. స్త్రీల తరఫున చాలా స్వాగతించదగిన తీర్పు ఇచ్చింది. దేశ మహిళా చరిత్రలో ఇదొక ముఖ్య ఘట్టం. ఈ సందర్భంగా భిన్న రంగాల, నేపథ్యాల మహిళల ప్రతిస్పందనను ఇక్కడ అందిస్తున్నాం... ‘దేశంలో ప్రతి మహిళకు ఆమె వివాహిత అయినా అవివాహిత అయినా గర్భస్రావం చేసుకునే హక్కు ఉంది’ అని గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ‘అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినోత్సవం’ – సెప్టెంబర్ 28 కాగా ఆ మరుసటి రోజే ఈ తీర్పు రావడం కాకతాళీయమే అయినా సందర్భం, ఆ సందర్భానికి ఈ తీర్పు వన్నె తెచ్చింది. విస్తృతంగా అధ్యయనం చేయాలి ఈ తీర్పు నిజంగా సంచలనమే. అయితే తీర్పుతోపాటు తదుపరి చట్టాల రూపకల్పనకు ముందు మరింతగా అధ్యయనం చేయాలి. ఈ తీర్పులో ఉన్న క్లాజ్ను అడ్డుపెట్టుకుని దుర్వినియోగం చేసుకునే వాళ్లు పెరిగే ప్రమాదం లేకపోలేదు. అది కూడా వివాహిత మహిళల విషయంలోనే. సాధారణంగా తొలి బిడ్డ విషయంలో జెండర్ పట్ల కొంచెం పట్టువిడుపులతో ఉంటారు. మొదటి బిడ్డ ఆడబిడ్డ అయితే... రెండవ బిడ్డ మగపిల్లవాడయితే బావుణ్ను అనే భావజాలం మన సమాజాన్ని ఇంకా వదల్లేదు. రెండవ బిడ్డ విషయంలో రహస్యంగా లింగనిర్ధారణ చేసుకుని ఆ తర్వాత ‘భర్తతో సఖ్యత లేని కారణంగా గర్భాన్ని వద్దనుకుంటున్నట్లు చెప్పి అబార్షన్ చేయించుకోమని భర్తలే భార్యల మీద ఒత్తిడి తీసుకువచ్చే’ ప్రమాదం ఉంది. లింగనిర్ధారణ ఇరవై వారాలకు తెలుస్తుంది. ఆడ–మగ నిష్పత్తిని సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగే ప్రమాదాన్ని చట్టబద్ధం చేసినట్లవుతుంది. అలాగే అవివాహితుల విషయంలో కూడా... థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలామందిలో ఉంటున్నాయి. అలాంటప్పుడు గర్భం దాల్చినట్లు సందేహం కలిగి పరీక్ష చేయించుకునేటప్పటికే మూడు నెలలు దాటి ఉంటుంది. ఇక సహజీవనాలలో అన్సేఫ్ సెక్స్ తర్వాత అబార్షన్ పిల్ వేసుకోవడం కూడా చాలా మామూలుగా చేస్తున్నారు. గతంలో అది కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండేది. ఇప్పుడు మెడికల్ షాపులో దొరుకుతోంది. ఆ టాబ్లెట్ వేసుకుంటే కొందరికి విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. స్పృహ కోల్పోయే పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరకు వస్తుంటారు. ఇందులో మహిళల ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం కూడా కలగలిసి ఉంది. అందుకే చట్టాన్ని రూపొందించేటప్పుడు మరింత విస్తృతంగా అధ్యయనం చేసి పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ పి.కృష్ణ ప్రశాంతి, చైర్పర్సన్, ఏపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగత గౌరవానికి ప్రాధాన్యత సుప్రీంకోర్టు తాజా తీర్పుతో స్త్రీకి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్లయింది. ఈ తీర్పు హర్షణీయం. అవాంఛిత గర్భాన్ని సురక్షితంగా తొలగించుకునే హక్కు కల్పించడం ద్వారా సుప్రీంకోర్టు మహిళల వ్యక్తిగత గౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అత్యాచారం, సహజీవనం వల్ల ఏర్పడిన అవాంఛిత గర్భాన్ని అయిష్టంగా మోయాల్సిన అవసరం స్త్రీకి ఉండకూడదు. మహిళలకు రక్షణ లేని సమాజంలో బడి, గుడి, రైలు పెట్టె, ఇతర వాహనాలు... అన్నీ ఆమె మీద లైంగిక దాడికి వేదికలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చట్టం రావడం మంచిదే. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం ద్వారా ఆమె భవిష్యత్తు సాఫీగా సాగుతుంది. కెరీర్లో కార్యసాధికారత సాధించడానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తోంది ఈ చట్టం. – చాకలకొండ శారద, రాష్ట్ర ఉపాధ్యక్షులు, అశ్లీల ప్రతిఘటన వేదిక, ఆంధ్రప్రదేశ్ ‘ఆమె’ అనుమతి అవసరం! ఇది ఆహ్వానించదగిన తీర్పు. సమాజంలో అనాథలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అబార్షన్ చట్టం లేకపోవడం అనాథల సంఖ్య పెరగడానికి కారణమయ్యేది. పిల్లల స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణకు ఈ చట్టం దోహదం చేస్తుంది. ఒక ప్రాణిని భూమ్మీదకు తేవాలంటే స్త్రీ–పురుషులిద్దరి అంగీకారం, సంసిద్ధత అవసరం. పుట్టిన బిడ్డను బాధ్యతగా పెంచడానికి సిద్ధమైన తర్వాత మాత్రమే పిల్లల్ని కనాలి. అవాంఛిత గర్భంతో పుట్టిన పిల్లలు వీధిన పడతారు. ఇంట్లో ఉన్నా కూడా నిరాదరణకు గురవుతూ పెరుగుతుంటారు. ఇన్ని అనర్థాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. అలాగే మన చట్టాల్లో శృంగారజీవితానికి వయో పరిమితి తగ్గుతూ వివాహ వయస్సు పరిమితి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం సహేతుకమైనదే. చాలామంది పెళ్లయిన ఐదారు నెలల్లో విడిపోతుంటారు. విడిపోవాలనే నిర్ణయం తీసుకునేటప్పటికే ఆమె గర్భం దాల్చి ఉంటే... ఆ గర్భాన్ని కొనసాగించాలా వద్దా అనేది ఆమె ఇష్టమే అయి ఉండాలి. అలాగే సహజీవనాల్లో గర్భాన్ని నివారించుకునే జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి పరిస్థితుల్లో స్త్రీ గర్భం దాల్చగానే మగవాళ్లు ముఖం చాటేసే సందర్భాలే ఎక్కువ. అలాంటి పరిస్థితులకు కూడా ఈ తీర్పు సరైన పరిష్కారమే అవుతుంది. శృంగారానికి ‘ఆమె’ అనుమతి ఎలా అవసరమో, గర్భాన్ని కొనసాగించుకుని బిడ్డను కనాలా లేక తొలగించుకోవాలా అనేది కూడా ఆమె అనుమతితోనే జరగాలి. – సంధ్య, నేషనల్ కన్వీనర్, పీఓడబ్లు్య పురోగతితో కూడిన తీర్పు ఫెమినిస్ట్లు, మహిళా సమస్యలపై పనిచేసేవారందరూ ఈ తీర్పును స్వాగతిస్తారు. ప్రధానంగా అబార్షన్ చుట్టూ ఉన్న చాలా కోణాలను ఈ తీర్పులో కవర్ చేసింది. ఒక విషయం కాదు పెళ్లి, పెళ్లికి ముందు, అత్యాచార సంఘటనలలోనూ.. అన్ని సమస్యలను చర్చించింది. అమెరికన్ సొసైటీ మన కంటే చాలా ముందంజలో ఉందంటాం. అయితే, అక్కడ కూడా అబార్షన్కి సంబంధించిన హక్కులు అంతగా లేవు. ఆ నేపథ్యంలో చూస్తే ఇది మన దగ్గర పురోగతితో కూడిన తీర్పు. మహిళలకు అబార్షన్ చేయించుకోవడం మీద ఎంత వరకు నిర్ణయాధికారం ఉంటుందో మనకు తెలుసు. పురుషాధిక్య సమాజంలో నిర్ణయాధికారం ఎక్కువగా మగవాడి చేతుల్లో ఉంటుంది. దానిని అరికట్టడానికి చట్టప్రకారం సురక్షితమైన అబార్షన్ అనే క్లాజు మహిళలకు వర్తిస్తుంది. ఇది కూడా మహిళల స్వయం నిర్ణయంతో జరుగుతుందా లేదా.. అనేది ఇంకొంచెం స్పష్టత వస్తే బాగుండు అనిపించింది. కాకపోతే, ఇది లైంగిక స్వేచ్ఛకు సంబంధించి చాలా పెద్ద ముందడుగే అని చెప్పవచ్చు. సమాజపు ఒత్తిడి నుంచి స్త్రీల మీద ఉండే పెద్ద బరువును తగ్గించిందని చెప్పవచ్చు. – కె.ఎన్ మల్లీశ్వరి, రచయిత ఉద్దేశ్యం మంచిదే! ఇండియాలో 1971లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత యాభై ఏళ్లుగా వివిధ పరిస్థితుల్లో దీనిని చట్టబద్ధం చేస్తూ వచ్చారు. ఒకప్పుడు బిడ్డ పుడితే కాపురం సెట్ అవుతుంది అనుకునే సంఘటనలు ఉన్నాయి. నాకు ఆడపిల్ల ఇష్టం లేదు, మగపిల్లవాడు కావాలి.. అని అబార్షన్లు చేయించేవారు. ఇలా రకరకాల కారణాల వల్ల మహిళ తనకు ఇష్టం లేకపోయినా ఒత్తిడితో కూడిన బరువును మోసేది. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా తెలివిగా వారి గురించి వారు ఆలోచించుకునే స్థితికి వచ్చేశారు. ఏ స్త్రీ అయినా ప్రేమతో తన బిడ్డను కని, పెంచాలనుకుంటుంది. ‘భరించలేను’ అనే స్థితి ఉంటే తప్ప అబార్షన్ అనే ఆలోచన చేయదు. మనసుకు ఈ బాధ్యతను తీసుకోలేను అనుకున్నప్పుడు బిడ్డను కనాలా, వద్దా? అనే స్వేచ్ఛ స్త్రీకి ఉండటం అవసరం. దానినే సుప్రీం కోర్టు తీర్పుగా చెప్పింది. ఇది చాలా ఆహ్వానించదగింది. – రాజేశ్వరి, అడ్వొకేట్ లైంగిక జీవన హక్కులను బలపరిచే తీర్పు వివాహానికి ఆవల మహిళలకు ఏర్పడే సంబంధాల వల్ల వచ్చే గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకొనే అవకాశం లేదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. అవివాహిత స్త్రీలకు అబార్షన్ హక్కుని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం అని, అబార్షన్ చట్టం చేసిన నాటి సామాజిక పరిస్థితులు, విలువలూ మారాయనీ, అవివాహితలకు అబార్షన్ హక్కుని నిరాకరించడం ఆర్టికల్ 14కి విరుద్ధం అని బెంచ్ అభిప్రాయపడడం స్త్రీల పునరుత్పత్తి హక్కుల గుర్తింపులో ఖచ్చితంగా ఒక ముందడుగే. అవివాహితుల అబార్షన్ హక్కును రాజ్యం నియంత్రించజాలదనీ, స్త్రీలలో పెరిగే పిండాన్ని తొలగించుకొనే హక్కు వారి శరీరం పై వారికి గల హక్కులలో భాగంగా చూడాలనీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైంది. ఇది వివాహం బయట స్త్రీల లైంగిక జీవన హక్కులను బలపరిచే తీర్పు. – కత్తి పద్మ, మహిళా హక్కుల కార్యకర్త చట్టబద్ధం కావడం ప్రాణాలను నిలబెడుతుంది సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గర్భిణి దశలో భర్తను కోల్పోయిన మహిళలు, గర్భిణిగా ఉండి విడాకులు పొందిన వాళ్లు సదరు వైవాహిక బంధం తాలూకు గర్భాన్ని కొనసాగించి తీరాల్సిన అవసరం ఉండదు. ఆమెకు ఇష్టం అయితే కొనసాగించవచ్చు. బిడ్డను పెంచలేని స్థితిలో ఉన్న మహిళలకు కూడా ఈ తీర్పు ఉపయుక్తమవుతుంది. అలాగే చట్టం ఆమోదించని రోజుల్లో ఒక అవివాహిత గర్భవిచ్ఛిత్తి చేయించుకోవాలంటే, చట్టవిరుద్ధమైన అబార్షన్ చేయడానికి డాక్టర్లు ఆమోదించేవారు కాదు. దాంతో వాళ్లు అరకొర పరిజ్ఞానం ఉన్న వైద్య సహాయకులతో అబార్షన్ చేయించుకోవడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరిగేది. ఇప్పుడు అలాంటి ప్రమాదాలు ఉండవు. – నిశ్చల సిద్ధారెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వాగతించాల్సిందే! ఈ రోజుల్లో రిలేషన్స్ విషయంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాల్సిందే. గర్భం విషయంలో మహిళ మాత్రమే నిర్ణయం తీసుకోగల స్వేచ్ఛ ఉండాలి. స్వతంత్రంగా ఎదుగుతున్న మహిళకు తనకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఇది అవసరం కూడా. కుటుంబం, స్నేహితులు, కొలీగ్స్.. సమాజంలో ఎవరైనా సరే, ఆమెను తప్పు పట్టడం సరైనది కాదు. ఎవరు సమస్యను ఎదుర్కొంటున్నారో వారు మాత్రమే నిర్ణయం తీసుకోగల స్వేచ్ఛ ఉండాలి. – డాక్టర్ ఝిలమ్ ఛట్రాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్బివిఆర్ఆర్ ఉమెన్స్ కాలేజీ స్వార్థానికి వాడకూడదు.. పెళ్లయినా, అవివాహితైనా బిడ్డను కనాలా, వద్దా అనే నిర్ణయించుకునే హక్కు పూర్తిగా స్త్రీకి ఉండాలి. ఇందులో పెద్దల జోక్యం కూడా ఉండకూడదు. పెళ్లి, ఆర్థిక భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకొని అన్ని జాగ్రత్తలతో గర్భం దాల్చిన స్త్రీలను నేను చూశాను. అయితే, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దీనిని ఆయుధంగా ఉపయోగించకూడదు. – పూనమ్ కౌర్, నటి దుర్వినియోగం కాకూడదు పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుంది. అయితే, చట్టంలో ఉంది కదా అని అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు. కుటుంబం, ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపే ఘటన కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవగాహనతో తమ భావి జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి తప్ప ఈజీగా తీసుకోకూడదు, అలాగని ఓకే చేయకూడదు. – వాణి, గృహిణి -
అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
24 వారాల్లోపే అబార్షన్కు అనుమతి: సుప్రీంకోర్టు
-
అబార్షన్.. ఆమె ఇష్టం.. గర్భస్రావానికి అవివాహితులూ అర్హులే
సాక్షి, న్యూఢిల్లీ: గర్భధారణ, మాతృత్వపు హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టపరమైన సురక్షిత గర్భస్రావం మహిళలందరికీ సమానంగా వర్తించే హక్కేనని తేల్చిచెప్పింది. వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. పెళ్లయిన వారితో సమానంగా అవివాహితులకు కూడా 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. అంతేగాక వైవాహిక అత్యాచారాన్ని కూడా వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్ట నిర్వచనం ప్రకారం రేప్గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంటీపీ చట్ట పరిధిని విస్తరిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ ఎ.ఎన్.బొపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ సురక్షిత అబార్షన్ దినోత్సవం (సెప్టెంబర్ 28) మర్నాడే ఈ తీర్పు రావడం విశేషం. కాలంతో పాటు చట్టాలూ మారాలి వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్టం సెక్షన్ 3(2)(బీ)ప్రకారం వివాహితలతో పాటు అత్యాచార బాధితులు, మైనర్లు, మానసిక సమస్యలున్న వారు, పిండం సరిగా అభివృద్ధి చెందని సందర్భాల్లో 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కుంది. అవివాహితలు, వితంతువులు తమ ఇష్టం మేరకు గర్భం దాలిస్తే 20 వారాల వరకు మాత్రమే అబార్షన్కు అవకాశముంది. ఈ తేడాలు వివక్షేనని ధర్మాసనం పేర్కొంది. చట్టాలు స్థిరంగా ఉండరాదని అభిప్రాయపడింది. వాటిని కాలానుగుణంగా మార్చుకోవాల్సిన అవసరముందని 75 పేజీల తీర్పులో పేర్కొంది. ‘‘ఎంపీటీ నిబంధనలను కూడా మెరుగుపరుచుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే పిల్లల్ని కనాలా, వద్దా అన్నది మహిళ హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం ఆమెకున్న వ్యక్తిగత స్వేచ్ఛ. దీనికి వైవాహిక స్థితితో నిమిత్తం లేదు. సహజీవనాలను కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే గుర్తించింది. కనుక 24 వారాల్లోపు సురక్షిత అబార్షన్ హక్కును వివాహితలకే పరిమితం చేసి అవివాహితలకు, ఒంటరి మహిళలకు నిరాకరించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. చట్టానికి సంకుచిత భాష్యం చెప్పడమే. ఇందులో ఎలాంటి హేతుబద్ధతా లేదు’’అని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినం మర్నాడే తీర్పు వెలువడిందని ఒక లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ఇది యాదృచ్ఛికమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. వైవాహిక అత్యాచారానికి గురైనా అబార్షన్ చేయించుకోవచ్చు వైవాహిక అత్యాచారాన్ని కూడా ఎంటీఐ చట్టానికి సంబంధించినంత వరకు అత్యాచారం పరిధిలోకి తేవాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘అత్యాచారమంటే మహిళ తన సమ్మతి లేకుండా లైంగిక సంపర్కంలో పాల్గొనాల్సి రావడం. అపరిచితులు మాత్రమే రేప్లకు, లైంగిక వేధింపులకు పాల్పడతారన్న అపోహ మనలో ఉంది. భర్త/జీవిత భాగస్వామి చేతిలో లైంగిక వేధింపులు చిరకాలంగా మహిళలు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలే. కాబట్టి దీన్ని కూడా అత్యాచారంగానే పరిగణిస్తూ, తద్వారా దాల్చే బలవంతపు గర్భం బారినుంచి మహిళలను కాపాడాల్సి ఉంది’’అని పేర్కొంది. సదరు మహిళకు కూడా ఎంటీపీ చట్టం సెక్షన్ 3(బి)(ఎ) ప్రకారం 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే భర్త చేతుల్లో లైంగిక వేధింపులను, బలవంతపు లైంగిక సంపర్కాన్ని ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచారంగా పరిగణించాలా, లేదా అన్నది మరో ధర్మాసనం విచారణలో ఉందని గుర్తు చేసింది. దీనిపై ఆ ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. మైనర్ల పేరు వెల్లడించాల్సిన పని లేదు ఎంటీపీ చట్టం ప్రకారం మైనర్లకు కూడా 20–24 వారాల వ్యవధిలో గర్భస్రావానికి అనుమతి ఉందని ధర్మాసనం పేర్కొంది. మైనర్కు అబార్షన్ చేయాల్సిన సందర్భంగా పోక్సో చట్టం మేరకు పోలీసు రిపోర్టు తప్పనిసరే అయినా బాధితురాలి పేరు, వ్యక్తిగత వివరాలను వైద్యులు తెలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పోక్సో చట్టాన్ని సామరస్యపూర్వకంగా వర్తింపజేయాలని సూచించింది. ‘‘వివాహితలు మాత్రమే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారన్నది సరికాదు. అవివాహితలు, మైనర్లు కూడా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం, లేదా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవడం జరుగుతోంది. ఇవి కొన్నిసార్లు గర్భధారణకూ దారితీస్తున్న సత్యాన్ని విస్మరించలేం. దేశంలో సరైన లైంగిక ఆరోగ్య విద్య లేక చాలామందికి కౌమారదశలో పునరుత్పత్తి వ్యవస్థ, సురక్షిత లైంగిక పద్ధతులు, గర్భనిరోధక పరికరాలు, పద్ధతుల గురించి తెలియడం లేదు. ఈ సమాచారం అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాలు, గుర్తింపు పొందిన వైద్యులు తప్పనిసరిగా ఉండాలి. కులం, సామాజిక, ఆర్థిక కారణాలతో చికిత్సను నిరాకరించరాదు’’అని ఆదేశించింది. ఇవన్నీ వాస్తవరూపం దాల్చినప్పుడు మాత్రమే మహిళల శారీరక స్వయంప్రతిపత్తి హక్కు సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. కుటుంబీకుల అనుమతీ అక్కర్లేదు చట్టపరమైన అబార్షన్ చేయించుకోవడానికి మహిళలకు కుటుంబ సభ్యుల సమ్మతి అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ సభ్యుల సమ్మతి, డాక్యుమెంటరీ రుజువులు, న్యాయపరమైన అనుమతి అంటూ వైద్యులు చట్టానికి మించిన షరతులు పెడుతున్నారు. అవి లేవంటూ అబార్షన్కు నిరాకరిస్తున్నారు’’అంటూ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఇది నిజంగా విచారకరం. ఆ కారణాలతో వైద్యులు అబార్షన్ నిరాకరించడానికి వీల్లేదు. గర్భాన్ని తొలగించుకోవాలనుకునే మహిళ ఎంటీపీ చట్ట నిబంధనలను పాటించేలా చూసుకుంటే చాలు’’అని పేర్కొంది. ‘‘సదరు గర్భానికి భర్త/భాగస్వామి అంగీకారం ఉందా? పుట్టబోయే బిడ్డ బాధ్యతను వారు కూడా సమానంగా స్వీకరిస్తారా? గర్భధారణ, కాన్పు ఖర్చులను కుటుంబం భరిస్తుందా? ఇలాంటివన్నీ చాలా సంక్లిష్టమైన అంశాలు. సదరు మహిళకు మాత్రమే తెలిసే విషయాలు. కాబట్టి గర్భాన్ని ఉంచుకోవాలా, లేదా అన్నది నిర్ణయించుకోవాల్సింది కేవలం ఆమె మాత్రమే. అంతే తప్ప సంకుచిత పితృస్వామిక సూత్రాల ఆధారంగా చట్టం నిర్ణయించే పరిస్థితి ఉండకూడదు’’అని స్పష్టం చేసింది. ఇదీ నేపథ్యం... ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ 25 ఏళ్ల అవివాహితకు 23 వారాల 5 రోజుల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను ఇష్టపడే గర్భం దాల్చినా ఆ తర్వాత భాగస్వామి పెళ్లికి నిరాకరించి తనను వదిలేశాడని పేర్కొంది. కానీ ఆమె గర్భానికి 20 వారాలు దాటినందున ఎంటీపీ చట్టం ప్రకారం అబార్షన్కు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అపీలు చేసుకుంది. అబార్షన్కు అనుమతిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎంటీపీ చట్టానికి 2021లో చేసిన సవరణ ద్వారా భర్త అనే పదాన్ని భాగస్వామిగా మార్చిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. తుది విచారణ జరిపి ఆగస్టు 23న వాదనలు ముగించింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది. చట్టపరంగా సురక్షిత అబార్షన్ చేయించుకోవడానికి మహిళలందరూ అర్హులే. గర్భిణులు 20–24 వారాల మధ్య అబార్షన్ చేయించుకోవచ్చని గర్భవిచ్ఛిత్తి చట్టం సెక్షన్ 3(2)(బీ) చెబుతోంది. దీన్ని వివాహితులకే వర్తింపజేసి అవివాహితులను దూరం పెట్టడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే స్త్రీకి తన శరీరంపై సంపూర్ణ హక్కుంటుంది. అవాంఛిత గర్భం ఆమె శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కనుక పెళ్లయిందా, లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అబార్షన్పై ఆమెదే అంతిమ నిర్ణయం. అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైనట్టు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ సభ్యుల సమ్మతీ అవసరం లేదు. మైనర్, లేదా మానసిక వైకల్యమున్న వారికి మాత్రమే సంరక్షకుల సమ్మతి అవసరం . – జస్టిస్ డీవై చంద్రచూడ్ -
'గర్భం దాల్చిన మూడ్నెళ్లకే అబార్షన్'...సింగర్ చిన్మయి ఎమోషనల్
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పిల్లల పేర్లు కూడా రివీల్ చేశారు. 2014లో నటుడు రాహుల్ని పెళ్లాడిన చిన్మయి ఇటీవలె ట్విన్స్కు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అయితే తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ స్టోరీని నెటిజన్లతో పంచుకుంది. తన స్వంత యూట్యూబ్ ఛానల్లో ఈ మేరకు వీడియోను షేర్ చేసింది. 'నేను, రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. 2020లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో అంతా అయోమయ పరిస్థితి. ప్రపంచమంతా తలకిందులయ్యింది. మా డాక్టర్ కూడా బయట ఏం జరుగుతుంతో తెలియదు.. ఇంతకాలం వెయిట్ చేశారు కదా ఇంకాస్త సమయం ఓపిక పట్టండి అని చెప్పింది. సెకండ్ వేవ్ అయిపోయాక నేను గర్బవతిని అయ్యాను. కానీ మూడు నెలలకే గర్భస్రావం(అబార్షన్)అయ్యింది. దీంతో చాలా బాధపడ్డాను. మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ తర్వాత కొన్నిరోజులకు ఇన్స్టాగ్రామ్లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ నాకు పరిచయం అయ్యింది. తన సలహాతో నా డైట్, ఎక్సర్సైజ్ అన్నీ పాటించాను. అవి దాదాపు మన ఇండియన్ ఆయుర్వేదిక్ పద్దతులే. ఇక కొంతకాలానికి నేను మళ్లీ గర్భం దాల్చాను. కవలలకు జన్మనిచ్చాను. 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను' అంటూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. -
24 వారాలకు అబార్షన్
న్యూఢిల్లీ: కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉన్న 20 వారాల అబార్షన్ను 24 వారాలకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. 20 వారాల గర్భవిచ్చిత్తి అంటే శిశువును చంపేయడమేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవివాహిత అనే కారణం చూపుతూ పిటిషనర్ వినతిని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లైంగిక హింస వంటి కేసుల్లో గర్భం దాల్చిన ఒంటరి మహిళలు 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునేందుకు ప్రస్తుతం చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. గర్భం దాల్చిన అనంతరం అందుకు కారకుడైన వ్యక్తితో సంబంధాల్లో మార్పు వచ్చినందున అబార్షన్కు అనుమతివ్వాలంటూ ఓ మహిళ ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లవకుండానే గర్భం దాల్చిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుందని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కొట్టివేశారు. అవివాహిత అయి, సమ్మతితోనే గర్భం దాల్చిందని, 20 వారాల పిండాన్ని తీసేయడమంటే శిశువును చంపేయడమేనని ఆయన అన్నారు. ‘‘ఒక మంచి ఆస్పత్రిలో చేరి, బిడ్డను కని వదిలేసి వెళ్లిపోవచ్చు. దత్తత తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా ప్రభుత్వం/ ఆస్పత్రి చూసుకుంటాయి. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించకుంటే నేనే భరిస్తా’అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన త్రిసభ్య ధర్మాసనం..హైకోర్టు తీర్పు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్–1971కు విరుద్ధమని పేర్కొంది. -
గర్భస్రావమయ్యేలా దాడి.. భర్త, బంధువులకు జైలుశిక్ష
మైసూరు: గర్భిణిపై దాడి చేసి గర్భపాతానికి కారణమైన ఐదుమందికి మైసూరు ఐదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన జైలు శిక్షను విధించింది. నంజనగూడు తాలూకాలోని హొసకోటె గ్రామానికి చెందిన భర్త మహేశ్, అత్త చిక్క కుసుమ, బంధువులు కుసుమ, కాంతరాజు, మహాదేవమ్మ జైలు శిక్ష పడిన వారు. భార్య పుట్టసౌమ్యను మరింత కట్నం తేవాలని భర్త మహేష్, ఇతర బంధువులు వేధించేవారు. 2015 ఫిబ్రవరి 7వ తేదీన పుట్ట సౌమ్య ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని తెలిపారు. నాకు చెప్పకుండా ఎందుకు ఆస్పత్రికి వెళ్లావు అని మహేశ్ బంధువులు ఆమెను తీవ్రంగా కొట్టడంతో అక్కడే గర్భస్రావమైంది. దాంతో బాధితురాలు బదవనాళు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చార్జిషీటు వేశారు. కోర్టు విచారణలో మహేశ్అ త్తమామల నేరం రుజువైంది. దీంతో జడ్జి మల్లికార్జున దోషులకు తలా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.22 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. (చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్ ) -
పెళ్లి కాకుండానే యువతికి గర్భం.. అబార్షన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి,న్యూఢిల్లీ: అబార్షన్కు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి కాని యువతి 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అబార్షన్ చేసినా ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని ఢిల్లీ ఎయిమ్స్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు చెప్పడంతో ఇందుకు ఓకే చెప్పింది. పెళ్లికానందు వల్ల ఈ యువతి అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం అలాంటి పరిమితులు ఏమీ లేవని చెప్పింది. 2021లో సవరించిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ను ప్రస్తావించింది. పెళ్లికాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అబార్షన్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ యువతి వయసు 25 ఏళ్లు. కొంత కాలంగా ఒకరితో రిలేషన్లో ఉంది. ఈ క్రమంలోనే అవాంఛిత గర్భందాల్చింది. దీంతో అబార్షన్కు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దిల్లీ హైకోర్టు ఇందుకు నిరాకరించినా.. సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. చదవండి: బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ -
ఫ్రెండ్తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి
Actress Kubbra Sait Reveals About Her Abortion After One Night Stand: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'రెడీ' మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ భామ కుబ్రా సైట్. తర్వాత వచ్చిన 'సేక్రెడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ద్వారా మంచి ఫేమ్ సంపాందించుకుంది. సుల్తాన్, జవానీ జానేమన్, సిటీ ఆఫ్ లైఫ్ వంటి తదితర సినిమాల్లో నటించింది. తాజాగా కుబ్రా 'ఓపెన్ బుక్: నాట్ ఏ క్వైట్ మెమోయిర్' (Open Book: Not A Quite Memoir) అనే పుస్తకాన్ని రాసింది. జూన్ 27న విడుదలైన ఈ పుస్తకంలో తన పర్సనల్ లైఫ్కు సంబంధించిన అనేక విషయాలను పొందుపరిచినట్లు ఆమె తెలిపింది. బాడీ షేమింగ్, వన్ నైట్ స్టాండ్, అబార్షన్, లైంగిక వేధింపులు వంటి తదితర ఆసక్తికర విషయాలను గుర్తు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో కుబ్రా సైట్ 'నా 30 ఏళ్లప్పుడు 2013లో అండమాన్ పర్యటనకు వెళ్లాను. స్కూబా డైవింగ్ సెషన్ తర్వాత కొన్ని డ్రింక్స్ తీసుకున్నాను. తర్వాత ఒక స్నేహితుడితో బెడ్ షేర్ చేసుకున్నాను. శారీరకంగా కలిశాను (వన్ నైట్ స్టాండ్). కొన్నాళ్లకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలింది. వారం రోజుల తర్వాత అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను. నేను తల్లిని కావడానికి సిద్ధంగా లేను. నేను ఊహించుకున్నట్లుగా నా జీవిత ప్రయాణం సాగట్లేదు. ఇప్పటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నానని అనుకోవట్లేదు. అమ్మాయిలు 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలి. 30 ఏళ్లకు పిల్లలను కనాలి వంటి విషయాలు నాకు అర్థం కావు. చదవండి: నగ్నంగా విజయ్ దేవరకొండ.. ఫొటో వైరల్ అబార్షన్ చేయించుకున్నా. నాకు తప్పు చేశానన్న భావన లేదు. ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా ఛాయిస్ నాకు ఉంటుంది. ప్రస్తుతం నా ఆలోచనల్లో క్లారిటీ ఉందనుకుంటున్నాను. ఈ విషయాలను ఇలా షేర్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తున్నాను. అందుకే ఈ పుస్తకాన్ని రాశాను. గతంలో జరిగిన సంఘటనల నుంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాను. బాడీ షేమింగ్కు గురయ్యాను. నా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి లైంగికంగా వేధించేవాడు. మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురైతే నేను వ్యవహరించే తీరు వేరే విధంగా ఉంటుంది. నేను రాసిన పుస్తకంలో 24 చాప్టర్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్ చదివించేలా ఆసక్తికరంగా ఉంటుంది' అని తెలిపింది. చదవండి: నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. టైటిల్ ఫిక్స్ -
అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు
ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఒక పసిపాప భూమ్మీదికి వచ్చిన వార్త కంటే సంతోష కరమైన విషయం మరొకటి ఉండదు. భూమ్మీద అన్ని బాధలూ, వ్యాధులూ, మరణాలూ సంభవిస్తున్నప్పటికీ, శిశువు జన్మించడం అంటే ఒక కుటుంబ భవిష్యత్తే కాదు, మానవజాతి భవిష్యత్తుకు కూడా గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తుందన్నమాట. అందుకే కడుపులో ఉన్న బిడ్డను అబార్షన్ రూపంలో చంపడం అంటే అది ఘోరమైన హత్య అని చాలామంది విశ్వసిస్తున్నారు. కానీ బిడ్డ పుట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. అత్యంత నిస్పృహలో, నిరాశాజనకమైన పరిస్థితుల్లో పుట్టే బిడ్డ జననం మహిళలను తరచుగా తీవ్రమైన కుంగుబాటుకూ, కొన్నిసార్లు వైద్యపరమైన సంక్లిష్టతల్లోకీ నెడుతుంటుంది. కానీ జన్మనివ్వడం అనేది మహిళలు, వారి కుటుంబాలు చేసుకోవలసిన ఎంపిక. అత్యవసరమైన సమయాల్లో అది వారి హక్కు, ఎంపికగా మాత్రమే ఉంటుంది. స్వచ్ఛంద మాతృత్వం అని కొంత మంది చెబుతున్నది, మహిళల గర్భస్రావ హక్కు. ఇది పునరుత్పత్తి, పనిలో సమానత్వానికి సంబంధించిన సాహసోపేతమైన ఫెమినిస్టు డిమాండుగా మాత్రమే లేదు. ఇది నిజంగానే మహిళ తన సొంత దేహంపై తాను మాత్రమే తీసుకోవలసిన ఎంపిక స్వాతంత్య్రంగా ఉంటుంది. అబార్షన్ అనేది వైద్యపరమైన అవసరమనీ, వైద్య శాస్త్రం స్వీయాత్మకమైన అంశంగా ఉండదనీ అమెరికన్ కాలేజీ ఆఫ్ ఆబ్స్టిట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఏసీఓజీ) చెప్పింది. అబార్షన్ రూపంలో గర్భధారణను తొలగించడానికి వైద్యపరమైన జోక్యం అవసరమైన పరిస్థితులు ఉంటాయి. మహిళ ఆరోగ్యాన్ని ఈ జోక్యమే కాపాడుతుంది. 2012లో సవితా హలప్పనవర్ అనే భారత సంతతి మహిళా డెంటిస్టు ఐర్లండులో రక్తంలో వ్యాధికారక క్రిములు ఉన్న కారణంగా ఆపరేషన్ అవసరమైన పరిస్థితుల్లో దారుణంగా చనిపోయారు. అబా ర్షన్ చేసుకుంటానన్న ఆమె డిమాండును ఐర్లండ్ చట్టాలు తిరస్కరిం చాయి. ఆమె మరణం పెద్ద ఉద్యమానికి దారితీసి, ఐర్లండులో సంస్క రణలు తీసుకొచ్చింది. దీంతో 2018లో ఆరోగ్య బిల్లు (గర్భధారణ తొలగింపు క్రమబద్ధీకరణ చట్టం)ను కూడా ఆ దేశం ఆమోదించింది. 1973 నాటి ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును గత వారం అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహిళల అబార్షన్ హక్కును ఎత్తిపట్టిన ఆనాటి తీర్పును అమెరికన్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అదే సమయంలో గర్భస్రావ ప్రక్రియను విడివిడిగా రాష్ట్రాలు ఆమోదించచ్చు లేదా పరిమితం చేయవచ్చునని ఫెడరల్ కోర్టు పేర్కొంది. దీంతో గత పాతికేళ్లలో చట్టపరమైన అబార్షన్కు ఉన్న రక్షణలను తొలగించిన నాలుగు దేశాల్లో అమెరికా ఒకటిగా మారింది. అబార్షన్ చట్టాలపై ఆంక్షలు విధించడం అనేది మహిళలకు వ్యతిరేకంగా వివక్షలో ఒక రూపమని మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయవాదులు, అడ్వకేట్ల హక్కుల సంస్థ అయిన సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్, అమెరికా సుప్రీంకోర్టు తాజా చర్యను నిశితంగా విమర్శించింది. అబార్షన్లపై తరచుగా జరుగుతున్న చర్చ గర్భస్థ పిండం, పిండంలో రూపు దిద్దుకుంటున్న జీవానికి సంబంధించి మానసిక, వైద్యపరమైన అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తోంది. అయితే పిల్లలను కనాలా, వద్దా అనే అంశాన్ని మహిళలు నిర్ణయించుకోవడం ఒక సామాజిక అడ్డంకిగా ఎందుకుందనే ప్రశ్నపై చర్చ జరగడం లేదు. మహిళలు కేవలం గర్భస్థ పిండాన్ని మోసేవారు మాత్రమే కాదు. ఇలాంటి అభిప్రాయంతోనే పిండంలో రూపొందుతున్న మరొక ప్రాణిని కాపాడే బాధ్యతను రాజ్యవ్యవస్థ తీసుకుని నిర్బంధ చట్టాలను అమలు చేస్తోంది. అబార్షన్ హక్కును నిషేధించడం మహిళకు ఎలాంటి అండనూ లేకుండా చేస్తుంది. ఆమె సొంత దేహం, ఆమె ఎంపిక అనేవి ఇంకా పుట్టని బిడ్డ కంటే ద్వితీయ ప్రాధాన్యత కలిగిన అంశాలుగా మారిపోయాయి. కడుపులోని పిండాన్ని కాపాడటానికి మహిళ ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తున్నారు, నియంత్రిస్తున్నారు. మహిళ అంటే గర్భాన్ని మోయడం తప్ప ఒక వ్యక్తిగా ఇక ఏమాత్రం ఉండదన్నమాట. తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడినప్పడు అబార్షన్ చేసుకోవడాన్ని ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాలు అనుమతిస్తున్నాయి. అత్యాచారం ద్వారా, వివాహేతర సంబంధం ద్వారా గర్భం దాల్చినప్పుడు లేక బలహీనమైన పిండం కారణంగా గర్భస్రావాన్ని సగం దేశాలు అనుమతిస్తున్నాయి. కాగా ఆర్థిక, రాజకీయ కారణాలవల్ల లేక అభ్యర్థించిన కారణంగా గర్భస్రావాన్ని మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. ఆంక్షలతో కూడిన అబార్షన్ విధానాలు ఉన్న దేశాల్లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటోంది. అయితే అబార్షన్లపై ఆంక్షలు విధించిన దేశాల్లో అరక్షిత అబార్షన్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రసూతి మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. 1973 నాటి రో తీర్పు వల్ల అమెరికాలో వేలాదిమంది టీనేజర్లు బాల్యవివాహాన్ని, చిన్నతనంలోనే మాతృత్వాన్ని అధిగమించడానికి వీలయింది. అలాగే అవాంఛిత, అనూహ్యమైన గర్భధారణల కారణంగా తక్షణం వివాహాలు చేసుకోవలిసిన పరిస్థితినుంచి మహిళలను ఈ తీర్పు కాపాడింది. కానీ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో ఇలాంటి తీర్పు రావడం అనేది మహిళల హక్కులపై తీవ్ర అఘాతం మాత్రమే కాదు... దశాబ్దాల స్త్రీవాద ఉద్యమం, మహిళల పునరుద్ధరణ, వారి హక్కుల రక్షణ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అబార్షన్ చేసుకోగలగడానికీ, మహిళలు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో తల్లులు కావాలో నిర్ణయించుకోవడానికీ మధ్య సాధారణమైన లింకు ఉంటోందనీ, ఇది మహిళల జీవితాంతం వారిపై ప్రభావాలు వేస్తోందనీ 2021 బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. మహిళల విద్య, ఆదాయం, కేరీర్, తమ పిల్లలకోసం కల్పించాల్సిన జీవితంపై ఇది పెను ప్రభావం చూపిస్తూంటుంది. రో వర్సెస్ వేడ్ తీర్పును రద్దు చేయడం ద్వారా అబార్షన్ని రద్దు చేయడం, లేదా పూర్తిగా ఆ హక్కుకే దూరం చేయడం అనేది మహిళల వ్యక్తిగత, ఆర్థిక జీవితాలను, వారి కుటుంబ జీవితాలను హరింప జేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అబార్షన్ చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును అమెరికన్ మహిళలు ప్రస్తుతం కోల్పోతుండగా, భారతదేశం మాత్రం 1971 నుంచే వైద్యపరంగా గర్భధారణ తొలగింపు చట్టం (ఎంటీపీ)ని కలిగి ఉంది. జనన లేదా కుటుంబ నియంత్రణ సాధనంగా ఇది ఉనికిలోకి వచ్చింది. 2021లో తీసుకొచ్చిన చట్ట సవరణ ద్వారా 24 వారాలలోపు గర్భస్రావం చేసుకునేందుకు ఈ చట్టం భారత మహిళలకు అనుమతించింది. మహిళల ఆరోగ్యానికి సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్లు ఎంతగానో అవసరం అవుతాయి. అయితే గర్భధారణను తొలగించుకోవాలంటే భారత్లో వైద్యుల ఆనుమతి అవసరం. కానీ అవివాహిత మహిళలు గర్భస్రావాన్ని చేయించుకోవడం భారత్లో మహిళలకు కళంకప్రాయంగా ఉంటున్న స్థితి కొనసాగుతోంది. అబార్షన్ హక్కును వెనక్కు తీసుకోవడం అంటే ఆధునికతను మడతపెట్టేయడమే అవుతుంది. చట్టబద్ధమైన పద్ధతులు, వైద్యపరంగా సురక్షితమైన అబార్షన్లు లేకుంటే మహిళలు మరింత ప్రమాదంలో పడతారు. వారి జీవితాలు మరింతగా దుర్భరమవుతాయి. అనూహ్యమైన, అవాంఛితమైన గర్భధారణను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మహిళలు మరింత ప్రమాదకరమైన, అంధకారయుతమైన స్థానంలోకి నెట్టబడతారు. పైగా నిర్బంధ మాతృత్వం వల్ల వారి జీవిత గమనమే మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి) - వినీతా ద్వివేది అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్పీజేఐఎంఆర్ (‘మింట్’ సౌజన్యంతో) -
వారికి స్వేచ్ఛ లేదా?
దాదాపు అర్ధశతాబ్దం క్రితం అమెరికా అంతటా మహిళలకు దక్కిన వరం అది. 1973లో ‘రో వర్సెస్ వేడ్’ కేసులో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ఆ దేశమంతటా గర్భస్రావం చట్టబద్ధమైంది. అలా 22 నుంచి 24 వారాల లోపు గర్భస్రావం చేయించుకోవడానికి దక్కిన హక్కు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయంతో మహిళలకు దూరమవుతోంది. ఈ తిరోగమన చర్యతో లావోస్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, ఇరాక్ల దోవలో గర్భస్రావాన్ని చట్టవిరుద్ధం చేసిన దేశాల జాబితాలో అమెరికా చేరింది. ఇప్పుడిక అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గర్భస్రావ హక్కుపై సొంత నిర్ణయాలు తీసుకొనే వీలు చిక్కింది. జూన్ 24న కోర్టు ఇచ్చిన ఈ ఆదేశం స్త్రీ స్వేచ్ఛనూ, సొంత శరీరంపై స్త్రీలకున్న సహజమైన హక్కునూ కాలరాయడమే అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చ. గర్భస్రావాలపై నిషేధం లైంగిక సమానత్వానికీ, మహిళల మానవహక్కులకూ గొడ్డలిపెట్టు అని ఐరాస సహా అంతర్జాతీయ మహిళా సంఘాలు ఎలుగెత్తుతున్నాయి. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ‘కోర్టు తాజా నిర్ణయం దురదృష్టకరం, ఇది దేశానికి దుర్దినం’ అన్నారంటే విషయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా కోర్టు 6–3 మెజారిటీతో ఇచ్చిన ఆదేశాన్ని ఆసరాగా చేసుకొని, అక్కడ 50 రాష్ట్రాల్లో కనీసం 26 రాష్ట్రాల్లో గర్భస్రావంపై నిషేధాలొచ్చే సూచనలున్నాయి. రిపబ్లికన్ల హయాంలోని రాష్ట్రాలు తక్షణమే గర్భస్రావాన్ని నిషేధించడమో, లేదంటే బోలెడన్ని ఆంక్షలు విధించడమో చేయనున్నాయి. మరోపక్క డెమోక్రాట్ల సారథ్యంలోని పలు రాష్ట్రాలేమో మహిళల గర్భస్రావ హక్కును కాపాడే చర్యలకు సిద్ధమవుతున్నాయి. వెరసి, అమెరికాలో ఆ యా రాష్ట్రాలలోని పాలకపార్టీని బట్టి స్త్రీ స్వేచ్ఛ ఉండే పరిస్థితి వచ్చిందన్న మాట. అయితే, కొత్త నియంత్రణల దెబ్బతో ఇక ఎవరూ గర్భ స్రావం చేయించుకోకుండా ఆగిపోతారని అనుకుంటే అమాయకత్వమే. దొంగచాటు గర్భస్రావాలు పెరిగి, గర్భిణుల ప్రాణాలకే ప్రమాదం పెరిగే అవకాశాలెక్కువ. ఐరాస ప్రతినిధుల అభిప్రాయమూ అదే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గర్భస్రావాల్లో నూటికి 45 గర్భస్రావాలు సురక్షితమైనవి కావు. అవి గర్భిణుల మరణానికి దారి తీస్తున్నాయని సాక్షాత్తూ ఐరాస పాపులేషన్ ఫండ్ లెక్క. నిజానికి, కోర్టు తాజా నిర్ణయం తాలూకు ముసాయిదా మే నెలలోనే బయటకు పొక్కింది. అమెరికన్ స్త్రీలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓ ప్రాథమికమైన హక్కుకు ముప్పు వాటిల్లనుందని అప్పటి నుంచీ చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కోర్టు నిర్ణయం అధికారికంగా వచ్చేసింది గనక, అటు రాజకీయంగానూ, ఇటు ప్రభుత్వ విధానపరంగానూ బైడెన్ వ్యూహాలు పరీక్షను ఎదుర్కోక తప్పదు. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనను రాజకీయంగా ఉపయోగించుకొని, నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని బైడెన్, ఇతర డెమోక్రాట్లు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా గర్భస్రావ హక్కు కల్పించేలా చేయడం కష్టమే కానీ, వివిధ రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయాలు సాధిస్తే గనక రిపబ్లికన్ల గర్భస్రావ నిషేధ యత్నాలను కొంత నియంత్రించవచ్చు. బైడెన్ వర్గం ఆ మాటే ప్రచారంలో పెట్టనుంది. కానీ, మధ్యంతర ఎన్నికల తర్వాత అమెరికన్ పార్లమెంటులోని రెండు సభల్లోనూ రిపబ్లికన్లదే మెజారిటీ కావచ్చని ఓ అంచనా. ఛాందస సంప్రదాయవాది అయిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ అధ్యక్షులైనా ఆశ్చర్యం లేదని వార్త. అంటే, గర్భస్రావమే కాదు... ఇంకా అనేక అంశాల్లో అమెరికా పాత కాలపు దురభిప్రాయాల్లోకి తిరోగమిస్తుందా? గర్భస్రావ హక్కుపై పోరు అమెరికాలో ఓ భావోద్వేగభరిత సైద్ధాంతిక యుద్ధం. కొన్ని దశాబ్దాలుగా కన్జర్వేటివ్లు గర్భస్రావ హక్కు నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగతావాళ్ళు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. తీరా కోర్టులో కన్జర్వేటివ్ల ఆధిక్యంతో ఇప్పుడు గర్భస్రావ హక్కును తొలగించేందుకు సందు చిక్కింది. ఇదంతా ఘనత వహించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చలవే. ఎందుకంటే, ఆయనే తన హయాంలో ముగ్గురు కన్జర్వేటివ్ సుప్రీమ్ కోర్టు జడ్జీలను నియమించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ ముగ్గురూ తాజాగా గర్భస్రావ హక్కును కొట్టిపారేసేందుకు ఓటేశారట. కేవలం ఆరే ఆరుగురు జడ్జీలు మొత్తం అమెరికన్ స్త్రీ జాతి శారీరక స్వేచ్ఛపై సమ్మెట దెబ్బ వేసి, వారి తలరాతను మార్చేయడం అత్యంత విషాదం. అమానవీయం. లైంగిక, పునరుత్పాదక ఆరోగ్యం, హక్కులనేవి ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ సమానత్వానికీ, స్వేచ్ఛకూ, ఎంపిక హక్కుకూ సంబంధించిన అంశాలు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే అమెరికాలోనే ఆ హక్కులపై నియంత్రణ పెట్టారంటే ఏమనుకోవాలి! ఎవరైనా సరే తుపాకీలు యథేచ్ఛగా కొనుక్కోవడానికి అవకాశమిస్తున్న అగ్రరాజ్యం... తీరా గర్భాన్ని కొనసాగించాలా, వద్దా అని నిర్ణయించుకొనే హక్కు మాత్రం స్త్రీలకు లేదనడమే విరోధాభాస. ఇంకా చెప్పాలంటే, ఒక దేశం ఆర్థిక పురోగమించినంత మాత్రాన ఆ దేశంలో పౌర స్వేచ్ఛ, హక్కులు పరిరక్షితమవుతాయని అనుకుంటే పొరపాటే అని మరోమారు ఋజువైంది. ఆదర్శంగా నిలవాల్సిన భారీ ప్రజాస్వామ్య దేశంలోని వ్యవహారం రేపు మిగతా ప్రపంచమూ ఆదర్శంగా తీసుకుంటే, అది మహిళలకు జరిగే మహాపచారం. అందుకే, పాశ్చాత్య ప్రపంచం తిరోగమిస్తుంటే, మన దేశం మాత్రం గర్భస్రావం, అద్దె గర్భం, బాల్యవివాహాల నిరోధం లాంటి అంశాల్లో మెరుగైన చట్టాలతో పురోగమిస్తోందని కేంద్ర పాలకులు జబ్బలు చరుచుకోవడం అర్థం చేసుకోదగినదే! -
అబార్షన్లపై నిషేధమా?
వాషింగ్టన్: అబార్షన్ విషయమై అమెరికాలో భిన్నాభిప్రాయాలు ఇప్పటివి కాదు. మత విశ్వాసాలను నమ్మే సంప్రదాయవాదులకు, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే ప్రగతిశీలవాదులకు మధ్య ఈ విషయమై ఎన్నేళ్లగానో పోరు నడుస్తోంది. 50 ఏళ్ల క్రితం రో వెర్సస్ వేడ్ కేసు తర్వాత రాజ్యాంగపరంగా సంక్రమించిన అబార్షన్ హక్కులకు సుప్రీంకోర్టు మంగళం పలికి, దాన్ని నిషేధించేందుకు రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టడంపై మహిళలు భగ్గుమంటున్నారు. పిల్లలను మోసి కనే శ్రమ ఆడవాళ్లదే కాబట్టి దానిపై నిర్ణయం తీసుకునే హక్కు తమకే ఉండాలంటూ దేశవ్యాప్తంగా భారీగా నిరసనలకు దిగారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏడు రాష్ట్రాలు అలబామా, అర్కన్సాస్, కెంటకీ, లూసియానా, మిసోరి, ఒక్లహామా, సౌత్ డకోటా అబార్షన్లను నిషేధించే ప్రక్రియను ప్రారంభించాయి. మరో 23 రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అబార్షన్ క్లినిక్స్ మూసేస్తున్నారు. మహిళల పునరుత్పత్తి హక్కులపై అధ్యయనం నిర్వహించే గట్మ్యాచర్ ఇనిస్టిట్యూట్ గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు 45 ఏళ్ల వయసులోనూ అబార్షన్ చేయించుకుంటున్నారు. 20–30 ఏళ్ల వయసు వారిలో ఏకంగా 60 శాతం అబార్షన్లు జరుగుతున్నాయి. వీరిలో ఆఫ్రికన్ నిరుపేద, అందులోనూ నల్లజాతి మహిళలే ఎక్కువ. ఇన్సూరెన్స్ లేని టీనేజర్లు, వలస వచ్చిన మహిళలపై తీర్పు తీవ్ర ప్రభావం చూపించనుంది. ఆలస్యమూ కొంప ముంచుతుంది డెమొక్రాట్ల పట్టున్న కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ సహా 10 రాష్ట్రాల్లో అబార్షన్లకు చట్టబద్ధత కొనసాగనుంది. దాంతో నిషేధమున్న రాష్ట్రాల మహిళలు అబార్షన్కు వందలాది మైళ్ల దూరం ప్రయాణించి ఇలాంటి రాష్ట్రాలకు వెళ్లాలి. -
షాకింగ్ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు!
7 Aborted Fetuses: బెళగావి జిల్లాలోని ముదలగి గ్రామంలో ఒక డబ్బాలో గర్భస్రావం చేయబడిన ఏడు పిండాలను స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ షాకింగ్ ఘటన బెళగావి జిల్లా ముదలగి గ్రామంలోని బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వెంటనే సంఘటనే స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు పోలీసులు ఆ డబ్బాలో ఏడు పిండాలను గుర్తించారు. అవన్నీ ఐదు నెలల పిండాలని, భ్రూణ హత్యలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ విషయమై జిల్లా యంత్రంగాం వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. అంతేకాకుండా ఈ పిండాలను ఆస్పత్రికి తరలించి, ఆపై పరీక్ష కోసం జిల్లా ఫంక్షన్ సైన్స్ సెంటర్ తీసుకువెళ్తున్నామని పోలీసులు చెప్పారు. (చదవండి: మహిళను బంధించి దోపిడీ)