Akula srija
-
రన్నరప్ ఆకుల శ్రీజ
సూరత్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి, మాజీ విజేత ఆకుల శ్రీజ రన్నరప్గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగిన శ్రీజ మహిళల సింగిల్స్ ఫైనల్లో 12 -10, 11 - 8, 11 - 13, 10-12, 8-11, 11-9, 9-11తో దియా చిటాలె (ఆర్బీఐ) చేతిలో ఓడిపోయింది. 26 ఏళ్ల శ్రీజ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 28వ స్థానంలో ఉంది. భారత నంబర్వన్ ర్యాంకర్గా కొనసాగుతున్న శ్రీజ గత ఏడాది ఆసియా చాంపియన్షిప్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. పారిస్ ఒలింపిక్స్లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. -
Paris Olympics 2024: భారత మహిళల టీటీ జట్టు అవుట్
పారిస్: ఒలింపిక్స్లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది. -
Olympics 2024: సరికొత్త చరిత్ర.. క్వార్టర్ ఫైనల్లో భారత్
పారిస్ ఒలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు (మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్) క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో భారత్.. రొమేనియాపై 3-2 తేడాతో గెలుపొందింది. విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపె ట్టడం ఇదే తొలిసారి.MANIKA BATRA - The Clutch moment in Table Tennis for India. 🥶 pic.twitter.com/dN3XApe98K— Johns. (@CricCrazyJohns) August 5, 2024ఈ మ్యాచ్లో భారత్ తొలి రెండు గేమ్ల్లో (సింగిల్స్, డబుల్స్) విజయాలు సాధించి ఏకపక్ష విజయం సాధించేలా కనిపించింది. అయితే రొమేనియా ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు గేమ్స్లో (సింగిల్స్) విజయం సాధించి స్కోర్ను లెవెల్ (2-2) చేశారు. చివరి గేమ్లో మనిక బత్రా తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రత్యర్ధిపై విజయం సాధించింది. రేపు జరుగబోయే క్వార్టర్ ఫైనల్లో భారత్.. యూఎస్ఏ, జర్మనీ మధ్య మ్యాచ్లో విజేతతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్ ఈవెంట్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా రౌండ్ ఆఫ్ 16కు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాతి రౌండ్లో వీరు ఓడిపోయారు. -
Paris Olympics 2024: బోణి కొట్టిన మరో తెలుగమ్మాయి
పారిస్ ఒలింపిక్స్లో రెండో రోజు భారత్ వరుస విజయాలతో శుభారంభం చేసింది. తొలుత బ్యాడ్మింటన్లో పీవీ సింధు విజయం సాధించగా.. ఆతర్వాత టేబుల్ టెన్నిస్లో ఆకుల శ్రీజ బోణి కొట్టింది. సింధు తొలి రౌండ్ మ్యాచ్లో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్పై 21-9, 21-6 విజయం సాధించగా.. ఆకుల శ్రీజ.. రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్లో స్వీడన్కు చెందిన క్రిస్టినా కల్బర్గ్పై 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో నెగ్గి, రౌండ్ ఆఫ్ 32కు క్వాలఫై అయ్యింది. SREEJA AKULA QUALIFIES INTO ROUND OF 32...!!!! 👌- She won the match without losing a single game, What a fantastic performance in Paris Olympics 🔥 pic.twitter.com/uoSxsD6muX— Johns. (@CricCrazyJohns) July 28, 2024సింధు తొలి రౌండ్లో ప్రత్యర్దిపై 29 నిమిషాల్లో జయకేతనం ఎగురవేయగా.. శ్రీజ 30 నిమిషాల్లో ప్రత్యర్దిని చిత్తు చేసింది. సింధు, శ్రీజ తమతమ ప్రత్యర్దులపై వరుస సెట్లలో విజయం సాధించారు. సింధు, శ్రీజ ఇద్దరూ తెలుగమ్మాయిలే కావడం విశేషం. BALRAJ PAWAR INTO QUARTER-FINAL IN ROWING..!!!! 🇮🇳- India continues to have a great time on Day 2 in the Paris Olympics. pic.twitter.com/3y9q7PLWMV— Johns. (@CricCrazyJohns) July 28, 2024మరోవైపు పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో భారత్కు చెందిన బల్రాజ్ పన్వర్ విజయం సాధించాడు. ఈ విజయంతో బల్రాజ్ క్వార్టర్ ఫైనల్కు చేరాడు.మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్ (631.5) ఫైనల్కు చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా (630.1) ఫైనల్కు చేరాడు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో మనికా బత్రా విజయం సాధించింది. గ్రేట్ బ్రిటన్కు చెందిన అన్నా హర్సేపై 11-8, 12-10, 11-9, 9-11, 11-5 తేడాతో గెలుపొందింది. పురుషుల టేబుల్ టెన్నిస్ తొలి రౌండ్లో భారత్కు చెందిన శరత్ కమల్ స్లొవేనియాకు చెందిన డేనీ కొజుల్ చేతిలో 2-4 తేడాతో (12-10 9-11 6-11 7-11 11-8 10-12) ఓటమిపాలయ్యాడు.పురుషుల టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో భారత్కు చెందిన సుమిత్ నగాల్ ఫ్రాన్స్కు చెందిన కొరెంటిన్ మౌటెట్ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు.భారత మహిళల ఆర్చరీ టీమ్ (అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమార్) క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 0-6 తేడాతో భారత్ ఓటమిపాలైంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్లో భారత్కు చెందిన హెచ్ ఎస్ ప్రణయ్.. జర్మనీకు చెందిన ఫేబియన్ రోథ్పై 21-18, 21-12 తేడాతో గెలుపొందాడు. -
Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
Paris Olympics 2024- న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. మే 16న అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నుంచి టాప్–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. తొలిసారి టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనుంది. పురుషుల, మహిళల టీమ్ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా... ఈ ముగ్గురిలో టాప్–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్ ప్లేయర్ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్గా ఉన్న ఆచంట శరత్ కమల్ ఐదోసారి ఒలింపిక్స్లో పాల్గోనుండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్). భారత పురుషుల జట్టు: శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, సత్యన్ జ్ఞానశేఖరన్ (రిజర్వ్). మనిక పరాజయం కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్వన్ మనిక బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. భారత్కే చెందిన కృత్విక రాయ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో కృత్విక 12–10, 11–4, 11–7తో వెరోనికా (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సానిల్ శెట్టి–హరీ్మత్ దేశాయ్ (భారత్) ద్వయం 8–11, 11–6, 6–11, 6–11తో ఎస్టెబన్ డోర్–ఫ్లోరియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పోమంతి బైస్యా–కృత్విక రాయ్ (భారత్) జంట 11–7, 11–1, 14–12తో ఫ్రాన్జిస్కా (జర్మనీ)–యశస్విని (భారత్) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. -
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళా స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో మనిక 24వ ర్యాంక్లో నిలిచింది. గతవారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన మనిక ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ నుంచి 24వ ర్యాంక్కు చేరుకుంది. తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–25లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలాగతవారం 38వ ర్యాంక్లో నిలిచి భారత నంబర్వన్గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్కు చేరుకోగా... యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్లో నిలిచింది.పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్లో, మానవ్ ఠక్కర్ 62వ ర్యాంక్లో, హర్మీత్ దేశాయ్ 63వ ర్యాంక్లో, సత్యన్ 68వ ర్యాంక్లో ఉన్నారు -
శ్రీజకు సింగిల్స్.. మనుష్–మానవ్లకు డబుల్స్ టైటిళ్లు
లెబనాన్లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ లెవెల్ రెండో టోర్నీలో భారత్కు చెందిన మనుష్ షా–మానవ్ ఠక్కర్ జోడీ డబుల్స్ టైటిల్ సాధించింది. బీరుట్లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మనుష్–మానవ్ ద్వయం 11–7, 11–5, 9–11, 11–6తో భారత్కే చెందిన ముదిత్–ఆకాశ్ పాల్ జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్–మనిక బత్రా (భారత్) జోడీ రన్నరప్గా నిలిచింది. ఆకుల శ్రీజకు సింగిల్స్ టైటిల్.. ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీజ అకుల 6-11, 12-10, 11-5, 11-9తో లక్సెంబర్గ్కు చెందిన సారా డి నట్టేపై గెలిచి, మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. -
World Table Tennis ontender Tourney: ముగిసిన శ్రీజ పోరాటం
దోహా: వరల్డ్ టేబుల్ టెన్నిస్ దోహా కంటెండర్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ‘బై’ పొందిన శ్రీజ రెండో రౌండ్లో 14–12, 11–8, 11–7తో ఆద్రీ జరీఫ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. అయితే మూడో రౌండ్లో శ్రీజ 5–11, 10–12, 9–11తో చెన్ జు యు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో శ్రీజ–యశస్విని ద్వయం 6–11, 7–11, 5–11తో జియాన్ టియాని–చెన్ జింగ్టాన్ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
అల్టిమేట్ టీటీ లీగ్.. దబంగ్ ఢిల్లీ తరఫున బరిలోకి ఆకుల శ్రీజ
Ultimate TT League 2023- పుణే: మూడేళ్ల తర్వాత అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) లీగ్ నాలుగో సీజన్కు గురువారం(జూలై 13) తెర లేవనుంది. మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్, యు ముంబా, బెంగళూరు స్మాషర్స్, గోవా చాలెంజర్స్ ఈ లీగ్లో పాల్గొననున్నాయి. ఇక ఈనెల 30న ఫైనల్తో లీగ్ ముగుస్తుంది. తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ దబంగ్ ఢిల్లీ తరఫున, సూరావజ్జుల స్నేహిత్ పుణేరి పల్టన్ తరఫున ఆడుతున్నారు. తొలిరోజు చెన్నై లయన్స్తో పుణేరి పల్టన్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్లను స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జ్ఞానేశ్వరికి స్వర్ణ పతకం కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో మహిళల 49 కేజీల విభాగంలో భారత ప్లేయర్ జ్ఞానేశ్వరి యాదవ్ స్వర్ణ పతకం సాధించింద. ఛత్తీస్గఢ్కు చెందిన జ్ఞానేశ్వరి మొత్తం 176 కేజీలు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్కే చెందిన జిలీ దలబెహెరా రజత పతకం గెలిచింది. మహిళల 45 కేజీల విభాగంలో కోమల్... పురుషుల 55 కేజీల విభాగంలో ముకుంద్ అహిర్ భారత్కు స్వర్ణ పతకాలు అందించారు. -
పారుపల్లి కశ్యప్ అవుట్.. క్వార్టర్స్లో ప్రణయ్
Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్వన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. పోరాడి ఓడిన శ్రీజ న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సత్యన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం -
WTT Singapore Smash Tourney 2023: ఆకుల శ్రీజకు నిరాశ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్కు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది. బుధవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ రెండో మ్యాచ్లో జాతీయ చాంపియన్ శ్రీజ 12–10, 6–11, 9–11, 3–11తో జూ చెన్హుయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ సూరావజ్జుల 11–4, 7–11, 10–12, 11–6, 11–8తో జేవియర్ డిక్సన్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
సింగపూర్ స్మాష్ టోర్నీలో ఆకుల శ్రీజ ముందంజ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’ బెర్త్కు విజయం దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి మ్యాచ్లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–5, 8–11, 11–8, 12–10తో చార్లోటి లుట్జ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్లో దక్షిణ కొరియాకు చెందిన జూ చెన్హుయ్తో శ్రీజ ఆడుతుంది. ఈ మ్యాచ్లో శ్రీజ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు చేరుకుంటుంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో మనిక.. పడిపోయిన ఆకుల శ్రీజ ర్యాంకు
International Table Tennis Federation (ITTF) world rankings- న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్లో నిలిచింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మనిక గత నవంబర్లో ఆసియా కప్లో కాంస్యం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతవారం దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో కాంస్యం గెలిచి 140 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ ఆరు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ 41వ ర్యాంక్లో, ఆచంట శరత్ కమల్ 46వ ర్యాంక్లో ఉన్నారు. తెలంగాణకు చెందిన సూరావజ్జుల స్నేహిత్ మూడు స్థానాలు పడిపోయి 125వ ర్యాంక్లో నిలిచాడు. చదవండి: Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
ప్రపంచ టీటీ చాంపియన్షిప్ పోటీలకు శ్రీజ అర్హత
World Table Tennis Championships: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీలకు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా అర్హత పొందారు. దోహాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ బెర్త్లు ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆచంట శరత్ కమల్... పురుషుల డబుల్స్లో శరత్ కమల్–సత్యన్.. మిక్స్డ్ డబుల్స్లో మనిక బత్రా–సత్యన్ కూడా ఈ మెగా ఈవెంట్కు అర్హత పొందారు. ఇది కూడా చదవండి: బోపన్న, రామ్కుమార్ జోడీలు ఓటమి అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 ఏటీపీ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)... రామ్కుమార్ (భారత్)–రేయస్ వరేలా (మెక్సికో) జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. బుధవారం జరిగిన మ్యాచ్ల్లో ఐదో సీడ్ బోపన్న–ఎబ్డెన్ 6–7 (4/7), 5–7తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)–టిమ్ ప్యూయెట్జ్ (జర్మనీ) చేతిలో... రామ్–వరేలా 3–6, 4–6తో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–రోజర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..? -
Table Tennis: కెరీర్ బెస్ట్ ర్యాంక్లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి
Manika Batra: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్లో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ 136వ ర్యాంక్ లో ఉన్నాడు. సత్యన్ 39వ ర్యాంక్తో భారత నంబర్వన్గా కొనసాగుతున్నాడు. ఇది కూడా చదవండి: రామ్కుమార్కు మిశ్రమ ఫలితాలు పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ రామ్కుమార్ రామనాథన్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రామ్కుమార్ 3–6, 7–5, 3–6తో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. అయితే డబుల్స్ తొలి రౌండ్లో రామ్కుమార్–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ 7–6 (7/5), 6–7 (4/7), 11–9తో రోహన్ బోపన్న (భారత్)–జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్) ద్వయంపై ‘సూపర్ టైబ్రేక్’లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర మ్యాచ్ల్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 7–6 (7/1), 5–7, 7–10తో మూడో సీడ్ సాదియో దుంబియా–రిబూల్ (ఫ్రాన్స్) జంట చేతిలో... పురవ్ రాజా–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 4–6, 3–6తో జీవన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ చేతిలో ఓడిపోయాయి. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? -
శరత్ కమల్కు ఖేల్రత్న.. శ్రీజ, నిఖత్లకు అర్జున
న్యూఢిల్లీ: తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ ‘అర్జున’ విజేతలయ్యారు. అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలతో సత్తా చాటుకుంటున్న తెలంగాణ మహిళా చాంపియన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా బాక్సర్ నిఖత్, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శ్రీజలను ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీజ ‘మిక్స్డ్’ భాగస్వామి, స్టార్ టీటీ ప్లేయర్ అచంట శరత్ కమల్కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ లభించింది. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయనున్నారు. కొన్నేళ్లుగా ‘ఖేల్రత్న’ అవార్డుకు ముగ్గురు, నలుగురేసి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఈసారి శరత్ మాత్రమే ఆ అవార్డుకు ఎంపికయ్యాడు. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (204 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో) భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదుసార్లు కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొని ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్షిప్లో రెండు కాంస్యాలు గెల్చుకున్నాడు. మొత్తం 25 మంది క్రీడాకారులకు ‘అర్జున’ దక్కింది. ఇందులో నలుగురు పారాథ్లెట్లున్నారు కానీ ఒక్క భారత మహిళా, పురుష క్రికెటర్ లేడు. ఆటగాళ్లను తీర్చిదిద్దే కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డుకు జీవన్జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మొహమ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్), సుమ షిరూర్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్)... ద్రోణాచార్య ‘లైఫ్ టైమ్’ అవార్డుకు దినేశ్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ఎంపికయ్యారు. అశ్విని అకుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ (హాకీ), సురేశ్ (కబడ్డీ), నీర్ బహదూర్ (పారాథ్లెటిక్స్) ధ్యాన్చంద్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. తెలంగాణ స్టార్లకు... ఇంటాబయటా అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలతో మెరిసిన ఆకుల శ్రీజ ఈ ఏడాది కెరీర్లోనే అత్యుత్తమ సాఫల్యాన్ని బర్మింగ్హామ్లో సాకారం చేసుకొంది. ఈ ఏడాది అక్కడ జరిగిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో వెటరన్ స్టార్ శరత్ కమల్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకం సాధించింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఆమె మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు నెగ్గింది. నిఖత్ ఈ ఏడాది ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకాలు సాధించింది. 2019లో బ్యాంకాక్లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో మెరిసింది. అవార్డీల జాబితా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న: శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్). అర్జున: నిఖత్ జరీన్, అమిత్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్), సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాశ్ సాబ్లే (అథ్లెటిక్స్), లక్ష్య సేన్, ప్రణయ్ (బ్యాడ్మింటన్), భక్తి కులకర్ణి, ప్రజ్ఞానంద (చెస్), దీప్గ్రేస్ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్), సాగర్ కైలాస్ (మల్లకంబ), ఇలవేనిల్ వలరివన్, ఓంప్రకాశ్ మిథర్వాల్ (షూటింగ్), వికాస్ ఠాకూర్ (వెయిట్లిఫ్టింగ్), అన్షు, సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మానసి జోషి, తరుణ్ థిల్లాన్, జెర్లిన్ అనిక (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్). -
ఖేల్రత్నకు శరత్ కమల్.. అర్జున బరిలో నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ
2022 ఏడాదికి గానూ భారత్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ను సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుకు సిఫార్సు చేసింది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఈ ఏడాది శరత్ కమల్ మినహా మరెవరిని ఎంపిక చేయకపోవడం విశేషం. దీంతో శరత్ కమల్కు ఖేల్రత్న అవార్డు రావడం గ్యారంటీ. ఇక 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ ఈ ఏడాది టేబుల్ టెన్నిస్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కామన్వెల్త్ గేమ్స్లో నాలుగు పతకాలు సాధించగా.. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఉంది. అలాగే శరత్ కమల్ ఏషియన్ గేమ్స్లో రెండుసార్లు పతకాలు సాధించిన తొలి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. ఇక అర్జున అవార్డుకు 25 మంది పేర్లను సిఫార్సు చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వీరిలో తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కూడా ఉంది. జరీన్తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, రెజ్లర్ అన్షు మాలిక్ తదితరులు ఉన్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసిన జాబితాల ఒక్క క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించింది. అంతకముందు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించి దేశ ఖ్యాతిని పెంపొందించింది. ఇక తెలంగాణకే చెందిన టేబుల్ టెన్నిస్ సంచనలం ఆకుల శ్రీజ కూడా అర్జున అవార్డు బరిలో ఉంది. ఖేల్ రత్న అవార్డు సిఫార్సు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డు సిఫార్సులు: సీమా పునియా (అథ్లెటిక్స్), ఎల్దోస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సేబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ పంఘల్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఎక్కా (హాకీ), శుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్స్), సాగర్ ఓవల్కర్ (మల్లాఖాంబ్), ఎలవేనిల్ వలరివన్ (షూటింగ్), ఓం ప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్), శ్రీజ అకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు మాలిక్ (రెజ్లింగ్), సరితా మోర్ (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మనాషి జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా (డెఫ్ బ్యాడ్మింటన్) చదవండి: 144లో ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు.. అందుకే సీజ్ ఐపీఎస్ ఆఫీసర్పై పిటిషన్ దాఖలు చేసిన ధోని -
ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలె, రీత్ టెనిసన్, స్వస్తిక ఘోష్లతో కూడిన భారత మహిళల జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన గ్రూప్–5 చివరి లీగ్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 3–1తో ఈజిప్ట్ను ఓడించింది. తొలి మ్యాచ్లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–6, 11–4, 11–1తో హనా గోడాపై నెగ్గగా... రెండో మ్యాచ్లో మనిక 8–11, 11–6, 11–7, 2–11, 11–8తో దీనా మెష్రఫ్ను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్లో దియా 11–5, 10–12, 11–9, 9–11, 4–11తో యుస్రా హెల్మీ చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్లో శ్రీజ 11–8, 11–8, 9–11, 11–6తో దీనా మెష్రఫ్పై గెలుపొందడంతో భారత విజయం ఖరారైంది. నాలుగు జట్లున్న గ్రూప్–5లో భారత్ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, జర్మనీ ఆరు పాయింట్లతో టాపర్గా నిలిచాయి. -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్లోని సూరత్లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్లో రజతం... మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణకే చెందిన స్నేహిత్తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్షిప్లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్ను నిర్వహించారు. -
టేబుల్ టెన్నిస్ సెమీఫైనల్లో తెలంగాణ
గుజరాత్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్కు చేరింది. ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్ సభ్యులుగా ఉన్న తెలంగాణ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. హరియాణా, గుజరాత్ జట్లపై 3–1తో నెగ్గిన తెలంగాణ 0–3తో మహారాష్ట్ర చేతిలో ఓడింది. జాతీయ క్రీడలు ఈనెల 29 నుంచి జరగనున్నాయి. అయితే అవే తేదీల్లో భారత జట్లు ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనాల్సి ఉండటంతో టీటీ ఈవెంట్ను ముందుగా నిర్వహిస్తున్నారు. -
భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్ హవా
టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్ చూంగ్–లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్గా 53వ పతకం చేరాయి. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్ డ్రింక్హాల్–లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. ఫైనల్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్ కమల్ 11–8, 11–8, 8–11, 11–7, 9–11, 11–8తో పాల్ డ్రింక్హాల్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 11–4, 8–11, 9–11, 9–11తో లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకపోరుకు సిద్ధమయ్యాడు. పోరాడి ఓడిన శ్రీజ మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో శ్రీజ పోరాడినా తుదకు 11–3, 6–11, 2–11, 11–7, 13–15, 11–9, 7–11తో లియు యాంగ్జీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. -
Commonwealth Games 2022: సూపర్ శ్రీజ, శరత్
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ... పురుషుల డబుల్స్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–9, 11–8, 9–11, 12–14, 11–7తో నికోలస్ లమ్–మిన్హైంగ్ జీ (ఆస్ట్రేలియా) జంటపై... శరత్ కమల్–సత్యన్ జోడీ 8–11, 11–9, 10–12, 11–1, 11–8తో నికోలస్ లమ్–ఫిన్ లు (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీజ 6–11, 11–8, 11–6, 9–11, 8–11, 11–8, 10–12తో తియాన్వె ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో యాంగ్జీ లియు (ఆస్ట్రేలియా)తో శ్రీజ ఆడుతుంది. పురుషుల సింగిల్స్లో సత్యన్, శరత్ కమల్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్లో శ్రీజ–రీత్... మనిక బత్రా–దియా చిటాలె (భారత్) జోడీలకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. -
శ్రీజ ‘డబుల్’ ధమాకా
షిల్లాంగ్ (మేఘాలయ): కొన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ అందని ద్రాక్షగా ఉన్న జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎట్టకేలకు అందుకుంది. అంతేకాకుండా మహిళల డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. గత ఏడాది సింగిల్స్లో కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ 23 ఏళ్ల శ్రీజ ఈసారి చాంపియన్గా అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హైదరాబాద్ బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీజ ఈ మెగా ఈవెంట్లో ఆర్బీఐ తరఫున బరిలోకి దిగింది. సోమవారం సాయంత్రం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ఆకుల శ్రీజ 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్ స్టార్ ప్లేయర్, మౌమా దాస్పై విజయం సాధించింది. బెంగాల్కు చెందిన 38 ఏళ్ల మౌమా దాస్ ఐదుసార్లు జాతీయ సింగిల్స్ చాంపియన్గా నిలువడంతోపాటు అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడ్డ భారత, ఆసియా ప్లేయర్గా గుర్తింపు పొంది ంది. సెమీఫైనల్లో శ్రీజ 12–10, 8–11, 11–8, 11–9, 3–11, 12–10తో అహిక ముఖర్జీ (ఆర్బీఐ) పై నెగ్గింది. అంతకుముందు జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీజ–అహిక ముఖర్జీ (ఆర్బీఐ) ద్వయం 3–11, 11–9, 11–5, 12–10తో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు చెందిన టకేమి సర్కార్–ప్రాప్తి సేన్ జోడీపై గెలిచింది. తాజా విజయంతో శ్రీజ జాతీయ సీనియర్ టీటీ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్గా ఘనత వహించింది. గతంలో హైదరాబాద్కు చెందిన సయీద్ సుల్తానా ఆరుసార్లు (1949, 1950, 1951, 1952, 1953, 1955) జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్గా నిలిచింది. అయితే సుల్తానా కుటుంబం 1956లో హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కు వలస వెళ్లి అక్కడే స్థిర పడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరా బాద్కు చెందిన మీర్ ఖాసిమ్ అలీ రెండుసార్లు (1968, 1969) చాంపియన్గా నిలిచారు. నా కల నిజమైంది... గతంలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో జాతీయ టైటిల్స్ సాధించాను. కానీ సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్ కావడంతో నా చిరకాల స్వప్నం నెరవేరింది. తాజా విజయం త్వరలో మొదలయ్యే అంతర్జాతీయ సీజన్ లో మరింత మెరుగ్గా రాణించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. –‘సాక్షి’తో ఆకుల శ్రీజ -
జాతీయ టీటీ టోర్నీ ఛాంపియన్గా ఆకుల శ్రీజ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో (సౌత్జోన్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ)కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ చాంపియన్గా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 5–11, 11–7, 7–11, 17–19, 11–4, 11–6, 12–10తో స్వస్తిక ఘోష్ (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై గెలిచింది. శ్రీజకు కోచ్గా సోమ్నాథ్ ఘోష్, ఫిట్నెస్ కోచ్గా హిరాక్ బాగ్చి వ్యవహరించారు. -
‘టాప్స్’ డెవలప్మెంట్ గ్రూప్లో స్నేహిత్, శ్రీజ, ఇషా సింగ్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో కొత్తగా 20 మందిని చేర్చారు. తాజా జాబితాతో కలిపి 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం ప్రభుత్వ సహకారంతో సన్నద్ధమవుతున్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య 148కి చేరింది. వర్ధమాన క్రీడాకారులను కూడా సహకారం అందించేందుకు ‘టాప్స్’ డెవలప్మెంట్ గ్రూప్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి టేబుల్ టెన్నిస్లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, ఆకుల శ్రీజకు... షూటింగ్లో ఇషా సింగ్కు చోటు లభించింది. చదవండి: Ind Vs SA- Test Series: రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్.. 314 నాటౌట్.. 24 సెంచరీలు! -
ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్లోకి ప్రవేశించగా... డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్యోగి అయిన శ్రీజ సింగిల్స్ తొలి రౌండ్లో 11–4, 11–7, 12–10తో సితీ అమీనా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–అర్చన కామత్ (భారత్) జోడీ 11–5, 11–3, 11–6తో సోనమ్ సుల్తానా–సాదియా (బంగ్లాదేశ్) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ–అర్చన ద్వయం 10–12, 7–11, 12–10, 13–15తో డు హై కెమ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
శ్రీజ తీన్మార్
కటక్: సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ వ్యక్తిగత విభాగంలోనూ భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఇంతకుముందు టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు నెగ్గగా... సోమవారం ముగిసిన వ్యక్తిగత విభాగంలో అందుబాటులో ఉన్న ఐదు పసిడి పతకాలను భారత క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు పతకాలు సాధించింది. మహిళల డబుల్స్లో మౌసుమి పాల్తో జతకట్టి బరిలోకి దిగిన శ్రీజ రజతం సాధించగా... మహిళల సింగిల్స్లో సెమీస్లో ఓడి ఆమె కాంస్యం సంపాదించింది. ఆదివారం మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ సెమీస్లో ఓడి కాంస్యం దక్కించుకుంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో శ్రీజ 8–11, 9–11, 11–9, 8–11, 12–14తో మధురిక పాట్కర్ (భారత్) చేతిలో ఓడింది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్ ద్వయం 9–11, 8–11, 11–9, 10–12తో పూజా సహస్రబుద్దె–కృత్విక సిన్హా రాయ్ (భారత్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో వరుసగా హర్మీత్ దేశాయ్, అహిక ముఖర్జీ కామన్వెల్త్ చాంపియన్స్గా అవతరించారు. ఫైనల్స్లో హర్మీత్ 9–11, 6–11, 11–5, 11–8, 17–15, 7–11, 11–9తో సత్యన్ జ్ఞానేశేఖరన్ (భారత్)పై, అహిక 11–6, 11–4, 11–9, 11–7తో మధురిక (భారత్)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంథోనీ అమల్రాజ్–మానవ్ ఠక్కర్ (భారత్) జంట 8–11, 11–6, 13–11, 12–10తో సత్యన్–శరత్ కమల్ (భారత్) ద్వయంపై గెలిచి టైటిల్ గెలిచింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సత్యన్–అర్చన కామత్ జంట స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. ఓవరాల్గా ఈ పోటీల్లో భారత్ అందుబాటులో ఉన్న 7 స్వర్ణాలను సొంతం చేసుకుంది. స్వర్ణాలే కాకుండా భారత క్రీడాకారులు ఐదు రజతాలు, మూడు కాంస్యాలనూ సాధించి 15 పతకాలతో అదరగొట్టారు. 1975లో ఇంగ్లండ్ తర్వాత కామన్వెల్త్ టీటీ చాంపియన్షిప్లో అన్ని విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. -
శ్రీజ తడాఖా
కటక్: స్వదేశంలో జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో సెమీఫైనల్ చేరి కనీసం రెండు కాంస్య పతకాలను ఖాయం చేసుకున్న శ్రీజ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన శ్రీజ క్వార్టర్ ఫైనల్లో 11–5, 11–6, 11–9, 17–19, 6–11, 17–15తో సుతీర్థ ముఖర్జీ (భారత్)పై అద్భుత విజయం సాధించింది. అంతకుముందు శ్రీజ తొలి రౌండ్లో 11–6, 11–5, 6–11, 12–10, 11–7తో సాగరిక ముఖర్జీ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–11, 15–13, 13–11, 11–3, 11–8తో చార్లోటి క్యారీ (వేల్స్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో మధురిక పాట్కర్ (భారత్)తో శ్రీజ ఆడుతుంది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్ (భారత్) జంట 11–4, 11–8, 7–11, 11–8తో జాంగ్ వాన్ లింగ్–తాన్ లిలిన్ జాసీ (సింగపూర్) జోడీపై విజయం సాధించి సెమీస్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట 11–13, 11–8, 11–6, 8–11, 4–11తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్–అర్చన కామత్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సత్యన్–అర్చన జంట 11–1, 11–7, 11–4తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో సత్యన్, హర్మీత్ దేశాయ్ (భారత్) సెమీఫైనల్కు చేరుకున్నారు. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీజ
కటక్: కామన్వెల్త్టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ పోటీల్లో గ్రూప్–6లో పాల్గొన్న శ్రీజ టాపర్గా నిలిచింది. తొలి మ్యాచ్లో శ్రీజ 11–7, 11–4, 11–6తో కొన్స్టాటినా (సైప్రస్)పై గెలిచింది. రెండో మ్యాచ్లో శ్రీజకు ఆమె ప్రత్యర్థి తెగీనా నకిబులె (ఉగాండా) నుంచి వాకోవర్ లభించింది. శ్రీజతోపాటు భారత్ నుంచి కృత్విక సిన్హా రాయ్, సుతీర్థ ముఖర్జీ, మౌసుమి పాల్, ప్రాప్తి సేన్, సెలీనా సెల్వకుమార్, దివ్య దేశ్పాండే, సాగరిక ముఖర్జీ, అనూష కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. -
చాంపియన్ శ్రీజ
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ జూనియర్, యూత్ స్థాయిల్లో పలు టైటిల్స్ సాధించిన తెలంగాణ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ తొలిసారి సీనియర్ స్థాయిలో విజేతగా నిలిచింది. హరియాణాలోని సోనెపట్లో గురువారం ముగిసిన జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టీటీ టోర్నమెంట్లో 20 ఏళ్ల శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్గా అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగిన శ్రీజ ఫైనల్లో 6–11, 7–11, 14–12, 13–11, 11–9, 11–9తో సుతీర్థ ముఖర్జీ (హరియాణా)పై విజయం సాధించింది. తొలి రెండు గేమ్లను చేజార్చుకున్న శ్రీజ ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో వరుసగా నాలుగు గేముల్లో గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. రూ. 15 లక్షల ఆర్థిక సహాయం... జాతీయ ర్యాంకింగ్ టీటీ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన తొలి తెలంగాణ అమ్మాయిగా గుర్తింపు పొందిన శ్రీజను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) అభినందించారు. ఈ సందర్భంగా శ్రీజ, కోచ్ సోమ్నాథ్ ఘోష్కు శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ వై.శ్రీధర్ రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న శ్రీజకు కోచ్గా సోమ్నాథ్ ఘోష్ వ్యవహరిస్తున్నారు. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) సంస్థ సహకారంతో కూకట్పల్లిలోని సెంట్రల్ మాల్లో ఘోష్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ టేబుల్ టెన్నిస్ అకాడమీని నెలకొల్పారు. ప్రస్తుతం శ్రీజ ఇదే అకాడమీలో శిక్షణ పొందుతోంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ అకాడమీని రాష్ట్ర ఐటీ డిపార్ట్మెంట్ సీఆర్ఓ ఆత్మకూరి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. -
'టేబుల్'పై తుఫాన్!
సాక్షి, హైదరాబాద్: భారత టేబుల్ టెన్నిస్లో మరో కొత్త సంచలనం దూసుకొచ్చింది. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజ ఇటీవల జాతీయ యూత్ ర్యాంకింగ్ టీటీ టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ అమ్మాయి అయిన శ్రీజ గత కొన్నేళ్లుగా సర్క్యూట్లో నిలకడగా రాణిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా రెండు టైటిల్స్ను తన ఖాతాలో వేసుకున్న 20 ఏళ్ల శ్రీజ మరో మెట్టు ఎక్కి సీనియర్ విభాగంలోనూ చెలరేగాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో కొత్తగా సీనియర్ ప్రొ టూర్కు సన్నద్ధమవుతోంది. నాన్న అండగా... శారీరకంగా చూస్తే సన్నగా, సాధారణ ఎత్తుతో కనిపించే ఈ అమ్మాయిని చూసి ఆమె ఆటను అంచనా వేస్తే పొరబడినట్లే. ఒక్కసారి టీటీ టేబుల్ వద్దకు చేరిందంటే ఆమె ఆటలో అప్రయత్నంగానే వేగం, దూకుడు వచ్చేస్తాయి. ఇదే తరహా శైలి శ్రీజకు వరుస విజయాలు అందించింది. టేబుల్ టెన్నిస్ను ఇష్టపడే తండ్రి ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో, అక్క రవళి ఆటను చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో ఆమె టీటీలో బలంగా తన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. ముందుగా ఎనిమిదేళ్ల వయసులో సెయింట్ పాల్స్ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న శ్రీజ ఆటకు కోచ్ సోమనాథ్ ఘోష్ ఆ తర్వాత గ్లోబల్ అకాడమీలో మరింత మెరుగులు దిద్దారు. ఈ క్రమంలో 11 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న ఈ ప్యాడ్లర్ ఆ తర్వాత దూసుకుపోయింది. వేర్వేరు వయో విభాగాల్లో నాలుగు సార్లు టైటిల్స్ సాధించిన శ్రీజ, మరో ఐదు సార్లు రన్నరప్గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలోనూ... దాదాపు రెండేళ్ల క్రితం అండర్–18 స్థాయిలో సాధించిన రెండు అంతర్జాతీయ విజయాలు శ్రీజలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఎల్ సాల్వడార్లో, ఇరాన్లో జరిగిన ఫజర్ కప్ టోర్నీలలో శ్రీజ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఇండియా ఓపెన్లో కాంస్యం సాధించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో ప్రి క్వార్టర్ వరకు చేరడం శ్రీజ అత్యుత్తమ ప్రదర్శన. అయితే ర్యాంకింగ్ టోర్నీలో తనకంటే ఎంతో సీనియర్లు అయిన భారత స్టార్లు మనికా బాత్రా, మౌసమీ పాల్, మధురిక పట్కర్లపై గెలుపొంది ఆమె తన సత్తా చాటుకుంది. ఎప్పుడో ఒకసారి కాకుండా ఈ తరహా విజయాలు నిలకడగా సాధిస్తేనే తన కెరీర్లో ముందుకు వెళ్లగలనని శ్రీజ నమ్ముతోంది. కొత్త లక్ష్యాలతో... టీటీతో పాటు పాఠశాల స్థాయి నుంచి చదువులో కూడా చురుగ్గా ఉండే శ్రీజ ప్రస్తుతం దూరవిద్యలో బీకామ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఏడాది క్రితం స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమెకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇవ్వడంతో ఆర్థికపరంగా కొంత వెసులుబాటు లభించింది. దిండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి (ఎంఎల్ఆర్) కళాశాలకు చెందిన టీటీ అకాడమీలో, మెరీడియన్ స్కూల్లో ఆమె ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తోంది. కోచ్ ఘోష్ ప్రకారం శ్రీజ బలం ఆమె ఫోర్ హ్యాండ్, టాప్ స్పిన్. అయితే సర్వీస్ను రిటర్న్ చేయడంలో ఉన్న కొంత బలహీనతను ఆమె సాధనతో అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. సీనియర్ విభాగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న శ్రీజ, వచ్చే నెలలో నైజీరియా ఓపెన్లో పాల్గొనబోతోంది. సీనియర్ ప్రొ టూర్లో భాగంగా ఇది ఆమె తొలి టోర్నీ కావడంతో విజయం కోసం పట్టుదలగా శ్రమిస్తోంది. నా కెరీర్లో ఇది కీలక దశ. సీనియర్ స్థాయిలో మంచి విజయాలు సాధిస్తేనే నా ఇన్నేళ్ల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్లాంటి మెగా ఈవెంట్లలో అవకాశం దక్కాలంటే నా ప్రపంచ ర్యాంక్ మెరుగ్గా ఉండాలి. అందు కోసం వరుసగా టోర్నీల్లో ఆడాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం టాప్–16లో ఉన్నవారినే ఎంపిక చేసిన కొన్ని టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుంది. మిగతా వాటికి సొంత డబ్బులతోనే వెళ్లాలి. అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనాలంటే దాదాపు రూ. 2 లక్షలు ఖర్చవుతాయి. ఆర్థికపరంగా ఇది చాలా భారం. ఆర్బీఐ ద్వారా ఉద్యోగ భద్రత ఉన్నా నాకు స్పాన్సర్ ఎవరూ లేరు. ఈ స్థితిలో కార్పొరేట్ కంపెనీలు గానీ, ఒలింపిక్ గోల్డ్క్వెస్ట్ లేదా గో స్పోర్ట్స్లాంటి సంస్థలు నాకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. ఇటీవల తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్గారిని కూడా కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేశాను. ఇప్పటి వరకు జూనియర్ స్థాయిలో మెరుగ్గా రాణించిన నా ప్రదర్శనకు స్పాన్సర్ల సహకారం లభిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించగలనని నమ్ముతున్నా. –ఆకుల శ్రీజ -
స్వర్ణం నెగ్గిన శ్రీజ
రాంచీ: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో ఆర్బీఐకు ప్రాతి నిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ స్వర్ణ పతకాన్ని సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగం ఫైనల్లో శ్రీజ–రాజ్ మోండల్ (ఆర్బీఐ) ద్వయం 3–2తో ఆకాశ్–అంకిత (బెంగాల్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్లో శరత్ కమల్ ఎనిమిదోసారి విజేతగా నిలిచి కమలేశ్ మెహతా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
‘పసిడి’ శ్రీజ
సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణాలు దక్షిణాసియా టీటీ టోర్నీ న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన దక్షిణాసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మెరిశారు. తొమ్మిది విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటుకుంది. టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన శ్రీజ వ్యక్తిగత విభాగాల్లోనూ తన హవా చలాయించింది. జూనియర్ బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో శ్రీజ పసిడి పతకాలను సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 11-9, 8-11, 11-4, 11-9, 11-8తో శ్రుతి అమృతే (భారత్)పై గెలుపొందగా... డబుల్స్ ఫైనల్లో శ్రీజ-శ్రుతి ద్వయం 6-11, 11-3, 11-6, 12-10తో రువిన్ కనన్గోరా-ప్రియదర్శిని (శ్రీలంక) జంటను ఓడించింది. -
శ్రీజ, వరుణి ఓటమి
బ్యాంకాక్ : థాయ్లాండ్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, వరుణి జైస్వాల్ పోరాటం పిక్వార్టర్ ఫైనల్స్లో ముగిసింది. శ్రీజ 11-7, 11-6, 5-11, 6-11, 6-11, 9-11తో నమీ కమాదా (జపాన్) చేతిలో.. వరుణి 8-11, 4-11, 1-11తో చెన్ టింగ్ టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
పోరాడి ఓడిన శ్రీజ
స్లొవేకియా జూనియర్ ఓపెన్ టీటీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ స్లోవేకియాలో జరిగిన జూనియర్ ఓపెన్ టీటీ టోర్నమెంట్లో పోరాడి ఓడింది. సెనెక్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ఏపీ అమ్మాయి సింగిల్స్ విభాగం ప్రిక్వార్టర్స్లో, డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో ఓడింది. ఆదివారం జరిగిన జూనియర్ బాలికల సింగిల్స్లో శ్రీజ 3-4 (8-11, 8-11, 11-6, 8-11, 11-9, 11-9, 5-11)తో లొరెంజోటి మరియా (ఉరుగ్వే) చేతిలో పరాజయం చవిచూసింది. ఏడు గేమ్ల పాటు జరిగిన ఈ పోరులో శ్రీజ తుదికంటా పోరాడింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో ఆమె 4-0 (11-6, 13-11, 11-7, 11-7)తో మిస్చెక్ కరోలిన్ (ఆస్ట్రియా)పై అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో లీ యూ పెంగ్ (చైనీస్ తైపీ)-లొరెంజోటి మరియా (ఉరుగ్వే) జోడి 4-11, 11-5, 11-5, 11-8తో శ్రీజ-రితి శంకర్ జోడిపై గెలిచింది. -
శ్రీజ బృందానికి స్వర్ణం
స్లొవేకియా ఓపెన్ టీటీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) గ్లోబల్ జూనియర్ సర్క్యూట్లో భాగంగా జరుగుతున్న స్లొవేకియా ఓపెన్లో హెదరాబాద్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. స్లొవేకియాలోని సెనెక్ పట్టణంలో శుక్రవారం రాత్రి ముగిసిన టీమ్ విభాగం ఫైనల్లో భారత్ 3-2 తేడాతో చైనీస్ తైపీపై గెలిచింది. ప్రియదర్శిని, అహిక ముఖర్జీ, శ్రీజలతో కూడిన భారత బృందం టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగింది. తొలి మ్యాచ్లో ప్రియదర్శిని 5-11, 11-4, 8-11, 11-13తో లీ యు పెంగ్ చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్లో అహిక 11-4, 11-7, 11-6తో కువో చియా యున్పై నెగ్గింది. మూడో మ్యాచ్లో శ్రీజ 4-11, 11-9, 12-14, 11-13తో హుంగ్ హుంగ్ చేతిలో ఓటమి చెందగా... నాలుగో మ్యాచ్లో అహిక 8-11, 9-11, 11-9, 11-3, 11-8తో లీ యు పెంగ్పై గెలిచింది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో ప్రియదర్శిని 6-11, 11-7, 13-11, 12-10తో కువో చియా యున్పై నెగ్గింది. -
శ్రీజకు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: గ్వాటెమాలా క్యాడెట్, జూనియర్ అంతర్జాతీయ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. సింగిల్స్లో రజతం నెగ్గిన శ్రీజ, డబుల్స్లో కాంస్య పతకం సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 6-11, 5-11, 8-11తో సాగరిక ముఖర్జీ (భారత్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ-మోరి పవోలా (పెరూ) జోడి 7-11, 11-7, 11-6, 9-11, 9-11 హర్షవర్ధిని-ఐశ్వర్య పాఠక్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. ‘ఇంతకుముందు సాధించిన రెండు స్వర్ణ పతకాలు టీమ్ విభాగాల్లో వచ్చాయి. సింగిల్స్లో రజతం నెగ్గడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. తొలి అంతర్జాతీయ పర్యటనలో రాణించినందుకు ఆనందంగా ఉంది’ అని శ్రీజ వ్యాఖ్యానించింది. సౌమ్యజిత్, మణికలకు టైటిల్స్ న్యూఢిల్లీ: బ్రెజిల్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో భారత్కు చెందిన సౌమ్యజిత్ ఘోష్, మణిక బాత్రాలు సింగిల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించారు. సాంతోస్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీ మహిళల అండర్-21 ఫైనల్లో మణిక 11-5, 9-11, 12-10, 11-5, 11-5తో కరోలిన్ కుమార్హా (బ్రెజిల్)పై గెలిచింది. అండర్-21 పురుషుల ఫైనల్లో సౌమ్యజిత్ 8-11, 6-11, 11-7, 11-6, 9-11, 11-7, 11-2తో బెంజిమన్ బ్రోసేయర్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. టైటిల్స్ గెలిచిన వీరిద్దరికి చెరో 1500 అమెరికా డాలర్ల ప్రైజ్మనీ లభించింది.