Andhra Premier League
-
YS Jagan: చదువుతో పాటు క్రీడలకూ సమ ప్రాధాన్యం
YS Jagan Mohan Reddy Birthday Special: చదువుతో పాటు ఆటలూ ముఖ్యమే. చిన్న వయసు నుంచే క్రీడల్లో భాగమవడం వల్ల మనోల్లాసం లభించడంతో పాటు.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా పాఠశాల స్థాయి నుంచే ఆటల పట్ల మక్కువ ఎక్కువ. క్రికెట్ ఆడటం అంటే ఆయనకు చాలా ఇష్టం. హౌజ్ కెప్టెన్గాఅంతేకాదు.. స్కూల్ లెవల్లో వైస్ జగన్ బాస్కెట్ బాల్ కూడా ఆడేవారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అంతేకాదు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించేవారు. హెచ్పీఎస్లో హౌజ్ కెప్టెన్గా జగన్ అరుదైన ఘనత సాధించారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. రెడ్ హౌజ్కు ఆల్రౌండర్ చాంపియన్షిప్ అందించారు. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీల్లోనూ తమ జట్టును విజయపథంలో నిలిపి టైటిల్ కైవసం చేసుకున్నారు.మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకుఇక క్రీడల్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి స్వతహాగా తెలుసు కాబట్టే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్.. తన హయాంలో విద్యతో పాటు క్రీడా రంగానికీ పెద్దపీట వేశారు. ప్రతిభ ఉండి వెలుగులోకి రాని మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.కేవలం రాష్ట్ర స్థాయిలోనే గాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా జగన్ ప్రభుత్వం ఈ మేర ప్రణాళికలు రచించింది. టాలెంట్ హంట్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) వంటి ప్రతిష్టాత్మక ఐపీఎల్ ఫ్రాంఛైజీని ఆహ్వానించింది.ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్రా క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కె.పవన్ అనే యువకుడిని సీఎస్కే దత్తత తీసుకోవడం విశేషం. విజయనగరం జిల్లాలోని జామి మండలం అలమండకు చెందిన పవన్ అలా ఐపీఎల్కు చేరువయ్యాడు. ఇక ఆడుదాం ఆంధ్రాతో పాటు ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ను కూడా ప్రతిష్టాత్మంగా నిర్వహించింది జగన్ ప్రభుత్వం.ఆంధ్ర ప్రీమిర్ లీగ్ హిట్వైఎస్ జగన్ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ‘ఆంధ్ర ప్రీమిర్ లీగ్’ పేరిట పోటీలు మొదలుపెట్టింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించేందుకు నిర్వహించిన ఈ లీగ్ విజయవంతంగా కొనసాగుతోంది. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఈ లీగ్లో పాల్గొంటున్నాయి. ఏపీఎల్తో జోనల్ స్థాయి క్రికెటర్లకు కూడా మంచి గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. -
రేపటి నుంచి ఏపీఎల్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మూడో సీజన్కు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్లో తలపడేందుకు ఆరు జట్లు శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన నితీష్కుమార్ రెడ్డి జింబాబ్వే జట్టుతో తలపడే భారత్ టీ–20 జట్టుకు ఎంపిక కావడంతో అందుబాటులో లేడు. కె.ఎస్.భరత్, పి.గిరినాథ్రెడ్డి, సీఆర్ జ్ఞానేశ్వర్, ఎస్.కె రషీద్, జి.గుల్ఫామ్ తదితరులు వారి జట్లతో ప్రాక్టీస్ చేశారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో రాయలసీమ కింగ్స్(ఆర్కే), కోస్టల్ రైడర్స్(సీఆర్), బెజవాడ టైగర్స్(బీటీ), గోదావరి టైటాన్స్(జీటీ), ఉత్తరాంధ్ర లయన్స్(యూఎల్)తో పాటు వైజాగ్ వారియర్స్(వీడబ్ల్యూ) జట్లు పోటీపడుతున్నాయి. తొలి పోటీ రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ మధ్య జరగనుంది. జూలై 13న టైటిల్ పోరు ఉంటుంది. కాగా.. శుక్రవారం వైఎస్సార్ స్టేడియం బీ గ్రౌండ్లో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 2 గంటల పాటు రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ జట్లు ప్రాక్టీస్ చేశాయి. బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు గంటల పాటు, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్ జట్లు రాత్రి ఏడున్నర నుంచి రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేశాయి.ఫ్యాన్కోడ్లో ప్రత్యక్ష ప్రసారంబీచ్రోడ్డు: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఫ్యాన్కోడ్ సంస్థ ప్రతినిధి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ లీగ్కు తెలుగు వ్యాఖ్యాతలుగా టి.సుమన్, కల్యాణ్ కృష్ణ వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. -
APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
సన్రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్-2024లో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం ఇందుకు ఓ కారణమైతే.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించడం మరో కారణం.జోనల్ స్థాయి క్రీడాకారులకి గుర్తింపు తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట గత రెండేళ్లుగా టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేరెన్నికగన్న క్రికెటర్లతో పాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లు కూడా ఈ లీగ్లో భాగమవుతున్నారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఏపీఎల్లో పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీఎల్.. మూడో సీజన్ కోసం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోలుకై గురువారం వేలం నిర్వహించారు. ఇందులో భాగంగా 76 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే 44 మంది ప్లేయర్లను ఆయా జట్లు రిటైన్ చేసుకున్నాయి.ఇక ఏ,బీ,సీ,డీ పేరిట నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించారు. ‘ఏ’ కేటగిరీ కనీస ధర: లక్ష... బీ కేటగిరీ కనీస ధర: 50 వేలు.. సీ,డీ కేటగిరీ కనీస ధర: 25 వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో దుమ్ము లేపుతున్న పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ వేలంలో పాల్గొన్నాడు.ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 15.6 లక్షలకు నితీశ్ రెడ్డి అమ్ముడుపోయాడు. ఈ యంగ్ సెన్సేషన్ కోసం గోదావరి టైటాన్స్ యాజమాన్యం ఈ మేరకు భారీ మొత్తం వెచ్చించింది.ఈ విషయం తెలియగానే నితీశ్ కుమార్ రెడ్డి నమ్మలేకపోతున్నా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వైజాగ్ కుర్రాడు నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంచనాలకు మించి రాణించిన 20 ఏళ్ల ఈ ఆల్రౌండర్ 7 ఇన్నింగ్స్ ఆడి 239 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3 వికెట్లు కూడా తీశాడు. NITISH KUMAR REDDY - Highest paid player in Andhra Premier League. 💥IPL salary - 20 Lakhs. APL salary - 15.6 Lakhs. His reaction is priceless. 🫡 The future star. pic.twitter.com/33i0hT3F3a— Johns. (@CricCrazyJohns) May 16, 2024 -
APL: సీజన్-3 కి సిద్ధం.. లీగ్ ముఖ్య ఉద్దేశం అదే: ఏసీఏ
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 నిర్వహణకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిద్దమవుతోంది. గత రెండు ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించిన ఏసీఏ ఈసారి కూడా ఆరు జట్లతో లీగ్ను కొనసాగించనుంది. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగుతాయని తెలిపారు. ఈ జట్ల మధ్య కడప, విశాఖ ప్రాంతాలలో మొత్తం 19 మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జోన్ లెవల్ క్రీడాకారులకి గుర్తింపు తీసుకొని రావడమే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశ్యం. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ జరగడం చాలా సంతోషకరం. మూలాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తేనే విజయవంతమవుతాం.మూడో సీజన్ తర్వాత నాలుగో సీజన్ కూడా సజావుగా నిర్వహించాలని భావిస్తున్నాం. మంగళగిరిలో కూడా మ్యాచ్లు జరపాలని ప్రణాళికలు రచిస్తున్నాం. నవనీత్ కృష్ణ ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో పాల్గొంటున్నారు.విశాఖ, కడప, మంగళగిరి లో వెయ్యి మందిని గుర్తించి స్క్రీనింగ్ చేశాం. ఇక సీజన్-1 స్టార్ స్పోర్ట్స్ తెలుగులో బ్రాడ్ కాస్టింగ్ చేశాం. కొన్ని అనివార్య కారణాల వలన సీజన్-2ను తెలుగులో ప్రసారం చేయలేకపోయాం. అయితే, ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. బీసీసీఐ గైడ్లైన్స్తో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. స్పోర్ట్స్ మెకానిక్ అనే సరికొత్త సాఫ్ట్వేర్ను తీసుకుని వస్తున్నాం’’ అని తెలిపారు. -
తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా..
Hanuma Vihari About His Love Story: ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది.. ప్రొఫెషన్తోతో సంబంధం లేకుండా.. కోతి పనులైనా సరే చేయించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది.. టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో ఇదే జరిగింది.. కులాంతర ప్రేమ వివాహం కోసం విహారి పడిన పాట్లు వింటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు గత జ్ఞాపకాలు గుర్తుకురావాల్సిందే. తన నెచ్చెలి ప్రీతి ప్రేమ కోసం ఎదురుచూపులు.. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించేక్రమంలో రెండేళ్ల ఎడబాటు.. ఆపై పెళ్లితో శుభం కార్డు.. విహారి వీర ప్రేమగాథను తెలుసుకోవాలంటే ఇటు వైపు ఓ లుక్ వెయ్యండి! ఘ ఐపీఎల్లో.. టీమిండియా టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యాటర్ హనుమ విహారి. ఐపీఎల్లో.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడిన ఈ అతడు.. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటివరకు మొత్తంగా 23 ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి.. 14.2 సగటు, 88.47 స్ట్రైక్ రేట్తో 284 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఇక టీమిండియా తరఫున 16 టెస్టుల్లో 839 పరుగులు సాధించడంతో పాటు 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ ఆఫ్బ్రేక్ స్పిన్నర్. అత్యధిక స్కోరు 111. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో కీలక ఆటగాడైన విహారి అనేక మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలున్నాయి. జాతీయ జట్టుకు ఆడే అవకాశం వచ్చినపుడల్లా తనను తాను నిరూపించుకుంటున్న విహారి.. విమర్శకుల ప్రశంసలతో పాటు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మెప్పు కూడా పొందాడు. ఇలా ఓవైపు క్రికెటర్గా కెరీర్ కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రేమాయణాన్ని కూడా సాగించాడీ బ్యాటింగ్ ఆల్రౌండర్. తల్లే మొదటి గురువు కాకినాడలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విహారి.. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇచ్చిన మనోధైర్యంతో ప్రోత్సాహంతో క్రికెటర్గా ఎదిగాడు. ఇప్పటికీ తన మొదటి గురువు తన తల్లి అని గర్వంగా విహారి చెబుతున్నాడు. ప్రీతి అంటే మహాప్రీతి.. ఇక విహారి ప్రేమ విషయానికొస్తే.. తన స్నేహితురాలు ద్వారా ప్రీతి అతడికి పరిచయమైంది. స్నేహం పెరిగి కాస్త ప్రేమగా మారింది.. ఎలాంటి లవ్ స్టోరీలో అయినా కొన్ని కష్టాలు తప్పవు.. విహారికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రేమ కోసం మినీ యుద్ధమే విహారి, ప్రీతి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్ళికి నిరాకరించారు. దీంతో.. రెండేళ్ల పాటు కష్టపడి.. వారిని ఒప్పించి చివరికి 2019లో ఇద్దరూ ఒకటయ్యారు. అయితే.. ఈ రెండేళ్ల పాటు ఓ మినీ యుద్ధమే చేశానని ‘సాక్షి’తో చెప్పుకొచ్చాడు విహారి. ఎప్పుడైనా ప్రీతిని చూడాలనిపిస్తే గోడ దూకి మరి వెళ్లి చూసేవాడిని సిగ్గుపడుతూ అప్పటి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. కాగా హనుమ విహారి- ప్రీతి ప్రేమకు గుర్తుగా వారికి కొడుకు జన్మించాడు. కాగా విహారి భార్య ప్రీతికి క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేనప్పటికీ భర్త కోపసం మ్యాచ్లు చూస్తుందట. ఏపీ ప్రభుత్వం సూపర్ ఇదిలా ఉంటే.. ఇటీవల విహారి ఆంధ్రప్రీమియర్ లీగ్లో ఆడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ సొంతరాష్ట్రంలో ఏపీఎల్ సీజన్-2లో ఆడటం ఎంతో ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న కొత్త క్రీడాకారులకు ఎంతగానో సహాయపడుతోందని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయిలో పోటీ పడేవిధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను పూర్తి చేశారని ప్రశంసించాడు. మొదటి సీజన్లో తాను ఆడకపోయినా టీవీలో చూసి ఎంతో గర్వపడ్డానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో గానో ప్రోత్సహిస్తున్నది అని హనుమ విహారి హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఏపీఎల్ సీజన్-2లో రాయలసీమ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించిన హనుమ విహారి జట్టుకు టైటిల్ అందించిన విషయం తెలిసిందే. నరేష్, కరస్పాండెంట్, సాక్షి టీవీ, విశాఖపట్నం View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) -
ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి.. అద్భుతం: టీమిండియా మాజీ క్రికెటర్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికై రోడ్ మ్యాప్ తయారు చేశామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్రెడ్డి తెలిపారు. అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఏసీఏ 70 ఏళ్ల పండగను సోమవారం వైజాగ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీఏ కార్యదర్శి గోపినాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఆటగాళ్ల భవిష్యత్ గురించే తాము నిత్యం తపనపడుతుంటామని పేర్కొన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటి సారిగా వుమెన్ టీ20 మ్యాచ్ నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి: టీమిండియా మాజీ క్రికెటర్ అనంతరం ఇండియా మాజీ క్రికెటర్, ఇండియన్ నేషనల్ క్రికెట్ మాజీ కోచ్ మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రలో ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఉన్నారు., భవిష్యత్తులో వారు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేలా ఎదగాలి’’ అని ఆకాంక్షించారు. ఇక్కడున్న యువ క్రికెటర్లను ఇక్కడ చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏసీఏ పనితీరు అద్భుతం అని మదన్ లాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏపీఎల్ సూపర్ ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను వెలికి తీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆంధ్రలో క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతోందని మదన్ లాల్ ప్రశంసించారు. ఇక ఈ సమావేశంలో.. పలువురు మాజీ రంజీ ప్లేయర్లు, మాజీ ఉమెన్ సీనియర్ ప్లేయర్స్, రంజీ ట్రోఫీ కెప్టెన్లు, క్రికెట్ కమిటీ సభ్యులకు, ఏసీఏ ఉద్యోగులకు, లీగల్ కమిటీలకు గోపినాథ్ రెడ్డి, ఏసీఏ ఉపాధ్యక్షులు పి. రోహిత్ రెడ్డి, మదన్ లాల్ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఏసీఏ సంయుక్త కార్యదర్శి ఎ. రాకేశ్, ట్రెజరర్ ఏ.వి. చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె.వి.పురుషోత్తం, జితేంద్ర నాథ్ శర్మ, సిఈఓ ఎం.వి. శివారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్. వెంకట రావు, చాముండేశ్వరి నాథ్ , అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్కు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ హాజరైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరిగిన తుదిపోరులో డిపెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్ను రాయలసీమ కింగ్స్ ఓడించింది. తద్వారా ఏపీఎల్-2 విజేతగా అవతరించింది. చదవండి: 13 ఏళ్ల వయస్సులోనే అవమానాలెన్నో.. అయినా వరల్డ్ ఛాంపియన్! -
ఏపీఎల్ నిర్వహణ భేష్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఏపీఎల్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు. ‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్ ప్యాషన్తో ఆడితే.. కోహ్లి ప్యాషన్తో పాటు అగ్రెసివ్గా ఆడుతాడు. అది వారి స్టయిల్. నేను కూడా అగ్రెసివ్గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది. మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ సీజన్–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రావు పేరుతో ‘స్టాండ్’ గర్వకారణం అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్ కమిటీ చైర్మన్గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా, 2003 వరల్డ్కప్లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్లో తలపడుతున్న బెజవాడ టైగర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
APL 2 Winner: టైటిల్ విజేత రాయలసీమ కింగ్స్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా రాయలసీమ కింగ్స్ అవతరించింది. ఆదివారం నాటి ఫైనల్లో కోస్టల్ రైడర్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో రాయలసీమ కింగ్స్ ఆదివారం కోస్టల్ రైడర్స్ తో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న రాయలసీమ కింగ్స్ కోస్టల్ రైడర్స్ ను 155 పరుగులకు కట్టడి చేసింది. రైడర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ధరణి కుమార్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కింగ్స్ బౌలర్లలో షేక్ కలీముద్దీన్ మూడు వికెట్లతో చెలరేగాడు. హరీష్ శంకర్ రెడ్డి రెండు వికెట్లు తీయగా, జాగర్లపూడి రామ్, బోదాల వినయ్, కెప్టెన్ హనుమ విహారి తలా ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన రాయలసీమ కింగ్స్ కు ఓపెనర్ తోట శ్రావణ్ 24 పరుగులతో శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ కోగటం హనీష్ రెడ్డి డకౌట్ కాగా, వన్ డౌన్ బ్యాటర్ తన్నీరు వంశీకృష్ణ 3 పరుగులకే నిష్క్రమించాడు. ఇలా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హనుమ విహారి 29 బంతుల్లోనే 46 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బోదాల కుమార్ 53 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. ఆఖరిలో గిరినాథ్ రెడ్డి 17 బంతుల్లో 29 పరుగులతో రాణించి విహారితో కలిసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో విజేడి (వి.జయదేవన్ సిస్టం) పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించారు. 16.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసిన రాయలసీమ కింగ్స్ ఛాంపియన్ గా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోస్టల్ రైడర్స్ ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ స్కోర్లు కోస్టల్ రైడర్స్- 155/8 (18 ఓవర్లు) రాయలసీమ కింగ్స్- 160/5 (16.3 ఓవర్లు) 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
APL 2: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సూపర్: 1983 విన్నర్ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 1 అభిమానులను ఆకట్టుకుంది. స్థానిక ఆటగాళ్లలోని ప్రతిభను నిరూపించుకునేందుకు వేదిక అయింది. ఈ క్రమంలో ఏపీఎల్ రెండో ఎడిషన్ పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ఆరు జట్లు పోటాపోటీగా తలపడి కావాల్సినంత వినోదం అందించాయి. ఇక ఇప్పుడు ఏపీఎల్-2 తుది అంకానికి చేరుకుంది. కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్ ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో చాలా మంది సీజన్ 1 చాలా బాగా నిర్వహించారని ప్రశంసించినట్లు చెప్పారు. ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 ఫైనల్స్ కి ముఖ్య అతిథిగా మాజీ ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ఇష్టమైన రాష్ట్రం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి మరి కొంత మంది క్రికెటర్లు రావాలని కోరుకుంటున్న. ఇప్పటికే ఏపీ మంచి క్రికెటర్లను అందించింది. యువ క్రికెటర్లకు మంచి అవకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కల్పిస్తుంది అని పేర్కొన్నాడు. -
కోగటం రెడ్డి మెరుపు ఇన్నింగ్స్.. ఫైనల్లో రాయలసీమ కింగ్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో రాయలసీమ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో కింగ్స్ 3 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్పై విజయం సాధించింది. ముందుగా రాయలసీమ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోగటం రెడ్డి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, గిరినాథ్ రెడ్డి (20 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్లు), వంశీ కృష్ణ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. అనంతరం గోదావరి టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 215 పరుగులు చేసి పోరాడి ఓడింది. భూపతి రాజు వర్మ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటిచేత్తో జట్టును గెలిపించే ప్రయత్నం చేయగా, ఇతర ఆటగాళ్లనుంచి సహకారం లభించలేదు. నేడు జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్తో రాయలసీమ కింగ్స్ తలపడుతుంది. ముగింపు కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మాజీ కెపె్టన్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చదవండి: మూడో వన్డేలోను పాకిస్తాన్దే విజయం -
APL 2023: మ్యాచ్ రద్దు.. ఫైనల్ చేరుకున్న కోస్టల్ రైడర్స్.. ఇక..
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో కోస్టల్ రైడర్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్–1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన కోస్టల్ రైడర్స్ జట్టు ఫైనల్ చేరింది. రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్ మధ్య నేడు జరిగే క్వాలిఫయర్–2లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్ జట్టుతో ఆడుతుంది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గోదావరి టైటాన్స్ ఏడు వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్పై నెగ్గింది. లయన్స్ను వేటాడిన టైటాన్స్ APL 2023 Godavari Titans Beat Uttarandhra Lions By 7 Wickets: ఏపీఎల్ సీజన్–2 ఎలిమినేటర్ మ్యాచ్లో లయన్స్ను టైటాన్స్ వేటాడేసింది. లీగ్ పాయింట్ల పట్టికలో రన్రైట్లో వెనుకబడ్డా... హెడ్ఆన్స్లో విజయంతో ఎలిమినేటర్ మ్యాచ్కు అర్హత సాధించిన గోదావరి టైటాన్స్ విజయమే లక్ష్యం అన్నంతగా రెచ్చిపోయింది. ఉత్తరాంధ్ర లయన్స్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫైయర్స్ మ్యాచ్కు అర్హత సాధించింది. మిడిలార్డర్ తడబాటు టాస్ గెలిచిన గోదావరి టైటాన్స్.. ఉత్తరాంధ్ర లయన్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ గుల్ఫమ్(49) విజయ్ బౌలింగ్లో సందీప్కు క్యాచ్ ఇచ్చి ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీని కోల్పోయాడు. మరో ఓపెనర్ కెప్టెన్ భరత్(37) విజయ్ బౌలింగ్లోనే మాధవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. వీరి జోడి తొలి వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే శ్యామ్(2), రాహుల్ డకౌట్, తపస్వి(2) విజయ్(8)తో వెనువెంటనే ఔట్ అవ్వడంతో 11 ఓవర్లకు 108 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రీనివాస్(12), తేజస్వి(12), రఫీ(17) ఇన్నింగ్స్ కాస్త సరిదిద్దే ప్రయత్నం చేసినా మరో బంతి మిగిలి ఉండగానే 153 పరుగులకు ఆలౌటైంది. శశికాంత్, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా విజయ్ రెండు, కమిల్ ఓ వికెట్ పడగొట్టాడు. జ్ఞానేశ్వర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రతిగా బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ ఓపెనర్ మునీష్ డకౌట్ గానే అజయ్కుమార్ బౌలింగ్లో వాసుకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఓపెనర్ కెప్టెన్ జ్ఞానేశ్వర్కు హేమంత్ రెడ్డి తోడై స్కోర్ను పరుగులెత్తించారు. రెండో వికెట్కు వంద పరుగులను జోడించారు. 124 పరుగుల వద్ద హేమంత్ 71(ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగులతో తపస్వి బౌలింగ్లో విజయ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో వచ్చిన ధీరజ్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేసి 25 పరుగులకు సరిగ్గా 153 పరుగుల వద్ద ఔటయ్యాడు. తపస్వి ఓవర్లో చివరి బంతిని సందీప్ ఎదుర్కొని లాంగాన్ మీదుగా సిక్సర్గా తరలించాడు. దీంతో 18 ఓవర్లలో మూడు వికెట్లకు 159 పరుగులు చేసి టైటాన్స్ గెలిచింది. కెప్టెన్ జ్ఞానేశ్వర్ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 సాధించి అజేయంగా నిలిచాడు. తపస్వి రెండు, అజయ్కుమార్ ఓ వికెట్ తీశారు. చదవండి: BCCI: ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్కు రూ.4.20 కోట్లు! -
APL 2023: తుది అంకానికి ఏపీఎల్ సమరం.. ప్లే ఆఫ్స్ చేరిన జట్లు ఇవే
Andhra Premier League 2023: లీగ్ చివరి మ్యాచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన గోదావరి టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. 16 పాయింట్లతో కోస్టల్ రైడర్స్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ జట్లు 12 పాయింట్లు సాధించగా.. మెరుగైన రన్ రేట్తో లయన్స్ రెండో స్థానంలో నిలిచింది. బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ ఎనిమిదేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్రేట్తో టైగర్స్ ప్లేఆఫ్నకు అర్హత సాధించింది. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్లో కింగ్స్తో టైగర్స్ తలపడనుండగా క్వాలిఫైయిర్ వన్లో రైడర్స్తో లయన్స్ తలపడనుంది. వైజాగ్ వారియర్స్ నాలుగు పాయింట్లతో రెండో సీజన్ ముగించింది. విశాఖ స్పోర్ట్స్: కోస్టల్ రైడర్స్ మరోసారి ప్లేఆఫ్నకు చేరుకుంది. ఏపీఎల్ సీజన్–2 లీగ్ చివరి మ్యాచ్లో రాయలసీమ కింగ్స్పై విజయం సాధించి 16 పాయింట్లతో టాప్లో నిలిచింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. బ్యాటింగ్కు దిగిన రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 131 పరుగులు చేసింది. వరుణుడి అంతరాయం వరుణుడు 13 ఓవర్ వద్ద అంతరాయం కలిగించగా.. అప్పటికి కింగ్స్ జట్టు ఏడు వికెట్లకు 98 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారి డకౌట్గా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ వీరారెడ్డి 45 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. చివర్లో కమరుద్దీన్( 21 బంతుల్లో 23 పరుగులు)తో కలిసి స్కోర్ను ముందుకు నడిపాడు. తిరిగి ఆటను కొనసాగించగా కింగ్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేయగా.. మరోసారి వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. అబ్దుల్లా 4 వికెట్లు తీయగా స్టీఫెన్, మనోహార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చిరంజీవి అజేయ ఇన్నింగ్స్ దీంతో కోస్టల్ రైడర్స్కు డీఎల్ఎస్ పద్ధతిలో 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. 14 ఓవర్లలోనే రెండు వికెట్లకు 127 పరుగులతో రైడర్స్ విజయం సాధించారు. ఓపెనర్ ధరణీకుమార్(18), కెప్టెన్ రషీద్(4) వికెట్లను 65 పరుగులకే రైడర్స్ కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రణీత్ 64, చిరంజీవి 32 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. కమరుద్దీన్, హనుమ విహారి చెరో వికెట్ తీశారు. ప్లే ఆఫ్స్లో బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ అసలు పోరులో చేతులెత్తేసిన టైటాన్స్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో గోదావరి టైటాన్స్ చేతులెత్తేసింది. రెండో మ్యాచ్లో టైటాన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు కెప్టెన్ జ్ఞానేశ్వర్(2), హేమంత్(1) ఎనిమిది పరుగులకే పెవిలియన్కు చేరారు. శ్యామ్ 11, సమన్విత్ 14, సత్యనారాయణ 16 పరుగులు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మరో బంతి ఉండగానే టైటాన్స్ 77 పరుగులకే ఆలౌటైంది. పృధ్వీ, తేజస్వి మూడేసి వికెట్లు తీయగా అయ్యప్ప రెండు, అజయ్, వాసు ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్ కెప్టెన్ భరత్(4), అతని స్థానంలో వచ్చిన రోహిత్ డకౌట్గా అయ్యారు. ఓపెనర్ గుల్ఫమ్(29)కు రాహుల్ తోడై మూడో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. రాహుల్(33), తపస్వి(10) అజేయంగా నిలిచి 13.4 ఓవర్లలోనే 79 పరుగుల చేసి జట్టుకు విజయాన్నందించారు. మల్లికార్జున రెండు వికెట్లు, కమిల్ ఓ వికెట్ తీశాడు. రాయలసీమ కింగ్స్ చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! -
అదరగొట్టిన ప్రణీత్.. 8 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక కోస్టల్ రైడర్స్ జట్టు 16 పాయింట్లతో టాపర్గా నిలిచింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ 8 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్ ఆధారంగా ఉత్తరాంధ్ర లయన్స్కు రెండో స్థానం, రాయలసీమ కింగ్స్కు మూడో స్థానం, బెజవాడ టైగర్స్కు నాలుగో స్థానం లభించాయి. కోస్టల్ రైడర్స్తోపాటు ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత పొందాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాయలసీమ కింగ్స్తో బెజవాడ టైగర్స్ ... క్వాలిఫయర్–1లో ఉత్తరాంధ్ర లయన్స్తో కోస్టల్ రైడర్స్ ఆడతాయి. రాయలసీమ కింగ్స్తో చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లో కోస్టల్ రైడర్స్ జట్టు వీజేడీ పద్ధతిలో 8 వికెట్లతో గెలిచింది. ముందుగా రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. హనీష్ రెడ్డి (78; 5 ఫోర్లు, 6 సిక్స్లు) మెరిశాడు. వర్షం తగ్గాక కోస్టల్ రైడర్స్ జట్టుకు 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. కోస్టల్ జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. ప్రణీత్ (64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు), చిరంజీవి (32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడగా ఆడారు. మరో మ్యాచ్లో ఉత్తరాంధ్ర లయన్స్ ఏడు వికెట్లతో గోదావరి టైటాన్స్ను ఓడించింది. చదవండి: ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్ -
APL 2023: ప్లే ఆఫ్స్లో ఆ రెండు జట్లు.. రేసులోకి బెజవాడ టైగర్స్ కూడా
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్లో లీగ్ చివరి మ్యాచ్ ఆడిన వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్ జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. ఓపెనర్లు మూడు పరుగులకే పెవిలియన్కు చేరినా బెజవాడ టైగర్స్ భారీ స్కోర్ను అధిగమించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వైఎస్సార్ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ వారియర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు అర్జున్(47), ప్రశాంత్ కుమార్(53) తొలి వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యం అందించారు. కెప్టెన్ కరణ్ షిండే (55) అర్ధ సెంచరీ నమోదు చేయగా.. యువన్(15) సహకారం అందించాడు. కెప్టెన్ కరణ్ అజేయంగా నిలిచాడు. సాయితేజ రెండు వికెట్లు తీయగా అఖిల్, లలిత్ మోహన్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రతిగా బెజవాడ టైగర్స్ ఓపెనర్ అభినవ్ డకౌట్ గానే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ మహీప్ రెండు పరుగులకే చేతులెత్తేశాడు. మనీష్(15)ఫోర్, సిక్సర్ బాది పెవిలియన్కు చేరడంతో తొలి మూడు వికెట్లు 23 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో షోయబ్.. రికీబుయ్(33)తో కలిసి నాలుగో వికెట్కు 52 పరుగులను, అవినాష్తో కలిసి మరో 50 పరుగులను జోడించాడు. షోయబ్ (51) ఆరు ఫోర్లతో అర్ధసెంచరీ చేయగా సాయికుమార్, దుర్గాకుమార్ చెరో ఎనిమిదేసి పరుగులు చేశారు. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. అవినాష్(71) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించాడు. ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన బెజవాడ టైగర్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం జరిగే ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్ మ్యాచ్ అనంతరం ప్లే ఆఫ్కు మిగిలిన రెండు బెర్త్లు తేలిపోనున్నాయి. ఇప్పటికే 12 పాయింట్లతో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ ప్లేఆఫ్కు చేరుకున్నాయి. -
APL 2023: ధరణీకుమార్ మెరుపులు.. గోదావరి టైటాన్స్కు తప్పని ఓటమి
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో కోస్టల్ రైడర్స్ 35 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్ ప్రణీత్ 15 పరుగులు చేసి మాధవ్ బౌలింగ్లో ఇస్మాయిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రైడర్స్ కెప్టెన్ రషీద్ 7 పరుగులే చేసినా ఓపెనర్ ధరణీకుమార్(32 బంతుల్లో 59, 8x4, 3x6)తో కలిసి రెండో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. హర్షవర్ధన్ (నాలుగు ఫోర్లు, సిక్సర్తో 22 బంతుల్లో 35)తో కలిసి లేఖజ్ రెడ్డి(12) ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన రైడర్స్.. మరో 63 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా తొమ్మిది వికెట్లకు 173 పరుగులు చేసింది. సత్యనారాయణ రాజు, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా మాధవ్ రెండు, విజయ్ ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన గోదావరి టైటాన్స్ ఓపెనర్లు వంశీకృష్ణ(4) 10 పరుగుల వద్ద, కెప్టెన్ జానేశ్వర్ (14) 28 పరుగుల వద్ద వెనుదిరిగారు. హేమంత్రెడ్డి ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ధీరజ్కుమార్(10), పాండురంగరాజు(14) వికెట్లను 94 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది. ఇస్మాయిల్ ఎనిమిది బంతుల్లో 19 పరుగులతో చివర్లో కాస్త మెరుపులు మెరిపించినా 18.1 ఓవర్లలోనే 138 పరుగులకు గోదావరి టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అబ్దుల్లా మూడు, సుదర్శన్, చిరంజీవి, స్టీఫెన్ రెండేసి వికెట్లు తీశారు. ఆశిష్ ఓ వికెట్ పడగొట్టాడు. చదవండి: అఫ్గనిస్తాన్పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్ -
CR vs GT Photos: కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్ మ్యాచ్ (ఫొటోలు)
-
APL2023 VIW Vs RAK Photos: వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ మ్యాచ్ (ఫొటోలు)
-
తొలి విజయం సాధించిన బెజవాడ టైగర్స్.. అదరగొట్టిన వారియర్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో బెజవాడ టైగర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్లో టైగర్స్ 7 వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్ను ఓడించింది. లయన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మహీప్ కుమార్ (77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు), రికీ భుయ్ (41; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి జట్టును గెలిపించారు. వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. అయితే సూపర్ ఓవర్ ద్వారా వారియర్స్ విజేతగా నిలిచింది. వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ప్రశాంత్ (73; 5 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. విహారి (71; 10 ఫోర్లు, 2 సిక్స్లు), అభిషేక్ రెడ్డి (58 రిటైర్డ్హర్ట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. సూపర్ ఓవర్లో కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి ఒకే ఒక పరుగు చేయగా, వారియర్స్ 2 పరుగులు చేసి గెలిచింది. -
APL 2023: ఉత్కంఠగా సాగుతున్న ఏపీఎల్.. ఫోటోలు
-
రాయలసీమ కింగ్స్ ‘హ్యాట్రిక్’ విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 టోర్నమెంట్ రెండో సీజన్లో రాయలసీమ కింగ్స్ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఇక్కడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్ జట్టును ఓడించింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్లో రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. త్రిపురాణ విజయ్ (25 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో అజేయ అర్ధ సెంచరీ చేశాడు. రాయలసీమ కింగ్స్ బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు, గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం రాయలసీమ కింగ్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ హనుమ విహారి (12 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ రెడ్డి (37 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్లు), తన్నీరు వంశీకృష్ణ (39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. గోదావరి టైటాన్స్ బౌలర్లు ఏకంగా 21 ఎక్స్ట్రాలు ఇవ్వడం గమనార్హం. తపస్వి ఆల్రౌండ్ ప్రదర్శన మరో మ్యాచ్లో ఉత్తరాంధ్ర లయన్స్ 93 పరుగుల తేడాతో వైజాగ్ వారియర్స్పై ఘనవిజయం సాధించింది. ముందుగా ఉత్తరాంధ్ర లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెపె్టన్ కోన శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్స్లు), వెంకట్ రాహుల్ (36 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్లు), పిన్నింటి తపస్వి (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు), సిర్లా శ్రీనివాస్ (13 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) దూకుడుగా ఆడారు. అనంతరం వైజాగ్ వారియర్స్ 14.4 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. తపస్వి, పృథీ్వరాజ్ మూడు వికెట్ల చొప్పున తీశారు. -
గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ గెలుపు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ల్లో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్ జట్టును ఓడించగా... గోదావరి టైటాన్స్ 56 పరుగుల తేడాతో వైజాగ్ వారియర్స్ జట్టుపై గెలుపొందింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (53 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్లు), యారా సందీప్ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం వైజాగ్ వారియర్స్ 17.4 ఓవర్లలోనే 135 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇస్మాయిల్ మూడు వికెట్లు తీశాడు. రాయలసీమ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మొదట ఉత్తరాంధ్ర లయన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. శ్రీరామ్ వెంకట రాహుల్ (31 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం రాయలసీమ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసి గెలిచింది. తన్నీరు వంశీకృష్ణ (34 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్లు), గిరినాథ్ రెడ్డి (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షేక్ కమరుద్దీన్ (18 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాయలసీమ కింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. -
అట్టహాసంగా ఏపీఎల్ ఆరంభం.. సందడి చేసిన శ్రీలీల
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెటర్లు ప్రతిభను ప్రదర్శించేందుకే ఏపీఎల్ ప్లాట్ఫాం కానుందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్చంద్రరెడ్డి పేర్కొన్నారు. బీసీసీఐ సహకారంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) రెండో సీజన్ను బుధవారం వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తరపున పలు కేటగిరిల్లో యువ క్రీడాకారులు ఆడుతున్నారని.. వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహించడమే ఏపీఎల్ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి ఏపీలోని ప్రతీ గ్రామ, వార్డులో ఔత్సాహిక ఆటగాళ్లను ప్రోత్సహించే విధంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారన్నారు. ఈ పోటీల్లో 15 వేలకు పైగా జట్లు ఎంపిక చేసిన క్రీడల్లో పోటీపడనున్నాయన్నారు. తొలుత అతిథిగా హాజరైన సినీ నటి శ్రీలీల ఆయా జట్ల ఫ్రాంచైజీ అధినేతలు, కెప్టెన్లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో వీడీసీఏ అధ్యక్షుడు, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ మేయర్ హరివెంకటకుమారి, ఏపీఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ చైర్మన్ ఫెర్రర్, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథరెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్రెడ్డి, ఏపీఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యులు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కోస్టల్ రైడర్స్–బెజవాడ టైగర్స్ జట్ల మధ్య పోరుతో ఈ సీజన్ ఆరంభమైంది. శరత్ చంద్రరెడ్డి టాస్ వేశారు. బెజవాడ టైగర్స్ జట్టుపై కోస్టల్ రైడర్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. అభిమానుల సందడి ఏపీఎల్–2 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత విజేతలకు అందించే ట్రోఫీతో ఆరుజట్ల ఫ్రాంచైజీ యజమానులు, కెపె్టన్లు ఫొటో సెషన్ నిర్వహించారు. సినీ నటి శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐపీఎల్ తరహాలో చీర్ గాళ్స్ సైతం బౌండరీలు, వికెట్లు పడినప్పుడు అభిమానులను ఉత్సాహపరిచారు. స్టేడియంలో అభిమానుల సందడి నెలకొంది. -
కోస్టల్ రైడర్స్ శుభారంభం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ తొలి మ్యాచ్లో కోస్టల్ రైడర్స్ జట్టు 12 పరుగుల తేడాతో బెజవాడ టైగర్స్ జట్టుపై గెలిచి శుభారంభం చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన కోస్టల్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మన్యాల ప్రణీత్ (31; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ షేక్ రషీద్ (20; 4 ఫోర్లు), మద్దిల హర్షవర్ధన్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్), మిట్టా లేఖజ్ రెడ్డి (26; 5 ఫోర్లు), పాథూరి మనోహర్ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెజవాడ టైగర్స్ బౌలర్లలో లలిత్ మోహన్ మూడు వికెట్లు, సాయితేజ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ మున్నంగి అభినవ్ (57; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోస్టల్ జట్టు బౌలర్లలో చీపురపల్లి స్టీఫెన్, సుదర్శన్, ఆశిష్, మనోహర్ రెండు వికెట్ల చొప్పున తీసి బెజవాడ జట్టును దెబ్బ తీశారు. -
Andhra Premier League 2023 - Sreeleela: విశాఖలో ఘనంగా ఏపీఎల్-2 ప్రారంభం.. శ్రీలీల సందడి (ఫొటోలు)
-
APL: తొలిరోజు మ్యాచ్కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్లో అదృష్టం మీదైతే!
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్కు వైఎస్సార్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఈ క్రికెట్ ఈవెంట్కు బుధవారం తెరలేవనుంది. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పర్యవేక్షణలో రోజూ రెండు చొప్పున 19 మ్యాచ్లు జరగనున్నాయి. టైటిల్ పోరు ఈ నెల 27న జరగనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. తొలిసీజన్ టైటిల్ పోరులో ఢీకొట్టిన బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ ఈసారి లీగ్ ప్రారంభ మ్యాచ్లోనే తలపడనుండడంతో ఏపీఎల్ – 2 ఆది నుంచే హోరాహోరీగా సాగనుంది. మ్యాచ్లు వీక్షించే అభిమానులకు లక్కీడిప్ ద్వారా విశాఖ వేదికగా త్వరలో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్కు టికెట్లు అందించనున్నారు. సినీనటి శ్రీలీల తొలిరోజు మ్యాచ్ వీక్షించేందుకు రానున్నారు. బెజవాడ టైగర్స్: వికెట్ల వెనుక నుంచే... టైటిల్ పోరులో ఢీకొట్టి కేవలం ఏడు పరుగుల తేడాతో వెనుకబడిపోయిన బెజవాడ టైగర్స్ ఈసారి వికెట్ల వెనుక నుంచే మ్యాచ్ను ముందుకు నడిపించే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామంటూ ఫ్రాంచైజీ అధినేత రమణమూర్తి అంటున్నారు. అందులో భాగంగానే ఈ సీజన్లో అత్యధిక ధరతో రికీబుయ్ను నిలబెట్టుకుంది. ఇటీవల మంచి ఫామ్లో ఉన్న రికీ మిడిలార్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దడమే గాక జట్టును ముందుకు నడపనున్నాడు. మహీప్ వికెట్ల వెనుక సత్తా చాటనుండగా అవసరమైతే నేనున్నా అంటున్నాడు మహిమా. ఆల్రౌండర్లు షోయిబ్, సాయురాహుల్తోపాటు లలిత్, అవినాష్లుండగా సాయితేజ బంతితో చెలరేగనున్నాడు. రాయలసీమ కింగ్స్ : టాప్ ఆర్డర్ పటిష్టం సౌత్జోన్నే విజేతగా నిలిపిన హనుమ విహారి ఈసారి రాయలసీమ కింగ్స్ను టైటిల్ దిశగా నడిపించనున్నాడు. బౌలింగ్ ఆల్రౌండర్లు గిరినాథ్, సాకేత్లను నిలబెట్టుకోగా మాధవ్, కలియప్పలను తీసుకుంది. అభిషేక్, వంశీకృష్ణ ఓపెనర్లుగా నిలదొక్కుకుంటే పొట్టి ఫార్మెట్లో పరుగుల వరదే. సుదర్శన్ కొత్త బంతితో ప్రత్యర్థికి చుక్కలు చూపించనున్నాడు. హరిశంకర్, పవన్ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తరాంధ్ర లయన్స్ : ఫైనల్ పోరే లక్ష్యం తొలి సీజన్లో టాప్ 4లో నిలిచి ఎలిమినేటర్లోనే వెనుతిరిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఈ సారి ఫైనల్స్లో గర్జించేందుకు సిద్ధమైంది. స్థానికుడైన అంతర్జాతీయ టెస్ట్ క్రికెటర్ భరత్ మినహా మిగిలిన ఐదుగురిని తక్కువ ధరకే నిలబెట్టుకున్న ఫ్రాంచైజీ ఐదుగురు కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. వీళ్లందరినీ ఫ్రాంచైజీ అధినేత వెంకటరెడ్డి వేలం చివరి వరకు ఉండి మరీ సొంతం చేసుకున్నారు. వీరిలో పృథ్వీ భౌలింగ్ ప్రారంభించనుండగా టాప్ ఆర్డర్లో తపస్వి, రాహుల్ బ్యాట్ ఝళిపించనుండగా వాసు, శ్రీనివాస్ ఆల్రౌండ్ ప్రతిభ కనబరచనున్నారు. ఇక జట్టుకు ఓపెనర్గా గుల్ఫమ్, వికెట్ల వెనుక భరత్, టాప్లో శ్యామ్, బౌలర్గా అజయ్, బౌలింగ్ ఆల్రౌండర్ రఫీ, అండర్ 16లో రాణిస్తున్న రచిత్ ఉండనే ఉన్నారు. గోదావరి టైటాన్స్: మిడిలార్డర్తో బ్యాలెన్స్ గోదావరి టైటాన్స్ ఈ సారి ఓపెనర్లు, టాప్ ఆర్డర్ను పక్కా ప్రణాళికతో మ్యాచ్కు సిద్ధం చేసుకోగా మిడిలార్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దే ధీరజ్కుమార్కు జట్టును ముందుకు నడిపించే బాధ్యత అప్పగించింది. ఓపెనర్ హిమకర్, ఆల్రౌండర్లు శశికాంత్, సత్యనారాయణను జట్టు సొంతం చేసుకుంది. ఓపెనర్ వంశీతోపాటు టాప్ ఆర్డర్లో సాత్విక్, పాండురంగ, హేమంత్ను నిలబెట్టుకోగా మాధవ్ బౌలింగ్ చేయనున్నాడు. ►తలపడనున్న జట్లు : 6 ►మొత్తం మ్యాచ్లు : 19 ►టైటిల్ పోరు : 27న ►అన్ని మ్యాచ్లు ఫ్యాన్ కోడ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్
-
APL ముఖ్య ఉద్దేశ్యం ఇదే.. దేశం మొత్తం మన లీగ్ వైపు చూస్తుంది
-
ఏపీఎల్ సీజన్ 2 వేలంలో విశాఖ క్రికెటర్కు రికార్డు ధర
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ వేలం మంగళవారం విశాఖలో జరిగింది. ఇందులో దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన విశాఖ కుర్రాడు రికీ బుయ్ రికార్డు ధర పలికాడు. రూ.8,10,000కు బెజవాడ టైగర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర. సౌత్జోన్ కెప్టెన్ హనుమ విహారీను రూ.6,60,000తో రాయలసీమ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఏపీలోని 6 ఫ్రాంచైజీ జట్లతో ఈ నెల 16 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా తరఫున రంజీలతో సహా అంతర్జాతీయ క్రికెట్లో పలు స్థాయిల్లో సత్తా చాటిన 567 మంది ఆటగాళ్లను వారి గ్రేడ్ను బట్టి వేలం నిర్వహించారు. 6 ఫ్రాంచైజీలు మొత్తంగా 120 మంది ఆటగాళ్లను జట్లకు ఎంపిక చేసుకున్నాయి. ఏసీఏ పర్యవేక్షణలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐపీఎల్ జట్ల వేలం నిర్వహించే వ్యాఖ్యాత చారుశర్మ ఈ వేలాన్ని నిర్వహించగా..కౌన్సిల్ చైర్మన్ మునీష్ సెహగల్ ప్రారంభించారు. లైనప్ను సరి చూసుకుంటూ ఫ్రాంచైజీలు మొత్తంగా రూ.1.8 కోట్లను వినియోగించుకున్నాయి. కాగా, గిరినాథ్రెడ్డిని రూ.6,10,000లకు రాయలసీమ కింగ్స్, కేఎస్ భరత్ను రూ.6,00,000లకు ఉత్తరాంధ్ర లయన్స్ నెలబెట్టుకున్నాయి. వైజాగ్ వారియర్స్ అశ్విన్ హెబ్బర్ను రూ.5,10,000కు, కోస్టల్ రైడర్స్ స్టీఫెన్, లేఖజ్లను రూ.4,50,000లకు నిలబెట్టుకున్నాయి. రూ.50,000 కనీస ధరతో బిడ్ ప్రారంభమైంది. -
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2
-
క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్ చరణ్, ఐపీఎల్లోనా?
ఆర్ఆర్ఆర్ సక్సెస్తో మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ఇమేజ్ ప్రపంచస్థాయికి చేరింది. మెగాస్టార్ వారసుడిగానే అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్చరణ్ కేవలం హీరోగానే కాదు వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ మెగా హీరోకి పోలో టీమ్ ఉండగా.. ట్రూజెట్ పేరుతో ఎయిర్లైన్స్ రంగంలోనూ అడుగుపెట్టాడు. సహజంగా స్పోర్ట్పైనా ఇంట్రెస్ట్ ఉండే రామ్చరణ్ ఇప్పుడు క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి. చెర్రీ ఐపీఎల్లో టీమ్ కొనుగోలు చేస్తున్నాడంటూ కథనాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రమే టీమ్గా ఉంది. ఇది కూడా తమిళనాడుకు చెందిన కావ్యా మారన్ ఓనర్గా ఉంటే.. ఏపీ నుంచి మాత్రం ఐపీఎల్లో ఫ్రాంచైజీ ప్రాతినిథ్యం లేదు. దీంతో రామ్చరణ్ ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి వైజాగ్ వారియర్స్ అనే పేరు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయన్నది ఆ వార్తల సారాంశం. అయితే ఐపీఎల్లో ఇప్పుడు కొత్త జట్లకు అవకాశం లేదు. గత ఏడాదే రెండు కొత్త ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇచ్చాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్జెయింట్స్ ఫ్రాంచైజీలను బడా వ్యాపారవేత్తలు దక్కించుకున్నారు. గుజరాత్ టీమ్ను సీవీసీ క్యాపిటల్స్, లక్నో టీమ్ను సంజీవ్ గోయెంకా టీమ్ వేలంలో కొనుగోలు చేశాయి. దీంతో ఐపీఎల్లో జట్ల సంఖ్య పదికి చేరింది. ఇప్పట్లో ఈ సంఖ్యను మరింత పెంచే ఉద్ధేశమైతే బీసీసీఐకి లేదు. దీంతో రామ్చరణ్ ఐపీఎల్లో టీమ్ ఎలా కొనుగోలు చేస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే రామ్చరణ్ కొనబోయేది ఐపీఎల్ కాదు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో అనీ తాజాగా వార్తలు వస్తున్నాయి. ఏపీలో యువక్రికెటర్లను ప్రోత్సహించే ఉద్ధేశంతో గత ఏడాది ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. తొలి సీజన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఈ లీగ్లో పలువురు వ్యాపారవేత్తలు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. ఆరు జట్లతో గత ఏడాది జరిగిన సీజన్ ద్వారా పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. రామ్చరణ్ ఏపీఎల్లో ఉన్న వైజాగ్ వారియర్స్ టీమ్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. దీనిపై వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్లతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ శ్రీనుబాబు, నరేంద్ర రామ్, సీఈవో భరణిలని మీడియా వర్గాలు ప్రశ్నించగా... రామ్చరణ్ లాంటి స్టార్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో భాగమయితే చాలా సంతోషిస్తామనీ, లీగ్కు, ఇందులో ఆడుతున్న యువ ఆటగాళ్లకు ఇది ఉత్సాహాన్ని ఇవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైజాగ్ వారియర్స్ సీఈవో భరణి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న యువ ఆటగాళ్ళకు ఏపీఎల్ గొప్ప వేదిక అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి లీగ్లో రామ్చరణ్ లాంటి టాప్ హీరో ఎంట్రీ ఇస్తే గ్లోబల్ వైడ్గా గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. చదవండి: తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఏడాదిన్నర ఇంట్లోనే కూర్చున్నా: బెల్లంకొండ హీరో -
ఏపీఎల్ విజేతగా కోస్టల్ రైడర్స్..
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. బెజవాడ టైగర్స్ రన్నరప్గా నిలిచింది. వైఎస్సార్ స్టేడియంలో సోమవారంతో ముగిసిన టైటిల్ పోరులో టాస్గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రతిగా బ్యాటింగ్ చేసిన బెజవాడ టైగర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. 7 పరుగుల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం సాధించింది. ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పర్యవేక్షణలో నిర్వాహక కమిటీ ప్రతినిధులు విజేతలకు ట్రోఫీలందించారు. వాస్తవానికి ఈ మ్యాచ్ ఆదివారమే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా పడి సోమవారం జరిగింది. విజేతలకు ట్రోఫీలందించేందకు క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ విశాఖ విచ్చేసినా సోమవారం తిరిగి పయనమయ్యారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర సైతం తిరుగుముఖం పట్టడంతో నిర్వాహక కమిటీ ప్రతినిధులు విజేతలకు ట్రోఫీలతోపాటు నగదు ప్రోత్సాహాకాలు అందించారు. రాణించిన కోస్టల్ రైడర్స్ బ్యాటర్లు ఫైనల్స్ టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రణీత్ (44), జ్ఞానేశ్వర్ (23) రాణించారు. తపస్వి (6) హర్ష (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరడంతో 94 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. కీపర్ బ్యాటర్ లేఖజ్ (15), మనీష్(13) సైతం తక్కువ పరుగులే చేయగలిగలిగారు. ఈ క్రమంలో బరిలోకి దిగిన శ్రీనివాస్ 20 బంతుల్లో 40 పరుగులు చేశాడు. లలిత్, మనీష్ చెరో మూడు వికెట్లు తీశారు. బెజవాడ టైగర్స్ తడ‘బ్యాటు’ ప్రతిగా 177 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెజవాడ టైగర్స్ ఏడు వికెట్లకు 169 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ మహీప్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోగష్ 30 పరుగులతో రాణించాడు. అవినాష్(23), కెప్టెన్ రికీబుయ్ (15) తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరారు. దీంతో టాప్ ఆర్డర్ 77 పరుగులకే కుప్పకూలిపోయింది. సాయిరాహుల్ ఒక సిక్సర్, ఒక ఫోర్తో 16 పరుగులు చేసి 105 పరుగుల వద్ద వెనుతిరిగాడు. జగదీష్ (25), ప్రణీత్ (48) పోరాడిన గెలిపించలేకపోయారు. తపస్వి, మునీష్, అశిష్ రెండేసి వికెట్లు తీయగా హరిశంకర్ ఒక వికెట్ తీశాడు. లలిత్మోహన్కు పర్పుల్ క్యాప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శ్రీనివాస్, బెస్ట్ బౌలర్గా విశాఖ కుర్రాడు మనీష్ నిలవగా, బెస్ట్ బ్యాటర్గా ప్రణీత్ నిలిచాడు. పర్పుల్ క్యాప్ను లలిత్మోహన్, ఆరెంజ్ క్యాకాప్ను పి.అవినాష్ అందుకున్నారు. ప్రామిసింగ్ ప్లేయర్గా రషీద్, వేల్యూబుల్ ప్లేయర్గా గురునాథ్ నిలిచారు. స్కోరు వివరాలు కోస్టల్ రైడర్స్ ఇన్నింగ్స్ : సీఆర్ జ్ఞానేశ్వర్(సి) అఖిల్(బి)మనీష్ 23; ప్రణీత్(సి) మనీష్(బి)లలిత్ 44, హర్ష(సి) ఆశిష్ (బి) లలిత్ 13; తపస్వి (సి)అయ్యప్ప (బి) మనీష్ 6; లేఖజ్(సి)జోగేష్ (బి)లలిత్ 15; మునీష్(సి)రాహుల్(బి)మనీష్ 13; శ్రీనివాస్(రనౌట్ ప్రణీత్/అఖిల్)40; విజయ్(సి)జోగేష్(బి)అఖిల్ 1; హరిశంకర్(నాటౌట్)12; ఎక్స్ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 8వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–73, 2–75,3–92,4–96,5–119,6–126, 7–138, 8–176. బౌలింగ్: అయ్యప్ప 4–0–34–0, అఖిల్ 4–0–48–1, లలిత్ 4–0–31–3, సాయిరాహుల్ 2–0–19–0, రికీబుయ్ 2–0–25–0, జి.మనీష్ 4–0–18–3. బెజవాడ టైగర్స్ ఇన్నింగ్స్ మహీప్కుమార్ (బౌల్డ్) హరిశంకర్ 1; జోగేష్(సి) రవికిరణ్(బి)మునీష్ 30; అవినాష్(సి)హర్షవర్దన్ (బి) మునీష్ 23; రికీబుయ్(సి)(బి) ఆశిష్ 15; ప్రణీత్(సి)హర్ష(బి)తపస్వి 48; సాయిరాహుల్(సి)మునీష్ (బి)ఆశిష్ 16; జగదీష్(సి)శ్రీనివాస్(బి)తపస్వి 25; మనీష్ (నాటౌట్)5; ఎక్స్ట్రాలు 6, మొత్తం(20 ఓవర్లలో 7 వికెట్లకు)169. వికెట్ల పతనం: 1–2, 2–35,3–60,4–77,5–105,6–163, 7–169. బౌలింగ్: స్టీఫెన్ 4–0–30–0, హారిశంకర్ 4–0–45–1,ఆశిష్ 4–0–18–2, మునీష్ 4–0–41–2, విజయ్ 3–0–20–0, తపస్వి 1–0–13–2. చదవండి: IND vs WI: టీమిండియాతో సిరీస్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..! -
ఏపీఎల్ తుది పోరు.. కోస్టల్ రైడర్స్తో బెజవాడ టైగర్స్ ఢీ
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ తొలి సీజన్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగే పోరులో విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఎవరు ఎగరేసుకు పోనున్నారో తేలిపోనుంది. టైటిల్ పోరులో రన్నరప్గా నిలిచిన జట్టు రూ.15 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందుకోనుంది. కాగా.. తొలి సీజన్కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. దీంతో మూడు మ్యాచ్లను కుదించి నిర్వహించారు. నాలుగు మ్యాచ్లను రద్దు చేశారు. టైటిల్ పోరుకు బెజవాడ టైగర్స్ ఏపీఎల్ క్వాలిఫైయర్ రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన బెజవాడ టైగర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లలిత్కు లెగ్బిఫోర్గా ప్రశాంత్(29) దొరికిపోగా.. మరో ఓపెనర్ అభిషేక్(41) మనీష్ బౌలింగ్లో షార్ట్ ఫైన్లెగ్లో సాయితేజకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వినయ్(16) లలిత్ బౌలింగ్లోనే డీప్ స్క్వేర్లెగ్లో అఖిల్కు క్యాచ్ ఇ చ్చాడు. కెప్టెన్ గిరినాథ్ 53 పరుగులు, రషీద్ 40 పరుగులతో నిలిచారు. 187 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెజవాడ టైగర్స్ ఓపెనర్ మహీప్ ఒక్క పరుగే చేసి సంతోష్ బౌలింగ్లో డీప్ పాయింట్లో కార్తికేయకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అతని స్థానంలో వచ్చిన అవినాష్ ఒక పరుగుతో, మరో ఓపెనర్ ప్రణీత్ 24 పరుగులతో ఆడుతుండగా వర్షం వచ్చింది. నాలుగు ఓవర్లలో ఒక వికెట్కు 29 పరుగుల వద్ద మ్యాచ్ నిలిచిపోయింది. ఫలి తం తేలేందుకు కనీసం మరో ఓవర్ జరగాల్సి ఉండగా స్టేడియంలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. లీగ్ దశలో పాయింట్ల ఆధారంగా బెజవాడ టైగర్స్ను విజేతగా ప్రకటించారు. దీంతో ఏపీఎల్ తొలి సీజన్ టైటిల్ పోరుకు బెజవాడ టైగర్స్ చేరుకుంది. ఆదివారం జరిగే తుది పోరులో కోస్టల్ రైడర్స్తో బెజవాడ టైగర్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి ఆరున్నరకు ప్రారంభం కానుండగా విజేతకు ట్రోఫీ అందించేందుకు క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ రానున్నారు. ఈ నాకవుట్ మ్యాచ్ను ఉచితంగానే ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. చదవండి: Tamim Iqbal: టీ20లకు గుడ్బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్.. -
APL: ప్లేఆఫ్స్నకు రాయలసీమ కింగ్స్.. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ వివరాలు!
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ ప్లేఆఫ్కు రాయలసీమ కింగ్స్ చేరుకోగా.. వైజాగ్ వారియర్స్ ఇంటి ముఖం పట్టింది. ఏపీఎల్ ప్లేఆఫ్కు చేరుకోవడమే లక్ష్యంగా వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ జట్లు బుధవారం తలపడ్డాయి. వైఎస్ఆర్ స్టేడియంలో లీగ్ చివరి మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన వైజాగ్ వారియర్స్ ఓపెనర్ సాయికృష్ణ(3) గిరినాథ్ బౌలింగ్లో సాకేత్కు క్యాచ్ ఇవ్వగా.. కెప్టెన్ అశ్విన్(15 ఒక ఫోర్, ఒక సిక్స్తో) సాకేత్ బౌలింగ్లో ప్రశాంత్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్లు 29 పరుగుల వద్దే పెవిలియన్ బాట పట్టారు. కరణ్ రెండు ఫోర్లతో 21 పరుగుల వద్ద వినయ్కు బౌల్డ్ అయ్యాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేప్పటికి నాలుగు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేశారు. నరేన్, దృవ్లు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నరేన్ 34 పరుగులతో బౌల్డయ్యాడు. తర్వాత బంతికే మనోహార్(0)బౌల్డ్ కాగా.. సిద్ధార్థ కూడా తర్వాత బంతికే క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో సంతోష్ హాట్రిక్ నమోదు చేశాడు. ఏపీఎల్లో సంతోష్ తొలి హాట్రిక్ చేసిన బౌలర్గా నిలిచాడు. వెంటనే గిరినాథ్ బౌలింగ్లో దృవ్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. దృవ్(53), రామన్(3) అజేయంగా నిలవడంతో వైజాగ్ వారియర్స్ ఏడు వికెట్లకు 140 పరుగులు చేసింది. సంతోష్ మూడు, వినయ్ రెండు వికెట్లు తీయగా, గిరినాథ్, సాకేత్ చెరో వికెట్ తీశారు. 141 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాయలసీమ కింగ్స్ తరఫున ఏపీఎల్లోనే ప్రశాంత్ తొలి సెంచరీ నమోదు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ అభిషేక్ పరుగుల ఖాతా ప్రారంభించకుండానే కార్తీక్ వేసిన రెండో బంతికి వికెట్ల వెనుక దృవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. మరో ఓపెనర్ ప్రశాంత్తో రషీద్(14) స్కోర్ను 45 పరుగులకు చేర్చి రన్ అవుటయ్యాడు. వంశీకృష్ణ కూడా ఏడు పరుగులు చేసి వేణు బౌలింగ్లో ఆశ్విన్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వినయ్ ఒక ఫోర్, సిక్స్తో 15 పరుగులతో నిలవగా.. ప్రశాంత్ 17.2 ఓవర్లో ఆంజనేయులు వేసిన బంతిని బౌండరీకి తరలించి ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. మూడే వికెట్లు కోల్పోయి 146 పరుగులతో విజయం సాధించి రాయలసీమ కింగ్స్ ప్లేఆఫ్కు చేరింది. కార్తీక్, వేణు చెరో వికెట్ తీశారు. ప్రశాంత్ మ్యాచ్ బెస్ట్తో పాటు బ్యాటర్గా నిలవగా హ్యాట్రిక్ వీరుడు సంతోష్ బెస్ట్ బౌలర్గా నిలిచాడు. ప్లేఆఫ్లు ఖరారు ఏపీఎల్ ప్లేఆఫ్కు రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్ పన్నేండేసి పాయింట్లతో.. పది పాయింట్లుతో ఉత్తరాంధ్ర లయన్స్ చేరుకున్నాయి. వైజాగ్ వారియర్స్ ఎనిమిది పాయింట్లు, గోదావరి టైటాన్స్ ఆరు పాయింట్లే సాధించి లీగ్ దశలోనే ఇంటి దారి పట్టాయి. తొలి క్వాలిఫైయింగ్లో టైగర్స్తో రైడర్స్ ఏపీఎల్ ప్లేఆఫ్లో క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్లో బెజవాడ టైగర్స్తో కోస్టల్ రైడర్స్ తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాయలసీమ కింగ్స్తో ఉత్తరాంధ్ర లయన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్లో పరాజయం చెందిన జట్టుతో ఆడనుంది. క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్లో విజయం సాధించిన జట్టు నేరుగా టైటిల్ పోరుకు అర్హత సాధించనుంది. చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్కు కోహ్లి దూరం! ఫ్యాన్స్కు ఓ గుడ్న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు! Andhra Premier League 2022: ప్లేఆఫ్నకు కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ .. ఇప్పటికే -
APL 2022: ప్లేఆఫ్నకు కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్
విశాఖ స్పోర్ట్స్ : కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ ఏపీఎల్ తొలి సీజన్ ప్లేఆఫ్కు చేరుకున్నాయి. లీగ్ చివరి మ్యాచ్లో ఆధిక్యానికి పోటీపడ్డ బెజవాడ టైగర్స్ను నిలువరించి కోస్టల్ రైడర్స్ ప్లేఆఫ్కు చేరింది. ఇప్పటికే టైగర్స్ ప్లేఆఫ్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్లు 12 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. మ్యాచ్ సాగిందిలా! వైఎస్సార్ స్టేడియంలో తొలుత టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ్ఞానేశ్వర్తో కలిసి తొలి వికెట్కు ఓపెనర్ మునీష్ 15 పరుగులు చేసి 23 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. అనంతరం బరిలో దిగిన హర్షవర్ధన్ కెప్టెన్ జ్ఙానేశ్వర్తో కలిసి పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు నమోదు చేశారు. భారీస్కోర్ దిశగా సాగుతుండగా జ్ఙానేశ్వర్ (52).. రికీబుయ్ బౌలింగ్లో డీప్మిడ్ వికెట్లో అవినాష్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కీపర్ బ్యాటర్ లేఖజ్తో కలిసి స్కోరును 168 పురుగులకు చేర్చారు. హర్షవర్ధన్ (63) పరుగులు చేసి సాయితేజ బౌలింగ్లో సుమంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో రెండు బంతుల అనంతరం లేఖజ్ (33)అయ్యప్పకు లెగ్బిఫోర్గా దొరికిపోయాడు. శ్రీనివాస్ (10), తపస్వి(3) అజేయంగా నిలిచి స్కోర్ను నాలుగు వికెట్లకు 181 పరుగులకు చేర్చారు. అయ్యప్ప, సాయితేజ, లలిత్, రికీబుయ్ ఒకో వికెట్ తీశారు. తడబడిన టైగర్స్.. దీటుగానే ఆట ప్రారంభించిన బెజవాడ టైగర్స్ తొలి రెండు వికెట్లను కోల్పోయినా తొలి పదిఓవర్లు టాప్ ఆర్డర్ కొనసాగింది. 50 పరుగుల వద్ద ఓపెనర్ సుమంత్ (24), మరో ఓపెనర్ మహీప్ (28) త్వరగా ఔటయ్యారు. 11వ ఓవర్లో ఆశిష్ బౌలింగ్లో రెండు వరుస బంతుల్లో కెప్టెన్ రికీబుయ్ (6), మనీష్(0) పెవిలియన్కు చేరుకోవడంతో ఒక్కసారిగా ఆటపై కోస్టల్ రైడర్స్ పట్టు సాధించింది. అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న ప్రణీత్ సైతం (30)తపస్వి బౌలింగ్లో విజయ్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో వంద పరుగుల మార్కు చేరుకోకుండానే టైగర్స్ జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో అవినాష్, జగదీష్ జోడి ఇన్నింగ్స్ సరిదిద్ది 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. జగదీష్ (27) విజయ్ బౌలింగ్లో జ్ఞానేశ్వర్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగ్గా...తొమ్మిది పరుగులు జోడించి రాహుల్ (9),అయ్యప్ప(0)పెవిలియన్కు చేరుకున్నారు. మరో రెండు బంతుల్లో ఆట ముగిసే సమయానికి నిలకడగా ఆడుతున్న అవినాష్ (35) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. చివరికి టైగర్స్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రైడర్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్షవర్ధన్ మ్యాచ్ బెస్ట్ బాటర్గానూ, ఆశీష్ బెస్ట్ బౌలర్గా నిలిచారు. రసవత్తర పోరులో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టైటాన్స్ ఓపెనర్ వంశీకృష్ణ ఒక్క పరుగు చేసి భరత్కు దొరికిపోయాడు. ఓపెనర్ హేమంత్తో కలిసి నితీష్ రెండో వికెట్కు 51పరుగులు జోడించారు. నితీష్ (35) షోయబ్కు క్లీన్బౌల్డ్ కాగా హేమంత్ను (39) 99 పరుగుల వద్ద కౌషిక్ క్లీన్బౌల్డ్ చేశాడు. సందీప్ రెండు ఫోర్లతో 22 పరుగులు చేసి వర్మ బౌలింగ్లో లాంగాఫ్లో క్రాంతికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 34పరుగులు చేయడంతో టైటాన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. ప్రమోద్ మూడు, వర్మ రెండు వికెట్లు తీయగా అజయ్, షోయిబ్, కౌషిక్ ఒకో వికెట్ తీశారు. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్లు తొలి ఓవర్కే 15 పరుగులు చేశారు. ఓపెనర్ రోహిత్ (10)ని నితీష్ తొలి ఓవర్ (ఇన్నింగ్స్ రెండోఓవర్)నాలుగో బంతిని ఆడబోయి స్క్వేర్లెగ్లో శశికాంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ స్థానంలో వచ్చిన గుల్ఫమ్ నాలుగు పరుగులే చేసి రనౌటై వెనుతిరిగాడు. ఈ దశలో ఓపెనర్, కెప్టెన్ భరత్కు ధీరజ్ లక్ష్మణ్ తోడై స్కోర్ను 50 పరుగులకు చేర్చారు. భరత్ (36).. ఇస్మాయిల్ వేసిన బంతికి ఎక్స్ట్రా కవర్లో నితీష్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్, క్రాంతి జోడి నిలకడగా ఆడుతూ స్కోర్ను పరుగులెత్తించారు. థీరజ్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బరిలో దిగిన క్రాంతి (17) సైతం సందీప్కు క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో చివరి మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు 25పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దోబూచులాడింది. లోయర్ మిడిలార్డర్లో వర్మ 11 పరుగులు చేశాడు. షోయబ్ (6), రఫీ(11) అజేయంగా నిలిచి మరో ఐదు బంతులుండగానే ఏడు వికెట్లకు 150 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించారు. ఇస్మాయిల్ మూడు, సందీప్ రెండు, నితీష్ ఒక వికెట్ తీశారు. దీంతో మూడు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం సాధించింది. మ్యాచ్ బెస్ట్గా నితీష్కుమార్ నిలవగా బెస్ట్ బ్యాటర్గా ధీరజ్, బెస్ట్ బౌలర్గా ఇస్మాయిల్ నిలిచారు. చదవండి: Ind Vs Eng 1st ODI: టీమిండియా ఆరేళ్ల తర్వాత.. పాపం ఇంగ్లండ్ సొంతగడ్డపై చెత్త రికార్డు! Latest Womens ODI Rankings: టాప్ 10లో టీమిండియా వైస్ కెప్టెన్.. మెరుగైన కెప్టెన్ ర్యాంక్ -
APL 2022: ప్లే ఆఫ్స్నకు చేరిన తొలి జట్టుగా బెజవాడ టైగర్స్
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ టోర్నీ తొలి సీజన్ ప్లేఆఫ్కు బెజవాడ టైగర్స్ జట్టు చేరుకుంది. టోర్నీలో తలపడుతున్న ఆరుజట్లు నాలుగేసి మ్యాచ్లు పూర్తిచేయగా.. బెజవాడ టైగర్స్ జట్టు 12 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాయలసీమ కింగ్స్,కోస్టల్రైడర్స్, వైజాగ్ వారియర్స్ ఎనిమిదేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర లయిన్స్, గోదావరి టైటాన్స్ ఆరేసి పాయింట్లతో టోర్నిలో చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా బెజవాడ టైగర్స్ ప్లేఆఫ్కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించగా.. మిగిలిన మూడు జట్లు చివరి మ్యాచ్లో ఫలితాన్ని బట్టి ప్లేఆఫ్కు అర్హత సాధించనున్నాయి. కాగా ఏపీఎల్లో మరోసారి వరుణుడి రాకతో సోమవారం జరగాల్సిన మధ్నాహ్నం మ్యాచ్ రద్దు అయింది. సాయంత్రం ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగాల్సిన మ్యాచ్ తొమ్మిది ఓవర్లకు కుదించారు. వైఎస్ఆర్ స్టేడియంలో మధ్యాహ్నం రాయలసీమ కింగ్స్తో బెజవాడ టైగర్స్తో తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు రెండేసి పాయింట్లు కేటాయించారు. కాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ గెలిచిన జట్టుకు 4 పాయింట్లు లభిస్తాయి. ఫలితం తేలనట్లయితే రెండు పాయింట్లు వస్తాయి. ఐదు వికెట్ల తేడాతో రైడర్స్ విజయం ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్లో వైజాగ్ వారియర్స్పై కోస్టల్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన వైజాగ్ వారియర్స్ ఓపెనర్ గిరినాథ్ ఒక పరుగే చేసి వెనుదిరగ్గా మరో ఓపెనర్ అశ్విన్ 28 పరుగులు చేశాడు. ఓపెనర్లతో పాటు అర్జున్ సైతం ఆశిష్ బౌలింగ్లోనే పెవిలియన్కు చేరాడు. సాయికృష్ణ(13), సిద్ధార్థ(18) మినహా మిగిలిన వారంతా వేగంగా పరుగులు చేయడానికే ప్రయత్నించి సింగిల్ డిజిట్ స్కోర్ల్తోనే పెవిలియన్కు చేరారు. 34 పరుగుల వద్ద రెండో వికెట్ కూలగా.. చివరికి తొమ్మిది ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 80 పరుగులతో వారియర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 81 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్లు తపస్వి, కెప్టెన్ జ్ఞానేశ్వర్ చెరో నాలుగేసి పరుగులు చేసి పెవిలియన్కు చేరారు. మునీష్ 9 పరుగులు చేయగా లేఖజ్ తొలిబంతికే లేని పరుగుకు రనౌటయ్యాడు. 24పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో శ్రీనివాస్ (38 పరుగులు)కు హర్ష తోడై స్కోర్ను పరిగెత్తించారు. హర్ష రెండు ఫోర్లతో 16 పరుగులతోనూ, అబ్బాస్ ఒక ఫోర్తో ఆరు పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. మరో రెండు బంతులుండగానే రైడర్స్ విజయలక్ష్యాన్ని ఛేదించారు. చదవండి: Ind Vs Eng 1st ODI Details: ముఖాముఖి రికార్డులు, తుది జట్ల అంచనా.. పూర్తి వివరాలు! ఇక టాస్ గెలిచిన జట్టు తొలుత.. Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! -
APL 2022: తడబడిన టైటాన్స్.. గర్జించిన బెజవాడ టైగర్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా సెంట్రల్ ఆంధ్ర ఫ్రాంచైజీ జట్లు బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. టైటాన్స్ కెప్టెన్ శశికాంత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ వంశీకృష్ణ(10)ను 25 పరుగుల వద్ద అయ్యప్ప క్లీన్బౌల్డ్ చేశాడు. 5.5ఓవర్లలో 50పరుగుల మార్కు దాటిన అనంతరం మరో ఓపెనర్ హేమంత్ నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్లో అయ్యప్పకు క్యాచ్ఇచ్చి వెనుతిరిగాడు. చివరికి 18.5 ఓవర్లలోనే 119 పరుగులు స్కోర్కే టైటాన్స్ ఆలౌటైంది. కెప్టెన్ శశికాంత్ ఒకఫోర్, సిక్సర్తో 22 పరుగులు చేయగా నితీష్ 15, సందీప్ 22, ధీరజ్ 10 పరుగులు చేయగలిగారు. అయ్యప్ప ,లలిత్మోహన్ మూడేసి వికెట్లు తీయగా సాయిరాహుల్ రెండు, మనీష్, రికీబుయ్ చెరో వికెట్ తీశారు. 120 పరుగుల లక్ష్యంతో... 120 పరుగుల లక్ష్యంతో ఆటను ప్రారంభించిన బెజవాడ టైగర్స్ జట్టు ఓపెనర్ మహీప్ మూడు ఫోర్లతో 20 పరుగులు చేసి 4.4 ఓవర్ల వద్ద వెనుతిరిగాడు. మరో ఓపెనర్ సుమంత్కు వన్డౌన్లో విశాఖకు చెందిన అవినాష్ తోడై స్కోర్ను రెండో వికెట్కు 84 పరుగులకు చేర్చారు. అవినాష్ రెండు ఫోర్లు,నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి వాసు బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. కెప్టెన్ రికీబుయ్ (ఒక ఫోర్, మూడు సిక్సర్స్తో)13 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. 17.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి బెజవాడ టైగర్స్ విజయాన్ని అందుకుంది. నితీష్ వేసిన బంతిని స్ట్రయిట్గా లాంగ్ఆన్ మీదుగా గాల్లో బౌండరీకి తరలిం సుమంత్ (మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 29 పరుగులు) జట్టుకు విజయాన్ని అందించాడు. లలిత్ ప్లేయర్ ఆఫ్ ది వ్యచ్గా నిలవగా... బెస్ట్ బ్యాటర్గా అవినాష్, బెస్ట్ బౌలర్గా వాసు నిలిచారు. ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్ ఏపీఎల్లో ఐదో రోజు మ్యాచ్లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్ మూడు మ్యాచ్లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్ వారియర్స్ మూడు మ్యాచ్లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్లాడిన రాయలసీమ కింగ్స్ 6 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్ రైడర్స్ 4 పాయింట్లు సాధించింది. చదవండి: APL 2022: వైజాగ్ వారియర్స్ పరుగుల వరద.. రెండో విజయం! Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... -
APL 2022: వైజాగ్ వారియర్స్ పరుగుల వరద.. రెండో విజయం!
Andhra Premier League- విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్లో ఉత్తరాంధ్ర ఫ్రాంచైజీ జట్లు వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయిన్స్ తలపడ్డాయి. వైఎస్సార్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ టోర్నీలో తొమ్మిదో మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు బౌండరీలతో సత్తా చాటుకున్నారు. టాస్ గెలిచిన వైజాగ్ వారియర్స్ కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఉత్తరాంధ్ర లయిన్స్ తొలుత బ్యాటింగ్కు దిగింది. లయిన్స్ ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగా వారియర్స్ మరో ఐదు బంతులుండగానే విజయం సాధించింది. నిలకడగా ఆడినా... బ్యాటింగ్ ప్రారంభింన లయన్స్ ఓపెనర్లు గుల్ఫమ్, భరత్ జోడి తొలి వికెట్కు 56 పరుగులు చేశారు. గుల్ఫమ్ రెండు ఫోర్లు ఒక సిక్సర్తో 22 పరుగులు చేసి వెనుతిరిగాడు. భరత్..6 ఫోర్లు, ఒక సిక్సర్తో 42 పరుగులు, వర్మ (మూడుఫోర్లు, ఒక సిక్సర్తో) 21 పరుగులతో స్కోర్ 88 పరుగులకు చేర్చారు. భరత్తో పాటు తర్వాత బంతికే వర్మ కూడా పెవిలియన్కు చేరుకున్నాడు. ఈ దశలో క్రాంతి (41,ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు)కి రోహిత్ (18, ఒకఫోర్,ఒక సిక్సర్)తోడై 141 పరుగులకు స్కోర్ బోర్డు పరుగులెత్తించారు. ఈ క్రమంలో 141 పరుగుల వద్ద రోహిత్, 159 పరుగుల వద్ద క్రాంతి ఔటయ్యారు. స్కోర్ 174 పరుగులకు చేరే క్రమంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఏడు వికెట్లకు 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగింంది. సిద్దార్థ రెండు వికెట్లు తీయగా కార్తీక్, వేణు, ఆంజనేయులు ఒకో వికెట్ తీశారు. మిడిలార్డర్లో నిలదొక్కుకుంటూ.... వారియర్స్ ఓపెనరు గిరినాథ్ (7) ప్రమోద్ వేసిన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ రెండో ఓవర్)వరి బంతికి దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్, కెప్టెన్ అశ్విన్తో కలిసిన సాయికృష్ణ 47(ఆరుఫోర్లు,ఒకసిక్సర్) 99 పరుగుల వద్ద వెనుతిరిగాడు. అశ్విన్ 47 (ఐదుఫోర్లు, ఒక సిక్సర్)116 పరుగుల వద్ద వెనుతిరిగ్గా....మరో రెండే పరుగులకే ధృవ్(1)వికెట్ కోల్పోయింది. నరేన్తో కలిసి వికెట్ చేజార్చుకోకుండా ఇన్నింగ్స్ సరిదిద్దేక్రమంలో కరణ్ (8) 16.2 ఓవర్వద్ద వెనుతిరిగాడు. అనంతరం నరేన్, మనోహార్ (ఏడుబంతుల్లో మూడు సిక్సర్లతో 21పరుగులు) జోడి చెలరేగిపోయింది. నరేన్ (20 బంతుల్లోనే రెండేసి ఫోర్లు, సిక్సర్లతో) 34పరుగులతో నిలి జట్టుకు విజయాన్నందించాడు. కార్తీక్ 3పరుగులతో నిలిచాడు. దీంతో మరో ఐదుబంతులుండగానే వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రవెద్, షోయిబ్ రెండేసి వికెట్లు తీయగా వర్మ, సాయికౌషిక్ చెరో వికెట్ తీశారు. ఏడో ఓవర్లోనే పై చేయి సాధించిన వారియర్స్ 11వ ఓవర్కు పూర్తిగా పట్టుసాధిం మిడిలార్డలో నిలదొక్కుకుని విజయం దిశగా సాగింది. సిద్ధార్ధ బెస్ట్ బౌలర్, మ్యాచ్ బెస్ట్గా నిలవగా... సాయికృష్ణ బెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్ ఏపీఎల్లో ఐదో రోజు మ్యాచ్లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్ మూడు మ్యాచ్లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్ వారియర్స్ మూడు మ్యాచ్లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్లాడిన రాయలసీమ కింగ్స్ 6 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్ రైడర్స్ 4 పాయింట్లు సాధించింది. చదవండి: IND Vs ENG 3rd T20: సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్ మాత్రం టీమిండియాదే -
APL 2022: వైజాగ్ వారియర్స్ విజృంభణ.. చేతులెత్తేసిన గోదావరి టైటాన్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో భాగంగా ఏడో మ్యాచ్లో స్పిన్నర్ల గింగిరాల బంతులకు బ్యాటర్లు చేతులెత్తేశారు. పేసర్లను చెండాడిన ఇరు జట్ల బ్యాటర్లు.. స్పిన్నర్లకే దొరికిపోయారు. వికెట్ కోల్పోకుండానే వైజాగ్ వారియర్స్ ఓపెనర్ల జోడి 29 బంతుల్లోనూ... గోదావరి టైటాన్స్ ఓపెనర్ల జోడి 30 బంతుల్లో అర్ధ సెంచరీలు నమోదు చేశాయి. టైటాన్ జట్టుకు చెందిన ఇస్మాయిల్ ఈ మ్యాచ్లో అత్యధికంగా లెగ్ బ్రేక్తో నాలుగు వికెట్లు తీయగా... వారియర్స్ జట్టుకు చెందిన ఆంజనేయులు మూడు, మల్లికార్జున రెండు వికెట్లను మణికట్టు మయాజాలంతో పడగొట్టారు. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన డే మ్యాచ్లో టాస్ గెలిచి గోదావరి టైటాన్స్ కెప్టెన్ శశికాంత్ వైజాగ్ వారియర్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించారు. వారియర్ ఓపెనర్లు అశ్విన్(43), గిరినాథ్ (44) 9.3 ఓవర్ల వరకు ఆడి 98 పరుగులు చేశారు. పేసర్లను చెండాడిన ఈ జోడి... ఇస్మాయిల్ లెగ్ బ్రేక్కి దొరికిపోయింది. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన అశ్విన్ క్లీన్ బౌల్డ్ కాగా.. ఐదు ఫోర్లు, సిక్సర్ బాదిన గిరినాథ్ కూడా ఇస్మాయిల్ బౌలింగ్లోనే వికెట్ల వెనుక వంశీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాప్ఆర్డర్లో వచ్చిన వేణు(10)ను క్లీన్ బౌల్డ్గా.. కరణ్ షిండే(8)ను లెగ్బిఫోర్గా ఇస్మాయిలే పెవిలియన్కు పంపాడు. శశికాంత్ బౌలింగ్లో నరేన్(25) డీప్ మిడ్ వికెట్లో సాత్విక్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో వైజాగ్ వారియర్స్ ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. 53 పరుగులకే ఎనిమిది వికెట్లు ధాటిగానే ఆటను ప్రారంభించిన టైటాన్స్ తొలి వికెట్కు 88 పరుగులు జోడించింది. ఓపెనర్ హేమంత్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 57 పరుగులు చేయగా మరో ఓపెనర్ వంశీకృష్ణ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. పేస్ను దీటుగా ఎదుర్కొంటున్న సమయంలో అశ్విన్ స్పిన్నర్లకు బంతిని అందించాడు. అంతే ఒక్కసారిగా ఆట తీరు మారిపోయింది. కేవలం 53 పరుగులకు టైటాన్స్ ఆటను ముగించాల్సి వచ్చింది. ఆంజనేయులు లెఫ్టార్మ్ స్పిన్తో ఆరు పరుగులే ఇచ్చి ముగ్గురిని పెవిలియన్కు పంపగా.. వేసిన నాలుగు ఓవర్లలో రెండు మేడిన్లు కావడం విశేషం. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ మల్లికార్జున రెండు వికెట్లు తీశాడు. 7.3 ఓవర్లకు 88 పరుగుల వద్ద తొలి వికెట్ పడగా 20 ఓవర్లలో 141 పరుగులకే టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 44 పరుగుల తేడాతో వారియర్స్ విజయం సాధించింది. ఇస్మాయిల్ ఎనిమిది పరుగుల(ఒక ఫోర్)తో చివరి వికెట్కు నిలవడంతో ఆలౌట్ కాకుండా టైటాన్స్ కాపాడుకోగలిగారు. సందీప్(15) రెండంకెల స్కోర్ చేయగలిగాడు. వేణు, మనోహార్ చెరో వికెట్ తీసి జట్టు విజయానికి సహకరించారు. బెస్ట్ బౌలర్, మ్యాచ్ బెస్ట్గా ఆంజనేయులు, బెస్ట్ బ్యాటర్గా హేమంత్ నిలిచారు. ఆధిక్యంలో బెజవాడ టైగర్స్ విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్లో నాలుగో రోజు మ్యాచ్లు ముగిసేప్పటికి రెండే మ్యాచ్లాడినా బెజవాడ టైగర్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడేసి మ్యాచ్లాడిన ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్ జట్లతో టైగర్స్ ఆరేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్రేట్తో ఆధిక్యంలో నిలిచింది. శనివారం మ్యాచ్లో విజయంతో కోస్టల్ రైడర్స్ నాలుగు పాయింట్లు(మూడు మ్యాచ్ల్లో) సాధించడంతో ఐదో స్థానానికి చేరుకోగా.. రెండు మ్యాచ్లాడిన వైజాగ్ వారియర్స్ నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది. తడబడిన లయన్స్ ఫ్లడ్లైట్ల వెలుతురులో కోస్టల్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర లయన్స్ కెప్టెన్ భరత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్ల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్నే ఎంచుకోగా.. అందుకు భిన్నంగా భరత్ తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్ జోడి తొలి వికెట్ను 10.3 ఓవర్ల వరకు చేజార్చుకోకుండానే 89 పరుగులు చేసింది. అర్ధసెంచరీ చేసిన భరత్ (52, నాలుగేసి ఫోర్లు, సిక్సర్లతో) శ్రీనివాస్ వేసిన బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. రెండు పరుగులు జత చేసి మరో ఓపెనర్ క్రాంతి(32) శ్రీనివాస్ వేసిన బంతిని ఆడబోయి కెప్టెన్ జ్ఞానేశ్వర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో 42 పరుగులు చేసిన లయన్స్ ఎనిమిది వికెట్లకు 133 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. ముగ్గురు రనౌట్గానే వెనుదిరిగారు. ఆఫ్బ్రేక్తో శ్రీనివాస్ మూడు వికెట్లు తీయగా స్టీఫెన్, తపస్వి చెరో వికెట్ తీశారు. రైడర్స్ దూకుడు దూకుడుగానే ఆటను ప్రారంభించిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్లు మొదటి మూడు ఓవర్లలో 37 పరుగులు రాబట్టారు. ఈ స్థితిలో షోయబ్ వేసిన తొలి బంతికి ప్రణీత్(24, నాలుగు ఫోర్లు, సిక్సర్) లెగ్బిఫోర్గా ఔటయ్యాడు. నాలుగో బంతికి కెప్టెన్ జ్ఞానేశ్వర్(11, రెండు ఫోర్లతో)ను బౌల్డ్ చేశాడు. టాప్ ఆర్డర్లో మునీష్, హర్ష నిలకడగా ఆడి స్కోర్ను 50(5.5 ఓవర్లలో) పరుగులకు చేర్చారు. టాప్ మిడిలార్డర్లో కీపర్ బ్యాటర్ లేఖజ్ 32 పరుగులతో(27 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో), తపస్వి 43 పరుగులతో (21 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) నిలిచి జట్టుకు విజయాన్నందించారు. వీరి జోడి 12.1 ఓవర్లలోనే స్కోర్ను వంద పరుగుల మార్కుకు చేర్చింది. రైడర్స్ 15 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఆఫ్బ్రేక్తో షోయబ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. వర్మ ఒక వికెట్ తీశాడు. తపస్వి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. బెస్ట్ బ్యాటర్గా భరత్, బెస్ట్ బౌలర్గా షోయబ్ఖాన్ నిలిచారు. -
APL 2022: ఏపీఎల్లో రాణిస్తున్న వైజాగ్ ఆటగాళ్లు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్.. క్రికెట్ ఆడే ప్రపంచ దేశాల్లోని ఆట గాళ్లకు ఎంతో మోజు. దేశంలో ఈ లీగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ప్రీమి యర్ లీగ్లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ స్ఫూర్తితో ఆంధ్రాలో ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) ప్రారంభమైంది. లీగ్ తొలి దశ శుక్రవారంతో ముగిసింది. లీగ్ల్లో నాలుగు ప్రాంచైజీ జట్లు రెండేసి మ్యాచ్లు ఆడాయి. రాయలసీమ కింగ్స్ మూడు మ్యాచ్లు ఆడగా వైజాగ్ వారియర్స్ ఒక మ్యాచ్నే ఆడింది. దీంతో బెజవాడ టైగర్స్తో పాటు మిగిలిన మూడు జట్లు ఆరేసి పాయింట్లు సాధించినా.. నెట్ రన్రేట్తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర లయన్స్ రెండో స్థానంలో, మూడు మ్యాచ్లాడిన రాయలసీమ కింగ్స్ మూడో స్థానంలో, గోదావరి టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. రాణిస్తున్న మన కుర్రాళ్లు ఉత్తరాంధ్ర నుంచి రెండు ప్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా సెంట్రల్ ఆంధ్ర, దక్షిణాంధ్ర నుంచి మరో రెండేసి ప్రాంచైజీలకు అర్హత కల్పించారు. ఉత్తరాంధ్ర నుంచి హోం టీమ్గా వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్లు ఆడుతున్నాయి. వైజాగ్ వారియర్స్కు విశాఖ ఆటగాళ్లు లేకున్నా.. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు కెప్టెన్గా భరత్ను, బౌలర్ అజయ్ను తీసుకుంది. అయితే అజయ్కు తొలి మ్యాచ్లో బాటింగ్ చేసే అవకాశం రాకుండానే జట్టు విజయం సాధించగా.. భరత్ అందుబాటులో లేడు. రెండో మ్యాచ్కు భరత్ అందుబాటులోకి వచ్చినా.. వర్షం అడ్డంకిగా మారి మ్యాచ్ రద్దయింది. సెంట్రల్ ఆంధ్ర నుంచి పోటీపడుతున్న రెండు జట్లకు విశాఖ కుర్రాళ్లే కెప్టెన్లుగా ముందుండి.. ఆడిన తొలి మ్యాచ్ల్లో జట్లను విజయతీరానికి చేర్చారు. బెజవాడ టైగర్స్కు అంతర్జాతీయ ఆటగాడు రికీబుయ్ ముందుండి నడపడమే కాక తొలి మ్యాచ్లో మూడో వికెట్ పడకుండానే విశాఖ కుర్రాడు అవినాష్తో కలిసి అజేయంగా ఉండి జట్టును గెలిపించాడు. బౌలర్ మనీష్ రెండు వికెట్లతో పాటు చివరి బ్యాటర్ను రనౌట్ చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్కే నిలువరించడంలో సహకరించాడు. ఇక బి.సుమంత్(21 బంతుల్లోనే రెండు ఫోర్లతో 31 పరుగులు) ఓపెనర్గా వచ్చి తొలి వికెట్కు 66 పరుగుల(లక్ష్య ఛేదనలో సగం పరుగులు) భాగస్వామ్యాన్ని అందించాడు. టాప్ ఆర్డర్లో అవినాష్, రికీబుయ్ జోడీ వికెట్ చేజారుకుండానే జట్టును గెలిపించింది. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్లో గోదావరి టైటాన్స్ను విశాఖ కుర్రాడు శశికాంత్ కెప్టెన్సీలో విజయతీరానికి చేర్చి శుభారంభం చేశాడు. టోర్నీలోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేయడమే కాక మ్యాచ్ బెస్ట్గానూ నిలిచాడు. విశాఖ కుర్రాళ్లు ఓపెనర్గా హేమంత్, టాప్ ఆర్డర్లో నితీష్(25) రాణించారు. ఇక దక్షిణాంధ్ర జట్లు కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్లో ఒక్క విశాఖ ఆటగాడికి ఆడే అవకాశం రాలేదు. అటు ఐపీఎల్లోనే కాకుండా ఏపీఎల్లో సైతం స్థానిక ఆటగాళ్లు ఇతర ప్రాంచైజీ జట్లకు ఆడుతూ విజయంలో కీలకపాత్ర పోషించడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. వరుణుడి రాకతో మ్యాచ్లు రద్దు ఏపీఎల్లో భాగంగా వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఉత్తరాంధ్ర లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెజవాడ టైగర్స్ బ్యాటింగ్కు దిగింది. ఏడు ఓవర్లలో మూడు వికెట్లకు 23 పరుగుల చేసిన స్థితిలో వరుణుడు ప్రవేశించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లకు రెండేసి పాయింట్లు చేకూరాయి. రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆడాల్సిన మ్యాచ్ సైతం వర్షం కారణంగా రద్దయింది. దీంతో గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ జట్లకు చెరో రెండేసి పాయింట్లు కేటాయించారు. (క్లిక్: విశాఖ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్!) -
APL 2022: గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్ శుభారంభం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మొదటి సీజన్ బుధవారం ప్రారంభమైంది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ను ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్చంద్ర టాస్ వేసి ప్రారంభించారు. తొలుత స్టేడియంలో ఏసీఏ, ఏపీఎల్ నిర్వాహక బృందాల సమక్షంలో విజేతలకు అందించే ట్రోఫీలను ఆయన ఆవిష్కరించారు. లీగ్ ఆరంభ మ్యాచ్లో వరుణుడు ఆగమనం చేశాడు. దీంతో ఊహించని విధంగా కోస్టల్ రైడర్స్ జట్టు రెండు పరుగుల తేడాతో మ్యాచ్ను చేజార్చుకుంది. టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్.. గోదావరి టైటాన్స్ కెప్టెన్ శశికాంత్కు బ్యాటింగ్కు ఆహ్వానించాడు. శ్రీరాం ఏపీఎల్ ఆరంభ మ్యాచ్లో సూపర్ స్ట్రయికర్గా నితీష్కుమార్, సూపర్ సిక్సర్తో జ్ఞానేశ్వర్, సూపర్ సేవర్గా విమల్ కుమార్, బెస్ట్ క్యాచర్గా గిరీష్కుమార్, బెస్ట్గా శశికాంత్ నిలిచి అతిథుల చేతుల మీదుగా అవార్డులందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాథ్రెడ్డి, సీఈవో వీరారెడ్డి, సభ్యుడు రెహ్మాన్, వై.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలా మొదలైంది.. స్టీఫెన్ వేసిన టోర్నీ తొలి బంతిని ఓపెనర్ హేమంత్ ఎదుర్కొన్నాడు. మూడో బంతికి కవర్ మీదుగా బంతిని పంపి సింగిల్ తీయడంతో గోదావరి టైటాన్స్ పరుగుల ఖాతా ప్రారంభించింది. తర్వాత రెండో బంతిని మరో ఓపెనర్ వంశీకృష్ణ లాంగాఫ్ మీదుగా తరలించడంతో తొలి బౌండరీ నమోదైంది. తొలి ఓవర్(ఆట రెండో ఓవర్) వేస్తున్న హరిశంకర్ రెండో బంతిని ఆడబోయి స్లిప్లో ఉన్న శ్రీనివాస్కు క్యాచ్ ఇచ్చి హేమంత్(1) వెనుతిరగడంతో టోర్నీలో తొలి వికెట్ నమోదైంది. తొలి నాలుగు వికెట్లను 4.4 ఓవర్లలోనే 21 పరుగుల స్కోర్కు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ శశికాంత్కు నితీష్(25) తోడై స్కోర్ను ముందుకు నడిపారు. 9.3 ఓవర్లలో 50 పరుగుల మార్కు, 18.3 ఓవర్కు వంద పరుగుల మార్కును అందుకోగలిగింది. 17.4 ఓవర్లో హరిశంకర్ వేసిన బంతిని ఆడబోయి ధీరజ్(13) హిట్ వికెటై పెవిలియన్కు చేరుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా శశికాంత్ బౌండరీకి తరలించడంతో గోదావరి టైటాన్స్ ఆరు వికెట్లకు 115 పరుగులను చేయగలిగింది. శశికాంత్(55) టోర్నీలో తొలి అర్ధ సెంచరీ నమోదు చేసి సాత్విక్(5)తో కలిసి అజేయంగా నిలిచాడు. స్టీఫెన్, హరిశంకర్, దీపక్ రెండేసి వికెట్లు తీశారు. టాస్ గెలిచారు.. మ్యాచ్ ఓడారు.. లక్ష్యం చేరుకునేందుకు కోస్టల్ రైడర్స్ ఇన్నింగ్స్ నిదానంగానే ప్రారంభించారు. శశికాంత్ వేసిన తొలి ఓవర్కు కేవలం ఒక పరుగే చేశారు. ఓపెనర్గా వచ్చిన కెప్టెన్ జ్ఞానేశ్వర్ 15 బంతులాడి 20 పరుగులే చేయగా.. మరో ఓపెనర్ ప్రణీత్ 18 బంతులాడి ఏడు పరుగులే చేశాడు. ఓపెనర్ల స్థానంలో వచ్చిన మునీష్ ఆరు బంతులాడి మూడు పరుగులే చేయగా.. తపస్వి మూడు బంతులాడి ఒక పరుగే చేశాడు. ఏడు ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసిన స్థితిలో వరుణుడు ఆగమనం చేశాడు. వర్షం కారణంగా ఆట ముందుకు సాగకపోవడంతో వీజేడీ పద్ధతిలో విజేతను నిర్ణయించేందుకు ఏడు ఓవర్లకు 35 పరుగుల టార్గెట్ విధించారు. దీంతో కోస్టల్ రైడర్స్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఏపీఎల్ ఆరంభ మ్యాచ్ వరుణుడి రాకతో ఇలా ముగిసింది. గర్జించిన ఉత్తరాంధ్ర లయన్స్ ఫ్లడ్లైట్ల వెలుతురులో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మరో మ్యాచ్ వర్షం కారణంగా.. 1.45 గంటలు ఆలస్యమైంది. దీంతో 13 ఓవర్ల ఇన్నింగ్స్గా నిర్ణయించారు. టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర లయన్స్ ఫీల్డింగ్ను ఎంచుకుని రాయలసీమ కింగ్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు అభిషేక్(30) వంశీకృష్ణ(17) జోడి ధాటిగానే బ్యాటింగ్ చేయడంతో.. 5.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా జట్టు 50 పరుగుల మార్కును చేరింది. తర్వాత రెండు పరుగులు జోడించి ఓపెనర్లు పెవిలియన్కు చేరారు. రషీద్ ఐదు నిమిషాల పాటు క్రీజ్లో ఉండి ఐదు బంతులాడి ఐదు పరుగులు చేసి వెనుతిరిగాడు. చివర్లో కీపర్ పృథ్వీ(8) ఓ భారీ సిక్స్ చేసి రనౌటయ్యాడు. కెప్టెన్ గిరినాథ్ 25 పరుగులతో నిలవగా రాయలసీమ కింగ్స్ జట్టు ఏడు వికెట్లకు 99 పరుగులు చేసింది. 100 పరుగుల లక్ష్యంతో ఉత్తరాంధ్ర లయన్స్ బరిలోకి దిగి ఓవర్ మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. ఓపెనర్లు గుల్ఫమ్ (30), క్రాంతి(10) తొలి రెండు ఓవర్లు ధాటి గానే ఆడి 21 పరుగులు చేశారు. జట్టు 50 పరుగుల మా ర్కును ఓ వికెట్ కోల్పోయి 6.5 ఓవర్లలో సాధించింది. 10 ఓవర్లు ముగిసేటప్పటికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. తరుణ్ 24 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్ అయితే ప్రపంచకప్ జట్టు నుంచి కోహ్లి అవుట్! -
ఏపీఎల్ తొలి సీజన్ షురూ.. (ఫొటోలు)
-
APL 2022: ఏపీఎల్ మొదటి సీజన్ షురూ
విశాఖ స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం ప్రపంచ క్రికెట్ ఆడే అన్ని ఫార్మాట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఆతిథ్య జట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగానూ పేరుగాంచింది. ఇప్పుడు సరికొత్త సీజన్ ఇక్క డి నుంచి ప్రారంభమవుతోంది. అదే ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్). దేశవాళీ క్రికెట్లో అన్ని తరహా మ్యాచ్లకు ఆతిథ్యమివ్వడంతో పాటు అంతర్జాతీయ టెస్ట్లు, వన్డేలు, టీ–20లు, ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్లకు హోమ్ పిచ్గా వైఎస్సార్ స్టేడియం సేవలందించింది. ఇప్పటికే ఐపీఎల్–15 సీజన్లు పూర్తయినా.. ఆంధ్రా నుంచి ఆడిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆంధ్రా క్రికెటర్లను ఆ స్థాయిలో ప్రోత్సహించేందుకు ఏపీఎల్ సిద్ధమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహాంతో.. ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర ఆధ్వర్యంలో.. బీసీసీఐ గుర్తింపుతో ఏపీఎల్ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఆంధ్రా తరపున ఆడి ప్రతిభ కనబరిచిన మేటి ఆటగాళ్లను వేలం ద్వారా ఆరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. ఈ నెల 17వ తేదీన టైటిల్ పోరు జరగనుండగా.. విజేతకు ట్రోఫీ అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతుండటం విశేషం. ఆరంభం ఇలా.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) తొలి సీజన్ టీ–20 మ్యాచ్లు షురూ అయ్యాయి. వైఎస్సార్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నపు సెషన్ మ్యాచ్ ఒంటి గంటకు ప్రారంభమైంది. రెండో మ్యాచ్ ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆరున్నరకు ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్లో కోస్టల్ రైడర్స్తో గోదావరి టైటాన్స్ తలపడగా లీగ్ చివరి మ్యాచ్లో 13న రాయలసీమ కింగ్స్తో వైజాగ్ వారియర్స్ జట్టు తలపడ్డాయి. ఇక ప్లేఆఫ్ల్లో లీగ్ 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుండగా.. 1, 2వ స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇవీ ఫ్రాంచైజీలు ఉత్తరాంధ్ర నుంచి రెండు ఫ్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా.. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టును కాయల వెంకటరెడ్డి, వైజాగ్ వారియర్స్ జట్టును సీహెచ్ తిరుమలరావు దక్కించుకున్నారు. సెంట్రల్ ఆంధ్ర నుంచి బెజవాడ టైగర్స్ను పి.వి రమణమూర్తి, గోదావరి టైటాన్స్ను పి.హరీష్బాబు, దక్షిణాంధ్ర నుంచి కోస్టల్ రైడర్స్ను ఎం.వెంకటరెడ్డి, రాయలసీమ కింగ్స్ను పి.వెంకటేశ్వర్ సొంతం చేసుకున్నారు. వీరంతా గత రెండు సీజన్లలో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రా తరఫున ప్రతిభ కనబరిచిన 20 మంది చొప్పున వేలంలో ఎంపిక చేసుకున్నారు. రంజీల్లో ఆరేళ్లుగా సత్తా చాటుతున్న 12 మందిలో ఇద్దరినీ చొప్పున జట్లకు ఐకాన్లుగా తీసుకున్నారు. వారు ఆడిన స్థాయిలను బట్టి ఆయా ఫ్రాంచైజీలు రూ.30 లక్షల వరకు వెచ్చించి ఎంపిక చేసుకున్నాయి. దేశంలో లీగ్లు ఐపీఎల్ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం పొందింది. అదే స్ఫూర్తితో దేశంలోనూ బీసీసీఐ గుర్తించిన కొన్ని లీగ్లు జరుగుతున్నాయి. 2009–10 సీజన్లోనే కర్నాటక ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇదే రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియర్ లీగ్. ప్రైజ్ పూల్గా రూ.20లక్షలు అందిస్తున్నారు. ఒకటిన్నర కోట్ల ప్రైజ్ పూల్తో ముంబయి లీగ్ 2018లో ప్రారంభించగా, అత్యధిక రూ.2.25కోట్ల ప్రైజ్పూల్తో తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2016 నుంచి కొనసాగుతోంది. ఒడిదొడుకుల్లో లీగ్లు ఒడిశా ప్రీమియర్ లీగ్ 2011లోనే ప్రారంభమైనా ఒడిదొడుకులతో నాలుగే సార్లు జరిగింది. రూ.6లక్షల ప్రైజ్ పూల్ ఇస్తోంది. సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2019లో నిర్వహించగా... కేరళ ప్రెసిడెంట్స్ కప్ 2020లో నిర్వహించారు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2009లో, తెలంగాణ ప్రీమియర్ లీగ్ 2018లో జరిగాయి. ఇక రాజపుటానా ప్రీమియర్ లీగ్, రాజ్వాడ క్రికెట్ లీగ్లు తొలి సెషన్స్లోనే మ్యాచ్ ఫిక్సింగ్ కారణాలతో సస్పెండ్ చేశారు. దీంతో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీఎల్ను విజయవంతం చేసేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కృషి చేస్తోంది. గోదావరి టైటాన్స్ గోదావరి టైటాన్స్ రూ.6.1 లక్షలతో ఆల్రౌండర్ శశికాంత్తో పాటు బ్యాటర్ నితీష్ కుమార్ను రూ.5 లక్షలతో కొనుగోలు చేసి బ్యాటింగ్లో దూకుడు చూపేందుకు సిద్ధమైంది. అనుభవజ్ఞుడు వటేకర్ కోచ్గా ఉండగా సందీప్, ధీరజ్, ఇస్మాయిల్, సాత్విక్, ఎం. వంశీకృష్ణ టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఆడారు. ఉత్తరాంధ్ర లయన్స్ ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ను రూ.6 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఆల్రౌండర్ షోయిబ్ను రూ.2లక్షలతోనే ఐకాన్గా ఎంచుకుంది. జట్టు విజయసారథి శిక్షణలో అహితేష్, క్రాంతి, తరుణ్, సుబ్రహ్మణ్యం, ప్రమో, రఫీ, సాయికౌషిక్, అజయ్ తదితరులతో ముందుకు నడవనుంది. బెజవాడ టైగర్స్ బెజవాడ టైగర్స్ జట్టు రూ.8.1 లక్షలతో బ్యాటర్ రికీబుయ్ను తీసుకున్నా.. బౌలింగ్లో మెరుపులు మెరిపించేందుకు అయ్యప్పను కేవలం రూ.లక్షన్నరకే దక్కించుకుంది. వి.అప్పారావు కోచింగ్లో సాయిరాహుల్, మహీష్, లలిత్, అఖిల్, మనీష్, సుమంత్, సాయితేజ తదితరులు ఆడనున్నారు. వైజాగ్ వారియర్స్ వైజాగ్ వారియర్స్ జట్టు బ్యాటర్ అశ్విన్ హెబ్బర్ను అత్యధికంగా రూ.8.7 లక్షలతో కొనుగోలు చేసింది. మరో ఐకాన్ ఆల్రౌండర్ నరేంద్ర రెడ్డిని రూ.4లక్షలకు చేజిక్కించుకుంది. విన్సెంట్ కోచింగ్లో ధ్రువ్, కార్తీక్, వేణు, మనోహర్, కరణ్, గిరినాథ్, సుదర్శన్, మల్లికార్జున తదితరులు జట్టుకు ఆడనున్నారు. కోస్టల్ రైడర్స్ కోస్టల్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ స్టీఫెన్ను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేయగా మరో ఐకాన్ బౌలర్ హరిశంకర్పైనే దృష్టి పెట్టి 1.6 లక్షలకు కొనుగోలు చేసింది. విజయ్కుమార్ కోచ్గా లేఖజ్, తపస్వి, జ్ఞానేశ్వర్, అషిష్, హర్షవర్ధన్, మనీష్, రవికిరణ్, విజయ్ తదితరులు జట్టుకు ఆడనున్నారు. రాయలసీమ కింగ్స్ రాయలసీమ కింగ్స్ రూ.6.1 లక్షలతో ఆల్రౌండర్ గిరినాథ్ను, ఇటీవల జూనియర్స్లో సత్తాచాటిన రషీద్ను రూ.3.5 లక్షలతో కొనుగోలు చేసి బ్యాటింగ్లో బలం సొంతం చేసుకుంది. శ్రీనివాస్ కోచ్గా దుర్గాకుమార్, ప్రశాంత్, వంశీకృష్ణ, సంతోష్, అభిషేక్ ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్లో ఆడారు. (క్లిక్: విశాఖ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్!)