Australia tour
-
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.భారత్తో సిరీస్లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్ను హోస్ట్ చేసింది. డార్విన్లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్ల తర్వాత ఆసీస్ భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్తో సిరీస్ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్లతో టీ20 సిరీస్లను ప్లాన్ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్బోర్న్నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
హర్మన్ప్రీత్ సారథ్యంలో....
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆధ్వర్యంలో భువనేశ్వర్లో 28 మంది ఆటగాళ్లతో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ జాబితా నుంచి రబిచంద్ర సింగ్ను తప్పించి మిగతా 27 మందితో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా, హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్గా కొనసాగుతారు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు పెర్త్ వేదికగా ఏప్రిల్ 1, 6, 7, 10, 12, 13వ తేదీల్లో ఆస్ట్రేలియా జట్టుతో ఐదు మ్యాచ్లు ఆడుతుంది. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేశ్, కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్కీపర్లు); హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్, సంజయ్, సుమిత్, అమీర్ అలీ (డిఫెండర్లు); మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రాజ్కుమార్ పాల్ (మిడ్ ఫీల్డర్లు); ఆకాశ్దీప్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, గుర్జంత్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, బాబీ సింగ్ ధామి (ఫార్వర్డ్స్). -
PAK Tour Of AUS: డబుల్ సెంచరీతో చెలరేగిన పాక్ కొత్త కెప్టెన్
నూతనంగా ఎంపిక చేయబడిన పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ కెప్టెన్గా ఎంపికైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే అజేయ డబుల్ సెంచరీతో (201) చెలరేగాడు. మూడు టెస్ట్ మ్యాచ్ల ఆసీస్ పర్యటనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్తో నిన్న (డిసెంబర్ 6) మొదలైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్లో మసూద్ కెప్టెన్స్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మసూద్తో పాటు అబ్దుల్లా షఫీక్ (38), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (40), సర్ఫరాజ్ అహ్మద్ (41) ఓ మోస్తరుగా రాణించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హాక్ (9), సౌద్ షకీల్ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ బౌలర్లలో జోర్డన్ బకింగ్హమ్ 5 వికెట్లతో విజృంభించగా.. స్టీకిటీ, మెక్ ఆండ్రూ, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం డిసెంబర్ 14 నుంచి 18 వరకు పెర్త్లో తొలి టెస్ట్ జరుగుతుంది. డిసెంబర్ 26-30 వరకు మెల్బోర్న్లో రెండో టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సెమీస్కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అనంతర పరిణామాల్లో టెస్ట్ జట్టుకు షాన్ మసూద్, టీ20 జట్టుకు షాహీన్ అఫ్రిది కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. పాక్ క్రికెట్ బోర్డు టీ20లకు కెప్టెన్ను ప్రకటించాల్సి ఉంది. -
ఆసీస్లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గుణతిలకపై అత్యాచారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సిడ్నీ పోలీసులు వెల్లడించారు. దీంతో సూపర్–12లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే ఆదివారం స్వదేశానికి పయనమైంది. ఆన్లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన లంక క్రికెటర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో ఒక్క నమీబియాతో ఆడిన గుణతిలక గాయం కారణంగా ఇతర మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టి20లు ఆడిన గుణతిలక వివాదాస్పద క్రికెటర్గా ముద్రపడ్డాడు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రెయినింగ్ సెషన్కు చెప్పాపెట్టకుండా గైర్హాజరు కావడంతో 6 వన్డేల సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడంతో ఆరు నెలలు నిషేధం విధించారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ బయటకు రావడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసి చివరకు ఆరు నెలలకు తగ్గించారు. -
మునుగోడు ఉపఎన్నిక పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
సూర్యకుమార్ ‘ప్రాక్టీస్’
పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితులకు అలవాటు పడేందుకు అన్ని జట్లకంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత్ తమ సన్నాహాలను సంతృప్తిగా మొదలు పెట్టింది. మూడు రోజుల సాధన అనంతరం సోమవారం మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా తొలి పోరులో విజయం సాధించింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. ఇతర బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (27; 1 ఫోర్, 1 సిక్స్), దీపక్ హుడా (22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... రోహిత్ (3), ఓపెనర్గా ఆడిన పంత్ (9) విఫలమయ్యారు. అనంతరం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్‡్షదీప్ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... చహల్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు. -
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
ICC T20 World Cup: ‘ఆల్ ది బెస్ట్’
ముంబై: భారత క్రికెట్ అభిమానుల ఆశలు మోస్తూ టి20 ప్రపంచ కప్ వేటలో టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని బృందం గురువారం ముంబైనుంచి బయల్దేరి వెళ్లింది. 14 మంది జట్టు సభ్యులతో పాటు మరో 16 మంది సహాయక సిబ్బంది కూడా టీమ్తో ఉన్నారు. వరల్డ్కప్లోని ఇతర జట్లతో పోలిస్తే భారత్ చాలా ముందుగా ఆసీస్ గడ్డపై అడుగు పెడుతోంది. మెగా టోర్నీకి ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్కు దూరమైన దీపక్ హుడా పూర్తిగా కోలుకొని జట్టుతో చేరాడు. మరో వైపు బుమ్రా స్థానంలో ఇంకా ఎవరినీ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో 14 మందే ఆసీస్కు వెళ్లారు. పెర్త్లో జట్టుకు వారం రోజుల పాటు కండిషనింగ్ క్యాంప్ జరుగుతుంది. -
ఆస్ట్రేలియా గడ్డ మీద జింబాబ్వే సరికొత్త చరిత్ర.. తొలిసారిగా
టాన్స్విల్లే వేదికగా జరిగిన మూడో వన్డేల్లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి పర్యటక జట్టు తప్పించుకుంది. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఆస్ట్రేలియా 141 పరుగులకే జింబాబ్వే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్ ర్యాన్ బర్ల్ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(94) మినహా మిగితా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. కాగా అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ రెగిస్ చకబ్వా (37 నటౌట్), ఓపెనర్ తాడివానాషే మారుమని (35) పరుగులతో రాణించారు. 8 ఏళ్ల తర్వాత తొలి విజయం 8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై తొలి విజయాన్ని జింబాబ్వే నమోదు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వేకు ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. ఇక ఓవరాల్గా ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వేకు ఇది మూడో విజయం కావడం విశేషం. తొలి సారిగా 1983 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. అనంతరం 2014లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయ భేరి మోగించింది. చదవండి: AUS vs ZIM: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా..! -
24 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ గడ్డపై సిరీస్
పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా 24 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి సిరీస్ ఆడనుంది. వచ్చే మార్చి- ఏప్రిల్ నెలలో పాకిస్తాన్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఒప్పందం చేసుకున్నాయి. వాస్తవానికి గతేడాది నవంబర్లోనే ఈ సిరీస్ జరగాల్సి ఉన్నప్పటికి సెక్యురిటీ కారణాల రిత్యా ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకుంది. చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్ కాగా తొలుత టెస్టు సిరీస్తో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన టి20 మ్యాచ్తో ముగుస్తుంది. తొలి టెస్టు రావల్పిండి.. రెండో టెస్టు కరాచీ.. మూడో టెస్టు లాహోర్ వేదికగా జరగనుంది. మూడు వన్డేలు సహా ఏకైక టి20 మ్యాచ్ రావల్పిండి వేదికగానే నిర్వహించనున్నారు. కాగా మార్క్ టేలర్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు చివరిసారిగా 1998లో పాకిస్తాన్లో పర్యటించింది. అప్పట్లో పాక్ గడ్డపై మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా ఇటీవలే ఇంగ్లండ్తో ముగిసిన యాషెస్ సిరీస్ను 4-0తో గెలుచుకొని సూపర్ ఫామ్లో ఉంది. చదవండి: Under-19 World Cup: అప్పుడు కుర్రాళ్లు.. ఇప్పుడు సూపర్స్టార్లు ఆస్ట్రేలియా టూర్ ఆప్ పాకిస్తాన్: మార్చి 4-8: తొలి టెస్టు, రావల్పిండి మార్చి 12-16: రెండో టెస్టు, కరాచీ మార్చి 21-25: మూడో టెస్టు, లాహోర్ మార్చి 29: తొలి వన్డే, రావల్పిండి మార్చి 31: రెండో వన్డే,రావల్పిండి ఏప్రిల్ 2: మూడో వన్డే, రావల్పిండి ఏప్రిల్ 5: ఏకైక టి20 మ్యాచ్, రావల్పిండి -
తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్ రికార్డు విజయం
మెక్కే: 3 వన్డేల సిరీస్లో భాగంగా హారప్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేయగా.. ఆసీస్ మహిళా జట్టు మరో 9 ఓవర్లు మిగిలుండగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఓపెనింగ్ బ్యాటర్ రేచల్ హేన్స్ 93 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. మరో ఓపెనర్ అలైసా హీలీ (77 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (69 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేయగా.. యస్తికా భాటియా (51 బంతుల్లో 35; 2 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), గోస్వామి (24 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్(4/33), మోలినెక్స్(2/ 39), డిర్లింగ్టన్(2/29) మిథాలీ సేనను దారుణంగా దెబ్బకొట్టారు. 4 వికెట్లతో చెలరేగిన డార్సీ బ్రౌన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 24న) జరుగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్తో పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా వరుసగా 25వ విజయం సాధించి విజయాల పరంపరను కొనసాగించింది. మరోవైపు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్లో 20 వేల పరుగులు పూర్తిచేసుకుంది. ఈ మ్యాచ్లో 63 పరుగులు చేసిన మిథాలీకి వన్డేల్లో ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు ఇన్నింగ్స్ల్లో ఆమె 75 నాటౌట్, 59, 72, 79 పరుగులు చేసింది. చదవండి: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు.. -
ఆసీస్తో చారిత్రక సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా వసీఖ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. తాలిబన్లు అఫ్గాన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతకాలు కానీ అంతరాయాలు కానీ ఉండబోవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం నవంబరులో జరగాల్సిన ఆసీస్ పర్యటన యధావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అఫ్గాన్ జట్టు నవంబర్ 27న ఆసీస్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో తలపడబోతుంది. హోబర్ట్ వేదికగా జరిగే ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సైతం ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే, అఫ్గాన్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వరుస ట్వీట్ల ద్వారా తన ఆవేదనను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని ఆయన చేసిన ట్వీట్లపై తాలిబన్లు ఏరకంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడతారని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది. చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
సెప్టెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్నాక భారత మహిళల క్రికెట్ జట్టు మరో విదేశీ పర్యటనకు సిద్ధం కానుంది. సెప్టెంబర్లో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడేందుకు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించకపోయినా... ఆస్ట్రేలియా మహిళల జట్టు పేస్ బౌలర్ మేగన్ షూట్ ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ‘సెప్టెంబర్ రెండో వారంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కు ముందు ఆసీస్ జట్టుకు డార్విన్లో శిక్షణ శిబిరం ఉంది. భారత్తో సిరీస్ తర్వాత బిగ్బాస్ లీగ్, మహిళల నేషనల్ క్రికెట్ లీగ్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్కప్, కామన్వెల్త్ గేమ్స్లతో ఆస్ట్రేలియా క్రికెటర్లు బిజీబిజీగా ఉండనున్నారు’ అని మేగన్ షూట్ తెలిపింది. 28 ఏళ్ల మేగన్ ఆస్ట్రేలియా తరఫున 65 వన్డేలు ఆడి 99 వికెట్లు... 73 టి20 మ్యాచ్లు ఆడి 96 వికెట్లు తీసింది. వాస్తవానికి భారత మహిళల జట్టు వన్డే వరల్డ్కప్ టోర్నీకి సన్నాహకంగా ఈ ఏడాది జనవరిలోనే ఆస్ట్రేలియాలో పర్యటించాల్సింది. అయితే కరోనా కారణంగా భారత పర్యటన వాయిదా పడింది. -
అలా అయితే నాల్గో టెస్టు వాకౌట్ చేస్తాం
అంతా సాఫీగా, ఆత్మీయంగా సాగిపోతే... ఏదో ఒక రచ్చ లేకపోతే అది భారత్–ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ఎలా అవుతుంది? ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న పర్యటనలో అనూహ్యంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హోటల్లో భోజనం కారణంగా ‘ఐసోలేషన్’తో మొదలైన చర్చ తర్వాతి రోజు భారత జట్టు నాలుగో టెస్టును బాయ్కాట్ చేయడం వరకు చేరింది! కరోనా నేపథ్యంలో బ్రిస్బేన్లో మళ్లీ కఠిన ఆంక్షల మధ్య ఆడాల్సి వస్తుండటం టీమిండియా అసంతృప్తికి కారణం. మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెటర్లు సుమారు రెండు నెలల పాటు బయో బబుల్లోనే ఐపీఎల్ ఆడారు. ఇక్కడికి చేరుకోగానే రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టారు. 3 వన్డేలు, 3 టి20లు, 2 టెస్టులు కూడా జరిగిపోయాయి. జనవరి 7 నుంచి జరిగే మూడో టెస్టుకు క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఆపై మరో మ్యాచ్ ఆడితే స్వదేశం తిరిగి వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఒక్క మ్యాచ్ కోసమే మళ్లీ కఠిన కరోనా ఆంక్షలు పాటించాల్సి వస్తే..! ఇదే ఇప్పుడు జట్టు ఆటగాళ్లను అసహనానికి గురి చేస్తోంది. అవసరమైతే చివరి టెస్టు ఆడకుండానే వెళ్లిపోతామని కూడా వారు చెబుతున్నారు. హోటల్ గది... గ్రౌండ్... హోటల్... షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్లాండ్లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మూడో టెస్టు వేదిక అయిన సిడ్నీలో కూడా కేసులు ఎక్కువగా ఉండటంతో క్వీన్స్లాండ్ రాష్ట్రం ఇప్పటికే సిడ్నీకి వెళ్లే సరిహద్దులు మూసేసి రాకపోకలపై నిషేధం విధించింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఇచ్చిన మాట ప్రకారం ఆటగాళ్లు తమ నగరానికి వచ్చి టెస్టు ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే సిడ్నీ నుంచి వచ్చేవారి విషయంలో ఎలాంటి కరోనా ఆంక్షలు విధిస్తారో అనే విషయంపై స్పష్టత లేదు. ఇంకా చెప్పాలంటే బ్రిస్బేన్లో అడుగు పెట్టాలంటే సిడ్నీ నుంచి ఆంక్షలు పాటిస్తూ రావాల్సి రావచ్చు. ఇక్కడే మన ఆటగాళ్లు భయపడుతున్నారు. అయితే మరోసారి పూర్తిగా హోటల్ రూమ్కే పరిమితమైపోయే క్వారంటైన్కు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టంగా చెప్పేశారు. ‘ప్రస్తుత పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. ఈ పర్యటన విషయంలో సీఏ, బీసీసీఐ కలిసి బాగా పని చేశాయి. మేం కూడా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆస్ట్రేలియా పర్యటించేందుకు సిద్ధమయ్యాం. అయితే మేం ఒకసారి ఇక్కడికి రాగానే క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా సాధారణ ఆ స్ట్రేలియా పౌరుల్లాగానే చూడాలి. ఐపీఎల్ నుంచి మేం బబుల్లోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా బ్రిస్బేన్లో మరో బబుల్ అంటే మా వల్ల కాదు. అవకాశం ఉంటే చివరి టెస్టు కూడా సిడ్నీలోనే నిర్వహించాలి. లేదంటే మేం చివరి టెస్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడం’ అని భారత క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే చివరి టెస్టుకు మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతానికి టీమ్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది. మేం బ్రిస్బేన్లోనే ఆడతాం... ఒకే వేదికపై వరుసగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధంగా లేము. సిరీస్ ఆరంభానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కట్టుబడి ఉంది. మా వైపు నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు లేదు. మేం బ్రిస్బేన్లో ఆడేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. అక్కడ కఠినమైన ఆంక్షలు, బయో బబుల్ ఉండవచ్చు కూడా. అయితే అన్నింటినీ మేం పాటిస్తాం. హోటల్ నుంచి మైదానానికి మాత్రమే వెళ్లి వచ్చే అనుమతి ఉంటే తప్పేముంది. అలాగే చేద్దాం. –మాథ్యూ వేడ్ భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దు. ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. –రాస్ బేట్స్, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు (షాడో మినిస్టర్) అంతా కలిసి సిడ్నీకి... మూడో టెస్టు కోసం భారత జట్టు మొత్తం నేడు ప్రత్యేక విమానంలో సిడ్నీకి వెళుతుంది. బయో సెక్యూరిటీ బబుల్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘ఐసోలేషన్’లోకి వెళ్లిన ఐదుగురు ఆటగాళ్లు రోహిత్, పంత్, పృథ్వీ, గిల్, సైనీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా జట్టుతో పాటే ప్రయాణిస్తారు. హోటల్ ఘటనపై సీఏ విచారణ కొనసాగిస్తున్నా... సహచరులతో వెళ్లే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాకు తెలిసి ఆటగాళ్లపై ఎలాంటి చర్యా ఉండదు. ఆ అభిమాని తనను పంత్ హత్తుకున్నాడని అబద్ధం చెప్పి ఉండకపోతే పరిస్థితి అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. ఏదో బయట వర్షం పడుతుంటే క్రికెటర్లంతా లోపలికి వెళ్లారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా అతను వీడియో తీశాడు. పైగా ఎవరూ అడగకపోయినా బిల్లు చెల్లించి ప్రచారం కోసం సోషల్ మీడియాలో పెట్టాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సదరు ఘటన విషయంలో టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీశ్ డోంగ్రీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లు ఒక జాబితా పట్టుకొని తిరగరు. ఇవన్నీ చూసుకోవాల్సింది మేనేజర్ మాత్రమే. ఈ విషయంలో అతను తప్పు చేసినట్లు అనిపిస్తోంది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. -
నాన్నకు బాగా లేకపోవడం వల్లే...
ముంబై: రోహిత్ శర్మ తన సహరులతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లకపోవడానికి ఫిట్నెస్ సమస్య కారణం కాదని బీసీసీఐ కొత్తగా తేల్చి చెప్పింది. రోహిత్ విషయంలో వరుస వివాదాలు, కోహ్లి వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు బోర్డు ఇచ్చిన వివరణ ఆసక్తకరంగా మారింది. ‘తన తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్ ఐపీఎల్ తర్వాత నేరుగా ముంబైకి వచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకున్నారు కాబట్టి రోహిత్ ఎన్సీఏకు వెళ్లి తన రీహాబిలిటేషన్ను ప్రారంభించాడు’ అని బోర్డు స్పష్టం చేసింది. డిసెంబర్ 11న రోహిత్ ఫిట్నెస్ను మరోసారి సమీక్షిస్తామని పేర్కొంది. ఇషాంత్ పూర్తిగా దూరం... గాయంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఇషాంత్ శర్మ మిగిలిన రెండు టెస్టులనుంచి కూడా తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పక్కటెముకల గాయంనుంచి పూర్తిగా కోలుకున్నా...టెస్టు మ్యాచ్లు ఆడే ఫిట్నెస్ స్థాయిని అతను ఇంకా అందుకోలేదని బోర్డు వెల్లడించింది. -
భారత్ వెళ్లేందుకు బోర్డు అవకాశం ఇచ్చినా...
ముంబై: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ను హైదరాబాద్ పంపించేందుకు బీసీసీఐ సన్నద్ధమైనా... అతను అంగీకరించలేదు. టూర్ మధ్యలో వెనక్కి రాకుండా సిడ్నీలోనే ఉండిపోవాలని అతను నిర్ణయించుకున్నాడని బోర్డు వెల్లడించింది. ‘తండ్రి మరణవార్త అనంతరం సిరాజ్తో బీసీసీఐ అధికారులు మాట్లాడారు. ఇలాంటి బాధాకర సమయంలో కుటుంబంతో ఉండే విధంగా భారత్కు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే అతను హైదరాబాద్కు వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. జట్టుతోపాటు ప్రాక్టీస్ కొనసాగిస్తానని సిరాజ్ అన్నాడు. అతని బాధను పంచుకుంటూ బోర్డు ఈ స్థితిలో సిరాజ్కు అండగా నిలుస్తుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు సిరాజ్కు ధైర్యం చెబుతూ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘ఈ బాధను అధిగమించే శక్తి అతనికిప్పుడు కావాలి. ఆసీస్ పర్యటనలో అతను రాణించాలని కోరుకుంటున్నా. అతని మనోధైర్యానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశాడు. భారత్ తరఫున 1 వన్డే, 3 టి20లు ఆడిన సిరాజ్ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఆసీస్ పర్యటనలో అతను టెస్టు సిరీస్కు మాత్రమే ఎంపికయ్యాడు. -
వంద శాతం ఫిట్గా మారేందుకే..
భారత క్రికెట్కు సంబంధించి ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసిన అంశం రోహిత్ శర్మ ఫిట్నెస్... ఐపీఎల్ జరుగుతున్నప్పుడు అతను గాయపడి నాలుగు మ్యాచ్లకు దూరం కావడం... ఫిట్గా లేడంటూ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం...ఆపై పూర్తిగా కోలుకోకుండానే రోహిత్ బరిలోకి దిగడం... గంగూలీ హెచ్చరిక, రవిశాస్త్రి వ్యాఖ్య... మళ్లీ టెస్టు జట్టులో చోటు... ఇలా ఎక్కడా అతని గాయంపై స్పష్టత లేకుండా వ్యవహారం సాగింది. చివరకు జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ) చేరుకున్న రోహిత్... తొలిసారి తన గాయం తీవ్రతపై పెదవి విప్పాడు. వంద శాతం ఫిట్గా మారేందుకే ఆస్ట్రేలియా వన్డే, టి20లకు దూరమైనట్లు వెల్లడించిన అతను... తన గాయం వివాదంగా మారడం పట్ల అసంతృప్తిని ప్రదర్శించాడు. బెంగళూరు: ఐపీఎల్లో తాను కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ విషయాన్ని అటు బీసీసీఐకి, ఇటు ముంబై ఇండియన్స్కు స్పష్టంగా తెలియజేసినట్లు భారత స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ అంశంపై బయటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అతను చెప్పాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఆ సమయంలో బయట అసలు ఏం జరుగుతుందో, అందరూ దేని గురించి చర్చించుకుంటున్నారో కూడా నాకు తెలీదు. నేను బీసీసీఐ, ముంబై ఇండియన్స్కి గాయం గురించి స్పష్టంగా వివరించాను. గాయమైన తర్వాత నేను తర్వాతి మ్యాచ్లు ఆడగలనా లేదా అని ఆలోచించాను. అయితే మైదానంలో దిగితే తప్ప దాని తీవ్రత తెలీదు. టి20 ఫార్మాట్లో ఎక్కువగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆడగలనంటూ ముంబై యాజమాన్యానికి చెప్పాను. ప్రతీ రోజూ ఫిట్నెస్ మెరుగవుతుండటంతో మళ్లీ బరిలోకి దిగాను. బాగుంటేనే ప్లే ఆఫ్స్ ఆడతానని, లేదంటే తప్పుకుంటానని కూడా వారికి స్పష్టం చేశాను. నా గాయం గురించి, ప్లే ఆఫ్స్లో ఆడటం, ఆస్ట్రేలియాకు వెళ్లడం గురించి ఫలానా వ్యక్తి ఫలానా మాట అన్నాడు అంటే నేను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రోహిత్ శర్మ వివరించాడు. ముందు జాగ్రత్త కోసమే... కండరాల గాయం నుంచి తాను చాలా వరకు కోలుకున్నా... మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని రోహిత్ వెల్లడించాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే ఆస్ట్రేలియాకు వెళ్లి టెస్టులు ఆడతానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడు నా గాయం తీవ్రత చాలా వరకు తగ్గింది. అయితే మరింత ఫిట్గా మారేందుకు ప్రయత్నిస్తున్నా. టెస్టు ఫార్మాట్లో ఆడాలంటే నా వైపు నుంచి ఎలాంటి లోపం ఉండకూడదని భావించే ఇప్పుడు ఎన్సీఏకు వచ్చా. పూర్తిగా మెరుగయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే 11 రోజుల వ్యవధిలో 6 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న వన్డే, టి20 సిరీస్ల కోసం తొందరపడలేదు. మరో 25 రోజులు నేను శ్రమిస్తే టెస్టులు ఆడగలనని నమ్ముతున్నా. ఇది చాలా సులువైన నిర్ణయం. బయటివారికి ఇది ఎందుకు అంత కష్టంగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు’ అని రోహిత్ చెప్పాడు. ఒక్కసారిగా ఫలితాలు రావు... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఐదోసారి విజేతగా నిలవడంపై ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉందని, పేరున్న కొందరు ఆటగాళ్లు ఉండటం వల్లే విజయాలు దక్కవని రోహిత్ వ్యాఖ్యానించాడు. ప్రతీ చిన్న లోపాన్ని గుర్తించి సన్నాహాలు మొదలు పెట్టామని అతను పేర్కొన్నాడు. ‘మరో జట్టుతో రోహిత్ ఇలాంటి ఫలితాలు సాధించేవాడా అని కొందరు అడుగుతున్నారు. అసలు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి. ఎందుకు సాధించి చూపించాలి. మా ఫ్రాంచైజీ ఆలోచనల ప్రకారమే నేను ఆటగాడిగా, కెప్టెన్గా కావాల్సిన పనితీరును ప్రదర్శించా. ఒక్క రాత్రికి ఫలితాలు రాలేదు. పొలార్డ్, బుమ్రా, హార్దిక్ పాండ్యాలాంటి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారనే మాటను అంగీకరిస్తా. అయితే 2011లో నాతో సహా అందరూ వేలంలో అందుబాటులో ఉన్నారు కదా. కానీ ముంబై మమ్మల్ని ఎంచుకుంది. మాపై నమ్మకముంచి జట్టును తీర్చి దిద్దుకుంది. ఇష్టమున్నట్లు ఆటగాళ్లను మార్చేయలేదు. బౌల్ట్ గత ఏడాది ఢిల్లీకి, అంతకుముందు సన్రైజర్స్కు కూడా ఆడాడు కదా. ఆరంభంలోనే బంతిని స్వింగ్ చేసి వికెట్లు తీయగల బౌలర్ మాకు అవసరం ఉందని భావించాం. అందుకే ఢిల్లీతో గట్టిగా పట్టుబట్టి బౌల్ట్ను తీసుకున్నాం. ఆపై అతను సత్తా చాటాడు. నా మనసుకు సరైంది అనిపించేది చేయడమే నా విజయ రహస్యం’ అని రోహిత్ విశ్లేషించాడు. -
ఇటు ఇషాంత్... అటు సాహా!
బెంగళూరు/సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి నెల రోజుల ముందే భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త. జట్టులోని ఇద్దరు కీలక సభ్యులు పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయాల నుంచి కోలుకుంటున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న ఇషాంత్ శర్మ బుధవారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధన చేయగా... సిడ్నీలో సాహా తొలిసారి ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఇషాంత్ శర్మ పూర్తి ఫిట్గా ఉంటే అతను వెంటనే ఆస్ట్రేలియా బయల్దేరతాడు. ద్రవిడ్, సునీల్ జోషి సమక్షంలో... ఐపీఎల్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం ఇషాంత్ పొత్తికడుపు కండరాల గాయంతో తప్పుకున్నాడు. ఆ తర్వాతి నుంచి అతను ఎన్సీఏలోనే ఉంటూ గాయానికి చికిత్స పొందుతున్నాడు. ఫిట్గా మారితే నవంబర్ 18 నుంచి ఇషాంత్ బౌలింగ్ చేయవచ్చని ఎన్సీఏ గతంలోనే బీసీసీఐకి సమాచారం అందించింది. బోర్డు వైద్యులు, ట్రయినర్ పర్యవేక్షణలో కోలుకున్న అనంతరం బుధవారం అతను మైదానంలోకి దిగాడు. రెండు వేర్వేరు స్పెల్లలో కలిపి సుమారు రెండు గంటల పాటు ఇషాంత్ బౌలింగ్ చేశాడు. అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి అక్కడే ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్ను భారత అండర్–19 జట్టు కోచ్, మాజీ పేసర్ పారస్ మాంబ్రే పర్యవేక్షించాడు. పూర్తి రనప్, వేగంతో ఇషాంత్ బౌలింగ్ చేశాడని, ఎక్కడా కొంచెం కూడా అతను ఇబ్బంది పడలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. బ్యాటింగ్ ప్రాక్టీస్... ఐపీఎల్లో కండరాల గాయంతో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సాహా... ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడలేకపోయాడు. అయితే జట్టుతో పాటు అతనూ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. బుధవారం సాహా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూస్తే అతను గాయం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తోంది. త్రోడౌన్ స్పెషలిస్ట్లు నువాన్ సెనెవిరత్నే, దయానంద గరాని నెట్స్లో విసిరిన బంతులను సాహా ఎదుర్కొన్నాడు. రెండు టి20లకు బుమ్రా, షమీ దూరం! ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ కోసం భారత ప్రధాన పేసర్లు షమీ, బుమ్రాలకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. డిసెంబర్ 11 నుంచి గులాబీ బంతితో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రధాన జట్టు మొత్తం బరిలోకి దిగే అవకాశం ఉండగా... అంతకుముందు డిసెంబర్ 6 నుంచి జరిగే తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా షమీ, బుమ్రా ఆడాలని జట్టు కోరుకుంటోంది. అయితే 6, 8 తేదీల్లో ఆసీస్తో భారత్ రెండు టి20లు మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టి20లనుంచి తప్పించైనా సరే... ప్రాక్టీస్ మ్యాచ్ ఆడించడంపైనే జట్టు ఎక్కువ దృష్టి పెట్టింది. మూడు వన్డేలు, తొలి టి20 తర్వాత ఈ ఇద్దరు పేసర్లు టెస్టు సిరీస్ కోసమే సిద్ధం కావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే జరిగితే చివరి రెండు టి20ల్లో చహర్, నటరాజన్, సైనీ బరిలోకి దిగే అవకాశం ఉంది. -
‘మాస్టర్... అతని విద్యార్థి’
సిడ్నీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు సరిగ్గా నెల రోజుల సమయముంది. దానికి ముందు టీమిండియా వన్డే, టి20 సిరీస్లు ఆడాల్సి ఉంది. అయితే టెస్టులకు ఉన్న ప్రాధాన్యత వల్ల కావచ్చు అప్పుడే వాటి కోసం మన ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. పైగా ఐపీఎల్ కారణంగా ఇప్పటి వరకు మన ఆటగాళ్లంతా తెల్ల బంతితో సాధన చేస్తూనే వచ్చారు. భారత జట్టు ప్రాక్టీస్కు సంబంధించి బీసీసీఐ మంగళవారం ఒక వీడియోను పోస్ట్ చేసింది. జట్టు టాప్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు మరో పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఎరుపు, గులాబీ బంతులతో బౌలింగ్ చేయడం ఇందులో కనిపించింది. వీరిద్దరు కెప్టెన్ కోహ్లి, కేఎల్ రాహుల్ సహా ఇతర బ్యాట్స్మెన్కు సుదీర్ఘ సమయం పాటు బౌలింగ్ చేశారు. ‘మాస్టర్... అతని విద్యార్థి’ అంటూ షమీ, సిరాజ్ల బౌలింగ్పై బీసీసీఐ వ్యాఖ్య జోడించింది. కోహ్లి కూడా ‘టెస్టు క్రికెట్ ప్రాక్టీస్ సెషన్లను ఇష్టపడతాను’ అంటూ కామెంట్ చేయడం టీమిండియా సన్నాహాల గురించి చెబుతోంది. ఈ టూర్లో భాగంగా భారత్ ఈ నెల 27న ఆస్ట్రేలియాతో తొలివన్డే ఆడుతుంది. (చదవండి: మారిపోనున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు) The master and his apprentice When @MdShami11 and Siraj bowled in tandem at #TeamIndia's nets. Fast and accurate! 🔥🔥 pic.twitter.com/kt624gXp6V — BCCI (@BCCI) November 17, 2020 Love test cricket practice sessions ❤️💙 pic.twitter.com/XPNad3YapF — Virat Kohli (@imVkohli) November 17, 2020 -
‘పుజారా.. ఈసారి అంత ఈజీ కాదు’
మెల్బోర్న్: ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పుజారాకు సవాల్ తప్పదని అంటున్నాడు ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్. గతంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్నుకైవసం చేసుకుని చరిత్ర సృష్టంచగా అందులో పుజారా ప్రధాన భూమిక పోషించాడు. కాగా, ఇప్పుడు మాత్రం పుజారాకు తమ బౌలర్లు ఆ చాన్స్ ఇవ్వరని మెక్గ్రాత్ ధీమా వ్యక్తం చేశాడు. ఒక స్పోర్ట్స్ చానల్తో మాట్లాడిన మెక్గ్రాత్.. ‘పుజారా టీమిండియా బ్యాటింగ్లో కీలక ఆటగాడు. నిలకడైన బ్యాటింగ్తో క్రీజ్లో పాతుకుపోతాడు. పరుగులు చేయనప్పుడు ఒత్తిడిని అనుభవించడు. ఆధునిక యుగంలో ఇది ప్రత్యేకమైనది, ఇక్కడ ఒక తొలి ఓవర్ తర్వాత పరుగులు చేయాలనుకునే బ్యాట్స్ మెన్ ఉన్నారు. పుజారాకు ఆ మనస్తత్వం లేదు. (ఇక్కడ చదవండి: చరిత్రను రిపీట్ చేస్తాం: పుజారా) ఇది చివరిసారి అతనికి సహాయపడింది అని మెక్గ్రాత్ అన్నాడు. అతను ఈ మధ్య కాలంలో క్రికెట్ ప్రాక్టీస్ చేయలేదు, ఇది పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది. అతను ఏ క్రికెట్ ఆడలేదు కాబట్టి అతను చివరి సిరీస్ కంటే కష్టపడాల్సి ఉంటుంది.ఈసారి పుజారాకు అతి పెద్ద చాలెంజ్ తప్పదు’ అని అన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా , 521 పరుగులతో మొత్తం 74.42 సగటుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రావడం కూడా ఆసీస్కు కలిసి వస్తుందని మెక్గ్రాత్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి జట్టులో లేకపోతే అది కచ్చితంగా సిరీస్పై ప్రభావం చూపిస్తుందన్నాడు. -
టీమిండియా ప్రాక్టీస్ షురూ
సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో సుదీర్ఘ సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఐపీఎల్ ముగిశాక దుబాయ్ నుంచి నేరుగా సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరి ఫలితాలు నెగెటివ్గా రావడంతో ఆటగాళ్లు అవుట్డోర్ ప్రాక్టీస్ను ప్రారంభించారు. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీస్లో, జిమ్లో చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా పంచుకుంది. సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలో హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్, పేసర్లు ఉమేశ్ యాదవ్, సిరాజ్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ వార్మప్ చేస్తూ జాలీగా కనిపించారు. టీమిండియా కొత్త ఆటగాళ్లు నటరాజన్, దీపక్ చహర్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మూడు ఫార్మాట్లకు (టెస్టు, వన్డే, టి20) చెందిన భారత ఆటగాళ్లందరూ ఒకేసారి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆదివారం నెట్ ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగింది. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన ఎడంచేతి వాటం పేసర్ నటరాజన్ తెల్లబంతులతో టాపార్డర్ బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేశాడు. పుజారా, కోహ్లి క్యాచింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డే మ్యాచ్తో ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆసీస్తో భారత్ 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు ఆడనుంది. -
కోహ్లి లేకపోతే టీమిండియాకు కష్టమే
మెల్బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీ ఆ జట్టుపై పెను ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అయితే తండ్రి కాబోతున్న సమయంలో సెలవు తీసుకోవాలనే అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చే నెలలో ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదలవుతుంది. నాలుగు టెస్టుల పూర్తి స్థాయి సిరీస్లో కోహ్లి కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ డెలివరీ కోసం అతను స్వదేశానికి పయనమవుతాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ హెడ్కోచ్ లాంగర్ మాట్లాడుతూ ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు కోహ్లి. ఒక్క బ్యాటింగ్లోనే కాదు... శక్తిసామర్థ్యాలు, క్రికెట్ కోసం కష్టపడే తత్వం, ఫిట్నెస్ స్థాయి ఇవన్నీ చూసి చెబుతున్నా. మ్యాచ్లో రాణించేందుకు అతను కనబరిచే పట్టుదల అద్భుతం. ప్రతీసారి అతనికి ఇదెలా సాధ్యమవుతుందో నాకు అంతుబట్టడం లేదు. అందుకే కోహ్లి అంటే నాకెంతో గౌరవం. అలాగే ఇప్పుడు కుటుంబం కోసం తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని అన్నారు. ఆటగాళ్లు కెరీర్తో పాటు కుటుంబానికి సమయమివ్వాలని చెప్పారు. అతను లేకపోవడం భారత జట్టుకు పూడ్చలేని లోటేనని, ఇది జట్టుపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని లాంగర్ వివరించారు. అయితే గత పర్యటన (2018–19)లో ఆసీస్ను ఓడించిన భారత్ను విరాట్ ఉన్నా లేకపోయినా తక్కువ అంచనా వేయబోమని, టీమిండియా పటిష్టమైన జట్టని విశ్లేషించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే టీమిండియా ఆసీస్కు చేరింది. ప్రస్తుతం కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్న భారత జట్టు, క్వారంటైన్ పూర్తవగానే నవంబర్ 27న తొలి వన్డే ఆడుతుంది. -
హలో ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత క్రికెట్ బృందం ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. ప్రత్యేక విమానంలో దుబాయ్నుంచి వెళ్లిన జట్టు సభ్యులు నేరుగా సిడ్నీకి చేరుకున్నారు. టీమిండియా సభ్యులతో పాటు ఐపీఎల్లో ఆడిన ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్, కమిన్స్ తదితరులు కూడా గురువారమే స్వదేశం చేరారు. వీరందరిని స్థానిక అధికారులు సిడ్నీ ఒలింపిక్ పార్క్ ప్రాంతానికి పంపించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటీన్ కోసం వీరంతా అక్కడి పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఉన్న ‘పుల్మ్యాన్’ హోటల్లో బస చేశారు. క్రికెటర్ల కోసమే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న స్థానిక రగ్బీ టీమ్ న్యూసౌత్వేల్స్ బ్లూస్ జట్టును అక్కడినుంచి తరలించారు. హోటల్లో ఆటగాళ్లను మినహా ఎలాంటి అతిథులను అనుమతించడం లేదు. ‘పుల్మ్యాన్’ హోటల్లో విరాట్ కోహ్లి కోసం ప్రత్యేక పెంట్ హౌస్ సూట్ను కేటాయించారు. క్వారంటీన్ సమయంలోనే జట్టు ప్రాక్టీస్ చేసుకునేందుకు మాత్రం అధికారులు అనుమతినిచ్చారు. ఆటగాళ్లు సాధన చేయాల్సిన బ్లాక్టౌన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ పార్క్ను కూడా బయో బబుల్ సెక్యూరిటీలో సిద్ధం చేశారు. ప్రాక్టీస్ కోసం మాత్రమే క్రికెటర్లు తమ హోటల్ గదులు వీడి బయటకు రావాల్సి ఉంటుంది. టీమిండియా సభ్యులలో కొందరి కోసం పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు వచ్చేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. రహానే, అశ్విన్ తమ కుటుంబాలతో అక్కడికి వెళ్లారు. కొత్త జెర్సీలతో... ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్ల కోసం భారత జట్టు పాత రోజులను గుర్తుకు తెచ్చే (రెట్రో) రంగు జెర్సీలతో బరిలోకి దిగనుందని సమాచారం. ఇది 1992 వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు ధరించిన కిట్ను పోలి ఉంది. -
పాపే నా అదృష్టం : గెడ్డం తీసేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైన మీడియం పేసర్ టీ నటరాజన్ (29) తన కూతురు రూపంలో తనకు అదృష్టం కలిసి వచ్చిందంటూ మురిసి పోతున్నాడు. తనకు పాప పుట్టం అదృష్టమనీ, నెట్బౌలర్ గా మాత్రమే ఎంపికైన తాను ప్రస్తుతం ప్రధాన జట్టుకు ఎంపికయ్యానని ఇంతకంటే శుభవార్త ఏమి ఉంటుందని నటరాజన్ తెలిపాడు. పాపాయి ఫోటో కూడా తానింకా చూడలేదని, వీడియోకాల్లో మాత్రమే చూశానని నటరాజన్ చెప్పాడు. అలాగే తన భార్య పవిత్ర ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారన్నాడు. మరోరెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. బిడ్డ పుట్టిన సందర్భంగా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు గడ్డం కత్తిరించుకుంటానని ఈ సందర్భంగా నటరాజన్ వెల్లడించాడు. అలాగే దీనికి ముందు ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉందన్నాడు. అయితే తన బిడ్డను చూసేందుకు మాత్రం నటరాజన్ మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే. అతను మొత్తం పర్యటన ముగిసే వరకు ఉంటే, అతను జనవరి మూడవ వారంలో మాత్రమే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పితృత్వ సెలవు మంజూరు కాగా నటరాజన్ మాత్రం తన ముద్దుల పాపాయిని చూసేందుకు మూడునెలలు ఆగాల్సి వస్తోంది. నవంబరు 7న నటరాజన్ భార్య పవిత్ర ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయ సంబరాల్లో ఉండగానే డేవిడ్ వార్నర్ ఈ శుభవార్తను అందరికీ షేర్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో పాటు పలువురు నటరాజన్ను అభినందనలు ముంచెత్తారు. కాగా భుజం గాయం కారణంగా చాన్స్ మిస్ అయిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో నటరాజన్ భారత టీ 2020 జట్టులో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: వచ్చే ఏడాది 9 జట్లతో ఐపీఎల్!) -
తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి రానున్నాడు. తొలి టెస్టు ఆడాక భారత్కు పయనమవుతాడు. అయితే అన్ని ఫార్మాట్లకు ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చిన సెలక్షన్ కమిటీ కెప్టెన్ గైర్హాజరీ నేపథ్యంలో టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైన ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి గాయంతో ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు. కేవలం టి20లకే ఎంపికైన సంజూ సామ్సన్ను ఇప్పుడు వన్డే జట్టులోనూ ఆడతాడు. నేడు జరిగే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన మరుసటి రోజే టీమిండియా యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. భార్య ప్రసవం ఉండటంతో... టీమిండియా సారథి విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె డెలివరీ తేదీ జనవరిలో ఉంది. దీంతో అనుష్క ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని కోహ్లి భావించాడు. ఈ మేరకు తన మనసులోని మాటను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖులకు తెలిపాడు. కోహ్లి అభ్యర్థనను బీసీసీఐ అంగీకరించింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి మంజూరు చేసింది. రెండు నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలుత మూడు వన్డే మ్యాచ్లు (నవంబర్ 27, 29, డిసెంబర్ 2) ఆడుతుంది. అనంతరం మూడు టి20 మ్యాచ్ల్లో (డిసెంబర్ 4, 6, 8) బరిలోకి దిగుతుంది. అనంతరం నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు అడిలైడ్లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు డే–నైట్గా జరుగుతుంది. ఈ మ్యాచ్ ముగిశాకే కోహ్లి భారత్కు తిరిగి వస్తాడు. మెల్బోర్న్లో జరిగే రెండో టెస్టు (26 నుంచి 30) సహా సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు కోహ్లి దూరమవుతాడు. ఆసీస్కు ‘హిట్మ్యాన్’... ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ టెస్టులాడేందుకు ఈ నెలాఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరతాడు. రోహిత్ చేరిక, ఫిట్నెస్పై బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘బీసీసీఐ వైద్య బృందం అతని ఫిట్నెస్పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇదే విషయాన్ని మేం సెలక్షన్ కమిటీకి తెలియజేశాం. పూర్తి ఫిట్నెస్ సంతరించుకునేందుకే అతనికి పరిమిత ఓవర్ల సిరీస్కు విశ్రాంతినిచ్చాం. ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోని పునరావాస శిబిరంలో ఉన్న ఇషాంత్ శర్మతో కలిసి రోహిత్ అక్కడికి పయనమవుతాడు. గాయం దాచిన వరుణ్... ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. అతన్ని టి20ల కోసం ఎంపిక చేయగా... భుజం గాయంతో అక్కడికి వెళ్లడం లేదు. ఐపీఎల్ సందర్భంగా గాయమైన సంగతిని వరుణ్ దాచి పెట్టాడని బీసీసీఐ గుర్రుగా ఉంది. అతని భుజానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాగా అతని స్థానంలో ‘యార్కర్ స్పెషలిస్ట్’, తమిళనాడు ఎడంచేతి వాటం పేస్ బౌలర్ నటరాజన్ను ఎంపిక చేశారు. తొడ కండరాల గాయంతో ఉన్న వృద్ధిమాన్ సాహాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. నెట్బౌలర్గా కమలేశ్ నాగర్కోటి అక్కడికి వెళ్లడం లేదు. అతన్ని ఎన్సీఏకు పంపుతున్నారు. -
సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో కష్టమే
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ కోసం భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘బయో బబుల్’లోకి ప్రవేశించి 75 రోజులైంది. మరో ఐదు రోజులు కలుపుకుంటే 80 రోజులవుతుంది. ఆ తర్వాత వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం అతను బయలుదేరాల్సి ఉంది. అక్కడా బయో బబుల్లో గడపాల్సి ఉండగా, జనవరి 19న పర్యటన ముగుస్తుంది. ఇదే విషయంపై కోహ్లి ఆందోళన వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో ఉండాల్సి రావడం చాలా కష్టమని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇండోర్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ప్రైవేట్ బీచ్లలో సరదాలు కొంత వరకు ఒత్తిడిని తప్పించగలవేమో తప్ప పూర్తిగా కాదని అతను అన్నాడు. ‘బయో బబుల్’లో జరిగే సిరీస్ల వ్యవధిని తగ్గించే విషయంపై దృష్టి పెట్టాలని కోహ్లి సూచించాడు. ‘బయో బబుల్లో సహచరులతో కలిసి గడపడం, మంచి సాహచర్యం ఉండటంతో ఆరంభంలో బాగానే అనిపించింది. కానీ ఇది సుదీర్ఘంగా కొనసాగడమే సమస్య. రాన్రానూ అంతా కఠినంగా అనిపిస్తోంది. వినోదం కోసం ఎన్ని ఏర్పాట్లు చేసినా... మానసికంగా ప్రశాంతంగా ఉండే విషయం గురించి కూడా సీరియస్గా ఆలోచించాలి. ఇదే అన్నింటికంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో సిరీస్ల వ్యవధి తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలి. ఒకే రకమైన వాతావరణంలో 80 రోజుల పాటు ఉంటూ మరో ప్రత్యామ్నాయం లేకుండా, భిన్నంగా కనిపించకుండా చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చాలా కష్టం. ఇది మానసికంగా మాపై ప్రభావం చూపిస్తుంది’ అని కోహ్లి విశ్లేషించాడు. -
‘రోహిత్ గాయం పెరిగే ప్రమాదం ఉంది’
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ గాయం తీవ్రతకు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంపై వివాదం కూడా నెలకొంది. అయితే జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి దీనిపై మొదటిసారి పెదవి విప్పాడు. అతను గాయం మరింత పెద్దది కాకూడదనే కారణంతోనే జాగ్రత్త పడుతున్నామని వెల్లడించాడు. తొందర ప్రదర్శించి బరిలోకి దిగితే రోహిత్కు మరింత సమస్య ఎదురు కావచ్చని రవిశాస్త్రి అన్నాడు. ‘బీసీసీఐ వైద్య బృందం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ టీమ్ తమ నివేదికను సెలక్టర్లకు అందజేసింది. అందులో మా పాత్ర ఏమీ లేదు. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత గాయానికి విశ్రాంతి అవసరమని, తొందరపడి ఆడే ప్రయత్నం చేస్తే అతను మళ్లీ తనను తాను గాయపర్చుకునే ప్రమాదం ఉందని ఆ నివేదికలో ఉంది. నేను సెలక్షన్ కమిటీలో సభ్యుడిని కాను. అతడిని పక్కన పెట్టడంలో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. -
కుటుంబ సభ్యులకు అనుమతి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం తెలిపింది. రెండున్నర నెలల పాటు సాగనున్న ఈ పర్యటనలో కుటుం బ సభ్యుల్ని కూడా అనుమతించాలని సీనియర్ క్రికెటర్లు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో తొలుత బీసీసీఐ ఈ అంశాన్ని వ్యతిరేకించింది. ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న భారత క్రికెటర్లు ఫైనల్ ముగియగానే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇప్పటికే నెలకు పైగా కుటుంబాలకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా లాంటి కొందరు సీనియర్ క్రికెటర్లు... ఆసీస్ పర్యటన ముగించుకొని తిరిగి భారత్ వచ్చేసరికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది. దీంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్లో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు ఆడనుంది. -
'ఆ అవకాశం ఇలా వస్తుందని ఊహించలేదు'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. లీగ్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన రాహుల్ 595 పరుగులతో టాప్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఒక దశలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన పంజాబ్.. తర్వాత అనూహ్యంగా ఫుంజుకొని వరుసగా ఐదు విజయాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. కెప్టెన్ అనే పదానికి నిర్వచనం చెబుతూనే బ్యాట్సమెన్గా నిలకడగా రాణిస్తున్న రాహుల్ తాజాగా ఆస్ట్రేలియా టూర్కు అన్ని ఫార్మట్లలో ఎంపికయ్యాడు. కాగా రోహిత్శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వన్డే, టీ20 జట్లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. (చదవండి : ఇలాంటి కీపర్ ఉంటే అంతే సంగతులు) ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఎంపికవడం పట్ల స్పందించాడు.'ఆసీస్ టూర్లో టీమిండియాకు వైస్ కెప్టెన్గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. నా దృష్టిలో ఇది గర్వించదగిన విషయం. అసలు నేను వైస్ కెప్టెన్ అవుతానని ఊహించలేదు. ఈ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా.. నా వంతు బాధ్యతగా జట్టును విజయవంతగా నడిపించడానికి ప్రయత్నిస్తా. అని తెలిపాడు. అయితే వైస్ కెప్టెన్గా రాహుల్ ఎంపిక సంతోషమే అయినా.. అతని ముందున్న లక్ష్యం మాత్రం కింగ్స పంజాబ్ను చాంపియన్గా నిలపడమే. కింగ్స్ పంజాబ్ ఆడనున్న తదుపరి రెండు మ్యాచ్లు చాలా కీలకం. ఇప్పటికే పంజాబ్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. కాగా కింగ్స్ పంజాబ్ రాజస్తాన్, సీఎస్కేలను ఎదుర్కోనుంది. (చదవండి : 'బయోబబుల్ నరకం.. కౌంట్డౌన్ మొదలెట్టా') -
నవంబర్ 27న తొలి పోరు
భారత క్రికెట్ జట్టు చివరిసారిగా మార్చి 2న మైదానంలోకి దిగింది. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నా... కరోనా కారణంగా ప్రపంచం తలకిందులై పోయింది. బయో బబుల్లో ఐపీఎల్ వినోదం పంచుతున్నా... సగటు భారత అభిమాని అంతర్జాతీయ క్రికెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగే టీమిండియా పర్యటన అధికారికంగా ఖరారైంది. మూడు ఫార్మాట్లలో కలిపి 10 మ్యాచ్లతో ఈ పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. కోవిడ్–19 కఠిన పరిస్థితులను అధిగమించి సరిగ్గా 269 రోజుల విరామం తర్వాత భారత జట్టు సిడ్నీ వేదికగా నవంబర్ 27న జరిగే తొలి వన్డేతో మళ్లీ బరిలోకి దిగనుంది. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. టీమిండియా సుదీర్ఘ ఆసీస్ టూర్కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కరోనా పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలతో చర్చించిన తర్వాత తమ అంగీకారాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. గతంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు సీఏ సిద్ధమైనా... ఆంక్షల కారణంగా ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు స్వల్ప మార్పులతో మొత్తం పర్యటన వివరాలను సీఏ వెల్లడించింది. ఆస్ట్రేలియా దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కేవలం 14 కేసులు మాత్రమే నమోదు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 1500 మాత్రమే. ఈ సిరీస్లో భారత్–ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు జరుగుతాయి. మెల్బోర్న్లో రోజూ 25 వేల ప్రేక్షకులకు అనుమతి! నాలుగు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు అడిలైడ్ వేదిక కానుంది. ఇది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ కావడం విశేషం. భారత్ తమ ఏకైక డే–నైట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించగా... ఆసీస్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు, ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు రోజుల డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడుతుంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో కూడా దాదాపు అంతా ప్రధాన జట్టు ఆటగాళ్లే ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయం ప్రకారం ఈసారి కూడా బాక్సింగ్ డే టెస్టుకు మెల్బోర్న్ మైదానమే వేదిక కానుంది. అయితే విక్టోరియా రాష్ట్రంలోనే కరోనా ప్రభావం ఉండటంతో లక్ష సామర్థ్యం గల ఈ స్టేడియంలో రోజూ నాలుగో వంతు సుమారు 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని సీఏ పరిశీలిస్తోంది. మరోవైపు భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో సీఏ, బీసీసీఐతో చర్చిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 14 రోజుల క్వారంటైన్... బీసీసీఐ ఎన్ని విధాలా విజ్ఞప్తి చేసినా క్వారంటైన్ విషయంలో మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం క్రికెటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంగా చెప్పింది. నవంబర్ 10న దుబాయ్లో ఐపీఎల్ ముగిసిన అనంతరం భారత బృందం ప్రత్యేక విమానంలో సిడ్నీకి బయలుదేరి వెళుతుంది. నిజానికి భారత్ ముందుగా బ్రిస్బేన్ వెళ్లాల్సి ఉన్నా, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించలేదు. సిడ్నీ ఒలింపిక్ పార్క్కు దగ్గరిలోనే ఒక హోటల్లో వీరికి బస ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోటల్ను ఇతర అతిథులు ఎవరూ ఉండకుండా ప్రత్యేకంగా టీమిండియా కోసం సిద్ధం చేశారు. ఆటగాళ్లంతా నవంబర్ 12 నుంచి హోటల్లోనే 14 రోజుల క్వారంటైన్ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలోనే ఉన్న బ్లాక్టౌన్లో టీమ్ ప్రాక్టీస్ చేస్తుంది. క్వారంటైన్ ముగిసిన సరిగ్గా రెండు రోజుల తర్వాత టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
భారత క్రికెట్ జట్టుకు కరోనా సెగ!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు తాజాగా కరోనా సెగ తగిలింది. ఆటగాడికి కాకపోయినా... సహాయ సిబ్బందిలో ఒకరికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ఇదివరకు ఐపీఎల్లో కరోనా కేసులున్నాయి. కానీ టీమిండియా, సిబ్బందికి సంబంధించి మాత్రం ఇదే తొలి మహమ్మారి కేసు. దీంతో కరోనా బాధితుడు రవిశాస్త్రి బృందంతో పాటు దుబాయ్కి వెళ్లలేదు. ఆదివారం అక్కడికి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కోవిడ్–19 సోకడంతో ‘అతడు’ 14 రోజుల క్వారంటైన్కు పరిమితమయ్యాడు. చికిత్స, రెండు వారాల ఐసోలేషన్ ముగిశాక నెగెటివ్ రిపోర్టు వస్తేనే అతడిని దుబాయ్ విమానం ఎక్కిస్తారు. (చదవండి: నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి) దుబాయ్లో రవిశాస్త్రి... ఆసీస్ పర్యటన కోసం భారత జట్టు ఐపీఎల్ ముగిసిన వెంటనే అక్కడి నుంచే ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, మేనేజర్ గిరీశ్ డోంగ్రేలతో పాటు టెస్టు స్పెషలిస్టులు హనుమ విహారి, చతేశ్వర్ పుజారా ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. తాజాగా వీరికి కోవిడ్ పరీక్షలు, ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో బయో బబుల్లోకి తీసుకున్నారు. పుజారా, విహారిలకు దుబాయ్లో ఉన్న ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తారు. కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ పర్యటన కోసం తమ భార్యలను వెంటతీసుకు వెళ్లేందుకు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు నెలలుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉండటంతో వారిని దుబాయ్కి రావాల్సిందిగా పలువు రు ఆటగాళ్లు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. (చదవండి: భారత టెస్టు స్పెషలిస్ట్లు దుబాయ్కి) -
వచ్చే వారంలో ఆసీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక!
ముంబై: మరో మూడు వారాల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ పూర్తిస్థాయి సిరీస్లలో పాల్గొననుంది. కానీ జట్టు ఎంపికపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టింది. వచ్చే వారం ఆయా జట్లను ప్రకటించే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆదివారం బీసీసీఐ చీఫ్ గంగూలీ మాట్లాడుతూ తేదీలు మినహా వేదికలు, మ్యాచ్లు ఖరారయ్యాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో క్వీన్స్లాండ్ రాష్ట్రం నుంచి ఆమోదం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎదురుచూస్తోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తిస్థాయి షెడ్యూల్ను తేదీలతోసహా సీఏ ప్రకటిస్తుంది. రెండున్నర నెలల పాటుసాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 12న అక్కడికి బయల్దేరనుంది. అనంతరం 14 రోజుల క్వారంటైన్ ముగిశాక కసరత్తు ప్రారంభిస్తుంది. ఐపీఎల్ వర్క్లోడ్, ఆటగాళ్ల గాయాలను దృష్టిలో పెట్టుకొని త్వరలో జట్టును ఎంపిక చేసే అవకాశముంది. ఇప్పటికే భువనేశ్వర్, ఇషాంత్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు గాయపడి లీగ్కు దూరమైన సంగతి తెలిసిందే. -
అడిలైడ్లో ఆసీస్తో భారత్ డేనైట్ టెస్టు
కోల్కతా: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తొలి టెస్టును అడిలైడ్ వేదికగా డేనైట్లో ఆడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించాడు. వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని క్రికె ట్ ఆస్ట్రేలియా (సీఏ) తమకు పంపిందని ‘దాదా’ చెప్పాడు. ‘ఆసీస్తో భారత్ మూడు టి20లు, మరో మూడు వన్డేలతో పాటు నాలుగు టెస్టుల సిరీస్లో తలపడుతుంది. తొలి టెస్టును ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆడుతుంది. అడిలైడ్లో ఈ పింక్బాల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది’ అని గంగూలీ వివరించాడు. ‘దాదా’ ఐసీసీ చైర్మన్ రేసులో నుంచి తప్పుకున్నాడా? గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నాడంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే! భారత బోర్డు నుంచి ఐసీసీకి నామినేషన్లే రాలేదని తెలిసింది. భారత్కే చెందిన శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ పదవి కోసం నామినేషన్లను ఈ నెల 18లోపే దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఆదివారంతో గడువు ముగిసినా బీసీసీఐ నుంచి నామినేషన్లు రాలేదని ఐసీసీ తెలిపింది. నామినేషన్ల స్క్రూటిని అనంతరం డిసెంబర్లో ఎన్నిక జరుగనుంది. -
సెప్టెంబర్లో ఇంగ్లండ్లో ఆసీస్ పర్యటన!
మెల్బోర్న్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్లో పర్యటించే అవకాశం ఉంది. రెండు వారాల్లోపే ముగిసే ఈ పర్యటనలో ఇంగ్లండ్తో ఆసీస్ జట్టు మూడు టి20లు, మూడు వన్డేలను ఆడనుంది. సెప్టెంబర్ 4, 6, 8 తేదీల్లో టి20 మ్యాచ్లను... అనంతరం సెప్టెంబర్ 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్లు నిర్వహించాలనుకుంటున్నారు. ఈ మ్యాచ్లన్నీ సౌతాంప్టన్, మాంచెస్టర్లలోనే జరిగే అవకాశం ఉంది. -
ఆస్ట్రేలియా పర్యటన ఆలస్యం!
ముంబై: కోవిడ్–19 కారణంగా సహజంగానే ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగం స్తబ్దుగా మారిపోయింది. ఇందుకు భారత క్రికెట్ కూడా అతీతం కాదు. కరోనా భయంతో మార్చి ఆరంభంలో అర్ధాంతరంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు కావడం మొదలు మళ్లీ ఆట జరగలేదు. ఇక ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏదోలా క్రికెట్ను ప్రారంభించాలని భావిస్తోంది. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకునే ప్రయత్నంలో ఉంది. కరోనా వల్ల భారత క్రికెట్ 2020–21 సీజన్ షెడ్యూల్ అంతా తారుమారైంది. ఇందులో కొన్ని మార్పుచేర్పులతో క్రికెట్ కార్యకలాపాలు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. అటు క్యాంప్...ఇటు ఐపీఎల్... బీసీసీఐ ప్రణాళికల్లో అన్నింటికంటే ముందుగా భారత సీనియర్ జట్టుకు శిక్షణా శిబిరం నిర్వహించడం కీలకంగా మారింది. ముందుగా జూలై మూడో వారంలో అనుకున్నా... దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అది సాధ్యం కావడంలేదు. ఇప్పుడు ఆగస్టుకల్లా పరిస్థితి చక్కబడుతుందని బోర్డు ఆశిస్తోంది. అదే జరిగితే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సరైన వేదిక అని బోర్డు అధికారులు చెబుతున్నారు. లేదంటే మరో ప్రత్యామ్నాయంగా హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలను అనుకుంటున్నారు. అయితే ఇక్కడ వసతి, ఇతర సౌకర్యాల గురించి కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఐపీఎల్ జరిగే అవకాశం ఉంటే ఆయా జట్ల ఆటగాళ్లు కనీసం 21 రోజుల ముందు తమ జట్లతో చేరాల్సి ఉంటుంది. ప్రేక్షకులను అనుమతించకపోయినా టీవీ వీక్షకుల కోసమే ఐపీఎల్ జరపాలని బోర్డు పట్టుదలగా ఉంది. పూర్తి స్థాయిలో లీగ్ నిర్వహిస్తే నవంబర్ చివరినుంచి ప్రారంభం కావాల్సిన ఆస్ట్రేలియా పర్యటన కనీసం వారం రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ‘క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3 నుంచి తొలి టెస్టు జరగాలి. దానికి ముందు టి20, వన్డే సిరీస్లు ఉన్నాయి. అయితే ప్రపంచకప్ కోసమే టి20 సిరీస్ పెట్టారు. ఇప్పుడు వరల్డ్కప్ జరిగే అవకాశం లేదు కాబట్టి టి20 సిరీస్ రద్దు చేసుకుంటే నష్టమేమీ లేదు. టెస్టు సిరీస్ కూడా వారం ఆలస్యం అవుతుంది’ అని బోర్డు అధికారి వెల్లడించారు. ఈ పర్యటన తర్వాత ఇంగ్లండ్ జట్టు కూడా భారత్కు రావాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సహజంగానే ఆలస్యం కానుంది. -
ధోనికి కోపమొచ్చింది
అడిలైడ్: టీమిండియా మిస్టర్ కూల్కు కోపమొచ్చింది. అవును టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని.. యువ ఆటగాడు ఖలీల్ అహ్మద్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి శతకంతో పాటు ధోని చిరస్మరణీయ ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతున్న సమయంలో అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో టీమిండియా 12వ ఆటగాడు ఖలీల్ అహ్మద్, 13వ ఆటగాడు యజువేంద్ర చహల్లు ధోని, దినేశ్ కార్తీక్లకు డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చారు. అయితే ఖలీల్ పిచ్పై పరుగెత్తుకుంటూ రావడంతో ధోనికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఎక్కడ నడుస్తున్నావ్? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా అంటూ ఖలీల్పై ధోని గుస్సా అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక దీనిపై ‘ఖలీల్ జాగ్రత్త.. మిస్టర్ కూల్కు కోపం తెప్పించకు’.. ‘ఏమైంది ఈ యువ ఆటగాళ్లకు.. మొన్న కుల్దీప్, నిన్న ఖలీల్.. ధోనికి కోపం తెప్పించినందుకు తప్పదు భారీ మూల్యం’అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
రిటైరయ్యాక మళ్లీ బ్యాట్ పట్టను
సిడ్నీ: తాను ఒక్కసారి ఆటకు గుడ్బై చెబితే తిరిగి బ్యాట్ పట్టబోనని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం చాలామంది ఆటగాళ్లు లీగ్ టోర్నీలు ఆడుతుండటం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఆ కోవలోకి చేరబోనని పేర్కొన్నాడు. ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక ఇక మ్యాచ్ల వైపు కన్నెత్తయినా చూడనని అంటున్నాడు. ఆసీస్తో వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లీ పాల్గొని మాట్లాడాడు. ‘అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాక తిరిగి మైదానం వైపు కన్నెత్తయినా చూడను. లీగ్ టోర్నీలు ఆడటానికి నాకు ఆసక్తి లేదు. ఇప్పటివరకు సరిపడా క్రికెట్ ఆడేశాను. గత ఐదేళ్లలో నేను ఆడాలనుకున్న దానికంటే ఎక్కువే ఆడాను. రాబోయే మ్యాచ్లనూ బాగానే ఆడతాను. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగా ఏం మాట్లాడలేను. వీడ్కోలు పలికాక మాత్రం ఇక బ్యాట్ ఎత్తుకోను’ అని తెలిపాడు. -
కేఎల్ రాహుల్ ఇంకెందుకు?
సిడ్నీ : గత కొద్దిరోజులుగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా గడ్డపై సైతం దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాహుల్పై మండిపడుతున్నారు. ఇంకెన్నీ అవకాశాలిస్తారని, రాహుల్ తమ ఓపికను పరీక్షిస్తున్నాడని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేఎల్ రాహుల్ మంచి బ్యాట్స్మనే కానీ అతను నెట్స్లో మాత్రమే ఆడుతాడని సెటైర్లేస్తున్నారు. వరుసగా విఫలమవుతున్నా అతనికి అవకాశం ఎందుకిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో 20 బంతులాడిన కేఎల్ రాహుల్ కేవలం 14 పరుగులే చేసి ఔటయ్యాడు. అది కూడా.. మ్యాచ్లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్ బాదినా.. ఆ తర్వాత 18 బంతుల్లోనూ చేసిన పరుగులు 8 మాత్రమే. అయితే.. రాహుల్ విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లి (61 నాటౌట్: 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), ఓపెనర్ శిఖర్ ధావన్ (41: 22 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్లు) దూకుడుగా ఆడటంతో 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించింది. ఇక బ్రిస్బేన్ వేదికగా గత బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కూడా రాహుల్ విఫలమయ్యాడు. 12 బంతుల్లో 13 పరుగులు చేసి స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. మూడో టీ20లోనూ రాహుల్ విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో అతను సాధించిన అద్భుత సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ లేదు. అయినా టీమిండియా మేనేజ్మెంట్ రాహుల్పై నమ్మకం ఉంచి అవకాశం కల్పించగా.. అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో కేఎల్ రాహుల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. Don't know what KL Rahul is doing in team. I agree he is fit and has quality. But he is not making the chances count since long time...#INDvAUS @BCCI @klrahul11 — Rakshak S (@naanuunknownu) November 25, 2018 Why KL Rahul continues to play after failing all time ? Far better players are not given enough chances. #INDvAUS #INDvsAUS @BCCI #AusvIndOnSonyTen3 #AUSvIND — Malay kumar (@mformalay) November 25, 2018 KL Rahul Is So Talented He Bats Only In Nets. Talent 👌🏻 — Anai Komagan (AK) (@AnaiKomagan) November 25, 2018 -
‘అప్పటి వరకు డే/నైట్ టెస్ట్ ఆడేదిలేదు’
ముంబై : ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ప్రతిపాదనను నిరాకరించిన బీసీసీఐ నిర్ణయాన్ని బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్ వెనకేసుకొచ్చాడు. డే/నైట్ టెస్టు ఆడితే ఓడిపోతామన్న భయంతోనే బీసీసీఐ స్వార్థంగా ఈ మ్యాచ్కు అంగీకరించట్లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయ్ మాట్లాడుతూ.. ‘‘అన్ని మ్యాచ్లూ గెలవాలనుకోవడంలో తప్పేం ఉంది? 30 ఏళ్ల క్రితం డ్రా చేసుకునేందుకు భారత్ మ్యాచ్లాడుతోంది అనేవారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. టీమిండియా ఆటగాళ్లు ఎప్పుడైతే డే/నైట్ టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతారో అప్పుడే దానికి అంగీకరిస్తాం’’ అని స్పష్టం చేశాడు. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి సైతం బోర్డు నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చాడు. ఎవరితో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఆడాలనేది తమ వ్యవహారమని, తాము భారత్ విజయాల కోసం కృషి చేస్తామని రాహుల్ జోహ్రి తెలిపాడు. డే/నైట్ టెస్టు ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డాడు. ఇక డే/నైట్ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా డే/నైట్ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ డే/నైట్ టెస్టు ఆడాలని హర్భజన్ సూచించాడు. ‘డేనైట్ టెస్టుల్ని భారత్ ఎందుకు ఆడనంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. ఓసారి ఆడిచూస్తే బాగుంటుంది. పింక్ బాల్ ఐతే ఏంటి. ఆడితే తప్పకుండా అలవాటు అవుతుంది. అదేమీ కష్టం కాదు... ఆడితే వచ్చే నష్టమూ లేదు’ అని అన్నాడు. -
నేడు ఆస్ట్రేలియా పర్యటనకు లక్ష్మీపార్వతి
సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఆస్ట్రేలియాలో 20 రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఆస్ట్రేలియాకు బయల్దే రనున్నారు. 9న సిడ్నీలో గ్లోబల్ ఉమెన్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో న్యూ సౌత్వేల్స్ పార్లమెంట్ హాల్లో లక్ష్మీపార్వతిని వివిధ మహిళా సంఘాలు సన్మానిస్తాయి. 14న మెల్ బోర్న్లోని తెలుగు సంఘాలు, అక్కడి తెలుగు వారు సన్మానించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని 23న ఆమె తిరుగు ప్రయాణమవుతారు. -
ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి కోదండరాం
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ యం. కోదండరాం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి దాదాపు 12 గంటలకు హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తారని టీజేయేసీ కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ మీడియాకు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు ఎన్ఆర్ఐ సంస్థల ఆహ్వానం మేరకు ఈనెల 8వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లిన కోదండరాం ఆ దేశంలోని వివిధ పట్టణాలలో అక్కడి తెలంగాణా సంస్థలు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి విచ్చేయనున్నట్లు రవీందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
కార్పొరేట్ పన్ను వ్యవస్థ ప్రక్షాళన: జైట్లీ
సిడ్నీ: పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ నాలుగు రోజుల ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమైంది. భారత్ పన్ను వ్యవస్థ పట్ల అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న సందేహాలను తొలగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల వృద్ధికి వ్యాపార పరిస్థితులను మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల దిశగా భారత పన్నుల వ్యవస్థను సంస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. పన్నులకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న పలు సమస్యలను పరిష్కరించామని, ఇతర సమస్యల పరిష్కారంపైసైతం దృష్టి పెట్టామని అన్నారు. త్వరలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిడ్నీ పర్యటనలో భాగంగా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు.భారత్ భారీ పెట్టుబడులను కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్
గాయం కారణంగా పది నెలలు భారత జట్టుకు దూరమై తిరిగి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పేసర్ మొహమ్మద్ షమీ మళ్లీ గాయపడ్డాడు. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా అతనికి కనీసం 4 నుంచి 6 వారాలు విశ్రాంతి అవసరమని, అందుకే స్వదేశానికి వెళుతున్నాడని జట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియా వెళ్లాక తొలి ప్రాక్టీస్ సెషన్లోనే అతను గాయపడ్డాడు. షమీ స్థానంలో పేసర్ భువనేశ్వర్ భారత జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేలు, మూడు టి20ల ఈ సిరీస్ ఈనెల 12 నుంచి జరుగుతుంది. -
‘ప్రాక్టీస్’లో బాదేశారు
► ఆసీస్ పర్యటనలో భారత్ శుభారంభం ► వెస్టర్న్ ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం ► చెలరేగిన కోహ్లి, ధావన్ నేడు ప్రాక్టీస్ వన్డే మ్యాచ్ పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనను ధోని సేన భారీ గెలుపుతో మొదలు పెట్టింది. వన్డే సిరీస్కు ముందు సన్నాహకంగా జరిగిన టి20 ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 74 పరుగుల తేడాతో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ను చిత్తు చేసింది. శుక్రవారం ఇక్కడి ‘వాకా’ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (46 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు రెండో వికెట్కు 14.1 ఓవర్లలోనే 149 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వెస్టర్న్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రెవిస్ బర్త్ (60 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్... పేసర్ బరీందర్ శరణ్ తలా 2 వికెట్లు తీశారు. శనివారం జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్లో భారత్... ఇదే జట్టుతో తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్లో అనవసరపు సింగిల్కు ప్రయత్నించి రోహిత్ శర్మ (6) రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత ధావన్, కోహ్లి కలిసి తమదైన శైలిలో ఆడారు. ఇద్దరు బ్యాట్స్మెన్ తమ టి20 నైపుణ్యం, అనుభవాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ముందుగా ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మూడీ వేసిన 15వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 బాదిన కోహ్లి 35 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ధావన్ మరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17వ ఓవర్లో కూడా 22 పరుగులు రాబట్టిన భారత్... అదే ఓవర్లో కోహ్లి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో ధావన్, అజింక్య రహానే (2) అవుటైనా, చివర్లో ధోని (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఆకట్టుకున్న శరణ్ భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన వెస్టర్న్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) జట్టును ఆరంభంలోనే బరీందర్ శరణ్ కట్టి పడేశాడు. తన రెండో ఓవర్లో షార్ట్ (5)ను అవుట్ చేసిన అతను, మూడో ఓవర్లో బొసిస్టో (1)ను వెనక్కి పంపాడు. ఒకవైపు బర్త్ చక్కటి షాట్లతో దూసుకుపోయి 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నా... మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పూర్తిగా కట్టడి చేయడంతో డబ్ల్యూఏ బ్యాట్స్మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లిస్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు. జడేజా తన వరుస ఓవర్లలో 2 వికెట్లు తీయగా, అక్షర్ కూడా అదే తరహాలో 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బర్త్ చివరకు అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 6; శిఖర్ ధావన్ (సి) షార్ట్ (బి) కెల్లీ 74; విరాట్ కోహ్లి (సి) ఇంగ్లిస్ (బి) నికోలస్ 74; ధోని (నాటౌట్) 22; అజింక్య రహానే (సి) ఇంగ్లిస్ (బి) డఫీల్డ్ 2; గుర్కీరత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-12; 2-161; 3-173; 4-185. బౌలింగ్: డఫీల్డ్ 4-0-21-1; నికోలస్ 4-0-44-1; కెల్లీ 4-0-31-1; మూడీ 3-0-40-0; కానర్ 3-0-34-0; ముర్హెడ్ 2-0-17-0. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇన్నింగ్స్: బర్త్ (నాటౌట్) 74; షార్ట్ (సి) అశ్విన్ (బి) శరణ్ 5; బొసిస్టో (సి) అశ్విన్ (బి) శరణ్ 1; ఇంగ్లిస్ (సి) శరణ్ (బి) జడేజా 11; హాబ్సన్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 5; మోర్గాన్ (సి) రహానే (బి) అక్షర్ 3; కెల్లీ (స్టంప్డ్) ధోని (బి) అక్షర్ 2; నికోలస్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-20; 2-26; 3-61; 4-73; 5-83; 6-92. బౌలింగ్: శరణ్ 4-0-24-2; ఉమేశ్ 3-0-23-0; రిషి ధావన్ 3-0-22-0; జడేజా 3-0-13-2; అశ్విన్ 4-0-20-0; అక్షర్ 3-0-13-2. -
'కంగారూ'ల వేటకు సిద్ధం!
-
'కంగారూ'ల వేటకు సిద్ధం!
నేటినుంచి ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో భారత్ టి20 ప్రాక్టీస్ మ్యాచ్ వన్డే ప్రపంచకప్లు, ముక్కోణపు లేదా నాలుగు దేశాల టోర్నీలలో మినహా భారత్, ఆసీస్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరగలేదు. తొలిసారి టీమిండియా టెస్టులు ఆడకుండా కేవలం వన్డేలు, టి20 మ్యాచ్ల కోసం కంగారూ గడ్డపై అడుగు పెట్టింది. వరల్డ్ కప్ సెమీస్లో ఓటమి జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగానే అదే వేదికలో వన్డే సిరీస్కు సిద్ధమైంది. ధోని సేన తన సత్తా చాటి ఈసారైనా కంగారూలను వేటాడుతుందా..! పెర్త్: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు ముందు శుక్రవారం టీమిండియా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. అయితే ఇది టి20 ప్రాక్టీస్ మ్యాచ్ కావడం విశేషం. టి20 జట్టు కోసం ఎంపిక చేసిన కొంత మంది ఆటగాళ్లు లేకుండా వన్డే జట్టుతోనే ధోని సేన వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్తో భారత్ తలపడుతుంది. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో... బుధవారం ఆస్ట్రేలియా చేరుకున్న భారత క్రికెటర్లు గురువారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్లో పాల్గొన్నారు. కెప్టెన్ ధోనితో పాటు కోహ్లి, ధావన్ ఎక్కువ సేపు నెట్స్లో బ్యాటింగ్ సాధన చేశారు. చాలా కాలం తర్వాత జట్టుతో చేరిన పేసర్ షమీ కూడా నిర్విరామంగా బౌలింగ్ చేశాడు. 43 డిగ్రీల తీవ్రమైన ఎండలో కూడా మన ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. భారత్ తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్ను ఈ నెల 9న ఆడుతుంది. జట్టునుంచి రైనాలాంటి సీనియర్ స్థానం కోల్పోవడంతో పాటు కొంత మంది కొత్త ఆటగాళ్లు వచ్చిన నేపథ్యంలో టీమ్ కాంబినేషన్పై ఒక అంచనాకు వచ్చేందుకు ధోనికి ఈ మ్యాచ్లు ఉపయోగపడతాయి. ఆసీస్ బయల్దేరే ముందు 6, 7 స్థానాల్లో గుర్కీరత్, మనీశ్ పాండేలకు అవకాశం ఇవ్వడం గురించి మాట్లాడిన ధోని వారిని ప్రాక్టీస్ మ్యాచ్లో పరీక్షించే అవకాశం ఉంది. మరో వైపు ప్రధాన ఆటగాళ్లు ఉన్న పెర్త్ జట్టు ఒక వైపు బిగ్బాష్ లీగ్లో పాల్గొంటుండగా... ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడుతున్న వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్లో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. -
స్టువర్ట్ బ్రాడ్.. ఆసీస్ కు బ్యాడ్
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సమర్పించుకుని చెత్త రికార్డు మూట గట్టుకున్న స్టువర్ట్ బ్రాడ్.. నేడు ప్రపంచ నంబర్ వన్ స్థాయికి ఎదిగిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై తొలి ఓవర్ నుంచే దాడి చేశాడు. తాను వేసిన 9.3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. అంతే కాకుండా బ్రాడ్ విసిరిన 57 బంతుల్లో 50 బంతులు డాట్ పడ్డాయి. రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు అంతే. ఈ దెబ్బకు ఆసీస్ 18.3 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. ఇంతటి ఉత్తమ గణాంకాలు నమోదు చేస్తానని బ్రాడ్ కూడా ఊహించి ఉండడేమో. కసి అంటే అలా ఉండాలి. చెత్త రికార్డులు మూట గట్టుకున్నా.. ఉత్తమ గణాంకాలు నమోదు చేయగల బౌలర్గా నేడు మరో రికార్డు నెలకొల్పాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తొలి వికెట్ పడగొట్టడంతోనే టెస్టుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. ఆ ఆనందంలోనే అతడు మరో ఏడు వికెట్లు తీసి.. ఆస్ట్రేలియాను కోలుకోకుండా చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. నేటి మ్యాచ్ లో ఆసీస్ కు బ్యాడ్గా నిలిచాడని చెప్పవచ్చు. -దివిటి రాజేష్ -
ఫామ్పై ఆందోళన లేదు
ఎప్పుడూ బాధ్యతగానే ఆడాను టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య చెన్నై: ఇటీవలి కాలంలో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి నుంచి అభిమానులు ఆశిస్తున్న మెరుపులు లేవన్నది నిజం. గతేడాది ఆసీస్ పర్యటనలో బాగానే రాణించినా ఆ తర్వాత మాత్రం తన బ్యాట్ ద్వారా అందరినీ నిరాశపరుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’పై కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అయితే తన ఫామ్పై మాత్రం ఎలాంటి ఆందోళన లేదని ఈ టెస్టు కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి అదనపు కృషి చేయాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు కోసం తానెప్పుడూ బాధ్యతగానే ఆడినట్టు గుర్తుచేశాడు... మున్ముందు కూడా సహజ శైలి లోనే ఆడతానని స్పష్టం చేశాడు. ఈ ఏడాది భారత టెస్టు జట్టు ఎక్కువగా మ్యా చ్లు ఆడకున్నా... వన్డేల్లోనూ అతడి ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఫిబ్రవరిలో చివరి శతకం సాధించాడు. తన బ్యాటింగ్ వైఫల్యంతో పాటు రాబో యే శ్రీలంక పర్యటన గురించి కోహ్లి చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే.... ప్రతిసారీ నూరుశాతం: ఓ బ్యాట్స్మన్గా నేనెప్పుడూ బాధ్యతాయుతంగానే ఆడాను. ప్రతిసారీ జట్టు గెలుపు కోసమే నూటికి నూరు శాతం ప్రయత్నించాను. అందుకే నా బ్యాటింగ్ మెరుగుకు అదనపు కృషి చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాడి కోచింగ్లో భారత్ ‘ఎ’ జట్టుకు ఆడడంతో నాకు మంచి శిక్షణ లభించినట్టయ్యింది.దూకుడే బలం: ఫామ్ను అందుకోవడానికి నా దూకుడైన బ్యాటింగ్ను మార్చుకోవాలని అనుకోవడంలేదు. వాస్తవానికి దూకుడే బోర్డు నన్ను కెప్టెన్గా ఎంపిక చేసేందుకు కారణమని అనుకుంటున్నాను. లంక పర్యటన: శ్రీలంక పర్యటన నా కెప్టెన్సీలో తొలి పూర్తిస్థాయి టెస్టు సిరీస్. అందుకే చాలా ఉద్వేగంగా ఉంది. జట్టు ఆటగాళ్లు సరైన దృక్పథంతో ఆడితే లంకలో విజయం సాధిస్తాం.పేసర్లూ కీలకమే: ఓపెనర్గా మురళీ విజయ్ జట్టుకు నిలకడైన ఆరంభాలను అందిస్తున్నాడు. అశ్విన్, మిశ్రాలతో పాటు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ ఆలోచనలు జట్టుకు ఉపయోగపడతాయి. అలాగే పేసర్లు కూడా లంక పర్యటనలో కీలకం కానున్నారు. -
ఉత్తమ భారత క్రికెటర్గా రహానే
‘సియట్’ అవార్డుల ప్రదానం ముంబై: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో నిలకడైన ఆటతీరు కనబర్చిన అజింక్య రహానే ‘సియట్’ వార్షిక అవార్డుల్లో ఉత్తమ భారత క్రికెటర్గా ఎంపికయ్యాడు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల కార్యక్రమం సోమవారం ఇక్కడ జరిగింది. కుమార సంగక్కర (శ్రీలంక) ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. భారత దిగ్గజం కపిల్దేవ్ను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఉత్తమ బ్యాట్స్మన్, బౌలర్లుగా హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా), హెరాత్ (శ్రీలంక), ఉత్తమ టి20 ఆటగాడిగా డ్వేన్ బ్రేవో (వెస్టిండీస్) పురస్కారాలు స్వీకరించారు. పొలార్డ్ (వెస్టిండీస్)కు పాపులర్ చాయిస్, వన్డే డబుల్ సెంచరీకి రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డు, ఉత్తమ దేశవాళీ ఆటగాడు అవార్డు వినయ్కుమార్కు, యువ ఆటగాడి అవార్డు దీపక్ హుడాకు లభించాయి. జ్యూరీ చైర్మన్ గవాస్కర్తో పాటు సియట్ అంబాసిడర్ బ్రెట్లీ (ఆస్ట్రేలియా) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారత్కు గాయాల బెడద!
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించాడు. కీలకమైన ఓపెనింగ్ స్థానంలో ఆడుతూ అతను పదే పదే విఫలం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపిస్తోంది. మరి ముక్కోణపు వన్డే సిరీస్లో అతడిని పక్కన పెట్టవచ్చు కదా అనేది సగటు అభిమాని భావన. కానీ టీమిండియాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక వైపు ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండగా, మరో వైపు ప్రధాన బ్యాట్స్మన్గా మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేకపోవడం కూడా ధోని సేనకు ఇబ్బందిగా మారింది. ఇషాంత్ సాధన, రోహిత్ డుమ్మా భారత జట్టు తమ తదుపరి లీగ్ మ్యాచ్లో సోమవారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఒక రోజు విశ్రాంతి తర్వాత శుక్రవారం జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ముగ్గురు మినహా దీనికి ఆటగాళ్లంతా హాజరయ్యారు. రోహిత్ శర్మ, కోహ్లి, అశ్విన్ సాధన చేయలేదు. తొడ కండరాల గాయంతో ఇంకా కోలుకోకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్కు రాలేదు. తొలి వన్డేలో చక్కటి సెంచరీతో విదేశీ గడ్డపై కూడా ఓపెనింగ్లో చెలరేగగలడని నిరూపించుకున్న రోహిత్... తర్వాతి మ్యాచ్కే దూరమయ్యాడు. అతను ఎప్పటికి ఫిట్గా మారతాడో ఇంకా చెప్పలేని పరిస్థితి. మోకాలి నొప్పితో నాలుగో టెస్టు ఆడని ఇషాంత్... ఆ తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సాధన చేయలేదు. ప్రస్తుతం ప్రపంచ కప్ జట్టులో నలుగురు ప్రధాన పేసర్లు మాత్రమే ఉండటంతో అతను త్వరగా కోలుకోవడం జట్టుకు అవసరం. జడేజా కూడా... గత ప్రపంచ కప్కు, ఈ సారి టోర్నీకి మధ్య భారత జట్టులో ఎంతో ఎదిగిన ఆటగాడు రవీంద్ర జడేజా. వన్డేల్లో ఏడో స్థానంలో అతను కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఇటీవల కెప్టెన్ ధోని కూడా అవసరం ఉన్నా, లేకపోయినా జడేజా గురించే మాట్లాడుతూ, అతను లేకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తోందంటూ పదే పదే అతడి ప్రాధాన్యతను గుర్తు చేస్తూ వస్తున్నాడు. భుజం గాయంతో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతను శుక్రవారం కొద్దిగా ఎక్కువ సేపు బౌలింగ్ చేయగలిగాడు. అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడు కోలుకుంటాడో తెలీదు. ప్రస్తుత జట్టులో రాయుడు ఒక్కడే రిజర్వ్ బ్యాట్స్మన్గా జట్టులో ఉన్నాడు. గత మ్యాచ్లో అతడిని ఆడించారు. ఒక వేళ ధావన్ను తప్పించాలని భావించినా, మరో అవకాశం లేదు. జడేజా వస్తే పరిస్థితిలో మార్పు రావచ్చు. రోహిత్ ఫిట్గా లేకపోతే సోమవారం మ్యాచ్లో కూడా ధావన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. -
465 పరుగులకే టీమిండియా ఆలౌట్
భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 65 పరుగులు వెనకబడినట్లయింది. అజింక్య రహానే, విరాట్ కోహ్లీ బ్రహ్మాండమైన సెంచరీలు సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తొలి వికెట్ ను 57 పరుగుల వద్ద కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఓపెనర్ వార్నర్.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికేశాడు. రోజర్స్, వాట్సన్ క్రీజులో ఉన్నారు. -
సమయం వచ్చేసింది... డీఆర్‘ఎస్’కు
పెరుగుతున్న మాజీల మద్దతు ఆసీస్ పర్యటనలో నష్టపోతున్న భారత్ న్యూఢిల్లీ: తన దాకా వస్తే కానీ అసలు బాధేమిటో తెలియదంటారు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు పరిస్థితి అలాగే ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనకు తోడు అంపైరింగ్ తప్పుడు నిర్ణయాలతో జట్టు పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరుసగా రెండు ఓటములతో ఆటగాళ్ల స్థైర్యం దెబ్బతింది. ఎందుకంటే ప్రపంచంలో ఏ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగినా అక్కడ అంపైర్ నిర్ణయ పునఃస్సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) ఉంటోంది. కానీ ఎందుకో ఆది నుంచీ డీఆర్ఎస్కు భారత క్రికెట్ బోర్డు బద్ద వ్యతిరేకి. రెండు దేశాలకు సమ్మతి అయితేనే ఈ పద్ధతి అమల్లో ఉంటుంది. కాబట్టి భారత్ ఆడే టెస్టు సిరీస్ల్లో డీఆర్ఎస్ కనిపించదు. అయితే తాజా పర్యటనలో పలు నిర్ణయాలు భారత్కు వ్యతిరేకంగా వచ్చాయి. జరిగిన రెండు టెస్టుల్లో కనీసం ఐదు సార్లు డీఆర్ఎస్ లేని కారణంగా తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో మాజీ ఆటగాళ్లు కొందరు ఈ పద్ధతికి మద్దతుగా గళం విప్పుతున్నారు. ఎంతగా పోరాడినప్పటికీ అంపైరింగ్ తప్పిదాలతో జట్టు ఓడిపోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. కాబట్టి ఈ పద్ధతిని అమలు పరిచేందుకు ఇదే సరైన సమయమని వారు అంటున్నారు. ఇక అంగీకరించాల్సిందే ‘జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం కూడా డీఆర్ఎస్ పద్ధతికి మద్దతు ఇవ్వక తప్పదు. ఓసారి రెండు టెస్టులను గమనించండి. భారత్ పోరాడినా కీలక సమయాల్లో తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లు వెనుదిరగాల్సి వచ్చింది. ధావన్, పుజారా, అశ్విన్ నిర్ణయాల్లో డీఆర్ఎస్ ఉండి ఉంటే తప్పకుండా రెండు టెస్టుల్లోనూ విజయం సాధించే అవకాశం ఉండేది. అయితే వ్యక్తిగతంగా ఈ పద్ధతిలో వంద శాతం కచ్చితత్వం ఉంటుందని చెప్పలేను. అయినా 90 శాతం ఉన్నా ఒక్కోసారి మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కదా.’ -హర్భజన్ సింగ్ (స్పిన్నర్) నేను వ్యతిరేకం కాదు ‘సాంకేతికంగా ఎలాంటి పద్ధతితోనైనా కచ్చిత నిర్ణయాలు వస్తే వాటిని స్వాగతించాల్సిందే. నేను డీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు. అయితే వంద శాతం కచ్చిత నిర్ణయాలు రావాలంటే ఈ పద్ధతి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. హాట్స్పాట్ లేక హాక్ఐ ద్వారా ఎల్బీను పరిశీలించడంపై నమ్మకం ఉంచలేకపోతున్నాను. ఈ రెండు విషయాలు డీఆర్ఎస్ పద్ధతిలో ఓ కొలిక్కి రావాల్సి ఉంది.’ -వీవీఎస్ లక్ష్మణ్ (మాజీ టెస్టు ఆటగాడు) భారత్కే ఎందుకు అభ్యంతరం ‘డీఆర్ఎస్కు ఐసీసీ గుర్తింపునిచ్చింది. అన్ని జట్లూ దీన్ని అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు ఒక్క భారత్ మాత్రమే ఎందుకు దూరంగా ఉంటున్నట్టు? బ్రిస్బేన్ టెస్టులో చాలా నిర్ణయాలు భారత్కు వ్యతిరేకంగా వచ్చాయి. డీఆర్ఎస్ ఉంటే కచ్చితంగా అవి మనకు అనుకూలంగానే వచ్చేవి’-అజహరుద్దీన్ (మాజీ కెప్టెన్) -
స్టేడియం బయట ఇషాంత్ లంచ్..
భోజన ఏర్పాట్లపై ఆగ్రహం న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు భోజనం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాబా టెస్టు మూడో రోజున శాకాహార భోజనం లేకపోవడంతో పేసర్ ఇషాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ మధ్యలో మైదానం బయటకు వెళ్లి తినాల్సి వచ్చింది. అంతకు ముందు లంచ్ మెనూలో తమకు కావాల్సిన భోజనం లేకపోవడంతో ఇషాంత్తోపాటు సురేశ్ రైనా కూడా నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వీరు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి, ఐసీసీ ఏసీఎస్యూ అధికారితో కలిసిబయటి నుంచి ఆహారం తెచ్చుకున్నారు. అయితే బయటి నుంచి స్టేడియంలోనికి ఫుడ్ అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక ఇషాంత్, రైనా ఇద్దరూ స్టేడియం బయట తమ భోజనాన్ని కానిచ్చారు. సిరీస్కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంలోనూ తమకు ఇచ్చిన మెనూపై భారత జట్టు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆ సమయంలో హ్యూస్ మరణంతో అంతటా విషాదం నెలకొనడంతో ఫిర్యాదు చేయలేకపోయింది. అడిలైడ్ టెస్టుకు భారత చెఫ్ను ఏర్పాటు చేసి మంచి భోజనమే అందించినా బ్రిస్బేన్లో మాత్రం పట్టించుకోలేదు. -
ఇక ఆటపై దృష్టి
నేటి నుంచి భారత్కు ప్రాక్టీస్ మ్యాచ్ శుక్రవారం జట్టుతో చేరనున్న ధోని అడిలైడ్: భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫిల్ హ్యూస్ మైదానంలో గాయపడటం... ఆ తర్వాత అతను మృతి చెందడంతో వారం రోజుల పాటు క్రికెట్ గురించి ఎవరూ మాట్లాడలేదు. అంతా హ్యూస్ గురించే చర్చ. బుధవారం హ్యూస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇక గురువారం నుంచి మళ్లీ క్రికెట్ మీద దృష్టి సారించనున్నారు. గ్లెనెల్గ్లోని గ్లిడొరెల్ స్టేడియంలో జరిగే రెండు రోజుల మ్యాచ్లో భారత్... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రెసిడెంట్స్ ఎలెవన్తో తలపడుతుంది. హ్యూస్ అంత్యక్రియలకు హాజరైన విరాట్, రోహిత్, విజయ్ కూడా ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్టుకు ముందు ప్రాక్టీస్ కోసం ఇదే చివరి అవకాశం కాబట్టి... తుది జట్టులో ఉండే ఆటగాళ్లందరికీ ఎక్కువ అవకాశం ఇవ్వాలని జట్టు భావిస్తోంది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్, బౌలర్లు అందరూ రాణించారు. అయితే ఆ తర్వాత ఒకట్రెండు ప్రాక్టీస్ సెషన్లలో మాత్రమే పాల్గొన్నారు. చేతి గాయం నుంచి కోలుకున్న ధోని శుక్రవారం సాయంత్రం భారత జట్టుతో చేరతాడు. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకుండానే... 9 నుంచి అడిలైడ్లోనే జరిగే తొలి టెస్టులో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది ఆసక్తికరం. -
మసాల పుడ్కు మన క్రికెటర్స్ దూరం!
-
మోదీ వస్తున్నారని.. రాత్రంతా నిద్రపోలేదు!
మొన్నటికి మొన్న అమెరికాలో ప్రవాస భారతీయులతో పాటు అక్కడున్న వాళ్లందరినీ తన ప్రసంగంతో, మాటల మ్యాజిక్తో ఉర్రూతలూగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ తన మ్యాజిక్ చూపిస్తున్నారు. సిడ్నీ ఒలింపిక్ పార్క్ లోని ఆల్ఫోన్స్ ఎరెనా ప్రాంతంలో ఆయన కోసం ఓ మెగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. దానికి ముందుగానే ప్రవాస భారతీయులలో మోదీ మానియా గట్టిగా కనిపించింది. సుమారు 20 వేల మంది వరకు ఉన్న భారతీయులు ఈ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, లోపల స్థలం సరిపోదన్న ఉద్దేశంతో ఎందుకైనా మంచిదని నిర్వాహకులు ముందుగానే బయట కూడా పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటుచేశారు. మోదీ వస్తున్నారని తెలిసి రాత్రంతా తనకు నిద్రపట్టలేదని, ఎప్పుడు ఆ కార్యక్రమం మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నానని ఓ క్యాబ్ కంపెనీ యజమాని నరీందర్ శర్మ అన్నారు. వేరే ప్రాంతాల నుంచి 'మోదీ ఎక్స్ప్రెస్' పేరుతో ప్రత్యేక రైళ్లు కూడా వచ్చాయి. ఆ రైళ్ల కోసం చాలామంది వచ్చినా, లోపల స్థలం సరిపోక మిస్సయ్యారు. సీటు దొరకనందుకు చాలా బాధపడ్డానని రంజన్ సింగ్ రాణా చెప్పారు. మెల్బోర్న్ వాసుల కోసం మరిన్ని ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మెల్బోర్న్, ఇతర ప్రాంతాల నుంచి సిడ్నీకి విమానాల్లో కూడా చాలామంది బయల్దేరారు. బహుశా సిడ్నీలో ఇప్పటివరకు ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరిగి ఉండదని అంటున్నారు. ఇప్పటివరకు మరే విదేశీ నేతకు ఇంత భారీ స్పందన లభించలేదు. ముందుగా ఇక్కడికొచ్చిన నరేంద్ర మోదీకి గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఆ ఫొటోలను మోదీ ట్విట్టర్లో కూడా షేర్ చేశారు. -
రాజీవ్ గాంధీ తర్వాత మళ్లీ మోదీయే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాలలో పదిరోరజుల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన మయన్మార్లో పర్యటిస్తున్నారు. అక్కడి పర్యటన ముగిసిన అనంతరం ఆయన ఆస్ట్రేలియా వెళ్తారు. 1986 సంవత్సరంలో రాజీవ్ గాంధీ తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనున్న రెండో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అవుతారు. ఆస్ట్రేలియాలో జరిగే జి20 దేశాల సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. అనంతరం, ఆ దేశ ప్రధానమంత్రి టోనీ అబాట్తో చర్చలు కూడా జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా పర్యటన కోసం అక్కడి ప్రవాస భారతీయులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో అమెరికాలో నరేంద్రమోదీ పర్యటించినప్పుడు అక్కడ మాడిసన్ స్క్వేర్ ప్రాంతంలో ఆయన చేసిన ప్రసంగం చరిత్రాత్మకం కావడం, లక్షలాది మంది దాన్ని వీక్షించడం తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియాలో కూడా మోదీకి ఘన స్వాగతం పలకాలని అక్కడివారు భావిస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో భారత్ కు గడ్డుకాలమే: మెక్ గ్రాత్
న్యూఢిల్లీ: భారత జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన కఠిన పరీక్షేనని ఫాస్ట్ బౌలర్, మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్ అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో దారుణ ఓటమి తర్వాత..ఈ సంవత్సరాంతంలో ఆస్ట్రేలియాలో భారత జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని మెక్ గ్రాత్ జోస్యం చెప్పారు. క్యాచ్ లు వదిలేయడం ద్వారా భారత్ పై విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 0-4 తేడాతో ఓటమి పాలైన సంగతిని ఆయన గుర్తు చేశారు. గత యాషెస్ సిరీస్ లో భారత్ ను ఓడించిన ఇంగ్లాండ్ ను 5-0 తేడాతో ఆస్ట్రేలియా ఓడించిందని మెక్ గ్రాత్ అన్నారు. ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత జట్టు చెమటోడ్చాల్సిందేనని మెక్ గ్రాత్ తెలిపారు. -
అక్షర్, పాండేలకు అవకాశం!
ఇండియా ‘ఎ’ జట్టు ఎంపిక నేడు ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును బుధవారం సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. బంగ్లాదేశ్తో త్వరలో జరిగే వన్డే సిరీస్కు ఎంపికై, ఇంగ్లండ్ పర్యటనకు స్థానం దక్కని ఆటగాళ్లకు ప్రధానంగా ఇందులో అవకాశం లభించవచ్చు. ఇటీవల ఐపీఎల్-7లో అద్భుతంగా రాణించి బంగ్లా సిరీస్లో ఆడనున్న రాబిన్ ఉతప్ప ఈ జాబితాలో ముందున్నాడు. అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్కూ అవకాశం దక్కవచ్చు. రంజీ ట్రోఫీలో నిలకడైన ప్రదర్శనతో కర్ణాటకను గెలిపించిన మనీశ్ పాండేకు కూడా స్థానం లభించే అవకాశం ఉంది. జూలై 6 నుంచి ఆగస్టు 12 వరకు ఈ పర్యటన కొనసాగుతుంది.