bail petetion
-
హైకోర్టులో మోహన్ బాబుకు షాక్.. !
టాలీవుడ్ నటుడు మోహన్బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా.. ఇటీవల జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి చేశారంటూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)ఈ ఘటనపై మోహన్బాబు మీడియాను క్షమాపణలు కోరారు. తాను చేసిన పనికి ఎంతో బాధపడుతున్నానని ఆడియో సందేశం కూడా విడుదల చేశారు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టి రావడం న్యాయమేనా? అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు.హైకోర్టులో మోహన్ బాబుకు షాక్..టాలీవుడ్ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో ఎలాంటి దర్యాప్తు, అరెస్ట్ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు. తాజాగా ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్లో వివరించారు.కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్లో వర్మ మెసేజ్ పెట్టారు.మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు తిరుపతన్న
న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాది అయిన తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసిందికాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన తిరుపతన్నకు ఈనెల ప్రారంభంలో హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న ధర్మాసనం.. ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని తెలిపింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్క్లను డీఎస్పీ ప్రణీత్రావు, తదితరులు ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఏడు నెలలుగా ఈయన జైలులోనే ఉన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాాకర్ రావు నేృతృత్వంలో పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడగా... ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీట్ సైతం దాఖలుచేశారు. అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ మందగించింది. ప్రభాకర్రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై సీట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. -
కవితకు గుడ్ న్యూస్
-
కవిత బయటకు వస్తుంది.. వచ్చే వారంలో బెయిల్: కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని చెప్పుకొచ్చారు ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో కవిత ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.కాగా, కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ.. తీహార్ జైలులో ఉన్న కవిత ఆరోగ్యం క్షీణించింది. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీల బరువు తగ్గింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతోంది. వచ్చే వారంలో బెయిల్కు వస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కవితకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తుందనే వార్తలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవితకు ఇప్పటికే కోర్టు బెయిల్ను నిరాకరించింది. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది. -
SC: సిసోడియా పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తైంది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై మంగళవారం (ఆగస్ట్6 న)తో వాదనలు పూర్తి కాగా, కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా 17 నెలలకు పైగా జైలులో ఉన్నారు. గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆయన అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. సిసోడియాకు సుదీర్ఘ జైలు శిక్ష కొనల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అంతేకాదు.. ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. కానీ, అలాంటిదేం జరగలేదని.. పైగా సరైన ఆధారాల్ని కూడా ఉంచలేదని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ తరఫు లాయర్ వాదించారు. దీంతో.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. Excise policy cases: SC reserves order on AAP leader Manish Sisodia's bail pleasEdited video is available on PTI Videos (https://t.co/L2D7HH309u) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/6fFzsSumFq— PTI News Alerts (@PTI_NewsAlerts) August 6, 2024 -
కవిత కొడుకు పరీక్షల భయంలో ఉన్నాడు, బెయిల్ ఇవ్వండి
-
శివబాలకృష్ణకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివబాలకృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది. మరోవైపు శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్ర పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని ఏసీబీ అధికారులు చెప్పారు. ఇవీ ఆస్తులు... శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్గఢ్ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సుదీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్ అయ్యాయన్నారు. అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సుదీంద్ర తెలిపారు. ఇది చదవండి: HMDA Siva Balakrishna Case: శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్.. -
చంద్రబాబు అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
ACB కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న జస్టిస్ బోస్
-
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
-
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిట్ ముందు లొంగిపోయిన చంద్రబాబు
-
చంద్రబాబు ఏదో కొత్త స్కిల్ వాడుతున్నాడు: దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి కామెంట్స్
-
సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
చంద్రబాబు బెయిల్పై అడ్వకేట్ సాయిరాం కామెంట్స్
-
తీర్పు వెల్లడించిన ఏపీ హైకోర్టు
-
బాబు బెయిల్ పిటిషన్ పై అదనపు కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
-
బాబు బెయిల్ పై మంత్రి బొత్స షాకింగ్ విషయాలు..!
-
చంద్రబాబు బెయిల్ రద్దు ఖాయం...?
-
జైలు నుంచి బయటకు వస్తూనే మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..హైకోర్టు ఆదేశాలను..!
-
ముందుంది ముసళ్ల పండగ..జైలు గ్యారెంటీ..గోరంట్ల మాధవ్ సెటైర్లు
-
2024లో ఏపీలోనూ టీడీపీ జెండా పీకేస్తారు: వెల్లంపల్లి
-
చంద్రబాబు బెయిల్పై కండిషన్స్ పెంపు
-
పురందేశ్వరికి వెల్లంపల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా?
-
నిజం గెలిచి బాబుకు బెయిల్ రాలేదన్న అంబటి
-
వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు
-
రాజమండ్రి సెంట్రల్ జైలు 46వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
-
స్కిల్ స్కాంలో సుప్రీం మాట ఏంటి?
-
స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా..!
-
బాబు కుటుంబంతో పాటు టీడీపీ నేతల ఆందోళనల పై విమర్శలు
-
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ప్రారంభమైన విచారణ
-
బాబు ఆరోగ్య పరిస్థితిని నేరుగా తెలుసుకున్న ఏసీబీ కోర్టు
-
చంద్రబాబు ఆరోగ్యంపై పచ్చ మీడియా తప్పుడు కథనాలు
-
గజదొంగ అని అర్థమైంది..అందుకే ఈ రివర్స్ గేర్
-
చర్మ సంబంధిత సమస్యకు కొన్ని మందులు రాసిచ్చాం: వైద్యులు
-
బాబు జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారు: డీఐజీ రవికిరణ్
-
చట్టం ముసుగులో చంద్రబాబు దాగుడుమూతలు
-
17A - చంద్రబాబు లాయర్ల వాదనలు
-
అవినీతిపరులకు 17A కవచంగా మారుతుందా..?
-
సుప్రీంకోర్టుకు వెళితే... చంద్రబాబు కేసు విచారణలో తాజా అప్డేట్..!
-
చంద్రబాబుకు నిరాశ? చంద్రబాబు కేసు అప్డేట్స్
-
జీఎస్టీ డీజీ స్కిల్ స్కాంలో చేసిన విచారణ కాపీని సమర్పించాం: రోహత్గీ
-
చంద్రబాబుకు బెయిల్ భయం పట్టుకుందా..?
-
బాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: యుద్ధభేరి పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు టీడీపీ శ్రేణులు ఇటీవల సాగించిన విధ్వంసంపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు మంగళవారం ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ బెయిల్ పిటిషన్కు విచారణార్హతే లేదన్నారు. మరో కేసులో అరెస్టయినందున ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. పలు కేసులు ఒకే పోలీస్టేషన్లో నమోదై, వాటిని ఒకే అధికారి దర్యాప్తు చేస్తుంటే అప్పుడు డీమ్డ్ (అన్నీ కేసుల్లో అరెస్ట్ అయినట్లు) అరెస్ట్ వస్తుందని, వేర్వేరు కేసులు, వేర్వేరు దర్యాప్తు అధికారులున్నప్పుడు అది డీమ్డ్ అరెస్ట్ కిందకు రాదని స్పష్టంచేశారు. డీమ్డ్ అరెస్ట్ అయితే పీటీ వారెంట్తో పనేముంటుందని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే పీటీ వారెంట్ దాఖలు చేశామన్నారు. అసలు చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు ఘటన జరిగిందన్నారు. అంగళ్లు వద్ద మొదలైన టీడీపీ శ్రేణుల విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబే దగ్గరుండి శ్రేణులను రెచ్చగొట్టారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టును కోరారు. మారణహోమం సృష్టించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలన్నదే చంద్రబాబు వ్యూహమన్నారు. అంతిమంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని ఆయన కోరారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ మరో కేసులో అరెస్టయి జైలులో ఉన్నందున, ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అందుకే బెయిల్ పిటిషన్ వేశామని తెలిపారు. అధికార పార్టీ నేతలు చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు రువ్వారని, ఆ దాడి నుంచి ఆయన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షించారని తెలిపారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైందని చెప్పారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: అభిషేక్ బోయినపల్లి పిటిషన్ను విచారించిన సుప్రీం..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఈడీకీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా రిజాయిండర్ దాఖలుకు అభిషేక్ బోయినపల్లికి రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర 20కు వాయిదా వేసింది. -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు, వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్రెడ్డి బెయిల్ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. దాదాపు నెలన్నర రోజులుగా జైలులో ఉంటున్నానని, కస్టడీ విచారణ కూడా ముగిసిందని భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర్రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఏప్రిల్ 24 నుంచి చంచల్గూడ జైలులో ఉంటున్న భాస్కర్రెడ్డి గత వారం అస్వస్థతకు గురవ్వగా.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు హృదయ సంబంధ సమస్యలున్నట్లు గుర్తించారు. దీంతో నిమ్స్కు తరలించి.. పలు పరీక్షలు చేశారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ -
అవినాష్ రెడ్డి పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. అవినాష్ తరపున సీనియర్ కౌన్సిల్ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. రేపు ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాదనలను రేపు విననుంది. వైఎస్ అవినాష్ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక, అంతకుముందు ముందస్తు బెయిల్పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ కోరే హక్కు పిటిషనర్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అవినాష్ పిటిషన్పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కూడా చదవండి: అవినాష్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా! -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రేణుకకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రాథోడ్ రేణుకకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం రేణుక దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు శనివారం కొట్టివేసింది. మరోవైపు పేపర్ లీక్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన మరో ముగ్గురు నిందితులను సిట్ కస్టడీకి కోరింది. అరెస్టయిన ప్రశాంత్, రాజేష్, తిరుపతయ్యను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును సోమవారం ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు వెల్లడించింది. కాగా, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అయితే పేపర్ లీక్ కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న బెయిల్ దాఖలు చేసింది. రేణుకకు ఆరోగ్యం బాగోలేదని, తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వారి బాగోగులు చూసే వారు ఎవరూ లేనందున బెయిల్ ఇవ్వాలని రేణుక తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సిట్ విచారణకు ఆమె మొదటి నుంచి సహకరిస్తోందని, ఇక ముందు కూడా సహకరిస్తుందన్న న్యాయవాది పేర్కొన్నారు. అయితే కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, చాలా మంది పాత్ర ఇందులో ఉందని సిట్ విచారణలో వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు రేణు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. -
మనీష్ సిసోడియాకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆప్ నేత బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్పాల్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కాగా లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో అరెస్ట్ అయిన సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని ఆరోపించిన సీబీఐ.. ఎనిమిది గంటలపాటు సిసోడియాను విచారించిన అంనంతరం ఫిబ్రవరి 26న ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆప్ సీనియర్ నేత విచారణకు సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదంటూ అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అతడి పేరును నిందితుల జాబితాలో చేర్చారు. అంతకుముందు సిసోడియా తన బెయిల్ పిటిషన్లో సీబీఐ విచారణకు హాజరువుతున్నానని, భవిష్యత్తులో కూడా సహకరిస్తానని తెలిపారు. ఈ కేసులోని మరో నిందితుడికి ఇప్పటికే బెయిల్ మంజూరు అయ్యిందని గుర్తుచేశారు. అంతేగాక ఈ కేసులో ఇప్పటికే అన్ని రికవరీలు జరిగాయని, ఈ క్రమంలో ఇంకా తాను కస్టడీలో ఉండటానికి ఎలాంటి ప్రయోజనకర ఉద్దేశ్యం లేదని తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ ‘డిగ్రీ’ చూపించాల్సిన అవసరం లేదు: హైకోర్టు అయితే ఆప్ నేత బెయిల్ పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించింది. సీబీఐ తరపున డీపీ సింగ్ వాదనలు వినిపించారు. అతనికి బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తును దెబ్బతీస్తుందని, సిసోడియా సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు, సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ.. తాము సెక్షన్ 41A CrPC నోటీసులకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని తాము ఆ దశను దాటేశామని పేర్కొన్నారు. కస్టడీని కంటిన్యూ చేయడానికి సీబీఐ బలవంతమైన కారణం ఏం పేర్కొనలేదని.. సిసోడియా సాక్షులను బెదిరించగలరని రికార్డుల్లో ఎక్కడ లేదని కోర్టుకు విన్నపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు ఈనెల 24వ తేదీన సిసిడియా బెయిల్ అభ్యర్థనపై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. -
రాజాసింగ్ బెయిల్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత నెల 25న రాజాసింగ్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయ్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. పలు కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. దీనిపై జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టి.. కౌంటర్ దాఖలు కోసం ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువిచ్చింది. విచారణను వాయిదా వేసింది. చదవండి: పాతబస్తీ క్షుద్రపూజల కలకలం -
ఆర్యన్ బెయిల్ విచారణ వాయిదా
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్కు బెయిల్ రద్దైంది. తాజాగా మంగళవారం మరోసారి ఆర్యన్ బెయిల్ పిటిషన్పై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్యన్ను అరెస్టు చేయడంలో అసలు అర్థం లేదని, ఆర్యన్ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ఆర్యన్ వాట్సప్ చాట్ అంతా గతేడాదివేనని, తాజా కేసుతో ఆర్యన్కు సంబంధం లేదని తెలిపారు. అంతేగాక క్రూయిజ్ షిప్ దాడిలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని, ప్రదీప్ గబ్బా ఆహ్వానం మేరకే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఆర్యన్కు ఇప్పటి వరకు మెడికల్ టెస్ట్ చేయలేదని, ఇది ప్రీప్లాన్డ్గా జరిగిన అరెస్ట్ అని ముకుల్ రోహత్గీ వాదించారు. ఇదిలా ఉండే ఆర్యన్కు బెయిల్ను వ్యతిరేకిస్తూ ఎన్సీబీ అధికారులు ముంబై హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆర్యన్కు బెయిల్ ఇవ్వొద్దని, అతడికి డ్రగ్స్ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని ఎన్సీబీ పిటిషన్లో పేర్కొంది. ఆర్యన్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కూడా ఎన్సీబీ తెలిపింది. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేపు ఆర్యన్కు బెయిల్ వస్తుందా? లేదా? తేలనుంది. డ్రగ్స్ కేసులో ఈ నెల 3న అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్షా తనయుడు.. అప్పటి నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నాడు. ఇప్పటికే రెండుసార్లు కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. -
సోషల్ మీడియా ట్రెండిగ్లో #ReleaseAryanKhan
ముంబైలో క్రూయిజ్ షిప్లో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్తో పాటు మరో ఏడుగురు అరస్టయిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం కస్టడీని 14 రోజులకు పొడిగించిన ముంబై కోర్టు, ఈ కేసును స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టుకి అప్పగించింది. దీంతో శుక్రవారం మరోసారి అతని బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది సోషల్ మీడియాలో ఆర్యన్కి మద్దతు తెలుపుతున్నారు. ఈ కేసు విషయమై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు షారుక్ ఫ్యామిలీకి సపోర్టుగా నిలిచారు. కాగా అతని దగ్గర డ్రగ్స్ దొరకలేదు. అతను డ్రగ్స్ తీసుకోలేదు అయినా ఇప్పటికీ జైలులో ఉంచడం కరెక్ట కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్లో #ReleaseAryanKhan ట్రేండింగ్లోకి వచ్చింది. కొన్ని ట్విట్స్ ఈ యాష్ట్యాగ్తో సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి. చదవండి: నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నా: ఆర్యన్ #ReleaseAryanKhan RELEASE ARYAN KHAN Rt if you are loved @iamsrk Fast Rt 500 Rt in 15 min Top 1 trends pic.twitter.com/uYXt3UYwT2 — Ayan khan (@AyanKha30668226) October 7, 2021 #ReleaseAryanKhan RELEASE ARYAN KHAN India stand @iamsrk Rt agree pic.twitter.com/Uldq4So571 — Ayan khan (@AyanKha30668226) October 7, 2021 No consumption , no Possession STILL in custody . We demand release of ARYAN Khan as soon as possible . what were these 2 BJP workers were doing with NCB , and holding accused " ARYAN KHAN WAS FRAMED #ReleaseAryanKhan — ♛Aȥαԃ♛ (@AagKaDevta) October 7, 2021 -
బెయిల్కు దరఖాస్తు చేసుకున్న ఒలింపిక్స్ పతక విజేత
Wrestler Sushil Kumar Seeks Bail In Murder Case: సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో ఒలింపిక్స్ పతక విజేత సుశీల్ కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సోమవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో అతని తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని సుశీల్ తన పిటిషన్లో ప్రస్తావించారు. అడిషనల్ సెషన్స్ జడ్జి శివాజీ ఆనంద్ రేపు ఈ పిటిషన్ను విచారించనున్నారు. కాగా, ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద 23 ఏళ్ల సాగర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్ను ఢిల్లీ పోలీసులు మే 23న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్.. 2008, 2012 విశ్వక్రీడల్లో కాంస్యం, రజత పతకాలు సాధించాడు. చదవండి: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు -
గాలి జనార్ధన్రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బళ్లారి, అనంతపురం, కడప వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం అతనికి అనుమతినిచ్చింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై గురువారం విచారణ జరిపి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ షరతులు ఎక్కడా ఉల్లంఘించలేదన్న కోర్టు.. స్థానిక జిల్లా ఎస్పీకి ముందస్తు సమాచారం అందించి సదరు ప్రాంతాలకు వెళ్లొచ్చని పేర్కొంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ మూడో వారానికి వాయిదా వేసింది. చదవండి: తనయుడి గిఫ్ట్కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి -
జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటీషన్ వాయిదా..
సాక్షి. హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ను వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్టు వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించి జగత్ విఖ్యాత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందు చేత అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కాగా, ఇదే కేసులో అరెస్టు అయిన మరో 15 మంది నిందితులు కూడా సికింద్రాబాద్ కోర్టులోనే బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, అన్ని పిటీషన్లను వచ్చే శుక్రవారం విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఇదే కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టై ఇటీవలే విడుదలయ్యారు. ఆమె భర్త భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను, చంద్రహాస్లు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. -
అర్నాబ్ గోస్వామికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. అర్నాబ్తో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. (చదవండి : అర్నబ్ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు) కాగా, ఈ కేసులో గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్కు నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అర్నాబ్ సుప్రీం కోర్టు తపులు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్ గోస్వామి వాదన. -
అర్నబ్ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి సుప్రీం తలుపు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అర్నబ్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. ‘టీవీ చానెల్స్ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్ చేసింది సరైనదిగా అనిపించడం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’అని సుప్రీం బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, సదరు జర్నలిస్టుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అర్నబ్ తరపు న్యాయవాది సాల్వే మాట్లాడుతూ.. తమ కేసు ఎఫ్ఐఆర్ దశ దాటిపోయిందని, దర్వాప్తు జరిగిన తర్వాతే మే, 2018లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ కేసు పునర్ దర్వాప్తు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, ఈ కేసులో గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్కు నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్ గోస్వామి వాదన. -
వరవరరావుకు బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో అరెస్టయి, ముంబై జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ కవి, 81 ఏళ్ళ వరవరరావుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన భార్య పెండ్యాల హేమలత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయనను నిరవధికంగా కస్టడీలో ఉంచటం అమాన వీయం, క్రూరత్వమని, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను అతిక్రమించడమేనని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. 2018 నవంబర్లో జ్యుడీషియల్ కస్టడీకి వెళ్ళేనాటికి 68 కేజీల బరువున్న వరవరరావు ఇప్పుడు 50 కేజీల బరువున్నారని, ఆయన 18 కేజీల బరువు తగ్గారని, వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, మంచంలో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నారని వెల్లడించారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు, కోవిడ్ ప్రబలిన తరువాత తలెత్తిన ఇబ్బందుల కారణంగా వరవరరావుకి నిరంతర పర్యవేక్షణ అవసరమౌతోందని హేమలత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ తెలిపారు. -
బలవంతంగా ఒప్పించారు: రియా
ముంబై: ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న రియాచక్రవర్తి తనకు జైల్లో ప్రాణభయం ఉన్నదనీ, తనపై మోపినవి బెయిలబుల్ నేరాలు కనుక తక్షణమే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. తాను అమాయకురాలిననీ, తనని తప్పుడు కేసులో ఇరికించారనీ రియా తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. మంగళవారం మెజిస్ట్రేటు కోర్టు రియా బెయిల్ పిటిషన్ని తిరస్కరించడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్లు నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద బెయిల్ కోసం ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. రియాని ప్రశ్నించింది పురుష అ«ధికారులేనని ఆమె న్యాయవాది సతీష్ మనే షిండే అన్నారు, ఆ సమయంలో కనీసం మహిళా పోలీసు అధికారి కానీ, కానిస్టేబుల్ కానీ లేకపోవడాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. నేరం అంగీకరించేలా రియాపై ఒత్తిడిచేశారని ఆమె లాయర్ ఆరోపించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ల బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు రానుందని షిండే తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో మంగళవారం స్థానిక కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు జ్యూడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే రియా, ఆమె సోదరుడు షోవిక్ పదిసంవత్సరాలకు తగ్గకుండా కారాగార శిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
జేసీ ప్రభాకర్, అస్మిత్కు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను రోడ్లపై ఎలా తిప్పుతారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ప్రమాదాలకుఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. మోసపూరిత పనులను అనుమతించమని తెల్చిచేప్పింది. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. (దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ) దీంతో హైకోర్టులో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను జేసీ కుటుంబసభ్యులు ఉపసంహరించుకున్నారు. అదే విధంగా కింది కోర్టులో బెయిల్ దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా చూపి రిజిస్ట్రేషన్ చేయించి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్స్తో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. నాగాలాండ్ రాష్ట్రంలో కూడా పలు వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్లు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. -
‘నీ కోసం భారత్లో ఉరి శిక్ష ఎదురుచూస్తోంది’
వాషింగ్టన్: 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు, పాక్ సంతతి కెనడా వ్యాపారవేత్త తహవుర్ రానాకు.. బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు నిరాకరించింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రానా 1.5 మిలియన్ డాలర్ల బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. 2008 ముంబై కేసులో అతని కోసం భారత్ ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన అమెరికా కోర్టు.. రానాను ఫ్లయిట్ రిస్క్గా భావించింది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ చిన్ననాటి స్నేహితుడైన రానాను జూన్ 10న లాస్ ఏంజిల్స్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2008 ముంబై ఉగ్రవాద దాడిలో రానాకు ప్రమేయం ఉన్నందున అతడికి అప్పగించాలంటూ భారతదేశం కోరింది. 2008నాటి ఘటనలో ఆరుగురు అమెరికన్లతో సహా 166 మంది మరణించారు. (ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్) లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు జడ్జి జాక్వెలిన్ చూల్జియన్.. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న 24 పేజీల తీర్పునిచ్చారు. పారిపోయే అవకాశం ఉన్నందున రానాకు బెయిల్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ అతన్ని కెనడా వెళ్లేందుకు అనుమతిస్తే.. అప్పుడు రానా భారత్లో శిక్షను తప్పించుకుంటాడని కోర్టు అభిప్రాయపడింది. భారీ మొత్తంపై బెయిల్ ఇచ్చినా.. కోర్టుకు తీసుకువచ్చే గ్యారెంటీ ఉండదని కోర్టు తెలిపింది. అతడి కోసం భారతదేశంలో ఉరి శిక్ష ఎదురు చూస్తుందని.. ఇప్పుడు రానాకు బెయిల్ మంజూరు చేస్తే.. అతడు పారిపోయే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాక రానాకు బెయిల్ మంజూరు చేయడం వల్ల అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని అసిస్టెంట్ యుఎస్ అటార్నీ జాన్ జె లులేజియన్ కోర్టుకు తెలిపారు. అయితే రానా వల్ల ఎటువంటి రిస్క్ లేదని, ఆయనపై 1.5 మిలియన్ల డాలర్ల పూచీకత్తు పెడుతున్నామని కోర్టులో అతని తరఫున న్యాయవాది వాదించారు. ('ఆ ఘటన మరిచిపోలేనిది, క్షమించరానిది') రానాపై భారత్లో హత్య అభియోగం కింద కేసులు ఉన్నాయి. లష్కరే తోయిబాకు ఆర్థిక సహాకారం అందిస్తున్న కేసులో.. 2011లో షికాగో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వాస్తవానికి అమెరికాలో రానాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు అతన్ని భారత్కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డేవిడ్ కోల్మన్ హెడ్లీ సహకారంతో రానా అమెరికాలో ఉగ్రవాదులకు సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముంబై పేలుళ్ల కేసులో హెడ్లీ కూడా దోషిగా ఉన్నాడు. -
నటి శ్రుతి బెయిల్ పిటిషన్ కొట్టివేత
తమిళసినిమా: నటి శ్రుతి బెయిల్ పిటిషన్ను కోవై కోర్టు కొట్టివేసింది. కోవై, పాపనాయగన్ పాళైయం, ధనలక్ష్మీనగర్కు చెందిన నటి శ్రుతి(21) ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువకుల నుంచి కోట్లాది రూపాయలను గుంజి మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎడపాడి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బాలకుమార్ను పెళ్లి పేరుతో రూ.45 లక్షలు మోసానికి పాల్పడడంతో అతను కోవై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర, సోదరుడు సుభాష్, సహయకుడు ప్రసన్న వెంకటేశ్లను అరెస్ట్ చేసి కోవై సెంట్రల్ జైలుకు పంపారు. నటి శ్రుతితో పాటు నలుగురు బెయిల్ను మంజూరు చేయవలసిందిగా కోవై జేఎం.కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వేల్స్వామి ఆ నలుగురికి బెయిల్ను మంజూరు చేయడానికి నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేశారు. -
గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
-
హనీప్రీత్కు హైకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును మంగళవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఆగస్టు 25న గుర్మీత్ అరెస్ట్ అనంతరం అల్లర్లు రెచ్చగొట్టేందుకు హనీప్రీత్ ప్రయత్నించారని ఆరోపిస్తూ పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్ కోసం హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్..పంచకుల కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను ఆలస్యం చేయడానికే హనీప్రీత్ హైకోర్టును ఆశ్రయించారని అభిప్రాయపడ్డారు. హనీప్రీత్ ముందున్న సులువైన మార్గం లొంగిపోవడమేనని తెలిపారు. తొలుత హనీప్రీత్ సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు రిజర్వులో ఉంచింది. అయితే హనీప్రీత్కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ, హరియాణా పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. హనీప్రీత్ తన బెయిల్ పిటిషన్లో ఢిల్లీలో ఇంటికి సంబంధించి తప్పుడు చిరునామా ఇచ్చి కోర్టును మోసం చేశారని పేర్కొన్నారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం హనీప్రీత్ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. మరోవైపు హనీప్రీత్తో పాటు ఇద్దరు డేరా ప్రధాన అనుచరుల్ని అరెస్ట్ చేసేందుకు వారెంట్తో ఢిల్లీ చేరుకున్న హరియాణా పోలీసులు పలుచోట్ల దాడులు చేశారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ బ్లాక్లో గుర్మీత్ పేరుపై ఉన్న ఇంటి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై అత్యాచారం కేసులో గుర్మీత్కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
కుమార్తె నిశ్చితార్థానికి బెయిల్ కోరిన రేవంత్
-
రేవంత్ కోసం సుప్రీం లాయర్లు
-
రేవంత్ కోసం సుప్రీం లాయర్లు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది రేవంత్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. రేవత్ రెడ్డి బెయిల్ పిటిలషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. కుమార్తె నిశ్చితార్థానికి రెండు రోజులు బెయిల్ కావాలని రేవంత్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. మేం కూడా నాగరిక ప్రపంచంలో ఉన్నామని, ఈ సాయంత్రం వెళ్లి..రేపు సాయంత్రం వస్తే మాకు అభ్యంతరం లేదని పబ్లికి ప్రాసిక్యూటర్ అన్నారు. ఒకరోజుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఎవరితోనూ భేటీకాకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించారు. రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేక కస్టడీ కొనసాగుతుందా అనే విషయం మరికాసేపట్లో తెలియనుంది.