benifits
-
ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ.. దాదాపు 'ఏటీఎం' (ATM) కార్డు (డెబిట్ కార్డు) ఉంటుంది. ఏటీఎం అనేది కేవలం డబ్బు విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ఇతర కార్యకలాపాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు.ఫండ్ ట్రాన్స్ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు.క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా చెల్లించవచ్చు. దీనికి మీ డెబిట్ కార్డు, పిన్ నెంబర్ వంటివి అవసరమవుతాయి.బీమా ప్రీమియం చెల్లింపు: ఏటీఎం ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ వంటివి బ్యాంకులతో టై-అప్లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏటీఎంలోనే ప్రీమియం చెల్లించవచ్చు.చెక్బుక్ రిక్వెస్ట్: చెక్ లీఫ్లు అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏటీఎం వీడరనే కొత్త చెక్బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. చిరునామా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామాకే చెక్బుక్ (Checkbook) వస్తుంది.బిల్ పేమెంట్స్: ఏటీఎం ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. అయితే ముందుగా బిల్లింగ్ కంపెనీ ఏటీఎం నెట్వర్క్కి లింక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బు పంపే ముందు, బ్యాంకు వెబ్సైట్లో చెల్లింపుదారు వివరాలను నమోదు చేసుకోవాలి.మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి యాక్టివేట్ చేస్తారు. అయితే మీరు ఏటీఎం ఉపయోగించి కూడా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.ఏటీఎం పిన్ చేంజ్: ఏటీఎం ఉపయోగించే.. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే.. ఏటీఎంలోనే పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. -
Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు
భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్)గా జరుపుకుంటారు. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు ఉపకరించేలా ప్రభుత్వం అందిస్తున్న కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ ఆరు వేలు ఆర్థిక సహాయంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అందిస్తారు. ఈ మొత్తం ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది.2. ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ధన్ యోజన (పీఎం-కేఎంవై) ఈ పథకం లక్ష్యం రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ప్రతీనెలా రూ. 55 నుంచి రూ. 200 వరకూ ఈ పథకంలో చెల్లిస్తే, వారికి 60 ఏళ్లు వచ్చాక ప్రతీనెలా రూ. 3,000 పెన్షన్ రూపంలో పొందవచ్చు.3. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) ఈ పథకం కింద, రైతులు నారు వేయడం లేదా విత్తనం నాటడం నుండి పంట కోసే వరకు పంటల రక్షణ కోసం బీమాను అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి ఇది రైతులకు సహాయపడుతుంది.4. జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్బీహెచ్ఎం) తేనెటీగల పెంపకానికున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయంగా తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం అందించడమే ఈ పథకం లక్ష్యం. ‘తీపి విప్లవం’ లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తేనెటీగల పెంపకందారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.5. నమో డ్రోన్ దీదీప్రభుత్వం ఇటీవలే నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జీ) డ్రోన్లను అందజేస్తున్నారు. గ్రామాల్లో నివసించే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.6. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (కేసీసీ)ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు వారి వ్యవసాయ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది. అలాగే రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది.ఇది కూడా చదవండి: తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్ -
'మష్రూమ్ కాఫీ'ని ఎప్పుడైనా తాగారా! కొందరికి ఇదీ..?
మష్రూమ్ వంటకాల గురించి తెలిసిన చాలామందికి ‘మష్రూమ్ కాఫీ’ గురించి తెలియకపోవచ్చు. నిజానికి ఇది లేటెస్ట్ కాఫీ ఏమీ కాదు. 1930 నుంచే ఆహా అనిపిస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి దీన్ని తయారు చేస్తారు.ఈ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి...– మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.– మష్రూమ్ కాఫీలోని అడా΄్టోజెనిక్ శరీరానికి మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది.– రోగనిరోధక శక్తి పెరుగుతుంది.– ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది.– గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.– పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.– వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి అలసట తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.– మామూలు కాఫీలో కంటే కెఫిన్ తక్కువగా ఉంటుంది.– ఏకాగ్రతను పెంచుతుంది.ఈ కాఫీని మామూలు కాఫీలాగే తయారు చేస్తారు. అయితే మష్రూమ్ పౌడర్ కలుపుతారు. ‘మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకి’గా మష్రూమ్ కాఫీ గురించి చెబుతున్నటికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మష్రూమ్ అలెర్జీ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి. దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో నొప్పి, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... మొదలైనవి మష్రూమ్ అలర్జీ లక్షణాలు. మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మష్రూమ్ కాఫీని సేవించాలనుకోవడానికి ముందు డైటీషియన్ను సంప్రదించడం మంచిది. -
పండంటి ఉపవాసంతో.. ఆరోగ్య లాభాలు!
ఉపవాసాలు రకరకాలు. ఒక రోజంతా కేవలం నీటిని తాగుతూ ఇతర ఏ ఆహారమూ తీసుకోకుండా ఉపవసించడాన్ని జలోపవాసం అంటారు. ఒక రోజంతా పండ్లను మాత్రమే తీసుకుంటూ ఇతర ఏ ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉండడాన్ని ఫలోపవాసం అంటారు.వారం లేదా రెండు వారాలకో రోజు ఏదో ఒక ఉపవాసాన్నిపాటించడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తశుద్ధి జరిగి చర్మం నిగారిస్తూ ఉంటుంది. ఉపవాసాలు రకరకాలు. ఒక రోజంతా కేవలం నీటిని తాగుతూ ఇతర ఏ ఆహారమూ తీసుకోకుండా ఉపవసించడాన్ని జలోపవాసం అంటారు. ఒక రోజంతా పండ్లను మాత్రమే తీసుకుంటూ ఇతర ఏ ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉండడాన్ని ఫలోపవాసం అంటారు. వారం లేదా రెండు వారాలకో రోజు ఏదో ఒక ఉపవాసాన్నిపాటించడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తశుద్ధి జరిగి చర్మం నిగారిస్తూ ఉంటుంది.ఇవి చదవండి: జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు! -
Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
ప్రతిరోజూ ఎండతోపాటుగా.. వర్షాలు, చల్లదనం, వాతవరణంలో ఓకేసారి మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అందులో చర్మం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపంచాలంటే ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేయండి..పుచ్చకాయ.. ద్రాక్ష!పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతిమంతం అవుతుంది.ఆరెంజ్ జ్యూస్..టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది.కొబ్బరిపాలతో..ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్లో ఉంచిన కొబ్బరిపాలలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులపై అద్ది, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.సోంపుతో..రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టి, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్లో ఉంచాలి.ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూది ఉండను సోంపు నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగిస్తాయి. దురద, దద్దుర్లు, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా! -
ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా!
నిగనిగ మెరిసిపోతూ.. ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి కూడా బాగుంటాయి. అందుకే అందరూ వీటిని అందరూ ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..ఖర్జూరాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే... కనీసం ఒక వారం లేదా పదిరోజులపాటు క్రమం తప్పకుండా నాలుగయిదు తినాలి. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.గుండెకు బలం..ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్టెన్షన్ , స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో ΄÷టాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్, బీపీని నార్మల్గా ఉంచుతుంది.కండరాలు బలంగా ఉంటాయి..ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే. ΄÷టాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.సంతానోత్పత్తి సామర్థ్యం..మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి. ఖర్జూరం తింటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.మెరుగైన జ్ఞాపకశక్తి..ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడును ఒత్తిడి, వాపు నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను రోజూ తింటే.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే.. న్యూరో డీ జెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుంటాయి. పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.జీర్ణ సమస్యలు దూరం..ఖర్జూరంలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం దరి చేరదు.ఇవి చదవండి: కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి! -
ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే!
మనకు తెలిసిన విషయమే కదా అని తేలిగ్గా తీసిపారేయద్దు. అలాగే బద్ధకించవద్దు. క్రమం తప్పకుండా రోజూ ఓ అరగంట పాటు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్లిమ్గా ఉండవచ్చు. డయాబెటిస్, బీపీ వంటి వాటికి దూరంగా ఉండచ్చు.అన్నింటికీ మించి రోజంతా ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండచ్చు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నడవడం కాదు... మన నడక ఎలా ఉండాలి... ఎంత దూరం నడవాలి? ఏ సమయంలో నడవాలి... వంటి ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం..!క్రమం తప్పకుండా నడవడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా, శారీరక వ్యాయామాలు, కార్యకలాపాలు ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఇతర సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాల పాటు చేసే మార్నింగ్ వాక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.వ్యాయామాలన్నింటిలోనూ అతి తేలికపాటి వ్యాయామం ఏదంటే నడకే అని చెప్పచ్చు. బరువును నియంత్రించడంలో, కేలరీలను కరిగించడంలో వాకింగ్ను మించిన మందే లేదు. క్రమబద్ధమైన నడక వార్థక్య ఛాయలను నివారిస్తుంది. అయితే ఆ నడక ఎలా ఉండాలి... ఎప్పడు చేయాలో చూద్దాం...శక్తిని పెంచుతుంది..మార్నింగ్ వాక్ ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. అలా ఖాళీ కడుపుతో చేసే మార్నింగ్ వాక్ శక్తి స్థాయిని పెంచుతుంది. శరీరం, మనస్సు సాంత్వన పొంది, కణజాలాలు శక్తిని పొందేలా చేస్తుంది. వాకింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ శక్తి స్థాయులను పెంచడానికి గొప్ప మార్గం. ఇది అలసట తగ్గించి,, ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.గుండెకు బలాన్నిస్తుంది..రోజూ ఉదయాన్నే అరగంటపాడు చురుగ్గా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని, రక్త΄ోటును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పును ముందుగానే తగ్గించుకోవచ్చు.జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది..జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడవడం మంచిది. ఈ అభ్యాసం మీ ఉదర కండరాల సహజ సంకోచాన్ని ్ర΄ోత్సహిస్తుంది.మానసిక బలంరోజూ నడవడం వల్ల మెరుగైన ఆత్మగౌరవం, మెరుగైన మానసిక స్థితి, ఆందోళన సమస్యలతో సహా మీ మానసిక ఆరోగ్యానికి వాకింగ్ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. శారీరక శ్రమ మీ శరీరం మానసిక స్థితి ఆత్మగౌరవాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్ లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.చక్కటి నిద్ర: తెల్లవారుజామున వెలువడే సూర్యరశ్మి సహజంగా మీ సిర్కాడియన్ రిథమ్ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ దినచర్యకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ అలవాటుతో మీ మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. శారీరక శ్రమ మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది.పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్ వంటి మితమైన వ్యాయామం, కాలక్రమేణా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే వాయిదా వేయకుండా నడుద్దాం. నడకను పడక ఎక్కనివ్వకుండా చూద్దాం.ఖాళీ కడుపుతో 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనే నియమాన్ని అలవాటుగా చేసుకోవటం వల్ల రోజంతా శక్తిని పొందుతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వార్థక్య లక్షణాలు తొందరగా దరిచేరకుండా ఉంటాయి. దీనిని తేలిగ్గా తీసేయకుండా దిన చర్యలో చేర్చడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. -
నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా!
కొంతమంది ఎప్పుడూ ఉసూరుమంటూ ఉంటారు. టార్చి లైటు వేసి చూసినా, వారి ముఖంలో ఉత్సాహం కనిపించదు. ఇంకొందరేమో ఉత్సాహానికి మారుపేరులా... ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటారు. మనం తీసుకునే ఆహారం మన ప్రవర్తనపైన, పనితీరుపైనా ప్రభావం చూపుతుందనడానికి అదొక తార్కాణం. కొన్ని రకాల ఆహార పదార్థాలను నిత్యం తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అవేమిటో చూద్దామా... ఉత్సాహంగా ఉంచే ఆహారం అనగానే అదేదో ఖరీదైన తిండేమో అని అనుకోనక్కరలేదు. ఇంకా చె΄్పాలంటే మిగిలిన వాటితో పోల్చితే అవి కాస్తంత చవగ్గానే దొరుకుతాయి. టొమాటో: దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే. నట్స్: ముఖ్యంగా వాల్నట్స్లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ΄్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్టరాల్ లెవల్ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్నట్స్లో పీచుపదార్థం అధికం. మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్–ఇ, ఉండి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్స్ని అందిస్తాయి. బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హానినుండి కాపాడుతుంది. ఆల్మండ్స్ చర్మకాంతికి తోడ్పడతాయి. రోజూ గుప్పెడు నట్స్ తింటూ ఉంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. గ్రీన్టీ: ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది. కప్పు గ్రీన్ టీ తీసుకోగానే కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కుతున్నట్లనిపిస్తుంది. యోగర్ట్ లేదా పెరుగు: మనం కర్డ్ లేదా పెరుగు అంటాం కానీ, విదేశాలలో దీనినే యోగర్ట్ అంటారు. అయితే మన పెరుగుకూ దానికీ ఉన్న తేడా ఏమిటంటే... పెరుగు కాస్త పలచగా ఉంటుంది. యోగర్ట్ గట్టిగా ఉంటుంది. పెరుగు కాస్తంత పుల్లదనాన్ని కలిగి ఉంటుంది. యోగర్ట్లో ఏమాత్రం పులుపు ఉండదు. కస్టర్డ్ ΄ûడర్ కలిపినట్టుగా గడ్డగా... కొద్దిపాటి తియ్యగా ఉంటుంది. ఈ రెండూ కూడాప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది. బీన్స్: ప్రోటీన్స్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అయితే ఇందులో అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు. బెర్రీస్: ముఖ్యంగా నేరేడుపండ్లు-వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. ఆకుకూరలు: ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బీ, సీ, ఇ, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. వీలయినంత వరకూ వీటిలో కొన్నింటిని అయినా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఉత్సాహంగా ఉండవచ్చు. ఇవి చదవండి: కిచెన్ టిప్స్: మనకిష్టమైన పదార్థాలను ఇలా కాపాడుకుందాం..! -
కీళ్ల నొప్పులను తొలగించే చిట్కాలు మీకోసం...
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే... నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్షపండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి. ఇవి చదవండి: మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..! -
థింక్ ట్యూన్ అప్
‘ఆలోచనను బట్టే ఆచరణ, ఆచరణను బట్టే కర్మఫలం’ ప్రతిదానికీ ఆలోచనే మూలం. అందుకే ఒక మనిషి మనుగడకు ప్రాణవాయువు, అన్నపానీయాలు ఎంత అవసరమో ఆలోచించడం కూడా అంతే అవసరం. నిజానికి మనిషిని సమస్తజీవకోటి నుంచి వేరు చేసిందే ఆలోచన. మానవాళి మనుగడకు మార్గం వేసేదే ఆలోచన. మరి అలాంటి ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ‘మంచి ఆలోచనకు మించిన మనుగడ లేదు, చెడ్డ ఆలోచనకు పోలిన చావు లేదు’ అంటారు పెద్దలు. అవసరాన్ని బట్టి బుద్ధికుశలతను ఉపయోగించడం, పరిస్థితిని బట్టి వివేకంగా వ్యవహరించడం, సందర్భానుసారంగా విచక్షణతో నడుచుకోవడం, క్లిష్టమైన సమయాల్లో కూడా జ్ఞానాన్ని ప్రదర్శించడం.. ఇవన్నీ ఆలోచన పరిధికి గుణకారాలే! అయితే అందుకు సాధన ఎంతో అవసరం. థింక్ ట్యూన్ అప్ ట్యూన్ అప్ అంటే స్వరాన్ని పెంచడం.. లేదా అడ్జస్ట్ చేసుకోవడం. సాధారణంగా రేడియోకో.. ఇయర్ ఫోన్ కో, బ్లూటూత్కో ఉండే ట్యూన్ బటన్ ని మనకు తగ్గట్టుగా.. మనకు కావాల్సినట్లుగా సెట్ చేసుకుంటాం. మరి మది ఆలోచల్ని ఎలా ట్యూన్ అప్ చేసుకోవాలి? మనసు స్వరాల్లో మంచి స్వరాన్ని ఎలా ఎంచుకోవాలి? ఎలా పెంచుకోవాలి? ‘ఒక సీసా నిండా గాలి ఉన్నప్పుడు అందులోని గాలిని బయటకు పంపాలంటే, ఆ సీసాలో నీళ్లు నింపడమే మార్గం. అలాగే మనసులోని ప్రతికూల భావాలు ఆవిరైపోవాలంటే, మనసు నిండా సానుకూల ఆలోచనలను పెంచుకోవాలి. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్.. ఈ రెండింటికీ ప్రభావవంతమైన శక్తులు ఉంటాయని, మనం దేన్ని నమ్ముతామో అదే జరుగుతుందని చెబుతారు సానుకూలపరులు. ‘సే సమ్థింగ్ పాజిటివ్ అండ్ యు విల్ సీ సమ్థింగ్ పాజిటివ్’... ‘మంచి గురించి మాట్లాడితే, మంచే కనిపిస్తుంది’ అని దీని అర్థం. అంటే మాట మంత్రంలా పని చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వైర్లెస్గా పనిచేస్తాయి. ఇక్కడే ఆధ్యాత్మికతకు.. శాస్త్రీయతకు పొంతన కుదురుతుంది. మనస్సుకు ఆహారం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, మనసు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మంచివాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని మాత్రమే కోరుకోవాలి. అందుకే ‘మంచి ఆలోచనలే మనసుకు మంచి ఆహారం’ అంటారు మానసిక నిపుణులు. ఒక మంచి విషయాన్ని మనం బలంగా నమ్మితే, ప్రపంచం మొత్తం ఆ కోరికను నిజం చేయడానికి కుట్ర చేస్తుందట. అంటే ప్రకృతి ఆజ్ఞతో.. తెలియకుండానే చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు మనకు సహకరిస్తారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటే, జీవితం సాఫీగా సాగుతుంది. మనసులో తలెత్తే అపోహలు, భయాలు, ప్రతికూల భావాలకు వ్యతిరేకంగా, మంచి సంకల్పాలను మనంతట మనమే సృష్టించుకోవాలి. ఉదయం లేవగానే.. ‘ఈ రోజు నాకు మంచి జరుగుతుంది. ఈ రోజు చాలా బాగుంటుంది’ అని మనసును ఉత్తేజపరచేలా ప్రకృతికి చెప్పడం నేర్చుకోవాలి. ‘ఎందుకొచ్చిన జీవితంరా సామీ?’ అంటూ ఏడుస్తూ నిద్రలేస్తే ఆ రోజు మొత్తం అంతే అసంతృప్తిగా ముగుస్తుందట. ఆలోచనలతో ఆరోగ్య ప్రయోజనాలు సానుకూల ఆలోచనలతో.. ప్రమాదకరమైన జబ్బుల్ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆశావాద దృక్పథం ఉంటే.. అది తీవ్ర అనారోగ్యాలను సైతం అరికడుతుందట. రొమ్ము క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, మానసిక రుగ్మతలు ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సమూలంగా తగ్గించే గుణం.. కేవలం సానుకూల ఆలోచనలకే ఉందట. ‘నాకేం కాదు’ అనే సంకల్పంతోనే బతికి బయటపడుతున్నారట. అందుకే ‘పాజిటివ్ థింకింగ్.. మెరుగైన రోగనిరోధక శక్తి’ అంటున్నారు నిపుణులు. పాజిటివ్ థింకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? 1. ప్రతిక్షణం ఆలోచనలను గమనించుకోవాలి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవడం నేర్చుకోవాలి. ప్రతికూలమైన ఊహలు కలిగినప్పుడు.. నిట్టూర్పులను పక్కన పెట్టి.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా తీసుకుని.. మళ్లీ మనసుకు అనుకూలమైన ఊహలను రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎలాగంటే.. మనకు బాగా ఇష్టమైన మనిషికి ప్రమాదం జరిగి ఉంటుందేమో? అని మనసు భయపడుతుంటే, దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి. ఆ మనిషి తిరిగి మీ కళ్ల ముందుకు వచ్చినట్లుగా, తనతో మీరు చెప్పాలనుకున్న కొన్ని మాటలుచెబుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ వైబ్రేషన్సే నిజంగా జరగబోయే ప్రమాదం నుంచి సైతం ఆ మనిషిని కాపాడే అవకాశం ఉంటుంది. 2. కృతజ్ఞతతో కూడిన ఆలోచనలు కూడా మనిషిని సానుకూలంగా మారుస్తాయి. మనసులోని క్రూరత్వాన్ని, అహంకారాన్ని పక్కకు నెడతాయి. ఇప్పటి దాకా సాఫీగా సాగుతున్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. మీతో పాటు పని చేసే ల్యాప్టాప్కి మీరెప్పుడైనా థాంక్స్ చెప్పారా? మిమ్మల్ని గమ్యానికి చేర్చే వాహనాన్ని మీరెప్పుడైనా కృతజ్ఞతా భావంతో చూశారా? వింతగా అనిపించినా ఇది నిజం. ప్రయత్నించి చూస్తే ఫలితం అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రపంచంలోని చాలా మతాలు చలనం లేని వస్తువుకు కూడా ప్రాణం ఉంటుందని నమ్ముతాయి. హిందూమతంలో యంత్రపూజ కూడా ఆ కోవకే వస్తుంది. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక ఎనర్జీ అక్కడుందని భావించి, బలంగా నమ్మితే.. దాని కిరణాలు మీ మదిని తాకుతాయి. అదే ‘యద్భావం తద్భవతి’ అనే నానుడిలోని సారాంశం. 3. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రతికూలమైన ఆలోచనలే చుట్టుముడతాయి. అప్పుడు సానుకూలమైన ఆలోచనలను ప్రేరేపించడానికి మనసులోనే చర్చ జరగాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. అలాంటి చర్చ మదిలో జరిగితే.. ఒత్తిడి మాయమవుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. 4. ప్రతిక్షణం క్షమాగుణంతోనే ఆలోచించాలి. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందనే నిజాన్ని గ్రహించుకోవాలి. చాలాసార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి, మనల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. అందుకే శత్రువుకు కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోమంటారు కొందరు జ్ఞానబోధకులు. మంచి మార్గం ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామాలు, ధ్యానం, యోగాలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడంతో పాటు.. పాజిటివ్ సంకల్పాలు స్వయంగా రాసుకుని, చదువుకోవడం అలవరచుకోవాలి. దాని వల్ల కూడా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాంటి సంకల్పాలతో పాజిటివిటీని అందిపుచ్చుకునే ఎన్నో మార్గాలు నెట్టింట దొరుకుతూనే ఉన్నాయి. వాటిల్లోంచి అనుకూలమైన మార్గాన్ని ఎన్నుకుని అనుసరించొచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన మనిషి ఆలోచనా విధానాన్ని మూడు రకాలుగా విభజించాడు. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే పేర్లతో ఆలోచనా తీరును వివరించాడు. ఇడ్: ఈ ఆలోచన మనిషి మనసులో అచేతనావస్థలో ఉంటుంది. ఇది నైతిక విలువలను పాటించదు. నియమాలు, తప్పొప్పులు దానికి తెలియవు. మనసులో కలిగే కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా మనిషిని తొందరపెడుతుంది. ఎక్కువ స్వార్థ చింతనతో ఉంటుంది. ఇగో: ఈ ఆలోచన చేతనావస్థలో ఉంటుంది. ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. వాస్తవాలను గ్రహించి.. సమయానుకూలంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సూపర్ ఇగో: ఇదే మనిషి అంతరాత్మ. నైతిక, సామాజిక విలువలను కచ్చితంగా పాటిస్తుంది. ఇగోకు మంచి చెడులను గుర్తు చేసి.. సాంఘిక ఆచారాలను పాటించేట్లు చేస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి ఇది మరింత పరిణతి పొందుతుంది. ఇది ఎక్కువగా నైతిక సూత్రాలపై ఆధారపడి అడుగులు వేస్తుంది. ఉదాహరణకు.. ‘దొంగతనంగా సినిమాకు వెళ్దాం’ అని ఇడ్ ప్రోత్సహిస్తే.. ‘దొంగతనంగా ఎలా వెళ్లొచ్చో?’ ఆలోచిస్తుంది ఇగో. కానీ ‘దొంగతనంగా వెళ్లడం సరికాదు, తప్పు, ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది, దాని వల్ల మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది’ అని హెచ్చిరిస్తూనే నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది సూపర్ ఇగో. ఇలా మనిషి ఆలోచన సరళిని విశ్లేషించాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్య్ర సమరయోధులు, కట్టుబాట్లపై, మూఢత్వాలపై తిరుగుబాటు చేసిన సంఘసంస్కర్తలు.. వీళ్లంతా ఉన్నతమైన ఆలోచనాపరులే. గొప్ప ఆలోచనల నుంచి ఉద్భవించిన కొన్ని సూక్తులు ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. దయతో జీవించండి, ఎవరినీ ఎప్పుడూ నిరుత్సాహపరచకండి. ఎవరు ఎంత తక్కువగా కనిపించినా.. ఏదో ఒకరోజు పురోగతిని సాధిస్తారు. -ప్లేటో చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం -రవీంద్రనాథ్ టాగోర్ ప్రేమ, స్నేహం, ఆగ్రహం, కరుణలతో ఇతరుల జీవితానికి విలువను ఆపాదించినంత కాలం.. మీకు కూడా విలువ ఉంటుంది -సిమోన్ ది బూవా మొదట అర్థం చేసుకోలేకపోతే.. దేన్నీ ప్రేమించలేరు, దేన్నీ ద్వేషించలేరు. ∙ఇబ్బందుల్లో కూడా నవ్వగల వారిని నేను ప్రేమిస్తున్నాను, నేర్చుకోవడానికి మనసు ఎప్పటికీ అలసిపోదు. -లియోనార్డో డా విన్సీ ‘చెయ్యాల్సిన పని పట్ల అవగాహన లేకపోతే.. భయపడటం పరిష్కారం కాదు.. నేర్చుకోవడమే మార్గం’ -ఐన్ రాండ్ మేధస్సుకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. -అల్బర్ట్ ఐన్ స్టీన్ సమానత్వంలోనే ధర్మం వర్ధిల్లుతుంది. స్త్రీ హక్కులను పంచుకోనివ్వండి. ఆమె పురుషుల ధర్మాలను కూడా అనుకరిస్తుంది. ఎందుకంటే విముక్తి పొందినప్పుడు ఆమె మరింత పరిపూర్ణంగా ఎదగాలి. -మేరీ వోల్స్టోన్ క్రాఫ్ట్ శత్రువును రెచ్చగొడితే అది మనకే నష్టం. అందరినీ ప్రేమించండి, కొందరిని నమ్మండి, ఎవరికీ నష్టం చేయకండి -షేక్స్పియర్ ప్రపంచంలో ప్రభావవంతమైన ఆలోచనాపరులు ఈ మానవాళిలో ఎందరో ఆలోచనపరులు.. తమ కోసం కాకుండా ప్రపంచం కోసం ఆలోచించారు. అందుకే నేటికీ ఆదర్శంగా నిలిచారు. ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు కాళోజీ. కానీ తమ ఒక్క ఆలోచనతో కోట్లాది ప్రజలను కదల్చగలిగారు ఎందరో విశ్లేషకులు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వంటి గ్రీకు తత్వవేత్తలతో పాటు.. డార్విన్ , కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి వారు తమ ఆలోచనలతో చరిత్ర గమనాన్ని మార్చారు. డార్విన్ మనుషుల్లోని మూఢనమ్మకాలను చెదరగొడితే.. కార్ల్ మార్క్స్.. మనిషి బతకడం ఎలానో నేర్పించారు. చార్లెస్ డార్విన్ ఈయన ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పులను తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్విన్ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. కార్ల్ మార్క్స్ ఈయన ఆలోచనలను, సిద్ధాంతాలను కలిపి సమష్టిగా.. ఈ ప్రపంచం ‘మార్క్సిజం’ అని పిలుస్తోంది. ప్రతి అంశంలోనూ న్యాయమైన వాదన వినిపించిన ఆలోచనాపరుడు కార్ల్ మార్క్స్. పిల్లలు పనికి పోకూడదని, బడికి వెళ్లాలని వాదిస్తూ భావితరాల గళం అయ్యాడు. ‘ఎంతసేపు ఉద్యోగమే కాదు.. మనిషికి వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకూ ఇష్టాయిష్టాలు ఉండాలి. జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి’ అనే కాంక్షను బలపరచింది మార్క్సిజం. మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి చాలా అవసరమని చెప్పింది ఈయనే. మార్పుకి ప్రజలే ప్రతినిధులు అనే మార్క్స్ రాతలతోనే.. ప్రపంచరూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వాలపైన, మీడియాపైన ఓ కన్ను వేస్తూ ఉండాలని ప్రజలకు తెలిపింది మార్క్సిజం. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? న్యాయాన్యాయాల మధ్య నిలిచే అశాంతి నేటి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మనిషి ఆలోచనాశక్తిని కుంగదీస్తోంది. బలవంతుడు అన్యాయం చేసి గెలిస్తే, బలహీనుడు మరో నలుగురు బలహీనుల సాయం తీసుకుని వాడిపై గెలవగలడట. మనం ఎంతటి బలవంతులమైనా ఆలోచనలో సవరణలు, సడలింపులు లేకపోతే పతనం వెన్నంటే ఉంటుంది. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె’ అన్న సుమతీ శతకం చెప్పే నీతి అదే! ఆవు–పులి కథ ఒకనాడు మేత కోసం అడవికి వెళ్ళిన ఓ ఆవు పెద్దపులి కంటపడుతుంది. వెంటపడిన ఆ పులి తనని తినబోతుంటే.. ‘నీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టమే కాని, నాకు కొంత సమయం కావాలి’ అని వేడుకుంటుంది ఆవు. ఆవు కన్నీళ్లు చూసి కరిగిన పులి.. ‘సమయం దేనికి?’ అని అడుగుతుంది. ‘ఇంటి దగ్గర పాలకు ఏడ్చే నా బిడ్డ ఉంది. దానికి కడుపు నిండా పాలిచ్చి, మంచి చెడు చెప్పి వస్తాను’ అంటుంది ఆవు. మొదట అనుమానించిన పులి చివరికి ఒప్పుకుని పంపిస్తుంది. ఆవు అన్న మాట ప్రకారం చెప్పిన సమయానికి వచ్చి.. ‘ఇక నన్ను తిను’ అంటుంది. ఆవు నిజాయితీకి మెచ్చిన పులి జాలితో ఆవును విడిచిపెట్టేస్తుంది. చిన్నప్పుడు ఈ ‘ఆవు–పులి’ కథ వినే ఉంటారు. ఈ కథలో ఆవు మంచిది. మాట మీద నిలబడింది. ఆవులో కన్నతల్లి ప్రేమ, ఇచ్చిన మాటకోసం ప్రాణాలను త్యాగం చేసేంత ఔదార్యం, కష్టాన్ని మొరపెట్టుకోగలిగేంత వినయం.. ఇలా మనిషి నేర్చుకోదగ్గ ఎన్నో గొప్ప సత్యాలు ఉన్నాయి. కానీ, కథలో ఉన్న నీతి అక్కడి వరకే అనుకుంటే పొరబాటు. కథలో నిజమైన హీరో పులి. పులి స్వతహాగా బలమైన ప్రాణి. దానికి ఆవు మాట వినాల్సిన అవసరమే లేదు. కానీ.. ఆవుకి దాని ఆవేదన చెప్పుకునే సమయాన్నిచ్చింది. ఆకలితో ఉన్న తన బిడ్డ దగ్గరకు ఆవు వెళ్తానంటే నమ్మి.. పంపించింది. తిరిగి వస్తే.. ఆ నిజాయితీని మెచ్చి జాలితో విడిచిపెట్టింది పులి. ఈ రోజు ప్రతి బలవంతుడు నేర్చుకోవాల్సిన నీతి ఇది. ఆలోచించాల్సిన తర్కమిది. పులికి పంజా విసరగలిగే సత్తా ఉంది. అంతకు మించి.. అవకాశం ఉంది, బలంతో కూడిన అధికారం ఉంది, తినాలనేంత ఆకలుంది, ఏం చేసినా ప్రశ్నించలేని నిస్సçహాయత ఆవు రూపంలో ఎదురుగా ఉంది. అయినా పులి ఆలోచించింది. అదే నైతికతంటే. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలో మన చేత్లులోనే ఉంది. కాదు కాదు మన ఆలోచనల్లోనే ఉంది. స్వచ్ఛమైన మనసులో చెలరేగే ఊహలను ఈ విశ్వం చెవులారా వింటుందట. మరింకెందుకు ఆలస్యం? సానుకూలమైన ఆలోచనలను శాంతి పావురాల్లా ఎగరనివ్వండి -సంహిత నిమ్మన -
కౌగిలింత ఎందుకు? పసివాళ్లను హగ్ చేసుకుంటే ఏమొస్తుంది?
ప్రేమికులకు వాలెంటైన్ వీక్లోని ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనదే. ఫిబ్రవరి 12ను వాలెంటైన్ వీక్లో ‘హగ్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు మాత్రమే కాదు.. ఆప్యాయతను అందుకునేవారంతా తమకు ఇష్టమైనవారిని కౌగిలించుకోవాలని, తమ మనసులోని భావాలను వారితో పంచుకోవాలని చెబుతుంటారు. ఇంతకీ కౌగిలింతతో వచ్చే లాభాలేమితో ఇప్పడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఒక వైపు పని భారం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, దీనికితోడు ఎన్నో సమస్యలు.. వీటన్నింటి మధ్య మనిషి ఒత్తిడితో సతమతమవుతున్నాడు. అలాంటి సమయంలో కౌగిలింత (హగ్) అనేది ఒక అద్భుత వరమని, అది ప్రశాంతతకు దోహదపడుతుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి మాయం కావలించుకోవడమనేది ఒక మంచి ఫీలింగ్ని కలిగిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు సన్నిహితులను కావలించుకుంటే మనసుకు ఓదార్పు లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందుకే మీరు పార్ట్నర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు మీ ఆప్యాయమైన కౌగిలింత అందించి, వారి ఒత్తిడిని దూరం చేయడంతోపాటు మీలోని ఒత్తిడిని కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. బరువు తగ్గడంలోనూ.. బరువు పెరగడానికి గల కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. టెన్షన్, పని ఒత్తిడి రోజూ అందరికీ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో కొందరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఆత్మీయుల కౌగిలింత వారిలోని ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. తద్వారా వచ్చే రిలాక్సేషన్ బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. 10 సెకన్ల కౌగిలింత అనేక సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుకు వైద్యం మనకు ఆప్యాయతను అందించేవారిని 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే మనలోని ఒత్తిడి తగ్గి, రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. అందుకే బీపీ కంట్రోల్లో ఉండాలనుకుంటే ఆత్మీయులను కౌగిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసివాళ్లను హగ్ చేసుకుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తన దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. దీంతో ఆ తల్లి అప్పటి వరకూ పడిన నొప్పులన్నింటినీ మరచిపోతుంది. అలాగే తల్లి కౌగిలింత పిల్లలకు సురక్షితంగా ఉన్నామనే భరోసానిస్తుంది. అది వారు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహద పడుతుంది. ఇదేవిధంగా పసివాళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎవరికైనా సరే మనసుకు స్వాంతన లభిస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. -
క్రెడిట్ కార్డులు ఎన్ని రకాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
భారతదేశంలో చాలా బ్యాంకులు (ప్రభుత్వ & ప్రైవేట్) తమ కస్టమర్లకు కేవలం డెబిట్ కార్డులు మాత్రమే కాకుండా.. క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్నాయి. ఈ కథనంలో ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి? బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెగ్యులర్ క్రెడిట్ కార్డులు రెగ్యులర్ క్రెడిట్ కార్డులనేవి రివార్డ్ పాయింట్స్, ఫ్యూయెల్ సర్ఛార్జ్ మినహాయింపుల వంటి అదనపు సౌకర్యాలను అందిస్తాయి. జీవిత భాగస్వామి, పెద్ద పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులతో పంచుకోవడానికి మూడు ఫ్రీ యాడ్-ఆన్ కార్డ్లను కూడా పొందవచ్చు. ఇవి అన్ని విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్లు ఈ కార్డ్లు మీకు ఫ్యాన్సీ లాంజ్లకు ఫ్రీ యాక్సెస్, గోల్ఫ్ ఫ్రీ రౌండ్లు, రివార్డ్లు, పెద్ద రెస్టారెంట్లలో కూల్ డిస్కౌంట్లు వంటి ప్రత్యేక సౌకర్యాలను అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలనుకునే వారికి ఇలాంటి కార్డులు ఉపయోగపడతాయి. కో-బ్రాండెడ్ కార్డ్లు కో-బ్రాండెడ్ కార్డ్లు కొన్ని రకాల అంశాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విమాన టికెట్లు, ప్రయాణాల మీద కొన్ని డిస్కౌంట్స్, స్పెషల్ చెక్-ఇన్ కౌంటర్స్, ఎక్స్ట్రా లగేజీ అలవెన్స్, లాంజ్లకు ఫ్రీ యాక్సెస్ వంటి అద్భుతమైన సదుపాయాలు ఈ కార్డుల ద్వారా పొందవచ్చు. కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు మీ అవసరాల కోసం ఖర్చు చేసే సమయంలో కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపార పర్యటనలు, కొనుగోళ్ల సమయంలో డబ్బు ఆదా చేసుకోవడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది. మీ చెల్లింపులను సైతం సులభంగా ట్రాక్ చేయవచ్చు. వీటిలో అదనపు ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డ్లు ప్రీపెయిడ్ కార్డలనేవి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగపడతాయి. లిమిటెడ్ క్రెడిట్తో లభించే ఈ కార్డులు మీ పిల్లలకు కూడా ఇవ్వవచ్చు, వారు ఎంత ఖర్చు చేయాలో దీని ద్వారా నిర్దారించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను కవర్ చేయడానికి కంపెనీలు కూడా ఇలాంటి కార్డులను ఉపయోగిస్తుంటాయి. ఇదీ చదవండి: ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్ వెనుక భార్య.. ప్రీమియం క్రెడిట్ కార్డులు ఎక్కువ డబ్బు సంపాదించి, ఎక్కువ పనుల కోసం కారు పొందాలనుకునే వినియోగదారులు ఇలాంటి ప్రీమియం క్రెడిట్ కార్డులను పొందవచ్చు. మెరుగైన రివార్డ్స్, అదనపు ప్రయోజనాల కోసం కూడా ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు అత్యవసర సమయంలో క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువలేనివారు కూడా ఇలాంటి కార్డులను పొందవచ్చు. అయితే బిల్లులు సకాలంలో చెల్లిస్తామని బ్యాంకుకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సదరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేసిన డబ్బు క్రెడిట్ కార్డుకు కొలేటరల్గా పనిచేస్తుంది. -
‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది?
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దీపావళి మరుసటి రోజు ఉదయం అంటే నవంబర్ 13 నుండి ప్రారంభంకానుంది. ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) గత కొన్ని రోజులుగా నిరంతరం 450కు పైననే ఉంటూ వస్తోంది. ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే గాలి పీల్చుకోవడానికి ‘చెడు’ అయినదిగా పరిగణిస్తారు. ఇది 301-400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’ ఉన్నట్లులెక్క. 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది’గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ‘చాలా తీవ్రమైనది’గా పరిగణిస్తారు. నవంబరు 13-20 తేదీల మధ్య గత ఏడేళ్లుగా ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలుత దీనిని 2016లో ప్రారంభించారు. సరి-బేసి విధానం అంటే ఏమిటి? రెండు చేత భాగింపబడని సంఖ్యను బేసిగా పరిగణిస్తారు. ఉదాహరణకు 1, 3, 5…. ఇక సరి (ఈవెన్) అంటే రెండు చేత పూర్తిగా భాగింపబడే సంఖ్య. ఉదాహరణకు 2, 4, 6.. ఇవి సరి సంఖ్యలుగా పరిగణిస్తారు. ‘బేసి-సరి’ నియమం ప్రకారం డ్రైవింగ్ చేయడం అంటే.. సరి సంఖ్యగల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ సరి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా బేసి సంఖ్యల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ బేసి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం విషయానికొస్తే.. ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై కార్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలనుకుంటోంది. ఇలా చేయడం వలన వాయు నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తోంది. గతంలో ప్రభుత్వం దీనిని అమలు చేసినప్పుడు, టాక్సీలు (సీఎన్జీతో నడిచేవి), మహిళలు నడిపే కార్లు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, అన్ని ద్విచక్ర వాహనాలతో సహా అనేక వర్గాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 75 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఈ 75 లక్షల వాహనాల్లో మూడో వంతు కార్లు. బేసి-సరి పథకం అమలయినప్పుడు ప్రతి రోజు దాదాపు 12.5 లక్షల కార్లు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మినహా) ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అవకాశం ఉండదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉంటుంది. అయితే కొన్ని నెలల్లో (ముఖ్యంగా దీపావళి వచ్చే మాసంలో) వాయు కాలుష్యం మరింత తీవ్రంగా మారుతుంది. పంజాబ్, హర్యానాలలో పంట చేతికొచ్చాక గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇది కూడా వాయు కాలుష్యానికి కారణంగా నిలుస్తుంది. అక్కడి నుంచి వచ్చే పొగ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా, మెక్సికో, ఫ్రాన్స్లోని నగరాల్లో సరి-బేసి విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. 2019లో ఢిల్లీలో సరి-బేసి విధానం అమలు చేసినప్పుడు నోయిడా, ఘజియాబాద్లలో స్వల్పంగా వాయు కాలుష్యంలో తగ్గుదల కనిపించిందని తేలింది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం వల్ల తీవ్రమైన కాలుష్య స్థాయిలు ఖచ్చితంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమని అంటున్నారు. 2016 జనవరిలో సరి-బేసి విధానాన్ని అమలు చేసినప్పుడు.. ఈ ప్రణాళిక ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమైంది’ అని ఒక అధ్యయనం పేర్కొంది. ఇది కూడా చదవండి: కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? -
మామిడి టెంకే!.. అని పడేయొద్దు!ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
పండ్లలలో రారాజు మామిడికాయ. టెంకే కదా అని తీసిపడేయొద్దు!. దీని వల్ల కలిగే అద్భత ప్రయోజనలు అన్ని ఇన్ని కావు. మామిడి టెంకను బ్యూటి ప్రొడక్ట్గా వాడతారని మీకు తెలుసా! ఇది మీ చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఇది అందించే ప్రయోజనాలు ఏంటంటే.. ప్రయోజనాలు ఈ టెంకలోని గింజల పొడిని సేవించినా ఆరోగ్యానికి మంచిదే ఇది అతిసారం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని నుంచి తయారు చేసిన నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందంటే.. చుండ్రుకి చెక్పెడుతుంది మాడిగింజల పొడిని ఆవాల నూనెతో కలిపి అప్లై చేస్తే అలోపేసియా, జుట్టు రాలడం, నెరిసిపోవడం, చుండ్రు వంటివి రావు. టూత్ పౌడర్గా మామిడిగింజల పౌడర్ని టూత్ పౌడర్గా ఉపయోగిస్తే మీదంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. విరేచనాలకు ఔషధంగా మామిడి గింజల పొడిని రోజుకు మూడుసార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడతాయి. ఈ మామిడిగింజల పొడిని నీడలో ఎండబెట్టి తేనెతో తీసుకుంటే అతిసారం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఒబెసిటీకి చక్కటి మందులా.. ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి మందులా ఉపయోగపుడుతుంది. దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి పొందడమే గాక కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలస్ట్రాల్ని కరిగించేస్తుంది రక్తప్రసరణను పెంచి చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో పడిపోయిన చక్కెర స్థాయిలను, సీ రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు.. రోజువారీ ఆహాకంలొ మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె సమస్యలు, అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డ్రై లిప్స్కి చెక్ పెదాలు హైడ్రేట్ చేయడానికి మామిడి గింజల పొడితో తయారు చేసిన బామ్ని ఉపయోగిస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. చర్మకణాలు పునురజ్జీవింపజేస్తుంది. మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మధుమేహం మామిడి గింజ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రేగు, కాలేయంలలో గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. అలాగే నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది. మొటిమలు మాయం మామిడి గింజలతో మొటిమల స్క్రబ్ని తయారు చేసుకుని వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అంతేగాదు మామిడి గింజలను గ్రైండ్ చేసి టమాట రసంతో కలిపి ముఖానికి అప్లై చేస్తే బ్లాక్హెడ్స్, బ్రేక్ అవుట్లు, మెటిమలు, మచ్చలను నయ చేస్తుంది. ముఖంపై ఏర్పడే రంధ్రాలను తగ్గించి ఎరుపు మారకుండా సంరక్షిస్తుంది. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
భలేగా లాభాలు..బొప్పాయి సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు
బొప్పాయి సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. రెండేళ్ల కాలపరిమితి పంటైనా సాగు చేసిన ఏడాదికే అన్నదాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రోత్సాహాన్ని అందిస్తూ సబ్సిడీపై మల్చింగ్ షీట్లు, తదితరాలను సమకూరుస్తుండటంతో సాగు చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆత్మకూరు: బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవి చూస్తుండగా.. తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. జిల్లాలోని 11 మండలాల్లో 1500 హెక్టార్లలో బొప్పాయి సాగవుతోందని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఏడు నెలలకే తొలి కాపు వాస్తవానికి రెండేళ్ల కాలపరిమితి గల బొప్పాయిని ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తూ ఏడాదికే లాభాలు గడిస్తున్నారు. రెండో పంటనూ వెంటనే చేపడుతున్నారు. ఈ కారణంగా కొంత ఖర్చయినా లాభాలు వస్తుండటంతో రెండేళ్ల కాలపరిమితిని రైతులు పాటించడంలేదు. ఏడు నెలలకే తొలి కాపు వచ్చే బొప్పాయి తోటల్లో అంతర్పంటగా బంతిని సాగుచేస్తూ అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. కచ్చితమైన లాభాలు వస్తుండటంతో అధిక శాతం మంది బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుండటంతో బొప్పాయి సాగుకు పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ను ప్రోత్సహిస్తూ.. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా హెక్టార్కు 90 శాతం సబ్సిడీతో అందిస్తోంది. కలుపు నివారణకు మల్చింగ్ చేసేందుకు తొలి ఏడాది రూ.18,490, రెండో సంవత్సరం రూ.ఆరు వేలను రైతులకు అందిస్తున్నారు. మల్చింగ్ షీట్ల ఏర్పాటుతో వర్షాకాలంలో వేరుకుళ్లు తెగులు సోకదని, వీటితో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సోలాపూర్ రకానికి ప్రాధాన్యం బొప్పాయిలో తైవాన్ రెడ్ లేడీ 786 రకానికి మరో పేరు సోలాపూర్ వైరెటీ. ఈ రకం సాగుకు రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సోలాపూర్ వెళ్లి మొక్కలు తెస్తుండటంతో తైవాన్ రెడ్ లేడీ పేరు స్థానంలో ఈ పేరొచ్చిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం అనంతపురం, రైల్వేకోడూరు నుంచి రైతులు ఈ రకం మొక్కలను తీసుకొస్తున్నారు. ఎకరాకు 1200 వరకు వేయాల్సి ఉన్నా, రైతులు 1050 మొక్కల చొప్పున సాగు చేస్తున్నారు. అధిక ధర సాధారణంగా కాయలను విడిగా రూ.8.50 చొప్పున రైతులు విక్రయిస్తుంటారు. అయితే గతేడాది ఒక్కో కాయను రూ.16 చొప్పున రైతుల వద్దే కొనుగోలు చేయడంతో ఎకరాకు రూ.నాలుగు లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.పది చొప్పున విక్రయిస్తున్నామని వారు చెప్పారు. ప్రథమ స్థానంలో ఆత్మకూరు సెక్టార్ ఆత్మకూరు సెక్టార్లో 400 ఎకరాలకుపైగా బొప్పాయి సాగవుతూ ప్రథమ స్థానంలో ఉందని ఉద్యానాధికారులు తెలిపారు. చేజర్ల, ఏఎస్పేట, మర్రిపాడు, పొదలకూరు, మనుబోలు, కలువాయి, తదితర మండలాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. వైద్యుల సూచన మేరకు బొప్పాయి వినియోగం పెరగడంతో కొనుగోళ్లూ భారీగానే జరుగుతున్నాయి. ఎకరాకు 40 టన్నుల దిగుబడి మూడేళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నా. లాభాలు బాగానే ఉన్నాయి. మా తోటను చూసి సమీపంలోని పలువురు రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలను అనంతపురం నుంచి తెచ్చుకుంటున్నాం. కలుపు రాకుండా మల్చింగ్ షీట్లను సబ్సిడీలో పొందాం. – సుబ్బారెడ్డి, బొప్పాయి రైతు, బొమ్మవరం, అనంతసాగరం ఎకరాలో బొప్పాయి సాగుకు రూ.70 వేలు ఖర్చవుతోంది. కలుపు రాకుండా మల్చింగ్ షీట్ల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్, తదితర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే రూ.లక్ష వరకు అవుతోంది. మొక్కలు నాటిన అనంతరం ఏడు నెలల పది రోజులకే తొలి కాపు చేతికందుతుంది. తొలి కాపులో ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల దిగుబడి.. 20 రోజుల అనంతరం రెండో కాపులో రెండు నుంచి మూడు టన్నులు.. మూడో కాపులో నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి వస్తోంది. ఏడాది పొడవునా కాపు ఉంటుందని రైతులు తెలిపారు. దీంతో ఎకరాకు రూ.మూడు లక్షలకుపైగా ఆదాయాన్ని గడిస్తున్నారు. -
ఇలాంటి ఫీచర్ కదా కోరుకునేది.. పర్సనల్ డీటైల్స్ ఎక్కడున్నా..
Google New Feature: రోజురోజుకి టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా అంతర్జాలం మరింత వేగం పుంజుకుంటోంది. ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్ లేని ఇల్లు లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అదే రీతిలో పుట్టుకొస్తున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాతో లెక్కలేనన్ని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త టెక్నాలజీలు వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్నట్లు, అలాంటి వాటికి నిర్మూలించి, వినియోగదారులను అప్రమత్తం చేయడానికి గూగుల్ ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ ఫీచర్ ఇప్పుడు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇది మిగిలిన అన్ని దేశాల్లో విస్తరించనుంది. నివేదికల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్లో గూగుల్ 'రిజల్ట్ అబౌట్ యూ' లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అనతి కాలంలోనే మొబైల్, వెబ్సైట్ వంటి వాటిలో ప్రత్యక్షమైంది. ఆ ఫీచర్ ఇప్పుడు మరింత ఆధునికంగా మారింది. ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎక్కడైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ తరువాత వాటిని తొలగించడానికి కూడా వీలుంటుంది. ఇదీ చదవండి: వ్యాపార సామ్రాజ్యంలో మహిళా సారధులు - ఏం చదువుకున్నారో తెలుసా? ఇప్పటి వరకు వినియోగదారులకు సంబంధించిన వివరాలను వెతుక్కోడానికి చాలా సమయం పట్టేది. కానీ త్వరలో రానున్న గూగుల్ కొత్త ఫీచర్ యూజర్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ వంటి వ్యక్తిగత వివరాలు కనిపించిన వెంటనే ఇస్తూ.. తొలగించుకోవడానికి సహకరిస్తుంది. ఇదీ చదవండి: భారత్లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! గూగుల్ కొత్త ఫీచర్ వల్ల వ్యక్తిగత వివరాలు సులభంగా తొలగించవచ్చు, కానీ అవసరమైన చోట కూడా ఈ వివరాలు తొలగిపోతాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వినియోగదారుడు తప్పకుండా కొన్ని ఆప్షన్స్ ఎంచుకోవడం వల్ల అలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!
కొంబుచా అనేది టీ, ఈస్ట్, బ్యాక్టీరియా, చక్కెరతో కలిసి తయారు చేసే పానీయం. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే కొత్తరకం డ్రింక్. మధుమేహం వ్యక్తులకు ఇది చక్కటి దివ్యౌషధం. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలను చూసి పరిశోధకులు సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ కొంబుచా అంటే ఏమిటి? దీన్ని ఎవరూ తయారు చేశారు?..అంటే.. ఈ డ్రింక్ రెండు వేల ఏళ్లక్రితం నాటిది. తొలిసారిగా చైనాలో తయారు చేశారు. ఆ తర్వాత దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి జపాన్, రష్యా దేశాలకు పాకింది. 20వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలతో సహా అమెరికాలో కూడా దీనికి విశేష ప్రజాధరణ లభించింది. ఇందులో ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింట్ల మిశ్రమాన్ని ఒక వారం పాటు నిల్వ ఉంచగా పులియబెట్టిన ఒక ఆమ్లం తయారవుతుంది. ఈ ప్రక్రియను కిణ్వణ ప్రక్రియ అంటారు. డ్రింక్ ఎలా తయారు చేస్తారంటే.. కొంబుచా టీని వివిధ మార్గాల్లో తయారు చేస్తారు, అయితే కొంబుచా తయారీలో ఉపయోగించే కొన్ని ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింటి మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు పులియబెట్టేందుకు అలా వదిలేస్తారు. దీన్ని కిణ్వన ప్రక్రియ అంటారు. దీనిలో ఉండే ఈస్ట్, బ్యాక్టీరియా కొన్ని రకాలు ఆమ్లాలు విడుదల అయ్యి పైన ఒక పొరలాంటిది ఏర్పడుతుంది. ఈ పొరను పక్కకు ఉంచి అందులో ఉన్న పానీయాన్ని సేవిస్తారు. ఈ పొరనే కొంబుచా అంటారు దీన్ని పక్కకు ఉంచుకుని దీని సాయంతో డ్రింక్ తయారు చేసుకుంటారు. ఇది తియ్యటి ఆల్కహాల్ మాదిరి ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువుగా ఉంటుంది. డైలీ డ్రింక్ తయారీ విధానం: పెద్ద గాజు సీసా తీసుకోండి. ఒకటిన్నర కప్పుల చక్కెరను రెండు కప్పుల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర బాగా కరిగాక రెండు టేబుల స్పూన్ల బ్లాక్ టీ వేసి పది నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఆఫ్ కప్ వెనిగర్ వేయాలి. ఈ నీటిని మనం పైన చెప్పనట్లుగా తయారు చేసకుని పక్కకు పెట్టుకున్న కొంబుచా పొరలో వేసేసి అలా సుమారు 15 నుంచి 20 రోజు చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి. దీన్ని ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంచితే అంత తియ్యగా రుచిగా ఉండే కొంబుచా డ్రింక్ తయారవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ కొంబుచాలో ఉండే బ్యాక్టీరియా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. టైప్2 డయాబెటీస్ పేషంట్లకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఈ కొంబుచా డ్రింక్ జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచుతుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పులియబెట్టిన డ్రింక్ కావడం చేత క్యాన్సని క్యూర్ అయ్యేలా చేస్తుంది అలాగే ఎయిడ్స్ పేషంట్లకు వ్యాధి నియంత్రణలో ఉండి మరింతకాలం బతికే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తికి సహాయపడటమేగాక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగు సంబంధిత అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అలాగే జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం జరిపిన క్లినకల్ ట్రయల్స్లో ఈ కొంబుచా డ్రింక్ని సేవించిని నాలుగు వారాల తర్వాత ఆయ వ్యక్తుల రక్తంలో సగటున ఉండే గ్లూకోజ్ స్థాయిలు డెసిలీటర్కు 164 నుంచి 116 మిల్లీగ్రాములకు తగ్గినట్లు వెల్లడైంది. ఎలుకలపై జరిపిన అధ్యయనాల్లో కూడా ఇది నిరూపితమైందని అందువల్ల ఇది శరీరానికి తక్షణ రోగ నిరోధక శక్తి అందించడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఔషధంగా పేర్కొన్నారు. ఐతే కొందరూ మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఆరోగ్యప్రయోజనాలను అందించగలదని నిరూపితమవ్వలేదంటూ వాదించడం గమనార్హం. (చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్కి ప్రదాన కారణమా! వెలుగులోకి విస్తూపోయే నిజాలు!) -
బ్లూ టీ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
చాలామందికి పొద్దున లేవగానే టీ తాగనిదే రోజు గడవదు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న టీ బ్లూ టీ. అపరాజిత పూలతో ఈ టీని తయారు చేస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ బ్లూ టీని ఒక్కసారి తాగితే మళ్లీ విడిచిపెట్టరట. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి? బ్లూ టీతో కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ► బ్లూ టీనే బటర్ఫ్లై పీ ఫ్లవర్ టీ, శంఖు పువ్వు అని కూడా పిలుస్తారు. ఇది నీలం రంగులో ఉంటుంది. ► బ్లూ బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ను నీటిలో మరిగించి ఈ హెర్బల్ టీని ప్రిపేర్ చేస్తారు. ► ఇందులోని ఆంథోసైనిన్ సమృద్దిగా ఉండటం వల్ల ఈ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ► యాంటీ యాక్సిడెంట్లు బ్లూ టీలో ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ టీని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ► బ్లూ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు ► బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంఉటంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. ► బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ► షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ టీ కాకుండా బ్లూ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ► అలసట, చికాకుగా ఉన్నప్పుడు ఈ బ్లూ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ► బ్లూ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి రోజుకు రెండుసార్లు అయినా హ్యాపీగా ఈ టీని తీసుకోవచ్చు. ► ఈ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. ► డిప్రెషన్, యాంక్సైటీగా అనిపించినప్పుడు బ్లూ టీ ఓ కప్పు తాగితే వెంటనే మూడ్ ఛేంజ్ అయ్యి యాక్టివ్ అవుతారట. -
విలువైన వస్తువులను ఖాళీ చిప్స్ ప్యాకెట్లో పెడితే.. ఫ్లైట్ అటెండెంట్ సలహా!
మనం ఏదైనా పెళ్లి లేదా పెద్దపెద్ద ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మనతో పాటు విలువైన వస్తువులు అంటే.. బంగారు ఆభరణాలు, విలువైన గాడ్జెట్స్ తీసుకువెళుతుంటాం. ఇటువంటి వేడుల సందర్భంలో బంధువుల సందోహం ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనతోపాటు తీసుకువచ్చిన విలువైన సామాను చోరీ జరిగే అవకాశం ఉండవచ్చు. అలాగని ప్రతి నిముషం మన విలువైన వస్తువులను కంట కనిపెట్టుకుని ఉండలేం. పైగా ఇటువంటి సందర్భాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరిపైనా నిందలు కూడా వేయలేం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఫ్లైట్ అటెండెంట్ సలహా.. ఫ్లైట్ అటెండెంట్ మైగుల్ మనోజ్ ఇటీవల సోషల్ మీడియాలో..విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు ఒక ఆశ్చర్యకరమైన లైఫ్ హ్యాక్ తెలియజేశారు. ఇది అందరికీ ఎంతగానో ఉపకరిస్తుంది. మన దగ్గరున్న విలువైన వస్తువులను కాపాడుకునేందుకు ఖాళీ చిప్స్ ప్యాకెట్స్ మన దగ్గర ఉంచుకోవాలని అయన సలహా ఇచ్చారు. నిజానికి మనం ఖాళీ చిప్స్ ప్యాకెట్లను చెత్తగా భావించి, బయటపారవేస్తుంటాం. అయితే విలువైన వస్తువులను ఎవరూ గుర్తించలేని చోట పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. చిప్స్ ప్యాకెట్తో పనేంటి? తాను చిప్స్ ప్యాకెట్ లైఫ్ హ్యాక్ను ఫాలో చేస్తానని చెప్పిన ఆయన.. తాను ఏదైనా హోటల్లో బస చేసినప్పుడు ఖాళీ చిప్స్ ప్యాకెట్లలో విలువైన వస్తువులను దాచివుంచుతానన్నారు. దీంతో ఎవరూ కూడా విలువైన వస్తువులు ఖాళీ చిప్స్ ప్యాకెట్లలో ఉంటాయనే విషయాన్ని అంచనా వేయలేరన్నారు. సాధారణంగా చోరీకి పాల్పడేవారు అల్మరాలు, సూట్కేసులు, బ్యాగులను, పర్సులను గమనించి వాటిని తస్కరించే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా విలువైన వస్తువులు అక్కడే ఉంటాయనే భావనతో చోరులు వాటిపై కన్ను వేస్తారు. దొంగకు దిమ్మతిరిగిపోయేలా.. ప్రయాణ సమయంలో లేదా వేడుకల సందర్భంలో ఖాళీ చిప్స్ ప్యాకెట్ లేదా ఖాళీ టిన్లలో విలువైన వస్తువులను ఉంచితే దొంగలు వాటిని పసిగట్టలేరు. ఫలితంగా మన విలువైన సామాను సురక్షితంగా ఉంటుంది. కాగా మైగుల్ మనోజ్ సోషల్ మీడియాలో ఇచ్చిన ఈ సలహా చాలామందికి నచ్చలేదు. విలువైన వస్తువులను మనం ధరించే దుస్తులలోని సీక్రెట్ పాకెట్లు, ధార్మిక గ్రంథాలు, ఖాళీ కాస్మొటిక్ డబ్బాలలో ఉంచడం శ్రేయస్కరమని వారు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్.. -
ప్రతిరోజూ పెరుగు తింటున్నారా? పొరపాటున కూడా ఈ పని చేయకండి
పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారతీయుల భోజనంలో పెరుగు కశ్చితంగా ఉండాల్సిందే. చాలామందికి ఎన్ని కూరలు ఉన్నా సరే చివరికి పెరుగుతోనే భోజనాన్ని ముగిస్తారు.పెరుగులో ప్రోబయోటిక్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు పెరుగు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. అయితే వీటిని తగిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. ఎక్కువ తీసుకుంటే కూడా నష్టమే అంటున్నారు నిపుణులు.కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు పెరుగును తినకూడదని, అలాంటి వారు పెరుగు తినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు. పెరుగు ఎలా తినాలి? పెరుగును నేరుగా తీసుకుంటే వేడి చేస్తుంది. కాబట్టి అందులో కాస్త నీళ్లు కలుపుకొని తీసుకోవాలి. అలా చేయడం వల్ల వేడి స్వభావాన్ని సమతుల్యం చేస్తుంది. ఈమధ్య దహీ కా థడ్కా, దహీ ఫ్రై పేరిట రకరకాల వంటలు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగులో తాళింపు వేసుకొని లాగించేస్తున్నారు. కానీ నిజానికి పెరుగును వేడి చేసి తినకూడదు. ఇలా చేయడం వల్ల పెరుగులోని పోషకాలన్నీ నశిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం పెరుగును పండ్లలో కలిపి కూడా తినకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రిపూట పెరుగు తినొచ్చా? పెరుగుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. రాత్రిపూట పెరుగును తీసుకవడం వల్ల తినడం మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం ఏర్పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణం చల్లపడినప్పుడు పెరుగును తింటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తప్పనిసరిగా పెరుగు తినాలనిపిస్తే పలుచని మజ్జిగ చేసుకొని తాగాలని సూచిస్తున్నారు. రాత్రివేళల్లో పెరుగు తింటే జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందట. రోజూ పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు ► ఆస్తమాతో బాధపడుతున్న వారు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారు పెరుగును కాస్త మితంగానే తీసుకోవాలి. తినాలని భావిస్తే కేవలం పగటిపూట మాత్రమే తినాలి. రాత్రిళ్లు తినకూడదు. ► చాలామంది అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు సైతం పెరుగుకు దూరంగా ఉండాలి. ► వర్షాకాలంలో ప్రతిరోజు పెరుగు తినడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు, జలుబు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ► మీరు తరచుగా అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే పెరుగుకు దూరంగా ఉంటేనే మంచిది. ► మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ పెరుగును తీసుకోవద్దు. ముఖ్యంగా పుల్లటి పెరుగు తింటే తలనొప్పి మరింత బాధిస్తుంది. ► కీళ్లనొప్పులతో బాధపడేవారు రోజూ పెరుగు తినకూడదు. పెరుగు పుల్లని ఆహారం , పుల్లని ఆహారాలు కీళ్ల నొప్పులను తీవ్రతరం చేస్తాయి ► ప్రతిరోజూ ఎక్కువ మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మితంగా తీసుకోవడం మంచిది. -
ఈ బైక్స్ కొనుగోలుపై కనీవినీ ఎరుగని బెనిఫిట్స్ - రూ. 4 లక్షల వరకు..
Ducati Benefits: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ బైక్ బ్రాండ్స్లో ఒకటైన 'డుకాటి' (Ducati) తన 10వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా కంపెనీకి చెందిన కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ అందించనున్న ఈ బెనిఫీట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బెనిఫీట్స్.. నివేదికల ప్రకారం, డుకాటి ఇండియా ఇప్పుడు తన స్ట్రీట్ఫైటర్ వి4, మల్టీస్ట్రాడా వి4 మోడల్స్ మీద ఏకంగా రూ. 4 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బైక్స్ అసలు ధరలు దేశీయ మార్కెట్లో రూ. రూ. 22.15 లక్షలు, రూ. 21.48 లక్షలు కావడం గమనార్హం. అదే సమయంలో స్ట్రీట్ఫైటర్ వి2, మల్టీస్ట్రాడా వి2, మాన్స్టర్ మోడల్స్ మీద రూ. 2 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మోడల్ బైకుల అసలు ధరలు రూ. 18.10 లక్షలు, రూ. 16.05 లక్షలు, రూ. 12.95 లక్షలు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కంపెనీ అందిస్తున్న ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ కాదు, అయితే డుకాటి బ్రాండ్ దుస్తులు, యాక్ససరీస్ వంటివి పొందవచ్చు. ఈ బెనిఫీట్స్ కూడా స్టాక్ ఉన్నత వరకు మాత్రమే లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కొనుగోలుదారులు సమీపంలో ఉన్న డీలర్షిప్లను సందర్శించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
మహిళా.. ఇక భయమేల! నీ ఆలోచన ఇలా అమలు చేసేయ్..
మహిళలకు జీవనకాలం పెరిగింది. సంరక్షణ బాధ్యతలు దీర్ఘకాలం పాటు నిర్వహించాల్సి వస్తోంది. ఒంటరి మహిళలు లేదా వితంతువులకూ బాధ్యతలు ఉంటాయి. ఉన్నట్టుండి అమ్మకు ఏదైనా జరగరానిది జరిగితే, ఆమె ఆకాంక్షల మేరకు పిల్లలకు ఆస్తుల బదిలీ ఎలా..? పిల్లల సంరక్షణ ఎలా..? తాను జీవించి ఉండగానే తీవ్ర అనారోగ్యం బారిన పడితే ఆమె సంరక్షణ ఎవరు చూడాలి..? ఆమె తరఫున ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి..? ఇక్కడే ఎస్టేట్ ప్లానింగ్ కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు కోరుకున్నట్టు, వారి ఇష్టం మేరకు, ఆకాంక్షల మేరకు ఆస్తుల బదిలీ సహా ఎన్నో అంశాలకు చట్టబద్ధమైన రక్షణతో ఎస్టేట్ ప్లానింగ్ హామీ ఇస్తుంది. ఈ ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుందన్నది? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఎస్టేట్ ప్లానింగ్ డాక్యుమెంట్లో ఆస్తులు, అప్పులు ఇలా సమగ్ర వివరాలు ఉంటాయి. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా సమగ్ర ఆస్తులు, బాధ్యతలు (చెల్లించాల్సిన రుణాలు) అన్నీ వస్తాయి. వారసుల మధ్య వివాదాలను ఇది నివారిస్తుంది. మహిళ కోరినట్టుగా ఆస్తుల పంపిణీ, పన్ను చెల్లింపులతోపాటు, అప్పులను కూడా తీరుస్తుంది. పిల్లలకు అంతగా సామర్థ్యాలు లేవని భావించినప్పుడు, అవసరమైన సందర్భాల్లో ఆర్ధిక, వైద్య అవసరాలను చూసేందుకు నమ్మకమైన ఒక వ్యక్తిని కూడా నియమించుకోవచ్చు. ఎస్టేట్ ప్లానింగ్ మహిళలను ఆర్థికంగానే కాకుండా బాధ్యతల పరంగా స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. తమకు ప్రియమైన వారు ఇబ్బంది పడకుండా దీర్ఘకాలం పాటు సంరక్షణ బాధ్యతలను కోరిన విధంగా నిర్వహిస్తుంది. మహిళలకు తమ పిల్లల సంరక్షణకు సంబంధించి ప్రత్యేకమైన లక్ష్యాలతోపాటు.. ఆందోళన కూడా ఉంటుంది. పిల్లల ఎదుగుదలలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు ప్రాధాన్యతలను నిర్ణయించే అమ్మలూ ఉన్నారు. ఒకవేళ తాము అకాల మరణానికి గురైతే పిల్లలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా ఎస్టేట్ ప్లానింగ్ భరోసానిస్తుంది. ఒంటరి మహిళ లేదా వితంతు మహిళ వీలునామాలో గార్డియన్ పేరు రాస్తే సరిపోతుంది. అదే ఎస్టేట్ ప్లాన్ అయితే అర్హత లేని వ్యక్తి సంరక్షకుడిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆకాంక్షలు నెరవేరేందుకు.. మహిళలు తమ పేరిట ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు, వాటి సక్రమ బదిలీకి, సరైన వారసులకు తాము కోరుకున్నట్టుగా బదిలీ చేసుకునేందుకు ఎస్టేట్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. వారసులు తేల్చుకోలేకపోతే ఆస్తులపై ప్రయోజనం ఎవరు పొందాలో కూడా ఓ పట్టాన తేలదు. దీంతో కోర్టు కేసులు, ఎన్నో ఏళ్ల కాల హరణం, విపరీతమైన ఖర్చులకు దారితీస్తుంది. మన దేశంలో వారసత్వ చట్టాలు పురుషులకే మొగ్గు చూపిస్తున్నాయి. మరణించిన మహిళ ఆస్తులు ఆమె భర్త తరఫు వారికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎస్టేట్ ప్లానింగ్ ఎంతో అవసరం. ఇది లేకపోతే ఆమె ఆకాంక్షలకు భిన్నంగా ఆస్తుల పంపకాలు జరగొచ్చు. అందుకని వివాహిత మహిళలు అయినా, వితంతువులు అయినా, పెళ్లి కాని మహిళలు అయినా అందరికీ ఎస్టేట్ ప్లానింగ్ అవసరం. అప్పుడే వారు కోరుకున్నట్టుగా, కోరుకున్న వారికి ఆస్తులు బదిలీ అవుతాయి. వీలునామా - ఎస్టేట్ ప్లానింగ్ ఎస్టేట్ ప్లానింగ్ అంటే వీలునామా అనుకునేరు. వీలునామా, ఎస్టేట్ ప్లానింగ్ వేర్వేరు. అలాగే, ఎస్టేట్ ప్లానింగ్ అంటే ధనవంతులకు, వీలునామా (విల్లు) సామాన్యులకు అనుకునేవారూ ఉన్నారు. కానీ, ఇవి ఫలానా వారికే అని ఏమీ లేదు. వీటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఎస్టేట్ అంటే.. ఒక వ్యక్తికి సంబంధించి అన్ని ఆస్తులు, అప్పులు. ఆస్తులు అంటే బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లు, బీమా పాలసీలు, పేటెంట్లు, ట్రేడ్మార్క్లు, కాపీ రైట్లు, రియల్ ఎస్టేట్, ఆర్ట్లు, కళాఖండాలు, వాహనాలు, ఆభరణాలు ఇలా విలువైనవన్నీ వస్తాయి. బాధ్యతలు అంటే వ్యక్తిగత రుణాలు, మార్ట్గేజ్ రుణాలు, క్రెడిట్ కార్డులు, పన్నులు వస్తాయి. ఉదాహరణకు.. ఏ అనే వ్యక్తికి కొన్ని పెట్టుబడులు, రూ.కోటి విలువైన ప్రాపర్టీ ఉంది. అలాగే, బీ అనే వ్యక్తి పేరిట ఆరి్థక పెట్టుబడులు, పలు చోట్ల ప్రాపర్టీలు, వ్యాపారాల్లో వాటాలు మొత్తం మీద రూ.500 కోట్ల విలువ చేసేవి ఉన్నాయి. ఇక్కడ ఏ, బీ ఇద్దరికీ ఎస్టేట్ ప్లానింగ్ ఉపయోగపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అనేది రాసిన వ్యక్తి మరణం తర్వాత వారి పేరిట ఉన్న సంపదను బదిలీ చేయడానికే పరిమితం కాదు. జీవించిన ఉన్న సమయంలోనూ వాటిని రక్షించడం, కాపాడుకోవడం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించలేని పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో కూడా ఎస్టేట్ ప్లానింగ్లో ఉంటుంది. విల్లు అనేది సంపదను ఎవరికి, ఎలా పంచాలో సూచించే చట్టబద్ధమైన పత్రం. మరణానంతరం కోరుకున్న విధంగా ఆస్తులను బదిలీ చేసేందుకు ఈ పత్రం ఉపయోగపడుతుంది. విల్లులోని అంశాలను అమలు చేసే బాధ్యతను ఎవరు నిర్వహించాలో కూడా సూచించొచ్చు. విల్లుతో పోలిస్తే ఎస్టేట్ ప్లానింగ్ మరింత విస్తృతంగా ఉంటుంది. విల్లు ఒక్కటే సాధనం అయితే, ఎస్టేట్ ప్లానింగ్ ఒకటికి మించిన సాధనాలతో ఉంటుంది. ఉద్దేశాలు ఊహించని రిస్క్లు ఎదురైతే సంపదకు రక్షణ కవచంలా ఎస్టేట్ ప్లానింగ్ సాయపడుతుంది. మైనర్లు, ప్రత్యేక అవసరాల పిల్లలు ఉంటే, ఆర్ధిక విషయాల గురించి ఏ మాత్రం అవగాహన లేని కుటుంబ సభ్యులు ఉంటే వారికి సంబంధించిన నిర్ణయాలకు ఎస్టేట్ ప్లానింగ్ హామీ ఇస్తుంది. మహిళ నిర్ణయాలు తీసుకోలేని స్థితికి వెళితే, ఆ బాధ్యతలు నిర్వహించే యంత్రాంగం ఏర్పాటు, కుటుంబ వివాదాలను పరిష్కరించే సమాచార వాహకం ఏర్పాటు ఇలా ఎన్నో అంశాలకు ఎస్టేట్ ప్లానింగ్ వేదిక కాగలదు. తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు, ఆసుపత్రుల్లో విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె తరఫున ఎవరు నిర్ణయం తీసుకోవాలో ఎస్టేట్ ప్లానింగ్ స్పష్టం చేస్తుంది. ఎస్టేట్ ప్లానింగ్తో ఉన్న ప్రయోజనం వారసత్వ పన్ను తప్పించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం మన దేశంలో వారసత్వ పన్ను లేదు. కానీ, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉంది. తాము ప్రేమించే వారు విదేశాల్లోనూ ఉండి, తమ తర్వాత వారికి కూడా ఆస్తుల బదలాయింపు కోరుకుంటే అప్పుడు ఎస్టేట్ ప్లానింగ్ మెరుగైనది. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారికి కూడా ఎస్టేట్ ప్లానింగ్ అవసరం. చివరి వీలునామా, ప్రైవేటు ఫ్యామిలీ ట్రస్ట్, పవర్ ఆఫ్ అటార్నీ, గిఫ్ట్ డీడ్స్, అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్, లైఫ్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ చార్టర్లు ఎస్టేట్ ప్లానింగ్లో ఉంటాయి. పరిధి చాలా విస్తృతం కనుక నిపుణుల సాయంతో దీన్ని రూపొందించుకోవడం అవసరం. మహిళలకు ప్రయోజనం ఒంటరి మహిళలకు ఎస్టేట్ ప్లానింగ్ ఎంతో సాయంగా ఉంటుంది. ఎందుకంటే వారి సంరక్షణ బాధ్యతలతోపాటు, వారి తదనంతరం అన్ని అప్పులు తీర్చేసి, మిగిలిన ఆస్తులను వారు కోరిన మేరకు వారికి ఎంతో ఇష్టమైన వారికి సాఫీగా పంపిణీ అవుతాయి. రెండు రకాల ప్రయోజనాలకు ఇది భరోసా ఇస్తుంది. అందుకే ఇక్కడ మహిళలను ప్రధానాంశంగా తీసుకోవడం జరిగింది. అంతేకాదు, ఎస్టేట్ ప్లానింగ్ రూపొందించడం వల్ల మహిళలకు అన్ని అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. అన్ని ఆస్తులు, అప్పులు, అవసరాలపై స్పష్టత వస్తుంది. ఒక విధంగా అన్ని వైపులా ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణనిస్తుంది. పన్నుల భారం ఆస్తులపై పన్నుల భారాన్ని ఎస్టేట్ ప్లానింగ్ తప్పిస్తుంది. అంతేకాదు, ఒకరి మరణానంతరం ఎస్టేట్ ప్లానింగ్లో పేర్కొన్న మాదిరి ఆస్తులను పింపిణీ చేసుకున్నప్పుడు వాటిపై వ్యయాలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకు ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం వల్ల ఆస్తులపై పన్ను తగ్గుతుంది. విచారణ లేకుండానే (చట్టపరమైన ప్రక్రియ) లబి్ధదారులు ఆస్తులు పొందగలరు. ఎస్టేట్ ప్లానింగ్లో సూచనల మేరకు ఆస్తులను వేగంగా బదిలీ చేయవచ్చు. ప్రయోజనాలు.. పరిమితులు.. వ్యత్యాసాలు తమ ఆస్తులు తమ తదనంతరం ఎవరికి చెందాలో విల్లులో రాసుకోవచ్చు. విల్లు లేకుండా మరణిస్తే.. అనుభవించే హక్కులు మారొచ్చు. ఉదాహరణకు హిందూ పురుషుడు విల్లు లేకుండా మరణిస్తే అతడి పేరిట ఉన్న సంపదను అతడి తల్లి, భార్య, పిల్లలు ఇలా మూడు సమాన వాటాలుగా పొందొచ్చని చట్టం చెబుతోంది. కానీ, విల్లు రాస్తే సంబంధిత వ్యక్తి కోరుకున్న విధంగా ఆస్తుల బదిలీకి అవకాశం ఏర్పడుతుంది. విల్లు వ్యక్తి మరణానంతరమే అమల్లోకి వస్తుంది. అంతేకాదు, ఈ విల్లును వారసులు సవాల్ చేయవచ్చు. ఎస్టేట్ ప్లానింగ్ సమగ్ర రూపంతో ఉంటుంది. మరణానంతరమే కాకుండా జీవించిన కాలంలోనూ లక్ష్యాలకు రూపం ఇస్తుంది. ఎస్టేట్ ప్లానింగ్ మీ సంపదకు, మీ వారసులు లేదా మీకు ఇష్టమైన వారి ఆరి్థక భద్రతకు ఎక్కువ రక్షణనిస్తుంది. కేవలం చట్టబద్ధమైన డాక్యుమెంట్లకే పరిమితం కాకుండా, అన్ని రకాల బాధ్యతలు, సంరక్షణ, సంపద బదిలీ యంత్రాంగం ఏర్పాటు ఇందులో ఉంటాయి. కనుక విల్లుతో పోలిస్తే ఎస్టేట్ ప్లానింగ్ అదనపు ఖర్చు భరించాల్సిందే. ఎస్టేట్ ప్లానింగ్ మహిళల కోసమనే కాదు. పురుషులకూ, ఇంటి బాధ్యతలు చూసే, ఆస్తులు, బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే డాక్యుమెంట్ అవుతుంది. -
ఆఫర్ల జాతర.. టాటా కార్లు కొనేవారికి ప్రత్యేకం
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఉగాదికి ముందే కొనుగోలుదారుల కోసం అద్భుతమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. టాటా హారియర్, సఫారి, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్ వంటి మోడల్స్ కొనుగోలుపై ఇప్పుడు రూ. 65,000 వరకు డిస్కౌంట్స్, బెనిఫిట్స్ పొందవచ్చు. టాటా సఫారీ: అత్యంత ప్రజాదరణ పొందిన సఫారీ అన్ని 2023 మోడల్స్ మీద కంపెనీ రూ. 35,000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇక 2022 మోడల్స్ మీద ఏకంగా రూ. 65,000 తగ్గింపును కంపెనీ అందిస్తోంది. టాటా హారియర్: టాటా మోటార్స్ తన 2023 హారియర్ మీద రూ. 35,000 డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇందులో 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉన్నాయి. 2022 హారియర్ మోడల్ కొనుగోలు మీద ఇప్పుడు మీద రూ. 65,000 డిస్కౌంట్ లభిస్తుంది. టాటా టిగోర్: 2023 టాటా టిగోర్ సిఎన్జి మోడల్ కొనుగోలు మీద రూ. 30,000, పెట్రోల్ మోడల్ మీద రూ. 25,000 తగ్గింపు పొందవచ్చు. పెట్రోల్, సిఎన్జి మోడల్స్ కొనుగోలుపై కస్టమర్లు ఇప్పుడు బెనిఫీట్స్ పొందవచ్చు. అదే సమయంలో 2022 మోడల్ మీద రూ. 45,000 మాత్రమే తగ్గింపు పొందవచ్చు. టాటా టియాగో: ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్లో ఒకటైన టాటా టియాగో కొనుగోలుపై కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తోంది. టియాగో సిఎన్జి మీద రూ. 30,000, పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25,000 తగ్గింపు లభిస్తుంది. ఇక 2022 మోడల్ కొనుగోలు చేస్తే రూ. 40,000 వరకు బెనిఫీట్స్ లభిస్తాయి. టాటా ఆల్ట్రోజ్: 2023 టాటా ఆల్ట్రోజ్ కొనుగోలుపై రూ. 25,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్ల మీద సమానంగా డిస్కౌంట్స్ పొందవచ్చు. 2022 మోడల్ కొనుగోలుపై రూ. 35,000 పొదుపు చేయవచ్చు. మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న హ్యాచ్బ్యాక్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ చెప్పుకోదగ్గ మోడల్. కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్స్, బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ డిస్కౌంట్స్ కూడా పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
మతం మారితే రిజర్వేషన్లు వద్దు: వీహెచ్పీ
ధన్తోలి: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి విజయ్ శంకర్ తివారీ అన్నారు. శుక్రవారం నాగ్పూర్(మహారాష్ట్ర) ధన్తోలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఇలా రెండు ప్రయోజనాలు పొందటాన్ని తాము అడ్డుకుంటామని తివారీ చెప్పారు. ఈ ప్రయోజనాలను ఆశించే చాలా మంది మతం మారుతున్నారన్నారు. కేంద్రం కూడా ఈ దిశగా రిజర్వేషన్లు అందకుండా చూసే ప్రణాళిక రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత మార్పిడుల కోసం పలు ప్రయత్నాలు ఊపందుకున్నాయని, అలాంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వీహెచ్పీ తరపున ఒక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్ -
ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా?
సాక్షి,ముంబై: ఇన్కం టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల (జూలై,31) చివరి లోపు తప్పనిసరిగా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్ను కచ్చితంగా పూర్తి చేయాలి. నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ITR ఫైలింగ్ తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేయవచ్చు. దాని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి రూ.2.5లక్షల్లోపు ఉన్న వారుఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరికాదు. ఫైల్ చేయక పోయినా జరిమానా ఉండదు. 60 ఏళ్లు పైబడి 80 ఏళ్లలోపు పన్ను చెల్లింపుదారులకు, ఈ మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు. 80 ఏళ్లు పైబడిన వారికి పన్ను మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలు ఈ నేపథ్యంలోనే సాధారణంగా చాలామంది ఐటీఆర్ దాఖలును పట్టించుకోరు. కానీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల ఈజీగా బ్యాంక్ రుణం పొందడం, క్రెడిట్ కార్డ్ లేదా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఈజీ లాంటి ఇతర లాభాలు న్నాయి. ఐటీఆర్ ఫైలింగ్, లాభాలు ఈజీగా రుణాలు : ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే ఐటీఆర్ కీలకం. ఐటీఆర్ను బ్యాంకులు, ఇతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఆదాయ వనరుకు రుజువుగా భావిస్తాయి. సో.. రెగ్యులర్గా ఐటీఆర్ దాఖలు చేస్తూ ఉంటే రుణం పొందడం తేలిక. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాన్ని చవిచూసి ఉంటే, తదుపరి ఏడాది సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది. గడువు తేదీకి ముందే ITRని ఫైల్ చేయడం ద్వారా ఈ నష్టాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. వీసా ప్రాసెస్: అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, జర్మనీ వీసా ప్రాసెసింగ్ సమయంలోసంబంధిత ఇమ్మిగ్రెంట్ కార్యాలయంలో ఐటీ రిటర్న్స్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దాదాపు 3-5 ఏళ్ల ఐటీఆర్ హిస్టరీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే క్రమం తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేస్తే. ఈ ప్రాసెస్లో ఆటంకాలను తగ్గించు కోవచ్చు. టీడీఎస్,రాయితీ క్లెయిమ్: ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఆదాయం ఉన్నా, ఐటీ విభాగం పన్ను విధించి ఉంటే దాన్ని క్లెయిమ్కు ఐటీఆర్ ఫైలింగ్ సాయపడుతుంది. పెట్టుబడిపై ఏదైనా పన్ను మినహాయింపు లభించిందా అని ఫారమ్ 26ASలో చెక్ చేసు కోవచ్చు. ఐటీఆర్ను ఆదాయం పన్ను విభాగం అధికారులు అంచనా తర్వాత, ఏమైనా రిఫండ్ ఉండే అది నేరుగా సంబంధిత వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. అలాగే, ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదంలో వైకల్యం సంభవించిన సందర్భాల్లో పరిహారం పొందేటప్పుడు కూడా ఐటీఆర్ ఒక ముఖ్యమైన ఆదాయ రుజువుగా ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో నష్టాలొచ్చినపుడు మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టిన పెట్టుబడులపై నష్టాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయంలో సర్దుబాటు చేసుకోవచ్చు. నిర్ధిష్ట గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు ఈ పన్ను మినహాయింపును అభ్యర్థించవచ్చు.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 70, 71 ఒక నిర్దిష్ట సంవత్సరంలోని నష్టాలను తదుపరి సంవత్సరానికి నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు . దీంతోపాటు ఆధార్ కార్డ్ లేదా మరేదైనా డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం దీన్ని అడ్రస్ఫూఫ్గా కూడా అంగీకరిస్తుంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్నవారికి, ఫారమ్ 16 అందుబాటులో లేని వారికి ఐటీఆర్ ఫైలింగ్ చాలా ఉపయోగపడుతుంది. -
కాఫీ డే: రోజుకి ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
International Coffee Day 2021: మంచి నీటితో పోటీపడుతూ.. మనిషి జీవనంలో టీ, కాఫీలు ఒక భాగంగా మారిపోయాయి. అందుకే వీటి కోసమూ ప్రత్యేకంగా రోజులను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1న(ఇవాళ) అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి.. అదే విధంగా అతిగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడమే ఈరోజు ప్రత్యేకత. అలాగే కాఫీ వర్తకం గురించి చర్చిస్తూనే.. పనిలో పనిగా ‘కాఫీ’ని జీవనోపాధిగా చేసుకునే వాళ్లకు మద్దతు ప్రకటించే రోజు కూడా. ఇంతకీ రోజూ ఎన్ని కప్పుల కాఫీ తాగొచ్చు.. ఏం ఏం ప్రయోజనాలు ఉంటాయి. అతి వల్ల నష్టమేంటో చూద్దాం. ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవరసాయనాలుంటాయి. కెఫిన్, డైటర్పిన్స్, డైఫీనాల్స్ వంటివి బాడీని చురుకుగా ఉంచుతాయి. ఒక కప్పు కాఫీ తాగగానే బాడీలో కాస్తంతైనా తేడా కనిపిస్తుంది. అయితే ఇది మనుషులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి హైబీపీ (హైపర్టెన్షన్), ఒంట్లో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉండటం (హైపర్లిపిడేమియా) ఉన్నాయనుకుందాం. సాధారణ వ్యక్తుల్లో కాఫీ కనబరిచే ప్రభావానికీ, ఆ జబ్బులున్నవాళ్లలో చూపే ప్రభావానికీ తేడాలుంటాయి. అలాగే కాఫీ ఏరకానికి చెందింది, ఎలా తయారు చేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు అది ఫిల్టర్ కాఫీనా? సాధారణ కాఫీనా? అనే అంశం లాంటివన్నమాట. 2015 నుంచి ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కాఫీ డే నిర్వహిస్తూ వస్తోంది. కొన్నిదేశాల్లో ఇది వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నప్పటికీ.. ఎక్కువ దేశాలు మాత్రం అక్టోబర్ 1నే జరుపుతున్నాయి. ఈ కారణం వల్లే అక్టోబర్ 1ని అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా పాటిస్తున్నారు. కాఫీ సుగుణాలివే... © కాఫీలో బోలెడన్ని మంచి గుణాలున్నాయి. © కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్ని) నివారిస్తుంది. © కాఫీలోని డైఫినాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. © కాఫీ బాడీని ఉత్తేజితంగా ఉంచుతుంది. © అయితే ఈ బెనిఫిట్స్ కోసం కేవలం రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి. చదవండి: గర్భిణులకు కాఫీ సేఫేనా? కెఫిన్తో హెల్త్.. కాఫీలో ఉండే కెఫిన్ అనే ఉత్ప్రేరక పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. మనం కాఫీ తాగి తాగగానే... దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే అది సాధారణం కంటే 8 ఎం.ఎం./హెచ్జీ ఎక్కువవుతుంది. అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత కనీసం గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. © కాఫీలో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. లేకుంటే అవసరం లేని మాత్ర వేసుకుంటే కలిగిన సైడ్ ఎఫెక్ట్ కలిగినట్లే. © కాఫీ.. యాంగ్జైటీ మరింత పెంచుతుంది. కొందరిలో దేహాన్ని వణికేలా కూడా చేస్తుంది. © రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా (నీటి కాసులు) కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. కాఫీ.. మూడు కప్పులు మహాఅయితే నాలుగు కప్పులు మించకుండా తాగితేనే దేహానికీ, ఆరోగ్యానికీ మేలని గుర్తుంచుకోండి. ఎలా తాగితే అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయో తెలుసుకుని, అలా మాత్రమే వాటిని తాగండి. ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ కాఫీ డే టు కాఫీ లవర్స్. -
ఆ కారుపై లక్ష వరకు బెనిఫిట్ ఆఫర్స్ !
Nissan Compact SUV Kicks: అమెరికా కంపెనీలు ఇండియా మార్కెట్ నుంచి వైదొలుగుతుండటంతో ఇతర కార్ల తయారీ కంపెనీలు ఇండియాలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్ కార్ మేకర్స్ కంపెనీ నిస్సాన్ సరికొత్త బెనిఫిట్ ఆఫర్స్తో ముందుకు వచ్చింది. కాంపాక్ట్ ఎస్యూవీ స్టో అండ్ స్టడీ అండ్ విన్ ది రేస్ అనే నానుడి నిజం చేస్తోంది నిస్సాన్ ఆటో. అమ్మకాల పరంగా మెరుపులు లేకపోయినా నిస్సాన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఆకర్షణీయమై మోడళ్లను రిలీజ్ చేస్తోంది. ఆ ఒరవడిలో కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో కిక్స్ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ మోడల్ ప్రమోషన్లో భాగంగా పలు బెనిఫిట్ ఆఫర్స్ ప్రకటించింది. సెప్టెంబరు 30 వరకు కొనుగోలు చేసే కార్లపై ఈ బెనిఫిట్ ఆఫర్ వర్తిస్తుంది. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రెల్ ఇంజన్తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. బెనిఫిట్ ఆఫర్స్ ఇలా 1.3 లీటర్ టర్బో వేరియంట్పై - క్యాష్ బెనిఫిట్ రూ. 15,000 - ఆన్లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000 - ఎక్సేంజీ బోనస్ రూ.70,000 - సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000 - స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం 1.5 లీటర్ వేరియంట్పై - క్యాష్ బెనిఫిట్ రూ. 10,000 - ఆన్లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000 - ఎక్సేంజీ బోనస్ రూ.20,000 - సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000 - స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం చదవండి : సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
Reliance: కోవిడ్తో మరణించిన ఉద్యోగి కుటుంబానికి 5 ఏళ్ల జీతం.. ఇంకా
కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగులను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మంచి నిర్ణయం తీసుకుంది. కొవిడ్తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఐదేళ్లపాటు ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. అంతేకాదు వాళ్ల పిల్లల చదువుల బాధ్యతలను కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ముంబై: ఉద్యోగుల సామాజిక భద్రత కోసం రిలయన్స్ ఒక అడుగు ముందుకేసింది. COVID-19 తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబానికి 5 సంవత్సరాలు పూర్తి వేతనం ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు విద్య అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. అలాగే ఆఫ్ రోల్స్ ఎంప్లాయిల కుటుంబాలకు పదిలక్షల సాయం అందించాలని నిర్ణయించినట్లు చెబుతోంది. అలాగే సాయం అందించే విషయంలో బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, సాయం త్వరగతిన అందుతుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు కొన్ని జాతీయ వెబ్సైట్స్ ఈ సాయం గురించి ప్రముఖంగా కథనాలు ప్రచురించాయి. కాగా, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో #WeappreciateReliance, #thanxReliance హ్యాష్ ట్యాగులతో రిలయన్స్ నిర్ణయాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. కోవిడ్ లీవులు.. సాయం ఇక కోవిడ్ బారిన పడ్డ ఎంప్లాయిస్, వాళ్ల కుటుంబాలు పూర్తిగా కోలుకునేంతవరకు జీతాలతో కూడిన సెలవుల్ని రిలయన్స్ మంజూరు చేసింది. అలాగే కరోనాతో చనిపోయిన ఉద్యోగి భార్య, పేరెంట్స్, పిల్లల ఆస్పత్రి ఖర్చుల కోసం 100 శాతం ప్రీమియం చెల్లింపును రిలయన్సే భరించాలని నిర్ణయించుకుంది. ఇక చనిపోయిన ఉద్యోగి పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ వరకు దేశంలో ఏ ఇనిస్టిట్యూట్లోనైనా 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ సౌకర్యానికి అవసరమయ్యే ఖర్చులనూ రిలయన్స్ ఫౌండేషన్ అందించబోతోంది. ‘‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. పోరాట పటిమను ఆపొద్దు. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందాలని ఆ దేవుడ్ని ప్రార్థిద్దాం. చేయూత నిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటన రిలీజ్ చేశారు. -
వెన్న రుచికరమే కాదు...ఆరోగ్యకరం కూడా!
ఇటీవల నూనెల వాడకం బాగా పెరిగాక వెన్నను గతంలోలా మునపటంత విరివిగా ఉపయోగించడం లేదు. కానీ నిజానికి వెన్న చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. వెన్నలోని కొన్ని పోషకాలూ, వాటితో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) అనే పోషకాలు ఉన్నాయి. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెన్నలోని బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక... అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని ఈ బ్యుటిరేట్. బ్యూటిరేట్కు మరో మంచి లక్షణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్ఫ్లమేషన్ను కూడా అది సమర్థంగా తగ్గిస్తుంది. -
హెచ్ఆర్ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న పీఆర్సీలో ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తగ్గిస్తూ వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏను యథాతథంగా కొనసాగించాలని కోరుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు హెచ్ఆర్ఏ 30 శాతం ఉండగా దాన్ని 24 శాతానికి తగ్గిస్తూ పీఆర్సీ సిఫారసు చేసింది. అలాగే 2 లక్షల జనాభా కంటే ఎక్కువున్న పట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 20 శాతం హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 17 శాతానికి తగ్గించింది. ఇక 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో 14.5 శాతం హెచ్ఆర్ఏ ఉండగా దాన్ని 13 శాతానికి, మండల కేంద్రాలు, గ్రామాల్లో 12 శాతం హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 11 శాతానికి తగ్గించింది. దీంతో హెచ్ఆర్ఏ తగ్గింపు వల్ల తమకు చేకూరాల్సిన ప్రయోజనం రాకుండా పోతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రస్తుతం హెచ్ఆర్ఏను యథావిధిగా కొనసా గించాలని కోరుతున్నాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. దానిపై ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, పాత పీఆర్సీలో హెచ్ఆర్ఏ గరిష్టంగా రూ. 15 వేల వరకే సీలింగ్ ఉంది. దీని ప్రకారం ఉద్యోగుల హెచ్ఆర్ఏ ఒకవేళ రూ. 15 వేలకు మించినా రూ. 15 వేలే ఇస్తారు. కానీ ప్రస్తుత పీఆర్సీలో ఆ సీలింగ్ లేదు. అయితే రూ. 15 వేల కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న వారికి మాత్రం హెచ్ఆర్ఏలో తగ్గుదల తప్పదు. -
త్వరలో 57 ఏళ్ల నుంచే పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: గతంలో హామీయిచ్చినట్లుగా 57 ఏళ్ల నుంచే పెన్షన్ సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును మూడేళ్లు తగ్గించి... అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలనేది సీఎం ఆలోచనని, కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యమైందని పేర్కొన్నారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పద్మా దేవేందర్రెడ్డి, ఆరూరు రమేష్, బొల్లం మల్లేష్ యాదవ్లు అడిగిన ప్రశ్నలకు ఎర్రబెల్లి సమాధానం ఇచ్చారు. పెన్షన్లకు కేంద్రం ఇచ్చే సొమ్ము చాలా తక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు ఏడాదికి రూ. 11,724 కోట్లు ఖర్చు చేస్తే, కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 210 కోట్లే ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 39.36 లక్షల మందికి ఇస్తే, కేంద్రం 6 లక్షల మందికే ఇస్తోందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో వృద్ధులు, వికలాంగులు, చేనేత, బీడీ కార్మికులకు న్యాయం జరుగుతోందన్నారు. ఒంటరి మహిళలకు 2015 నుంచే పెన్షన్ ఇస్తున్నామన్నారు. కరోనా వల్ల ఏడాది నుంచి కొద్దిగా గ్యాప్ ఏర్పడిందన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30% ఫిట్మెంట్ను ప్రకటిం చారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు. గత ఎన్నికల మేని ఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాం గంలో భాగమై పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏలు, వీఏఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ కలిపి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదలను వర్తింపజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సోమవారం శాసనసభలో టీ విరామం అనంతరం సీఎం కేసీఆర్ పీఆర్సీ, ఇతర సమస్యల పరిష్కారంపై ప్రకటన చేశారు. తెలం గాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను ఆయన కొనియాడారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర సాహసోపేతమైనదని, సకల జనుల సమ్మె దేశ చరిత్రలోనే అద్భుతఘట్టమని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం పేరు మార్పుకోని సంఘం ఒక్క టీఎన్జీవోయేనని, తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో టీఎన్జీవో స్ఫూర్తి నింపిందన్నారు. టీజీవో అధ్యక్షురాలు మమత, కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ఆర్.ప్రతాప్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు, కార్యదర్శి యూసుఫ్ మియా, పీఆర్టీయూ అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, కార్యదర్శి కమలాకర్రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్తో పాటు ఎమ్మెల్సీ జనార్ధన్రెడ్డి, రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్లతో సైతం వ్యక్తిగతంగా చర్చించిన అనంతరం పీఆర్సీపై ప్రకటన చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. బీఆర్కేఆర్ భవన్ వద్ద ఉద్యోగుల ఆనందోత్సాహాలు 9,17,797 మంది ఉద్యోగులకు లబ్ది రాష్ట్ర సాధనలో స్ఫూర్తిమంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలుపంచుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వీరందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయని, ఉద్యోగులతో ప్రభుత్వానికున్న అవినాభావ సంబంధం రీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నదని, ఉద్యోగులందరి హక్కులను గౌరవిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇంక్రిమెంటును ప్రకటించిందని గుర్తుచేశారు. 2014లో పదవ వేతన సవరణ చేస్తూ 43 శాతం అత్యధిక ఫిట్మెంటును ప్రకటించి, ఉద్యోగుల పట్ల తనకున్న అభిమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకుందన్నారు. ‘కరోనా విపత్తు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. అనూహ్యంగా ఏర్పడిన ఆర్థిక లోటు వల్ల 11వ వేతన సవరణ కొంత ఆలస్యమైంది. ఆర్థిక వ్యవస్థ ఇపుడిపుడే తేరుకుంటున్న నేటి సందర్భంలో మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేస్తున్నాం. వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతిని గత ప్రభుత్వాలు అవలంభించాయి. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే, క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని అన్నిరకాల ఉద్యోగులు కలిపి మొత్తం 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’అని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టిందని, ఇప్పటికే 80 శాతం ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. మిగతా అర్హులైన ఉద్యోగులతో పాటు, అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుందని, ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని అర్హులైన ఉద్యోగులందరూ.. 100 శాతం ప్రమోషన్లు పొందుతారన్నారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనలో కీలక అంశాలివీ... – పీఆర్సీ కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈ.హెచ్.ఎస్) నూతన విధివిధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. – ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15 శాతం అదనపు పెన్షన్ పొందేందుకు ఉన్న వయోపరిమితిని 75 ఏళ్ల నుండి 70 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. – గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతో పాటు, ఆ సంఖ్య పది వేలకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. – వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది. – తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం. – కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. – విధి నిర్వహణలో మరణించిన సీ.పీ.ఎస్.(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు, కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో ప్రజాజీవనంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కరోనా వల్ల రాబడి తగ్గి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కలిపి అందిస్తాం. – ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని రూ. 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. – గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నాం. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయోపరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. – ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ఆశిస్తున్నాం. -
పొట్టి తాటి చెట్లతో ప్రయోజనాలెన్నో!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నీరా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో తాటి చెట్ల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. తాటి నీరాతో తయారైన బెల్లానికి కూడా మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఎక్కువ ఎత్తు పెరిగే మన దగ్గరి తాటి జాతి కన్నా బీహార్కు చెందిన పొట్టి రకం తాటి చెట్ల పెంపకం మేలని పామ్ ప్రమోటర్స్ సొసైటీ చైర్మన్ విష్ణుస్వరూపరెడ్డి అంటున్నారు. తెలంగాణలో తాడి చెట్లు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. గింజ నాటిన 12–14 ఏళ్లకు గానీ గీతకు రావు. బీహార్ పొట్టి రకాలైతే 10–20 అడుగుల ఎత్తు పెరుగుతాయి. విత్తిన 5–7 ఏళ్లలోనే గీతకు వస్తాయని, సీజన్లో రోజుకు 3–15 లీటర్ల నీరా, వంద వరకు పండ్లను ఇస్తాయని తమిళనాడులోని తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు విష్ణుస్వరూప్రెడ్డి తెలిపారు. ఎత్తు తక్కువ ఉండటం వల్ల గీత కార్మికుల పని సులువు కావటంతోపాటు అభద్రత తగ్గుతుందన్నారు. బీహార్ పొట్టి రకం తాటి పండ్లను గత ఏడాది 5 వేలు తెప్పించి పంచామని, ఈ ఏడాది 1,25,000 వరకు తెప్పిస్తున్నానని అన్నారు. వీటిని హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా, రోజుకు 30 లీటర్ల నీరా దిగుబడినిచ్చే డాలర్ (జీలుగ/గిరిక తాడు) మొక్కలను తొలిసారిగా టిష్యూకల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని విష్ణుస్వరూప్రెడ్డి (95023 76010) వెల్లడించారు. -
జుట్టు రాలుతుందా? అయితే ఇది ట్రై చేయండి
ఈ మధ్యకాలంలో జట్టు రాలడం సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనూ జుట్టు తెల్లబడటం, ఎక్కువగా రాలిపోవడం, దురద, చుండ్రు లాంటి అనేక సమస్యలకు పెరుగు చాలా చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వేలకు వేలు పోసి జుట్టుపై కెమికల్స్ ప్రయోగించినా ఎలాంటి ఫలితం ఉండకపోగా దీర్ఘకాలిక సమస్యలు, సైడ్ ఎఫెక్స్ వస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పెరుగులోని ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. పాల నుంచి తయారయ్యే పెరుగులో ఉండే జింక్, బయోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. (సరస్సులో సినిమా) మన శరీర దృఢత్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి అంతే పోషకాలు అవసరం. పెరుగులో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ గుణాలు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టులో పేరుకుపోయిన బాక్టీరియాను దూరం చేసి తేమగా, మృదువుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా తలస్నానం చేశాక జుట్టుకు కండీషనింగ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కుదుళ్లు చిట్లిపోయి జుట్టు రాలుతుంది. దీనికి పెరుగు చక్కటి పరిష్కారం. పెరుగు గొప్ప కండీషనర్గా పని చేస్తుంది. దీంతో మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం వీకెండ్స్లో పార్లర్లు, స్పాలకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే దొరికే పెరుగుతో హెయిర్ ప్యాక్ ప్రయత్నించి ఆరోగమైన కురులకు వెల్కమ్ చెప్పేయండి. (‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’) -
చలి బారిన పడకుండా చక్కటి చిట్కా
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఈ విషయం విన్న తర్వాత అది నిజమే అనిపిస్తుంది. అసలే చలికాలం మొదలైంది కాబట్టి రానున్న మూడు నెలలు చలి తీవ్రంగా ఉండబోతుంది. ఇప్పటికే ప్రతీ ఇంట్లో చలి నుంచి తప్పించుకోవడానికి రకరకాల స్వెటర్లు, ఇంకా అనేక దుస్తులను రెడీ చేసుకుంటారు. అయితే మనం తీసుకునే ఆహారంలో ఉల్లిగడ్డను తీసుకోవడం ద్వారా ఎంతటి చలిలోనైనా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ వంటింట్లో ఉల్లి లేనిదే ఏ కూరను వండరన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉల్లిలో ఉండే ఎంజైమ్స్, కొన్ని యంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన శరీరాన్ని ఎప్పటికప్పుడు వెచ్చగా ఉంచుతుందట. అందుకే చలికాలంలో రోజుకు ఒక ఉల్లి తింటే ఎంత చలికి తటుకొనైనా ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఉల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఉల్లిని జ్యూస్గా తీసుకోవడం వల్ల మన శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు అప్పటికప్పుడు తగినంత శక్తిని ఇస్తుందట. ఉల్లిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్స్, రసాయన పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి ఉల్లిలో సహజంగానే అల్లైల్ డై సల్ఫేట్, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ వంటి లక్షణాలు ఉంటాయి. వీటి వల్ల జ్వరం, జలుబు, దగ్గు, ఉబ్బసం, చెవి, చర్మ సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయలు ప్రయోజనకరంగా ఉంటాయి. చలికాలంలో సాధారణంగానే వ్యాయామం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. కాబట్టి రోజు ఒక ఉల్లి తింటే బరువు పెరగకుండా ఉంచేందుకు దోహదపడుతుంది. ఉల్లిలో ఉండే కాల్షియం, ఐరన్, ఫోలేట్, సల్ఫర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు, ఎక్కువ మోతాదులో ఉండే ఫైబర్ మనిషిని బరువు పెరగకుండా ఉంచుతుందట. చలికాలంలో తీపి వస్తువులు, కూల్ డ్రింక్స్ను ఎక్కువగా తీసుకున్నప్పుడు మన చిగుళ్లు చెడిపోయే అవకాశం ఉంది. అయితే రోజు ఉల్లిని తింటే పిప్పి పళ్లను రాకుండా చేయడంతో పాటు చిగుళ్లను మరింత బలంగా తయారు చేస్తుంది. -
కాళేశ్వరం తొలి ఫలితం మనకే
సాక్షి ,కరీంనగర్ : 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిని 365 రోజులు నింపి ఉంచడమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి గుండెకాయ. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతల పథకాల ద్వారా వచ్చే నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్న తరువాతే ఆయకట్టుకు నీరందించే అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు మంచిర్యాల జిల్లా గూడెం ఎత్తిపోతల పథకంతోపాటు హైదరాబాద్కు తాగునీటి రూపంలో వెళ్తుంది. ఎన్టీపీసీ, సింగరేణి, పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాజెక్టులకు నీరు ఇక్కడి నుంచే చేరుతుంది. ఇప్పుడు కొత్తగా వేమునూరు వద్ద ఏర్పాటు చేసిన మూడు గేట్ల ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లా భూభాగంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి నీరు గ్రావిటీ ద్వారా రెండు 9.53 కిలోమీటర్ల పొడువున్న భారీ సొరంగ మార్గాల ద్వారా నందిమేడారం వద్ద భూగర్భంలోనే నిర్మించిన సర్జిపూల్కు వెళ్తుంది. ఇక్కడ భూగర్భంలోనే ఏర్పాటు చేసిన సర్జ్పూల్ పంప్హౌజ్కు 124 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ పంప్హౌజ్ల ద్వారా మేడారం నుంచి 1.95 కిలోమీటర్ల కాలువ, 15.37 కిలోమీటర్ల దూరం గల రెండు సొరంగ మార్గాల ద్వారా ప్రవహించే నీరు లక్ష్మిపూర్ పంప్హౌజ్కు చేరుతుంది. లక్ష్మీపూర్ పంప్హౌజ్ వద్ద ఒక్కోటీ 139 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి సాయంతో నీటిని 117 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వరద నీటి కాలువలో పోసి, ఒక టీఎంసీని ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా శ్రీరాంసాగర్ వరద కాలువలోకి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్లిస్తారు. 182 కిలోమీటర్ల ఎస్ఆర్ఎస్పీ వరద నీటి కాలువకు నీటిని మళ్లించడం వల్ల చొప్పదండి, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం నియోజకవర్గాలకు సాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. ఈ కాలువ పొడవునా ఉన్న రైతుల కోసం సుమారు 30 చోట్ల తూములు ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఉంది. ఇక మరో టీఎంసీ నీరు మిడ్మానేరుకు చేరుతుంది. మిడ్మానేరు ద్వారా సిరిసిల్లలోని లక్షకు పైగా ఎకరాలకు నీరు లభించనుంది. మిడ్మానేరు నుంచి అప్పర్ మానేర్ దారిలో గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్లు నింపుకుంటూ గోదావరి ఎగువకు సాగనుంది. అనంతగిరి, రంగనాయకసాగర్ ద్వారా మల్లన్నసాగర్ వరకు వస్తాయి. ఈ ప్రాజెక్టు కారణంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజన్న సిరిసిల్ల రైతాంగానికి అధికంగా మేలు జరగబోతుంది. ఏకంగా 1,41,205 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్టు వల్ల రాబోతుంది. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా స్టేజ్–1 కింద 1,60,000 ఎకరాలకు, స్టేజ్ 2 ద్వారా ఏకంగా 4లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మిడ్మానేరు ద్వారా 30వేల ఎకరాలతోపాటు మిడ్మానేరు నుంచి అప్పర్ మానేరు దారిలో 86,150 ఎకరాలకు సాగునీరు అందబోతుంది. కరీంనగర్ జిల్లాలో 800 ఎకరాలు కొత్తగా సాగులోకి రానుంది. గోదావరి నీరు ఎత్తిపోసే దారి ఇదే.. మేడిగడ్డ దగ్గర 1063 మీటర్ల వెడల్పు బ్యారేజీతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలవుతుంది. ఇక్కడి నుంచి గోదావరి నదిలో బ్యాక్ వాటర్ కన్నెపల్లి వరకు 16.37 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కన్నెపల్లి వద్ద 11 మోటార్లతో కూడిన పంప్హౌజ్ ఏర్పాటు చేశారు. ఈ మోటార్లు అన్నారం బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోస్తాయి. 10.87 టీఎంసీల నిల్వసామర్థ్యంతో, 66 గేట్లతో నిర్మించిన అన్నారం బ్యారేజీలో బ్యాక్ వాటర్ను సుందిళ్ల బ్యారేజీలోకి ఎత్తిపోసేందుకు గుంజపడుగు వద్ద భారీ పంప్హౌజ్ నిర్మించారు. ఒక్కోటీ 40 మెగావాట్ల సామర్థ్యం గల 8 భారీ మోటార్లతో అన్నారం బ్యారేజీలోని నీటిని 34 మీటర్ల ఎత్తుకు పంప్ చేసి.. 74 గేట్లతో నిర్మించిన సుందిళ్ల బ్యారేజీలో పోస్తుంది. ఇక సుందిళ్ల బ్యారేజీ నుంచి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోసేందుకు గోలివాడ వద్ద మరో పంప్హౌజ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి పంప్హౌస్ నుంచి 9 భారీ మోటార్ల ద్వారా 40 మీటర్ల ఎత్తుకు పంప్ చేసి.. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పోస్తుంది. ఒక్కోటీ 40 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్ను అమర్చడం గమనార్హం. జగిత్యాల జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు నీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలపై జగిత్యాల జిల్లా రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాకు మణిహారమైన ఎస్సారెస్పీ కాలువలు పునరుజ్జీవం పొందనున్నాయి. ఎస్సారెస్పీ కాలువల్లో నిరంతరం నీరుండేలా మల్యాల మండలం రాంపూర్ వద్ద రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక్కడి నుంచి కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీకి తరలించడం ద్వారా జిల్లాలోని లక్షకు పైగా ఎకరాలలో రెండు పంటలకు సాగునీరు అందనుంది. జిల్లాలో ఎస్సారెస్పీ కింద లక్ష ఎకరాల వరకు ఆయకట్టు ఉన్నప్పటికీ... ప్రస్తుతం నీరు లేక 50 వేల నుంచి 70 వేల ఎకరాలకే సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని లక్ష ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు చేరుకోనుంది. ఇది కాకుండా అదనంగా మరో 60 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందనుంది. జిల్లాలోని ఎస్సారెస్పీ నీరు చేరని మల్యాల, కొడిమ్యాల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు సైతం కాళేశ్వరం నీరు అందనుండటంతో ఆ మండలాలు కూడా సస్యశ్యామలం కానున్నాయి. మొత్తంగా జిల్లాలోని 1.60 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరిచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లికి ‘పేద్ద’ ఊరట కాళేశ్వరం ప్రాజెక్టు జల ఫలాలు పెద్దపల్లి జిల్లా వాసులు ధర్మారం మండలం పత్తిపాక నరసింహస్వామి గుట్టపై ప్రాజెక్టు నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం అవి పెండింగ్లో ఉన్నాయి. పత్తిపాక కంటే లక్ష్మిపూర్ వరద కాలువ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా కాకతీయ కాల్వకు నీరందించడం ద్వారా పెద్దపల్లి జిల్లాలోని లక్షా 85వేల ఎకరాలకు సాగునీరు చేరనుంది. డీ–83 కాల్వలకు లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. డీ–86 కాల్వ ద్వారా 80వేల ఎకరాలకు సాగునీరు వెళుతుంది. ఇలా రెండు ప్రధాన కాల్వల ద్వారా పిల్ల కాల్వల నుంచి ప్రతిపల్లెకు ఎస్సారెస్పీ నీటిని అందించడానికి కాళేశ్వర జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా అందజేసేందుకు వరద కాల్వ వద్ద పనులు కొనసాగుతున్నాయి. అయితే అన్నారం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంథని ప్రాంతానికి, అంతర్గాం లిఫ్టు ఇరిగేషన్ ద్వారా రామగుండం నియోజకవర్గం నుండి నిర్ధేశిత గ్రామాలకు సాగునీరు అందించడానికి అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రివర్స్ పంపింగ్తోపాటు అంతర్గాం, అన్నారం లిఫ్టు ఇరిగేషన్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కాళేశ్వర జలాలు ఎల్లంపల్లి నుంచి మేడారం అక్కడి నుంచి లక్ష్మిపూర్ వరకు టన్నెల్ నిర్మాణం పూర్తయి పంపుహౌజ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. గోపాల్రావుపేట, పాతగూడూరు, సాయంపేట, ముంజంపల్లి, నల్లలింగయ్యపల్లి, మేడారం తదితర గ్రామాలకు మేడారం రిజర్వాయర్ ద్వారా పొలాలకు కాళేశ్వరం నీళ్లు చేరుతున్నాయి. పెరగనున్న భూగర్భ జలమట్టం ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా ఇప్పటికే వెల్గటూరు, ధర్మారం మండలాల్లోని పలు గ్రామాల్లో భూగర్భ జల మట్టం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ధర్మపురి నుంచి మేడిగడ్డ వరకు వందల కిలోమీటర్ల దూరం నిత్యం నీటి నిల్వ ఉండడంతో గోదావరి దిగువన ఉన్న గ్రామాలతోపాటు పంప్హౌజ్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలు, ఎస్ఆర్ఎస్పీ కాలువల దిగువ ప్రాంతాలు, మిడ్మానేరు, అప్పర్ మానేరు ప్రాంతాల్లో భూగర్భజల మట్టం భారీగా పెరుగుతుందని సాగునీటి నిపుణులు చెపుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో 1.41 లక్షల ఎకరాలకు సాగునీరు.. జిల్లాలోని బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మధ్యమానేరు జలాశయ నిర్మాణం పూర్తయింది. గత ఏడాది ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ ద్వారా ఐదు టీఎంసీల నీటిని మధ్యమానేరుకు చేర్చారు. మిషన్ భగీరథ కోసం తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ నీటిని వినియోగిస్తున్నారు. రూ.650 కోట్ల అంచనాలతో మధ్యమానేరు పనులు చేశారు. ఇప్పటికే 25 గేట్లు బిగించారు. 10 కిలోమీటర్ల మేర మట్టి కట్టను నిర్మించారు. గేట్ల బిగింపు పూర్తి కావడంతో ప్రాజెక్టులో 25.873 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. 25 టీఎంసీల సామర్థ్యం గల మిడ్మానేరుకు కాళేశ్వరం నీరు రావడంతో 30వేల ఎకరాల ఆయకట్టు రానుంది. మిడ్మానేర్ నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే క్రమంలో మరో 85,150 ఎకరాలు సాగులోకి రానుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–9,10, 11, 12లతో రాజన్న సిరిసిల్ల జిల్లా సస్యశ్యామలం కానుంది. ప్యాకేజీ–9 ద్వారా మల్కపేట రిజర్వాయర్, నిమ్మపల్లి మూలవాగు, సింగసముద్రం, ఎగువమానేరు, పెనంమడుగు జలాశయాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు దరి చేరనుంది. వేములవాడ నియోజకవర్గంలోని 60వేల ఎకరాలకు, సిరిసిల్ల నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు గోదావరి జలాలు రానున్నాయి. సిరిసిల్ల ముస్తాబాద్ మండలాలకు సాగునీరు అందించేందుకు పనులు సాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయకసాగర్ నుంచి నీటిని ముస్తాబాద్, సిరిసిల్ల మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు శాశ్వతంగా సాగునీరు అందించే పనులు సాగుతున్నాయి. ప్యాకేజీ–10, –11 ద్వారా మధ్యమానేరు నుంచి అంతగిరి రిజర్వాయర్కు నీరు మళ్లిస్తారు. మూడున్నర టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులతో ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలకు సాగునీరు అందనుంది. -
సేంద్రియం.. లాభదాయకం
అలంపూర్: వ్యవసాయం పూర్వకాలంలో మొత్తం సేంద్రియ ఎరువులపైనే ఆధారపడి జరిగేది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతో పాటుగా రసాయనాల వాడకం పెంచాల్సిన అవసరం నెలకొంది. రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడుతూ దిగుబడులు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వీటిని పక్కన పెట్టి సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు సాగు చేస్తే ఎంతో మేలు కలగనుండగా.. భూసారానికి కూడా ఎలాంటి ముప్పు ఉండదు. ఇటీవల కాలంలో సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండగా రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ మేరకు రసాయన ఎరువుల వాడకం వల్ల నష్టాలు, సేంద్రియ ఎరువుల వాడకంతో లాభాలపై అలంపూర్ ఏడీఏ మహ్మద్ ఖాద్రీ ఇచ్చిన సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రసాయనాల వాడకంతో.. సాగులో విచక్షణరహితంగా బస్తాల కొద్ది రసాయన ఎరువులను కుమ్మరించడంతో ఆ మందులను తట్టుకునే స్థాయి పంటల్ని ఆశించే పురుగుకు పెరుగుతుంది. తద్వారా పురుగుల బెడద అధకమవుతుంది. పోనుపోను రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం పెంచాల్సి ఖర్చులు పెరుగుతాయి. అలాగే, ఆహార ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోయి.. నీరు, సాగు నేలలు కలుషితమవుతాయి. నష్టాలు – సూచనలు అధిక మొత్తంలో రసాయనాల వాడకంతో మిత్ర కీటకాలు నశించి పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. ఈ మేరకు రైతులు ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి. వ్యవసాయంలో పురుగుల మందులు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్లో మన రైతులు పోటీకి నిలవాలంటే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. పంట ఉత్పత్తులు తక్కువ ధరలకు లభించేలా సాగు చేసుకోవాలి. సేంద్రియ విధానం సాగులో లింగాకర్షన బుట్టలు వాడాలి. పరిమితులకు లోబడి బీటీ వైరస్ శిలీంధ్రాన్ని వాడాలి. గంధకం, రాగి ఉత్పత్తులు వాడొచ్చు. వృక్ష సంబంధం నూనెలను కొన్ని జాగ్రత్తలతో వాడాలి. వేప సంబంధిత ఉత్పత్తులు, పచ్చిరొట్ట, వర్మీకంపోస్టు ఎరువులను వాడితే మంచిది. పంట వ్యర్థాలు, కొబ్బరి వ్యర్థాలు, షజొల్లా కూడా ఉపయోగపడేవే. పంటల నుంచి వచ్చే బూడిద, జీవన ఎరువులు, జిప్సం పంటల్లో వాడుకోవచ్చు. ప్రస్తుత కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సేంద్రియ ఉత్పత్తుల వాడకంపై అవగాహన పెరిగి వాటి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానంలో పండించిన పంట ఉత్పత్తులకు తప్పక మంచి మార్కెట్ ఉంటుంది. వేప చెక్క సేంద్రియ ఎరువులతోనే సాధ్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయ చేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ ఎరువులైన వానపాముల ఎరువులు, పశువుల ఎరువులు, కోళ్ల ఎరువు, పచ్చి ఆకులు, పిండి చెక్కలు వాడాలి. నాణ్యమైన రుచికరమైన ఉత్పత్తులను పండించి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండేలా వర్మీ కంపోస్టు బెడ్స్ను రూ.5వేల సబ్సిడీపై ఇస్తున్నారు. ఇంకా వ్యవసాయ శాఖ ద్వారా పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లి పెసర విత్తనాలను రూ.5 శాతం సబ్సిడీపై లభిస్తాయి. వర్మీ కంపోస్టు ఎరువులో వానపాములు -
విశ్రాంత సైనికులకు లబ్ధి చేకూరుస్తాం
జిల్లా సైనిక సంక్షేమాధికారి చంద్రశేఖర్ కొత్తగూడెం: దేశసేవ చేసి ఉద్యోగ విరమణ చేసిన సైనిక ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుస్తామని జిల్లా సైనిక సంక్షేమాధికారి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం మాజీ సైనిక ఉద్యోగులతో కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు. సైనిక ఉద్యోగుల పిల్లలకు ఉపకార వేతనాలు అందుతాయని, సంతానం వివాహం కోసం రూ.50వేలను ఖర్చుల కోసం అందజేస్తామని, ఇల్లు నిర్మించుకున్న వారు మొదటి నెలకు మాత్రమే ఇంటి పన్ను చెల్లించాలని, ఆ రశీదుతో శాశ్వతంగా ఇంటి పన్ను మినహాయింపు పొందొచ్చని వివరించారు. స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తామని, పెన్షన్ పొందనివారు తమ శాఖ నుంచి రూ.6 వేలను సంక్షేమ నిధిగా పొందొచ్చని, పిల్లల ఉన్నత విద్య కోసం ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందని వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు సహకారంతో చుంచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్థలాన్ని కేటాయించారని, రిటైర్డ్ సైనిక ఉద్యోగుల కార్యాలయ నిర్మాణానికి రూ.1.75 కోట్లు మంజూరైనట్లు ప్రకటించారు. ఇళ్లులేని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఫ్రాన్సిస్, బాధ్యులు నర్సింహారావు, రషీద్, శ్రీనివాస్, వాసు తదితరులు పాల్గొన్నారు.