bhojpuri
-
ఆ ఎంపీ మాతృభాషలో ప్రమాణం ఎందుకు చేయలేకపోయారు?
18వ లోక్సభలో భాషా సాంస్కృతిక వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణం చేశారు. అయితే తన భాష అయిన భోజ్పురిలో ప్రమాణం చేయలేకపోయినందుకు బీహార్లోని సారణ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ విచారం వ్యక్తం చేశారు.లోక్సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ ఒరియాలతో సహా పలు భారతీయ భాషల్లో ప్రమాణం చేశారు. ఎంపీలు ఇంగ్లీషులో లేదా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా ప్రమాణం చేయవచ్చు. అయితే భోజ్పురి భాషకు ఎనిమిదవ షెడ్యూల్ జాబితాలో స్థానం దక్కలేదు. రాజీవ్ ప్రతాప్ రూడీ భోజ్పురిలో ప్రమాణం చేయకపోవడానికి కారణం ఇదే. ఎంపీలు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని రూడీ అన్నారు.ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్లోని తూర్పు చంపారన్కు చెందిన బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షత వహించారు. కాగా రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడీ హిందీలో ప్రమాణం చేశారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యపై రాజీవ్ ప్రతాప్ రూడీ విజయం సాధించారు. -
నామినేషన్ వెనక్కి.. ప్రముఖ నటుడికి ఊరట
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్లోని కరకట్ లోక్సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.ఈ సీటు నుంచి భోజ్పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.పవన్ సింగ్ తల్లి నామినేషన్ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున కరకట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్ సింగ్ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.దీనికి ముందు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానం టిక్కెట్ను బీజేపీ పవన్ సింగ్కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ సింగ్ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
బరిలోకి మరో ఇద్దరు భోజ్పురి సెన్సేషన్లు! బీజేపీ కసరత్తు
రానున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ ప్రకటించిన అభ్యర్థి భోజ్పురి స్టార్ పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆ స్థానంలో గట్టి అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రస్థాయి నేతలతోపాటు ఢిల్లీ స్థాయిలోనూ అభ్యర్థి ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అసన్సోల్ లోక్సభ స్థానానికి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాష్ట్ర యూనిట్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని పార్టీ వర్గాలు ఇద్దరు భోజ్పురి సంచలనాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వారిలో ఒకరు బెంగాలీ అయినప్పటికీ భోజ్పురి చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందారు. బెంగాల్ బీజేపీ సూచించింది వీరినే.. బెంగాల్ బీజేపీ సూచించిన పేర్లు అగ్నిమిత్ర పాల్, జితేంద్ర తివారీ, డాక్టర్ అజయ్ పొద్దార్. వీరిలో అగ్నిమిత్ర పాల్ వైద్యురాలు, విద్యావేత్తల కుటుంబంలో జన్మించారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. శ్రీదేవి, మిథున్ చక్రవర్తి, కేకే మీనన్ వంటి బాలీవుడ్ తారలకు ఆమె కాస్టూమ్స్ రూపొందించారు. 2019లో లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ 2020లో బీజేపీలో చేరారు. హిందీలో అనర్గళంగా మాట్లాడగల ఆయన గణనీయమైన సంఖ్యలో హిందీ మాట్లాడే ఓటర్లను ప్రభావితం చేయగలడని పార్టీ భావిస్తోంది. ఆయన గతంలో అసన్సోల్ మేయర్గానూ పనిచేయడం మరింత కలిసొచ్చే అంశం. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కుల్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ అజయ్ పొద్దర్ను కూడా స్థానిక పార్టీ పరిశీలిస్తోంది. మరో ఇద్దరు భోజ్పురి సంచలనాలు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ స్థానానికి ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం ఇద్దరు భోజ్పురి సంచలనాలను అన్వేషిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భోజ్పురి చిత్రాల బెంగాలీ స్టార్ 'మోనాలిసా'పై కాషాయ పార్టీ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఆమె అసలు పేరు అంటారా బిస్వాస్. హిందీ టెలివిజన్లో పేరు సంపాదించడంతో పాటు భోజ్పురి సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారారు. ఆమెకు బెంగాలీ, హిందీ, భోజ్పురి భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అందుకే ఆమెను అసన్సోల్ నుంచి పోటీ చేయించే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోనాలిసా బిగ్ బాస్-10లోనూ కంటెస్టెంట్గా పాల్గొన్నారు. దక్షిణ కోల్కతాలోని జూలియన్ డే స్కూల్లో చదువుకున్న ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. భోజ్పురి పరిశ్రమలో సెన్సేషన్ అయిన మోనాలిసా భోజ్పురి స్టార్నే వివాహం చేసుకున్నారు. ఇక పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరైన మరో భోజ్పురి సంచలనం అక్షరా సింగ్ను రంగంలోకి దించే అవకాశాలను కూడా బీజేపీ పరిశీలిస్తోందన్న ఊహాగానాలు ఉన్నాయి. 'మోనాలిసా' కంటే పెద్ద స్టార్ అయినప్పటికీ అక్షరా సింగ్ విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈమెకు బెంగాలీ నేపథ్యం లేకపోవడం, పవన్ సింగ్తో గత అనుబంధం. బీజేపీ అధిష్టానం ఈ ఐదుగురిలో ఒకరిని ఎంపిక చేస్తుందా లేక ఇంకెవరైనా కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. -
లెజెండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
మ్యూజిక్ లెజెండ్, పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను పంకజ్ కూతురు నయాబ్ ఉదాస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా పంకజ్.. 1951లో గుజరాత్లోని జెటూర్లో జన్మించారు. చదువుకునే వయసులోనే ఆయన కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. తన అన్నయ్య మన్హర్ ఉదాస్ బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు గడించారు. వారి బాటలోనే పంకజ్ కూడా నడిచారు. 1970లో వచ్చిన తుమ్ హసీన్ మే జవాన్ సినిమాలో తొలిసారి పాట ఆలపించారు. నామ్(1986) సినిమాలో పాడిన చ్టిటి ఆయూ హై పాట పంకజ్కు గుర్తింపు తెచ్చిపెట్టింది.అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు.'చిట్టి ఆయిహై ఆయూహై.. చిట్టీ ఆయిహై..', 'చాంది జైసా రాంగ్ హై తేరా.. ఔర్ ఆహిస్తా కిజియే బాతే', 'తోడితోడి పియా కరో..' ఇలా బాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించారు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. గజల్ సింగర్గా ఎక్కువ ప్రసిద్ధి పొందారు. పంకజ్ సేవలను గుర్తించిన కేంద్రం 2006లో పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: TV Serial Actress Story: ఛాన్స్ కోసం ఆ పని చేయాలి.. వద్దని చెత్త ఏరుకుంది.. తర్వాత లక్షలు ఆర్జిస్తూ.. -
Akshara Singh: హీరోయిన్ షోపై రాళ్ల దాడి.. వీడియో వైరల్
భోజ్పురి ప్రముఖ నటి, గాయని అక్షర సింగ్ నిర్వహించిన ఓ లైవ్ షో స్వల్ప ఉద్రిక్తలకు దారి తీసింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఫ్యాన్స్ని అదుపు చేసేందకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా..కొంతమంది తిరగబడి పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ అక్షర సింగ్కి భోజ్పురిలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి గాయని, డ్యాన్సర్ కూడా. తాజాగా అక్షర బిహార్లోని జౌరంగాబాద్ జిల్లాలో ఓ షాప్ ఓపెనింగ్కి వెళ్లింది. (చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే: సమంత) పేపర్ ప్రకటన ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. పెద్ద ఎత్తున ఆ షాపింగ్ మాల్కి తరలి వచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన అక్షర.. స్టైజ్పైకి వెళ్లి ఓ అద్భుతమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపు చేసేకుందు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం అక్షర సింగ్ని అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో చాలా మంది అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు అక్షర సింగ్కి రక్షణ కవచంగా మారి అక్కడి నుంచి సేఫ్గా పట్నాకు తరలించారు. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి స్పందిస్తూ.. అక్షర చాలా ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకుందని, దీంతో అక్కడ ఉన్న జనం అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు. (చదవండి: ఏం చేస్తోందసలు.. యాక్టింగా? గుర్తుపట్టడం కష్టమే!) 2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్పురి సినిమాతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్షరకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్లలో నటించారు. కొన్నాళ్ల తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో 2021లో బిగ్బాస్ ఓటీటీ వర్షన్లో పాల్గొంది. #Bhojpuri star Akshara Singh पर Fans ने फेंके पत्थर, बेकाबू भीड़ पर Police ने किया लाठीचार्ज#Akshara #AksharaSingh #BhojpuriSongs #Bihar #AksharaSinghNews #AksharaSinghSongs #AksharaSinghHot #BhojpuriNews #Bollywood #Bhojiwood #BhojpuriMovies #BhojpuriFilms #PawanSingh pic.twitter.com/hPwCDe784o — JAYANTIKA TRIPATHI (@Jayantika_t) January 18, 2024 It’s late cold but still fans in thousands came to sherni event in Daudnagar..that’s the love she has earned. Some Bollywood stars don’t have such craze as humari bhojpuri Queen @AKSHARASINGH1 . #Bollywood #Bhojpuri #AksharaSingh #BiggBoss 🔥🔥🔥🔥 pic.twitter.com/z73tBwHKdB — Sherni Akshara Fan (@queen_twirl3) January 17, 2024 -
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తూ..
ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తున్నాయా? అనిపిస్తుంది! రంగుల ప్రపంచంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న కొందరు తారలు తర్వాత గుర్తుపట్టలేని స్థితికి మారిపోయారు. చేతినిండా డబ్బులుండే స్థితి నుంచి ఒకరి దగ్గర చేతులు చాచి అడగాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు. తెలుగు, తమిళం, హిందీ అని కాకుండా అన్ని భాషల్లోనూ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొన్న తారలు ఉన్నారు. ఒకప్పటి ఆ సెలబ్రిటీయేనా ఇలాంటి హీనస్థితిలో ఉంది? అని అభిమానులు కళ్లు చెమర్చుకున్న రోజులున్నాయి. హీరోయిన్ మిథాలి శర్మ కూడా అందనంత ఎత్తుకు వెళుతుందనుకుంటే అందరి దగ్గర భిక్షమడిగే స్థాయికి దిగజారింది. అందుకు గల కారణాలేంటి? అసలు తనకు ఏమైంది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. ఇంటితో సంబంధం కట్ మిథాలి శర్మ.. భోజ్పురిలో ఫేమస్ హీరోయిన్. ఈమె స్వస్థలం ఢిల్లీ. ఎప్పటికైనా టీవీలో కనిపించాలనుకున్న ఆమె అందుకోసం ఇంటి నుంచి పారిపోయింది. ఒంటరిగా ముంబై వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడే ఆమెతో సంబంధాలు తెంచేసుకుంది మిథాలి కుటుంబం. ఇక ముంబైలో చెప్పులరిగేలా తిరిగిన మిథాలి తొలుత మోడలింగ్ చేసింది. తర్వాత సినిమాలు చేసింది, బాగానే క్లిక్ అయింది. దీంతో దర్శకనిర్మాతలు ఈమెతో సినిమా తీసేందుకు పోటీపడ్డారు. ఆ రేంజ్లో క్రేజ్ అందుకుంది. పని దొరక్క డిప్రెషన్లోకి.. కానీ, సడన్గా అంతా మారిపోయింది. అదృష్టం బాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందన్నట్లు తన జీవితంలో బ్యాడ్ టైమ్ మొదలైంది. తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్టాక్ను మూటగట్టుకున్నాయి. అవకాశాలు తగ్గిపోయాయి. చాలాకాలం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. నెలలు కావస్తున్నా పని దొరక్కపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అలాగే కూర్చుంటే కడుపు నిండదు కదా.. పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేయాలనుకుంది. అందుకే భిక్షాటన మొదలుపెట్టింది. ముంబై వీధుల్లో కనిపించినవారినల్లా నాలుగు రూపాయలు దానం చేయమని కోరింది. భిక్షాటన చేస్తూ పోలీసులకు దొరికిన హీరోయిన్ ఆ మధ్య ముంబై లోఖండ్వాలాలో భిక్షాటన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేయగా అందులో మిథాలి శర్మ కూడా ఉంది. తన చేతికి మహిళా పోలీసు బేడీలు వేస్తుంటే మిథాలి ఆమెను తిట్టిందని, అక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. చివరకు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా మిథాలి తనకు కాస్త అన్నం పెట్టమని అడిగిందట! దీంతో ఆమెకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన పోలీసులు తన మానసిక స్థితి సరిగా లేదని గ్రహించారు. దీంతో తనను మానసిక వికలాంగుల ఆశ్రమంలో చేర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం మిథాలి శర్మ ఎక్కడుంది? ఎలా ఉంది? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. చదవండి: సినీప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఒకే సినిమాలో ఇద్దరు లెజెండరీ హీరోలు! -
నమ్మించి దారుణం.. నటిపై రెండుసార్లు అత్యాచారం..!
ప్రముఖ భోజ్పురి నటి ప్రియాన్స్ సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. తన సహా నటుడు పునీత్ సింగ్ అత్యాచారం చేశాడని ఆరోపింంచింది. తనపై చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ గతనెల 29న పోలీసులను ఆశ్రయించింది. తనతో అసహజమైన పనులు చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. (ఇది చదవండి: ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!) ప్రియాంక మాట్లాడుతూ.. 'నా కెరీర్లో బాగా పని చేస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో పునీత్ సింగ్ రాజ్పుత్ని కలిశా. ఆ తర్వాత నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మొదట నాతో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలనేది అతని కోరిక. నా పరిచయాల ద్వారా అతనికి సాయం చేశా. దీంతో అతనిపై పూర్తి నమ్మకం ఏర్పడింది. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ తర్వాత మా ఇంటికి రావడం మొదలెట్టాడు.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'ఒక రోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మద్యం తాగి మా ఇంటికి వచ్చాడు. నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు. నా జుట్టు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు ఉదయం అతను స్పృహలోకి వచ్చాక.. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. ఏడ్చి నన్ను క్షమించమని వేడుకున్నాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని ఒప్పించి.. త్వరలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల మరోసారి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. . నాకు న్యాయం కావాలి. అతనికి వీలైనంత త్వరగా శిక్ష విధించాలి.' అని డిమాండ్ చేసింది. (ఇది చదవండి: హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్) -
భోజ్పురి సింగర్కు బుల్లెట్ గాయం...వీడియో వైరల్
-
లైవ్ షోలో సింగర్కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!
ప్రముఖ భోజ్పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బీహార్లోని పాట్నాలో ఓ లైవ్ షోలో బుల్లెట్ తగిలినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బీహార్లోని సరన్లో ఓ కల్చరల్ ప్రోగ్రామ్లో ప్రదర్శన ఇచ్చేందుకు నిషా రాగా.. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష) కాగా.. నిషా ఉపాధ్యాయ్ బీహార్కి చెందిన సింగర్. ఆమెది సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ స్వస్థలం కాగా.. పాట్నాలోనే ఉంటున్నారు. నిషా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆమె పాటల్లో లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. (ఇది చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) స్పందించిన పోలీసులు.. నిషా ఉపాధ్యాయ్పై బుల్లెట్ తగలడంపై పోలీసులు స్పందించారు. ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది.. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు. -
హోటల్ రూంలో శవమై కనిపించిన దర్శకుడు
ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం ఓ హోటల్లో బస చేసిన దర్శకుడు శవమై కనిపించారు. వివరాల ప్రకారం.. భోజ్పురి డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారీ ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో షూటింగ్ కోసం మూవీ టీం అందరితో కలిసి ఓ హోటల్లో బసచేశారు. అయితే ఉదయం ఎంత పిలిచినా స్పందించికపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు బద్దలుకొట్టగా అప్పటికే తివారీ మృతిచెందారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. -
మోడల్స్తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
ముంబయి పోలీసులు హై లెవెల్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మోడల్స్తో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోరెగావ్లోని ఓ హోటల్లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్పురి నటి సుమన్ కుమారిని అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్ను పోలీసులు రక్షించారు. ఈ దందాలో భోజ్పురి నటి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భోజ్పురి నటి వయసు 24 ఏళ్లు కాగా.. గోరేగావ్లోని రాయల్ పామ్ హోటల్లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించగా.. నటి చీకటి దందా బయటపడింది. కాగా.. భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన సుమన్ కుమారి ‘లైలా మజ్ను సినిమాలో నటించింది. అలాగే వెబ్ సిరీస్ జామ్స్టిక్ బాక్స్, భోజ్పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈనె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్లలో కూడా పనిచేసింది. Maharashtra | A Bhojpuri actress Suman Kumari (24) has been arrested by Mumbai Police for allegedly forcing girls (models) into prostitution. Police also rescued 3 models. Further investigation is being done: Crime Branch, Mumbai police — ANI (@ANI) April 21, 2023 -
Video: మెట్రో యువతి మరో డ్యాన్స్.. ఈసారి యువకుడితో స్టెప్పులు
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోందనే చెప్పాలి. సామాన్యుడిని సెలబ్రిటీ చేయాలన్నా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, అంతెందుకు మనీ సంపాదనకు కూడా మార్గం చూపిస్తూ ప్రత్యేకంగా యవతను తనవైపు తిప్పుకుంది. ఇదిలా ఉండగా భారతదేశంలో టిక్టాక్ నిషేధం తర్వాత, నెటిజన్లు ఇప్పుడు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇన్స్టాగ్రామ్ను ఆశ్రయిస్తున్నారు. ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శించడం నుంచి అనేక ఫన్నీ వీడియోలు, డ్యాన్స్లు, పాడే క్లిప్లతో ప్రజలను అలరించడం వరకు ఇలా ఒక్కటేంటి నెటిజన్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్మీడియా ఒక వేదికగా రూపాంతరం చెందిందనే చెప్పాలి. అందుకే యవత వీడియోలతో తమ టాలెంట్ను నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇటీవల చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్ఫాంపై డ్యాన్స్ చేసి హల్చల్ చేసిన అవ్నీకరీశ్ తాజాగా మరో డాన్స్ వీడియో ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. వృత్తిరీత్యా డ్యాన్సర్గా చెప్పుకునే అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రో స్టేషన్లో భోజ్పురి పాట సాజ్ కే సవార్ కేకు తన నిర్మొహమాటంగా డ్యాన్స్ చేసినందుకు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే పబ్లిక్గా డ్యాన్స్ చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. తాజాగా ఈ యువతి నలుపు రంగు లెహంగా ధరించి, తన డ్యాన్స్ పార్ట్నర్తో స్టెప్పులేసింది. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన హలో బ్రదర్లోని తేరి చున్నారియా పాట బీట్లకు వీరిద్దరూ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Avnikarish Avnikarish (@avnikarish) -
చీరకట్టులో యువతి డ్యాన్స్.. ఢిల్లీ మెట్రో మరో వీడియో వైరల్..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టింది. తాజాగా ఓ యువతి చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్ఫాంపై డ్యాన్స్ చేసి హల్చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎర్ర చీర ధరించి బోజ్పురి పాటకు అదిరే స్టెప్పులేసి అదరగొట్టిన ఈ యువతి పేరు అవ్నీకరీశ్. ఇన్స్టాలో తన డ్యాన్స్ వీడియో పోస్టు చేసింది. ఇప్పటికే వేల మంది ఈ వీడియోను వీక్షించారు. View this post on Instagram A post shared by Avnikarish Avnikarish (@avnikarish) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీ మెట్రో ఆవరణలో ఇలాంటి ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం అమల్లో ఉంది కాదా.. అయినా ఎలా రికార్డు చేశారు అని కొందరు అభ్యంతరం తెలిపారు. మరికొందరేమో ఇలాంటి వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకొందరు మాత్రం యువతి స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఎలాంటి భయం లేకుండా మెట్రో ప్లాట్ఫాంపై డ్యాన్స్ చేసిన ఈమె ధైర్యవంతురాలు అని ప్రశంసలు కురిపించారు. ఈమె డ్యాన్స్ను తెగమెచ్చుకున్నారు. అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. మార్చిలోనూ సోనూ నిగమ్ పాటకు నృత్యం చేసి.. ఆ వీడియోనూ కూడా ఇన్స్టాలో పోస్టు చేసింది. చదవండి: తాజ్మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు -
నటి సూసైడ్ కేసు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భోజ్ పురి ఫేమస్ నటి అయిన ఆకాంక్ష వారణాసిలోని ఓ హోటల్ రూంలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. షూటింగ్లో భాగంగా ఓ హోటల్లో బస చేసిన ఆమె అక్కడే ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది.చనిపోయే ముందు కూడా ఫాలోవర్స్తో ఇన్స్టా లైవ్లో ముచ్చటించిన ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఆకాంక్ష దుబే పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆమె కడుపులో 20 మీ.లీ. గుర్తు తెలియని లిక్విడ్ని గుర్తించారు. అలాగే ఆమె మణికట్టుపై కూడా గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆకాంక్ష దుబేది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా ఆకాంక్ష కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్తో ప్రేమలో ఉంది. ఆకాంక్ష మరణానంతరం సమర్ సింగ్తో పాటు అతని సోదరుడు సంజయ్ సింగ్ పరారీలో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. -
నటి సూసైడ్ కేసు.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
భోజ్పురి నటి ఇటీవల వారణాసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు ముందే ఓ వీడియో సాంగ్ను కూడా రిలీజ్ చేసింది. అయితే నటి ఆత్మహత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్లో మరో వ్యక్తి కూడా నటితో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతను ఎవరన్నదానిపై ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మార్చి 26న ఆకాంక్ష తన హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. ఇప్పటికే ఆమె సూసైడ్ చేసుకున్న రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె హోటల్ గదిలో 17 నిమిషాల పాటు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మిస్టరీ మ్యాన్ ఆకాంక్షతో పాటే ఉన్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ అతని ముఖం ఆ వీడియో ఫుటేజీలో తగినంత స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కాగా.. ఆకాంక్ష దుబే 'లైక్ హూన్ మై నాలైక్ నహిన్' చిత్రం షూటింగ్ కోసం వారణాసిలోని ఒక హోటల్లో బస చేసింది. ప్రియుడిపై కేసు నమోదు ఆకాంక్ష మరణానంతరం ఆమె ప్రియుడు సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తల్లి కేసు పెట్టింది. సమర్ సింగ్ తన కుమార్తెను కొట్టేవాడని, అతని సోదరుడు చంపేస్తానని బెదిరించాడని ఆకాంక్ష తల్లి తన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆకాంక్ష మరణించినప్పటి నుంచి సింగ్ సోదరులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Exclusive CCTV footage of Bhojpuri actress Akanksha Dubey surfaced, in the video the actress is seen with Sandeep Singh. Look #AkanshaDubey #AkanshaDubeySuicide #CCTVFootage #bhojpuriactress https://t.co/b9kotfX75c pic.twitter.com/fbtQzCitSr — Siraj Noorani (@sirajnoorani) March 31, 2023 -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యువనటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శనివారం కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరవకముందే మరో నటి సూసైడ్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భోజ్పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసిలోని ఓ హోటల్లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనతో భోజ్పురి చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం నటి వయస్సు 25 సంవత్సరాలు. కొన్ని గంటల ముందే సాంగ్ రిలీజ్ ఆత్మహత్యకు కొన్ని గంటలముందే పవన్ సింగ్తో కలిసి ఆమె చేసిన మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. తరచుగా ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు. ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో జన్మించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆకాంక్ష ఇన్స్టాగ్రామ్లో రిలేషన్షిప్ను అధికారికంగా ప్రకటించింది. తన సహనటుడు సమర్ సింగ్తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఆకాంక్ష 2018లో డిప్రెషన్తో బాధపడి.. కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె 17 ఏళ్ల వయసులోనే మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆకాంక్ష ముజ్సే షాదీ కరోగి (భోజ్పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్ట్లలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Prashant Photography Deoria (@prashant_photography_deoria) -
యోగి సర్కార్పై సెటైరికల్ సాంగ్.. సింగర్కు నోటీసులు
ప్రముఖ భోజ్పురి గాయని నేహా సింగ్ రాథోడ్కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాట పాడినందుకు ఆమెకు ఈ నోటీసులు అందాయి. కాగా ఇటీవల కాన్పూర్ అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ కూతుళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ నేహా సింగ్ ఓ పాట పాడారు. ‘యూపీ మే కా బా సీజన్-2’ పేరుతో ఈ పాటను యూట్యూబ్, ఫేస్బుక్లో విడుదల చేశారు. ఈ క్రమంలోనే నేహా రాథోడ్ పాడిన పాటపై యోగి సర్కార్ సీరియస్ అయ్యింది. ఆ వెంటనే యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాయని తన పాట ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు రావడంపై గాయని స్పందిస్తూ.. మంగళవారం రాత్రి కాన్పూర్ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొంది. తన పాటల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికి సమాధానాలు ఇవ్వదని.. కేవలం నోటీసులే జారీ చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జానపద గాయకురాలిగా నా బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పుడూ ప్రయతిస్తాను. జానపద పాటల ద్వారా ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తాను. యూపీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడానికి నేను 'కా బా' ఫార్మాట్ను ఉపయోగించడం ఇదేం తొలిసారి కాదు. ఎన్నికల సమయంలో కూడా నేను అనేక ప్రశ్నలు సంధించాను. దానిపై వారు ఇప్పటికీ సమాధానాలు చెప్పలేకపోయారు. వారు సమాధానాలు ఇవ్వలేరు.. కానీ నోటీసులు మాత్రమే జారీ చేస్తారు. యూపీలో ప్రస్తుత పరిస్థితిపై సమాజ్వాదీ పార్టీని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది.. కరెక్ట్ కాదు కదా. నేను ఏ ఒక్క పార్టీని టార్గెట్ చేయడం లేదు, కేవలం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడమే నా పని’ అని పేర్కొన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని, సాధారణ ప్రజల సమస్యల మీద పాటలు పాడటం ఆపనని భోజ్పురి సింగర్ స్పష్టం చేశారు. కాగా గుజరాత్ ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిపోవడం గురించి కూడా ఆమె 'గుజరాత్ మే కా బా' అంటూ పాట పాడారు అంతేగాక 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడారుది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేశారు. 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 -
రాత్రికి రాత్రే స్టార్ సింగర్గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు
ఇంతవరకు మనం ఎంతోమంది మట్టిలో మాణక్యలాంటి సింగర్ల గురించి విన్నాం. అదీ కూడా పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ మహిళలు, పురుషులు సింగర్ మాదిరి అద్భుతంగా పాడి ప్రశంసలందుకున్నారు. వారిలో కొందరైతే సినిమాల్లో పాడే అవకాశాన్ని కూడా కొట్టేశారు కూడా. అవన్నీ ఒకతైతే ఇక్కడొక ఖైదీ ఏకంగా ఒక పాటతో స్థార్ సింగర్గా పేరు సంపాదించేసుకున్నాడు. పైగా అవకాశాలు కూడా వెల్లువలా వచ్చేయడమే కాకుండా ఆ వ్యక్తిని విడుదలయ్యేలా చేస్తామని ఓ ఎమ్మెల్యే చెప్పడం విశేషం. వివారాల్లోకెళ్తే...కంగయ్య కుమార్ అనే వ్యక్తి బిహార్ జైలులో ఉండే ఖైదీ. ఐతే ఒక రోజు భోజ్పురికి సంబంధించిన ఫేమస్ పాట పాడాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్కసారిగా నెటిజన్లంతా అతడి వాయిస్కి అతను పాడిన విధానానికి ఫిదా అయ్యారు. దీంతో అతన్ని బయటకు తీసుకువచ్చి పాటలు పాడే అవకాశం ఇవ్వాలనుకున్నారు బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అంకిత్ తివారీ. అతన్ని టాలెంట్ నాలుగు గోడలకే పరిమితకాకుండా అతన్ని బయట వచ్చేలా చట్టపరమైన సాయం అందించి పునరావాసం కల్పించాలనుకున్నారు ఒక యూపీ ఎమ్మెల్యే. ఏది ఏమైతే ఒక పాటతో కంగయ్య అందరీ మనసులను దోచుకున్నాడు. ఏకంగా విడుదలయ్యే అవకాశం తోపాటు పాటలు పాడే అవకాశం ఇచ్చేందుకు బాలీవుడ్ ప్రముఖ గాయకులు ముందకు వచ్చారు. వాస్తవానికి కంగయ్య బిహార్లోని కైమూర్ జిల్లా నివాసి. అతను పని కోసం ఉత్తప్రదేశ్ సరిహద్దు జిల్లాకు వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. ఐతే బిహార్లో మద్యం చట్టాలను కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిహార్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో అతను జైల్లో ఉన్నాడు. కంగయ్య జైల్లో దరోగజీ హో... సోచి-సోచి జియా హమ్రో కహే గబ్రతా..." అనే ప్రసిద్ధ భోజ్పురి పాటను పాడాడు. వాస్తవానికి కంగయ్య లాకప్లో ఉండగా ఎవరో ఒక వ్యక్తి ఆపాటను తప్పుగా పాడటంతో..అది కరెక్ట్ కాదని చెప్పేందుకు పాడాడు. అది సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకోవడంతో అద్భుతమైన అవకాశాన్ని కొట్టేశాడు. TV के पूर्व सहयोगी @cmohan_pat के माध्यम से संपर्क करने पर पता चला कि ये कैमूर का गरीब युवक कन्हैया है,नशे में मिलने पर बिहार पुलिस ने इसे जेल भेजा,इनकी कानूनी मदद के उपरांत इन्हें सुधारने का प्रयास होगा,साथ ही UP के मशहूर त्रिनेत्र स्टूडियो में गाने का अवसर भी उपलब्ध कराया जाएगा pic.twitter.com/Id8HrJV2HZ — Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) January 8, 2023 (చదవండి: ఎయిర్ ఇండియా ఘటన: పశ్చాత్తాపం లేకుండా ఆరోపణలా!) -
జైల్లో పాట.. దెబ్బకు ఫేమస్.. ఫేట్ మారింది
వైరల్: ఊచల వెనుక పాడిన పాటను పోలీసు వాళ్లే చిత్రీకరించారు. అతని మధుర గాత్రానికి ఫిదా అయ్యి వైరల్ చేశారు. కటకటాల వెనుక పాడిన పాటకు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. ఆ వ్యక్తి మరింత ఫేమస్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక.. తన పాట ఫేమస్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడతను. దానికి కొనసాగింపుగానూ అతనికి ప్రభుత్వ సాయం ప్రకటనతో పాటు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్లోని కైమూర్ దహ్రక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్ను.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బక్సర్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ నుంచి తాగొచ్చాడని(బీహార్లో మద్యపాన నిషేధం అమలు ఉండడంతో) పోలీసులు అతని ఆ రాత్రి జైల్లో ఉంచారు. అయితే ఆ పూట జైలు శిక్ష అతని జీవితాన్ని మార్చేసింది. ఉదయం విడుదలై బయటకు వచ్చిన కన్హయ్యను.. ఆ తర్వాత అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టారు. అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లలో చక్కర్లు కొడుతోందని స్నేహితులు చెప్పారు. దీంతో తన గొంతు విన్న కన్హయ్య తెగ ఖుష్ అయ్యాడు. అయితే.. మద్యం సేవించినందుకు తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్(భోజ్పురి హీరో) పాట పాడినందుకు.. ఆ పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకే తనను అరెస్ట్ చేశారని కన్హయ్య చెప్తున్నాడు. కానీ, ఆ వీడియోను తాను అప్పుడే డిలీట్ చేశానని వివరణ ఇచ్చాడతను. ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తాను సరదాగా పాట పాడనని, అది ఎవరు వీడియో తీశారు, ఎలా వైరల్ అయ్యిందో కూడా తనకు తెలియదని అంటున్నాడతను. ఆర్థిక కష్టాలతో చిన్నతనంలోనే చదువుకు తాను దూరం అయ్యానని, రిపబ్లిక్డే, ఇతర ఫంక్షన్లకు పాటలు కూడా పాడతానని చెప్తున్నాడు కన్హయ్య. ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలను రాటు దేల్చాల్సిన అవసరం ఉందని, అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. తనలో దాగున్న ప్రతిభ నలుగురికి తెలియడం, దాని ద్వారా తన కుటుంబ పరిస్థితిని మార్చుకునే అవకాశం దొరికినందుకు ఆ దేవుడికి, తనను వైరల్ చేసినవాళ్లకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడతను. नशा एक सामाजिक बुराई है और सिर्फ कला में शक्ति है इस बुराई को हराने की ।@shalabhmani जी मैं इस व्यक्ति को अपनी म्यूजिक कंपनी @MistMusic_ की तरफ से एक गाना गाने का मौका देता हूं । 🙏 https://t.co/qug7cto5Rp — Ankit Tiwari (@officiallyAnkit) January 9, 2023 -
ఫోటో అంటూ ఎగబడిన ఫ్యాన్స్.. పారిపోయిన హీరోయిన్
-
చెప్పులు కూడా వదిలేసి పారిపోయిన హీరోయిన్, వీడియో వైరల్
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని తహతహలాడేవారు చాలామంది. అలాంటిది సెలబ్రిటీ ఎదురుగా కనిపిస్తే ఊరుకుంటారా? ఆరునూరైనా సరే ఫోటో సంపాదించాల్సిందేనని అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఫొటో ప్లీజ్ అంటూ వెంటపడుతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఎదురైంది భోజ్పురి హీరోయిన్ అక్షర సింగ్కు. అక్షర సింగ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. హీరోయిన్ కనిపించడంతో ఆగలేకపోయిన జనం సెల్ఫీల కోసం పరుగులు తీశారు. వందలమంది ఫోటో అంటూ ఎగబడటంతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోయింది హీరోయిన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో అక్షర సింగ్ స్కూటీ మీద వెళ్తుండగా అభిమానులు ఆమె వెనకాల పరిగెత్తారు. కానీ చూడటానికి మాత్రం అందరూ ఆమెను తరుముతున్నట్లుగా ఉండటంతో హీరోయిన్కు ఎంత కష్టం వచ్చింది? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: ఫస్ట్ డే షూటింగ్.. బాబు చనిపోయాడు..: నటుడు -
నా సోదరుడిని కాపాడుకోలేకపోయాను: నటుడు ఎమోషనల్
ప్రముఖ భోజ్పురి గేయ రచయిత శ్యామ్ దేహాటి ఇటీవలే కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన భోజ్పురి సూపర్ స్టార్ కేసరిలాల్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో తన ప్రియ ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు శ్యామ్ దేహాటిని గుర్తు చేసుకున్నాడు. తన సోదరుడిని కాపాడలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడికి భార్యాపిల్లలు ఉన్నారని, వాళ్లు సైతం కరోనాతో బాధపడుతున్నారని తెలిపాడు. శ్యామ్ను కాపాడుకోలేకపోయిన తాను కనీసం అతడి కుటుంబాన్ని అయినా ఆదుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో అభిమానుల మనసులను కదిలించి వేస్తోంది. కాగా కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న శ్యామ్ కొన్నాళ్ల క్రితం ఓ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడట. కానీ, అంతలోనే కరోనా బారిన పడి సోమవారం గోరఖ్పూర్లో తుది శ్వాస విడిచాడు. ఇతడి మృతి పట్ల భోజ్పురి ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టాప్ సెలబ్రిటీలు పవన్ సింగ్, దినేశ్ లాల్ యాదవ్, రితేశ్ పాండే, అర్వింద్ అకేలా కల్లు, రాణీ చటర్జీ, కాజల్ రాఘ్వానీ సహా పలువురు శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: క్వారంటైన్లో మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్ ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోలు వైరల్ -
రాథోర్ పాటలకు పడి పోవాల్సిందే!
న్యూఢిల్లీ : ‘గౌరీ లంకేష్కు పట్టిన గతి నీకు పట్టవచ్చు’ అంటూ నేహా సింగ్ రాథోర్ను ఆమె స్నేహితులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఆ హెచ్చరికను ఆమె బుగ్గలపై చెదరని చిరు నవ్వుతో ఓ అభినందనగా స్వీకరిస్తున్నారు. హిందూ మత ఛాందస వాదులను విమర్శించినందుకు జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేష్ను 2017, సెప్టెంబర్లో బెంగళూరులో మతోన్మాదులు హత్య చేశారు. ‘ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎప్పటికప్పుడు తన భోజ్పురి జానపద పాటల ద్వారా సునిశితంగా విమర్శిస్తోన్న నేహా సింగ్ రాథోర్కు గౌరీ శంకర్కు పట్టిన గతి పడుతుందన్నది ఆమె మిత్రులు, సామాజిక కార్యకర్తల ఆందోళన. ( అందరూ చస్తారు: ప్రయాణికురాలి హల్చల్) పాలక వర్గాలను విమర్శిస్తూ నేహా సింగ్ రాథోర్ పాడిన భోజ్పూర్ జానపదాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఆమెకు మంచి పేరు తెస్తున్నాయి. ‘ప్రజలకు ఉద్యోగాలిస్తారా లేదా నాటకాలేసుకుంటూ బతకమంటారా? నీవు అలంకరించిన అధికార పీఠం వంశపారంపర్యంగా నీ తండ్రి నుంచి వచ్చింది కాదనే విషయాన్ని తెలుసుకో!, అచ్చా దిన్ (మంచి రోజులు) వస్తాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, సంకలో జోలి, చేతికి చిప్ప ఇవ్వడమే మంచి రోజని తెలుసుకోలేక పోయాం!’ అనే భావాలతో ఆమె రాసి పాడిన పాటలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ సరిహద్దులోని జాండహ గ్రామంలో నివసిస్తోన్న రాథోర్, 2019 నుంచి పాటలు రాస్తూ, వాటికి సొంతంగా బాణీలు కూరుస్తూ పాడుతున్నారు. ‘ధరోహర్’ పేరిట ఆమె ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్కు దాదాపు లక్ష మంది సబ్స్రై్కబ్ చేశారు. ఆమె ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మంచి ప్రజాదరణ సంపాదించారు. ఆమె అభిమానుల్లో సినిమా దర్శకులు, జర్నలిస్టులు, మాజీ అధికారులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారు. వారణాసికి వంద, పట్నాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని జాండవ గ్రామంలో 8వ తరగతి వరకే పాఠశాల ఉండడంతో రాథోర్, రామ్గఢ్లో సెకండరీ ఎడ్యుకేషన్, యూపీలోని కాన్పూర్లో బీఎస్సీ చదివారు. -
పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నటి..
భోజ్పురి నటి రాణి చటర్జీ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టెలివిజన్ రంగానికి చెందిన తన లాంగ్టైమ్ బాయ్ఫ్రెండ్ను వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్లో తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ ఇంకా తేదీపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కొంత కాలంగా తన బాయ్ఫ్రెండ్తో డేటింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే తన బాయ్ఫ్రెండ్ ఎవరనేది మాత్రం రాణి రహస్యంగా ఉంచారు. అతని గుర్తింపును ఇప్పుడు వెల్లడించలేనని.. కానీ తొందరలోనే వివరాలు చెబుతానని అన్నారు. అలాగే వెడ్డింగ్ ప్లాన్స్ గురించి ఆమె మాట్లాడుతూ.. ముస్లిం సంప్రాదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని అన్నారు. కాగా, ససురా బడా పైసావాలా సినిమాతో రాణి భోజ్పురి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవ్రా బడా సతవేల, ఏక్ లైలా తీన్ చైలా, నాగిన్, రాణి చాలీ సాసురల్, దులారా.. వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే భోజ్పురిలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఆ హీరోకు బిల్డర్ టోకరా..
న్యూఢిల్లీ : పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లో నటించిన భోజ్పురి సినిమా మెగాస్టార్ రవికిషన్ ఓ బిల్డర్ చేతిలో మోసపోయారు. ముంబైలో రూ 1.5 కోట్లు వెచ్చించి ఫ్లాట్ను బుక్ చేసిన రవికిషన్కు ఇంతవరకూ బిల్డర్ ఫ్లాట్ను అప్పగించకపోవడంతో నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని కమలా ల్యాండ్మార్క్ గ్రూప్ బిల్డర్స్ వద్ద రూ 1.5 కోట్లు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్న రవికిషన్కు ఇప్పటివరకూ బిల్డర్లు ఫ్లాట్ను అప్పగించలేదు. కమలా ల్యాండ్మార్క్ గ్రూప్ బిల్డర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై రవికిషన్ ఫిర్యాదు చేశారు. సునీల్ నాయర్ అనే వ్యక్తిని కూడా బిల్డర్లు రూ 6.5 కోట్ల మేర మోసగించినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. కమలా ల్యాండ్మార్క్ గ్రూప్ మరో నిర్మాణ రంగ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన జేవీ గ్రూప్ ఫిర్యాదుదారులు ఇద్దరికీ కలిపి రూ 8 కోట్ల మేర టోకరా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
క్లాస్కి వెళ్తున్నాను!
క్యారెక్టర్కి అనుగుణంగా మారిపోవడం పరిణీతీ చోప్రాకు చాలా ఇష్టం. అందుకే సినిమా సినిమాకు వ్యత్యాసం చూపించడానికి ట్రై చేస్తుంటారామె. తన లేటెస్ట్ సినిమా ‘జబరియా జోడీ’లో బిహారీ అమ్మాయిగా కనిపించనున్నారు. దాని కోసం భోజ్పురీ భాష నేర్చుకుంటున్నారట. భోజ్పురీ భాష సరిగ్గా పలకడం కోసం ఒక ట్యూటర్ని కూడా పెట్టుకున్నారు పరిణీతి. కొత్త భాష నేర్చుకోవడం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘యాక్టర్స్గా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, రకరకాల పాత్రల్లో కనిపించడం మా అదృష్టం. స్క్రీన్ మీద నన్ను నేను చాలెంజ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం ట్రైనింగ్ (భోజ్పురీ భాష నేర్చుకోవడం గురించి) చాలా సరదాగా నడుస్తోంది. చిన్న చిన్న డీటైల్స్ కూడా మిస్ అవ్వదలుచుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు పరణీతి. -
ఇంటర్నెట్ను ఊపేస్తున్న ఆమ్రపాలి డ్యాన్స్
ముంబై : భోజ్పురి ఫిల్మ్ ఇండస్ట్రీ నటి ఆమ్రపాలి దుబే ‘బెల్లి డ్యాన్స్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘లవ్ కే లియే కుచ్ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్ అనే వీడియో పాటను మూవీ యూనిట్ వాళ్లు ఎస్ఆర్కే మ్యూజిక్ యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, తన బృందంతో కలిసి నటి ఆమ్రపాలి వేసిన స్టెప్పులకు వీక్షకులు ముగ్దులవుతున్నారు. ఈ నెల 9న పోస్ట్ చేసిన వీడియో సాంగ్ ఇప్పటికే 82 లక్షల వ్యూస్తో దూసుకెళ్తోంది. తెలుపు, ఎరుపు రంగుతో ఉన్న ఘాగ్రా చోలీలో ఆమ్రపాలి మరింత ఆకర్షనీయంగా కనిపించారు. ఇందు సోనాలి, అనుజ్ తివారీలు ఈ వైరల్ పాటకు గాత్రదానం చేశారు. దీరజ్ ఠాకూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్లో సతీశ్ దుబే, సునీల్ సింగ్లు నిర్మించారు. పలు టీవీ షోల్లోనూ నటి ఆమ్రపాలి తనదైన ముద్రవేశారు. నిరాహువా హిందూస్తానీ మూవీతో 2014లో భోజ్పురి ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయ్యారు. కాగా, అత్యధిక పారితోషికం అందుకుంటోన్న హీరోయిన్లలో ఆమె ఒకరన్న విషయం తెలిసిందే. ఆమ్రపాలి డ్యాన్స్ వీడియో -
నటి మనీషా దుర్మరణం
లక్నో: రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం పాలైన ఘటన యూపీలో చోటు చేసుకుంది. భోజ్పురి నటి మనీషా రాయ్(45) శనివారం మృతి చెందారు. బల్లియాలోని చిట్టౌని గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఖోబర్ అనే లఘు చిత్రం ద్వారా మనీషా పాపులర్ అయ్యారు. సహనటుడు సంజీవ్ మిశ్రాతో కలిసి ఆమె మోటర్ సైకిల్పై షూటింగ్కు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుకాల నుంచి ఓ కారు వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మనీషా ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మిశ్రాకు గాయాలు కాగా, ఆయన్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పలు టీవీ సీరియళ్లతోపాటు చిత్రాల్లోనూ ఆమె నటించారు. మనీషా మృతి పట్ల భోజ్పురి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. -
నటిపై అత్యాచారం కేసులో దర్శకుడికి ఊరట!
ముంబై : వర్థమాన నటిపై లైంగిక దాడి కేసులో భోజ్పురి సినీ దర్శకుడికి ఊరట లభించింది. ముంబై సెషన్ కోర్టు తాజాగా అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. భోజ్పురి చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడైన రాంకుమార్ కుమావత్ (51)పై ఓ వర్ధమాన నటి లైంగిక దాడి కేసు నమోదు చేసింది. సినిమాల్లో అవకాశమిస్తానని తన కార్యాలయానికి పిలిచిన రాంకుమార్.. అక్కడ తనపై లైంగిక దాడి చేశాడని నటి ఆరోపించింది. అయితే, వారిద్దరూ పరస్పర సమ్మతితోనే శృంగారంలో పాల్గొన్నారని, సినిమాలో అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆమె కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా డిఫెన్స్ లాయర్ నిరూపించారు. ప్రాసిక్యూషన్ కేసు ప్రకారం.. 2009 జూలై 21న తన సినిమాలో ‘ఐటెం గర్ల్’ అవకాశం ఇస్తానంటూ నటిని కుమావత్ తన కార్యాలయానికి పిలిచి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మరునాడు డ్యాన్స్ రిహార్సల్ పేరిట మరోసారి పిలిచి.. ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. కానీ చివరకు ఆ అవకాశం వేరే అమ్మాయికి ఇచ్చాడు. దీంతో నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను కుమావత్ ఇంటికి వెళ్లానని, తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదుచేసేదాణ్ని కాదని డిఫెన్స్ లాయర్ల క్రాస్ఎగ్జామినేషన్లో నటి తెలిపింది. బాధితురాలి శరీరం మీద ఉన్న గాయాలు కల్పితమైనవేనని వైద్యులు తమ నివేదికలో తేల్చారు. అంతేకాకుండా ఆమె వాంగ్మూలంలోనూ పలు వైరుధ్యాలు ఉండటంతో కోర్టు డైరెక్టర్ కుమావత్ను నిర్దోషిగా తేల్చింది. -
మద్యం మైకంలో సహనటిపై స్టార్ హీరో దాడి!
న్యూఢిల్లీ: భోజ్పురి చిత్రపరిశ్రమలో సూపర్స్టార్గా వెలుగొందుతున్న పవన్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. పలు సినిమాల్లో నటించి.. పాపులర్ పాటలు పాడిన పవన్ సింగ్ తాజాగా మద్యం మత్తులో సహనటిపై దాడి చేశాడు. భోజ్పురి స్టార్ హీరోయిన్ అయిన అక్షరాసింగ్ను మద్యం మత్తులో చితకబాదాడు. ఈ ఘటన గురించి ప్రముఖ జర్నలిస్ట్ శశికాంత్ సింగ్ ఫేస్బుక్లో పోస్టుచేయడంతో వెలుగులోకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హావేలి రాజధాని సిల్వాసాలోని దామన్గంగా వ్యాలీ రిస్టార్లో గురువారం అర్ధరాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న పవన్సింగ్ అక్షర జుట్టు పట్టుకొని.. ఆమె తలను గోడకేసి కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో అక్షర చేతికి గాయమైంది. ఆమె అరుపులతో పరుగెత్తుకొచ్చిన రిసార్ట్ సిబ్బంది ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, పవన్ వారిపై కూడా దాడిచేశాడు. సిల్వాసాలో పవన్ సింగ్, అక్షర ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని, తాగిన మైకంలో ఉన్న పవన్ గదిలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా ఆమెతో అతను అసభ్యంగా ప్రవర్తించి..దూషించాడని జర్నలిస్ట్ శశికాంత్సింగ్ తెలిపారు. సిల్వాసాలో ఆమె షూటింగ్ పూర్తయి.. ముంబై రావాల్సి ఉందని, కానీ ఎయిర్పోర్టు వరకు డ్రాప్చేసేవారు లేకపోవడంతో ఇప్పటికీ ఆమె అక్కడే ఉండిపోయిందని శశికాంత్సింగ్ వివరించారు. పవన్, అక్షర ప్రేమలో ఉన్నట్టు గతంలో కథనాలు వచ్చాయి. ఈ ఇద్దరూ సన్నిహితంగా తిరిగారు. అయితే, పవన్ మాత్రం ఇటీవల జ్యోతిసింగ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. భోజ్పురి సూపర్స్టార్ పవన్సింగ్ -
సారీ చెప్పినా.. సిధార్థ్పై ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సిధార్థ్ మల్హోత్రా చిక్కుల్లో పడ్డాడు. భోజ్పురి భాషను అవమానించాడన్న విమర్శల నేపథ్యంలో అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ విషయాన్ని భోజ్పురి నటుడు, బీజేపీ నేత మనోజ్ తివారీ వెల్లడించారు. ‘‘సిధార్థ్ చేసిన వ్యాఖ్యలు నేను విన్నా. 22 కోట్ల మంది మనోభావాలను అతను దారుణంగా దెబ్బతీశాడు. నేను వాటిని ఖండిస్తున్నా. మనం ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. కళాకారులకు ఆ బాధ్యత ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అతను మంచి నటుడే. కానీ, ఇలా వ్యవహరించటం కుసంస్కారం. క్షమాపణలు చెప్పినా ప్రజలు అతన్ని వదిలేస్తారని నేను అనుకోవట్లేదు’’ అని తివారీ తెలిపారు. పట్నా, వారణాసి, కోల్కతా, ముంబై, తదితర ప్రాంతాల్లో ఇప్పటికే సిధార్థ్ పై భోజ్పురి కమ్యూనిటీ ఫిర్యాదులు చేయగా.. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు సమాచారం అందుతుందని తివారీ వెల్లడించారు. అసలేం జరిగిందంటే... ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్ కోసం హీరో సిధార్థ్, హీరోయిన్ రకుల్, నటుడు మనోజ్ బాజ్పాయి... సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకు వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంలో మనోజ్ బాజ్పాయి బలవంతం మేరకు భోజ్పురి భాషలో సిధార్థ్ ఓ డైలాగ్ చెప్పాడు. అయితే ఫన్నీగా సాగిన ఆ ఎపిసోడ్ కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలుగా మారిపోవటంతో భోజ్పురి కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిధార్థ్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేసింది. నటి నీతూ చంద్ర కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే చివరకు సిధార్థ్ ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పినా.. పరిస్థితి చల్లారటం లేదు. I recently tried speaking a new language while I was on a TV show. In the process if I inadvertently hurt anyone's feelings or sentiments, I apologise and assure you that no disrespect was meant in any way. — Sidharth Malhotra (@S1dharthM) 22 January 2018 -
బాహుబలి.. వీర యోధ మహాబలి
బాక్సాఫీస్ కలెక్షన్స్ను, రికార్డులను ‘బాహుబలి’ ఏ లెవెల్లో కొల్లగొట్టిందో సినీ లోకమంతా చూసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తొలుత రిలీజ్ చేసిన ఈ సినిమాను కొన్ని భాషల్లోకి డబ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. టోటల్గా మన టాలీవుడ్ సత్తా ఏంటో ‘బాహుబలి’ వరల్డ్ వైడ్గా చాటింది. ఈ నెల 29న ఈ చిత్రం జపాన్లో విడుదల కానుంది. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని అనువదించి, విడుదల చేస్తున్నారు కానీ, వేరే భాషలవాళ్లు రీమేక్ చేసే సాహసం అయితే చేయలేదు. మరి.. ఐదేళ్లంటే మాటలా? పైగా మరో రాజమౌళి ఉండాలి కదా? ప్రభాస్, రానా, రమ్యకృష్ణ.. ఇలా ఏ ఆర్టిస్ట్ని తీసుకున్నా వేరే భాషల్లో ఇలాంటి ‘గుడ్ ప్యాకేజ్’ సెట్ అవుతుందా? అంటే.. భోజ్పురి వాళ్లు సెట్ చేసుకున్నారని సమాచారం. యస్.. ‘బాహుబలి’ చిత్రం భోజ్పురిలో రీమేక్ అవుతోందని టాక్. అందుకు తగ్గట్టే.. కొన్ని ఫొటోలు కూడా బయటికొచ్చాయి. సో.. నమ్మక తప్పదు. దినేష్ లాల్ యాదవ్ నిర్హూస్ హీరోగా దర్శకుడు ఇక్బాల్ భ„Š ‘వీర్ యోధ మహాబలి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది ‘బాహుబలి’కి రీమేక్ అనేది భోగట్టా. ‘‘షూటింగ్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ వీర్ యోధ మహాబలి’’ అంటూ నిర్హూస్ ఫేస్బుక్లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అవి అచ్చం... ‘బాహుబలి’లో మన ప్రభాస్ గెటప్ పోలినట్లే ఉన్నాయి. అయితే... ఇది ‘బాహుబలి’కి రీమేక్ అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇక, ఈ చిత్రకథానాయకుడు విషయానికొస్తే.. దినేష్లాల్ యాదవ్ భోజ్పురి ఇండస్ట్రీలో సింగర్, తర్వాత యాక్టర్గా మారాడు. టెలివిజన్ ప్రజెంటర్గా కూడా వర్క్ చేశాడు. 2012 బిగ్ బాస్ 6 కంటెస్ట్ కూడా. ప్రజెంట్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ‘నిర్హాహ్ హిందూస్థానీ, పాట్నానే పాకిస్తాన్’ వంటి భోజ్పురి చిత్రాల్లో నటించారు. వాటిని హిందీలోనూ విడుదల చేశారు. ఈ సంగతలా ఉంచితే.. మన ‘బాహుబలి’ సాధించిన తాజా రికార్డ్ గురించి చెప్పుకుందాం. ఐఎమ్డిబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ఈ ఏడాది ఇండియన్ టాప్ 10 మూవీస్ లిస్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో ‘బాహుబలి 2’ సినిమా సెంకడ్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ను మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ ఆక్రమించడం విశేషం. అర్జున్రెడ్డి, సీక్రెట్ సూపర్స్టార్, హిందీ మీడియమ్, ఘాజి సినిమాలు 3,4, 5, 6 స్థానాల్లో నిలిచాయి. తొలి టాప్ 10 మూవీస్ లిస్ట్లో ఐదు సినిమాలు ఉండటం విశేషం. -
అది బాహుబలికి రీమేకేనా?
సాక్షి, సినిమా : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ప్రాజెక్టు ప్రతిష్టాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ డబ్బింగ్ చిత్రం అయి ఉండి ఈ ఏడాది బాలీవుడ్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన(ఇండియాలో) సినిమాగా బాహుబలి ది కంక్లూజన్ నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ కంటెంట్తో ఆకట్టుకున్న బాహుబలిని మరో భాషలో తెరకెక్కించే ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం అందుతోంది. భోజ్పురి హీరో దినేష్ లాల్ యాదవ్ నిరాహువా కొత్త చిత్రం బాహుబలి రీమేక్ అన్న సంకేతాలను అందిస్తోంది. వీర్ యోధా మహబలి పేరుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఇక్బాల్ భక్ష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అమ్రపాలి దుబేను హీరోయిన్గా ఎంపిక చేశారు. తాజాగా దినేష్ తన ఫేస్బుక్లో షేర్ చేసిన ఫోటోలు ఇది బాహుబలి రీమేక్ అన్న సంకేతాలను అందిస్తున్నాయి. అయితే దానిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. భారీగా జూనియర్ ఆర్టిస్టులు, గుర్రాలు, వార్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు. జనవరి 15న చిత్ర ట్రైలర్ను విడుదల చేస్తారంట. -
భోజ్పురి దర్శకుడి ఆత్మహత్య
ప్రముఖ భోజ్పురి దర్శకుడు షాద్ కుమార్ (49) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వర్గ్’ సినిమా ఈ నెల 24న రిలీజ కావాల్సి ఉండగా ఈ లోపు ఆయన మరణించటంతో చిత్రయూనిట్ షాక్కు గురయ్యారు. భోజ్పురిలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన షాద్ కుమార్ ‘ఏక్ లైలా, తీన్ చైలా’, ‘తుమ్ హారే ప్యార్కి కసమ్’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అసిస్టెంట్ ఫొటోగ్రాఫర్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నిర్మాతగా దర్శకుడిగా ఎదిగిన షాద్, ఇటీవల సినిమాల్లో తీవ్రం నష్టపోయారు. ప్రస్తుతం తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేని పరిస్తితిలో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. షాద్ కుమార్ అసలు పేరు షమ్షాద్ అహ్మద్. -
నటిపై అత్యాచారం, 36 లక్షలు స్వాహా
ముంబై: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి వంచించడమే కాకుండా భారీ మొత్తంలో డబ్బులు స్వాహాచేసిన ఓ దర్శకుడి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా అవకాశాల పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పాకిస్థాన్కు చెందిన ఓ నటి (30) ఆరోపించింది. తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించమంటే బెదిరిస్తున్నారని భోజ్పురి దర్శకుడు శ్యామ్ చరణ్ యాదవ్(42) మరోఇద్దరు సహదర్శకులు బబ్లూ , టైగర్ లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేళ్ల క్రితం ఓ సినిమా ఫంక్షన్ లో పరిచయమైన పాకిస్తానీ నటిని దర్శకుడు శ్యామ్ మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని మభ్యపెట్టాడు. పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. సినిమా నిర్మాణానికి ఆమెనుంచి రూ. 35.80 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అటు సినిమా ఛాన్సులు లేక, ఇటు తీసుకున్న డబ్బులు చెల్లించక ముఖం చాటేస్తున్న దర్శకుడిని ఆమె గట్టిగా నిలదీయడంతో బబ్లూ , టైగర్ లతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దర్శకుడు తనను మోసంచేశాడని ఆమె ఆరోపిస్తోంది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని నిందితుడి అరెస్ట్ చేశామని డీఎస్పీ బావ్చే తెలిపారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని, విచారణ కొనసాగుతుందన్నారు. -
నటిపై దర్శకుడు అత్యాచారం
థానె: పాకిస్థాన్కు చెందిన ఓ నటి (30)ని అత్యాచారం చేసి, మోసం చేసిన కేసులో భోజ్పురి దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడికి సహకరించారనే ఫిర్యాదుపై అతని దగ్గర పనిచేసే ఇద్దరు సహాయ దర్శకులను కూడా అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ బావ్చే చెప్పారు. గత మూడేళ్లుగా దర్శకుడికి పాక్ నటితో పరిచయమున్నట్టు పోలీస్ అధికారి చెప్పారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేసినట్టు తెలిపారు. సినిమా నిర్మించేందుకుగాను ఆమె నుంచి 35.80 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, ఈ సొమ్మును తిరిగి చెల్లించలేదని ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కాగా నిందితుల పేర్లను బయటపెట్టలేదు. -
ప్రముఖ నటుడి కూతురు మిస్సింగ్!
ముంబై: బాలీవుడ్, భోజ్పురి నటుడు రవికిషన్ 19 ఏళ్ల కూతురు కనిపించకుండాపోయారు. తన కూతురు కనిపించడం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కొన్నిరోజుల కిందటే ఆయన బంగుర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని డీసీపీ (డిటెన్షన్) ధనుంజయ్ కులకర్ణి తెలిపారు. రవికిషన్ కూతురు ఇంటిని వదిలివెళ్లిపోవడం ఇది రెండోసారి. గతంలోనూ ఓసారి ఆమె తల్లిదండ్రులను వదిలేసి బయటకు వెళ్లిందని పోలీసు వర్గాలు తెలిపాయి. భోజ్పురి నటుడిగా ఫేమస్ అయిన రవికిషన్ ఇటీవల బిగ్బాస్, ఏక్ సే బడ్ఖర్ ఏక్- జల్వా సితారోంకా వంటి టీవీ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందారు. అంతేకాకుండా తెలుగులో 'రేసుగుర్రం', 'కిక్-2' సినిమాల్లో విలన్ గా నటించారు. -
సిటీకి సలామ్ చేస్తున్న బీహారీలు
జిందగీ దియా! నాగరికత మానవుడిని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. కష్టాల్లోనే మనిషి అనే ్వషణ మొదలవుతుంది. బతుకుతెరువు దూరమైనపుడు కొత్త దారి వెతుక్కోవాల్సిందే. బీమారీ రాజ్యం నుంచి దశాబ్దాల కిందట బీహారీలు హైదరాబాద్కు వలస వచ్చారు. భాగ్య నగరంలో బతుకుభాగ్యం పొందారు. భిన్న సంస్కృతుల పూదోటలో కొత్తకుసుమాలయ్యారు. తరతరాలుగా ఇక్కడి గాలి పీలుస్తూ.. హైదరాబాదీలయ్యారు. బీహార్ అంటేనే వెనుకబాటుతనం గుర్తుకొస్తుంది. అభివృద్ధి ఆనవాళ్లయినా కనిపించని ఊళ్లు గుర్తుకొస్తాయి. అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితుల్లో సజావుగా సాగు చేయలేక, బతుకు సాగక సతమతమయ్యే రైతులు గుర్తుకొస్తారు. దశాబ్దాల కిందట కరువు ఛాయలు కమ్మిన వేళ.. ఉపాధి లేక చాలామంది బీహారీలు వలసబాట పట్టారు. వారిలో కొందరు పొట్ట చేత పట్టుకుని భాగ్యనగరానికి చేరుకున్నారు. నగరం వారికి నిలువనీడనిచ్చింది. తమకు జీవితాన్నిచ్చిన నగరంతో ఇక్కడి బీహారీలూ అనుబంధాన్ని పెనవేసుకున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్లోని జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న సుభాష్నగర్, అయోధ్యనగర్, వినాయక్నగర్ ప్రాంతాల్లో బీహారీలు ఎక్కువగా ఉంటున్నారు. మొదటితరంలో వలస వచ్చిన వారి పిల్లలకు ఇక్కడే పెళ్లిళ్లు జరిగాయి. వారి పిల్లల చదువుసంధ్యలు ఇక్కడే సాగుతున్నాయి. ఇక్కడే పుట్టిపెరుగుతున్న బీహారీల పిల్లలు తమ మాతృభాష భోజ్పురితో సమానంగా పక్కా దక్కనీ భాష కూడా మాట్లాడతారు. ఛఠ్ పూజ ప్రత్యేకం దశాబ్దాలుగా నగరంలో స్థిరపడినా, బీహారీలు తమ సంప్రదాయాలను మాత్రం తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బీహారీల ప్రధాన పర్వదినం ‘ఛఠ్పూజ’. కార్తీక శుక్ల షష్ఠిరోజున.. అంటే, దీపావళి వెళ్లిన ఆరో రోజు ఈ పండుగ జరుపుకుంటారు. సూర్యుడికి చెల్లెలయిన ఛఠ్మాతకు పూజించి, సూర్యాస్తమయ సమయంలో చెరువులోకి దిగి, సూర్యుడికి నమస్కరించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. మరునాడు వేకువ జామున నాలుగు గంటలకు చెరువు వద్దకు చేరుకుని, అక్కడ పూజలు చేసి, సూర్యోదయం తర్వాత సూర్యుడికి నైవేద్యం సమర్పిచి దీక్ష విరమిస్తారు. పురాణకాలంలో సీత, కుంతి, ద్రౌపది తదితరులు ఈ పూజ చేసినట్లు చెబుతారు. బీహారీలు జరుపుకొనే మరో ముఖ్యమైన పండుగ ‘తీజ్’. వివాహిత మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఈ పూజలు చేస్తారు. రాత్రివేళల్లోనే పెళ్లిళ్లు.. బీహారీల పెళ్లిళ్లు రాత్రిపూట మాత్రమే జరుగుతాయి. పగటివేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. అమ్మాయి ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది. ఎదుర్కోళ్ల తర్వాత అబ్బాయిని పెళ్లిపందిరికి తీసుకొస్తారు. సంపన్నులు ఐదురోజులు ఘనంగా జరుపుకుంటారు. పేదలు కూడా మూడు రోజులు పెళ్లివేడుక జరుపుకుంటారు.పెళ్లి కాగానే అమ్మాయిని తీసుకువెళ్లిపోతారు. మరునాడు మంచిరోజైతే అమ్మాయిని తిరిగి పుట్టింటికి తీసుకువస్తారు. పెళ్లికి ముందు కుండలో మట్టిపోసి, గోధుమ గింజలు విత్తుతారు. మూడు నుంచి ఐదు రోజుల్లో ఇవి మొలకెత్తుతాయి. ఇవి మొలకెత్తే సరికి పెళ్లి తంతు పూర్తవుతుంది. -
ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న సినీ నటుడు!
మరో సినీ నటుడు రాజకీయ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. భోజ్ పూరి నటుడు రవి కిషన్ వచ్చే లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని స్వంత జిల్లా జాన్ పూర్ లో ఎన్నికల్లో పోటి చేసేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన రక్తంలోనే కాంగ్రెస్ ఉంది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించే విషయంలో సానుకూలంగా స్పందింస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తనతో ఇతర పార్టీల వారు కూడా తనతో టచ్ లో ఉన్నారని, కాని తాను కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నాను అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బాలీవుడ్ చిత్రాలు ఫిర్ హెరా ఫెరీ, ఏజెంట్ వినోద్, బుల్లెట్ రాజాతోపాటు పలు భోజ్ పూరి చిత్రాల్లో రవి కిషన్ నటించారు. -
కెమెరామన్ అమర్ మృతి
ఛాయాగ్రాహకుడు అమర్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్లో ఓ భోజ్పురి సినిమా షూటింగ్లో అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. నెల్లూరు జిల్లా ముత్తకూరు ఆయన స్వస్థలం. అమర్కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మోహన్బాబు నటించిన ‘శివ్శంకర్’, శ్రీకాంత్ ‘ప్రేమసందడి’, తనీష్ ‘బ్యాండ్బాజా’ తదితర చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారాయన.