born baby
-
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన
-
New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్’
కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. కొంగొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకొచ్చింది. అయితే ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారి తరాన్ని జనరేషన్ బీటాగా పిలువనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలను బీటా బేబీస్ అని పిలుస్తారు. బీటా జనరేషన్(Beta Generation) సాంకేతిక యుగంలో అత్యున్నతంగా ఎదగడమే కాకుండా, మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటూ, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనరేషన్ బీటా 2035 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం ఉంటుందని అంచనా. నూతన దృక్పథంతో భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ తరం, 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్ష్యంగా నిలుస్తారంటున్నారు. సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సామాజిక మార్పుల మధ్య బీటా తరం జీవితం గడుపుతుంది. ఈ తరం ప్రతి అంశంలో సాంకేతికత వినియోగించడమే కాకుండా, పర్యావరణ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది.బీటా జనరేషన్ ఆల్ఫా జనరేషన్ (2010-2024 మధ్య పుట్టినవారు)ను అనుసరిస్తుంది. దీనికి ముందు జెనరేషన్ జెడ్ (1996–2010), మిలీనియల్స్ (1981–1996) జనరేషన్లు ఉన్నాయి. జనరేషన్ బీటాను బీటా బేబీస్(Beta Babies) అని కూడా అంటారు. ఈ తరం సాంకేతిక యుగంలో పెరుగుతుంది. టెక్నాలజీ యుగం సామాజిక పరిశోధకుడు మార్క్ మెక్క్రిండిల్ తెలిపిన వివరాల ప్రకారం జనరేషన్ బీటా జీవితాలు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ముందుకు సాగుతాయి. విద్య, ఆరోగ్యం, వినోదం, కార్యాలయ కార్యకలాపాల్లో వీరు ఏఐని విరివిగా వినియోగిస్తారు.ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
అలా జన్మించిన శిశువుల్లో గుండె లోపాలు..!
సంతాన సాఫల్య చికిత్సల ద్వారా జన్మించే శిశువుల్లో గుండె లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. స్వీడిష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ యు.బి.వెనర్హోమ్ ఈ అంశాన్ని తన అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఐవీఎఫ్ సహా వివిధ రకాల కృత్రిమ పద్ధతుల ద్వారా జన్మించిన శిశువుల్లో సహజంగా జన్మించిన శిశువుల్లో కంటే జన్యు సమస్యల వల్ల గుండె లోపాలు తలెత్తే అవకాశాలు 36 శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్ వెనర్హోమ్ గుర్తించారు. ఆయన నేతృత్వంలోని వైద్యుల బృందం డెన్మార్క్, ఫిన్లండ్, స్విట్జర్లండ్, నార్వే దేశాల్లో కృత్రిమ పద్ధతుల ద్వారా 1990–2015 మధ్య కాలంలో జన్మించిన సుమారు 1.71 లక్షల శిశువుల ఆరోగ్య వివరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.సహజంగా జన్మించిన శిశువుల కంటే, కృత్రిమ పద్ధతుల ద్వారా పుట్టిన శిశువుల్లోనే తర్వాతి కాలంలో గుండె లోపాలు ఎక్కువగా బయటపడినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన సారాంశాన్ని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ఇటీవల ప్రచురించింది.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
అద్భుతం.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా శిశువులో చలనం
విశాఖ: కేజీహెచ్లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు తరలిస్తుండగా ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.కేజీహెచ్లో శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రాణం లేకుండా శిశువు జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువులో ఎలాంటి చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును తండ్రికి అప్పగించారు.శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన హృదయంతో అంబులెన్స్లో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఎక్కిన ఆ తండ్రి ఒడిలో ఉన్నశిశువులో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. అప్రమత్తమైన తండ్రి కేజీహెచ్ వైద్యులకు సమాచారం అందించారు. చికిత్స చేసిన వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యులు పసికందును చేతుల్లోకి తీసుకొని ఆనందంలో మునిగిపోయారు. అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. -
పుట్టుకతోనే 32 పళ్లు.. వీడియో వైరల్..
-
నర్సు వేషంలో వచ్చి కిడ్నాప్..
-
వయాగ్రా..! నవజాత శిశువుల పాలిట వరం!
గర్భస్థ శిశువు, నవజాత శిశువులు శ్వాస సంబధ సమస్యలు ఎదుర్కొటుంటారు. వారికి ట్రీట్మెంట్ అందించడం అనేది ఓ సవాలు. దీని వల్ల మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందక బుద్ధిమాంద్య పిల్లల్లా లేదా మానసిక వికలాంగులులా మిగిలిపోతున్నారు. అలాంటి శిశువులకు వయాగ్రాతో చికిత్స అందిస్తే మెరుగైన ప్రయోజనం ఉంటుందని కెనడాలోని మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. నిజానికి గర్భస్థ శిశువులు లేదా నవజాత శిశువులు ఎక్కువగా ఈ శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిని నియోనాటల్ ఎన్సెలోపతి అంటారు. నిజానికి ఇలాంటి సమస్యలతో బాధపడే చిన్నారులకు సాధారణంగా ఇప్పటి వరకు థెరప్యూటిక్ హైపోథెర్మీయా(అల్పోష్ణ స్థితి) చికిత్స మాత్రేమే అందిస్తున్నారు. ఇది శరీరాన్ని కూల్ చేసే పద్ధతి. దీన్ని కార్డియాక్ అరెస్ట్కి గురయ్యి వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకునేలా చేసిన తర్వాత ఆ వ్యక్తి శరీరాన్ని కూల్ చేయడానికి ఈ థెరప్యూటిక్ హైపోథెర్మీయా(అల్పోష్ణ స్థితి) చికిత్స విధానాన్నే అందించడం జరుగుతుంది. అయితే ఈ చికిత్స విధానాన్ని శిశువులకు అందిస్తుంటే వారిలో సుమారు 29% మంది శిశువులు నరాల సంబంధిత సమస్యలు ఎదురయ్యి మెదడు డెవలప్ అవ్వకపోవడం లేదా దెబ్బతినడం జరుగుతోంది. ఈ సమస్యకు సిల్డెనాఫిల్(వయాగ్రా)తో చెక్పెట్టొచ్చని కెనడాలోని మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇలా థెరప్యూటిక్ హైపోథెర్మీయా చికిత్స తీసుకుని మెదడు దెబ్బతిన్న చిన్నారులకు సిల్డెనాఫిల్(వయాగ్రా)తో చికిత్స అందించగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. వారిలో కేవలం 30 రోజుల్లో బూడిదరండు పదార్థం పెరిగింది. పైగా 18 నెలల్లోనే న్యూరో డెవలప్మెంట్లో మంచి ఫలితాలు చూపించాయి. ఈ మేరకు మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం తీవ్రమైన నియోనాటల్ ఎన్సెఫలోపతితో బాధపడుతున్న మొత్తం 24 మంది శిశువులను తీసుకున్నారు. వారిలో ముగ్గురికి తప్పించి మిగతా అందరికి వయాగ్రాతో చికిత్స అందించారు. ఈ వయగ్రా తీసుకున్న శిశువులందరిలో మెదుడలోని గాయాలు నయమవ్వడం, వాల్యూమ్ కోల్పోయిన మెదడులో బూడిద రంగు పదార్థం పెరగడం వంటివి జరిగాయని అన్నారు. తక్కువ టైంలోనే వారిలో న్యూరో డెవలప్మెంట్ మెరగయ్యిందని, అలాగే ఇది వారికి సురక్షితమైనదేనని పేర్కొన్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా నియోనాటల్ ఎన్సెఫలోపతితో బాధపడుతున్న చిన్నారులకు ఈ చికిత్స విధానమే బెస్ట్ అని చెప్పారు. (చదవండి: గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!) -
నవజాత శిశువులను కాపాడే అరుదైనా బ్లడ్ గ్రూప్!
రక్తమార్పిడ్లు గురించి విన్నాం. చాలామందికి ప్రమాద కారణంగానో లేదా మరే ఇతర కారణాల వల్ల రక్తం ఎక్కించాల్సి ఉంటంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ నవజాత శిశువులకు కూడా ఒక్కోసారి జననంలో ఎదురయ్యే సమస్యల కారణంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అయితే వారికి ఎక్కించే రక్తం విషయంలో మాత్రం వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ఎక్కించాక ఏవైనా సమస్యల రాకుండా పలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ నవజాత శిశువులకు ఎలాంటి రక్తాన్ని ఎక్కిస్తారు? ఆ రక్తానికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారంటే.. అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ బీ-ని నవజాత శిశువులకు ఎక్కిస్తారు. ఆ రక్తాన్ని నియో అనే బ్లడ్ని బ్లూ ట్యాగ్ బ్యాగ్లె కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే? ఈ బ్లడ్ అప్పుడే పుట్టిన శిశువులకు ఇచ్చేది కాబట్టి దానిపై నియో అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఇక్కడ ‘నియో’ అంటే నియోనాటల్. 28 రోజుల వయసున్న చిన్నారుల గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతుంటారు. ఇక ఈ రక్తం నవజాత శిశువులతో పాటు కొందరు రోగులకు సాయం చేస్తుంది. ఎలాంటి పరీక్షలు చేస్తారంటే.. సాధారణంగా దానం చేసిన రక్తంనతంటికీ హెచ్ఐవీ, హెపటీటిస్ బీ, సీ, ఈ, అలాగే సిఫిలిస్ వంటి పరీక్షలు చేపడతామని హెమటాలసీ డాక్టర్ ఆండీ చార్టన్ వివరించారు. ఆ పరీక్షలు అన్ని పూర్తి అయిన తర్వాత రోగులకు సరిపోతుందా? లేదా? అని అనేది తెలుసుకోవడం కోసం కొన్ని శాంపిల్స్ తీసుకుని మరిన్ని పరీక్షలను, ప్రక్రియలను చేపడతామని చెప్పారు. అంటే..కొందరి వ్యక్తులకు అంతకుముందు రక్తమార్పిడి సమయంలో వచ్చిన అలర్జిక్ రియాక్షన్ల ప్రొటీన్లు తొలగించిన తర్వాత రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందని తెలిపారు శిశువులకు ఎక్కించాలంటే తప్పనసరిగా ఆ పరీక్ష.. నవజాత శిశువులకు, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్లకు(రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న రోగులకు), గర్భిణులకు, గర్భాశయంలో ఎదిగే పిండానికి ఎక్కించే రక్తానికి తప్పనిసరిగా సైటోమెగాలో(CMV) అనే వైరస్కు సంబంధించి పరీక్షించాల్సి ఉంటుంది. ఇది హెర్పస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ చాలా సాధారణం. ఇది హానికరమైనది కాదు. స్వల్పంగా ఫ్లూ వంటి లక్షణాలను లేకపోతే ఎలాంటి లక్షణాలను ఇది కలిగి ఉండదు. కానీ, కొందరికి మాత్రం ఇది ప్రమాదకరం. ఈ వైరస్ వల్ల పిల్లలకి మూర్ఛ రావొచ్చు, కళ్లు మసకబారడం, వినికిడి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కిడ్నీ, ప్లీహాన్ని దెబ్బతీయొచ్చు. చాలా అరుదైన కేసుల్లో ఇది ప్రాణాంతకం కావొచ్చు. ఒకవేళ రక్తంలో ఈ వైరస్ ఉంటే అది ఇలాంటి శిశువులకు, రోగులకు ఇవ్వడానికి పనికిరాదు. అయితే ఈ రక్తం దొరకడం అనేది అత్యంత అరుదు. అందువల్ల ఈ రక్తం గల దాతలు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎందరో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. దయచేసి బీ నెగిటివ్ గ్రూప్ కల వారు తమ రక్తం ఎంతో అమూల్యమైనదని గర్వించడమే గాకుండా ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎన్నో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్ కపూర్ సైతం..
అప్పుడే పుట్టిన పిల్లలకు కొందరు తేనె పెడుతుంటారు. మాటలు తెనె పలుకుల్లా ఉంటాయని మన పెద్దవాళ్ల ఆలోచన. చెప్పాలంటే తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా మన పెద్దలు అప్పుడే పుట్టిన పిల్లలకు తేనె పెడుతుంటారు. ఇలా పెట్టడంతో పిల్లలు చనిపోయిను ఉదంతాలు కూడా ఉన్నాయి. ఐతే అసలు తేనె పిల్లలకు పెట్టొచ్చా? ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధా గుణాలు కలిగిన తేనె చిన్నారుల పాలిట విషమా? తదితరాల గురించే ఈ కథనం. ఏదీఏమైనా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు తేనె అస్సలు పెట్టొదనే అంటున్నారు ఆరోగ్య నిపుణలు. బాలీవుడ్ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ సైతం ఇదే చెబుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలా చేసినప్పటికీ నిర్మొహమాటంగా మీ ముక్కు పచ్చలారని చిన్నారులకు తేనెను ఇవ్వనని గట్టిగా చెప్పండి అని అంటోంది సోనమ్. అది వారి ప్రాణాలను హరించే విషం అంటూ హితవు పలుకుతుంది. తాను కూడా తన కొడుకు వాయు కపూర్కి ఇవ్వలేదని. ఇది మన ఆచారమే అయినా..దాన్ని తను స్కిప్ చేశానని. అలాగే మీరు కూడా చేయండి అని సోషల్ మీడియా వేదికగా చెబుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో పూర్తిస్థాయి జీర్ణవ్యవస్థ ఉండదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రాణాంతకం కూడా కావచ్చు. దయచేసి ఇలాంటి పనులు మానుకుండి. కోరి కోరి గర్భశోకాన్ని అనుభవించొద్దు ఓ తల్లిగా చెబుతున్నా అని సోనమ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తోంది. “had an argument with Pandit ji for feeding Honey to newly born child because i don’t believe in these traditions”, like seriously ??? Wokeism at its peak!! pic.twitter.com/fBbQ7TVGVL — Moana (@ladynationalist) September 27, 2023 శిశువులకు తేనె ఎందుకు సురకక్షితం కాదంటే... శిశువులకు తేనె ఎందుకు సురక్షితం కాదని తెలుసుకోవడానికి తాను ఆరోగ్య నిపుణులను కూడా సంప్రదించినట్లు తెలిపింది సోనమ్. అంతేగాదు ఆమె శిశువులకు తేనె ఎందుకు ఇవ్వకూడదో వివరిస్తూ, సికె బిర్లా హాస్పిటల్ గురుగ్రామ్లోని నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ డాక్టర్ శ్రేయా దూబే చెప్పిన విషయాలను కూడా పంచుకుంది. తేనెలో క్లోస్ట్రిడియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుల ప్రేగులలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదికాస్త శిశు బోటులిజం అనే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ఈ బొటులిజంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో.. ఒకటి ఆహారం ద్వారా వచ్చేవి, రెండు గాయం ద్వారా వచ్చే శిశు బొటులిజం. ఈ బ్యాక్టీరియా శిశువుల నరాలపై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, తేనెనూ ఏ విధంగానూ శిశువులకు తినిపించకపోవడమే మంచిదిని సోనమ్ గట్టిగా నొక్కి చెబుతోంది. వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తేనెలో "క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే తక్కువ ఆక్సిజన్ పరిస్థితులలో ప్రమాదకరమైన టాక్సిన్లను (బోటులినమ్ టాక్సిన్స్) ఉత్పత్తి చేసే బాక్టీరియం ఉంటుందని పేర్కొంది. శిశు వైద్యురాలు డాక్టర్ మీనా జే మాట్లాడుతూ..వడకట్టలేని లేదా ప్రాసెస్ చేయని తేనె శిశువులకు ఇవ్వడం వల్ల న్యూరోటాక్సిసిటీకి గురై కండరాల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది శిశువుని మరణం అంచులదాక తీసుకువెళ్తుందని తెలిపారు. తొలుత మలబద్దకం, హైసోటోనియాతో మొదలవుతుంది. క్రమేణ పక్షవాతానికి దారితీసి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. చివరికి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్లోని యశోద ఆస్పతత్రిలోని శిశు వైద్యుడు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి మాట్లాడుతూ.. తేనె వల్ల శిశు బొటులిజంకి గురవ్వుతారని అన్నారు. దీనివల్ల కండరాల బలహీనతకు దారితీసి కనీసం పాలను కూడా ఫీడ్ చేయలేనంత బలహీనంగా మారిపోయి విరేచనలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. నవజాత శిశువుల్లో అప్పుడే రోగ నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. దీని ఫలితంగా మనం ఆచారం పేరుతో శిశువులకు తేనెను ఇచ్చేస్తాం. వారి ప్రేగుల్లో తేనెలో ఉన్న టాక్సిన్స్తో పోరాడే రక్షణ పూర్తిగా ఉండదు. జీర్ణసమస్యలు ఏర్పడి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీసస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు తేనె ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి. ఇక ఇండియన్ పీడియాట్రిక్ ప్రకారం అప్పుడే పుట్టిన శిశువులకు జంతువులకు సంబంధించిన పాలు, పాల పొడి, టీ, నీరు, గ్లూకోజ్ నీరు లేదా ఇతర ఏ ద్రవాలు ఆహారంగా వ్వకూడదని హానికరం అని పేర్కొంది. ప్రజలు తేనెని శిశువులోని ప్రేగు కార్యకలాపాలను ఉత్తేజపరిచి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుందని భావిస్తారు. వాస్తవానికి తేనె శరీరంలో చాలా నీటిని తీసుకుంటుంది. ఫలితంగా వదులుగా ఉండే మలం వస్తుంది .కానీ అప్పుడే ఉండే శిశువు శరీరంలో ఆ స్థాయిలో నీరు ఉండదు, పైగా అరిగించుకునేంత జీర్ణవ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉండదు. అందువల్ల ఇలాంటి ఆచారాన్ని మానుకోవాలని డాక్టర్ అమిత్ గుప్తా చెబుతున్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నవజాత శిశువుల తొలి ఆహారంగా ఆవుపాలు లేదా తేనె వంటివి ఇస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పుని గట్టిగా నొక్కి చెబుతున్నారు. తల్లిపాలు తప్ప మిగతావన్నీ శిశువుకు లేనిపోని ఆరోగ్య సమస్యలను కలిగించేవేనని అధ్యయనంలో వెల్లడైంది. కావునా మనం ఆ సంస్కృతులు, ఆచారాలు అనేవి ఆయా పరిస్థితులు దృష్ట్యా వచ్చినవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు అంతటి స్థాయిలో లేవు అనేదాన్ని కూడా మనం గమనించి విచక్షణతో వ్యవహరించాల్సి ఉంది. (చదవండి: ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..) -
భూకంప శిథిలాల కింద ఊపిరిపోసుకున్న బిడ్డ ఇప్పుడిలా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటే ఇంకా ఆ దృశ్యాలు కళ్లముందు మెదులుతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ శిథిలాల కిందే ఓ శిశువు ఊపిరి పోసుకుంది. ఆ 'జననం ఓ అద్భుతం' అనే చెప్పాలి. అంతటి విషాదంలో అందరిలో ఓ కొత ఆశను రేకెత్తించినట్లు 'మిరాకిల్గా ఆ బేబి' పుట్టడం అందర్ని ఒకింత ఆనందసభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇప్పుడూ ఆ శిశువు ఎలా ఉందంటే? నాటి సిరియా భారీ భూకంపంలో శిథిలాల కింద ఆ పసికందు కనిపించినప్పుడు, ఆమె బొడ్డు తాడు తల్లి నుంచి ఇంకా తెగిపోలేదు. ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి వచ్చిన కాసేపటికే ఆమె తల్లి కన్నుమూసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచాన్ని ఆకర్షించింది. తల్లి లేకపోయిన ఆ చిన్నారి ఆస్పత్రిలో వైద్యుల సాయంతో కోలుకుంది. ఇప్పుడు ఆ శిశువుకి ఆరు నెలలు. చాలా ఆరోగ్యంగా ఉంది. సిరియాలోని జిండిరెస్ పట్టణంలో ఆ చిన్నారి తన మేనత్త, మేనమామ, వారి ఏడుగురు పిల్లల మధ్య పెరుగుతోంది. ఆమె నవ్వుతుంటే వాళ్ల నాన్న, అక్కలే గుర్తుకొస్తున్నారని ఆ చిన్నారి మేనమామ ఖలీల్ అల్ సవాడీ అన్నారు. ఆ విషాద ఘటనలో ఆమె తండ్రి, తల్లి, నలుగురు అక్కలు ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుటుంబంలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి అఫ్రానే. ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఎంతోమంది ముందుకొచ్చారు కూడా. ఆఖరికి అయినవాళ్ల అయిన ఆ చిన్నారి మేనమామ, మేనత్తలకు ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. ఎన్నో టెస్ట్లు నిర్వహించిగానీ వారికి ఆ పాపను అప్పగించలేదు ఆస్పత్రి యజమాన్యం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే చేసిన పని ఆ పాపకు కొత్తపేరు పెట్టడమే. ఆ చిన్నారికి ఆమె తల్లి 'అఫ్రా' పేరునే పెట్టారు. నిజానికి ఆ శిశువుని కాపాడిని రెస్క్యూ సిబ్బంది, ఆస్పత్రి యజమాన్యం ఆ చిన్నారికి 'అయా' అని పేరు పెట్టడం జరిగింది. 'అయా' అంటే అరబిక్లో అద్భుతం అని అర్థం. ఆమె నా కూతుళ్లలో ఒకత్తని, దాన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేనన్నారు ఆ చిన్నారి మేనమామ ఖలీల్. ఇక జిండిరెస్లోని ఖలీల్ ఉంటున్న ఇల్లు కూడా బాగా భూకంపం కారణంగా బాగ దెబ్బతిందని, అందువల్ల తాముఅక్కడే ఎక్కువ కాలం ఉండలేకపోయామన్నారు ఖలీల్. దీంతో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టినట్టయిందని, పిల్లలను స్కూల్కి పంపే స్థోమత కూడా లేదని ఖలీల్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఖలీల్ లాగానే ఎన్నో వేల కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్నాయి. అంతేగాదు ఆ విషాద ఘటనలో దాదాపు 50 వేలమంది మరణించారని, మరో 50 వేలమంది నిరాశ్రయులయ్యినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది కూడా. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురికి లండన్లో ఉద్యోగం) -
మంచిర్యాల జిల్లాలో నవజాత శిశువు అమ్మకం
-
అంబానీ ఇంట కొత్త వారసురాలొచ్చింది!
-
రెండో కుమారుడికి శాంతి పూజ చేయించిన యాంకర్ లాస్య (ఫోటోలు)
-
47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి
ఇండస్ట్రీలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో ఓ కల్పిత కథ.. నిజ జీవితంలో చోటు చేసుకుంది. ప్రముఖ సీరియన్ నటి, బుల్లితెర హీరోయిన్ తల్లి 23 ఏళ్ల తర్వాత గర్భవతి అయి ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఈ వార్త ఇండస్ట్రలో, సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నిలిచింది. వివరాలు.. కేరళకు చెందిన 23 ఏళ్ల ఆర్య పార్వతి మలయాళంలో పాపులర్ నటి. ఆమె పలు టీవీ సీరియల్స్లో లీడ్ రోల్స్ చేస్తూ బుల్లితెర హీరోయిన్గా ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. చదవండి: కృష్ణవంశీకి పిచ్చా.. ఈమె హీరోయిన్ ఏంటీ? అని హేళన చేశారు: నటి సంగీత ‘చెంబట్టు’ ‘ఇలయవళ్ గాయత్రి’ వంటి సీరియల్స్ ఆమె గుర్తింపు పొందింది. ఆమె నటి మాత్రమే కాదు క్లాసికల్ డ్యాన్సర్ కూడా. నటిగా, డ్యాన్సర్గా ఆమె ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో గతంలో తన తల్లి గర్భవతి అయినట్లు ప్రకటించి షాకిచ్చింది. 47 ఏళ్ల ఆమె తల్లి 23 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యిందని తెలిసి అంతా అవాక్కాయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మననిచ్చింది. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఈ విషయాన్ని నటి ఆర్య పార్వతి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు తన బుల్లి చెల్లి ఫొటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ మురిసిపోతుంది. కాగా అచ్చం ఇలాంటి సంఘటన ఆధారంగా ఇటీవల తమిళంలో ఓ సినిమా తెరకెక్కింది. ఆర్జే బాలాజీ లీడ్ రోల్లో ‘వీట్ల విశేషం’ అనే సినిమా వచ్చింది. ఇందులో సత్యరాజ్, ఊర్వశీలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో హీరో తల్లిగా కనిపించిన ఊర్వశీ మధ్య వయసులో తల్లవుతుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరగడం గమనార్హం. View this post on Instagram A post shared by 𝗔𝗿𝘆𝗮 𝗣𝗮𝗿𝘃𝗮𝘁𝗵𝗶 (@arya_parvathi) View this post on Instagram A post shared by 𝗔𝗿𝘆𝗮 𝗣𝗮𝗿𝘃𝗮𝘁𝗵𝗶 (@arya_parvathi) -
అమ్మా ఎందుకు వదిలేశావ్..?
రాత్రి 8 గంటల సమయం. చుట్టూ చిమ్మచీకటి. మెల్లగా ముసురుకుంటున్న చలి గాలులు. నిశ్శబ్దమైన వాతావరణంలో వినిపించిన ఓ పసికందు రోదన కోష్ట గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా ఉన్న బిడ్డ ఆ పేగు తెంచుకున్నాక.. బంధాలకు కూడా దూరమై ఇలా చీకటిలో నిస్సహాయంగా స్థానికుల కంట పడింది. జేఆర్పురం ఎస్ఐ జి.రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. కోష్ట గ్రామంలోని ఒక కర్రల మోపుపై ఎవరో ఒక ఆడ పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయారు. స్థానికులు పసిపాప ఏడుపులు విని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ రాజేష్ పాపను రణస్థలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ వదిలి వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది. పసికందు 1.5 కిలోల బరువు ఉందని, జన్మించి ఒక రోజు అయి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. (చదవండి: సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం) -
నవజాత శిశువు కడుపులో కవల పిండం...షాక్లో తల్లి
కవల పిండంతో ఒక నవజాత శిశువు జన్మించింది. ఈ ఘటన ఇజ్రాయెల్లో అష్టోడ్లోని అసుతా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తల్లి గర్భంలో ఉండగానే నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్తో శిశువు ఏదో సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆ శిశువు జన్మించాక నిర్వహించిన పరీక్షల్లో కడుపులో ట్విన్పిండం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వివరాల్లోకెళ్తే...నవజాత శిశువు కడుపులో కవల పిండం ఉంది. దీన్ని ఫీటస్ ఇన్ ఫీటూ(ఎఫ్ఐఎఫ్) అంటారు. గతేడాది బిడ్డ పుట్టిన తర్వాత వైద్యులు అల్ట్రాసౌండ్ ఎక్స్రేలతో సహా పలు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో శిశువు పొత్తికడుపులో పాక్షికంగా అభివృద్ధి చెందిన పిండాన్ని కనుగొన్నారు. వైద్యులు శిశువు కడుపులో కవల పిండం ఉన్నట్లు చెప్పగానే ఆ చిన్నారి తల్లి ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. ఆ తర్వాత ఆ శిశువుకు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని తొలగించారు. ఈ మేరకు మెడికల్ సెంటర్లోని నియోనాటాలజీ డైరెక్టర్ డాక్టర్ ఒమెర్ గ్లోబస్ మాట్లాడుతూ... ఆ శిశువు పొత్తి కడుపులో ఉన్నది పిండం అని తెలుసుకుని మేము ఆశ్యర్యపోయాం. కానీ పరీక్షల్లో అది పిండంలా కనిపించలేదు. ఐతే అది పొత్తి కడుపులో పాక్షికంగా అభివృద్ధి చెందుతుంది కానీ జీవించదని అక్కడే అలా ఉండిపోతుందని చెబుతున్నారు. సదరు తల్లి ఆలస్యంగా గర్భం దాల్చిందని కూడా చెప్పారు అందువల్ల కూడా పలు సమస్యలు తలెత్తుతాయని అన్నారు. కానీ ఇలాంటి అరుదైన పరిస్థితి ప్రతి అరమిలియన్ జననాలకు ఒకరికి మాత్రమే సంభవిస్తుంది. (చదవండి: వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!) -
ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..
అనంతపురం సెంట్రల్/చిలమత్తూరు: ఐదు నెలల ఉత్కంఠకు తెరపడింది. అనాథ శిశువుగా శిశుగృహకు చేరుకున్న చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అసలేం జరిగిందంటే... సరిగ్గా ఐదునెలల క్రితం (జూన్ 7న) చిలమత్తూరులో ముళ్లపొదల మధ్యన నవజాత మగ శిశువు లభ్యమైంది. స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు వెంటనే స్పందించారు. శిశువును వెంటనే కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అనంతపురంలోని శిశుగృహకు చేర్చారు. ఉత్కంఠకు తెర పెనుకొండ నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన దంపతులు బతుకు తెరువు కోసం చిలమత్తూరుకు చేరుకున్నారు. అప్పటికే ఆమె నిండు గర్భిణి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెకు ప్రసవమైంది. ఆ సమయంలో ఆమె మతిస్థిమితం లేక నవజాత శిశువును వదిలేసి ఇంటికి చేరుకుంది. అదే రోజు సాయంత్రం విషయం తెలుసుకున్న భర్త వెంటనే చిలమత్తూరు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే శిశువును శిశుగృహకు అప్పగించినట్లు పోలీసులు తెలపడంతో అనంతపురం చేరుకుని ఐసీడీఎస్ అధికారులను సంప్రదించాడు. అయితే తమ బిడ్డేననే ఆధారాలు చూపలేకపోవడంతో శిశువు అప్పగింతకు అధికారులు అంగీకరించలేదు. దీంతో తండ్రి జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థను ఆశ్రయించాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిశువుకు ఐసీడీఎస్ అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన నివేదిక గురువారం ఐసీడీఎస్ అధికారులకు అందింది. అందులో శిశువు తల్లిదండ్రులు వారేనని రుజువైంది. దీంతో తల్లిదండ్రులకు గురువారం సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మి సమక్షంలో ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి అప్పగించారు. శిశుగృహ సిబ్బందికి అభినందన తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన తరుణంలో ముళ్లపొదల మధ్య నుంచి నేరుగా తమ చెంతకు చేరుకున్న శిశువును శిశుగృహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు ఐదు నెలల పాటు బిడ్డ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు తల్లిదండ్రులకు శిశువును అప్పగిస్తున్న తరుణంలో శిశుగృహ సిబ్బంది కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారిని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మీ, సభ్యులు ఓబుళపతి, కామేశ్వరి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి తదితరులు అభినందించారు. తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శిశుగృహ మేనేజర్ శ్రీలక్ష్మీ, ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకటేశ్వరి, చంద్రకళ, చిలమత్తూరు పోలీసులు పాల్గొన్నారు. (చదవండి: వరద గుప్పిట్లో అనంతపురం) -
తల్లయిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ.. పాపకు పేరు పెట్టిన కేసీఆర్
సాక్షి,ఇల్లెందు(కొత్తగూడెం): హైదరాబాద్లో బీఆర్ఎస్ ఆవిర్భావం రోజు బుధవారం ఉదయం ఆ పార్టీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మార్కెట్ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. బీఆర్ఎస్ ఆవిర్భావం వేళ జన్మించిన బిడ్డకు ‘సుచిత్ర భారత ప్రియ’గా నామకరణం చేయాలని తనను కలిసిన హరిసింగ్ నాయక్కు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. హరిప్రియ దంపతులకు ఇరవై ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడం, అదేరోజు దసరా కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: నేతలకు గాలం వేస్తున్న ‘ఈటల’.. ఒక్కొక్కరుగా ‘గులాబీ’ పార్టీకి గుడ్ బై -
కన్నతల్లీ కర్కోటకురాలు
మండ్య: మానవత్వం లేని మహిళ అప్పుడే పుట్టిన నవజాత శిశువు (మగ)ను 30 అడుగుల లోతులో ఉన్న పాడుబడిన బావిలో పారవేసిన దారుణ ఘటన జిల్లాలోని పాండవపుర తాలూకా చంద్రె గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని శిశువును సంరక్షించారు. అనంతరం పాండవపుర పట్టణ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఉన్న ఓ మహిళ చనుబాలు ఇచ్చి అమ్మతనం చాటుకుంది. శిశువును చీమలు కరవడంతో మెరుగైన చికిత్స కోసం మండ్య మిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి గోపాలయ్య మిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శిశువును పరిశీలించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ వైద్యం అందివ్వాలని జిల్లా అధికారి అశ్వతికి సూచించారు. (చదవండి: ఆడపిల్లను కన్నావు... అదనపు కట్నం తెస్తేనే సంసారం) -
ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకున్న ఓ కుటుంబం
-
కసాయి తల్లి...మరో పెళ్లి కోసం నెలల పసికందుని....
సాక్షి ముంబై: వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని తమ కన్న పిల్లల్నే హతమారుస్తున్న కసాయి తల్లిదండ్రులను చూస్తున్నాం. మరికొంతమంది తమ అక్రమసంబంధాలు గురించి పిల్లలకు తెలిసిపోయిందనో లేక వాళ్లు చూశారనో చంపేస్తున్నారు. కొంతమంది జంటలు విడాకులు తీసుకుని మరోకరితో కొత్తజీవితాన్ని పంచుకునేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని వాళ్లను రోడ్ల మీద, బస్టాండ్ల్లోనూ, లేదా చెత్తబుట్టలోనూ వదిలేసి వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడో మహిళ అలాంటి దారుణానికే పాల్పడింది. వివరాల్లోకెళ్తే...ముంబైలోని మెరైన్ డ్రైవ్లోని డస్ట్బిన్ దగ్గర 15 రోజుల పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయిన 22 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బీహార్లోని తన గ్రామంలో వయస్సులో తన కంటే రెట్టింపు వయసు ఉన్న వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆ మహిళ తెలిపింది. పెళ్లైయిన కొన్ని నెలలు తర్వాత ఆమె తన భర్త ఇంటి నుంచి పారిపోయి తన సోదరుడి సహాయంతో మహారాష్ట్రకు వచ్చి ఖడావ్లీలో నివసిస్తుంది. కొన్ని రోజుల తర్వాత తాను గర్భవతినని తెలుసుకుంది. ఐతే ఆమె మరొ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ఉల్హాసనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ మహిళ తన సోదరుడి సాయంతో ఆ బిడ్డను మెరైన్ డ్రైవ్కు సమీపంలోని డస్ట్బిన్ దగ్గర శిశువును వదిలి వెళ్లిపోయారు. పైగా ఆ బిడ్డను డబ్బున్న కుటుంబం దత్తత తీసుకుంటుందని భావించాం అని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు మెరైన్ డ్రైవ్ పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సదరు మహిళను గుర్తించినట్లు వెల్లడించారు. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి..) -
శిశు శోకం: ఏమైందో తెలియదు.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు..
‘ఆకలైనప్పుడల్లా పాలు తాగాను. నువ్విచ్చే ముద్దులతో మురిసిపోయాను. నీ ఒడిలో ఆడుకున్నాను. నీ వెచ్చని స్పర్శతో హాయిగా నిద్రపోయాను. ఏమైందో తెలియదు గానీ.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు. అంగట్లో బొమ్మలా.. నన్ను వేరొకరికి అమ్మారు. నాకేదో ప్రాణాంతక వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పడంతో.. తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు నాకే తెలియని లోకమైన శిశుగృహలో ఉన్నాను. నీ ఒడి చేరాలనుంది. నీ చనుబాలు తాగాలనుంది.’ అని ఆ శిశువుల ఆక్రందనలు వింటే అర్థమవుతోంది. తల్లికి దూరమైన ఇద్దరు శిశువులు గుక్క పట్టి ఏడుస్తున్నారు. – సాక్షి, వరంగల్ ఓరుగల్లు కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా సభ్యులు శిశువులను విక్రయిస్తున్నారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. శిశువులను సంరక్షించారు. నెలల వయసు లేని ఆ పసిబిడ్డలు ఆక్రందనలు చేస్తున్నా.. తల్లుల ఆచూకీ ఇంకా దొరక్కపోవడం విచారకరం. గత నెల 14న శిశువుల విక్రయ ముఠాను పట్టుకున్నా.. ఇప్పటివరకు ఆ శిశువుల తల్లులెవరో తెలుసుకునే దిశగా ఇంతేజార్గంజ్ పోలీసులు అడుగు ముందుకేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో వరంగల్ వాసులు రుద్రారపు స్వరూప, ఓదెల అనిత, విజయవాడ వాసి శారదతోపాటు గుజరాత్, మహారాష్ట్రకు చెందిన అనురాధ అక్షయ్ కోరి, సల్మా యూనిస్ షేక్ అలియాస్ హారతి, పాట్నీ శైలబేన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి ఆ శిశువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకొని వారి వద్దకు చేర్చాల్సి ఉంది. కానీ పోలీసులు ఆ కేసును పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ శిశువులను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చామని పట్టుబడిన నిందితులు చెప్పినప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ప లువురు విమర్శిస్తున్నారు. తీగ లాగితే.. డొంక కదులుద్ది! వరంగల్ కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా కదలికలున్నాయని పోలీసులకు ఈ అరెస్టుతో తెలిసినా.. వాటి మూలాలను వెలికితీసే దిశగా చొరవ చూపడం లేదు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే ఇక్కడి లోకల్ ఏజెంట్ల గుట్టు రట్టవుతుంది. ఆశ వర్కర్ స్వరూప, స్వయం సహాయక మహిళా సంఘం లీడర్ అనితతోపాటు ఇతర రాష్ట్ర నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. ముఠాకు సంబంధించిన వివరాలు దొరికే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరిస్తే ముఠా మూలాలు, శిశువుల తల్లులు దొరికే అవకాశం ఉందని పలువురు పేర్కొటున్నారు. -
ఆ రోజు పుట్టే శిశువులకు బంగారు ఉంగరం: డీఎంకే నేత
తిరుత్తణి: ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదినమైన మార్చి1వ తేదీన తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరాన్ని కానుకగా అందజేయనున్నట్లు డీఎంకే జిల్లా కన్వీనర్ భూపతి తెలిపారు. తిరుత్తణిలో ఆదివారం డీఎంకే జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో కన్వీనర్ భూపతి, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి జన్మదినం రోజున భారీగా వేడుకలు నిర్వహించి పేదలకు సహాయకాలు పంపిణీ చేయాలని సూచించారు. మరో ఘటనలో.. కయోజెనిక్ ఇంజిన్ ప్రయోగం విజయవంతం సాక్షి, చెన్నై : తిరునల్వేలి జిల్లా మహేంద్ర గిరి ఇస్రో కేంద్రంలో ఆదివారం క్రయోజెనిక్ ఇంజిన్ ప్రయో గం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గగన్యాన్ ప్రాజెక్టుకు ఇస్త్రో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ. 10 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2023లో అమలు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఉపయోగించే క్రయోజెనియ్ ఇంజిన్ను మహేంద్రగిరిలోని ఇస్రో కేంద్రంలో రూపొందించి పరీక్షిస్తున్నారు. సీఈ –20 పేరిట సిద్ధం చేసిన ఈ ఇంజిన్ను ఇప్పటికే మూడు విడతలుగా పరీక్షించినట్లు వెల్లడించారు. తాజాగా నాలుగో విడతలో 100 సెకన్ల పాటూ ఈ ఇంజిన్ పనితీరును పరిశీలించారు. -
'గుర్తుపెట్టుకోండి నా కూతురు పేరు'.. 2016 టి20 వరల్డ్కప్ హీరో
2016లో భారత గడ్డపై జరిగిన టి20 ప్రపంచకప్ను వెస్టిండీస్ గెలుచుకుంది. ఎవరు ఊహించని రీతిలో ఒకే ఒక్క ఓవర్లో ఆట మొత్తం మారిపోయింది. దానికి కారణం విండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్వైట్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. బెన్స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్లు కొట్టి బ్రాత్వైట్ తన జట్టుకు టి20 ప్రపంచకప్ అందించాడు. అప్పటివరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని బ్రాత్వైట్ పేరు మోర్మోగిపోయింది. ఆ మ్యాచ్లో బ్రాత్వైట్ 10 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు చేశాడు. గుర్తుంచుకోండి నా పేరు కార్లోస్ బ్రాత్వైట్.. అని గర్వంగా చెప్పుకున్నాడు. అంతలా ఇంపాక్ట్ చూపించిన బ్రాత్వైట్ తమ దేశానికి ప్రపంచకప్ అందించిన భారత గడ్డపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో బ్రాత్వైట్ వివరించాడు. చదవండి:అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా! తాజాగా ఈడెన్పై తనకున్న అభిమానానికి గుర్తుగా పుట్టిన బిడ్డకు 'ఈడెన్' వచ్చేలా పేరు పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 6న కార్లోస్ బ్రాత్వైట్ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాగా తన బిడ్డకు ఈడెన్ అని వచ్చేలా పేరు పెట్టినట్లు బ్రాత్వైట్ ఇన్స్టాగ్రామ్లో చెప్పుకొచ్చాడు. '' గుర్తుపెట్టుకోండి నా బిడ్డ పేరు.. ఈడెన్ రోస్ బ్రాత్వైట్. పుట్టిన తేదీ 2/6/22.ఈడెన్ గార్డెన్స్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం. ఇక నా చిట్టితల్లికి ఒక మాట ఇస్తున్నా.. డాడీగా నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా. థాంక్యూ జెస్సీపర్పుల్.. నా జీవితంలోకి నువ్వు రావడం అదృష్టం. కచ్చితంగా ఈడెన్ రోస్ బ్రాత్వైట్కు మంచి తల్లిగా ఉంటావని భావిస్తున్నా. అంటూ పోస్ట్ చేశాడు. ఇక కార్లోస్ బ్రాత్వైట్ ఒక్కడే కాదు.. ఇంతకముందు పలువురు విదేశీ క్రికెటర్లు తమ బిడ్డలకు భారతీయ పేరు వచ్చేలా పెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా జియాన్నే రోడ్స్ అని పేరు పెట్టాడు. భారతదేశం అన్ని మతాలతో కూడిన దేశం. ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, వారసత్వం అంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన అభిమానంతోనే తన కూతురుకు ఇండియా జియన్నే పేరు పెట్టినట్లు రోడ్స్ గతంలో ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా తన కూతురుకు ''తాజ్'' అని పేరు పెట్టాడు. ఇండియాలోని తాజ్మహల్ అంటే ఏబీకి చాలా ఇష్టం. ఇంకో విషయమేంటంటే.. ఏబీ తన గర్ల్ఫ్రెండ్.. ప్రస్తుత భార్యకు తాజ్మహల్ వేదికగానే లవ్ప్రపోజ్ చేశాడు. ఇక భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ తన చిన్న కూతురుకు ''ఇండీ'' అని పేరు పెట్టాడు. చదవండి: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
ఎవరో కని పాడేశారు.. ఆ నవజాత శిశువుని అక్కున చేర్చుకున్న కుక్క!
The baby was rescued from a field in Chhattisgarh: చత్తీస్గఢ్లో ముంగేలి జిల్లాలో లోర్మీ సరిస్టాల్ గ్రామంలోని స్థానికులు ఒక పసికందు కేకలు విని అటుగా వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన నవజాత శిశువు పొలం వద్ద పడి ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు ఒక తల్లి కుక్క తన ఆరు పిల్లలతో ఆ నవజాత శిశువుని రాత్రి అంతా కాపాల కాసి మరీ రక్షించింది. అయితే స్థానికుల్ని నుంచి ఈ సమాచారం అందుకున్న టాస్కఫోర్స్ బృందం ఘటనస్థలికి వచ్చి విచారించారు. (చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది') ఈ మేరకు ఏఎస్ఐ చింతారామ్ బింజ్వార్ శిశువును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు చిన్నారిని ది చైల్డ్ లైన్ ప్రాజెక్ట్కి రిఫర్ చేసి ఆకాంక్ష అని పేరు పెట్టారు. కాగా, నవజాత శిశువు కుటుంబం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన విషయాలతోపాటు ఫోటోలను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ వార్త చదివిన తర్వాత తాను కలత చెందానని, కూతురు, కొడుకు అనే లింగవివక్షను గురించి ఆలోచించి ఉంటే మీరు తల్లిదండ్రులగా ఉండటానికి తగినవారు కాదని ట్విట్టర్లో ఆవేదనగా పేర్కొన్నారు. (చదవండి: గిట్టుబాటు ధర లేక 160 కేజీల ఉల్లిపాయల్ని తగలబెట్టిన రైతు!!) खबर पढ़कर मन व्यथित हो गया. बच्ची को पुलिस ने अस्पताल पहुंचा दिया है, मामले की छानबीन जारी है. यदि आप बेटा-बेटी में भेद-भाव की सोच से ग्रस्त हैं तो आप अभिभावक बनने लायक नहीं हैं. दोषियों को कानून के तहत सख्त सजा मिले. ऐसे पाप रोकें, दकियानूसी सोच त्यागें, बेटा-बेटी एक समान मानें. pic.twitter.com/JDD5tQExSu — Dipanshu Kabra (@ipskabra) December 19, 2021 -
అందరికీ గుర్తుండి పోయేలా.. ‘గులాబ్’ పేరు పెట్టి మురిసిపోయిన తల్లులు
భువనేశ్వర్: గులాబ్ తుపాన్ తీరం దాటుతూ భారీ నష్టంతో పాటు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావాన్ని అంత సులువుగా మర్చిపోలేము కూడా. అందుకే ఇద్దరు మహిళలు ఈ తుపాను ప్రళయ కాలంలో పుట్టిన తమ శిశువులకు గులాబ్ అని పేరు పెట్టుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ విశేషం చోటుచేసుకుంది. కుని రైట్, నందిని సబర్ ఇద్దరు మహిళలు ఆదివారం గులాబ్ తుపాన్ ప్రతాపాన్ని చూపిస్తుండగా వేరువేరు ప్రభుత్వ ఆస్పత్రులలో కుమార్తెలకు జన్మనిచ్చారు. సోరడపల్లి గ్రామానికి చెందిన సబర్ అనే వ్యక్తి సుమండల ఆరోగ్య కేంద్రంలో, అంకులి పంచాయతీకి చెందిన రైట్ పాత్రాపూర్ కమ్యునిటీ ఆస్పత్రిలో చిన్నారులకు జన్మనిచ్చారు. అయితే వారు తమ పిల్లల పేర్లు అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని భావించి గులాబ్ అని పేర్లు పెట్టుకున్నారు. దీనిపై సబర్ మాట్లాడుతూ.. తన బిడ్డ అందరికి గుర్తుండిపోయే రోజున ప్రపంచంలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఈ తుపాను ప్రభావం చూపగా ఆంధ్రాలో తీర ప్రాంతాల్లో అధికంగా చూపింది. కాగా ఈ తుపాన్కు గులాబ్ అనే పేరు పాకిస్తాన్ సూచించింది. గులాబ్ అంటే ఉర్దూలో గులాబీ పువ్వు అని అర్థం. చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా.. -
Kamareddy: పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కన్న కొద్దిసేపటికే బావిలో దూకి..
-
నాలుగు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళా
-
ఎడమచేయి, నడుములో లోపం ఉందని..
బనశంకరి: బస్టాండ్లో పడి ఉన్న గోనె సంచిని ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లగా అందులో నుంచి పసికందు బయట పడింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కోగిళికుళి గ్రామానికి చెందిన మాదేవి వ్యవసాయ కూలీ. రోజూలానే బుధవారం ఉదయం కూలీ పనులకు వెళ్తూ గౌడళ్లి సమీపంలోని ఖాన్నగర బస్టాండుకు వెళ్లగా గోనె సంచి కనిపించింది.ఎవరో మరిచిపోయి ఉంటారని భావించి ఇంటికి తీసుకెళ్లింది. సంచిని పరిశీలించగా రోజుల వయసున్న మగబిడ్డ కనిపించింది. పోలీసులు, శిరసి సహాయట్రస్ట్ అధ్యక్షుడు సతీశ్శెట్టి వచ్చి పరిశీలించి ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం శిశువు జన్మించిందని, బరువు 1.6కిలోలు ఉందని, ఎడమచేయి, నడుములో లోపం ఉందని, ఆరువేళ్లు ఉన్నాయని గుర్తించారు. కార్వార పోలీసులు పసికందు తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. -
శిశువు బతికి ఉండగానే ఖననం చేసేందుకు యత్నించిన దుండగులు
-
బతికుండగానే ‘బలి’చేద్దామనుకున్నారు..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : అది విశాఖ కాన్వెంట్ జంక్షన్లోని హిందూ శ్మశాన వాటిక.. సాయంత్రం వేళలో అక్కడకు ఏపీ31 డీఎఫ్ 0741 నంబర్ గల ఓ కారు చేరుకుంది. అందులోంచి నలుగురు వ్యక్తులు దిగారు. వారి చేతిలో ఓ శిశువు కవర్లో చుట్టి ఉంది. పాప చనిపోయిందని అక్కడి సిబ్బందితో చెప్పారు. ఏ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించాడు శ్మశాన వాటిక ఇన్చార్జి. అందుకు వాళ్లు.. రైల్వే న్యూకాలనీలోని కృష్ణా మెటర్నిటీ నర్సింగ్ హోమ్ నుంచి తెచ్చామంటూ.. ఓ లేఖను ఆయన చేతిలో పెట్టారు. కవర్లో ఉన్న శిశువును శ్మశాన వాటిక సిబ్బందికి అందించారు. శిశువును పూడ్చడం కోసం సిబ్బంది కవర్ను తెరవగా.. ఒక్కసారిగా శిశువు ఏడ్వడం ప్రారంభించింది. ఒక్కసారిగా హతాశులైన సిబ్బంది.. తర్వాత తేరుకుని.. ఆ నలుగురినీ నిలదీశారు. దీంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన శ్మశానవాటిక సిబ్బందిని తీవ్రంగా కలచివేసింది. వెంటనే వారు శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ ఆస్పత్రి సిబ్బంది కూడా వీరితో దురుసుగా ప్రవర్తించారు. బిడ్డను ఆస్పత్రిలో వదిలి బయటికి వెళ్లమంటూ కసురుకోవడంతో బిడ్డను ఆస్పత్రిలో వదిలి బయటికి వచ్చారు. దీనిపై శ్మశాన వాటిక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అసలు శిశువును ఆ ఆస్పత్రి నుంచే తీసుకొచ్చారా? లేక నకిలీ రశీదు సృష్టించారా? ఇంతకీ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? తీసుకొచ్చిన ఆ నలుగురు ఎవరు? తదితర విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఘటనపై శనివారం శ్మశానవాటిక ఇన్చార్జి ప్రసన్నకుమార్ కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచినట్టుగా తనకు సమాచారం తెలిసిందని ‘సాక్షి’తో చెప్పారు. -
ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం?
మీరు 5 ఏళ్ల లోపు చిన్న పిల్లల కోసం ఆధార్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, చిన్న పిల్లల ఆధార్ కోసం మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆధార్ కేంద్రానికి ఒరిజినల్ పత్రాలను తీసుకెళ్లాలి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల బయోమెట్రిక్స్ క్యాప్చర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్(యుఐడీ) అనేది వారి తల్లిదండ్రుల యుఐడీతో లింక్ చేసిన డెమోగ్రాఫిక్ సమాచారం, పిల్లల ముఖ ఛాయాచిత్రం ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. అయితే, ఈ మైనర్లకు 5 ఏళ్ల నుంచి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పది వేళ్లు, ఐరిస్, ఫోటోగ్రాఫ్ వంటి బయోమెట్రిక్ లను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కొరకు తల్లిదండ్రులు బిడ్డతో (5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు) ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ కోసం కింద పేర్కొన్న రెండు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. #AadhaarChildEnrolment To enroll your child for #Aadhaar, you only need the child's birth certificate or the discharge slip from the hospital and the Aadhaar of one of the parents. List of other documents that you can use for the child's enrolment: https://t.co/BeqUA07J2b pic.twitter.com/J1W3AYSVoP — Aadhaar (@UIDAI) July 27, 2021 పిల్లల జనన ధృవీకరణ పత్రం / ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ స్లిప్ / పిల్లల స్కూలు ఐడీ పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ -
పసికందు ఏం నేరం చేసిందని..?
నరసన్నపేట: ఆ లేలేత కళ్లతో తల్లిని చూసిందో లేదో..? ఆ చిట్టి చేతులతో తండ్రిని తాకిందో లేదో..? పుట్టాక చనుబాలైనా తాగిందో లేదో..? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి తుప్పల్లోకి చేరిందో పసిపాప. అప్పుడే పుట్టింది కదా.. అమ్మను విసిగించి ఉండదు. తొమ్మిది నెలలు గర్భంలోనే ఉంది కదా.. నాన్న మనసు కష్టపెట్టే ప్రసక్తే లేదు. అసలు తాను ఆడపిల్లనని కూడా తనకు తెలిసి ఉండదు. మరేం నేరం చేసిందని.. పాపకు ఇంత శిక్ష విధించారు ఆ తల్లిదండ్రులు...? నరసన్నపేట–జలుమూరు మండలాల బోర్డర్ కంబకాయ సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన బుధవారం ఓ పసిపాప తుప్పల్లో స్థానికులకు దొరికింది. వివరాల్లోకి వెళితే.. కంబకాయ రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం స్థానికులు సూర్యనారాయణ, బసివాడకు చెందిన యూత్ స్టార్ సభ్యులు సాయిమణికంఠ, తేజ, కృష్ణలు రన్నింగ్ చేస్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ పసి బిడ్డ ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే అప్పుడే పుట్టిన ఆడ శిశువు రక్త కారుతూ కనిపించింది. వెంటనే వారు బిడ్డను బయటకు తీసి అదే రోడ్డుపై వెళ్తున్న మహిళల సాయంతో సపర్యలు చేశారు. వేకువజామున ఎవరో వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. శిశువుకు సపర్యలు చేశాక వెంటనే ఆటోలో నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. సకాలంలో స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఆ శిశువుకు సపర్యలు చేశారు. సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్ఐ వి.సత్యనారాయణ, చైల్డ్లైన్ ప్రతినిధులు వచ్చి బిడ్డను పరిశీలించారు. ఊపిరి పీల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతుండటంతో మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది బాలరాజు తెలిపారు. -
Karnataka: కిమ్స్లో వింత శిశువు జననం..
సాక్షి, హబ్లీ (కర్ణాటక) : కిమ్స్ ఆస్పత్రిలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కాగా, అరుదైన శిశువు జన్మించింది. ఆదివారం మధ్యాహ్నం పురిటి నొప్పులతో ఓ మహిళ కిమ్స్ ఆస్పత్రిలో చేరింది. సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. అయితే శిశువు విచిత్ర ఆకారంలో ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువుకి నడుము కింద కేవలం ఓ కాలు మాత్రమే ఉంది. మిగతా ఎలాంటి భాగాలు లేవు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన ఆ ప్రాంతంలో వింతగా మారింది. ఆ బాలుడిని చూడటానికి ఆసుపత్రికి చాలా మంది చేరుకుంటున్నారు. అయితే, దీనికి కొన్ని జన్యుపరమైన లోపాల వలన శిశువు ఈ విధంగా జన్మించాడని తెలిపారు. -
కరోనా సోకిన మహిళ పండంటి పాపకు జన్మ
బరంపురం: గంజాం జిల్లా పులసరా బ్లాక్ ప్రాంతానికి చెందిన కోవిడ్ బాధిత గర్భిణి సోమవారం మహిళా సిటీ అసుపత్రిలో ప్రసవించారు. డెడికేటెడ్ కోవిడ్కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఆమె అడశిశువుకు జన్మనిచ్చారు. శిశువుకు పరీక్షలు నిర్వహించిన వైద్యుడు ప్రశాంతకుమార్ మాట్లాడుతూ.. బిడ్డకు కోవిడ్ లక్షణాలేమీ లేవని తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొందమాల్ జిల్లా చకాపదా సమితి పరిధిలో ఓ నిండు గర్భిణి కరోనాతో బాధపడుతూ బ్రాహ్మణపధా ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ అడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడ కూడా తల్లి, బిడ్టా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
కరోనా యాంటీ బాడీస్తో పాప పుట్టింది
ఫ్లొరిడా: కరోనా పేరు తలిస్తేనే గుండె గుభేలుమనే పరిస్థితి. దాన్నుంచి రక్షణకు టీకా వేసుకోవడమే మార్గం. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో, వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కరోనా యాంటీ బాడీస్ తయారవుతాయి. శరీరంలోకి వైరస్ ఎంటరవకుండా పోరాడుతాయి. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని ఫ్లారిడాలో ఓ చిన్నారి కరోనా యాంటీ బాడీస్తోనే పుట్టింది. వైరస్ వచ్చినా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా జన్మించింది. పాప పుట్టాక బొడ్డుతాడు నుంచి తీసిన రక్తంతో పరీక్షలు చేసిన వైద్యులు పాల్ గిల్బర్ట్, చాడ్ రుడ్నిక్ ఈ విషయాన్ని నిర్ధారించారు. చిన్నారి కడుపులో ఉన్నప్పుడే ఆమె తల్లి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుందని, దానివల్ల చిన్నారిలోనూ యాంటీ బాడీస్ ఏర్పడ్డాయని తేల్చారు. అయితే ఈ యాంటీ బాడీస్ ఎంతకాలం ఉంటాయి, వీటి నుంచి ఎంత వరకు రక్షణ ఉంటుం దన్నది పరిశోధకులు తేల్చాల్సి ఉందని వారు చెప్పారు. దానివల్ల గర్భంతో ఉన్న మహిళలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ఏర్పడే పరిస్థితులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. -
బిడ్డకు ఘనాహారం అలవాటు చేస్తున్నారా?
బిడ్డకు 4 నుంచి 6 నెలల వయసప్పటి నుంచి తల్లిపాలతో పాటు ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇలా ఘనాహారం ఇవ్వడాన్ని వీనింగ్ అంటారు. వీనింగ్ మొదలు పెట్టబోతున్న తల్లుల కోసం కొన్ని సూచనలు. ►మెత్తగా వండిన అన్నాన్నీ, పప్పునూ గుజ్జులా కలిపి నేతితో కలిపి పెట్టడం సాధాణంగా ఘనాహారం అలవాటు చేయడానికి మనం చేసే పని. అయితే అరటిపండు కూడా పెట్టవచ్చు. కూరగాయలూ మెత్తగా వండి అన్నంతో గుజ్జులా చేసి కూడా బిడ్డకు పెట్టవచ్చు. వీనింగ్ మొదలుపెట్టే సమయంలో బిడ్డకు ఎంత ఆహారం పెట్టాలన్నది ఒకసారి డాక్టర్ను సంప్రదించి ఇవ్వడం మేలు. ►బిడ్డకు ఇచ్చే ఆహారంలో మెత్తటి అన్నం, ఆకుకూరలు, నెయ్యి, పప్పు, గుడ్డు... లాంటి ఆహార పదార్థాలు గుజ్జులా కలిపి ఇవ్వచ్చు. ►బిడ్డకు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాన్ని పెట్టడం ఎప్పుడూ మంచిది. ►బిడ్డ తినే దాన్ని బట్టి ఒక రోజు పెట్టింది మళ్లీ పెట్టకుండా 15 రోజుల వ్యవధి ఇస్తూ రకరకాల ఆహార పదార్థాలు పెట్టాలి. ఏదైనా ఆహార పదార్థాన్ని బిడ్డ ఇష్టపడకపోతే దాన్ని తాత్కాలికంగా ఇవ్వడం ఆపి... కొద్దిరోజుల తర్వాత మళ్లీ ప్రయత్నించి చూడాలి. ► తినేలా అలవాటు చేయాలి. ►పిల్లలు తినేదానికంటే ఎక్కువ పెట్టద్దు. ►పిల్లలను ఎత్తుకుని అటూ ఇటూ తిప్పుతూ తినిపించకూడదు. -
కూతురును చూసి మురిసిపోతున్న స్టార్ క్రికెటర్
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ బుధవారం తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు. విషయానికి వస్తే.. కేన్ విలియమ్సన్ భార్య సారా రహీమ్ బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా విలియమ్సన్ తన బిడ్డను ఎత్తుకొని ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ' చిట్టితల్లి.. మా జీవితంలోకి.. అలాగే కొత్త ప్రపంచానికి స్వాగతం.. నీ రాక మా జీవితాల్లో కొత్త వెలుగులను నింపింది.. ' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా తండ్రిగా ప్రమోషన్ అందుకున్న కేన్ విలియమ్సన్కు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్తో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి : 'క్షమించండి.. మళ్లీ రిపీట్ కానివ్వను') View this post on Instagram A post shared by Kane Williamson (@kane_s_w) 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కేన్ విలియమ్సన్ కివీస్ తరపున 151 వన్డేల్లో 6,173 పరుగులు.. 81 టెస్టుల్లో 6727 పరుగులు.. 60 టీ20ల్లో 1665 పరుగులు సాధించాడు. కాగా వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ తర్వాత విలియమ్సన్ పెటర్నిటీ లీవ్స్పై భార్య దగ్గరకు వెళ్లాడు. విలియమ్సన్ మొదటి టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో మెరవడమే గాక 251 పరుగులు చేసి కెరీర్లోనే బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. విండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను కివీస్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.(చదవండి : వైరల్ : ఒకరినొకరు తోసుకున్న టీమిండియా ఆటగాళ్లు) -
చిన్నారి వైద్యానికి సోనూసూద్ భరోసా
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి) : సినీనటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్ ద్వారా భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు అద్విత్ శౌర్య (4నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు సిరిసిల్లలో ఓ కొరియర్ సంస్థలో బాయ్గా పనిచేస్తున్నాడు. బాబు తన కుమారుడిని ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. శౌర్యను పరీక్షించిన వైద్యులు.. చికిత్స కోసం రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీనస్థితిలో ఉన్న బాబు తన కుమారుడి వైద్యానికి సాయం అందించాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతడి స్నేహి తులు ట్విట్టర్లో ఆ సమాచారాన్ని పోస్టు చేశారు. దీనిపై సోనూసూద్ స్పందించి అద్విత్ శౌర్య ఆపరేషన్కు అవసరమయ్యే డబ్బులో వీలైనంత మొత్తం భరించేందకు సిద్ధంగా ఉన్నట్లు ట్టిట్టర్ ద్వారా భరోసా ఇచ్చారని బాలుడి తండ్రి తెలిపాడు. ఇన్నోవా ఆస్పత్రిలో చిన్నారికి వైద్యచికిత్స చేయించాలని పేర్కొన్నట్లు తెలిపాడు. ఆపరేషన్ను డాక్టర్ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్ తెలిపినట్టు బాబు చెప్పారు. రూ.లక్షన్నర కోసం తిప్పలు చిన్నారి అద్విత్ చికిత్సకు అవసరమయ్యే రూ.7 లక్షల్లో అధికభాగం సోనూసూద్ ఇవ్వనుండగా ఇంకా రూ.1.5 లక్షలు కావాలని, అంత డబ్బు తమ వద్ద లేదని.. దాతలు ఆదుకుని తన కుమారునికి ప్రాణం పోయాలని బాబు వేడుకుంటున్నాడు. దాతలు 80964 24621 మొబైల్ నంబరును సంప్రదించాలని ఆయన కోరాడు. -
అక్క కోసం చెల్లించింది!
జీడిమెట్ల: అక్కకు నాలుగుసార్లు అబార్షన్ అయి పిల్లలు పుట్టకపోవడంతో ఆమె బాధకు చలించిన ఓ చెల్లి రాష్ట్ర ప్రభుత్వ దత్తత నియమాలు అనుసరించకుండా రూ.22 వేలకు మగ శిశువును కొన్న వ్యవహారం జీడిమెట్ల ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్న ఇద్దరితో పాటు మధ్యవర్తులు ఇద్దరిపై, మగ శిశువును అమ్మిన తల్లిదండ్రులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్లోని 80, 81 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా కాచీపుట్లకు చెందిన దంపతులు మదన్సింగ్, సరిత 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గాజులరామారం బతుకమ్మబండ ప్రాంతంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు (6 ఏళ్లు, 2 నెలలు). అడ్డా కూలి అయిన మదన్సింగ్ మద్యానికి అలవాటుపడ్డాడు. లాక్డౌన్ సమయంలో పని దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అయితే ఇదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉండే మహేష్, యాదమ్మలు వీరి పరిస్థితిని ఎల్లమ్మబండలో ఉంటున్న శేషు అనే మహిళకు వివరించారు. అంతకుముందే శేషు తన అక్క దేవీ పెంచుకునేందుకు ఓ బాబు కావాలని.. ఎవరన్నా ఉంటే చెప్పమని.. వీరికి చెప్పింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలకు కొంత డబ్బు ఇచ్చిన శేషు... మదన్ సింగ్ దంపతులకు కూడా రూ.22 వేలు చెల్లించింది. అలాగే దత్తత తీసుకున్నట్లు బాండ్ పేపర్ రాయించుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో వారికి 2 నెలల బాబును ఇచ్చిన సరిత.. ఆదివారం ఉదయం ఏడుస్తూ ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని అడిగారు. దీంతో ఆమె జరిగిన విషయమంతా చెప్పడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ బాబును తీసుకొని వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటకు శేషు, అరవింద్ (శేషు అన్న కొడుకు) వాహనంలో వెళుతుండగా బోయిన్పల్లి, సికింద్రాబాద్ మధ్యలో జీడిమెట్ల పోలీసులు వెంబండించి పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో తన అక్కకు నాలుగుసార్లు అబార్షన్ అయిందని, పిల్లలు పెంచుకోవాలన్న ఉద్దేశంతో కొనుక్కొని తీసుకెళుతున్నామని చెప్పింది. ఆ తర్వాత మదన్సింగ్, సరితను కూడా జీడిమెట్ల ఠాణాకు తీసుకొచ్చారు. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకున్నారని, ఇందుకు మధ్యవర్తిత్వం వహించారని, అలాగే బాబును అమ్మారని... ఇలా ఆరుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాబును శిశువిహార్కు తరలించారు. అయితే బాబును అమ్మేందుకు మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలు గతంలో ఇలాంటివి ఏమైనా చేశారనే దిశగా విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఇటువంటి ఉదంతాలపై కఠినంగా వ్యవహరించాలని బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతారావు.. బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డిని డిమాండ్ చేశారు. -
‘బాలిక వధూ’ నటుడికి పుత్రోత్సాహం
హిందీ ప్రముఖ సీరియల్ ‘బాలిక వధూ’ నటుడు రుస్లాన్ ముంతాజ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య నిరాలి మెహతా గురువారం(మార్చి 26) మగ బిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని ముంతాజ్ సోషల్ మీడియాలో శుక్రవారం ప్రకటించాడు. తాను తండ్రినయ్యాను అంటూ భావోద్యేగ పోస్టును ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. లాక్డౌన్ : రోడ్డుపై అనుకోని అతిథి ‘అసలైతే అప్పుడే పుట్టిన బిడ్డల ఫొటోలు తీయడం కానీ బయటకు చూపించడం కానీ చేయొద్దంటారు. కానీ నా మనస్సు అత్యుత్సాహంతో ఉంది. అందుకే ఆగలేక నా కొడుకు ఫొటోలను వెంటనే షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను. మా ఇంటికి చోటా బేజీ వచ్చేసాడు. 3,4 నెలల తర్వాత అప్లోడ్ చేయాల్సిన నా బేబీ ఫొటోలను ఇప్పుడే షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం ఎదుర్కొంటున్న గడ్డు సమయంలో ఈ వార్త మీకు కాస్తా ఆనందాన్నిస్తుందని నమ్ముతున్నాను’ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. (లాక్డౌన్: సల్మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా!) అంతేగాక ‘ప్రస్తుతం ప్రపంచం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ లోకంలోకి వచ్చిన పిల్లలు.. ఓ కారణం చేతనే వస్తారన్న విషయాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ నా చిన్న బేబీ కష్టకాలంలో జన్మించిన సూపర్ హీరో. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నా బిడ్డ అందంగా మారుస్తాడని నేను నమ్ముతున్నాను. నాకు, నా తల్లిదండ్రులకు, నా బిడ్డకు ఈ ప్రపంచం మంచి రోజులను ఇస్తుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను’ అంటూ హృదయపూర్వక పోస్టును పంచుకున్నాడు. (లాక్డౌన్లో ఆకలి చావులను ఆపాలంటే....) View this post on Instagram 26-03-2020 : CHOTA BABY HAS ARRIVED 👶 I was going to avoid uploading any of my baby's pictures for atleast 3,4 months but given the current gloom and doom in the world right now I think news of a chota baby will only brighten your day. I genuinely do believe that babies born in times when the world is going through a rough patch come here for a reason. So I'm hoping my chota baby is a super hero born in difficult times and in time will make this world even more beautiful than he already is. I hope and pray the world becomes a better place for us, our parents and our children. A post shared by Ruslaan Mumtaz (@ruslaanmumtaz) on Mar 25, 2020 at 11:47pm PDT -
అప్పుడే పుట్టిన శిశువుకి కరోనా లక్షణాలు
కరోనా వైరస్ పంజా విసురుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలను కూడా వదలడం లేదు. ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్.. తాజాగా పుట్టిన కొన్ని గంటలకే లండన్ నగరంలోని నార్త్ మిడిలెక్స్ ఆస్పత్రిలోని ఓ చిన్నారికి ఈ వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాగా ఆ శిశువు ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన అతిచిన్న వయస్కురాలిగా నమోదైంది. శిశువు తల్లి గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో నార్త్మిడిలెక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిసింది. ప్రసవం జరిగిన వెంటనే శిశువుకు నిర్వహించిన వైద్యపరీక్షలో కరోనావైరస్ ఉన్నట్లు బయటపడింది. ఈ వైరస్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు సోకిందా, లేక పుట్టిన వెంటనే సోకిందా అన్న కోణంలో వైద్యులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరిని వేర్వేరు ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా.. శనివారం నాటికి యూకేలో కరోనా వైరస్ సోకిన కేసుల సంఖ్య 798కి చేరుకోగా, 10 మంది మృతి చెందారు. చదవండి: కరోనా మృతదేహాలను ఏం చేస్తున్నారంటే..! -
పుట్టగానే ఆ బిడ్డ చేసిన పనికి డాక్టర్లే షాక్
సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు ఏడవడం చూస్తుంటాం. పుట్టిన బిడ్డ కళ్లు తెరిచి చూడడానికి కూడా రెండు మూడు గంటలు పడుతుంది. అయితే బ్రెజిల్లోని రియో డీ జెనిరియోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే జన్మించిన శిశువు డాక్టర్ల వైపు కోపంగా చూస్తున్నట్లు ఉండే ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పసిపాపను చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ ఫొటోలపై నెటిజనులు తెగ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. శిశువు ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకొనేందుకు పిల్లలను ఏడిపించడం సర్వ సాధారణం. బొడ్డు తాడు కత్తిరించక ముందే ఆ బిడ్డ ఏడుస్తుందో లేదోనని పరీక్షించారు. చిత్రంగా ఆ బిడ్డ ఏడ్వడానికి బదులు డాక్టర్ల వైపు కోపంగా చూడసాగింది. ఎంతకీ ఏడవకుండా ఉండేసరికి పసిపాప బొడ్డు తాడును కత్తిరించారు. దీంతో ఆ నొప్పికి శిశువు ఏడ్చింది. దీంతో వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ప్రసవానికి ముందే బిడ్డకు ఆమె తల్లిదండ్రులు ఇసాబెలా పెరీరా డి జీసస్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన ఆనంద క్షణాలను చిత్రాల్లో బంధించేందుకు ఇసాబెలా తల్లి డయాన్ డి జీసస్ బార్బోసా స్థానిక ఫొటోగ్రాఫర్ రోడ్రిగో కున్స్ట్మాన్ను ఏర్పాటు చేసుకుంది. అందువల్ల మనకు ఈ అరుదైన చిత్రాలను చూసే అవకాశం కలిగింది. చదవండి: ఎవరైనా నన్ను చంపేయండి!.. -
అంగట్లో చిన్నారులు
అల్వాల్: సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులతోపాటు మారుమూల ప్రాంతాల నిరుపేద కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకొని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. సంతానం కోసం ఆస్పత్రులను వస్తున్న వారిని చూసి కొందరు ముఠాగా ఏర్పడ్డారు. నగరంలోని పేరు మోసిన సంతాన సాఫల్య కేంద్రాలకు అద్దె గర్భాలను అందించే దళారులుగా పని చేస్తూనే శిశువుల అక్రమ రవాణాకు తెర లేపారు. అయితే నవ శిశువులను నేరుగా అమ్మితే లక్షలు సంపాదించ వచ్చనే దుర్భుద్ది వారికి కలిగింది. దీంతో పేద బలహీన వర్గాలను టార్గెట్ చేశారు. పేద మహిళలకు డబ్బు ఆశచూపేవారు. అక్రమ మార్గంలో మహిళలు పిల్లలకు జన్మనిచ్చే స్థాయికి వీరు వ్యాపారం సాగింది. జన్మనిచ్చిన మహిళ కుటుంబాలకు కొంత నగదు ఇచ్చి శిశువును ఇతరులకు లక్షలకు అమ్మడం ప్రారంభమైంది. సాఫల్య కేంద్రాలతో తమకు ఉన్న పరిచయాలతో సంతానం కలగని దంపతులను గుర్తించి వారితో ఒప్పందాలు చేసుకోవడం మొదలు పెట్టారు. 2015 నుంచి ఈ ముఠా మానవ అక్రమ రవాణాను కొనసాగించగా ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. గతనెల 27న అల్వాల్ పైపులైను రోడ్డులో ఇద్దరు మహిళలు పది రోజుల వయస్సున్న శిశువును అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అల్వాల్ పోలీసులకు అందింది. దీంతో బాలానగర్ ఎస్ఓటి, అల్వాల్ పోలీసులు కోట మారుతి శమంతక మణి(41) కుంతి రేణుక(35)లను అదుపులోని తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో డీసీపీ పద్మజ ప్రత్యే బృందాలను రంగంలోకి దించారు. దమ్మాయిగుడాలో నివాసముంటున్న కడప జిల్లావాసి మేముల బాబురెడ్డి(43), కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో నివసిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లావాసి వాకపల్లి గంగాధర్రెడ్డి(33)లు ముఠాకు నాయకులుగా గుర్తించారు. తూర్పు గోదావారి జిల్లా రాజమండ్రి ప్రాంతానికి చెందిన బిక్కవోలు రమేష్(30), గుంటూరు జిల్లా మానసపెట గ్రామానికి చెందిన రాజానాయక్(26), మూసారాంబాగ్కు చెందిన కోట మారుతి శమంతకమణి, యాప్రాల్ బాలాజీనగర్లో నివసించే కాంతి రేణుక, ముషీదాబాద్ గంగపుత్ర కాలనీ నివాపి జలిగామ సునీత(33), రాంనగర్కు చెందిన వనమాల లక్ష్మీ(25)లను తమ ఏజెంట్లుగా ప్రధాన నిందితులు బాబురెడ్డి, గంగాధర్రెడ్డిలు నియమించుకున్నారు. బిడ్డలు లేని దంపతులకు అప్పటికే శిశువులను విక్రయించారు.వీరు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు దళారులుగా వ్యవహరిస్తున్నారు. అమీర్పేట్ రమా ఫెర్టిలిటీ సెంటర్, హబ్సిగూడ పద్మజ ఫెర్టిలిటీ సెంటర్, మారేడ్పల్లిలోని ప్రెటీ–9, కింగ్కోఠి కామినేని ఫెర్టిలిటీ సెంటర్, జీవికే మాల్ సమీపంలోని నేవ ఐవిఎఫ్ సెంటర్, పంజాగుట్ట, సికింద్రాబాద్లోని ఉమెన్స్ ఆసుపత్రి, బేగంపేట్లోని రెయిన్బో ఆసుపత్రిలకు బ్రోకర్లుగా ఉండడం విశేషం. ప్రధాన నిందితుడు బాబురెడ్డిని పోలీసులు గతంలోనే రిమాండ్కు తరలించారు. గంగాధర్రెడ్డిపై పలు స్టేషన్లలలో కేసులు నమోదై ఉన్నాయి.ఈ ముఠా వెనుక ఎవరైన ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ప్లాస్టిక్ కవర్లో చుట్టి...ముళ్లపొదల్లో పసికందు
సాక్షి, హైదరాబాద్ : తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన ఓ చిన్నారి ముళ్ల పొదలపాలైంది. కన్న మమకారం మరిచిన తల్లి అప్పుడే పుట్టిన ముక్కపచ్చలారని తన కూతుర్ని ముళ్లపొదల్లో విసిరేసింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం నిమ్స్ ఆవరణలో బయట పడింది. నిమ్స్ మిలినియం బ్లాక్ వెనుక ప్రహరివద్ద చిన్నపాటి ఏడుపు శబ్ధం వినిపిస్తుంది. దీంతో అవుట్ పోస్ట్ పోలీసులు ఏడుపు వినిపిస్తున్న ప్రాంతానికి వెళ్లి చూడగా, ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్న చంటిపాప కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని నిమ్స్ అత్యవర చికిత్సా విభాగానికి తరలించారు. చికిత్స అనంతరం బిడ్డ సంరక్షణకు శిశువిహార్కు తరలించనున్నట్లు పంజగుట్ట పోలీసులు చెప్పారు. అయితే ఆ బిడ్డను ఎవరు వదిలి వెళ్లారన్న దానిపై సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆడపిల్ల కావడంతోనే ఆ బిడ్డను వదిలి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు స్పందిస్తూ నవజాత శిశువులను రోడ్లపై వదిలేయడం నెలలో ఇది మూడో ఘటన అని అన్నారు. పిల్లలకు బతికే హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఓ పథకం రూపొందించాలని, లేదా ఊయల పథకాన్నిసమర్థవంతంగా నిర్వహించేలా స్త్రీ శిశు సంక్షేమ శాఖను ఆదేశించాలని కోరారు. -
దారుణం: చెత్తకుప్పలో పసికందు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా బంటారంలో దారుణం జరిగింది. చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పసికందును పడేసిన ఘటన మండల కేంద్రంలో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు పసికందును చెత్తకుప్పలో పడేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. పసికందును గుర్తించిన అక్కడి వారు బయటకు తీశారు. చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నవజాత శిశువు గొంతుపై బలంగా కొట్టినట్లు, తీవ్రంగా గాయపరిచినట్లు డాక్టర్లు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
శిశువు ప్రాణం తీశారు
సాక్షి ,బొమ్మలసత్రం(కర్నూలు): నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన శిశువు ప్రాణం తీసింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డ మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చెన్నమ్మకు నెలలు నిండటంతో భర్త దేవదాసు కాన్పు కోసం సోమవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆమెకు పరీక్షలు నిర్వహించి బిడ్డ ఆరోగ్యం బాగుందని రాత్రిలోగా కాన్పు చేస్తామని చెప్పారు. రాత్రంతా చూసినా పురిటి నొప్పులు రాలేదు. ఉదయం కాల కృత్యాలు తీర్చుకునేందుకు చెన్నమ్మ బాత్రూంకు వెళ్లగా అందులో నీరులేదు. దీంతో ఆమె మెట్లు దిగి కింద అవుట్ పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్కు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడే కాన్పు కావడంతో సిబ్బంది తల్లీబిడ్డను కాన్పుల వార్డుకు తరలించారు. అయితే, డ్యూటీలో ఉండాల్సిన వైద్యురాలు ముందుగానే ఇంటికి వెళ్లిపోయింది. దీంతో చికిత్స అందించే వారు ఎవరూ లేక ఉమ్ము నీరు తాగిన పసిబిడ్డ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. వైద్యులే మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని చెన్నమ్మ, దేవదాసు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాన్పు సమయంలో విధులు నిర్వహించాల్సిన వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో చికిత్స అందలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మూడేళ్ల క్రితం చెన్నమ్మ మొదటి కాన్పు కోసం 108లో వస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవమైంది. ఆసుపత్రికి బిడ్డను తీసుకునే వచ్చేలోగా మృతిచెందినట్లు ఆ దంపతులు గుర్తుచేసుకుని బోరున విలపించారు. వైద్యురాలిపై విచారణకు ఆదేశించాం డ్యూటీలో వైద్యురాలు లేక పోవటంతో బిడ్డ మృతి చెందినట్లు అందిన ఫిర్యాదు నేపథ్యంలో డాక్టర్పై విచారణకు ఆదేశించాం. వైద్యురాలు నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –విజయ్కుమార్, సూపరింటెండెంట్ -
డ్రైనేజీలో దొరికిన అప్పుడే పుట్టిన బిడ్డ
-
కోఠి ప్రసూతి ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్
-
ఏ తల్లి కన్న బిడ్డో..
కృష్ణరాజపురం(కర్ణాటక): ఏ తల్లి కన్నబిడ్డో పాపం, వెచ్చగా తల్లి ఒడిలో కేరింతలు కొట్టాల్సిన మగశిశువు అనాథలా రోడ్డు మీద పడి ఉంది. ఆ తల్లిదండ్రులకు ముద్దులొలికే బిడ్డే భారమయ్యాడో ఏమో మరి. ఎక్కడుంది మానవత్వం? అనిపించే అమానుష ఘటన నగరంలో జరిగింది. అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు కే.ఆర్.పురం ప్రభుత్వం ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన ఘటన సోమవారం వెలుగుచూసింది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగశిశువు కే.ఆర్.పురం ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లడంతో వర్షంలో తడుస్తూ ఎలుకలు కొరుకుతుండడంతో శిశువు ఏడుపు విన్న ఆసుపత్రి వాచ్మెన్ జోసెఫ్ శిశువును వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రి పాలక మండలి సభ్యుడు చంద్రశేఖర్, ఆసుపత్రి అధికారి చంద్రశేఖర్లు శిశువును శిశువిహార్ సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. శిశువును రక్షించిన వాచ్మెన్ జోసెఫ్ను అభినందించారు. కాగా శుక్రవారం రాత్రి వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించగా శనివారం సాయంత్రం పోలీసులు ఆసుపత్రికి రావడంపై బుద్ధ భూమి ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కే.ఆర్.పురం ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలంటూ డిమాండ్ చేశారు. -
అయ్యో పాపం!
గుంతకల్లు టౌన్ / అనంతపురం సిటీ: వారిప్పుడే ఈ లోకంలోకి వచ్చారు. భావవ్యక్తీకరణకు భాష తెలియని అమాయకులు. కుటుంబ సభ్యులకు ఏ కష్టమొచ్చిందో గానీ అభం శుభం తెలియని ఆ శిశువులను బయట పడేశారు. ఒక శిశువు సజీవంగా లభ్యమైతే, మరొక శిశువు చనిపోయి ఉంది. అయ్యో పాపం అన్పించే ఈ ఘటనలు సోమవారం అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల వెలుగు చూశాయి. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణ శివారులోని సమ్మర్స్టోరేజీ ట్యాంక్ పంప్హౌస్ ఎదురుగా ఉన్న ముళ్లపొదల్లో నుంచి పసికందు ఏడ్పును అక్కడికెళ్లిన ముగ్గురు బాలురు భరత్, రాజశేఖర్, రాజు విన్నారు. వెళ్లి చూడగా పసికందును ఓ టవల్లో చుట్టి పడేసి ఉండడం కన్పించింది. తలపైభాగంలో చీమలు కరిచి చిన్న గాయాలయ్యాయి. వెంటనే వారు 100కి డయల్ చేశారు. గుంతకల్లు వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఆడశిశువును 1098 చైల్డ్లైన్ సంస్థ మండల కోఆర్డినేటర్ బాలాజీకి అప్పగించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పసికందును పరీక్షించిన చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ హరిప్రసాద్ ఆ పసికందుకు పుట్టుకతోనే మలవిసర్జన ప్రాంతంలో రంధ్రం లేదని, వెంటనే చిన్నపిల్లల సర్జన్తో ఆపరేషన్ చేయించాల్సి ఉంటుందని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. శిశువు బొడ్డుకున్న క్లిప్ను చూస్తే ఎక్కడో హాస్పిటల్లోనే జన్మించినట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం సర్వజనాస్పత్రి గైనిక్ వార్డు సమీపంలోని నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న క్యారీ బ్యాగులో మృత మగశిశువు లభ్యమైంది. ఈ విషయాన్ని రోగుల బంధువులు గమనించి ఔట్పోస్ట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మృత శిశువు లభించిన ప్రాంతంలో గుర్తుతెలియని మహిళకు కాన్పు చేసినట్లు తెలుస్తోంది. -
చెత్తకుప్పలో పసికందు మృతదేహం
కర్నూలు: జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుండీలో పడేసి వెళ్లారు. దీంతో చిన్నారి(ఆడపిల్ల) మృతి చెందింది. జూపాడుబంగ్లా మండలం తర్తురు గ్రామ శివారులోని చెత్తకుప్పలో పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్
అన్ని ఆస్పత్రులు, పీహెచ్సీలలో అమలు చేయాలి: కేంద్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఇకపై పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్ నమోదు తప్పనిసరి కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్సీ) ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. నవజాత శిశువులతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, పాఠశాలల విద్యార్థుల ఆధార్ నమోదుకు అవసరమైన కిట్లను అందుబాటులోకి తేవాలని పేర్కొంది. వాటి కొనుగోలుకు అవసరమైన వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని సూచించింది. రాష్ట్రంలో 100 శాతం ఆధార్ నమోదు లక్ష్య సాధనకు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ఐటీ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 2017 మార్చి వరకు రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్ణీత గడువులోగా 100 శాతం ఆధార్ నమోదుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆధార్ నమోదు ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదని... ముఖ్యంగా 0-5 ఏళ్లలోపు పిల్లల ఆధార్ నమోదు జరగడం లేదని కేంద్రం పేర్కొంది. మరోవైపు 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రి క్ వివరాలను కచ్చితంగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేసేందుకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆధార్ యాక్టు-2016 నోటిఫికేషన్ను ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో దేశంలో 100 శాతం ఆధార్ అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, పౌర సేవలన్నింటినీ ఆధార్కు అనుసంధానించేందుకు చర్యలు చేపట్టింది. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన ప్రతి బిడ్డ ఆధార్ నమోదుకు పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో 25 ఆస్పత్రుల్లో ఆధార్ నమోదుకు ప్రణాళికలు రూపొందించింది. -
స్వైన్ ఫ్లూతో అప్పుడే పుట్టిన శిశువు మృతి
గ్వాలియర్: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్వైన్ ఫ్లూ సోకి అప్పుడే పుట్టిన శిశువుతో పాటు, మరో వ్యక్తి మృతి చెందారు. స్థానిక కమలరాజా ప్రభుత్వాసుపత్రిలో సోమవారం జన్మించిన శిశువు తెల్లవారు జామున 4 గంటల సమయంలో స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందింది. ఈ విషయాన్ని వైద్య ఉన్నతాధికారి డాక్టర్ అనూప్ కామనాథ్ ధృవీకరించారు. దీంతో పాప తల్లి సుమన్ ను ఆస్పత్రిలోని ప్రత్యేక గదికి మార్చి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామాలతో వైద్య బృందాన్ని న్యూసంజయ్ నగర్ ప్రాంతానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.