centuries
-
చంద్రునిపై ఆవలి వైపూ... అగ్నిపర్వతాలు!
న్యూయార్క్: చందమామ ఆవలి వైపు కూడా కొన్ని వందల ఏళ్ల కింద భారీ అగ్నిప ర్వతా లకు నిలయమేనని సైంటిస్టులు తాజాగా తేల్చారు. చంద్రుని ఆవలివైపు నుంచి చైనాకు చెందిన చాంగ్ ఈ–6 వ్యోమనౌక తొలిసారిగా తీసుకొచ్చిన రాళ్లు, మట్టి, ధూళి నమూ నాలను క్షుణ్నంగా పరీక్షించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘‘వాటిలో అగ్నిపర్వతపు రాళ్ల తాలూకు గుర్తులున్నాయి. అవి దాదాపు 280 కోట్ల కిందివని తేలింది. ఒకటైతే ఇంకా పురాత నమైనది. అది ఏకంగా 420 కోట్ల ఏళ్లనాటిది’’ అని వారు వివరించారు. ఆవలి వైపున అగ్నిపర్వతాల పేలుళ్లు కనీసం వంద కోట్ల ఏళ్ల పాటు కొనసాగినట్టు నిర్ధారణ అవుతోందని అధ్యయన సహ సారథి, చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ నిపుణుడు క్యూలీ లీ చెప్పారు.ఇప్పటికీ మిస్టరీయే...చంద్రునిపై మనకు కనిపించే వైపు అగ్ని పర్వతాల ఉనికి ఎప్పుడో నిర్ధారణ అయింది. అయితే ఆవలి వైపు మాత్రం సైంటిస్టులకు ఎప్పుడూ పెద్ద మిస్టరీగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా నమూనాలు అందించిన సమాచారం అమూల్యమైనదని విశ్లేషణ లోపాలుపంచుకున్న అరిజోనా యూని వర్సిటీకి చెందిన ప్లానెటరీ వాల్కెనో నిపుణు డు క్రిస్టోఫర్ హామిల్టన్ అన్నారు. -
పదిహేడేళ్ల వయసులో తొలి శతకం.. సచిన్కు సాటెవ్వరు!
పదిహేడేళ్ల వయసులో.. సరిగ్గా ఇదే రోజు ఓ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి శతకం నమోదు చేశాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. తన అసాధారణ ప్రతిభతో వాటన్నింటిని దాటుకుని.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచంలో ఏ క్రికెటర్కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతడే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.టీమిండియా తరఫున 1989లో పాకిస్తాన్తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్.. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, మొదటి 15 మ్యాచ్లలో ఒక్క శతకం కూడా సాధించలేకపోయిన ఈ ముంబై బ్యాటర్.. 1990లో ఇంగ్లండ్ గడ్డ మీద తన సెంచరీల ప్రయాణానికి నాంది పలికాడు.మాంచెస్టర్లో సెంచరీల ప్రయాణానికి నాందిమాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో సచిన్ శతకంతో మెరిశాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 189 బంతులు ఎదుర్కొని 119 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. భారత్ మ్యాచ్ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితం ఎలా ఉన్నా సచిన్ కెరీర్లో ఈ మ్యాచ్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.వందో సెంచరీ అక్కడేనాడు ఇంగ్లండ్ మీద తొలి సెంచరీ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆసియా 2012 వన్డే కప్ సందర్భంగా బంగ్లాదేశ్ మీద మీర్పూర్ వేదికగా వందో శతకం బాదాడు. మొత్తంగా టీమిండియా తరఫున 200 టెస్టులు ఆడిన సచిన్ టెండుల్కర్.. 51 శతకాలు, 68 అర్ధ శతకాల సాయంతో 15921 పరుగులు సాధించాడు.ఎవరికీ అందనంత ఎత్తులోఅదే విధంగా.. 463 వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేసి 18426 పరుగులు స్కోరు చేశాడు. ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడిన సచిన్ ఖాతాలో 10 పరుగులు ఉన్నాయి. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 664 మ్యాచ్లు ఆడి 34,357 పరుగులు స్కోరు చేసి.. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. వంద శతకాలు ఖాతాలో ఉన్నా మొదటి సెంచరీ మాత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకమే కదా!! -
ఆ విజయానికి అయిదు శతాబ్దాలు..
దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం ఒరిస్సా నుంచి ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి. అతడు రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు.ఉదయగిరిపై కొండవీటి రెడ్డిరాజులు, మహమ్మదీయ రాజులూ ఒక కన్నేసి ఉంచారు. కానీ బలమైన గజపతులతో తలపడలేక అదను కోసం ఎదురు చూశారు. ఇదే సమయంలో విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. గుత్తి, గండికోట మీదుగా తన సేనతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు.రాయలు తన చతురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం వశం కాకపోవడంతో అసహనంతో ఊగిపోయాడు. చివరికి ఒక రోజు సైనికులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ... దుర్గాధిపతి తలను రేపటి కల్లా కాలితో తంతానని శపథం చేశాడు. యుద్ధాన్ని ఉద్ధృతపర్చి సైనికులను ఉత్సాహపరిచాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి సైనికులను కోట గోడల మీదికి ఎగబాకించాడు. దీనితో గజపతి సైనికులు హహాకారాలు చేస్తూ శరణు వేడారు. అలా అతి కష్టం మీద దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు. శరణు కోరిన అందరినీ రక్షించాడు.దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. అన్నట్లుగానే రాయలు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు. రాహుత్త రాయలను బంధించాడు. 1514 జూన్ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు. ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది.ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విలువైన ఆభరణాలు సమర్పించాడు. తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామి వారి పేరిట ధర్మంగా ఇచ్చాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. – ఈతకోట సుబ్బారావు, 94405 29785 (శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు) -
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2024
ఐపీఎల్ 2024 సీజన్ సెంచరీల విషయంలో ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 14 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. 2023 సీజన్లో నమోదైన 12 సెంచరీల రికార్డును ఈ సీజన్ బద్దలు కొట్టింది. ఈ సీజన్లో వివిధ ఫ్రాంచైజీలకు చెందిన 13 మంది ప్లేయర్లు శతక్కొట్టారు. వీరిలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రెండుసార్లు సెంచరీ మార్కును తాకాడు. సీజన్ తొలి సెంచరీని లక్నో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124*) నమోదు చేయగా.. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113*), సునీల్ నరైన్ (56 బంతుల్లో 109), రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108*), జానీ బెయిర్స్టో (48 బంతుల్లో 108*), జోస్ బట్లర్ (60 బంతుల్లో 107*), రోహిత్ శర్మ (63 బంతుల్లో 105*), యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104*), శుభ్మన్ గిల్ (55 బంతుల్లో 104), సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103), సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102*), ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102), జోస్ బట్లర్ (58 బంతుల్లో 100*), విల్ జాక్స్ (41 బంతుల్లో 100*) వరుసగా సెంచరీలు చేశారు. ఈ సీజన్ వేగవంతమైన సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, విల్ జాక్స్ పేరిట సంయుక్తంగా నమోదై ఉంది. హెడ్ ఆర్సీబీపై.. జాక్స్ గుజరాత్పై 41 బంతుల్లో శతక్కొట్టారు.సీజన్ల వారీగా సెంచరీలు..2024- 14 సెంచరీలు2023- 12 సెంచరీలు2022- 8 సెంచరీలు2021- 4 సెంచరీలు2020- 5 సెంచరీలు2019- 6 సెంచరీలు2018- 5 సెంచరీలు2017- 5 సెంచరీలు2016- 7 సెంచరీలు2015- 4 సెంచరీలు2014- 3 సెంచరీలు2013- 4 సెంచరీలు2012- 6 సెంచరీలు2011- 6 సెంచరీలు2010- 4 సెంచరీలు2009- 2 సెంచరీలు2008- 6 సెంచరీలుఓవరాల్గా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 101 సెంచరీలు నమోదయ్యాయి. -
MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓటమితో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్రేట్ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
నితేశ్, ప్రజ్ఞయ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: మేఘాలయ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐదు రోజుల ఈ తుది పోరులో రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 25/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు 87.5 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. నితేశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్స్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఏడో వికెట్కు 131 పరుగులు జోడించారు. నితేశ్ అవుటయ్యాక ప్రజ్ఞయ్ అజేయంగా నిలిచి హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 46 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయ ఆట ముగిసే సమయానికి ఖాతా తెరవకుండా ఒక వికెట్ కోల్పోయింది. -
INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్కప్లో తమ్ముడి సెంచరీలు
What A day for Sarfaraz Khan and Musheer Khan: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ 2024లో భారత యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అదరగొట్టాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో ఆద్యంతం దూకుడుగా ఆడి సెంచరీతో చెలరేగాడు.మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న 18 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. ముషీర్ ఖాన్కు తోడు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ గురువారం ఐర్లాండ్తో తలపడుతోంది. ముషీర్ దుమ్ములేపాడు.. సహారన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఇందులో భాగంగా.. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(17), అర్షిన్ కులకర్ణి(32) వికెట్లు కోల్పోయింది. అయితే, వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం పట్టుదలగా నిలబడి.. కెప్టెన్ ఉదయ్ సహారన్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన తెలుగు క్రికెటర్ అరవెల్లి అవినాశ్ రావు 22, సచిన్ దాస్ 21(నాటౌట్) పర్వాలేదనిపించారు. టెయిలెండర్లు ప్రియాన్షు మొలియా(2), మురుగన్ అభిషేక్(0) పూర్తిగా విఫలమయ్యారు. అటు అన్న.. ఇటు తమ్ముడు ఇరగదీశారు ఇదిలా ఉంటే.. ముషీర్ ఖాన్.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు స్వయానా తమ్ముడు. ఇంగ్లండ్ లయన్స్తో భారత్-ఏ అనధికారిక టెస్టులో భాగంగా గురువారం సర్ఫరాజ్ సెంచరీతో దుమ్ములేపాడు. 160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్లు బాది 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇదే రోజు ముషీర్ ఖాన్ ఐర్లాండ్తో వన్డేలో శతకంతో చెలరేగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అన్నాదముళ్లను క్రికెట్ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘అన్న అలా.. ఇంగ్లండ్ లయన్స్ మీద 161... తమ్ముడేమో ఇలా ఐర్లాండ్ మీద 118.. ఈరోజు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లదే’’ అంటూ అన్నాదముళ్లను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’ -
CWC 2023: ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్ పాజీ.. కష్టంగా ఉంది: కోహ్లి
ICC WC 2023- Ind vs NZ- Virat Kohli 50th ODI Century: ‘‘కోల్కతాలో కూడా చెప్పాను కదా!.. ఓ గొప్ప వ్యక్తి నన్ను అభినందించారు. ఇప్పుడు కూడా ఇదంతా ఓ కలలానే ఉంది. నిజానికి కల నిజమైనట్లు ఉంది. ఏంటో నాకే కొత్తగా ఉంది. ఈరోజు కూడా కీలక మ్యాచ్.. ఇందులో నా వంతుగా ఏం చేయాలో అది చేశాను. సింగిల్స్, డబుల్స్.. ఏదైనా జట్టు కోసమే నా సహచర ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అన్నీ అనుకూలించి ఈరోజు మేము భారీ స్కోరు చేయగలిగాం. జట్టును గెలిపించాలన్నదే నా అంతిమ లక్ష్యం. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. సింగిల్స్, డబుల్స్.. బౌండరీలు.. ఏదైనా జట్టు నా నుంచి ఆశిస్తున్న ప్రదర్శనకు అనుగుణంగానే ఆడతాను. నా శక్తిసామర్థ్యాల మేరకు అత్యుత్తమ ఆట తీరుతో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా. క్రీజులో కుదురుకున్న తర్వాత బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ఉంటా. ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్ పాజీ ఇక ఈరోజు నా సెలబ్రేషన్స్ గురించి చెప్పాలంటే.. అనుష్క, సచిన్ పాజీ ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఈ ఫీలింగ్ను ఎలా వర్ణించాలో కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ నేను ఓ పరిపూర్ణ ఛాయాచిత్రం గీయాలనుకుంటే.. బహుశా అది ఇదేనేమో! నేను అత్యంత ప్రేమించే వ్యక్తి.. నా జీవిత భాగస్వామి అనుష్క.. నా హీరో సచిన్ టెండుల్కర్.. వీళ్లిద్దరి ముందు నేను వన్డేల్లో 50వ శతకం సాధించగలగడం.. అది కూడా చారిత్రాత్మక వాంఖడేలో.. ఇంతకంటే అత్యద్భుతం ఏముంటుంది?! అందరూ బాగా ఆడినందు వల్లే ఈరోజు మేము నాకౌట్ మ్యాచ్లో 400 పరుగుల స్కోరుకు చేరువగా వచ్చాం. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.. షాట్లు బాదాడు.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక టాప్లో శుబ్మన్, రోహిత్ అద్భుతం చేశారు. కేఎల్ రాహుల్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. ప్రతి ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు’’- వన్డేల్లో 50 సెంచరీల వీరుడు, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాగా వన్డే వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్తో తలపడుతోంది. ముంబైలోని వాంఖడేలో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్లో ఓపెనర్లు రోహిత్ శర్మ(47), శుబ్మన్ గిల్(80- నాటౌట్).. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డు సెంచరీతో మెరిశాడు. సచిన్ రికార్డు బద్దలు ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ గండాన్ని దాటి 117 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా 80వ శతకం సాధించాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 50వ సెంచరీ. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఫైనల్కు చేరువయ్యేందుకు మరోవైపు.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సైతం శతకం(105) బాదాడు. ఐదో నంబర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రోహిత్ సేన 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. తన రికార్డు సెంచరీ సమయంలో కలిగిన భావోద్వేగాలు, జట్టు భారీ స్కోరు సాధించిన విధానం గురించి చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమిది
వన్డే ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ వేదికగా విరాట్ కోహ్లి సాధించిన అర్థ శతక సెంచరీ ఫీట్పై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. క్రీడా అభిమానులతో పాటు క్రీడాయేతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కోహ్లికు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడి ఘనత అందుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి అభినందనలు తెలుపుతూ ఓ సందేశం ఉంచారు. ఇవాళ కోహ్లి 50వ శతకం సాధించడమే కాదు.. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్టతను, పట్టుదల స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడు. ఈ అద్భుతమైన మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. కోహ్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్ తరాలకు బెంచ్మార్క్ నెలకొల్పడం కొనసాగిస్తూనే ఉంటాడు.. Today, @imVkohli has not just scored his 50th ODI century but has also exemplified the spirit of excellence and perseverance that defines the best of sportsmanship. This remarkable milestone is a testament to his enduring dedication and exceptional talent. I extend heartfelt… pic.twitter.com/MZKuQsjgsR — Narendra Modi (@narendramodi) November 15, 2023 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోహ్లిని ఎక్స్ వేదికగా అభినందించారు. వెల్డన్ కింగ్కోహ్లీ. హాఫ్ సెంచరీ శతకాలు అనే అద్భుతమైన ఫీట్.. అదీ వరల్డ్కప్ సెమీఫైనల్లో. టేక్ ఏ బో అంటూ ట్వీట్ చేశారు. Supremely Well done King Kohli @imVkohli 🎉 on Half-century of Centuries 👏 What an amazing feat to achieve and that too in the semi final of the World Cup Take a Bow 🙏 #ViratKohli𓃵 — KTR (@KTRBRS) November 15, 2023 తన సెంచరీల ఫీట్ను అధిగమించడంపై కోహ్లిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా అభినందించగా.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆ ట్వీట్ను రీపోస్ట్ చేసి మరీ కోహ్లిని అభినందించారు. ఒక దిగ్గజం నుంచి స్నేహపూర్వక సందేశం.. నిజంగా అభినందనీయం. మీ ఇద్దరినీ చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ కోహ్లి, సచిన్ను ఉద్దేశించి పోస్ట్ చేశారాయన. ఆప్ జాతీయకన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ సెమీఫైనల్లో చారిత్రక మైలురాయిని అధిగమించిన విరాట్ కోహ్లికి శుభాకాంక్షలు. ఒక నిజమైన దిగ్గజమే రికార్డులను తిరగరాస్తారు. భావితరాలలో స్ఫూర్తిని నింపుతారు అంటూ సందేశం ఉంచారు. Congratulations to Virat Kohli on achieving a historic milestone with his 50th ODI century against New Zealand in the World Cup semifinal. A true legend rewriting records. Keep on inspiring the generations to come. pic.twitter.com/tLaKWv7fNq — Arvind Kejriwal (@ArvindKejriwal) November 15, 2023 -
Virat Kohli: కోహ్లి సాధించేశాడు.. సచిన్ సెంచరీల రికార్డు బద్దలు
క్రీజులో కుదురుకునేంత వరకు నెమ్మదిగా... పిచ్ స్వభావాన్ని, అవసరాన్ని బట్టి మధ్య ఓవర్లలో దూకుడుగా.. ఆఖరి వరకు ఉంటే ఆకాశమే హద్దుగా.. వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ స్టైల్ ఇది. టెస్టు, టీ20 ఫార్మాట్ల కంటే 50 ఓవర్ల క్రికెట్లో మిగతా మేటి బ్యాటర్లందరికంటే కోహ్లిని ప్రత్యేకంగా నిలిపింది ఈ లక్షణమే! ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఒకలా.. ఛేజింగ్లో అయితే మరోలా.. మ్యాచ్ సాగుతున్న కొద్దీ తన లెక్కలు మారిపోతూ ఉంటాయి. కానీ తానేం చేయాలి, తన ప్రణాళికలు ఎలా అమలు పరచాలన్న వ్యూహాల్లో మాత్రం స్పష్టత అలాగే ఉంటుంది. మిగతా బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల దాహం తీర్చుకుంటే.. కోహ్లికి మాత్రం లక్ష్య ఛేదనలోనే మరింత ఊపొస్తుంది. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ తనలోని బ్యాటర్ మరింత దూకుడుగా మారిపోతాడు. ఇంకా.. ఇంకా మెరుగ్గా ఆడాలనే కసితో ముందుకు సాగుతాడు. అందుకే ఛేజింగ్లో కింగ్గా మారాడు కోహ్లి. ఇప్పటి వరకు లక్ష్య ఛేదనలో భాగంగా 27 శతకాలు బాదిన ఈ రన్మెషీన్.. తాజాగా ప్రపంచకప్-2023 సెమీ ఫైనల్లో 100 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్లో తన సెంచరీల సంఖ్యను 23కు పెంచుకున్నాడు. అయితే, ఈ సెంచరీ అట్లాంటి ఇట్లాంటి సెంచరీ కాదు.. క్రికెట్ ప్రపంచంలో ఉన్న ఏకైక సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టిన సెంచరీ!! అవును కోహ్లి సాధించేశాడు.. సెల్యూట్ కింగ్ కోహ్లి!! కేవలం నీ ఆటకే కాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నీ తత్వానికి!! చప్పట్లతో నిన్ను అభినందించిన ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండుల్కర్కు సలాం చేస్తూ మరోసారి నీ ప్రత్యేకతను చాటుకున్నందుకు!! టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఓవరాల్గా 50వ శతకం సాధించాడు. తద్వారా టీమిండియా లెజెండ్ సచిన్ టెండుల్కర్ సెంచరీ(49)ల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచకప్-2023లో భాగంగా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతకు ముందు.. వన్డే వరల్డ్కప్ ఎడిషన్లలో సెమీస్లో మొత్తంగా కేవలం 11 పరుగులు(9, 1, 1) చేసిన కోహ్లి.. ఈసారి ఏకంగా 117 రన్స్ కొట్టేశాడు. సెమీ ఫైనల్ గండాన్ని దాటేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. అత్యధిక వన్డే సెంచరీలు: ►50 - విరాట్ కోహ్లి ►49 - సచిన్ టెండూల్కర్ ►31 - రోహిత్ శర్మ ►30 - రికీ పాంటింగ్ ►28 - సనత్ జయసూర్య View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
విరాట్ కోహ్లి= సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవాలంటే మళ్లీ సచినే దిగి రావాలి... మాస్టర్ బ్యాటర్ ఘనతల గురించి ఒకప్పుడు వినిపించిన వ్యాఖ్యల్లో ఇదొకటి. సచిన్ రికార్డుల స్థాయి, అతను అందుకున్న అసాధారణ మైలురాళ్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమనే భావన ఇందులో కనిపించింది... కానీ వాటిలో ఒక అరుదైన రికార్డును విరాట్ కోహ్లి ఇప్పుడు అందుకున్నాడు... తనకే సాధ్యమైన అద్భుత ఆటతో వన్డే క్రికెట్కు ముఖచిత్రంగా మారిన కోహ్లి 49వ సెంచరీని సాధించడం అనూహ్యమేమీ కాదు... ప్రపంచకప్కు ముందు 47 వద్ద నిలిచిన అతను మెగా టోర్నీలో కనీసం రెండు సెంచరీలు సాధించగలడని అందరూ నమ్మారు... బంగ్లాదేశ్పై సెంచరీ తర్వాత మరో రెండుసార్లు చేరువగా వచ్చీ శతకానికి దూరమైన అతను ఈసారి విజయవంతంగా ఫినిషింగ్ లైన్ను దాటాడు. విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు... అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు... కోహ్లి శతకం అందుకున్న క్షణాన కామెంటేటర్ అన్న ఈ మాట అక్షరసత్యం. ప్రపంచకప్ మ్యాచ్లో తన 35వ పుట్టిన రోజున సచిన్ సెంచరీల సరసన నిలవడంవంటి అద్భుత స్క్రిప్ట్ నిజంగా కోహ్లికే సాధ్యమైంది. ప్రపంచకప్ గెలిచిన క్షణంలో సచిన్ను భుజాల మీదకు ఎత్తుకున్న కోహ్లి... పుష్కరం తర్వాత భుజం భుజం కలుపుతూ అతని సరసన సమానంగా నిలిచాడు. సాక్షి క్రీడా విభాగం : వన్డే క్రికెట్ను విరాట్ కోహ్లి చదువుకున్నంత గొప్పగా మరెవరి వల్లా సాధ్యం కాలేదేమో! ఇన్నింగ్స్ను ఎలా ప్రారంభించాలి, మధ్య ఓవర్లలో ఎలాంటి ఆట ఆడాలి, చివర్లో ఎంతగా దూకుడు జోడించాలి... సరిగ్గా తాసులో కొలిచి లెక్కించినట్లుగా అతను ఈ ఫార్మాట్లో తన ఆటను ప్రదర్శించాడు. రుచికరమైన వంటకం కోసం వేర్వేరు దినుసులను సరిగ్గా ఎలా కలపాలో బాగా తెలిసిన షెఫ్ తరహాలో వన్డేల్లో విజయం కోసం ఎలాంటి మేళవింపు ఉండాలో అతను ఆడి చూపించాడు. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా...లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా తన వ్యూహంపై ఉండే స్పష్టత కోహ్లిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగా ఉండే లక్ష్య ఛేదనలో గొప్ప గొప్ప ఆటగాళ్ల రికార్డులు కూడా పేలవంగా ఉంటాయి. కానీ కోహ్లికి మాత్రం పరుగుల వేటలోనే అసలు మజా. ఎంత లక్ష్యాన్నైనా అందుకోవడంలో తనను మించిన మొనగాడు లేడన్నట్లుగా అతని బ్యాటింగ్ సాగింది. తొలి ఇన్నింగ్స్లతో (51.15 సగటు, 22 సెంచరీలు) పోలిస్తే ఛేదనలో కోహ్లి రికార్డు (65.49 సగటు, 27 సెంచరీలు) ఘనంగా ఉందంటే అతని ఆట ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ 27లో 23 సార్లు భారత్ విజయం సాధించడం విశేషం. తన బ్యాటింగ్పై అపరిమిత నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం కోహ్లిని ‘ది బెస్ట్’గా తీర్చిదిద్దగా... అసాధారణ ఫిట్నెస్, విశ్రాంతి లేకుండా సుదీర్ఘ సమయం పాటు సాగే కఠోర సాధన అతడి ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కోల్కతాలో శతకంతో మొదలై... ఆగస్టు 18, 2008... కోహ్లి తొలి వన్డే మ్యాచ్ ఆడిన రోజు. కొద్ది రోజుల క్రితమే భారత్కు అండర్–19 ప్రపంచకప్ అందించిన కెపె్టన్గా కోహ్లికి గుర్తింపు ఉండగా... సచిన్, సెహ్వాగ్లు విశ్రాంతి తీసుకోవడంతో శ్రీలంకతో వన్డే సిరీస్లో అతనికి తొలి అవకాశం దక్కింది. ఐదింటిలో ఒక మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసినా సీనియర్ల రాకతో తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత దేశవాళీలో, ఆ్రస్టేలియా గడ్డపై ఎమర్జింగ్ టోర్నీలో భారీ స్కోర్లతో చెలరేగిన తనను మళ్లీ ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. దాంతో ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం దక్కింది. మూడు అర్ధసెంచరీల తర్వాత తన 14వ వన్డేలో శ్రీలంకపై 114 బంతుల్లో చేసిన 107 పరుగుల ఇన్నింగ్స్తో అతని ఖాతాలో తొలి సెంచరీ చేరింది. ఈ సెంచరీ కోల్కతాలోనే ఈడెన్ గార్డెన్స్లో నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత మరో మూడు వన్డేలకే మళ్లీ సెంచరీ నమోదు చేసిన కోహ్లికి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వన్డే టీమ్లో అతను పూర్తి స్థాయిలో రెగ్యులర్ మెంబర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో సెహ్వాగ్తో పాటు కోహ్లి కూడా సెంచరీ సాధించాడు. అయితే ఫైనల్లో అతని ఇన్నింగ్స్ (35 పరుగులు) కూడా ఎంతో విలువైంది. 31 పరుగులకే సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత గంభీర్తో మూడో వికెట్కు జోడించిన కీలకమైన 83 పరుగులు చివరకు విజయానికి బాట వేశాయి. ఒకదాన్ని మించి మరొకటి... విరాట్ కెరీర్లో అప్పటికే ఎనిమిది సెంచరీలు వచ్చి చేరాయి. జట్టులో స్థానానికి ఢోకా లేకపోగా, జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పరుగు జత చేస్తూ ఇన్నింగ్స్ నిరి్మంచే ‘క్లాసిక్’ ఆటగాడిగా కోహ్లికి అప్పటికి గుర్తింపు వచ్చింది. కానీ అతనిలోని అసలైన దూకుడుకు హోబర్ట్ మైదానం వేదికైంది. శ్రీలంకతో మ్యాచ్లో 40 ఓవర్లలో 321 పరుగులు ఛేదిస్తేనే టోర్నీలో నిలిచే అవకాశం ఉన్న సమయంలో కోహ్లి నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్స్లతో అజేయంగా 133 పరుగులు చేయడంతో 37వ ఓవర్లోనే భారత్ లక్ష్యాన్ని చేరింది. పరిస్థితిని బట్టి కోహ్లి తన ఆటను ఎలా మార్చుకోగలడో ఈ ఇన్నింగ్స్ చూపించగా, తర్వాతి రోజుల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఆసియా కప్లో పాకిస్తాన్పై చేసిన అత్యధిక స్కోరు 183, కేప్టౌన్లో దక్షిణాఫ్రికాపై 160 నాటౌట్, నేపియర్లో కివీస్పై 123, పుణేలో ఇంగ్లండ్పై 123, మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై 117... ఏది గొప్పదంటే ఏమి చెప్పాలి? జైపూర్లో ఆ్రస్టేలియాపై 52 బంతుల్లోనే చేసిన శతకం ఇప్పటికీ భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదై ఉంది. అతని ఒక్కో వన్డే ఇన్నింగ్స్కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ శతకాలు అభిమానులకు పంచిన ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! -
అన్ని ఫార్మాట్ల ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో తొలి సెంచరీలు చేసింది ఎవరు..?
నిన్న (జూన్ 7) ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా ట్రవిస్ హెడ్ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ ఆసీస్ ఆటగాడు డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ ఫార్మాట్లో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా హెడ్ రికార్డుల్లోకెక్కిన అనంతరం వివిధ ఫార్మాట్ల ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్లో ఎవరు శతక్కొట్టారనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్స్లో ఎవరు తొలి సెంచరీ చేశారని ఆరా తీయగా.. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో తొలి సెంచరీ క్లైవ్ లాయిడ్ (1975 వరల్డ్కప్, వెస్టిండీస్), ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తొలి సెంచరీ ఫిలో వాలెస్ (1998, వెస్టిండీస్) పేరిట నమోదై ఉన్నాయి. టీ20 ఫార్మాట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో జరిగే ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో ఇప్పటివరకు ఎవరూ సెంచరీ సాధించలేదు. టీ20 వరల్డ్కప్లో 11 సెంచరీలు నమోదైనప్పటికీ అన్నీ వివిధ దశల్లో వచ్చినవే. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా నిన్న మొదలైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. ట్రావిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) సత్తా చాటడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. వార్నర్ (43), ఉస్మాన్ ఖ్వాజా (0), మార్నస్ లబూషేన్ (26) ఔటయ్యారు. షమీ, సిరాజ్, శార్దూల్కు తలో వికెట్ దక్కింది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపెవరిది..? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ను ఆశ్రయించిన ఆసీస్ -
ముందే అనుకున్నారా.. కలిసే సెంచరీలు కొడుతున్నారు!
విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్.. ఇద్దరిలో ఒకరు ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకొని క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుంటే.. మరొకరు యంగ్ ప్లేయర్గా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆటలో ఎవరికి వారే సాటి. గిల్ కోహ్లి కంటే చాలా సీనియర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే కోహ్లి ఆటను చూస్తూ గిల్ పెరిగాడు. అలాంటిది ఈ ఇద్దరు ఇప్పుడు టీమిండియా తరపున కీలక బ్యాటర్లుగా ఎదిగారు. మరో విశేషమేమిటంటే ఈ ఇద్దరు కలిసి ఈ ఏడాది మూడు వేర్వరు మ్యాచ్ల్లో ఒకేసారి సెంచరీలతో మెరిశారు. అందులో రెండు మ్యాచ్లు టీమిండియా తరపున .. మరొకటి ఐపీఎల్లో వేర్వేరు జట్లు తరపున ఒకే మ్యాచ్లో సెంచరీలు బాదారు. తొలిసారి లంకతో జరిగిన మూడో వన్డేలో ఈ ఏడాది శుబ్మన్ గిల్, కోహ్లిలు ఒకే మ్యాచ్లో సెంచరీలతో మెరిసింది లంకతో జరిగిన మూడో వన్డేలో. ఆ మ్యాచ్లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత ఓపెనర్ గిల్ 116 పరుగులు సెంచరీ చేయగా.. ఆ తర్వాత కోహ్లి 166 పరుగులతో నాటౌట్గా నిలవడం విశేషం. రెండోసారి.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇక ఈ ఇద్దరు ఒకే మ్యాచ్లో రెండోసారి సెంచరీలు చేసింది బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ 128 పరుగులు చేయగా.. కోహ్లి 186 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది. ఐపీఎల్లో ముచ్చటగా మూడోసారి Photo: IPL Twitter ఇక ముచ్చటగా మూడోసారి ఒకే మ్యాచ్లో సెంచరీలు బాదింది ఐపీఎల్లో. అయితే ఇక్కడ మాత్రం ప్రత్యర్థులుగా సెంచరీలు సాధించారు. ప్లేఆఫ్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కోహ్లి 101 నాటౌట్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్మన్ గిల్ 104 పరుగులు నాటౌట్ చివరివరకు నిలిచి గుజరాత్ను గెలిపించి ఆర్సీబీ లీగ్ స్టేజీలోనే వెనుదిరగడానికి కారణమయ్యాడు. అలా కోహ్లి, గిల్లు ముచ్చటగా మూడుసార్లు మూడు వేర్వేరు మ్యాచ్ల్లో సెంచరీలతో మెరిసి అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ అనంతరం ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో మరోసారి ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగి జట్టును గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా జూన్ ఏడు నుంచి 11 వరకు ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. చదవండి: జడ్డూకు ఫుల్ డిమాండ్.. సీఎస్కే నుంచి బయటికి వస్తే?! -
సచిన్ రికార్డు బద్దలు కొట్టేది అతడే.. 110 సెంచరీలతో: పాక్ మాజీ పేసర్
OTD- Sachin Tendulkar 100 Centuries: పదకొండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ టోర్నీ-2012లో భాగంగా మార్చి 16న బంగ్లాదేశ్తో మ్యాచ్లో సచిన్ ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 147 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 114 పరుగులు సాధించాడు. ఫలితం ఏదైనా ఈ మ్యాచ్ మాత్రం భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక ఇప్పటి వరకు సచిన్ సాధించిన ఈ అత్యంత అరుదైన రికార్డుకు చేరువగా రాగలిగింది టీమిండియా స్టార్, రన్మెషీన్ విరాట్ కోహ్లి మాత్రమే! ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇటీవలే కోహ్లి 75వ శతకం నమోదు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో తాజా సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశమే హద్దు సచిన్ టెండుల్కర్తో ఎన్నో మ్యాచ్లలో తలపడిన ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్.. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా కోహ్లికే ఉందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ భారం దిగిపోయిన తర్వాత పరుగుల యంత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడని అక్తర్ పేర్కొన్నాడు. 110 సెంచరీలు చేస్తాడు ‘‘విరాట్ కోహ్లి తిరిగి ఫామ్లోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఇప్పుడు తనపై కెప్టెన్సీ భారం లేదు. మానసికంగా ఒత్తిడి లేదు. కేవలం బ్యాటింగ్పైనే దృష్టి పెట్టే వీలు కలిగింది. కోహ్లి 110 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డును బ్రేక్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. పరుగుల దాహంతో ఉన్న కోహ్లికి ఈ ఫీట్ అసాధ్యమేమీ కాదు’’ అని షోయబ్ అక్తర్ ఏఎన్ఐతో వ్యాఖ్యానించాడు. కాగా సచిన్ టెండుల్కర్.. అంతర్జాతీయ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు సాధించాడు. కోహ్లి ఇప్పటి వరకు వన్డేల్లో 46, టెస్టులో 28, టీ20లలో ఒక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వంద సెంచరీల మార్కుకు ఇంకా 25 శతకాల దూరంలో ఉన్నాడు. ఇక 34 ఏళ్ల కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సమాయత్తమవుతున్నాడు. ఇదిలా ఉంటే అక్తర్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్తో బిజీగా ఉన్నాడు. ఆసియా లయన్స్కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2023: కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా! PSL 2023: పోలార్డ్పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..! -
Ranji Trophy: సౌరాష్ట్ర దీటైన జవాబు
బెంగళూరు: కెప్టెన్ అర్పిత్ వాసవద (219 బంతుల్లో 112 బ్యాటింగ్; 15 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (245 బంతుల్లో 160; 23 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు సాధించడంతో... కర్ణాటక జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు మరో 44 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 76/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. షెల్డన్ జాక్సన్, అర్పిత్ నాలుగో వికెట్కు 232 పరుగులు జోడించి సౌరాష్ట్ర జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం అర్పిత్, చిరాగ్ జానీ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీయగా, వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్లకు ఒక్కో వికెట్ దక్కింది. బెంగాల్కు భారీ ఆధిక్యం ఇండోర్లో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో బెంగాల్కు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 56/2తో మూడో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ ఆకాశ్దీప్ (5/42) మధ్యప్రదేశ్ను దెబ్బ కొట్టాడు. బెంగాల్కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా కెప్టెన్ మనోజ్ తివారి మధ్యప్రదేశ్కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు సాధించింది. ప్రస్తుతం బెంగాల్ ఓవరాల్ ఆధిక్యం 327 పరుగులకు చేరుకుంది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. 112 ఏళ్ల రికార్డు బద్దలు
రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్లో పర్యాటక ఇంగ్లండ్ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. తొలి రోజే 506 (4 వికెట్ల నష్టానికి) పరుగుల స్కోర్ చేసి, క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1910 డిసెంబర్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు 494 పరుగులు నమోదయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేటి వరకు ఇదే తొలి రోజు అత్యధిక స్కోర్గా కొనసాగింది. తాజాగా ఇంగ్లండ్ తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగానూ రికార్డు పుటల్లోకెక్కింది. World Record Day!#ENGvPAK pic.twitter.com/1WqQzmhNpC — RVCJ Media (@RVCJ_FB) December 1, 2022 ఈ రికార్డుతో పాటు తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ ఇంగ్లండ్ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్ తొలి సెషన్లో 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసిన ఇంగ్లండ్.. టీమిండియా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. 2018లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా తొలి సెషన్లో 158 పరుగులు స్కోర్ చేసింది. తాజాగా ఇంగ్లండ్.. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టింది. Stumps in Rawalpindi 🏏 England rewrite record books on their historic return to Pakistan 🙌 #WTC23 | #PAKvENG | https://t.co/PRCGXi3dZS pic.twitter.com/WPDooIc2ee — ICC (@ICC) December 1, 2022 ఇవే కాక, ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఈ మ్యాచ్లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు 75 ఓవర్లలో 6.75 రన్రేట్ చొప్పున పరుగులు పిండుకున్నారు. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఒక్క రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు. -
శతకాలతో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. పాక్ బౌలర్లకు చుక్కలు
3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్లో పరుగుల వరద పారిస్తుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ వన్డేల తరహాలో బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్కోర్ 227/0గా ఉంది. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా దక్కంచుకోలేకపోయారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ టీమ్లో గుర్తు తెలియని వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 14 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లంతా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే అస్వస్థతను జయించి బెన్ డకెట్ సెంచరీ సాధించడం విశేషం. డకెట్కు ఇది టెస్ట్ల్లో తొలి శతకం. -
ఒకే రోజు 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు.. పరుగుల ప్రవాహం
VHT 2022: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా నవంబర్ 21 జరిగిన మ్యాచ్ల్లో పరుగుల వరద పారింది. ఈ ఒక్క రోజే ఏకంగా 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీ హవాలో పై పేర్కొన్న గణాంకాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కేరళ ఆటగాడు రోహన్ కున్నుమ్మల్ (107 నాటౌట్), మధ్యప్రదేశ్ ఓపెనర్ యశ్ దూబే (195 నాటౌట్), హిమాచల్ ప్రదేశ్ ఏకాంత్ సేన్ (116), చండీఘడ్ అర్స్లన్ ఖాన్ (107), ఒడిశా ఆటగాడు కార్తీక్ బిశ్వాల్ (107 నాటౌట్), గుజరాత్ ఆటగాడు కథన్ పటేల్ (109), హైదరాబాద్ ఆటగాడు రోహిత్ రాయుడు (109), తమిళనాడు ఆటగాళ్లు నారాయణ్ జగదీశన్ (277), సాయ్ సుదర్శన్ (154), ఆంధ్రప్రదేశ్ రికీ భుయ్ (112 నాటౌట్), జార్ఖండ్ ఆటగాడు విక్రమ్ సింగ్ (116 నాటౌట్), బెంగాల్ ఆటగాళ్లు సుదీప్ ఘరామీ (162), అభిమన్యు ఈశ్వరన్ (122), రాజస్తాన్ ఆటగాడు ఆదిత్య గర్హ్వాల్ (149 నాటౌట్), మహారాష్ట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి (107) సెంచరీలు బాదగా.. మరో 36 మంది హాఫ్ సెంచరీలు సాధించారు. -
టీ20 వరల్డ్కప్ల్లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
దేశవాళీ, ఐపీఎల్ తరహా లీగ్ల్లో మూడంకెల స్కోర్ను చేరుకోవడం సర్వసాధారణమైపోయినప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఈ మార్కును చేరుకోవడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే సెంచరీ సాధించిన ఆటగాళ్ల సంఖ్యను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఇవాల్టి (అక్టోబర్ 27) దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ వరకు కేవలం 10 శతకాలు మాత్రమే నమోదయ్యాయంటే నమ్మి తీరాల్సిందే. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రొస్సో సాధించిన సుడిగాలి శతకం (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) టీ20 వరల్డ్కప్ చరిత్రలో పదవ శతకంగా రికార్డయ్యింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (117) తొలి శతకాన్ని నమోదు చేశాడు. 2007 ఇనాగురల్ టీ20 వరల్డ్కప్లో సౌతాఫ్రికాపై గేల్ శతకం బాదాడు. గేల్ తర్వాత పొట్టి ప్రపంచకప్లో రెండో శతకాన్ని టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా బాదాడు. రైనా 2010 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాపై 101 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్కప్లో టీమిండియా తరఫున ఇప్పటివరకు మూడంకెల స్కోర్ సాధించిన ఆటగాడు రైనా ఒక్కడే కావడం విశేషం. వీరి తర్వాత మహేళ జయవర్ధనే (2010లో జింబాబ్వేపై 100), బ్రెండన్ మెక్కల్లమ్ (2012లో బంగ్లాదేశ్పై 123), అలెక్స్ హేల్స్ (2014లో శ్రీలంకపై 116 నాటౌట్), అహ్మద్ షెహజాద్ (2014లో బంగ్లాదేశ్పై 111 నాటౌట్), తమీమ్ ఇక్బాల్ (2016లో ఓమన్పై 103 నాటౌట్), క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్పై 100 నాటౌట్), జోస్ బట్లర్ (2021లో శ్రీలంకపై 101 నాటౌట్), తాజాగా రిలి రొస్సో టీ20 ప్రపంచకప్ల్లో శతకాలు సాధించారు. -
మూడేళ్లు సెంచరీ చేయకపోయినా సచిన్ కంటే కోహ్లినే బెటర్..!
టీమిండియా తాజాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా కప్-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో శతక్కొట్టిన కోహ్లి.. అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని, ఓవరాల్గా 71 శతకాన్ని నమోదు చేశాడు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 1020 రోజుల పాటు మూడంకెల స్కోర్ చేయకపోయినా గణాంకాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. కోహ్లి మూడేళ్లకు పైగా సెంచరీ సాధించకపోయినా, సచిన్ కంటే ఓ ఇన్నింగ్స్ ముందుగానే తన 71వ శతకాన్ని నమోదు చేయడం మరో విశేషం. సచిన్ 71 శతకాల మార్కును 523 ఇన్నింగ్స్ల్లో చేరుకోగా.. కోహ్లి 522 ఇన్నింగ్స్ల్లోనే ఆ శతకాలను పూర్తి చేశాడు. 71 సెంచరీల తర్వాత మిగతా గణాంకాల్లోనూ కోహ్లి.. సచిన్ కంటే కాస్త మెరుగ్గానే ఉన్నాడు. సచిన్ 71 సెంచరీలు నమోదు చేసే క్రమంలో 49.51 సగటున 23,274 పరుగులు సాధించగా.. కోహ్లి ఇదే మార్కును చేరుకునే క్రమంలో 53.81 సగటున 24,002 రన్స్ స్కోర్ చేశాడు. అర్ధసెంచరీల విషయంలోనూ కోహ్లి.. సచిన్ కంటే మెరుగ్గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 523 ఇన్నింగ్స్ల తర్వాత సచిన్ 107 హాఫ్ సెంచరీలు సాధించగా.. కోహ్లి 124 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఇవే కాకుండా స్ట్రయిక్ రేట్ ఇతరత్రా గణాంకాల్లోనూ కోహ్లి.. సచిన్తో పోలిస్తే కాస్త బెటర్గానే ఉన్నాడు. కాగా, కేవలం గణాంకాల్లో మెరుగ్గా ఉన్నాడని సచిన్ కంటే కోహ్లి అత్యుత్తమ ఆటగాడని చెప్పలేని పరిస్థితి. ఇద్దరు తమతమ హయాంలో అత్యుత్తమ ఆటగాళ్లన్నది కాదనిలేని సత్యం. కోహ్లి గణాంకాల పరంగా ప్రస్తుతం సచిన్ కంటే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల మార్కు అందుకోవడం కోహ్లికి అంత ఈజీ కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 33 ఏళ్ల వయసున్న కోహ్లి మరో మూడు నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడినా హండ్రెడ్ హండ్రెడ్స్ మార్కును అందుకోలేడని సచిన్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. చదవండి: కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..! -
ఆ రోజు ఊరంతా ఖాళీ!... దశాబ్దాలుగా సాగుతున్న ఆచారం
అనంతపురం(తాడిపత్రి రూరల్): శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ బుధవారం సూర్యుడు ఉదయించక ముందే తాడిపత్రి మండలం తలారి చెరువు మొత్తం ఖాళీ అయింది. ‘అగ్గి పాడు’ ఆచారం పేరుతో ఇంటిలోని విద్యుత్ దీపాలను పూర్తిగా ఆర్పి, నిప్పు సైతం వెలిగించలేదు. పశువుల పాక ల్లోని పేడకళ్లతో పాటు ఇళ్లలోని కసువూ శుభ్రం చేయలేదు. కట్టెలు, వంట సామగ్రి, పాత్రలను మూటగట్టుకుని ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లపై వేసుకుని, ఇళ్లకు తాళం వేసి దర్గా వద్దకు చేరుకున్నారు. రాత్రి వరకూ అక్కడే ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. చీకటి పడిన తర్వాత ఇళ్లకు చేరుకుని ఆరుబయటనే భోజనాలు ముగించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి ఇంటి గడపకూ టెంకాయ కొట్టి లోపలకు ప్రవేశించారు. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయని గ్రామస్తుల నమ్మకం. -
సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్
Ruturaj Gaikwad And Venkatesh Iyer Smash Centuries Vijay Hazare Trophy.. దేశవాలీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్లు దుమ్మురేపారు. కేరళతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ తరపున కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ మెరుపు సెంచరీతో ఆకట్టుకోగా.. మహారాష్ట్ర తరపున కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ సీఎస్కే తరపున ఆడగా.. వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రుతురాజ్ను(రూ.6 కోట్లు) సీఎస్కే రిటైన్ చేసుకోగా.. వెంకటేశ్ అయ్యర్ను(రూ.8 కోట్లు) కేకేఆర్ తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. చదవండి: Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్.. త్వరలోనే టెస్టులకు కూడా! మ్యాచ్ల విషయానికి వస్తే.. మహారాష్ట్ర, చత్తీస్ఘర్ పోరులో.. తొలుత బ్యాటింగ్ చేసిన చత్తీస్ఘర్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్రను రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో నడించాఇ మ్యాచ్లో రుతురాజ్ 143 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతని దాటికి మహారాష్ట్ర 47 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. కాగా రుతురాజ్కు ఈ సీజన్లో రెండో సెంచరీ కావడం విశేషం. మరోవైపు కేరళతో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ ఇన్నింగ్స్లో వెంకటేశ్ అయ్యర్(84 బంతుల్లో 112, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభమ్ శర్మ(67 బంతుల్లో 82, 9 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేరళ 49.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: Vijay Hazare Trophy: హైదరాబాద్కు వరుసగా రెండో విజయం.. ఆంధ్రకు మాత్రం -
గర్జించిన సఫారీ ఓపెనర్లు.. పసికూనపై భారీ స్కోర్ నమోదు
డబ్లిన్: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సఫారీ బ్యాట్స్మెన్ గర్జించారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డేలో పసికూన చేతిలో ఎదురైన పరాభవంతో సఫారీలు అలర్ట్ అయ్యారు. పరువు పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), జన్నెమన్ మలాన్ (177 బంతుల్లో 169 నాటౌట్; 16 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మలాన్ చివరి దాకా క్రీజ్లో నిలిచి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కెరీర్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. వన్డౌన్ బ్యాట్స్మెన్ వాన్ డర్ డుసెన్(28 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 2, క్రెయిగ్ యంగ్, సిమి సింగ్ తలో వికెట్ పడగొట్టారు. కడపటి వార్తలందేసరికి ఐర్లాండ్ 3 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 12 పరుగులు సాధించింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకపోగా, రెండో వన్డేలో ఆతిధ్య ఐర్లాండ్ సఫారీలపై 43 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. వన్డే క్రికెట్లో ఐర్లాండ్కు సఫారీలపై ఇదే తొలి విజయం కావడం విశేషం. -
వరుస సెంచరీలతో చెలరేగుతున్న పృథ్వీ షా
ఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీలో ముంబై కెప్టెన్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే టోర్నీలో మూడు సెంచరీలు బాదిన పృథ్వీ తాజాగా మరో సెంచరీ బాదేశాడు. ఈ నాలుగు సెంచరీల్లో మూడుసార్లు 150కి పైగా స్కోరు నమోదు చేయడం విశేషం. ఇందులో రెండు మ్యాచ్ల్లో 227 నాటౌట్, 185 పరుగులు నాటౌట్తో చెలరేగాడు. తాజాగా కర్ణాటకతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో కేవలం 122 బంతుల్లో 167 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే కర్ణాటకతో జరగుతున్న మ్యాచ్లో ఆరంభంలో ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభించిన పృథ్వీ షా తర్వాత వేగం పెంచాడు. 79 బంతుల్లోనే టోర్నీలో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో దారుణమైన ప్రదర్శనతో జట్టులో చోటు పోగొట్టున్న షా.. విజయ్ హజారే ట్రోపీలో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే టోర్నీలో 725 పరుగులు చేసిన పృథ్వీ.. 723 పరుగులతో మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్ధలుకొట్టాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 49.2 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. -
అటు తిలక్... ఇటు భుయ్
సూరత్: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ 113 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తిలక్వర్మ (145 బంతుల్లో 156; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా, తన్మయ్ అగర్వాల్ (100 బంతుల్లో 86; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం త్రిపుర 42 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. సీవీ మిలింద్ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇండోర్: ఆంధ్ర 3 వికెట్లతో పటిష్టమై న విదర్భను ఓడించింది. విదర్భ 50 ఓవర్లలో 6 వికెట్లకు 331 పరుగులు చేసింది. యష్ (113 బంతుల్లో 117; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫైజ్ ఫజల్ (105 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. అనంతరం ఆంధ్ర 49.2 ఓవర్లలో 7 వికె ట్లకు 332 పరుగులు సాధించింది. రికీ భుయ్ (78 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫో ర్లు, 6 సిక్స ర్లు) అజేయ శతకం బాదగా, కెప్టెన్ హనుమ విహారి (67 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. -
సచిన్ బ్యాటింగ్పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో ఎక్కువ డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించాల్సిందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహిళ క్రికెట్ జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరుగులకు సంబంధించి సచిన్ ఖాతాలో అనేక అంతర్జాతీయ రికార్డులు ఉన్నాయని, అయితే టెస్టు క్రికెట్ విషయానికొస్తే డబుల్ సెంచరీల రికార్డులో సచిన్ టాప్ పదిలో కనిపించడని అన్నారు. మార్వన్ అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్ లాగే సచిన్ కూడా టెస్ట్ క్రికెట్లో ఆరు డబుల్ సెంచరీలు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. కాని డబుల్ సెంచరీల రికార్డులో సచిన్ 12వ స్థానంలో ఉన్నాడన్నారు. ఎందుకంటే 200 టెస్టు మ్యాచుల్లో సచిన్ కేవలం ఆరు డబుల్ సెంచరీలు చేశాడని ఆయన పేర్కొన్నారు. (షెడ్యూల్ ఖరారు చేసేందుకు...) కపిల్ దేవ్ మాట్లాడుతూ.. “సచిన్ చాలా ప్రతిభావంతుడు. క్రికెట్ చరిత్రలో అలాంటి వ్యక్తిని చూడలేదు. సెంచరీలు ఎలా చేయాలో అతనికి తెలుసు, కానీ వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా ఎలా మలచాలో తెలియదు. సెంచరీ చేసిన తరువాత అతను సింగిల్స్ తీసుకునేవాడు.. ఎక్కువ స్పీడ్గా ఆడేవాడు కాదు. అతను ఎప్పుడూ క్రూరమైన బ్యాట్స్మన్ కాలేడు. సచిన్ కనీసం అయిదు ట్రిపుల్ సెంచరీలు, పది డబుల్ సెంచరీలు చేయాల్సి ఉండేది. ఎందుకంటే అతను ప్రతి ఓవర్లో బౌండరీ బాదేవాడు. టెస్ట్ క్రికెట్లో 51 సెంచరీలు సాధించిన సచిన్కు తన మొదటి డబుల్ సెంచరీ సాధించడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇది 1999లో న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో సాధ్యమైంది. వాస్తవానికి, టెండూల్కర్ 51 సెంచరీలలో కేవలం 20 మాత్రమే 150 కి పైగా స్కోర్లుగా నిలిచాయి. అయితే, 2010లో దక్షిణాఫ్రికాపై వన్డే డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్ సచిన్’ అని పేర్కొన్నారు. సచిన్ తన కెరీర్లో 200 టెస్ట్ మ్యాచ్ల్లో 54.04 సగటుతో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 44.83 సగటుతో18,426 పరుగులు చేశాడు. 2013 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు (కపిల్ సలహాతోనే కోచ్నయ్యా) (ట్రిపుల్ సెంచరీ కంటే.. 136 పరుగులే మిన్న!) -
అజహర్... తీన్మార్
ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతూ సెంచరీ సాధించడం అంటే గొప్ప ప్రదర్శనగా గుర్తించవచ్చు. ఎందుకంటే 143 ఏళ్ల టెస్టు చరిత్రలో 2,384 మ్యాచ్లు జరిగితే 108 మందికే ఇది సాధ్యమైంది. అదే జోరు కొనసాగించి రెండో టెస్టులోనూ శతకం బాదితే అద్భుతమని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 9 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇక అంతటితో ఆగకుండా మూడో టెస్టు మ్యాచ్లోనూ వందతో చెలరేగిపోతే ఆ సంచలనాన్ని మొహమ్మద్ అజహరుద్దీన్ అనవచ్చు. ఎందుకంటే తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన ఈ మాజీ కెప్టెన్ రికార్డును ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా ఇప్పటికీ అజహర్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 1984–85 సీజన్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. భారత జట్టుకు సునీల్ గావస్కర్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సిరీస్కు అజహర్ ఎంపికయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే మూడో టెస్టులో సందీప్ పాటిల్ స్థానంలో అజ్జూను తీసుకున్నారు. 1984 డిసెంబర్ 31న మొదలైన ఈ టెస్టుతో అజ్జూ చరిత్ర సృష్టించాడు. తొలి సెంచరీ (కోల్కతా) ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ టెస్టులో అజహర్ ఐదో స్థానంలో వచ్చాడు. 322 బంతుల్లో 10 ఫోర్లతో 110 పరుగులు చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. అద్భుతంగా కెరీర్ను ఆరంభించిన అజహర్పై అందరి దృష్టీ పడింది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 437 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 276 పరుగులకే ఆలౌటైంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్కు ఇబ్బంది కలగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో అజహర్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తుదకు ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. రెండో సెంచరీ (మద్రాస్) చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 272 పరుగులకు ఆలౌటైంది. అజహరుద్దీన్ 90 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. అనంతరం మైక్ గ్యాటింగ్ (207; 20 ఫోర్లు; 3 సిక్స్లు), గ్రేమ్ ఫ్లవర్ (201; 22 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఇంగ్లండ్ 7 వికెట్లకు 652 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. 380 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరకు 412 పరుగులు చేసి ఆలౌటై ఇంగ్లండ్ ముందు 33 పరుగుల విజయలక్ష్యాన్ని పెట్టింది. తీవ్ర ఒత్తిడిలో పోరాడుతూ ఇక్కడ సాధించిన మరో శతకం అజహర్ అసలు సత్తాను చూపించింది. 218 బంతుల్లో అజహర్ 18 ఫోర్లతో 105 పరుగులు సాధించాడు. భారత్ 9 వికెట్లతో ఈ మ్యాచ్ ఓడినా... మన హైదరాబాదీ ప్రదర్శించిన బ్యాటింగ్ సొగసు, అతని మణికట్టు మాయాజాలం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది. వరుసగా రెండో సెంచరీతో అజ్జూ తళుక్కుమన్నాడు. మూడో సెంచరీ ( కాన్పూర్) అజహర్కు ముందు ముగ్గురు బ్యాట్స్మెన్కు మాత్రమే తమ అరంగేట్రం తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన గుర్తింపు ఉంది. తాజా ప్రదర్శనతో భారత అభిమానుల దృష్టి అజహర్పై నిలిచింది. అతను మూడో మ్యాచ్లోనూ శతకాన్ని అందుకోగలడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. గ్రీన్పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అజహర్ అభిమానుల అంచనాలు వమ్ము చేయలేదు. చురుకైన బ్యాటింగ్తో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అజ్జూ 270 బంతుల్లో 16 ఫోర్లతో 122 పరుగులు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత్ 8 వికెట్లకు 553 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 417 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఫలితం ‘డ్రా’గా ఖాయమైన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడిన అజహర్ 43 బంతుల్లోనే 5 ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా అతని వరుసగా మూడు సెంచరీల ప్రదర్శన క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. మొత్తంగా 3 టెస్టుల్లో కలిపి అజహర్ 439 పరుగులు సాధించాడు. మూడో టెస్టులో వేటుపడ్డాక సందీప్ పాటిల్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. తన స్థానంలో వచ్చిన అజహర్ పాతుకుపోవడంతో పాటిల్ కెరీర్ అక్కడే ముగిసిపోయింది. భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం -
మార్చి 16.. మర్చిపోలేని రోజు!
క్రికెట్ అభిమానులు ఈ రోజు(మార్చి 16)ను మర్చిపోలేరు. క్రికెట్ చరిత్రలో రెండు సరికొత్త రికార్డులు నమోదయిన రోజు. అందులో ఒకటి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలు సాధించింది కాగ, మరొకటి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ హెర్షల్ గిబ్స్ తొలి సారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి నయా రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద అంతర్జాతీయ శతకాలు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది ఇదే రోజున. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్పై చేసిన శతకం సచిన్కు వన్డేల్లో 49వ సెంచరీ కాగా, టెస్టులు(51), వన్డేల్లో కలుపుకుని వంద సెంచరీలను సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా ఈ "లిటిల్ మాస్టర్" సరికొత్త రికార్డును సృష్టించాడు. సచిన్ సాధించిన ఈ అరుదైన ఘనతతో యావత్ క్రికెట్ అభిమానులు తెగ పండగ చేసుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్(71) సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇప్పటివరకు 66 అంతర్జాతీయ సెంచరీలు సాధించి సచిన్ ‘వంద శతకాల’పై కన్నేశాడు. సిక్సర్ల సునామీ ఇక పన్నెండేళ్ల క్రితం సిరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు హెర్ష్లీ గిబ్స్ అద్భుతం చేశాడు. వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిబ్స్ అతడికి చుక్కలు చూపించాడు. అప్పటివరకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో రవిశాస్త్రి, గార్ఫీల్డ్ సోబర్స్ సాధించిన రికార్డే(ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు) అత్యుత్తమం కావడం విశేషం. గిబ్స్ ఈ ఘనత అందుకున్న కొద్ది నెలల అనంతరం టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ రికార్డు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో బ్రాడ్ బౌలింగ్లో యువీ ఈ ఫీట్ అందుకున్నాడు. -
"లిటిల్ మాస్టర్" వంద సెంచరీకి ఏడేళ్లు
-
సెంచరీల సరదాట
ఆటలో, పరుగుల వేటలో కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. వన్డేల్లో తమ అద్భుత ఆటను, ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శిస్తూ ఇద్దరు స్టార్లు కదం తొక్కిన వేళ... 323 పరుగుల లక్ష్యం కూడా చాలా చిన్నదిగా మారిపోయింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ, ఒక్కో పరుగుతో కొత్త రికార్డులు సృష్టిస్తూ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వీర విధ్వంసం సృష్టించడంతో బర్సపర స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. రోహిత్, కోహ్లి కలిసి 36 ఫోర్లు, 10 సిక్సర్లతో 204 పరుగులు బౌండరీల ద్వారానే సాధించేస్తే ఆ మ్యాచ్లో వినోదానికి లోటేముంటుంది. పరుగులు చేయడం ఇంత సులువా అన్నట్లుగా వీరిద్దరు అతి సునాయాసంగా ఫోర్లు, సిక్సర్లు బాదేస్తుంటే విండీస్కు చాలా ముందే ఓటమి కళ్ల ముందు కనిపించేసింది. కోహ్లికి 60వ అంతర్జాతీయ శతకం అలవోకగా ఒళ్లో వచ్చి వాలితే... రోహిత్ ఆరోసారి 150 పరుగులు దాటిన తొలి ఆటగాడయ్యాడు. జంటగా చూస్తే ఐదోసారి 200 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన ఈ జోడీ తొలి వన్డేలో ఆహా అనిపించే విజయాన్ని అందించింది. గువాహటి: టెస్టు సిరీస్ తరహాలోనే వన్డేల్లోనూ భారత్ భారీ విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి బర్సపర స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మైర్ (78 బంతుల్లో 106; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) కెరీర్లో మూడో సెంచరీ సాధించగా, కీరన్ పావెల్ (39 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. చహల్ 41 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 2 వికెట్లకు 326 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ (117 బంతుల్లో 152 నాటౌట్; 15 ఫోర్లు, 8 సిక్సర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (107 బంతుల్లో 140; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకాలతో భారత్ను గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు 246 పరుగులు జోడించడం విశేషం. తాజా ఫలితంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం విశాఖపట్నంలో జరుగుతుంది. హెట్మైర్ జోరు... టెస్టుల్లో ఘోర వైఫల్యం తర్వాత హెట్మైర్ కొత్త తరహా ఆట... మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు కలిసి బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై విండీస్కు భారీ స్కోరు అందించాయి. తొలి వన్డే ఆడుతున్న చంద్రపాల్ హేమ్రాజ్ (9)ను షమీ క్లీన్బౌల్డ్ చేయడంతో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో కీరన్ పావెల్, షై హోప్ (51 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్కు 65 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన పావెల్ 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే పావెల్ను ఔట్ చేసి ఖలీల్ ఈ జోడీని విడదీశాడు. అనంతరం కెరీర్లో 200వ వన్డే బరిలోకి దిగిన మార్లోన్ శామ్యూల్స్ (0)కు మ్యాచ్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. విండీస్ స్కోరు 86/3 వద్ద బ్యాటింగ్కు వచ్చిన హెట్మైర్ అనూహ్యంగా చెలరేగిపోయాడు. జడేజా బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతను షమీ ఓవర్లో వరుసగా 6, 4 బాదాడు. 41 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. హెట్మైర్, రావ్మన్ పావెల్ (22) కలిసి ఐదో వికెట్కు 74 పరుగులు జత చేసిన తర్వాత జడేజా భారత్కు వికెట్ అందించాడు. అయితే ఆ తర్వాత కూడా కెప్టెన్ హోల్డర్ (42 బంతుల్లో 38; 5 ఫోర్లు) సహకారంతో హెట్మైర్ జోరు కొనసాగింది. షమీ బౌలింగ్లో కవర్స్ వైపు సిక్సర్ కొట్టి హెట్మైర్ 74 బంతుల్లోనే సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. అయితే తర్వాతి ఓవర్లోనే మరో భారీ షాట్కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే నర్స్ (2), హోల్డర్ వికెట్లు చేజార్చుకున్నా... తొమ్మిదో వికెట్కు రోచ్ (26 నాటౌట్), బిషూ (22 నాటౌట్) నెలకొల్పిన 44 పరుగుల అభేద్య భాగస్వామ్యం విండీస్ స్కోరును 300 పరుగులు దాటించింది. చివరి పది ఓవర్లలో ఆ జట్టు 68 పరుగులు చేసింది. ఈ ఏడాది జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కుల్దీప్ కాకుండా పేసర్ ఖలీల్ను ఎంచుకున్న టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయం ఆశ్చర్యపరచింది. నంబర్వన్ జోడి... తన తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ (4)ను క్లీన్బౌల్డ్ చేసిన అరంగేట్ర బౌలర్ ఒషాన్ థామస్ సంబరాలు... అంతే, ఇది మినహా వెస్టిండీస్ ఆ తర్వాత చేసేందుకు ఏమీ లేకపోయింది. కోహ్లి, రోహిత్ల దూకుడు ముందు ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. మొదటి వికెట్ పడిన తర్వాత ఎదురుదాడికి దిగిన కోహ్లి తాను క్రీజ్లో ఉన్నంత వరకు అదే దూకుడు కొనసాగించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరి ధాటికి పరుగులు వరదలా రాగా... విండీస్ బౌలర్లు బేలగా చూస్తుండిపోయారు. భారత బ్యాట్స్మెన్ అద్భుత బ్యాటింగ్కు తోడు ప్రత్యర్థి పేలవ బౌలింగ్ టీమిండియా లక్ష్యాన్ని తొందరగా చేరేలా చేసింది. థాంప్సన్ వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన కోహ్లి, హోల్డర్ ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు కొట్టి 35 బంతుల్లోనే అర్ధ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు అప్పటి వరకు సహాయక పాత్రలో నిలిచిన రోహిత్ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. బిషూ ఓవర్లో వరుస బంతుల్లో భారీ సిక్సర్లు బాది తాను సీన్లోకి వచ్చేశాడు. రోచ్ బౌలింగ్లో కవర్ డ్రైవ్తో సాధించిన ఫోర్తో 88 బంతుల్లో కోహ్లి శతకం పూర్తయింది. రోచ్ తర్వాతి ఓవర్లో కోహ్లి ఫోర్, సిక్స్... రోహిత్ రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తం 19 పరుగులు లభించాయి. నర్స్ ఓవర్లో కూడా భారత్ ఇలాగే మరో 19 పరుగులు రాబట్టింది. ఇదే ఓవర్లో ఫోర్తో 84 బంతుల్లో రోహిత్ సెంచరీని చేరుకున్నాడు. ఎట్టకేలకు బిషూ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయి కోహ్లి స్టంపౌంట్ కావడంతో అద్భుత భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రాయుడు (22 నాటౌట్)తో కలిసి రోహిత్ మరో 7.5 ఓవర్లు మిగిలి ఉండగానే మిగతా పనిని పూర్తి చేశాడు. బిషూ బౌలింగ్లో భారీ సిక్స్తో 150 పరుగుల మార్క్ను దాటిన రోహిత్ మ్యాచ్నూ ముగించాడు. వీరిద్దరు మూడో వికెట్కు అభేద్యంగా 70 పరుగులు జత చేశారు. సాధికారిక విజయం తర్వాత చాలా సంతోషంగా ఉంది. వెస్టిండీస్ చాలా బాగా బ్యాటింగ్ చేసింది. 320 పరుగులకు పైగా ఛేదన అంటే ఎప్పుడూ అంత సులువు కాదు. అయితే ఒక భారీ భాగస్వామ్యం చాలనే విషయం తెలుసు. మరో ఎండ్లో రోహిత్ శర్మ ఉన్నాడంటే మన పని ఎప్పుడూ సులువే. టాప్–3లో రోహిత్ సహాయక పాత్ర పోషించడం చాలా అరుదు. సాధారణంగా నేను ఆ పని చేస్తుంటాను. ఈ రోజు నేను నడిపించే బాధ్యత తీసుకుంటానని రోహిత్కు చెప్పేశాను. నేను ఔటయ్యాక అతనూ అదే పని చేశాడు. రోహిత్తో కలిసి ఆడటం చాలా బాగుంటుంది. ఇది మా ఐదో డబుల్ సెంచరీ భాగస్వామ్యం. ఆటను ఆస్వాదించేందుకు నా కెరీర్లో మరికొన్నేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేశం తరఫున ఆడటం గర్వకారణం కాబట్టి ఏ మ్యాచ్ను కూడా తక్కువగా చూడరాదు. –విరాట్ కోహ్లి ► భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 224వ క్రికెటర్గా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన వన్డేలో మాజీ కెప్టెన్ ధోని చేతుల మీదుగా రిషభ్ పంత్ క్యాప్ను అందుకున్నాడు. ► 36: వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. ఈ జాబితాలో సచిన్ (49) మాత్రమే అతనికంటే ముందున్నాడు. కెప్టెన్గా కోహ్లికిది 14వ సెంచరీ. పాంటింగ్ (22) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఛేదనలో 22వ శతకం బాదిన కోహ్లి... ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 60వ సెంచరీ నమోదు చేశాడు. ► 20: వన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీల సంఖ్య. భారత్ తరఫున సచిన్ (49), కోహ్లి (36), గంగూలీ (22) తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ వన్డేల్లో ఆరు సార్లు 150కి పైగా స్కోర్లు సాధించాడు. గతంలో సచిన్, వార్నర్ ఐదేసిసార్లు ఈ ఘనత సాధించారు. 2017 చాంపియన్స్ ట్రోఫీ నుంచి రోహిత్ వరుసగా 9 వన్డే సిరీస్లలో సెంచరీ సాధించడం విశేషం. ► 3: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్ గంగూలీ (190)ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ (194) మూడో స్థానానికి చేరాడు. మహేంద్ర సింగ్ ధోని (217), సచిన్ టెండూల్కర్ (195) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: కీరన్ పావెల్ (సి) ధావన్ (బి) అహ్మద్ 51; హేమ్రాజ్ (బి) షమీ 9; షై హోప్ (సి) ధోని (బి) షమీ 32; శామ్యూల్స్ (ఎల్బీ) (బి) చహల్ 0; హెట్మైర్ (సి) పంత్ (బి) జడేజా 106; రావ్మన్ పావెల్ (బి) జడేజా 22; హోల్డర్ (బి) చహల్ 38; నర్స్ (ఎల్బీ) (బి) చహల్ 2; బిషూ (నాటౌట్) 22; కీమర్ రోచ్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–19; 2–84; 3–86; 4–114; 5–188; 6–248; 7–252; 8–278. బౌలింగ్: షమీ 10–0–81–2; ఉమేశ్ 10–0–64–0; ఖలీల్ అహ్మద్ 10–0–64–1; చహల్ 10–0–41–3; జడేజా 10–0–66–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 152; ధావన్ (బి) థామస్ 4; కోహ్లి (స్టంప్డ్) హోప్ (బి) బిషూ 140; అంబటి రాయుడు (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 8; మొత్తం (42.1 ఓవర్లలో 2 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–10; 2–256. బౌలింగ్: కీమర్ రోచ్ 7–0–52–0; థామస్ 9–0–83–1; హోల్డర్ 8–0–45–0; నర్స్ 7–0–63–0; బిషూ 10–0–72–1; హేమ్రాజ్ 1.1–0–9–0. హెట్మైర్ -
ఆ సచిన్ ఫీట్కు ఆరేళ్లు.!
సాక్షి, స్పోర్ట్స్ : సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎవరికి సాధ్యం కాని రికార్డును క్రికెట్ గాడ్, టీమిండియా మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుసాధ్యం చేశాడు. ఎన్నో రోజుల నుంచి ఊరించిన వంద సెంచరీల ఫీట్ను సచిన్ ఇదే రోజు అందుకున్నాడు. అన్నీ ఫార్మట్లలో కలిపి అప్పటికే 99 సెంచరీలు సాధించిన సచిన్ 100వ సెంచరీకి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో ఈ ఫీట్ కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. చివరకు ఆసియా కప్లో భాగంగా 2012 మార్చి16 న ఢాకాలోని షేర్ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సచిన్ ఈ ఫీట్ను అందుకున్నాడు. ఈ సెంచరీతో ప్రపంచ క్రికెట్లో తన పేరుతో మరో చెరగని రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్పై సచిన్కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ వన్డేలో 49 సెంచరీలు, టెస్టులో 51 సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. కోహ్లి అధిగమించెనా! 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ ప్రపంచ క్రికెట్లో భారత కీర్తిని దశదిశల చాటాడు. భారత్లో క్రికెట్ ఒక మతంలా మారడానికి సచిన్ ఆట కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సచిన్ని స్పూర్తిగా తీసుకొని ఎంతో మంది యువ క్రీడాకారులు తమ సత్తాను చాటుతున్నారు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ కోహ్లి కూడా మాస్టర్ స్పూర్తితోనే క్రికెట్లోకి అడుగెట్టాడు. వరుస సెంచరీలతో చెలరేగుతున్న కోహ్లి ఇప్పటికే అన్నిఫార్మట్లలో కలిపి 56 సెంచరీలు నమోదు చేశాడు. అయితే కోహ్లి ఫామ్ ఇలానే కొనసాగితే సచిన్ సాధించి ఈ అద్భుత రికార్డు అధిగమించడం కష్టమేమి కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కోహ్లి మరో రికార్డు
సెంచూరియన్ : అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. బ్యాట్ పడితే చాలు మంచి నీళ్లు ప్రాయంలా ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో రికార్డుల పంట పండించాడు. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించిన కోహ్లి, దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో సెంచరీతో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్గా 13వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు కొట్టిన ఓవరాల్ కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్(13), కోహ్లి(13)లు రెండో స్థానంలో నిలవగా, కెప్టెన్గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్(22) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(11) రికార్డును ఇటీవలే కోహ్లి అధిగమించిన విషయం తెలిసిందే. భారత కెప్టెన్గా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఘనత కూడా కోహ్లి(14 సెంచరీలు) పేరిటే ఉంది. -
గెలుపు బాటలో ఆసీస్
సిడ్నీ: మార్ష్ సోదరులు షాన్, మిచెల్ అద్భుత సెంచరీలు చేయడంతో... యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్ను 649/7 వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియాకు 303 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ (42 బ్యాటింగ్), బెయిర్స్టో (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 210 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ కాపాడుకోవాలంటే ఇంగ్లండ్ చివరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సి ఉండగా... ఆసీస్ మరో ఆరు వికెట్లు తీస్తే నాలుగో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది. ఓవర్నైట్స్కోరు 479/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆటలో మార్ష్ సోదరుల బ్యాటింగే హైలైట్. అన్నదమ్ములిద్దరూ ఒకరిని మించి ఒకరు దూకుడుగా ఆడటంతో.. ఇంగ్లండ్ బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ క్రమంలో ముందు షాన్ మార్ష్ (291 బంతుల్లో 156; 18 ఫోర్లు)... ఆ తర్వాత మిచెల్ మార్ష్ (145 బంతుల్లో 101; 15 ఫోర్లు, 2 సిక్స్లు) శతకాలు పూర్తి చేసుకున్నారు. పాయింట్ దిశగా బంతిని పంపిన మిచెల్ మార్ష సెంచరీ సంబరాల్లో పడి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి పరుగు పూర్తవగానే పిచ్ మధ్యలో సోదరుడిని హత్తుకొని రెండో పరుగు పూర్తి చేయడం మరిచాడు. అనంతరం షాన్ మార్ష్ గుర్తుచేయడంతో క్రీజులోకి చేరి బతికిపోయాడు. ► ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అన్నదమ్ములు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చాపెల్ సోదరులు గ్రెగ్, ఇయాన్ (1972లో)... ‘వా’ సోదరులు మార్క్, స్టీవ్ (2001లో)లు కూడా ఇంగ్లండ్ పైనే ఈ ఘనత సాధించడం విశేషం. ఓవరాల్గా టెస్టు క్రికెట్లో అన్నదమ్ములిద్దరూ ఒకే ఇన్నింగ్స్లో సెంచరీలు చేయడం ఇది ఎనిమిదో సారి. ► రెండో ఇన్నింగ్స్లో 4 పరుగుల వద్ద కుక్ టెస్టుల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్మన్గా కుక్ రికార్డు నమోదు చేశాడు. ► గత 80 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సిడ్నీలో ఆదివారం 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన ఉక్కపోతతో ఇంగ్లండ్ బౌలర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
19 ఏళ్ల తర్వాత టీమిండియా..
భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్మెన్ చేలరేగిపోయారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ (208 నాటౌట్) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో శ్రీలంకకు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. తొలి వన్డేలో దారుణంగా విఫలమై చెత్త రికార్డును మూటగట్టుకున్న టీం ఇండియా మొహాలీలో భారీ లక్ష్యంతో లంకకు సవాల్ విసిరింది. మరో వైపు 115 బంతుల్లో రోహిత్ శర్మ 8 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్లో 16 వ సెంచరీ పూర్తిచేసుకోగా.. వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉండగా టీమిండియా మొహాలీ వన్డేలో మరో రికార్డును సమం చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన రికార్డును భారత్ సమం చేసింది.1998లో సచిన్ చేసిన సెంచరీతో క్యాలెండర్ ఇయర్లో 18 వన్డే సెంచరీలను భారత్ నమోదు చేసింది. అయితే 2017 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటి వరకు టీమిండియా 17 వన్డే సెంచరీలను చేసింది. తాజాగా మొహాలీలో జరుగుతున్న వన్డేలో రోహిత్ 115 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో 19 ఏళ్ల తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో టీమిండియా 18 వన్డే సెంచరీలు చేసి గత రికార్డును సమం చేసింది. -
పాఠశాల శతాబ్ది ఉత్సవాలు
-
ఆ సెంచరీ నాకు చాలా స్పెషల్: కోహ్లి
న్యూఢిల్లీ: ఇటీవల వెస్టిండీస్తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలోటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అజేయ శతకం(111 నాటౌట్: 115బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. తద్వారా విండీస్పై వన్డే సిరీస్ను 3-1తో భారత్ కైవసం చేసుకుంది. ఈ వన్డేలో సాధించిన సెంచరీతో కోహ్లి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లికిది 28వ శతకం కాగా, ఛేజింగ్లో 18వ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకూ ఛేజింగ్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(17) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లి అధిగమించాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా తొలి మ్యాచ్లో సాధించిన సెంచరీ తనకు చాలా చాలా స్పెషల్ అని కోహ్లి పేర్కొన్నాడు. ఆ మ్యాచ్ లో కేదర్ జాదవ్ తో రెండొందల పరుగుల భాగస్వామ్యాన్ని సాధించే క్రమంలో చేసిన సెంచరీనే తనకు అత్యుత్తమన్నాడు. ప్రధానంగా భారత్ జట్టు 63 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో తాను నమోదు చేసిన 122 పరుగులకు తనకు ఎప్పటికీ ప్రత్యేకమన్నాడు. ఇంగ్లండ్ విసిరిన 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహకరించిన తన శతకం కచ్చితంగా స్పెషల్ ఇన్నింగ్స్ అని విరాట్ పేర్కొన్నాడు. అయితే తాను సాధించిన సెంచరీలకు రేటింగ్ ఇవ్వడం కష్టసాధ్యమైనప్పటికీ, పరిస్థితుల్ని బట్టి జట్టును విజయ తీరాలకు చేర్చిన ఏ ఇన్నింగ్స్ అయినా గొప్పదేనని కోహ్లి తెలిపాడు. ఈ మేరకు ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో చేసిన 49 పరుగులు కూడా మంచి స్కోరు కిందకే వస్తుందన్నాడు. -
కుక్, ఆమ్లా సెంచరీలు
* దక్షిణాఫ్రికా 329/5 * ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సెంచూరియన్: ఇంగ్లండ్తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ ఆడుతున్న స్టీఫెన్ క్రెయిగ్ కుక్ (115; 14 ఫోర్లు), హషీం ఆమ్లా (109; 19 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. కుక్, ఆమ్లా రెండో వికెట్కు 202 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అయితే 36 పరుగుల వ్యవధిలో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. బవుమా (32 బ్యాటింగ్), డి కాక్ (25 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. సెంచరీల ‘సెంచరీ’... సెంచూరియన్ టెస్టులో ఆసక్తికర రికార్డు నమోదైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కెరీర్ తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 100వ ఆటగాడిగా కుక్ నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడు అతను. స్టీఫెన్ తండ్రి జేమ్స్ కుక్ 1992లో తన తొలి టెస్టులో మ్యాచ్ తొలి బంతికే డకౌట్ కాగా... దాదాపు పాతికేళ్ల తర్వాత అతని కొడుకు తొలి మ్యాచ్లోనే సెంచరీ చేయడం మరో విశేషం. -
ఖవాజా, బర్న్స్ శతకాల మోత
► తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 345/3 ► విండీస్తో రెండో టెస్టు మెల్బోర్న్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వన్డౌన్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖవాజా (227 బంతుల్లో 144; 6 ఫోర్లు; 1 సిక్స్), ఓపెనర్ జో బర్న్స్ (230 బంతుల్లో 128; 16 ఫోర్లు; 1 సిక్స్) శతకాలు సాధించడంతో తొలి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 90 ఓవర్లలో మూడు వికెట్లకు 345 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (49 బంతుల్లో 32 బ్యాటింగ్; 3 ఫోర్లు), వోజెస్ (24 బంతుల్లో 10 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. 154 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న ఖవాజాకు కెరీర్లో ఇది మూడో సెంచరీ. అయితే ఇవన్నీ గత నాలుగు ఇన్నింగ్స్లలోనే రావడం విశేషం. మరోవైపు గత 16 ఏళ్లలో బాక్సింగ్ డే టెస్టుకు మెల్బోర్న్ మైదానంలో అత్యల్ప(53,389) సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. -
శతక్కొట్టుడు...
ఈసారి ప్రపంచకప్లో బ్యాట్స్మెన్ పరుగుల వరద పారిస్తున్నారు. ఇక సెంచరీల గురించి చెప్పాల్సిన పని లేదు. ఐర్లాండ్ నుంచి భారత్ దాకా ప్రతి జట్టులోనూ కీలక ఆటగాళ్లు శతక్కొట్టారు. లీగ్ దశలో జరిగిన 42 మ్యాచ్లలో ఏకంగా 35 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ ప్రపంచకప్లోనూ ఈ స్థాయి దూకుడు కనపడలేదు. డ్రాప్ ఇన్ పిచ్లు, మారిన నిబంధనలతో బ్యాట్స్మెన్ చెలరేగిపోతున్నారు. ఈసారి టోర్నీలో ఇప్పటిరకు సంగక్కర అందరికంటే ఎక్కువగా నాలుగు సెంచరీలు చేశాడు. దిల్షాన్ (శ్రీలంక), శిఖర్ ధావన్ (భారత్), బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), మహ్మదుల్లా (బంగ్లాదేశ్) రెండేసి శతకాలు సాధించారు. మరో 23 మంది క్రికెటర్లు ఈసారి ప్రపంచకప్లో ఒక్కో సెంచరీ చేశారు. 1975లో తొలి ప్రపంచకప్ మొత్తంలో నమోదైన సెంచరీలు ఆరు మాత్రమే. 1979లో కేవలం రెండు శతకాలు మాత్రమే వచ్చాయి. 1983లో ఏడు, 1987లో 11 సెంచరీలు నమోదయ్యాయి. 1992లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలోనే జరిగిన టోర్నీలో 8 సెంచరీలు మాత్రమే వచ్చాయి. 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలో 21 శతకాలు వచ్చాయి. 2007లో 20, 2011లో 24 సెంచరీలు నమోదయ్యాయి. ప్రపంచకప్లలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్ డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్). అందరికంటే ఎక్కువగా సచిన్ టెండూల్కర్ (భారత్) ఆరు శతకాలు సాధించాడు. సంగక్కర, పాంటింగ్ ఐదేసి సెంచరీలు చేశారు. -
రాహుల్, నాయర్ సెంచరీలు
ముంబై: రంజీట్రోఫీ ఫైనల్లో తొలి రోజు బౌలర్లు హవా చూపినా రెండో రోజు బ్యాట్స్మెన్ దుమ్ము దులిపారు. లోకేశ్ రాహుల్ (214 బంతుల్లో 131 బ్యాటింగ్; 13 ఫోర్లు; 1 సిక్స్), కరుణ్ నాయర్ (295 బంతుల్లో 130 బ్యాటింగ్; 19 ఫోర్లు) శతకాలతో అదరగొట్టడంతో తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 99 ఓవర్లలో ఐదు వికెట్లకు 323 పరుగులు చేసింది. ప్రస్తుతం కర్ణాటక 189 పరుగుల ఆధిక్యంలో ఉంది. 45/4 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం ఆట ప్రారంభించిన డి ఫెండింగ్ చాంప్ రోజంతా ఆడి కేవలం ఒక్క వికెట్ను మాత్రమే కోల్పోయింది. అభిమన్యు మిథున్ (41 బంతుల్లో 39; 7 ఫోర్లు) త్వరగానే అవుటైనా తొలి రోజు గాయంతో రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగిన రాహుల్ వచ్చి అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. నాయర్తో కలిసి ఆరో వికెట్కు అజేయంగా 239 పరుగులు జోడించాడు. -
క్లార్క్, హాడిన్ సెంచరీలు
అడిలైడ్: ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ క్లార్క్ (245 బంతుల్లో 148; 17 ఫోర్లు), హాడిన్ (177 బంతుల్లో 118; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ను 158 ఓవర్లలో 9 వికెట్లకు 570 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హారిస్ (55 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కార్బెరీ (20 బ్యాటింగ్), రూట్ (9) క్రీజులో ఉన్నారు. కుక్ (3)ను జాన్సన్ దెబ్బతీశాడు. అంతకుముందు 273/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన క్లార్క్, హాడిన్లు నిలకడగా ఆడారు. ఇంగ్లండ్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. క్లార్క్ భారీ షాట్లు ఆడకపోయినా.. హాడిన్ మాత్రం స్పిన్నర్ల బౌలింగ్లో సిక్సర్ల మోత మోగించాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్ లెగ్లో బెల్ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న క్లార్క్... క్రమంగా కెరీర్లో 26వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు స్టోక్ బౌలింగ్లో అండర్సన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్కు నెలకొన్న 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జాన్సన్ (5), సిడిల్ (2) వెంటవెంటనే అవుటైనా... హారిస్ సమయోచితంగా ఆడాడు. హాడిన్తో కలిసి తొమ్మిదో వికెట్కు 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాడిన్ 4వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన లియోన్ (17 నాటౌట్) నెమ్మదిగా ఆడుతూ పదో వికెట్కు హారిస్తో కలిసి అజేయంగా 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్రాడ్ 3, స్వాన్, స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ ఇన్నింగ్స్లో కొట్టిన 12 సిక్సర్లు యాషెస్లో ఆసీస్ తరఫున రికార్డు. 2005 ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్పై 10 సిక్సర్లు కొట్టారు. మండేలాకు నివాళి: శుక్రవారం తెల్లవారుజామున మరణించిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు ఇరుజట్లు నివాళులు అర్పించాయి. మ్యాచ్కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నల్ల బ్యాండ్లను ధరించి బరిలోకి దిగారు.