CLP leader
-
బీఆర్ఎస్ నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు
కేతేపల్లి: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేని ఆ పార్టీ నాయకులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. ఉత్తర తెలంగాణ మొదలుకుని నల్లగొండవరకు సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, ప్రజల సంపద దోచుకుంటున్న ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకే తాను పాదయాత్ర చేపట్టానని ఆయన పేర్కొన్నారు. పీపుల్స్మార్చ్ పాదయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్న కేసీఆర్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నక్కలగండి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని పనులు పూర్తి చేయిస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కేసీఆర్కు.. ఇప్పటికీ కుర్చీ దొరకలేదా? అని ప్రశ్నించారు. ఏడేళ్లుగా పూర్తి చేయని ‘పాలమూరు–రంగారెడ్డి’ఎత్తిపోతల ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేస్తామంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయించడంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య పాల్గొన్నారు. భట్టివిక్రమార్కకు అస్వస్థత కాగా, భట్టివిక్రమార్క మంగళవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి వచ్చిన వైద్యులు కేతేపల్లిలోని పాదయాత్ర శిబిరం వద్ద ఆయనకు చికిత్స అందించారు. తీవ్రమైన వడగాలులు, ఎండలను లెక్కచేయకుండా 96 రోజులుగా పాదయాత్ర చేస్తుండటంతో ఆయన వడదెబ్బకు గురయ్యారు. జ్వరం, తలనొప్పితో ఆయన బాధపడుతున్నారని, బీపీ కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో బీపీ కంట్రోల్లోకి వచ్చిందన్నారు. షెడ్యూలు ప్రకారం మంగళవారం ఆయన నకిరేకల్ హైవే నుంచి కొర్లపాడు మీదుగా కేతేపల్లికి, అక్కడి నుంచి భాగ్యనగరం శివారు వరకు మొత్తం 12.5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంది. అస్వస్థతకు గురికావడంతో నకిరేకల్ హైవే నుంచి బయలుదేరి కొర్లపాడు మీదుగా 6 కిలోమీటర్లు నడిచి కేతేపల్లికి చేరుకున్నారు. అక్కడే పాదయాత్రకు విరామం ప్రకటించారు. బుధవారం ఉదయం వరకు జ్వరం, తలనొప్పి తగ్గితే పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని భట్టి విక్రమార్క కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పి.నాగేశ్వరరావు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు భట్టిని పరామర్శించారు. -
భలే కొంటున్నారు సారూ...
-
ఆ సభ సక్సెస్కు కారణం ఇదే.. మంచిర్యాలలో జై కొట్టించింది వారే..
మంచిర్యాలలో నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ సభ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కొన్ని కలిసివచ్చాయి. సభను ప్లాన్ చేయడం నుంచి సక్సెస్ ఫుల్గా జరిగే వరకు భట్టి విక్రమార్కకు అండగా నిలిచింది ఓ టీం. వారెవరో కాదు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల బృందం. వైఎస్సార్ను అత్యంత అభిమానించే వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒకరు. ఎంతంటే దేవుడి ఫోటోల మధ్య లో వైఎస్సార్ ఫోటో పెట్టి పూజించేంత అభిమానం భట్టికి ఉంది. దీనికి కారణం భట్టి రాజకీయాల్లో ఎదగడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది వైఎస్సారే. ఇటు వైఎస్సార్ అభిమానులకు కూడా భట్టి అంటే అంతే ఇష్టం. భట్టి పాదయాత్ర తలపెట్టినప్పుడు అన్ని తామై వెఎస్సార్ అభిమానులే చూసుకుంటున్నారు. జై భారత్ సత్యాగ్రహా సభ సక్సెస్ వెనక కూడా వైఎస్సార్ అభిమానులే బ్యాకప్ వర్క్ చేశారన్న టాక్ ఉంది. అందులో ముందు చెప్పుకోవాల్సిన పేరు ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల సభ కు అన్ని తానై ఏర్పాట్లు చేసారు ప్రేమ్ సాగర్ రావు. ఇదే జాబితాలో మరో ఇద్దరు శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి. వీరిద్దరూ మంచిర్యాలలోనే ఉండి సభ సక్సెస్ కోసం కృషి చేసారు. సీఏల్పీ నేతగా ఉన్నప్పుడు వైఎస్సార్ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తన పాదయాత్ర ద్వారా ఎంతో మంది ప్రజలను కలిశారు, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. నేన్నునానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు సీఏల్పీ నేతగా ఉన్న భట్టి కూడా వైఎస్సార్ బాటలోనే పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి దిగారు. వైఎస్సార్ సెంటిమెంట్ వైఎస్సార్ అభిమానిగా తనకు కలసి వస్తుందని ఆశిస్తున్నారు సీఏల్పీ నేత భట్టి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్డెస్క్ చదవండి: కాంగ్రెస్లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్కు కోపం ఎందుకు వచ్చింది? -
విడుదల చేసే దమ్ము కేంద్రానికి ఉందా..
-
రుణాలు బడా వ్యాపారులకేనా.. రైతులకు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద రద్దు చేసే పాలకులు, ఆరుగాలం కష్టపడే రైతుకు రుణమాఫీ చేయమంటే మాత్రం వెనకాడుతారెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గురువారం ఇక్కడి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అని నిలదీశారు. తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని హితవు పలికారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రమంత్రి పర్యటన ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితిల్లో రైతులు ఉన్నారని, ఈ దుస్థితి వారి ఆత్మహత్యలకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని భట్టి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై ఫైర్ -
మద్యం పాలసీని రూపొందించడం విచిత్రం
-
ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లి.. మద్యం పాలసీపై నిర్ణయాలా?: భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మద్యం పాలసీపై ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ‘మద్యాన్ని విచ్చలవిడిగా, అవినీతిపరులతో విక్రయాలు జరుపుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు మద్యం పాలసీని రూపొందించటం విచిత్రం. ప్రభుత్వ పాలసీలపై సచివాలయంలో లేదా కేబినెట్లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వ పాలసీలపై హోటల్లో నిర్ణయాలేంటి? ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వచ్చి.. మద్యం పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఇదీ చదవండి: లిక్కర్ స్కాం కేసు: బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత -
సీనియర్ నేతలు మా ఆస్థి.. వారిని కాపాడుకుంటాం : భట్టి
-
తెలంగాణలో పోలీసు యంత్రాంగం ఉందా?: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు యంత్రాంగం ఉందా? బాలికపై అఘాయిత్యం జరిగితే హోంమంత్రి స్పందించరా? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పబ్ కల్చర్ బాగా పెరిగిపోయిందన్నారు. బాలిక అత్యాచారం కేసు సీబీఐకి అప్పగించాలని భట్టి డిమాండ్ చేశారు. చదవండి: అమ్నీషియా పబ్ కేసు: సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ! సీబీఐకి అప్పగించాలి.. శ్రీధర్ బాబు ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదని.. బాలిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కానీ దోషులను పట్టుకోవడంలేదు.. వారు బయట దర్జాగా తిరుగుతున్నారని శ్రీధర్బాబు దుయ్యబట్టారు. -
ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ బడ్జెట్: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారు.. గతేడాది బడ్జెట్ కూడా పెట్టిన దానికి చేసిన ఖర్చు కు పొంతన లేదన్నారు. కేటాయింపులు కేవలం చెప్పుకోవడం కోసమేనని దుయ్యబట్టారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: కేటాయింపులు ఇవే.. ‘‘ఎన్నికల సందర్భంగా జాగా ఉంటే ఇళ్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు అని చెప్పి.. ఇప్పుడు 3 లక్షలు మాత్రమే పెట్టారు. నిరుద్యోగులు, రైతుల గురించి ఇలా ఏ వర్గానికి ఉపయోగపడని బడ్జెట్. ప్రచారానికి తప్ప .. ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని తెచ్చుకొన్నది తలెత్తుకొని బతకడం కోసం. ఈ రోజు సెల్ప్ రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. గవర్నర్తో మీకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలి. గతేడాది జరిగిన పురోగతి చెప్పాల్సి ఉన్నా.. చెప్పలేదు. అందుకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన కనీసం మా వైపు కూడా స్పీకర్ చూడలేదని.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని’’ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
జగ్గారెడ్డితో భట్టిభేటీ..రాజీనామా అంశంపై చర్చ
-
‘మోదీ డ్రామా.. బహిరంగ సభకు జనం రాలేదనే..’
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ పర్యటనలో మోదీ డ్రామాలాడారని.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బహిరంగ సభకు జనం రాలేదని నాటకాలు ఆడారని ఎద్దేవా చేశారు. చదవండి: పర్యాటకుల్లా వచ్చి కేసీఆర్పై విమర్శలా? ‘‘పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. 371డి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎల్పీ నుండి లేఖ రాస్తున్నాం. ధ్యానం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కొనుగోలు చేయాల్సిందే. తామర పురుగుతో లక్షల ఎకరాల మిర్చి పంటకు నష్టం ఏర్పడింది. పసుపు, పత్తి పంటలకు కూడా నష్టపరిహారం అందించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దయనీయ పరిస్థితిలో ఉంది. పోలీసులు యంత్రాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ గా మార్చుకుంది. సీఎల్పీ బృందం.. గవర్నర్తో పాటు రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల పెంచితే పోరాటం చేస్తాం. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, వనమాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలంటూ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. -
కేంద్రంతో యుద్ధం.. టీఆర్ఎస్ నాటకాలు: సీఎల్పీ నేత భట్టి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంతో యుద్ధం చేస్తున్నట్లు టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. ధాన్యం కొనకుంటే టిఆర్ఎస్ సర్కార్ చావు డప్ఫు కొట్టాల్సిందేనన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తానని ప్రకటించి టీఆర్ఎస్.. మూడు నెలలుగా రైతులను అవస్థలు పెడుతూ అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతుందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. చదవండి: తెలంగాణ మంత్రులపై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు -
కేసీఆర్ పాతాళ భైరవి సినిమాలోలాగా చేస్తున్నారు: భట్టి
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. పాతాళ భైరవి సినిమాలోలాగా అప్పుడప్పడూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకువస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్గా వచ్చాకా కరోనా వ్యాక్సిన్ రాష్ట్రంలో పూర్తిగా బంద్ అయ్యిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన జూమ్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు.. కరోనా రోగుల నుంచి వసూలు చేస్తున్న భరించలేని ఫీజులను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఏడాది సమయం ఉన్నా రాష్ట్రంలో కనీసం ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ ఉందో, ఏ ఆసుపత్రిని పరిశీలించిందో? ఎక్కడ ఫీజులు నియంత్రణ చేసిందో ఇప్పటి వరకూ తెలియలేదన్నారు. ‘‘కరోనా పెరుగుతున్న సమమంలో చీఫ్ సెక్రెటరీతో ఫోన్ చేసి మాట్లాడాను.. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది. దున్న పోతుమీద వాన పడుతున్నా కదిలే పరిస్థితి లేదు. ఫామ్ హౌస్లో నిద్రిస్తోంది. మంత్రులెవరూ స్పందించడం లేదు. కనీసం బ్యూరోక్రసీతో పనిచేయించడం నీ బాధ్యత అని సీఎస్తో చెప్పి 15 రోజులైనా ఆయన స్పందించింది లేదు’’ అంటూ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై పూర్తిస్థాయిలో ఒక మంత్రి పర్యవేక్షణ ఉండాలి కానీ.. గెస్ట్ యాక్టర్లలా రోజుకొకరు సమావేశాలు పెట్టడం ఏంటని భట్టి ప్రశ్నించారు. సోనూసూద్ మాదిరిగా తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్లు ఆర్టిస్టులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చిన కరోనా బాధితులకు అండగా నిలవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇక వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకోలేదన్నారు. రాష్ట్ర జనాభా ఎంత? కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్ డోసులు ఎన్ని? ఫార్మా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ ఎంత? అనే దానిపై ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదని భట్టి అన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న చీఫ్ సెక్రెటరీ కూడా ఈ వివరాలు చెప్పడం లేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. చదవండి: ఆత్మగౌరవం పేరిట కొత్త నాటకం: మంత్రి గంగుల లాక్డౌన్.. అంతంత మాత్రమే! -
అడవి బిడ్డలపై దాడి అత్యంత హేయం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ ప్రాంతంలో అడవి బిడ్డలపై అటవీ సిబ్బంది పైశాచిక దాడిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఇప్పపూలు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై జరిగిన దాడిలో 14 మహిళలు, 9 మంది పురుషులకు తీవ్ర గాయాలయ్యాయని, వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటవీ ఉత్పత్తులను సేకరించడం తప్పు కాదని, ఉత్పత్తుల సేకరణపైనే ఆధారపడి చెంచు, లంబాడాలు ఆధారపడి జీవిస్తున్నారని, 29 రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి ఉపాధి పొందవచ్చు అని అటవీ చట్టం చెబుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గిరిజనులకు రోగం వస్తే హెలికాప్టర్లో తీసుకువచ్చి కార్పొరేట్ దవాఖానల్లో చేర్చించి కడుపులో పెట్టి చూసుకుంటామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, పోడు భూముల సమస్యను తనే కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గిరిజన మహిళలను చెట్లకు కట్టేసి కొట్టిన అరాచకాలు టీఆర్ఎస్ పాలనలో ఉందని, గత ఏడేళ్లుగా అనేక ప్రాంతాల్లో అధికారులు, అధికార పార్టీల నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. చదవండి: తెలంగాణలో పండుగలు, పబ్బాలు లేవు! కరోనా తెచ్చిన కష్టం; ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక -
సీఎం కేసీఆర్పై భట్టి విక్రమార్క ఫైర్..
సాక్షి, హైదరాబాద్: దాదాపు 30 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను కేవలం ఆరు రోజుల్లోనే ముగించడంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 ఏడాదికి సంబంధించిన 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ బడ్జెట్ను కేవలం ఆరు రోజులకు మాత్రమే చర్చలను పరిమితం చేసి.. పాస్ చేయించుకుని వెళ్లిన వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం.. శాసనసభా సమావేశాలు ముగిసిన అనంతరం గన్ పార్క్లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు 30 రోజులు జరపవలసిన బడ్జెట్ సమావేశాలను ఆరు రోజులకే పరిమితం చేయడంపై ఆయన మండిపడ్డారు. భారీ బడ్జెట్ పైనా సుదీర్ఘంగా చర్చలు జరిపి.. పాస్ చేసుకోవాల్సి ఉండగా, కేవలం ఆరు రోజుల్లోనే సమావేశాలు పూర్తి చేయడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరు రోజుల్లో కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని భట్టి విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచనలను అధికార పక్షం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. బడ్జెట్ను అధికార పక్షం పాస్ చేయించుకున్న వైనం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. కేసీఆర్ పాలన నియంతృత్వ పాలనలా ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలనలా లేదన్నారు, శాసనసభా సమావేశాలు కేవలం అలంకార ప్రాయంగా మారిపోయాయి తప్ప... అర్థవంతమైన చర్చలు జరగడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రంగం, నీటిపారుదల, క్రుష్ణానదిమీద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని భట్టి చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో టెండర్లలో అక్రమాలకు పాల్పడి.. భారీ అవినీతికి పాల్పడినట్లు భట్టి ఆరోపించారు. ఇది రాష్ట్రం మీద అదనపు ఆర్థిక భారంలా మారిందని బట్టి అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ ప్రజల సమక్షంలో పెట్టడంతో పాటు చట్టసభలలో పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. డీపీఆర్లను చట్టసభల్లో ఇవ్వకపోవడంతో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదన్నారు. అప్పులను ప్రభుత్వం విపరీతంగా చేస్తోందన్నారు. ఈ ఏడాది రూ. 48 వేల నుంచి రూ. 50 వేల కోట్ల వరకూ అప్పులు ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా.. చిరవకు రాష్ట్రాన్ని డెడ్ ట్రాప్ లోకి నెట్టేస్తున్నారన్నారు. 2023 నాటికల్లా అప్పులు ఐదున్నర నుంచి 6 లక్షల కోట్ల రూపాయాలకు రాష్ట్ర అప్పులు చేరుకుంటాయని వివరించారు. రాష్ట్రాన్ని కుదవపెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను వినియోగించకుండా.. వాటిని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శుల అంశాలపై కాంగ్రెస్ శాసనసభా పక్షం.. సభలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వలేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
‘తెలంగాణలో నయా రాచరికం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలన అంతా అయోమయంగా సాగుతోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులను, ఇటు ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ నుంచి నయా రాచరిక పాలన చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ రెండేళ్ల పాలనపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికారులు ఎవరు ఎక్కడ ఉంటారో.. ఎవరికి తెలియని పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. సెక్రటేరియట్లో ఏ శాఖకు ఫోన్ కలవని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.(చదవండి: టీపీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం!) ఆ హామీపై కనీసం ఊసేలేదు.. కాళేశ్వరం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఎకరాకైనా నీళ్లు పారాయా? అని భట్టి ప్రశ్నించారు. వరదలతో హైదరాబాద్ నగరం మునిగిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకున్నారని భట్టి మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన భృతి హామీకి అతీగతీ లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కనీసం విధివిధానాలను ఖరారు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీపై కనీసం ఊసేలేదని విమర్శించారు. (చదవండి: హైదరాబాద్లో కాంగ్రెస్కు ఏమైంది?) రాష్ట్రంలో గందరగోళం.. ధరణితో తెలంగాణ గందరగోళంలో పడిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తనకు కావాల్సిన వారికోసం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను గందరగోళం చేశారని ఆరోపించారు. వ్యవసాయ రంగం అతలాకుతలం అవుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ చేయకపోవడం రైతులకు మరింత భారంగా మారిందని.. సన్నవడ్లు పండించిన రైతుల బాధలు కేసీఆర్కు పట్టవా? అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి.. గ్రేటర్ ఎన్నికల ముందు ప్రకటించిన వరద సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్నికల తరువాత ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 57 ఏళ్లకే పెన్షన్ అని చెప్పిన కేసీఆర్.. కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం.. తరువాత దానిని మర్చిపోయిందన్నారు. ఆన్లైన్ తరగతులకు సరైన వసతులు కల్పించకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. వారు మినహా అంతా డమ్మీలే.. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చే అంశం పరిశీలిస్తామన్నారు.. ఎంత వరకు పరిశీలనకు వచ్చిందో ఏవరికీ తెలియదన్నారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రులకు అధికారాలు లేవు. కేటీఆర్, హారీష్ మినహా అంతా డమ్మీలే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో సామాన్య ప్రజలను, రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని, సూటు బూటు వేసుకున్నవారినే కేసీఆర్ కలుస్తారని ఘాటుగా విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల ఆలోచనను మళ్లించేందుకే భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ.. భావోద్వేగాలతో రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆ అంశంపై నిర్ణయం తీసుకోలేదు.. సీఎల్పీ నేతగా తమ ఎమ్మెల్యేలు పీసీసీ ఎంపికపై కొన్ని అభిప్రాయాలు చెప్పారు. వారి అభిప్రాయాలను ఇంఛార్జ్ మానిక్యం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఈ సందర్భంగా భట్టి మీడియాకు చెప్పారు. పీసీసీ ఎంపికపై తన అభిప్రాయాన్ని పార్టీ ఇంఛార్జ్కు తెలియజేసానన్నారు. ఈ సందర్భంగానే ఢిల్లీ వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోలేదని ఆయన మీడియాకు వెల్లడించారు. ఒక వేళ వెళ్లే అవకాశం ఉంటే తప్పకుండా మీడియాకు తెలియజేస్తానని భట్టి విక్రమార్క చెప్పారు. -
‘అందుకే కేసీఆర్ కరోనాపై సమీక్ష పెట్టడం లేదు’
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖలో ఉన్న లోపాలు బయటకు వస్తాయనే భయంతోనే సీఎం కేసీఆర్ కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించడంలేదని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైద్యశాఖకు నిధులు విడుదల చేయండని, ప్రైవేటు హాస్పిటల్స్పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న మంత్రి ఈటలకు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడ టెస్ట్ కిట్స్ లేవని చెబుతున్నారు.. 1,82,000 కోట్ల రూపాయల బడ్జేట్ ఉన్న రాష్ట్రంలో వైద్యం గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మానవత్వం లేని పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కోరత కూడా తీవ్రంగా ఉందని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రుల రేట్లను ప్రభుత్వమే ఫిక్స్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలని, 17 మంది అధికారులను.. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియమించాలని భట్టి పేర్కొన్నారు. -
వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: బీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న వరవరరావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు శిక్షించిన వారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే మెరుగైన వైద్యం అందిస్తారని, ఉరి శిక్ష వేసిన వారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే ఉరి వాయిదా వేస్తారు. అలాంటిది రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యమ నేతను అక్కడి ప్రభుత్వాలు, పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ఆ టెండర్లపై సెంట్రల్ విజిలెన్స్కు లేఖ రాస్తాం’
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పోలీసులను కపలా పెట్టి ప్రభుత్వం మద్యం అమ్మకాలు సాగిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వల్ల తాగుబోతులు మృతి చెందిన పర్వాలేదని ప్రభుత్వం భావిస్తుందా అని ప్రశ్నించారు. ఒక పక్క తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలను ఆదుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు 21 వేల కోట్లతో టెండర్లు పిలవడం సబబేనా అంటూ విమర్శలు గుప్పించారు. టెండర్లు పిలవడం రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ కూడా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్గత పనుల వల్ల అదనంగా రూ.8 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ ఇప్పటికే 3 లక్షల 21 వేల అప్పుల్లో ఉందని.. మళ్ళీ మరో 21 వేల కోట్ల భారమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి,కాళేశ్వరం టెండర్లపై సెంట్రల్ విజిలెన్స్కు లేఖ రాస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను, మీడియాను తిడితే అసలు విషయాలు బయటకు రావని సీఎం కేసీఆర్ ఆలోచన అని దుయ్యబట్టారు. మద్యం షాపులు తెరవడం వల్ల ఇన్ని రోజులు వైద్యులు, పోలీసులు శ్రమ అంతా వృధా అయ్యిందన్నారు. రాజీలేని పోరాటం చేయాలి: శ్రీధర్బాబు రాబోయే రెండు వారాల్లో కరోనా వ్యాప్తి మరింత వేగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారని మాజీ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ఇసుక తరలింపు కోసం పనిచేసేవారికి ఎలాంటి టెస్టులు నిర్వహించడం లేదన్నారు. తెలంగాణకు ఆదాయం వచ్చే వాటిలో చిన్న,సన్నకారు వ్యాపారుల పాత్ర కూడా కీలకమన్నారు. కేంద్రం కోటి 70 వేల కోట్లు ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకుందని.. దేశంలో ఇంతటి పరిస్థితుల్లో ఫైనాన్సిల్ ప్యాకేజి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందన్నారు. సింగపూర్, మలేషియా లాంటి చిన్న దేశాలు కూడా వారి ప్రజలకు నమ్మకం కల్పించాయన్నారు. దేశంలో ప్రతి పేద కుటుంబానికి 7,500 నగదు ఇవ్వాలనే రాహుల్ గాంధీ సూచనను పక్కన పెట్టారని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల విషయంలో రాష్ట్రాల హక్కులను లాక్కునే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో రాజీలేని పోరాటం చేయాలని శ్రీధర్బాబు హితవు పలికారు. -
ప్రజల కోసమే పోలీసులు పనిచేయాలి:భట్టి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బోయినిపల్లి సంఘటనపై పోలీసుల తీరును తప్పుబట్టారు. ‘బోయినిపల్లిలో ఒక స్థల వివాదంలో స్థానిక అధికార పార్టీ నేత రాజకీయ పలుకుబడి అడ్డం పెట్టుకుని తన అనుచరులు, గుండాలతో కలిసి భూమిలో ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేయడమే కాకుండా వాచ్మేన్ శంకరప్ప పైన పెట్రోలు పోసి నిప్పంటిచారు. శంకరప్ప భార్యను వివస్త్రను చేసి హింసించారు. ఈ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని’ భట్టి విక్రమార్క విమర్శించారు. వాచ్మేన్ పరిస్థితి విషమంగా ఉందని..మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. శంకరప్ప భార్యపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ నాయకుల కోసం కాకుండా.. ప్రజల కోసం పోలీసులు పనిచేయాలని భట్టి విక్రమార్క హితవు పలికారు. -
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా : మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం చర్ల మండలంలోని కుదునూరులో ఆయన ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఆర్టీసీలో 48 వేల ఉద్యోగాలు తొలగించేందుకు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో దళిత, గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. దొరల తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భద్రాచంల ఎమ్మెల్యే పోడెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో ఆస్తులమ్ముతున్న కేసీఆర్ : భట్టి
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ఆదాయం కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్ముతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టపురం క్రాస్ రోడ్డు వద్ద ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఓటమి భయంతోనే హుజూర్నగర్లో మండలానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యేను పంపుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని విశ్వాసం వెలిబుచ్చారు. -
భవిష్యత్తులో నీరు, గాలిపైనా పన్ను : భట్టి విక్రమార్క
సాక్షి, పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ 2023 నాటికి ఐదు లక్షల బడ్జెట్ ప్రవేశపెడ్తాడో లేదో తెలియదు కానీ ఆరోజుకు అప్పులు మాత్రం అంతవరకు చేరుస్తాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం పెద్దపల్లిలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అప్పుల భారం అంతా సామాన్య ప్రజానీకంపైనే పడుతుందన్నారు. ఆఖరుకు తాగే నీళ్లు, పీల్చే గాలిపైనా పన్నులు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్పై అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం మనదేనని, అప్పులు పెరుగుతూ పోతే వడ్డీలు కట్టేందుకు ప్రభుత్వం అన్నింటిమీదా పన్నుల రేట్లు పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇసుకను ఆదాయ వనరుగా కాకుండా సహజ వనరుగా, రాష్ట్ర సంపదగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ రేసులో నేను లేను
సాక్షి, ఢిల్లీ : రాష్ట్రమంతా సిద్ధిపేట మోడల్ అమలు చేస్తానంటున్న సీఎం కేసీఆర్ దుబ్బాకలో యూరియా కోసం రైతు చనిపోయిన ఘటన చూసి సిగ్గుపడాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు పెట్టి కొందామన్నా యూరియా దొరకడం లేదని వాపోయారు. రైతు బంధు, రుణమాఫీ పథకాలను అమలుచేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎన్నికల వేళ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 20 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాలపై పార్టీ అధ్వర్యంలో పోరాడుతూ.. కేంద్ర హోంమంత్రిని కలిసి లోతైన దర్యాప్తు చేయాలని కోరతామని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు, మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపామని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. -
కళ్లకు గంతలు కట్టుకున్నారా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు డెంగీ, మలేరియా, విష జ్వరాలు విజృంభిస్తున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రులన్నీ దుర్భరంగా ఉన్నాయన్నారు. ఏం.ఆర్.ఐ. సిటీ స్కాన్, బ్లడ్ ప్లేట్ లెట్ సేపరేటర్ ఎక్విప్ మెంట్, ఈసీజీ, ఎక్స్ ప్లాంట్ లేవని భట్టి వివరించారు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతతో స్త్రీ, పురుషులిద్దరీని ఒకే బెడ్ పై పడుకో బెట్టి చికిత్స అందించడం దారుణమన్నారు. అలా చికిత్స చేయించుకునే వారు కూడా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారని ఆయన వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన పరికరాలు, మందులు లేవని.. మంత్రి ఈటెల అంతా బాగుందని మాట్లాడటం సరికాదన్నారు. తాను రాజకీయాల కోసం ఆసుపత్రుల్లో తిరగడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లోనూ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్.. టీఆర్ఎస్ ఓనర్ షిప్ పంచాయతీలో పడి .. ఈ విషయాలు పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోందన్నారు. ఈటెల పార్టీ ఓనర్ షిప్ లొల్లి కొద్దిగా పక్కన పెట్టి .. రాష్ట్రంలో ఆసుపత్రుల దుస్థితిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాష్ట్రంలో అధిక శాతం రైతులకు రైతుబంధు డబ్బులు అందడం లేదని.. రుణమాఫీకి దిక్కులేదని విమర్శించారు. -
మిడ్ మానేరుకు వచ్చింది కాళేశ్వరం నీళ్లు కాదు..
సాక్షి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అవాస్తవాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం హన్మకొండలోని హరిత హోటల్లో ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలతో కలిసి ఆయన ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాళేశ్వరం జలకళ అంతా అబద్ధమనీ, సీఎం చెప్తున్నట్టు మిడ్మానేరుకు కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సారథ్యంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే మిడ్మానేరుకు నీళ్లు వచ్చాయని వివరించారు. అప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టులో 5 మోటార్లను బిగించి 7, 8 పంపు సెట్లు నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులతో టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నుంచి అన్నారంకు 12 టీఎంసీలు, అన్నారం నుంచి సుందిళ్లకు 6 టీఎంసీలు తెచ్చామంటున్న కేసీఆర్, ఆ నీళ్లన్నీ తిరిగి గోదావరిలో కలిసి కిందికి వెళ్లిపోయాయని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. జలహారతి పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు. -
కేసీఆర్ వారిని శిక్షించకూడదు
సాక్షి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు తన కుటుంబ సంక్షేమే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజలను కాపాడాల్సిన పాలకులు వారిని శిక్షించకూడదు అని భట్టి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఇతర సీనియర్ నాయకులతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. అనంతరం మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై.. కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులను భయంకరంగా నిర్వీర్యం చేసిందని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిని నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అదనంగా ఒక్క భవనం నిర్మించలేదని, కొత్తగా ఎక్విప్మెంట్ ఇవ్వడంగానీ, మందులు సక్రమంగా సరఫరా చేయడంకానీ చేయలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బెడ్ షీట్స్ కూడా సరిగ్గా అందించక పోవడం దురదృష్ట కరమని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉన్న బెడ్స్ సరిపోక మడత మంచాలు వేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఎక్కడ? కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 350 పడకలు ఉన్నాయి. దీనికి అదనంగా మాత, శిశు సంక్షేమం కింద 150 పడకలను గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. దీనితో మొత్తం ఆసుపత్రిలో పడకల సంఖ్య 500కు చేరింది. ఇందులో కేవలం 200 పడకల ఆసుపత్రిలో ఉండే సిబ్బంది మాత్రమే ఉన్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని భట్టి అన్నారు. సివిల్ సర్జన్స్ 28 మందికిగానూ నలుగురు, 109 మంది నర్సులకుగాను 61 మంది, 13 మంది లాబ్ టెక్నీషియన్స్ ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని వివరించారు. మహిళలకు పురుషులతో ఈసీజీ టెస్టులా? మహిళా రోగులకు పురుషులతో ఈసీజీ పరీక్షలు నిర్వహించే అత్యంత దురదృష్టకర పరిస్తితులు కరీంనగర్ పెద్దాసుపత్రిలో ఉన్నాయి. మేల్ టెక్నీషియన్స్తో ఈసీజీ పరీక్షలు చేయించుకోలేక మహిళలు బయటకు వెళుతున్నారని ఇది అత్యంత బాధాకరమని భట్టి అన్నారు. శానిటేషన్ కు సంబంధించిన స్టాఫ్ కూడా ఎవ్వరు లేరని భట్టి అన్నారు. ఆరోగ్యమంత్రికి కనీసం ఆసుపత్రులను పట్టించుకుంటున్నాడా కరీంనగర్ జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై కనీసం సమీక్ష అయిన చేసారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. జిల్లా ఆసుపత్రిని చూస్తే ఆయన శాఖను పరిశీలిస్తున్నట్లు లేదని అన్నారు. మందులు లేవు, బెడ్ షీట్స్ లేవు, మంచాలు లేవు, కావాల్సిన స్థాయిలో వైద్యులు, ఇతర సిబ్బంది లేరని.. అసలు ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి వీటిని చూస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. 500 పడకల ఆసుపత్రికి తగినంత సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేయాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఆరోగ్య మంత్రి వైద్య, ఆరోగ్య మంత్రి స్వీయ ఆందోళనలతో శాఖను మర్చిపోయినట్లు ఉన్నదని అన్నారు. కేవలం తన రాజకీయ ఆందోళనలో పడి.. ఇతర విషయలను పట్టించుకోవడం లేనట్లు ఉందని, అందుకే రాష్ట్రం జ్వరాల బారిన పడి ఉందని అన్నారు. ఈటల రాజేందర్కు ఆ పార్టీ అధినాయకత్వానికి వాటాల పంపకంలో వచ్చిన తేడాలకు మాకు సంబంధం లేదు.. మీరు రూ. 5 వేలు లంచం కూడా తీసుకోలేదని చెబుతున్నారు.. ఆది మీరు.. మీ నాయకత్వం తేల్చుకోవాల్సిన విషయం..కానీ అవినీతి మాత్రం జరిగిందని.. మీ నాయకులు ప్రశ్నించడంతో మీరు మనస్తాపం చెందారని భట్టి చెప్పారు. మొత్తం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కేసీఆర్కు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: నూతన ప్రాజెక్టులన్నీ తానే డిజైన్ చేస్తున్నానని చెబుతున్న సీఎం కేసీఆర్కు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా అంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల మీద రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేయడాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. దీనిపై ప్రభుత్వం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ప్రాజెక్టుల మీద లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని ప్రభుత్వం బెబుతుంది.. కానీ ఒక్క ఎకరానికయినా నీళ్లు వచ్చాయా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేసిన ఖర్చు పనిలో కనపడాలి కదా అని విమర్శించారు. ప్రాజెక్టులపై చేసిన ఖర్చుపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. భూప్రక్షాళన మీద ఎలాంటి ప్రక్షాళన జరగలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. భూ ప్రక్షాళన పేరు మీద కొత్త సమస్యలు వచ్చాయని భట్టి విక్రమార్క అన్నారు. -
పీఏసీ చైర్మన్గా వనమా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీకి లభించే ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్గా కాంగ్రెస్కు చెం దిన సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వనమా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్లో ఉత్తమ్కుమార్రెడ్డి తర్వాత ఎక్కువ సార్లు గెలుపొందిన ముగ్గు రు ఎమ్మెల్యేల్లో సీనియర్ ఈయన. సీఎల్పీ నేతగా ఎస్సీ నాయకుడిని ఎంపిక చేయడం, పీసీసీ అధ్యక్షుడిగా ఓసీ వర్గానికి చెందిన ఉత్తమ్ ఉండటంతో పీఏసీ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయిస్తారని, ఆ కోటాలో బీసీల్లో సీనియర్ ఎమ్మెల్యే అయి న వనమాను ఈ పదవికి ఎంపిక చేస్తారని టీపీసీ సీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వా త కాంగ్రెస్ తరఫున ఎక్కువ సార్లు గెలిచిన సీని యర్ ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. దీనిలో భాగంగా నారాయణ్ఖేడ్ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన పి.కిష్టారెడ్డిని పీఏసీ చైర్మన్గా నియమిం చింది. అప్పటికే ఐదుసార్లు గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పటికీ ఈయన కంటే 13 ఏళ్ల ముందు ఎమ్మెల్యే అయిన కిష్టారెడ్డిని పీఏసీ చైర్మన్గా నియమించారు. ఆ తర్వాత కిష్టారెడ్డి చనిపోవడంతో రాంరెడ్డి వెంకటరెడ్డిని పీఏసీ చైర్మన్గా నియమిం చారు. వెంకటరెడ్డి కూడా అదే టర్మ్లో చనిపోవడంతో 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలలో సీనియర్ అయిన జె.గీతను ఆ పదవికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఐదుసార్లు గెలిచిన ఉత్తమ్ని ఈసారి పీఏసీ చైర్మన్ పదవికి ఎంపిక చేయాల్సి ఉం టుంది. ఉత్తమ్ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాది. దీంతో ఈసారి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో సీనియర్లకు అవకాశం వచ్చింది. వీరిలో 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో వనమా, సబితా ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉన్నారు. సబితా, శ్రీధర్బాబు పీఏసీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వీరి కంటే సీనియర్ ఎమ్మెల్యే కావడంతో వనమాను పీఏసీ చైర్మన్గా నియమించే అవకాశముందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉపనేతగా రాజ్గోపాల్రెడ్డి.. సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ను పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అసెం బ్లీలోని ఇతర పదవులపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఉపనేతలుగా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఉపనేత పదవి ఖరారైనట్టు తెలుస్తోం ది. ఆయనతో పాటు ఎస్టీ మహిళా కోటాలో సీతక్క, సీనియర్ ఎమ్మెల్యేగా సబిత, గండ్ర వెంకటరమణారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. సీఎల్పీ కార్యదర్శి, విప్ పదవులకు పార్టీ తరఫున పొడెం వీరయ్య, చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, జగ్గారెడ్డి, సుధీర్రెడ్డిలతో పాటు హరిప్రియా నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. -
కేసీఆర్ స్పీచ్లా గవర్నర్ ప్రసంగం
-
‘టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది’
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో అందరిని కలుపుకుని ముందుకెళతానని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభలో ప్రసంగించినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, పింఛన్ గురించి గవర్నర్ ఏం చెప్పలేదని తెలిపారు. పాలకులు.. ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆకర్ష్కు తమ ఎమ్మెల్యేలు లొంగరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు టీఆర్ఎస్లోకి వెళ్లలేదని.. కావాలనే అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. గవర్నర్ ప్రసంగం కాపీ, పేస్ట్లా ఉంది : షబ్బీర్ ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడే మాటలనే గవర్నర్ కాపీ కొట్టారంటూ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీ, పింఛన్, డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు ఇస్తారో గవర్నర్ స్పష్టం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై కూడా గవర్నర్ ప్రసంగంలో మైనార్టీగా ప్రస్తావించారని.. దీని గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘ఉత్తమ్ని తప్పిస్తేనే పార్టీ బతుకుతుంది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించడంపై కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. భట్టికి సీఎల్పీ పదవి ఇవ్వడం మంచి నిర్ణయమని, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మరోసారి రుజువైందని అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉంటే దళితుడు సీఎం అయ్యేవాడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలనీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కూమార్ రెడ్డి అసమర్థుడని విమర్శించారు. సీఎల్పీ కోసం ఉత్తమ్ పాకులాడారనీ, ఎన్నికల్లో ఓటమికి కారణమైన ఆయన వెంటనే రాజీనామా చేయాలని సర్వే డిమాండ్ చేశారు. ఉత్తమ్ నాయకత్వాన్ని నమ్ముకుంటే లోక్సభ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని, ఆయనను తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతుకుతుందని వ్యాఖ్యానించారు. -
భట్టికే సీఎల్పీ కిరీటం...
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా ఖమ్మం జిలా మధిర శాసన సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క నియమితుల య్యారు. ఈ పదవి కోసం పార్టీలోని సీనియర్ నేతలు తీవ్రంగా పోటీపడినప్పటికీ.. భట్టి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆయన్ను సీఎల్పీ నేతగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన భట్టి వైపే రాహుల్ మొగ్గుచూపారు. సామాజిక సమీకరణాల కోణంలోనూ దళిత వర్గాలకు చెందిన భట్టిని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తే బాగుంటుం దనే ఆలోచనతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే ఆనవాయితీ కాంగ్రెస్కు ఉంది. అయితే.. ఈసారి సీఎల్పీ నేత పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు మాజీ మంత్రులు శ్రీధర్బాబు,సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు వినిపించాయి. అయితే, అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచించి భట్టిని సీఎల్పీ నాయకుడిగా నియమించింది. పార్టీ బాధ్యతల్లో ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ను అదే పదవిలో కొనసాగించి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలని అధిష్టానం ఆలోచించింది. చివరి నిమిషంలో ఉత్తమ్ కూడా భట్టి వైపే మొగ్గుచూపారని పార్టీ వర్గాలంటున్నాయి. మహిళల కోటాలో సబితా ఇంద్రారెడ్డి పేరును కూడా తీవ్రంగానే పరిశీలించిన అధిష్టానం.. సీఎల్పీ, పీసీసీ పదవులు రెండూ ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం సరైంది కాదనే అభిప్రాయంతో ఆమె పేరును కూడా పక్కనపెట్టింది. మాజీ మంత్రి శ్రీధర్బాబు పేరు ఈ రేసులో వినిపించినా ఆయన ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవివైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విషయంలో ఎమ్మెల్యేల మద్దతు కొంత లభించినా.. మొదటిసారి ఎమ్మెల్యే కావడం, సామాజిక వర్గం కారణంగా ఆయన వైపు కూడా అధిష్టానం మొగ్గు చూపలేదు. భట్టిని సీఎల్పీ నేతగా నియమించడం ద్వారా.. దళితుడిని సీఎంను చేస్తానని కేసీఆర్ చేయలేదని, తాము దళిత నాయకుడిని తమ సభానాయకుడిగా ఎన్నుకున్నామన్న సందేశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టిన ఖమ్మం జిల్లా ప్రజల నిర్ణయాన్ని గౌరవించినట్టు ఉంటుందని కూడా అధిష్టానం ఆలోచించి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అన్ని అంశాలు కలిసిరావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా మల్లు భట్టివిక్రమార్క నియమితులయ్యారు. ఎమ్మెల్సీగా, డిప్యూటీ స్పీకర్గా గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మల్లు అనంత రాములు సోదరుడైన భట్టి విక్రమార్క 1961లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఆయన ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్గా 1996–2000 నామినేటెడ్ (తొలిసారి) పదవి చేపట్టారు. 1990–92 వరకు పీసీసీ కార్యవర్గ సభ్యుడిగా, 2000–03 వరకు పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2007–2009 వరకు ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భట్టి.. 2014, 18 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే విజయం సాధించారు. 2009లో ప్రభుత్వ చీఫ్ విప్గా, 2014లో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 2015లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి కావాలని కలలుగన్న భట్టి.. ఇంటర్వూ్య వరకు వెళ్లారు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజీలేని పోరాటం చేస్తా: భట్టి తనను సీఎల్పీ నేతగా నియమించడం పట్ల భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తెచ్చేలా పనిచేస్తానని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ‘సాక్షి’కి వెల్లడించారు. -
తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క
-
తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. ఈ రేసులో ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ముందునుంచి ఉండగా.. చివరకు సీఎల్పీ నేతగా అధిష్టానం భట్టి విక్రమార్కను నియమించింది. ఈ మేరకు కొద్దిసేపటిక్రితమే కాంగ్రెస్ అధిష్టానం ఓ లేఖను విడుదల చేసింది. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా.. కాంగ్రెస్ శ్రేణుల్లో సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ నేత ఎంపికను పూర్తిగా అధిష్టానానికే వదిలేశారు. భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే నియమించినట్లు ప్రకటించారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గమైన మధిరలో పండుగ వాతావరణం నెలకొంది. -
సీఎల్పీ నేత: ఏకగ్రీవ తీర్మానం చేయనున్న రాహుల్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతను ఎన్నుకొనే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. ఇందుకోసం రాహుల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలంగాణ పీసీసీ నాయకులంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆయన గురువారం అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు రాహుల్గాంధీ ఆదేశాల మేరకు పీసీసీ కోర్కమిటీ, సీనియర్ నేతలతో తాను సమావేశమయ్యానని తెలిపారు. సీనియర్ నేతల అభిప్రాయం మేరకు సీఎల్పీ నేత ఎన్నిక ఉంటుందని ఆయన చెప్పారు. -
కౌన్ బనేగా సీఎల్పీ నేత?
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పదవి కోసం పార్టీలోని హేమాహేమీలు పోటీపడుతుండటం, అధిష్టానం కూడా మనసులోని మాటను వెల్లడించకపోవడంతో ఉత్కంఠ రేగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కలు ఈ రేసులో ముందున్నారు. మాజీ శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్బాబు పేరు కూడా పరిశీలనలో ఉంది. తమకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఉత్తమ్, భట్టిలు బాధ్యులనే చర్చ జరుగుతున్నందున.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఉత్తమ్ పేరు సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉత్తమ్ను సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తే కొన్నాళ్లు పీసీసీ అధ్యక్షునిగా కూడా కొనసాగించి, తర్వాత ఆ పదవిని భట్టికి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక, భట్టిని సీఎల్పీ నేత చేస్తే.. ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్షుని విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. అధిష్టానం ప్రత్యామ్నాయ నేత కోసం వెతికితే మాత్రం మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, శ్రీధర్ బాబు సీఎల్పీ నేత కన్నా ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. శ్రీధర్బాబు కూడా కాకపోతే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మహిళా కోటాలో పరిశీలించే అవకాశముంది. మొన్నటి ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా సీఎల్పీ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. తొలిసారి ఎమ్మెల్యే కావడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు తనకు గానీ, తన సోదరుడు వెంకటరెడ్డికి గానీ అప్పగిస్తామని అధిష్టానం హామీ ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎల్పీ పదవికి పోటీ ఉండటం, అధిష్టానం కూడా ఈ విషయంలో గుంభనంగా వ్యవహరిస్తుండటంతో గురువారం నాటి సీఎల్పీ భేటీపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్కు వేణుగోపాల్ సీఎల్పీ నేత ఎన్నిక సమావేశానికి అధిష్టానం దూతగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరవుతున్నారు. ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ప్రొటోకాల్ ఇన్చార్జి హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్లు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండ హోటల్ చేరుకున్న వేణుగోపాల్ అక్కడ టీపీసీసీ కోర్కమిటీ సమావేశం నిర్వహించారు. సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ సమావేశం జరగనుంది. -
కాంగ్రెస్లో ‘పెత్తనం’.. జిల్లాకు దక్కేనా?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ జిల్లాలో ఢీలా పడినట్లు కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటూ వచ్చిన ఆ పార్టీ ఈసారి మాత్రం ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఫలితాల చేదు కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడు పడేలా లేదు. దీంతో ఈ ప్రభావం పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం అంతా ఇది వరకు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించేది. సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటి వారు ఓటమి పాలుకావడం ఆ పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం నడుస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు అంత దూకుడుగా కనిపించడం లేదని ఉదహరిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల్లో సంస్థాగత పదవులు, రాజకీయాలపైనే ఎడతెగని చర్చ నడుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాకు చెందిన హుజూర్నగర్ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి వ్యవహరిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఆయన టీ.పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారా..? పక్కకు తప్పుకుని వేరే పోస్టులోకి వెళతారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరిగింది. అసలు అధ్యక్షుడిని మార్చే అవకాశం లేకుంటే, ఉత్తమ్ కుమార్రెడ్డి అదే పదవిలో కొనసాగితే జిల్లాకు అ పదవి ఉన్నట్టే లెక్క. అయితే, ఈ విషయంలో ఏఐసీసీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది..? అసలు టీ.పీసీసీ అధ్యక్షుడి మదిలో ఏముందన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. మొదటినుంచి పీసీసీ పదవిని ఆశిస్తున్న ‘కోమటిరెడ్డి’ సోదరులు సంస్థాగతంగా జరగబోయే మార్పుల కోసం, ఏఐసీసీ నాయకత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంటున్నారు. సీఎల్పీ పదవి.. జిల్లా చేజారేనా? మరోవైపు తెలంగాణ తొలి శాసనసభలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా వ్యవహరించిన జానారెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో జిల్లానుంచి ముగ్గురే ఉండడం, అందులో సీనియర్ అయిన ఉత్తమ్ కుమార్రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో ఈ సారి సీఎల్పీ పదవి జిల్లాకు దక్కేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్ష పదవి , సీఎల్పీ పదవిలో ఏదో ఒకటి తమకు కావాల్సిందేనని కోమటిరెడ్డి సోదరులు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. లోక్సభ సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా తనకు సీఎల్పీ పోస్టును ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించినా.. టీ.పీసీసీ అధ్యక్ష పదవిపైనా ఆయనకు ఆశలు ఉన్నాయంటున్నారు. అయితే, జిల్లాకు ఈ రెండింటిలో ఏదో ఒక పదవి మాత్రమే దక్కుతుంద3న్న అభిప్రాయం కూ డా ఉంది. ఒకవేళ అటు టీ పీసీసీ అధ్యక్ష పదవి కానీ, లేదా సీఎల్పీ నేత పదవి కాని తమకు దక్కని పక్షంలో కో మటిరెడ్డి సోదరులు ఎలాంటి నిర్ణయం తీసుకుం టారో అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. డీసీసీ అధ్యక్ష నియామకంలో ‘వారి’ ముద్ర ఉంటుందా? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను సంక్రాంతిలోపు నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవుల నియమాకంపైనా జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారు..? వారి నియామకాల్లో సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరుల ముద్ర ఉంటుందా చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన బూడిద బిక్షమయ్య గౌడ్ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉండడం, కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించనుండడంతో నల్లగొండకు నూతన డీసీసీ అధ్యక్షుడిని ఖరారు చేయాల్సి ఉంది. జానారెడ్డి తన అనుచరుడు రామలింగయ్య యాదవ్ పేరును ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా, కోమటిరెడ్డి సోదరులు ఎవరి పేరును సూచిం చారన్న విషయం బయటకు రాలేదు. అయితే, వారి అనుచర నేత, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జిల్లాలో కాంగ్రెస్లో సంస్థాగత వ్యవహారాలు చర్చనీయాంశాలుగా మారాయి. -
సీఎల్పీ రేసులో శ్రీధర్బాబు?
సాక్షి, మంథని: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ప్రభుత్వ విప్.. శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును కాంగ్రెస్ శానససభాపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతుంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల నుంచి జీవన్రెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనను సీఎల్పీ ఉపనేత పదవి వరించింది. ఆ ఆనవాయితీ ప్రకారం ఈసారి మంథనికి సీఎల్పీ కేటాయిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంథని నియోజకవర్గంలోనే నిర్మాణంలో ఉండడంతో శాసన సభలో కాంగ్రెస్ తరఫున మాట్లాడే అవకాశం ఉండేలా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు సీఎల్పీ ఇస్తే బాగుంటుందనే ఆలోచన టీపీసీసీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావును నాడు నక్సల్స్ కాల్చి చంపగా ఆయన వారసత్వంగా శ్రీధర్బాబు రాజకీయ అరగ్రేటం చేశారు. మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఉన్నతవిద్య, పౌర సరఫరాల శాఖలతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఏఐసీసీ మెంబర్గా, 2014లో మానిఫెస్టో కమిటీ చైర్మన్గా ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇలా పార్టీలో పదవులు చేపట్టి సీనియర్గా, అజాత శత్రువుగా పేరున్న శ్రీధర్బాబు అర్హతను పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఓడిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా, 10 స్థానాల్లో టీఆర్ఎస్, రామగుండంలో స్వతంత్ర ఎమ్మెల్యే గెలుపొందగా, మంథని నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా శ్రీధర్బాబు విజయం సాధించారు. -
'అప్పుడే నయీంని పట్టుకోవాలని ఆదేశించా'
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం ఆగడాలపై సిట్ విచారణ మంచిదనని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. సిట్ విచారణలో వాస్తవాలు బయటకు రాకపోతే... అప్పుడు సీబీఐ విచారణ గురించి ఆలోచించాలన్నారు. శనివారం హైదరాబాద్లో కె.జానారెడ్డి మాట్లాడుతూ... నేను హోం మంత్రిగా ఉన్నప్పుడు నయీం గురించి కొందరు సమాచారం ఇచ్చారన్నారు. అయితే లిఖిత పూర్వకంగా మాత్రం ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. నయీంను పట్టుకోవాల్సిందిగా నేను పోలీసులను ఆదేశించానని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ అతడి ఆచూకీ దొరకడం లేదని నాకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా నేను చేసిన కృషే కారణమని జానారెడ్డి పేర్కొన్నారు. -
'పాలేరు ప్రజా తీర్పు.. గౌరవిస్తున్నాం'
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో స్పందించారు. ప్రాలేరు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఏదో చేస్తుందని భ్రమపడ్డారని... అందువల్లే ఆ పార్టీని గెలిపించారని చెప్పారు. పార్టీ ఓటమికి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని విశ్లేషించుకుంటామని జానారెడ్డి వెల్లడించారు. -
బాధితులకు జానారెడ్డి పరామర్శ
నల్గొండ: అకాల వర్షాలతో నష్టపోయిన బాధితులను సీఎల్పీ నేత జానారెడ్డి పరామర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా అనుముల మండలం అల్వాల గ్రామంలో ఆయన పర్యటించారు. శుక్రవారం వచ్చిన భారీ గాలివానకు గ్రామంలో సుమారు 40 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆయా కుటుంబాల వారిని, రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు. -
'పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలి'
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీఎల్పీ నేత కె.జానారెడ్డి గురువారం హైదరాబాద్లో పిలుపునిచ్చారు. ఓ పార్టీలో గెలిచి... మరోపార్టీలోకి వెళ్లడం అప్రజాస్వామికమని ఆయన అరోపించారు. గతంలో నేను రాజీనామా చేశాకే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయిస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఫిరాయింపులను ప్రోత్సహించదని చెప్పారు. పార్టీ మారేవారిని అనర్హులుగా ప్రకటించేలా చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి జానారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మెదక్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జానారెడ్డి పైవిధంగా స్పందించారు. -
జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు, మంత్రి కేటీఆర్ లపై ప్రతిపక్ష నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికార టీఆర్ఎస్ పార్టీ రెండేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తానని చెప్పడం సత్యదూరం. రాష్ట్రం కాదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగినా రెండేళ్లలో పూర్తిచేయలేదు. మంత్రి హరీశ్ రావుకు ఇదే నా సవాల్.. ఒకవేళ టీఆర్ఎస్ ఆ పని చేయగలిగితే.. ఆ పార్టీ తెలంగాణకు గొప్పధనమని నిరంతరం చెబుతా' అని వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'పెద్దనేతలను ఎదిరిస్తున్నట్లుగా వ్యవహరిస్తే ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుందనుకోవటం భ్రమ. అలాంటి మాటలు వారి అహంకారానికి నిదర్శనం. నేను ప్రారంభించిన మండల వ్యవస్థను నిర్వహించడానికే కేటీఆర్ ప్రయాసపడుతున్నారు. ఐదేళ్ల తర్వాత ఎవరేంటో ప్రజలే తేలుస్తారంటున్న మంత్రులు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శించడంలో ఏమైనా అర్థం ఉందా?' అని జానా ఫైర్ అయ్యారు. తాగునీటి సదుపాయాల కల్పనకు మంత్రి కేటీఆర్ చేసిందేమీలేదని, తాను మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్లకు కేటాయించిన రూ.50 కోట్లు ఇంకా ఖర్చుచేయనేలేదని జానా వాపోయారు. మాటలు మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని మంత్రులకు చురకలంటించారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక, అమరావతి శంకుస్థాపన తదితర అంశాలపై అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. 'ఇద్దరు సీఎంలు సహకరించుకోవాల్సిన అవసరం ఉందని నేను మొదట్లోనే చెప్పాను. అప్పట్లో నామాట ఎవరైనా విన్నారా అనేది పక్కన పెడితే, ఇప్పటికైనా కలిసి మాట్లాడుకున్నందుకు కేసీఆర్, చంద్రబాబులను అభినందిస్తున్నా' అన్నారు. అమరావతి శంకుస్థాపనకు తాను వెళ్లడంలేదని, అయితే తన సందేశం మాత్రం పంపానని జానా చెప్పారు. -
జానారెడ్డిని మార్చం
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డి మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ నేత కుంతియా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్నిసేకరించలేదన్నారు. డీఎస్ వంటి వారు అధికారం కోసం పార్టీ మారుతున్నారని, ఆయన మారడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ నేత కుంతియా విమర్శించారు. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని కుంతియా వెల్లడించారు. ఇందుకోసం విరాళాలు సేకరిస్తామన్నారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో రాహుల్ పర్యటిస్తారని తెలిపారు. సుమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే వరంగల్ ఉపఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మీరాకుమార్ ప్రస్తావన రాలేదన్నారు. రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ము స్లిం సోదరులకు ఇప్తార్ విందులను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. -
అసెంబ్లీ నుంచి జానారెడ్డి వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి ప్రతిపక్షనేత కె.జానారెడ్డి శుక్రవారం వాకౌట్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నేత జానారెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగల సమస్యను లేవనెత్తారు. దీనిపై సమాధానం చెప్పాలని ఆయన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కోరారు. అందుకు ఆయన సమాధానంపై జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటెల సమాధానంతో తాము సంతృప్తి చెందలేదని తెలుపుతూ జానారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. రెండేళ్లలో లక్ష ఉద్యోగాలకు నోటిపికేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వ చర్యలు చేపట్టనుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పటికే రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో గురువారం ఉస్మానియా యూనివర్శిటీలో నిరుద్యోగుల ఐకాస ర్యాలీ నిర్వహించి.. అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. -
పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం
హాలియా (నల్లగొండ): పార్టీ ఫిరాయింపు అప్రజాస్వామికమని, అనైతికమని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ పార్టీ గుర్తుపై గెలుపొంది మరో పార్టీలోకి వెళ్లడం సరైనది కాదన్నారు. పార్టీ ఫిరాయింపులు ఏ స్థాయిలో జరిగినా, ఎవరు ప్రోత్సహించినా అది సరైన విధానం కాద్దన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారికి ప్రజలే వెంటబడి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలం నుంచి మూడు రోజుల క్రితం టీఆర్ఎస్లోకి వెళ్లిన వారు స్థానిక ప్రజలు, నాయకుల ఒత్తిడి మేరకు ఆత్మపరిశీలన చేసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోనికి వెళ్లిన వారు మళ్లీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన వారు పార్టీ మారాలనుకుంటే పార్టీకి, పదవికిరాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ ఇతర పార్టీలోనికి వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలుపోందాలని సూచించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద వరి, ఇతర పంటలను కాపాడాల్సిన బాధ్యత రె ండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సమావేశంలో ఆయన వెంట జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటిలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కాకునూరి నారాయణ, రావుల శ్రీనివాస్ యాదవ్. యడవెల్లి సోమశేఖర్, మర్ల చంద్రారెడ్డి, పోశం శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. -
'నాకు ఎంపీ పదవి సరిపోదు'
-
'నాకు ఎంపీ పదవి సరిపోదు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో తాము రాయల తెలంగాణ కోరామని... కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇవ్వలేదని టీడీపీ నాయకుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఓ వేళ రాయల తెలంగాణ ఇచ్చి ఉంటే ... అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ... జానారెడ్డి సీఎం అయ్యేవారన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి జేసీ వచ్చారు. అసెంబ్లీ ఛాంబర్లోని పాత మిత్రుడు జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య అసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ప్రాంతీయ పార్టీల్లో ఉండదన్నారు. అందుకే టీడీపీలో తాను స్వేచ్ఛగా లేనన్నారు. ఎంపీ పదవి తనకు సరిపోదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఓవర్ లోడ్ అయ్యిందని చెప్పారు. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు ఇప్పుడు బీజేపీ వేదిక అవుతోందని అన్నారు. ఇందిరా కన్నా మోడీ పవర్పుల్ పీఎం అని చెప్పారు. ఎన్నికల ముందు మోడీ వేరు... ప్రధాని పదవి చేపట్టాక మోడీ వేరని తెలిపారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే రైతులు రోడ్డెక్కుతారని తెలిపారు. టీడీపీ, టీఆర్ఎస్.... ఏ ప్రభుత్వంపైన అయిన ఏడాది తర్వాతే కామెంట్ చేయాలని జేసీ అభిప్రాయపడ్డారు. -
జిల్లాకు..మరో ముఖ్యపదవి
సాక్షిప్రతినిధి, నల్లగొండ :పదేళ్లపాటు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. దీంతో ఆ పార్టీ నాయకత్వం కుంగిపోయింది. ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడాన్ని జీర్ణించుకోలేక పోయింది. అయితే సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డికి సీఎల్పీ పదవి దక్కడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కొంతలో కొంత సంతృప్తిగా ఉన్నాయి. కాగా జానారెడ్డి ఓ దశలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో నిలిచారు. ఆయన ఎన్నికల ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవి రేసులోనూ ముందు వరుస లోనే నిలిచారు. కానీ, చివరి క్షణంలో ఏఐసీసీ నాయకత్వం జానారెడ్డిని కాదని పొన్నాలవైపు మొగ్గుచూపడంతో ఆయనకు అవకాశం దక్కకుండా పోయింది. మెజారిటీ స్థానాలు సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే జానారెడ్డి ముఖ్యమంత్రి పదవికి గట్టి అభ్యర్థిగా ఉండేవారు. కానీ, పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడంతో, కేబినెట్ హోదా ఉండే శాసనసభా పక్ష నేత పదవిపై దృష్టి పెట్టి, ఆ మేరకు విజయం సాధించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు జానారెడ్డి వైపు మొగ్గు చూపడంతో ఆయనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. వాస్తవానికి ఇప్పటికే జిల్లా నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నారు. దీంతో ఒకే జిల్లాకు రెండు కీలకమైన పదవులు ఇస్తారా? ఇవ్వరా? అన్న చర్చ జరిగింది. ఉత్తమ్కుమార్రెడ్డి సైతం సీఎల్పీ నేత పదవి కోసం ప్రయత్నించారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇక, బయటి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు డీకే అరుణ, మల్లు భట్టివిక్రమార్క, టి.జీవన్రెడ్డిలు సైతం సీఎల్పీ నేత పదవి కోసం ప్రయత్నాలు చేశారు. అయితే పోటీ తీవ్రంగా ఉన్నా, పార్టీలో సీనియర్ నేత, అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన (సమైక్య రాష్ట్రంలో) రికార్డు, అనుభవం ఉన్న జానారెడ్డి వైపే కాంగ్రెస్ నాయకత్వం మొగ్గుచూపింది. దీంతో అంతా ఊహించినట్లుగానే సీఎల్పీ నేతగా ఆయనను ప్రకటించింది. గురుతర బాధ్యతే.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ను ఒక విధంగా ముందుండి నడిపించిన జానారెడ్డి.. రాజకీయ జేఏసీ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద దిక్కుగా ఉండి ఉద్యమానికి నాయకత్వం వహించారు. సొంత ప్రభుత్వంపై కూడా ఆయన లేఖాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుని ప్రభుత్వాధినేతలకు వివరించడంలో గతంలోనే పేరు పొందారు. ఇపుడు తెలంగాణ నూతన రాష్ట్రంలో, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే వివిధ ప్రజా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ నవనిర్మాణం తదితర అంశాలపై ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఈ దశలో ఎంతో ‘బ్యాలెన్స్ ’గా ఉంటారనే పేరున్న జానారెడ్డికి సీఎల్పీ పదవి దక్కడంతో ఆయనవర్గీయులు , జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. -
ఓటింగ్ ద్వారా సీఎల్పీ నేత ఎన్నిక!
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం సంకేతాలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన ప్రతిపక్షనేత పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సగం మందికిపైగా పోటీ పడుతున్నారు. మాజీ మంత్రులు కె.జానారెడ్డి, డీకే అరుణ, జె.గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి.జీవన్రెడ్డి, జి.చిన్నారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ప్రధానంగా రేసులో ఉన్నారు. ఈ విషయంలో ఎవరికి వారే పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలుపెట్టారు. అయితే, ఎమ్మెల్యేల మధ్య నున్న పోటీని గమనించిన అధిష్టానం పెద్దలు.. ఓటింగ్ ద్వారా సీఎల్పీ నేతను ఎన్నుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తనను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ మేరకు పరోక్ష సంకేతాలిచ్చినట్లు సమాచారం.