damascus
-
సిరియాలో మళ్లీ ఘర్షణ.. 17 మంది మృతి
డెమాస్కస్: సిరియాలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో భాగంగా 17 మంది మృతిచెందారు. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వంలో అకృత్యాలకు పాల్పడిన ఓ అధికారిని అరెస్టు చేసే సమయంలో ఈ ఘర్షణ వెలుగు చూసింది.వివరాల ప్రకారం.. సిరియాలోని టార్టస్ ప్రావిన్స్లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వంలో అకృత్యాలకు పాల్పడిన ఓ అధికారిని అరెస్టు చేసేందుకు బలగాలు ప్రయత్నించే క్రమంలో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఘర్షణలో 17 మంది చనిపోయారని అక్కడి మీడియా తెలిపింది. ఇదే సమయంలో సిరియా కొత్త అధికారుల జనరల్ సెక్యూరిటీ ఫోర్స్లో 14 మంది చనిపోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.ఇదిలా ఉండగా.. ఇటీవల సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయిన విషయం తెలసిందే. అనంతరం, రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించింది. మరోవైపు.. సిరియాలో తాత్కాలికంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసద్ హయాంలో పలు నేరాలకు పాల్పడిన అధికారులను టార్గెట్ చేస్తున్నారు. -
ఎటు చూసినా మృతదేహాలే
డమాస్కస్: ఎక్కడ చూసినా శవాల కుప్పలు. రాజధాని డమాస్కస్తోపాటు కుతైఫా, ఆద్రా, హుస్సేనియాల తదితర ప్రాంతాల్లో సామూహిక సమాధులు! సిరియాలో ఇటీవల కుప్పకూలిన అసద్ ప్రభుత్వం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుగుబాటుదారులను బంధించి జైళ్లలో చిత్రహింసలు పెట్టడమే గాక దారుణంగా హతమార్చినట్టు తేలింది. అలా అదృశ్యమైనవారి మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ బయటపడుతున్నాయి. సిరియా అంతటా సామూహిక సమాధులేనన్న వార్తల నేపథ్యంలో సిరియన్ ఎమర్జెన్సీ టాస్్కఫోర్స్ (ఈటీఎఫ్) అనే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇటీవల దేశంలో పర్యటించింది. దాని పరిశీలనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటికొచ్చాయి... లక్షల మంది గల్లంతు సిరియాలో తిరుగువాబాటు చేసిన వారందరినీ బషర్ అల్ అసద్ ప్రభుత్వం నిర్బంధించింది. జైళ్లలో పెట్టి చిత్ర హింసలకు గురి చేసింది. ఆ క్రమంలో వేలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అలా 2011 నుంచి ఇప్పటివరకు ఏకంగా లక్ష మందికి పైగా అదృశ్యమయ్యారు. 2014లో కనపించకుండా పోయిన సోదరుడి కోసం ఓ మహిళ, 2013లో అరెస్టయిన కుమారుడి కోసం ఓ తండ్రి ఇప్పటికీ వెదుకుతూనే ఉన్నారు. హయత్ తహ్రీర్ అల్షామ్ (హెచ్టీఎస్) తిరుగుబాటు సంస్థ దేశాన్ని హస్తగతం చేసుకోవడం, అసద్ రష్యాకు పారిపోవడం తెలిసిందే. అనంతరం సిరియా రక్షణ దళం వైట్హెల్మెట్స్తో కలిసి హెచ్టీఎస్ సిరియా అంతటా జైళ్లు, నిర్బంధ కేంద్రాలను తెరిచింది. అసద్ హయాంలో నిర్బంధించిన వేలాది మందిని విడుదల చేసింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయిన తమ ఆత్మీయులకోసం అనేకమంది జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వారేమైనట్టు? తిరుగుబాటుదారులను చిత్రహింసలు పెట్టి చంపాక అసద్ సర్కారు సామూహికంగా ఖననం చేసింది. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలా ఇప్పటికే ఏకంగా లక్షకు పైగా మృతదేహాలను కనుగొన్నారు! సామూహిక సమాధులున్న మరో 66 ప్రాంతాలనూ గుర్తించారు. డమాస్కస్ వాయవ్యంగా ఉన్న కుతైఫా పట్టణంలో వేలాది మృతదేహాలను వేర్వేరు చోట్ల సామూహికంగా ఖననం చేసినట్లు ఈటీఎఫ్ తెలిపింది. డమాస్కస్ విమానాశ్రయ మార్గంలో హుస్సేనియేయాలోనూ సామూహిక సమాధులు బయటపడ్డాయి. దక్షిణ సిరియాలో పన్నెండు సామూహిక సమాధులు కనుగొన్నారు. సిరియాలో గల్లంతైన వారిలో 80,000 మందికి పైగా చనిపోయినట్టు హక్కుల సంఘం ఇప్పటికే తేలి్చంది. 60,000 మందిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బ్రిటన్కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) తెలిపింది. గుర్తించలేని స్థితిలో శవాలు ఖననం చేసి చాలాకాలం కావడంతో చాలావరకు శవాల అవశేషాలే మిగిలాయి. దాంతో మృతులనుగుర్తించడం కష్టంగా మారింది. చేసేది లేక పుర్రెలు, ఎముకలనే భద్రపరుస్తున్నారు. డీఎన్ఏ నమూనాల డాక్యుమెంటేషన్, తదుపరి విశ్లేషణ కోసం బ్లాక్ బాడీ బ్యాగుల్లో విడిగా ఉంచుతున్నారు. హత్యకు గురైన వారిని మున్ముందైనా గుర్తించగలమని ఈటీఎఫ్ ఆశాభావం వెలిబుచి్చంది. -
‘సిరియా విషయంలో రష్యా, ఇరాన్ జోక్యం వద్దు’
డెమాస్కస్: సిరియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారుల దాడులతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడంతో ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అసద్కు రష్యా, ఇరాన్ మద్దతుపై తుర్కీయో కీలక వ్యాఖ్యలు చేసింది.తాజాగా తుర్కీయే విదేశాంగ శాఖ మంత్రి హకస్ ఫిదాన్ మాట్లాడుతూ..‘సిరియా, డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలకు రష్యా, ఇరాన్లు మద్దతు ఇవ్వకూడదు. అసద్కు మద్దతు తెలిపే విధంగా వ్యవహరించకూడదు. ఇప్పటికే వారితో మేము చర్చించాం. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో, టెహ్రాన్లు అసద్కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలు సహాయం చేసినప్పటికీ తిరుగుబాటుదారులే గెలిచేవారు. అయితే, ఫలితం మరింత హింసాత్మకంగా ఉండేది’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే తిరుగుబాటుదారుల కారణంగా సిరియా కల్లోల పరిస్థితుల నెలకొన్నాయి. అధ్యక్షుడు అసద్ పాలనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో దేశ రాజధాని డమాస్కస్తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. అసద్కు రష్యా ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు.మరోవైపు.. సిరియా తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన మొహమ్మద్ అల్ బషీర్ 2025 మార్చి ఒకటో తేదీదాకా పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అల్ బషీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. -
సిరియాలో విధ్వంసం.. స్వదేశానికి బయలుదేరిన భారతీయులు
డెమాస్కస్/బీరూట్: సిరియాలో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తరలి వస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవతో దాదాపు 75 మంది భారతీయులు సిరియా నుంచి స్వదేశానికి బయలుదేరారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరియాలో దారుణ పరిస్థితులు, దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సిరియాను వీడాలని సూచించింది. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీంతో, అక్కడున్న వారంతా స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.సిరియా నుండి కనీసం 75 మంది భారతీయులు పప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. వారంతా మొదట సిరియా నుంచి లెబనాన్ చేరుకుని అక్కడి నుంచి భారత్కు తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు.. డెమాస్కస్, బీరూట్ భారత రాయబార కార్యాలయాల ద్వారా పౌరుల తరలింపునకు సంబంధించి సమన్వయం చేసినట్టు వెల్లడించింది.ఇక, ఇప్పటికీ సిరియాలో ఉన్న భారతీయులు.. డమాస్కస్లోని దౌత్యకార్యాలయం ద్వారా తగిని సాయం పొందాలని కోరింది. ఈ క్రమంలో హెల్ప్లైన్ నంబర్ +963 993385973, వాట్సాప్, ఈ-మెయిల్ hoc.damascus@mea.gov.in ద్వారా టచ్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.Pics of 75 Indians evacuated from war torn #Syria, they are reaching home soon. https://t.co/uw6TWEtIUP pic.twitter.com/wNqagbh758— Abhishek Jha (@abhishekjha157) December 10, 2024 -
ఇంకా తెలవారని సిరియా!
కుటుంబ పాలనలో.. ఆ పాలకుల నియంతృత్వ పోకడలతో యాభై ఏళ్లుగా చిధ్రమైంది సిరియా. దశాబ్దంపైగా సాగిన అంతర్యుద్ధం ఆ నేలపై ఐదు లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. 13 లక్షల మందిని దేశం విడిచిపోయేలా చేసింది. చివరకు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో నియంతాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో.. 2024 డిసెంబర్ 8న సిరియా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చింది. కానీ..సిరియాలో చీకట్లు తొలగినా.. ఇంకా తెలవారలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసద్ పలాయనం తర్వాత ఊహించిందే జరుగుతోంది. ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. అలాగే సైన్యం, భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం.. శాంతిభద్రతలు పూర్తిగా పట్టు తప్పాయి. చాలాచోట్ల దోపిడీల్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరని పని. పోనీ.. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా కొత్త తలనొప్పి వచ్చిపడింది!.నా కేబినెట్లో పని చేసినవాళ్లంతా రెబల్స్కు సన్నిహితులే. కాబట్టి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైనా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. -ప్రధాని ముహమ్మద్ అల్ జలీల్రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేం ఎలాంటి ఆటంకాలు కలిగించబోం.-రెబల్స్ గ్రూప్స్సిరియాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వ ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు తప్పక ఉంటుంది. - విపక్షాల కూటమిసిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు.. ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమే!-హెచ్టీఎస్ గ్రూప్ నేత డిమ మౌస్సాపైన ప్రకటనలన్నీ ప్రభుత్వ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరులో అవి తలమునకలైపోయాయి. ప్రభుత్వ ఏర్పాటునకు ప్రభుత్వాలు ముమ్మరం చేశామని, చర్చలు జరుపుతున్నామని చెప్పిన రెబల్ గ్రూప్ హెచ్టీఎస్.. ఇంకోపక్క యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తూర్పు సిరియాలోనే అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్పై పట్టుకోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది. ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై.. టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇంకా కొన్ని రెబల్ గ్రూప్స్.. పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇవికాకుండా..ఇదీ చదవండి: అసద్ పీఠాన్ని కూలదోసిన పిల్ల చేష్టలు!సిరియాలో ఆయుధ కారాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా రసాయనిక ఆయుధాలు హెజ్బొల్లాలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాము దాడుల్ని కొనసాగిస్తున్నామని ప్రకటించుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు అమెరికా కూడా సహాకారం అందిస్తోంది. మరోవైపు.. ఈ పరిణామాలను ఉగ్ర సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే రెబల్స్లో కొన్నింటికి వీటి మద్దతు ఉంది. హెచ్టీఎస్ లాంటి సంస్థ మూలాలు ఆల్ఖైదా నుంచే ఉన్నాయి. పైగా ఒకప్పుడు అలావైట్, సున్నీల మధ్య చిచ్చులో జిహాదీ గ్రూపులు చలి కాచుకున్న చరిత్ర ఉండనే ఉంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తితే గనుక ఆ గ్రూపులు మరింత బలపడొచ్చు.ప్రస్తుతానికి.. సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. అంతర్యుద్ధం ముగిసిపోయిందనడానికి అస్సలు వీల్లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తోంది. వీటికి తోడు విదేశీ జోక్యం ఈ సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి.. వీలైనంత త్వరగా అధికార శూన్యత భర్తీ జరిగి.. దేశం వెలుతురు దిశగా పయనించాలని సిరియా ప్రజానీకం బలంగా కోరుకుంటోంది. -
కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా..
బీరూట్: రెండు పుష్కరాల క్రితం అన్యమనస్కంగా అధ్యక్ష పీఠంపై కూర్చున్న అసద్ తదనంతరకాలంలో నిరంకుశ నేతగా ఎదిగిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డమాస్కస్ మెడికల్ కాలేజీలో చదివిన అసద్ తర్వాత ఆప్తమాలజీ చదివేందుకు బ్రిటన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అసద్ తొలినాళ్లలో లండన్లో నేత్ర వైద్యునిగా సేవలందించేవారు. 1971 సంవత్సరం నుంచి సిరియాను తన ఉక్కుపిడికిలి కింద పాలిస్తున్న తన తండ్రి హఫీజ్ మరణంతో 2000 సంవత్సరంలో అసద్ స్వదేశం తిరిగొచ్చాడు. సానుభూతిపరుల మద్దతుతో అయిష్టంగానే అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు. అధ్యక్ష పదవికి కనీస అర్హత వయసు అయిన 40 ఏళ్లుకూడా నిండకపోవడంతో ఈయన కోసం పార్లమెంట్లో చట్టసవరణ చేశారు. నిజానికి హఫీజ్ తన పెద్ద కుమారుడు బస్సెల్ను తన వారసునిగా చూడాలనుకున్నారు. అయితే 1994లో కారు ప్రమాదంలో బస్సెల్ మరణించడంతో అసద్ అసలైన వారసుడయ్యారు. 2011దాకా అసద్ పాలనపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ అరబ్ విప్లవం మొదలయ్యాక 2011 మార్చిలో అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు డమాస్కస్, డేరా నగరాల్లో వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేశారు. వీటిని అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి నుంచి అసద్ నిరంకుశ పాలనకు తెరలేపారు. మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాతి ఏడాది అలెప్పో సిటీలో ఘర్షణలు పెరిగాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమించుకోగా నాలుగేళ్లు కష్టపడి సైన్యం తిరిగి స్వాధీనంచేసుకుంది. ఆ తర్వాత తూర్పు ఘాతాలో ప్రభుత్వం జరిపిన రసాయన ఆయుధ దాడిలో ఏకంగా వందలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. దీంతో ఐసిస్ ఉగ్రసంస్థ విజృంభించి రఖాను స్వాధీనం చేసుకుంది. 2019దాకా ఐసిస్ పట్టుకొనసాగింది. అయితే 2015 సెప్టెంబర్లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకున్నారు. అయితే 2017 ఏప్రిల్లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా రంగ ప్రవేశం చేశాయి. 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ పలాయనం చిత్తగించక తప్పలేదు. అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 11 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు. అసద్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
సిరియాలో ముదిరిన అంతర్యుద్ధం..
-
అసద్ పాలన అంతం
డమాస్కస్/బీరూట్: అర్ధ శతాబ్దానికిపైగా అసద్ కుటుంబ అరాచక, నిరంకుశ పాలనలో, అంతర్యుద్ధంతో అణచివేతకు, వెనకబాటుకు గురైన పశ్చిమాసియా దేశం సిరియా చరిత్రలో కీలక పరిణామం సంభవించింది. ఒక్కో నగరాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులు ఆదివారం దేశ రాజధాని డమాస్కస్లో కాలుమోపి అసద్ పాలనకు తెరదించారు. అధ్యక్షుడుసహా భద్రతా బలగాలు దేశాన్ని విడిచి పారిపోవడంతో ఇక సిరియాకు స్వేచ్ఛ లభించిందని తిరుగుబాటుదారులు ప్రకటించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయిన ప్రజలు ఆయన పాలన అంతమైందని తెల్సి వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. భద్రతా బలగాలు వదిలివెళ్లిన తుపాకులు టీనేజర్లు తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపి హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అన్యాయంగా ఏళ్ల తరబడి కారాగారాల్లో చీకటి కొట్టాల్లో మగ్గిపోయిన అమాయకులందరినీ సయ్యద్నాయా జైలు నుంచి విడిపించినట్లు తిరుగుబాటుదారులు ప్రభుత్వ టెలివిజన్ ఛానెల్లో అధికారికంగా ప్రకటించారు. రక్షణశాఖ కార్యాలయం ఉన్న ప్రఖ్యాత ఉమాయద్ స్కే్కర్ వద్దకు చేరుకుని జనం మూడు నక్షత్రాలు, త్రివర్ణ సిరియా విప్లవ జెండాలను ఎగరేశారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘‘ ఇడ్లిబ్ నుంచి మొదలెట్టి డమాస్కస్ సిటీదాకా రావడానికి తిరుగుబాటు సింహాలకు ఎంతోకాలం పట్టలేదు. మా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం’’ అని స్థానికులు ఆనందంతో చెప్పారు. దేశాధ్యక్షుడు, సైనిక కాపలాలేని అధ్యక్ష కార్యాలయం, అసద్ కుటుంబ నివాసాల్లోకి జనం చొరబడి అక్కడి విలువైన వస్తువులు, నిత్యావసర సరకులు ఎత్తుకెళ్లారు. దేశం రెబెల్స్ చేతుల్లోకి వెళ్లడంపై దేశ ప్రధాని మొహహ్మెద్ ఘాజీ అల్ జలానీ స్పందించారు. ‘‘ అధ్యక్షుడు పారిపోయారు. నేనెక్కడికీ పారిపోలేదు. నా సొంతింట్లోనే ఉన్నా. అధికారంలోకి రాబోతున్న విపక్షాలు, తిరుగుబాటుదారులకు ఇదే నా ఆహ్వానం. అధికార మార్పిడికి సిద్ధం. ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేయడం, లూటీచేయడం మానుకోవాలి’’ అని ప్రధాని ఘాజీ జలానీ వీడియో సందేశంలో ప్రకటించారు. నిరంకుశ పాలన ముగిందని తెలిసి గత 14 ఏళ్లుగా తుర్కియే, జోర్డాన్, లెబనాన్ దేశాల్లో తలదాచుకుంటున్న సిరియన్లు చాలా మంది మళ్లీ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఇడ్లిబ్ వద్ద జాతీయరహదారి వద్ద క్యూ కట్టిన కార్లతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లెబనాన్లోని మస్కా బోర్డర్ గుండా సిరియన్లు లోపలికి వస్తున్నారు. ‘‘ బషర్ పాలనతో పోలిస్తే ఇకపై సిరియాలో పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉండొచ్చు. అందుకే స్వదేశం వెళ్తున్నాం’’ అని హమా నుంచి శరణార్థిగా లెబనాన్కు వచ్చిన సమీ అబ్దెల్ లతీఫ్ చెప్పారు.మెరుపువేగంతో ఆక్రమణ2018 ఏడాది తర్వాత తిరుగుబాటుదారులు మళ్లీ డమాస్కస్ దాకా రాలేకపోయారు. కానీ నవంబర్ 27 నుంచి విపక్షాల దన్నుతో రెబల్స్ మెరుపువేగంతో ముందుకు కదిలారు. సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్న ఇరాన్, రష్యాల నుంచి అసద్ సైన్యానికి ఎలాంటి ఆయుధ, సైనిక సాయం లేకపోవడంతో తిరుగుబాటుదారులకు ఎదురే లేకుండాపోయింది. అలెప్పో, హమా, హోమ్స్ మొదలు సిరియా దక్షిణప్రాంతాన్నంతా ఆక్రమించిన రెబెల్స్ వడివడిగా రాజధాని డమాస్కస్ వైపుగా కదిలి విజయపతాకం ఎగరేశారు. హయత్ తహ్రీర్ అల్–షామ్(హెచ్టీఎస్) గ్రూప్ నేతృత్వంలో ఈ తిరుగుబాటుదారులు అసద్ సైన్యంతో పోరాడి యావత్ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 2017 నుంచే వాయవ్య సిరియా మొత్తాన్ని పాలిస్తున్న హెచ్టీఎస్ గ్రూప్ ఇప్పుడు యావత్సిరియాను సురక్షిత దేశంగా ఏ విధంగా పాలిస్తుందో వేచిచూడాల్సిందే. అంతర్యుద్ధాన్ని రూపుమాపి, అమెరికా ఆంక్షలను తట్టుకుని దేశాన్ని ముందుకు నడిపించాల్సి ఉంది. అంతర్జాతీయ సమాజంతోపాటు, మైనారిటీల మెప్పు పొందేందుకు బహుళత్వాన్ని, పరమత సహనాన్ని సాధించేందుకు హెచ్టీఎస్ అధినేత అబూ మొహమ్మెద్ గోలానీ ఏ మేరకు సిద్ధపడతారోనని పశ్చిమాసియా దేశాలు ఎదురుచూస్తున్నాయి. ‘‘తక్షణం జెనీవాలో చర్చలు మొదలెట్టి కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు, సాధారణ రాజకీయ, అధికార మార్పిడి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి’’ అని ఐరాసలో సిరియా రాయబారి గెయిర్ పెడర్సన్ కోరారు. సిరియాలో అసద్పాలన అంతమైన నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, జోర్డాన్, రష్యా, తుర్కియే, ఖతార్ దేశాల విదేశాంగ మంత్రులు అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. అదును చూసి ఆక్రమించిన ఇజ్రాయెల్సిరియాతో సరిహద్దును పంచుకుంటున్న ఇజ్రాయెల్ ఈ పరిణామాన్ని తనకు అనువుగా మార్చుకుంటోంది. 1974లో కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ గోలన్హైట్స్ సమీప నిస్సైనికీకరణ(బఫర్జోన్) ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సేనలు ఆక్రమించాయి. యుద్ధం సందర్భంగా 1967 జూన్లో సిరియా నుంచి గోలన్హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన విషయం విదితమే. దేశం తమ స్వాధీనంలోకి వచ్చిన నేపథ్యంలో తన పేరును అహ్మద్ అల్షారాగా గోలానీ మార్చుకున్నారు. తొలిసారిగా డమాస్కస్లోని ఉమయ్యాద్ మసీదుకు వచ్చి అందరి సమక్షంలో ప్రసంగించారు. ‘‘ ప్రభుత్వ సంస్థల వద్ద కాల్పులు జరపకండి. అధికార మార్పిడి జరిగేదాకా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రధాని ఘాజీ జలానీ సారథ్యంలోనే పనిచేస్తాయి’’ అని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఆపేందుకు సోమవారం ఉదయం దాకా డమాస్కస్లో కర్ఫ్యూ విధించారు. ‘‘ సిరియా ఇప్పుడు అందరికీ. డ్రూజ్లు, సున్నీలు, అల్లవీట్, మైనారిటీలందరికీ సమాన హక్కులుంటాయి’’ అని రెబల్ కమాండర్ అనాస్ సల్ఖాదీ ప్రకటించారు. రెబల్స్కు మద్దతు తెలుపుతున్నట్లు ఆదివారం యెమెన్ ప్రకటించింది. జర్మనీ, ఫ్రాన్స్సహా చాలా యూరోపియన్ దేశాలు అసద్ పాలన అంతంపై హర్షంవ్యక్తంచేశాయి. 🚨Breaking NewsDamascus has fallen. Syria Rebel forces took over the capital.🇸🇾 Assad is expected to leave the country soon, US officials say. pic.twitter.com/YAsXFu0lO1— MediaMan (@Mr_Sheriiii) December 8, 2024సురక్షితంగా భారతీయులు న్యూఢిల్లీ: అసద్ ప్రభుత్వం కూలిపోయి సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లినాసరే అక్కడి భారతీయులు క్షేమంగానే ఉన్నారని భారత సర్కార్ ఆదివారం స్పష్టంచేసింది. డమాస్కస్లో భారత రాయబార కార్యాలయం యథాతథంగా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్కడి భారతీయులతో ఇండియన్ ఎంబసీ సంప్రతింపులు జరుపుతోందని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆయా వర్గాలు వెల్లడించాయి.రష్యాలో అసద్ ?మిత్రదేశాలు ఇరాన్, రష్యాల నుంచి సైనికసాయం అందక, సొంత సైన్యంతో తిరుగుబాటుదారులను ఎదుర్కొనే సామర్థ్యంలేక అధ్యక్షుడు అసద్ దేశాన్ని వీడారు. రష్యా తయారీ ఇలూషిన్–ఐఎల్76 రకం సిరియా ఎయిర్ఫ్లైట్ నంబర్ 9218 విమానంలో ఆదివారం తెల్లవారుజామునే అసద్ దేశం వదిలి పారిపోయారని సిరియా స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అసద్ రష్యా లేదా ఇరాన్కు పారిపోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే అసద్కు, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం కల్పించినట్లు ఆదివారం రాత్రి వార్తలు వెలువడ్డాయి. ఆయన మాస్కో చేరుకున్నట్లు తెలిపాయి. అసద్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారుల జాడ కూడా తెలీడంలేదు. సైన్యాధికారులు ఇరాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. దేశం విడిచివెళ్లడానికి ముందే అసద్.. తిరుగుబాటుదారులతో హడావిడిగా చర్చలు జరిపి శాంతియుతంగా అధికార మార్పిడిపై తగు సూచనలు చేసి వెళ్లారని రష్యా విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇంకా తమ సైనిక స్థావరం సిరియాలోనే కొనసాగుతుందని రష్యా స్పష్టంచేసింది. రష్యా ముఖం చాటేయడంతోనే అసద్ పారిపోయాడని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.సుస్థిర శాంతి సాధ్యమా?ఇన్నాళ్లూ అసద్ ఏలుబడిలో యావత్ సిరియా లేదని వాస్తవ పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. 14 రాష్ట్రాలకుగాను కేవలం మూడు రాష్ట్రాల్లోనే అసద్ పాలన కొనసాగుతోంది. మిగతా చోట్ల వేర్వేరు తిరుగుబాటుదారుల కూటములు, మిలిటెంట్ ముఠాలు పాలిస్తున్నాయి. తక్కువ ప్రాంతానికి పరిమితమైనాసరే ఇరాన్, రష్యాల ప్రత్యక్ష సహకారం ఉండబట్టి అసద్ పరిపాలిస్తున్న ప్రాంతానికి మాత్రమే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్టీఎస్ తిరుగుబాటుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. గోలన్హైట్స్సహా కొంతభాగాన్ని దశాబ్దాల క్రితమే ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది.زندانیان آزاد شده از زندان صیدنایاPrisoners released from Saydnaya Prison#دمشق #سوریه #Syria #Damascus #بشار_الأسد pic.twitter.com/HI0ZW6G9H0— Nima Cheraghi (@CheraghiNima) December 8, 2024 -
డెమాస్కస్ శివార్లకు చొచ్చుకొచ్చిన రెబెల్స్
డెమాస్కస్: సిరియాలో అస్పాద్ ప్రభుత్వంపై తిరుగుబాటుదార్ల పైచేయి కొనసాగుతోంది. శనివారం రాత్రి వారు హోమ్స్ నగరంలోని శివారు ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా రాజధాని డెమాస్కస్ శివార్ల దాకా చొచ్చుకొచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హోమ్స్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అస్సాద్ అనుకూల బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం పల్మీరా తదితర ప్రాంతాల నుంచి బలగాలను, సైనిక వాహనాలను రప్పిస్తోంది. అంతకుముందు, దక్షిణ ప్రాంతంలోని నా లుగో నగరం దారాలో తిరుగుబాటుదార్లు తిష్టవేయడం తెల్సిందే. పరిస్థితులు వేగంగా మారుతుండటంతో బషర్ అల్ అస్సా ద్ ప్రభుత్వం యూఏఈ, జోర్డాన్, ఇరాక్ ప్రభుత్వాలను ఆయుధ సాయం, నిఘా సమాచారం అందించాలంటూ కోరినట్లు చెబుతున్నారు. పరిస్థితులు విషమిస్తున్నందున వెంటనే దేశం విడిచి వెళ్లాలని అస్సాద్కు అరబ్ నేతలు కొందరు సూచించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.అమెరికా జోక్యం చేసుకోబోదు: ట్రంప్సిరియా సంక్షోభంలో తమ దేశం జోక్యం చేసుకోబోదని అమెరికా కాబో యే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ‘సిరియా సమస్యల్లో చిక్కుకుంది. అయితే, అది మా మిత్ర దేశం కాదు. అమెరికాకు ఆ దేశంతో సంబంధం లేదు. అది మా పోరాటం కాదు. వాళ్లను పోరాడుకోనివ్వండి. మేం తలదూర్చం’అని తెలిపారు. ‘ఉక్రెయిన్తో యుద్ధంలో తలమునకలుగా ఉన్న రష్యా మిత్రదేశం సిరియాలో తిరుగుబాటుదార్లను ఆపలేకపోతోందనుకుంటున్నా. సిరియా నుంచి రష్యా బలగాలను వెళ్లగొడితే అది రష్యాకే మంచిది. ఎందుకంటే సిరియా లో ఉండి రష్యా లాభ పడిందేమీ లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
సిరియా టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు.. భారీగా ప్రాణ నష్టం
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 15 మంది చనిపోయినట్టు సిరియా స్టేట్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రధాన కార్యాలయాలు, సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా రాజధానికి పశ్చిమాన ఉన్న మజ్జే, ఖుద్సాయా శివారులో ఉన్న భవనాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 15 మంది మరణించినట్టు స్థానిక మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది.ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా సిరియాలో ఇరాన్ సంబంధిత లక్ష్యాలపై దాడులు చేస్తోంది. అయితే, గాజా యుద్ధానికి దారితీసిన ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గత ఏడాది అక్టోబర్ 7 దాడి చేసినప్పటి నుండి డెమాస్కస్లో దాడులను వేగవంతం చేసింది. హిజ్బొల్లాకు చెందిన కమాండర్లు, రివల్యూషనరీ గార్డ్లు మజ్జేలో నివసిస్తున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. 🔶 Reports: The IDF attacked the Almazehh neighborhood in Damascus - shortly after a senior Iranian adviser landed in the cityAccording to reports, in the last few minutes the Air Force carried out an airstrike in the Almazzeh neighborhood .. pic.twitter.com/hMnhuiAJzq— Monika (@Monika_is_His) November 14, 2024 ఇదిలా ఉండగా.. హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్కు భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్లో హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 47కి పెరిగింది. ఓ గ్రామంలో జరిగిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 🇮🇱🇸🇾 Israel wipes out an entire neighborhood in Damascus, Syria pic.twitter.com/TarWpmw8We— HOT SPOT (@HotSpotHotSpot) November 14, 2024 -
సిరియాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
డమాస్కస్:సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో ఓ అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోగా 11 మంది దాకా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో పిల్లలు,మహిళలు ఉన్నట్లు సిరియా మీడియా వెల్లడించింది. దాడుల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని తెలిపింది.ఇజ్రాయెల్లోని గోలాన్ హైట్స్ నుంచి మూడు మిసైల్స్ అపార్ట్మెంట్పైకి దూసుకువచ్చి ఈ దాడులు జరిపాయి. ఇరాన్ మిత్రదేశమైన సిరియాపై కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. అక్టోబర్7 హమాస్ తమపై జరిపిన మెరుపు దాడుల తర్వాత సిరియాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా చితికిపోయింది: అమెరికా -
Israel-Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి, ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్ను హెచ్చరించింది. ఇజ్రాయెల్కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నుంచి తమ విమానాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకూ రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాలు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. ఆ నౌకలో భారతీయులు 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్లోని హొర్మూజ్ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్లోని జొడియాక్ గ్రూప్నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వా«దీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. -
Wall Street Journal: ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమైన ఇరాన్!
వాషింగ్టన్: సిరియా రాజధాని డమాస్కస్లోని తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ఎంబసీపై దాడిలో ఆర్మీ జనరళ్లు, సైన్యాధికారుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. దాడి చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతొల్లా అలీ ఖమేనీ చెబుతున్నాసరే ఆ దేశం తన నిర్ణయంపై వెనకడుగు వేసే పరిస్థితి లేదని కథనం వెల్లడించింది. నిజంగా దాడి జరిగితే పశి్చమాసియాలో యుద్ధజ్వాలలు ఊహించనంతగా ఎగసిపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. యుద్ధ సంసిద్దతపై వార్ కేబినెట్, రక్షణ శాఖ అధికారులతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ శుక్రవారం సమావేశం నిర్వహించారు. హమాస్తో ఇప్పట్లో ఆగని యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్.. ఇరాన్తోనూ కయ్యానికి కాలు దువ్వడంపై పశి్చమదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డమాస్కస్పై దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ చెబుతుండగా ఇంతవరకూ ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏప్రిల్ ఒకటోతేదీ నాటి ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్సంభాషణలో కోరారు. ఇరాన్ విషయంలో మీకు పూర్తి మద్దతు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్, ఇరాన్లకు వెళ్లకండి పౌరులకు భారత సర్కార్ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కారి్మకులుగా భారత్ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్కు పంపబోమని భారత్ శుక్రవారం స్పష్టంచేసింది. -
ఇజ్రాయెల్ టార్గెట్ మిస్?.. ఇరాన్ ఎంబసీపైకి మిస్సైళ్లు!
గాజా సంక్షోభ నేపథ్యంలో.. ప్రత్యర్థి దేశాలపై ఇజ్రాయెల్ తన దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సోమవారం సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరిపింది. ఈ దాడిలో మొత్తం 11 మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ఎంబసీ లక్ష్యంగా జరిగి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. గాజా యుద్ధంలో ఇరాన్ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇజ్రాయెల్ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్ తరఫున సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని.. ఎనిమిది మంది ఇరాన్, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ జరిపిన ఐదో దాడి ఇది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు ఇరాన్ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. మిస్ టార్గెట్? సిరియాలో ఇరాన్ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో సోలెయిమానీ చనిపోయాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు సిరియా రాజధానిలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడిని లెబనాన్ రెబల్ గ్రూప్ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి. -
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు..ఐదుగురు మృతి
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజధానిలోని నివాస భవనసముదాయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని ప్రభుత్వ వార్తా సంస్థ సనా పేర్కొంది. వందల ఏళ్లనాటి కోట, ఒక కళాశాల ధ్వంసమయ్యాయని వివరించింది. ఇరాన్ అనుకూల హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 15 మంది చనిపోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. -
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్: ఇజ్రాయెల్ ప్రభుత్వం మరోమారు సిరియాపై దాడులకు తెగబడింది. సిరియా రాజధాని నగరం డమాస్కస్లోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్పై క్షిపణి దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు సిరియా సైనికులు, ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది మరణించారు. ఎయిర్పోర్ట్లో ఒకవైపు రన్వే దెబ్బతింది. రెండు టర్మినళ్లలో నిర్వహణ వ్యవస్థ ధ్వంసమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ దాడి ఘటన జరిగింది. గత ఏడు నెలల్లో డమాస్కస్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించడం ఇది రెండోసారి. బషర్ అల్ అసద్కు మద్దతు పలుకుతున్న స్థానిక ఉగ్రవాదులకు ఇరాన్, లెబనాన్ హిజ్బుల్లాల నుంచి ఆయుధాల సరఫరాను అడ్డుకునేందుకే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్తోపాటు డమాస్కస్ దక్షిణాన ఉన్న సిరియా ఆయుధాగారంపైనా ఇజ్రాయెల్ క్షిపణులను ఎక్కుపెట్టింది. వెస్ట్బ్యాంక్లో కాల్పులు రమల్లా: ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యంతో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పాలస్తీనియన్లు చనిపోయారు. జెనిన్లోని కాఫిర్దాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ఆర్మీని పాలస్తీనియన్లు అడ్డుకున్నారు. దీంతో ఆర్మీ వారిపైకి కాల్పులకు దిగింది. కాల్పుల్లో సమెర్ హౌషియెహ్(21), ఫవాద్ అబెద్(25) అనే వారు మృతి చెందారు. -
ఈ గ్రహం మీద అదే గొప్పదట, పోదామా,పోదామా.. వియన్నా!
పారిస్: ఆస్ట్రియా రాజధాని వియన్నా ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా దెబ్బతిన్న ఆస్ట్రేలియా నగరం ఆక్లాండ్ 34వ స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా వియన్నా టాప్లోకి దూసుకొచ్చింది. అలాగే ఈ ఏడాది కూడా సిరియా రాజధాని డమాస్కస్ ఈ గ్రహం మీద అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 173 నగరాల్లో ఒక వ్యక్తి జీవనశైలికి ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటుంది. కరోనా కారణంగా మ్యూజియంలు, రెస్టారెంట్లు మూవేత కారణంగా 2021 ప్రారంభంలో ర్యాంకింగ్స్లో 12వ స్థానానికి పడిపోయిన వియన్నా, తిరిగి 2018, 2019 మాదిరిగా టాప్లోకి వచ్చిందని నివేదిక పేర్కొంది. వియన్నా తర్వాత డానిష్ రాజధాని కోపెన్హాగన్ రెండు, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్, కెనడాలోని కాల్గరీ సంయుక్తగా మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి. కోపెన్హాగన్ వాంకోవర్ ఐదవ స్థానంలో, స్విస్ నగరం జెనీవా ఆరో స్థానంలో, జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్ట్ ఏడో స్థానంలో, టొరంటో ఎనిమిదో స్థానంలో, నెదర్లాండ్స్కు చెందిన ఆమ్స్టర్డామ్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఈ మేరకు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) వార్షిక నివేదికను గురువారం ప్రచురించింది. డమాస్కస్ ఫిబ్రవరి చివరలో రష్యా వార్ తర్వాత ఉక్రేనియన్ రాజధాని కైవ్ ఈ సంవత్సరం ఈ జాబితాలో చోటు కోల్పోయింది. ఈఐయూ సర్వేలో ఈ నగరాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే "సెన్సార్షిప్", పాశ్చాత్య ఆంక్షల ప్రభావంపై రష్యన్ నగరాలు మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ ర్యాంకింగ్లలో కిందికి పడిపోయాయి. రష్యా రాజధాని మాస్కో 15 స్థానాలు క్షీణించగా, సెయింట్ పీటర్స్బర్గ్ 13 స్థానాలు దిగజారింది. మొదటి పది నగరాల్లో ఆరు నగరాలు యూరప్వి కావడం విశేషం. జపాన్కు చెందిన ఒసాకా, ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్లు పదో స్థానాన్ని దక్కించుకోగా, ఫ్రాన్స్ రాజధాని పారిస్ గతేడాదితో పోలిస్తే 23 స్థానాలు ఎగబాకి 19వ స్థానంలో నిలిచింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ కెనడాలోని మాంట్రియల్ కంటే 24వ స్థానంలో ఉంది. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ ప్రపంచంలో అత్యంత నివసించదగిన నగరాలలో 33వ స్థానంలో ఉంది. పారిస్ స్పెయిన్కు చెందిన బార్సిలోనా మాడ్రిడ్ వరుసగా 35, 43 స్థానాల్లో నిలిచాయి. ఇటలీకి చెందిన మిలన్ 49వ ర్యాంక్లో, న్యూయార్క్ 51వ స్థానంలో, చైనాలోని బీజింగ్ 71వ స్థానంలో నిలిచాయి. అలాగే 2020 పోర్ట్ పేలుడుతో సర్వ నాశనమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్, రాజధాని బీరుట్ కూడా ర్యాంకింగ్లో జాబితాలో చోటు కోల్పోయింది. -
సిరియాలో సైన్యం లక్ష్యంగా బస్ బాంబు పేలుడు
డమాస్కస్: సిరియా సైనికులను లక్ష్యంగా చేసుకుని జరిగిన బస్ బాంబు దాడిలో 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా రాజధాని నగరం డమాస్కస్లో బుధవారం ఈ దాడి జరిగింది. బుధవారం ఉదయం రద్దీ సమయంలో డమాస్కస్లోని ఒక జంక్షన్ వద్ద ఈ పేలుడు జరిగింది. సిరియా సైనికులు ప్రయాణిస్తున్న ఒక బస్కు ముందుగానే ఆగంతకులు రెండు శక్తివంతమైన బాంబులను అమర్చారు. సైనికులతో బస్సు కదులుతుండగా ఆ బాంబులను పేల్చేశారు. ఈ ఘటనలో 14 మంది సైనికులు మరణించారు. సిరియా అధ్యక్షుడు బషర్–అల్–అస్సద్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే విపక్ష సాయుధ కూటములు, జిహాదీ సంస్థలు ఈ దాడికి పాల్పడి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసద్ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అధీనంలోని ప్రాంతంలో సైన్యం జరిపిన దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లోని ఓ పట్టణంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఎనిమిది మంది చిన్నారులు, ఒక ఉపాధ్యాయురాలు, ఒక మహిళ చనిపోయారు. -
డమాస్కస్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
డమాస్కస్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మేరిల్యాండ్: అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన అధ్యాయం లిఖించారని అమెరికాలోని మేరిల్యాండ్లో ఉన్న ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని డమాస్కస్ నగరంలో జులై 11న ఘనంగా జరిగాయి.వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థసారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, పవన్ ధనిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో గల అనుబంధాన్ని ప్రవాస భారతీయులు గుర్తుచేసుకున్నారు. - వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టి, ప్రతీ పేదవాడికి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. గత పదేళ్లుగా వైఎస్సార్ జయంతి, వర్ధంతిలతో పాటు బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వైఎస్సార్ పేరు మీదుగా మేరిల్యాండ్లో జరుపుతున్నామని తెలిపారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే నవరత్నాలకు సీఎం జగన్ రూపకల్పన చేశారని తెలిపారు. - వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలం లో కూడా ఇంత మంది ఈ వేడుకల్లో భాగం కావడం చూస్తుంటే రాజశేఖరరెడ్డి ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. - మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జ్ మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ సారధిరెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. - వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు పవన్ ధనిరెడ్డి మాట్లాడుతూ... అందరికీ మంచి చేయాలనే తపనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ తపన ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు రాజశేఖర్ యరమల మాట్లాడుతూ... కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్సార్కు అభిమానులు ఉన్నారని చెప్పారు. పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థ సారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు భాస్కర బొమ్మారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కొండా, వెంకట్ యర్రం, పవన్ ధనిరెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, రాజశేఖర్ రెడ్డి యరమల, రవి బారెడ్డి, మురళి బచ్చు, రాంగోపాల్ దేవపట్ల, శ్రీనివాస్ పూసపాటి, రామకృష్ణ, వాసుదేవ రెడ్డి తల్లా, గిరిధర్ బండి, సతీష్ బోబ్బా, పూర్ణశేఖర్ జొన్నల, శ్రీనాథ్, వెంకట్ కీసర, శ్రీనివాస్ పూతన, రామచంద్ర యారుబండి, నాగిరెడ్డి, లక్ష్మి నారాయణ, కరుణాకర్ వణుకూరి, అనంత్ పూసపాటి, శివ పిట్టు, శ్రీనివాస్, రాజు గొనె, రవి ముత్తోజు, రరాజు బచ్చు, నవీన్ చింతలపూడి లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఫుడ్డ్రైవ్ వైఎస్సార్ జయంతి సందర్భంగా పిక్నిక్ , ఫుడ్ డ్రైవ్ కూడా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దలు వరకు రెండు వందల మందికి పైగా కుటుంబం తో వచ్చి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఫుడ్ డ్రైవ్ లో ఐదు వందల పౌండ్స్ కి పైగా ఫుడ్ ను మన్నా ఫుడ్ సెంటర్కి డొనేట్ చేశారు. -
బంధువుతో పెళ్లి వద్దన్నందుకు.. కాల్చి చంపిన కుటుంబ సభ్యులు
సిరియా: బంధువును వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు అల్ హసకా గవర్నరేట్ ప్రాంతానికి చెందిన సిరియా మైనర్ బాలికను కుటుంబ సభ్యులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. ఓ 13-16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికను తమ బంధువుకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఆమె వేరొకరిని ప్రేమించడంతో పెళ్లికి నిరాకరించింది. దీంతో ఓ 10 మందికి పైగా యువకులు అమ్మాయిని ఆటోమేటిక్ రైఫిల్స్తో హత్య చేశారు. అయితే ఈ ఘటనపై తూర్పు సిరియాలో భద్రతా అధికారులు అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కానీ, ఈశాన్య సిరియాలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ భద్రతా అధికారులు ఈ నేరం జరిగినట్లు ధృవీకరించారు. ఇక బాధితురాలి తండ్రి, సోదరులు, బంధువులు ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై సిరియాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. -
సిరియాపై క్షిపణుల వర్షం
వాషింగ్టన్: అంతర్యుద్ధంతో నెత్తురోడుతున్న సిరియాలో బాంబులమోత మోగింది. మొన్నటి వరకూ రసాయనిక ఆయుధాలతో రష్యా, సిరియా అధ్యక్షుడు అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలు వందలాది అమాయకులు, చిన్నారుల్ని పొట్టనపెట్టుకుంటే ఈ సారి అమెరికా సంకీర్ణ బలగాలు వైమానిక దాడులకు దిగాయి. సిరియా రాజధాని డమాస్కస్పై సంకీర్ణ దళాలు క్షిపణుల మోత మోగించాయి. రసాయనిక దాడులకు ప్రతీకారంగా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. గట్టి జవాబిచ్చేందుకే: ట్రంప్ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు సంయుక్తంగా జరిపిన ఈ వైమానిక దాడుల్ని సిరియా బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. అమెరికా, దాని మిత్రదేశాలు 100కి పైగా క్షిపణుల్ని ప్రయోగించాయని, వాటిలో కొన్నింటిని సిరియా వైమానిక బలగాలు తిప్పికొట్టాయని రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిరియా సైనిక కేంద్రాలు, సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు చేశారని వెల్లడించింది. ‘గురితప్పకుండా దాడులు చేశాం. మిషన్ పరిపూర్ణమైంది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. రసాయనిక ఆయుధాల తయారీ, వాడకంపై గట్టి సమాధానమిచ్చేందుకే ఈ దాడులు జరిపామన్నారు. ఫ్రాన్స్, బ్రిటన్తో కలిసి దాడులు చేస్తామని శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డమాస్కస్పై తొమహక్ క్షిపణుల వర్షం మధ్యధరా సముద్రం మీదుగా యుద్ధనౌకల నుంచి తొమహక్ క్రూయిజ్ క్షిపణులు, బీ–1 బాంబర్ విమానాలతో జేఏఎస్ఎస్ఎం–ఈఆర్ క్షిపణుల్ని ప్రయోగించినట్లు పెంటగాన్(అమెరికా) వర్గాలు పేర్కొన్నాయి. పెంటగాన్ ప్రతినిధి స్పందిస్తూ.. ‘క్షిపణులు లక్ష్యాల్ని ఛేదించాయి. రసాయనిక ఆయుధాల తయారీ ప్రాంతాలపై దాడులు చేశాం’ అని చెప్పారు. తూర్పు డమాస్కస్లోని రసాయన ఆయుధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలపై ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ దాడులు సిరియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడం లేదా అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నవేనని బ్రిటన్ ప్రధాని థెరెసా మే చెప్పారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. మరోసారి రసాయనిక ఆయుధాలు వాడితే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు. భద్రతా మండలి అత్యవసర భేటీ సంకీర్ణ బలగాల దాడిని సిరియా మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్లు సైనిక నేరంగా, దుందుడుకు చర్యగా అభివర్ణించాయి. ‘దాడులకు ప్రతీకారంగా పర్యవసనాలు తప్పకుండా ఉంటాయి.’ అని రష్యా హెచ్చరించింది. కాగా రష్యా విజ్ఞప్తి మేరకు ఐరాస భద్రతా మండలి శనివారం అత్యవసరంగా సమావేశమైంది. 13 క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం తమ శాస్త్ర పరిశోధన కేంద్రంపై దాడి చేశారని, సిరియా వైమానిక బలగాలు 13 క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాయని, ముగ్గురే గాయపడ్డారని సిరియా ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. దాడులు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించడమేనంది. క్షిపణుల మోత ఆగగానే డమాస్కస్ వీధుల్లో విజయ సంకేతాల్ని చూపుతూ జెండాలతో వందలాది మంది సందడి చేశారు. ఈ దాడులు పోరాటం కొనసాగించాలన్న సిరియా ప్రజల సంకల్పాన్ని దృఢం చేశాయని, దేశంలోని ఉగ్రవాదుల్ని అణచివేస్తామని సిరియా అధ్యక్షుడు అసద్ పేర్కొన్నారు. -
ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలోని కఫర్సుసెలో గురువారం ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు ముహఫజ స్పోర్ట్స్ క్లబ్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. పేలుడు అనంతరం రక్తపు చారికలతో అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఇదిలా ఉండగా డమాస్కస్ పశ్చిమ ప్రాంతం మెజెహ్లోని తమ ఎయిర్బేస్ను ఇజ్రాయిల్ వార్ప్లేన్స్ టార్గెట్గా చేసుకున్నాయని సిరియన్ ఆర్మీ శుక్రవారం ఆరోపించింది. ఎయిర్పోర్ట్ పరిధిలో పడిన పలు బాంబులు ఇజ్రాయిల్కు చెందినవే అని పేర్కొంది. -
ఎంత కష్టమోచ్చింది...
-
ఎంత కష్టమొచ్చింది...
డమాస్కస్(అలెప్పో): సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్య ప్రజలు, చిన్నారులు ఎలా సమిధలౌతున్నారో తెలిపే ఓ బాలుడి వీడియో ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. శకలాల మధ్య కాళ్లు ఇరుక్కున్న 16ఏళ్ల బాలుడు మరూఫ్ని సహాయక సిబ్బంది కాపాడుతున్న వీడియో సిరియా అంతర్యుద్దాన్ని కళ్లకుకడుతోంది. ఈ ఘటనలో శకలాల మధ్య బాలుడి కాళ్లు ఇరుక్కోవడంతో బాలున్ని బయటకు తీయడానికి సిబ్బంది ప్రయత్నాలు చూస్తే, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందారు. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి. కాగా, తీవ్రగాయాలైన మరూఫ్కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఆ ఘటన మరువక ముందే అలెప్పో ప్రాంతంలో తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని ఆగష్టులో జరిగిన వైమానిక దాడుల్లో ఓ భవనం ధ్వంసమైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు, పాత్రికేయులు ఒమ్రాన్ అనే బాలుడి కుటుంబాన్ని రక్షించారు. ఒళ్లంతా తీవ్రగాయాలై రక్తమోడుతున్న బాలుడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఒమ్రాన్ కుటుంబాన్ని భవనం నుంచి బయటకు తీసుకొచ్చిన కొద్ది సేపట్లోనే అది పూర్తిగా కుప్పకూలింది. ఒమ్రాన్ అంబులెన్స్ లో కూర్చున్న సమయంలో ఓ పాత్రికేయుడు తీసిన ఫోటో ఇది. ఒమ్రాన్ ఫోటోతో అంతర్జాతీయ సమాజం కదిలిపోయింది. సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. -
వైమానిక దాడుల్లో 31 మంది మృతి
డమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందినట్టు బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై నాలుగు వైమానిక దాడులు జరిగినట్టు తెలిపింది. శిథిలాల్లో 10 కుటుంబాలు చిక్కుపోయాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఈ దాడుల వెనుక సిరియా ప్రభుత్వ దళాల హస్తం ఉండొచ్చ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. -
సిరియాలో సైన్యం దాడుల్లో 60 మంది మృతి
బీరట్: సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని పలు ప్రాంతాల్లో గురువారం అమెరికా సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో 15 మంది చిన్నారులుసహా 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని డమాస్కస్కు తూర్పున ఉన్న గౌట ప్రాంతంలో దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారని ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ సంస్థ తెలిపింది. డ్యూమాలోనూ దాడులు కొనసాగాయని ఏఎఫ్పీ ఫొటోగ్రాఫర్ తెలిపారు. అలెప్పో సమీపంలోని రెండు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు చిన్నారులుసహా 15 మంది చనిపోయారు. అలెప్పో సిటీ గత రెండు వారాలుగా సైన్యం ముట్టడిలో ఉంది. ఇడ్లిబ్కు నైరుతి దిశలో ఉన్న వేర్వేరు ప్రావిన్సుల్లో జరిగిన దాడుల్లో మొత్తం 30 మంది మరణించారు. 2011 మార్చిలో దేశంలో అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2,80,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు సగం దేశజనాభా స్వస్థలాలను వదిలివెళ్లింది. -
మసీదు లక్ష్యంగా దాడి: 20 మంది మృతి
డమాస్కస్(సిరియా): ఐసిస్ తీవ్రవాదులు జరిపిన దాడుల్లో 20 మంది మృతిచెందారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా డమాస్కస్లోని సయ్యిదా జీనాబ్ మసీదుకు వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశారు. మసీదు బయట ఓ కారు బాంబు, మరో ఆత్మాహుతి దాడి జరిగింది. రెండు బాంబు పేలుళ్లలో మొత్తం 20 మంది మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రార్థన కోసం మసీదుకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఐఎస్ఐఎస్ ఈ దాడులకు తెగబడింది. -
ప్రాణ భయంతో లక్షమంది పరుగు!
డెమాస్కస్: సిరియాలో ఎప్పటి నుంచో అదుపులేకుండా జరుగుతున్న యుద్దం కారణంగా అక్కడి పాలస్తీయునులంతా కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టారని, పలు దేశాలకు వలస వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తెలిపింది. సిరియాలో యుద్ధ వాతవరణానికి ముందు 5,60,000మంది పాలస్తీనా వాసులు ఉండేదని.. యుద్ధ ప్రారంభం అయ్యాక దాదాపు 1,20,000మంది ప్రాణభయంతో దేశాన్ని విడిచి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఎజెన్సీ ఫర్ పాలస్తీనా రెప్యూజీస్(యూఎన్ఆర్ డబ్ల్యూఏ) వెల్లడిచింది. ఇలా వెళ్లిపోయిన వారిలో 45 వేలమంది లెబనాన్, 15 వేలమంది జోర్డాన్ కు, సగంమందికిపైగా టర్కీ మీదుగా యూరప్ వెళ్లిపోయారని వివరించింది. -
300 మందికిపైగా కిడ్నాప్
డెమాస్కస్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అబు అల్ షమత్ ప్రాంతంలో 300 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు మీడియా శుక్రవారం వెల్లడించింది. కిడ్నాప్ అయిన వారంతా అల్ బడేహి సిమెంట్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులని వివరించింది. కార్మికులు కిడ్నాప్ అయిన విషయం తెలిసిన వెంటనే ఆ సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో పరిశ్రమల మంత్రిత్వశాఖ మాట్లాడినట్లు పేర్కొంది. అయితే దీనిపై సదరు కంపెనీ... స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలిసింది. -
సిరియాలో నరమేధం
కారుబాంబు దాడుల్లో 120 మంది మృతి బీరుట్: సిరియాలోని హామ్స్ నగరంలో, డమాస్కస్ శివారులోని ఓ ప్రార్థన మందిరం వద్ద ఆదివారం జరిగిన రెండు కారు బాంబు దాడుల్లో 120 మంది మృత్యువాతపడ్డారు. హామ్స్లోని అల్-జహ్రనా జిల్లాలో జరిగిన దాడిలో 57 మంది చనిపోయారు. సయీదా జినాబ్లో జరిగిన దాడిలో 63 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో అత్యధికం సాధారణ పౌరులు ఉన్నారని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. -
బాంబు దాడుల్లో 45 మంది మృతి
డమాస్కస్: సిరియా మరోసారి బాంబు దాడులతో అట్టుడికింది. రాజధాని డమాస్కస్ దక్షిణ ప్రాంతంలోని సయిదా జీనాబ్ ప్రార్థనా మందిరం సమీపంలో జరిగిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 45 మంది మృతి చెందినట్లు సిరియన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శక్తిమంతమైన పేలుళ్లు జరిగిన ప్రాంతంలోని సమీప భవనాలు, కార్లు ధ్వంసమైన దృశ్యాలను సిరియన్ స్టేట్ టెలివిజన్ ప్రసారం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. సిరియా ప్రభుత్వ వర్గాలు ప్రతిపక్షాలతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
3,000 మందిని చంపిన రష్యా
డెమాస్కస్: రష్యా వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 3,000మంది ప్రాణాలుకోల్పోయారని సిరియా పరిశీలన సంస్థ ఒకటి వెల్లడించింది. గత ఏడాది(2015) సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకు రష్యా లెక్కలేనిసార్లు సిరియాలో వైమానిక బాంబు దాడులు జరిపిందని ఈ దాడుల్లో ఉగ్రవాదులతోపాటు సామాన్యులు కూడా మృత్యువాత పడ్డారని ఆ సంస్థ పేర్కొంది. మొత్తం మూడు వేలమంది ఈ దాడుల కారణంగా చనిపోగా వారిలో సామాన్యులు 1,015 మంది ఉన్నారని, వారిలో 238 మంది 18 ఏళ్లలోపువారు, 640మంది పురుషులు, 137మంది మహిళలు ఉన్నట్లు సిరియా హక్కుల సంస్థ ఓ పత్రికకు వివరాలు తెలియజేసింది. ఇక ఇదే దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఎక్కువగా చనిపోయారని పేర్కొంది. మొత్తం 893 మంది ఐఎస్ ఉగ్రవాదులు చనిపోగా.. ఇతరులు అల్ కాయిదావంటి జిహాదీ గ్రూపులకు చెందినవారు 1,141 మంది మరణించినట్లు వివరించింది. అయితే, రష్యా ఈ దాడులను సిరియా బలగాలకు మద్దతుగానే జరిపినట్లు ఆ హక్కుల సంస్థ వివరణ ఇచ్చింది. -
భత్కల్ను తప్పించేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర
హైదరాబాద్ :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ పథకం వేసింది. అయితే ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భత్కల్ తన భార్య జహిదాతో ఫోన్లో మాట్లాడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. తనను త్వరలో ఐఎస్ఐఎస్ జైలు నుంచి తప్పిస్తుందని అతడు..ఢిల్లీలో ఉంటున్న భార్యకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. డమాస్కస్లోని స్నేహితులు.. తనను త్వరలో జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డమాస్కస్ వెళ్లిపోదామని భత్కల్ తన భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది. భత్కల్ చెప్తున్న డమాస్కస్లోని స్నేహితులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతేకాక చర్లపల్లి జైలు నుంచి భత్కల్ తన భార్యకు 10 ఫోన్కాల్స్ చేశాడని... భార్యతోపాటు ఇంకొంతమందితోనూ అతడు ఫోన్లో మాట్లాడాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. యాసిన్ భత్కల్ ఫోన్కాల్స్ను రికార్డ్ చేసిన కేంద్ర నిఘా వర్గాలు... అతని వెనకున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు భత్కల్కు సెల్ ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. -
54 మంది తిరుగుబాటుదారులు హతం
డెమాస్కస్ : డెమాస్కస్లోని తూర్పు ప్రాంతంలో తిరుగుబాటుదారులు ఆశ్రయం పొందుతున్న స్థావరాలపై సిరియా దళాలు మూకుమ్మడి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 54 మంది తిరుగుబాటుదారులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. సిరియా రాజధాని డెమాస్కస్లోని తూర్పు ప్రాంతం తిరుగుబాటుదారులకు నిలయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సైన్యం వైమానికదాడులు చేస్తోంది. -
117 మంది తీవ్రవాదుల హతం
డెమాస్కస్: దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాలల్లో తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని సైనిక బృందాలు ముమ్మరం చేశాయి. అందులోభాగంగా దాదాపు 117 మంది తీవ్రవాదలను మట్టుబెట్టినట్లు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఆల్ ఖైదాలో సంబంధాలు ఉన్న 47 మంది తీవ్రవాదులను మషారా పట్టణంలో చంపివేసినట్లు తెలిపింది. అలాగే దక్షిణ ప్రావెన్స్లోని దర్రార్లో 70 మంది రెబల్స్ను అంతమొందించినట్లు పేర్కొంది. అయితే సిరియా రాజధాని డెమాస్కస్లో శనివారం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారని మీడియా వెల్లడించింది. -
సిరియా
నైసర్గిక స్వరూపం ఖండం: ఆసియా వైశాల్యం: 185180 చదరపు కిలోమీటర్లు జనాభా: 2,20,87,048 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: డమాస్కస్ ప్రభుత్వం: యూనిటరీ సింగిల్ పార్టీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ కరెన్సీ: సిరియన్ పౌండ్ అధికారిక భాష: అరబిక్ మత: 90 శాతం ముస్లిములు, 8 శాతం క్రైస్తవులు. వాతావరణం: జనవరిలో 0 నుండి 12 డిగ్రీలు, ఆగష్టులో 18 నుండి 37 డిగ్రీలు ఉంటుంది. పంటలు: పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు. పరిశ్రమలు: చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు. సరిహద్దులు: ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, మధ్యధరా సముద్రం. స్వాతంత్య్ర దినోత్సవం: 1944 జనవరి 1 పరిపాలనా విధానం: సిరియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 14 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని గవర్నోరేట్ అని అంటారు. ఇవి తిరిగి 61 జిల్లాలుగా విభజింపబడి ఉన్నాయి. జనాభా ఎక్కువగా రాజధాని డమాస్కస్ చుట్టూ అలాగే యూఫ్రటీస్ నదీ తీరం వెంబడి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.దేశంలోని పది పెద్ద నగరాలు... డమాస్కస్, అలెప్పొ, హోమ్స్ లటా కియా, హమా, అల్ రక్కఫ్, డీర్ ఎజ్జోర్, అల్హసకా, క్వామిష్లీ, సయ్యిదా జన్సబ్లు చరిత్ర: క్రీ.పూ. 2500 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజల ఉన్న దాఖలాలు ఉన్నాయి. రాజధాని డమాస్కస్ నగరంలో ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలతో నిత్యమూ పోరాటాలు, చిన్నపాటి యుద్ధాలు నేడు చోటు చేసుకుంటున్నాయి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఫోనీషియన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతాలు, ఎడారి ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఒకప్పుడు సిరియా దేశం వివిధ దేశాల రాజులకు యుద్ధభూమిగా ఉండేది. ‘సిరియన్లు’ ఎక్కువగా వ్యాపారరంగంలో ఉన్నాయి. సమీప దేశాలతో వీరి వ్యాపార బంధాలుగా చైనా, భారతదేశం, అరబ్బు దేశాలలో ఉన్నాయి. దేశాన్ని ఫోనేషియన్ల తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్ రాజుల పరిపాలించారు. క్రీస్తుశకం 632లో ముస్లిం మత నమ్మకం కలిగిన ప్రాఫెట్ మహమ్మద్, ఇతర అరబ్బీ సైనికులు ఆ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ విధంగా సిరియాదేశం ముస్లిం మత దేశంగా మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాలపాటు కలీఫాలు పరిపాలించారు. క్రీ.శ. 1095లో యూరోపు నుండి క్రైస్తవులు క్రమంగా వచ్చి ఈ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. క్రీ.శ. 1114లో సుల్తాన్ నూరుద్ధీన్ అనే రాజు క్రమంగా సిరియాదేశాన్ని ఆక్రమించి క్రిస్టియన్లను తరిమివేశాడు. 15వ శతాబ్దంలో ఒట్టోమాన్ రాజులు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1944తో సిరియా దేశం స్వాతంత్య్రం పొందింది. ఆహారం: మాంసం, రొట్టెలు వీరి ప్రధాన ఆహారం. గోధుమ, మైదా పిండితో బన్, రొట్టె, బ్రెడ్డు లాంటి పదార్థాలు తయారుచేస్తారు. వీటితో పాటు సూప్లు, కూరలు ఉంటాయి. అన్నం, మాంసం కలిపి ముద్దలు చేస్తారు. వీటిని బ్రెడ్డుతో లేదా రొట్టెతో కలిపి తింటారు. ప్రజలు-సంస్కృతి: దేశంలో 74 శాతం మంది ప్రజలు ముస్లిములు. వీరు చాలా స్నేహ పూర్వకంగా ఉంటారు. లెవన్టైన్, ఖుర్దు, టుర్కుమెన్, సిర్కాసియన్, గ్రీకులు, జ్యూలు, ఆర్మేనియన్లు... ఇలా ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారు. అరబ్బీ, కుర్దెష్ భాషలు మాట్లాడుతారు. వివిధ తెగల వాళ్ళు వారివారి సాంప్రదాయరీతులలో వస్త్రధారణ చేస్తారు. ఇది ప్రాంతాలవారీగా ఉంటుంది. సాధారణంగా పురుషులు పొడవాటి గౌన్లను ధరిస్తారు. దీనిని కఫ్తాన్ అంటారు. స్త్రీలు పొడవాటి రోబ్లను ధరిస్తారు. కేవలం చేతులు, పాదాలు మాత్రమే బయటికి కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు తలలకు పాగాలు ధరిస్తారు. యువతీయువకులు మాత్రం ప్యాంటు, షర్టు, జీన్స్ ధరిస్తారు. అలంకరణ సామగ్రిని ఉపయోగిస్తారు. ధనిక కుటుంబాల మహిళలు మాత్రం కురచ దుస్తులు ధరిస్తారు. సాధారణంగా మహిళలు ఇంటి వ్యవహారాలు చూసుకుంటారు. గ్రామాలలో మహిళలు ఇంటిపనులతో పాటు పొలం పనులకు కూడా వెళతారు. చూడవలసిన ప్రదేశాలు 1. డమాస్కస్: దేశ రాజధాని డమాస్కస్ నగరం కిక్కిరిసిన జనాభాతో నిండిన నగరం. నగరం నలుదిశలా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. బైజాంటైన్ ఆర్కేడ్ అనేది జూపిటర్ దేవుని ఆలయం. దీనిని రోమన్ పరిపాలకులు నిర్మించారు. ఈ ఆర్కేడ్ సమీపంలోనే ఉమ్మాయ్యద్ మసీదు ఉంది. దీనినే గ్రాండ్ మాస్క్ అంటారు. దీనిని పూర్వం ఒకటవ కాన్స్టాంట్నోపుల్ అనే రోమన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ మసీదుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మసీదు లోపలి భాగంలో శిఖరం లోపలి భాగంలో ఇప్పటికీ సెయింట్ జాన్ తల భాగం నిలిచి ఉంది. మరో విశేషం 2001లో పోప్ జాన్ పాల్-2 ఈ మసీదును సందర్శించాడు. ఇక డమాస్కస్ పాత నగరంలో పురాతన కట్టడాలు, ఇళ్ళు, ఇతర నిర్మాణాలు ఎన్నో దర్శనమిస్తాయి. అప్పటికాలంలో రోమన్లు, ముస్లింలు, క్యాథలిక్కులు, జ్యూలు నిర్మించిన కట్టడాలు నేటికీ నిలిచి ఉన్నాయి. నగరంలోని హేజాజ్ రైల్వేస్టేషన్ భవనాన్ని చూసి తీరాల్సిందే. ఎందుకంటే ఒట్టోమాన్ రాజుల కాలంలో నిర్మించిన ఈ భవనం నేటికీ రైల్వేస్టేషన్ భవనంగా ఉపయోగపడుతోంది. 2. అలెప్పో నగరం: కనుచూపు మేర వరకు విస్తరించిన నగరం అలెప్పో. ఈ నగరం అన్ని రకాలుగానూ ఎంతో ధనవంతమైన నగరంగా కనబడుతుంది. కిక్కిరిసిన ఇళ్ళు, చారిత్రక కట్టడాలు, ప్రజల సంస్కృతులు... ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయనిపిస్తుంది. దేశంలో రెండో అతి పెద్ద నగరం అలెప్పో. నగరంలోని పురాతన కట్టడాలను ప్రభుత్వం సంరక్షిస్తుంది. సెయింట్ సిమియన్ ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ ఒకే ప్రదేశంలో నాలుగు చర్చి భవనాలు కలిసి ఒక శిలువ ఆకారంలో ఉంటాయి. మధ్యభాగంలో స్పైలైట్ స్తంభం ఉంది. ఆ కాలంలో ఆ స్తంభం మీద నిలబడి సెయింట్ జార్జ్ ప్రజలతో మాట్లాడేవారు. ఈ స్తంభం 25 మీటర్ల ఎత్తు ఉంది. నగరంలో మరో కట్టడం సిటాడెల్. ఇది యునెస్కో సంరక్షిత భవనంగా ఉంది. నగరంలో క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో నిర్మించిన ఆల్ కికన్ మాస్క్ నేటికీ అద్భుతంగా నిలిచి ఉంది. సిటాడెల్ 165 అడుగుల ఎత్తు, 1476 అడుగుల పొడవు, 1066 అడుగుల వెడల్పుతో ఉంటుంది. శతాబ్దాలుగా ఎందరో రాజులను, చక్రవర్తులను చూసిన ఈ కట్టడం నేడు మౌనసాక్షిగా నిలబడి ఉంది. 3. హమాలో నీటి చక్రాలు: హమా ఒక పురాతన నగరం. ఇది ఓరోంటిస్ నదీతీరంలో ఉంది. మధ్యయుగం నాటి నుండీ ఈ నగరం ఉందన్న చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం, పరిశ్రమలు అధికం. బైజాంటియన్ రాజులు ఇక్కడ నీటి చక్రాలను మొట్టమొదట ఏర్పరిచారు. ఆ కాలంలో నదిలోని నీటిని తోడడానికి ఈ విశాలమైన నీటి చక్రాలను నిర్మించారు. చక్రాలను తిప్పుతూ ఉంటే నదిలోని నీళ్ళు చక్రాల చివరలలో ఉన్న డబ్బాలలో నిండి బయటికి వస్తాయి. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో ఏర్పరచిన ఈ నీటిచక్రాలు నేటికీ పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం కేవలం 17 నీటిచక్రాలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క చక్రం వ్యాసార్థం 66 ఫీట్లు ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ నీటి చక్రాలు ఆ కాలంనాటి నీటిపారుదుల తీరుకు అద్దం పడుతుంది. 4. రోమన్ల సాక్షి బోస్రా : సిరియా దేశంలో ఉన్నన్ని చారిత్రక ప్రదేశాలు మరే దేశంలోనూ కనబడవు. అందుకే విదేశీయులు సిరియా దేశాన్ని అధిక సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. బోస్రా ఒక పురాతన నగరం. రోమన్ చక్రవర్తులు నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. సందర్శకులను అది మంత్ర ముగ్ధులను చేస్తుంది. దీనిని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆనాటి కట్టడం నేటికీ ఏమాత్రం శిథిలం కాకుండా ఉండడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బోస్రా నగరం రాజధాని డమాస్కస్కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ నగరం ఆకాలంలో నబాషియన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్లు, అరబ్ ముస్లిం రాజులు దీనిని పాలించారు. రోమన్లు నిర్మించిన ఆంఫిథియేటర్లో దాదాపు 18 వేల మంది కూర్చోగలిగే వీలు ఉంది. స్టేజి పొడవు 148 అడుగుల పొడవు, 26 అడుగుల లోతులో ఉంటుంది. 5. పాల్మీరా: పాల్మీరా కట్టడాలు ఒకటవ శతాబ్దానికి చెందినవి. ప్రజలు ఈ కట్టడాలను రెండు పేర్లతో పిలుస్తారు 1. ఎడారి పెళ్ళికూతురు- ఎందుకంటే ఈ ప్రదేశం ఎడారిలో ఉంది. ఇక్కడ ఒక ఒయాసిస్సు ఉంది. బాటసారులు ఆకలి, దప్పిక తీర్చుకోవడానికి పాల్మీరా దగ్గర విడిది చేసేవారు. 2. తాడ్మోర్- ఆధిపత్యానికి ప్రతీక. ఏ రాజులు దీనిని ఆక్రమించినా వెంటనే దానిని వదిలేసి వెళ్ళిపోయేవారు. అది మళ్ళీ ఒంటరిగా నిలిచి ఉండేది. ఎడారి కావడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇక్కడే టెంపుల్ ఆఫ్ బాల్ నిర్మాణం ఉంది. పూర్వకాలంలో ప్రజలు ఈ దేవాలయాన్ని తమ కోర్కెలు తీరినపుడు జంతువులను బలి ఇవ్వడానికి ఎంచుకున్నారు. బైజాంటైన్ రాజులకాలంలో ఈ దేవాలయం మార్పు చెంది చివరికి ఒక మసీదుగా, ఆ తర్వాత రాజుల సైనికులకు విడిది ప్రదేశంగా మారిపోయింది. టూంబుల లోయ కూడా ఇక్కడే ఉంది. ఈ లోయలోని టూంబులు దాదాపు ఈజిప్టులోని పిరమిడ్ల మాదిరిగా కనిపిస్తాయి. ఈ టూంబులలో ఆకాలపు రాజుల వారి కుటుంబ సభ్యుల మృత దేహలను భద్రపరిచే సమాధులు. నేటికీ ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడే మ్యూజియం, అరబ్ క్యాజిల్లు చూడదగిన కట్టడాలు. -
వైమానిక దాడులు: 50 మంది తీవ్రవాదులు మృతి
డెమాస్కస్ : డీర్ అల్ జోర్ తూర్పు ప్రావెన్స్లోని తీవ్రవాదుల శిక్షణ శిబిరంపై శనివారం సిరియా వైమానిక దాడులు జరిపింది. ఆ దాడులలో సున్నీ తీవ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్కు చెందిన దాదాపు 50 మంది తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అల్ రఖా ప్రాంతంలో కూడా సిరియా దళాలు మరిన్ని వైమానికి దాడులు నిర్వహించాయని తెలిపింది. 2011 మార్చిలో మొదలైన సిరియాలో జరుగుతున్న పోరాటంలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది మరణించారు. అలాగే ముప్పై లక్షల మంది పొరుగు దేశాలకు వలస పోయారని యూఎన్ తన గణాంకాలలో వెల్లడించింది. -
సిరియాలో హింస: 71 మంది మృతి
సిరియాలో నరమేథం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గురువారం ఓ వైపు కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లగా, మరోవైపు దేశ భద్రత సిబ్బంది, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరిగా కాల్పులు జరిగాయి. ఆ హింసలో మొత్తం 71 మంది మరణించారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. సిరియా ఈశాన్య ప్రావెన్స్లో హస్కాలో రెండు కారు బాంబు పేలుళ్లకు తిరుగుదారులు పాల్పడ్డారు. ఆ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. హస్కాలోని ఓ పాఠశాల ప్రవేశ ద్వారం సమీపంలో కారు పేలుడు సంభవించి... ఇద్దరు చిన్నారుల మృతి చెందారని తెలిపింది. తల్ హలాఫ్ పట్టణంలో అల్ ఖమిస్ మార్కెట్ వద్ద మరో కారును తిరుగబాటుదారులు పేల్చేశారిని ఆ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తిరుగుబాటుదారులను అణిచేందుకు భద్రత సిబ్బంది చర్యలు చేపట్టింది. అందులోభాగంగా భద్రత సిబ్బందికి, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో మొత్తం 64 మంది మరణించారని మీడియా వివరించింది. -
సిరియాలో హింసాత్మక ఘటనల్లో 17 మంది మృతి
సిరియాలోని అలెప్పో నగరంలో తిరుగుబాటుదారులు రక్తపాతాన్ని సృష్టించారు. దాంతో 17 మంది మరణించారు. మృతుల్లో జడ్జి, మిలటరీ ఉన్నతాధికారి ఉన్నారని స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. అలెప్పో నగరంలోని మెరిడియన్, అల్ఫర్కన్ ప్రాంతాల్లోని జనవాసాలపై తిరుగుబాటుదారులు రాకెట్ లాంచర్లతో దాడులు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో ఫూటేజ్లను స్థానిక టీవీలలో ప్రసారం చేసింది. ఆ దాడుల్లో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. -
సిరియాలో పేలుడు, 20 మంది మృతి
సిరియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దక్షిణాది రాష్ట్రం డారాలోని నావా పట్టణంలో బుధవారం జరిగిన బాంబు పేలుడుకు దాదాపు 20 మంది మరణించగా, మరో 15 మందికిపైగా గాయపడ్డారు. సిరియాలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా డారా రాష్ట్ర మీడియా ఈ విషయంపై స్పందించలేదు. పేలుడు గల కారణాలు పూర్తిగా తెలియాల్సివుంది. సిరియాలో ముస్లింల పండుగ రోజే ఈ ఘటన జరగడం ప్రజల్ని మరింత భయబ్రాంతులకు గురిచేసింది. -
సిరియాలో పేలుళ్లు: 19 మంది మృతి
సిరియాలో మరోసారి హింస రాజుకుంది. గురువారం జరిగిన పేలుళ్లలో 19 మంది మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిరియా మధ్య రాష్ట్రం హామ్స్లో జబురిన్, అక్రాద్ అల్-డఫ్నీ పట్టణాల మధ్య రోడ్డుపై పేలుడు పదార్థాలను అమర్చి రెండు బస్సులు, ఓ కారును పేల్చివేశారు. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ దుర్ఘటనకు కారకులు ఎవరన్న విషయం తెలియరాలేదు. రెణ్నెళ్ల కిత్రం సిరియా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాయి. తిరుగుబాటు దారుల కీలక స్థావరాల్ని స్వాధీనం చేసుకున్నాయి. -
సిరియాలో కొనసాగుతున్న ప్రభుత్వ బలగాల దాడులు
బీరుట్: సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో బుధవారం ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన దాడులకు 1,300 మంది అమాయక పౌరులు బలయ్యారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. ప్రభుత్వ దాడులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. రసాయన దాడులకు గురైన ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న తూర్పు ఘౌటాలో గురువారం ఉదయం ప్రభుత్వ యుద్ధవిమానాలు మళ్లీ బాంబుల వర్షం కురిపించాయి. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలపై అధ్యక్షుడు బషర్ అసద్ బలగాలు గురువారం కూడా బాంబుల వర్షం కురిపించాయని ప్రతిపక్షం ఆరోపించింది. రసాయనదాడికి గురైన తూర్పు ఘౌటాలోనే మళ్లీ జరిగిన ఈ బాంబుదాడులపై మాట్లాడేందుకు మాటలు రావడంలేదని బ్రిటన్కు చెందిన ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్రైట్స్’ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మరోపక్క అమాయక పౌరులతోపాటు పసిపిల్లలపై సైతం రసాయన దాడులకు పాల్పడటంపై యూనిసెఫ్ తీవ్రంగా మండిపడింది. బాలల హక్కులు కాపాడాలని, హక్కులు కాలరాసినవారు బాధ్యత వహించకతప్పదని హెచ్చరించింది. చట్టాల ఉల్లంఘనే.... బాన్ కీ మూన్ సిరియా ప్రజలపై రసాయన దాడితో ప్రభుత్వం దారుణ మారణకాండకు పూనుకుందన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. ‘రసాయన ఆయుధాలను ఏ పక్షమైనా సరే.. ఏ పరిస్థితుల్లోనైనా సరే.. ప్రయోగించడం అంతర్జాతీయ మానవతావాద చట్టాలను ఉల్లంఘించడమే’నని స్పష్టంచే శారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో బుధవారం ప్రభుత్వ బలగాలు రసాయనదాడులు జరుపగా 1,300 మంది పౌరులు బలయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దాడులపై బుధవారం నాటి అత్యవసర సమావేశంలో ఐరాస భద్రతామండలి ఆందోళన వ్యక్తంచేసింది. అయితే దీనిపై శాశ్వత సభ్యదేశాల మధ్య భేదాభిప్రాయం తలెత్తింది. సిరియాపై కఠిన చర్యలకు చైనా, రష్యా వ్యతిరేకించగా.. సిరియాలో ఉన్న ఐరాస బృందంచేత నిష్పాక్షిక దర్యాప్తు జరపాలంటూ సెక్రటరీ జనరల్కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లేఖ రాశాయి. కాగా, సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలు ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను మిత్రదేశం ఇరాన్ తోసిపుచ్చింది. రసాయన దాడులు జరిగి ఉంటే.. అందుకు రెబెల్స్దే బాధ్యతని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదముఠాలు ఏ నేరానికైనా వెనుదీయవని, రసాయన దాడులు వాటి పనే అయి ఉంటుందని పేర్కొంది. -
సిరియా ఘటనపై ఐరాస దిగ్ర్భాంతి
ఐక్యరాజ్యసమితి : సిరియాలో రసాయన ఆయుధాల వినియోగంపై తీవ్ర దిగ్భ్రాంతి చెందిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. నిన్న రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. సిరియా పరిణామాలపై సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ షాక్కు గురయ్యారని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. సమితి రసాయన ఆయుధాల తనిఖీబృందం సిరియాలో ఉండగానే..డెమాస్కస్లో వాటి ప్రయోగం జరగడాన్ని సమితి సెక్రెటరీ జెనరల్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. మరోవైపు సిరియాలో రసాయన ఆయుధాల ప్రయోగం జరిగిందన్న వార్తలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. అసాద్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన అగ్రరాజ్యం, సిరియా విషయంలో తమతో విభేదించేవారు సైతం.. రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గట్టిగా వ్యతిరేకించాల్సిందేనంది. సిరియా పరిణామాలపై స్పందించిన అమెరికా విదేశాంగశాఖ, అధ్యక్ష భవనాలు వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ఇక రాజధాని డమాస్కస్ పరిసరాల్లో జరిగిన ఈ దారుణ మారణకాండలో దాదాపు 1300 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది స్త్రీలు, చిన్నారులు ఉన్నారు. డమాస్కస్తో పాటు ఇతర ప్రాంతాల్లో సైనిక బలగాలు విచక్షణ రహితంగా క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. విషపూరిత వాయువుల ప్రయోగం, క్షిపణి దాడులతో 1, 228 మంది బాధితులుగా మారారని వైద్యవర్గాలు తెలిపాయి. అయితే రసాయనిక ఆయుధాల ప్రయోగం వార్తలను అధ్యక్ష వర్గాలు ఖండించాయి. ఎలాంటి విషపూరిత పదార్థాలు వినియోగించలేదని సైన్యం తెలిపింది. సిరియాలో రసాయన ఆయుధాలు ఉన్నాయో లేవో తేల్చడానికి ఐరాస నిపుణుల బృందం ఆదివారం సినియాకు వచ్చిన నేపథ్యంలో ఈ దాడి ఉదంతం చోటుచేసుకోవటం గమనార్హం.