Dissolution of Legislative Council
-
టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన రద్దు!
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే, వారికి ఢిల్లీలో ఎవరి అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి చేపట్టాలనుకున్న ప్రజాచైతన్య యాత్రలపైనా తర్జనభర్జన పడుతున్నారు. తమ పార్టీకి చెందిన వారిపై ఐటీ దాడులు జరగటం, రూ.రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడికావడంతో ఆందోళనలో ఉన్న టీడీపీ నేతలు యాత్ర నిర్వహించాలా వద్దా అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిసింది. ఒకవేళ యాత్ర చేసినా నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా చేయాలని సూచించినట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్సీలకు అమిత్ షా ఝలక్
సాక్షి, విజయవాడ : ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఊహించని షాక్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. శాసనమండలి రద్దు నిర్ణయంపై అమిత్ షాను కలవాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ పర్యటన ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్మెంట్ మాత్రమే ఖరారైంది. దీంతో ఇక చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మండలి రద్దుకు సహకరించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. (మండలి రద్దును ఆమోదించండి) -
శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరు
-
ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం
-
ఢిల్లీలో లాబీయింగా.. హాస్యాస్పదం: ఏపీ మంత్రి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. మండలి రద్దును అడ్డుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తానని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అధికార వికేంద్రీకరణ ఆగదని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంపై చంద్రబాబు అండ్ టీం దుష్ర్పచారం దుర్మార్గమని మండిపడ్డారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను బోగి మంటల్లో వేయాలన్న టీడీపీ నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత టీడీపీ పాలనలో లాయర్లు 90 రోజులు ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎవరడిగారని యనమల వ్యాఖ్యానించడం తగదని మంత్రి శంకర్ నారాయణ హెచ్చరించారు. చదవండి: నేను మేనేజ్ చేస్తాగా! రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది -
మండలి రద్దు నిర్ణయం సరైందే..
సాక్షి, అమరావతి/రేపల్లె: చంద్రబాబు స్వార్థానికి వేదికగా మారిన శాసన మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం నూటికి నూరుశాతం సరైందేనని పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. గుంటూరు జిల్లా రేపల్లె వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ద్వారా ఎన్నికైన శాసనసభ ప్రజల శ్రేయస్సుకు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేస్తున్న చట్టాలపై.. పెద్దల సభగా సూచనలు, సలహాలు అందించాల్సింది పోయి.. చంద్రబాబు స్వార్థానికి కేంద్రంగా మారడం అవాంఛనీయమన్నారు. శాసన మండలికి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రచారమాధ్యమాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకునే ఏ నిర్ణయానికైనా ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. మండలిని రద్దు చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన మరుక్షణమే తామూ పదవులకు రాజీనామా చేస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఆక్వా ఎగుమతుల పెంపుపై ప్రత్యేక దృష్టి ఆక్వా రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. 9 జిల్లాల్లో 22 ప్రాంతాల్లో జెట్టీలు, హార్బర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. చేపల వేటను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సీఎం జగన్ సూచనల మేరకు రెండు దశల్లో ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. మొదటి దశలో ఓడరేవు, ఉప్పాడ, మచిలీపట్నం, జువ్వలదిన్నె, రెండోదశలో బుదగట్లపాలెం, ఎద్దువానిపాలెం, పూడిమడక, కొత్తపట్నంలలో హార్బర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో జెట్టీ నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చవుతోందని దీనిలో 50 శాతం కేంద్రం, మిగిలిన యాభై శాతం రాష్ట్రం భరించేలా ఈ ఏడాదిలోనే వీటి నిర్మాణాన్ని ప్రారంభింలనేది లక్ష్యంగా సీఎం ఆదేశించినట్టు చెప్పారు. దీంతో పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ను రూ.100 కోట్లతో ఆధునికీకరించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. గ్రామాల్లోని మంచి నీటి చెరువుల్లో కేజ్ కల్చర్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న తిలాపీ వంటి చేపలను పెంచే ఆలోచనలో ఉన్నట్టు సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. -
నేను మేనేజ్ చేస్తాగా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ ఎమ్మెల్సీలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నాలను ప్రారంభించారు. తాను బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నానని, మండలి రద్దు కాకుండా మేనేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన నమ్మబలుకుతున్నట్లు తెలిసింది. అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి వెళ్లిన తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీలు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్ ముందుకు మండలి రద్దు అంశం రాకుండా ఉండేందుకు తమ అధినేత ప్రయత్నాలు సాగిస్తున్నా అవి ఎంత వరకూ ఫలిస్తాయోనని వారిలో సందేహం నెలకొంది. సుజనా ప్రస్తావించేలా పావులు..: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించిన చంద్రబాబు లోక్సభ, రాజ్యసభ సభ్యులకు విడివిడిగా బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మండలి రద్దు అంశాన్ని రెండు సభల్లో తమ ద్వారా గానీ, బీజేపీలోకి వెళ్లిన సుజనా లాంటి వారితోగానీ ప్రస్తావించే ఏర్పాట్లు చేశామని బాబు చెబుతున్నట్లు సమాచారం. ఒకవైపు పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం మరోవైపు కేంద్ర పెద్దలపై ఒత్తిడి చేసేలా వ్యూహం రూపొందించినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ గూటికి టీడీపీ ఎమ్మెల్సీలు!..: అవసరమైతే తమ పార్టీకి చెందిన సగం మందికిపైగా ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపి వారి పదవులను కాపాడేలా చంద్రబాబు స్కెచ్ గీసినట్లు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. తమ ఎమ్మెల్సీలు బీజేపీలోకి వెళ్లినా తన మాటే వింటారని అదే సమయంలో బీజేపీ బలం పెరిగినట్లు కనబడుతుందని చంద్రబాబు చెబుతున్నట్లు తెలిసింది. -
రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడబోదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. ‘ఇది రాజకీయ వ్యవహారం కాదు. బీజేపీ తీసుకునే నిర్ణయమూ కాదు. శాసనమండలి రద్దుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. వ్యవస్థ ఆధారంగా కేంద్రం ముందుకెళ్తుంది.. రాజకీయ కోణముండే ఆస్కారం లేదు’ అని వెల్లడించారు. ఎక్కడా రాజకీయాలకు తావుండదు బిల్లుపై బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘కేబినెట్ ఆమోదం పొంది ప్రభుత్వం ద్వారా వచ్చే బిల్లును ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వ్యతిరేకించడం సాధ్యం కాదు కదా.. ఏవో కారణాల వల్ల ఆపేస్తారని, రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా ఆపేస్తారని కొందరు అంటున్నారు. నా అవగాహన మేరకు ఆర్టికల్ 169(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే దానిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. దీనిలో ఎక్కడా రాజకీయాలకు తావులేదు’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఏపీ చట్టసభల్లో.. అది కూడా శాసన మండలిలో మాత్రమే ఇద్దరు సభ్యులు ఉన్నారని, మండలి రద్దుతో ఆ ప్రాతినిధ్యం కూడా పోతుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇద్దరున్నా పది మంది సభ్యులున్నా సంబంధం లేదని, వ్యవస్థకు లోబడి నడుచుకోవాలన్నారు. బిల్లు వెనుక బీజేపీ ఉందన్న విమర్శలను తోసిపుచ్చుతూ.. ‘అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాత్రమే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. అక్కడ ఏపార్టీ అధికారంలో ఉందన్న అంశాన్ని పరిగణించదు. కాబట్టి రాజకీయ కోణం నుంచి చూస్తే అది తప్పు. దీని వెనక బీజేపీ ఉందన్న విమర్శలు అక్కసుతో కూడినవే. ఏపీ ప్రజలు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు పలికారు. మేం వారితో కలిసి పోటీచేయలేదు. ఈరోజు కూడా వారు ఎన్డీయేలో భాగస్వామి కాదు. అక్కడ సీపీఎం ఉన్నా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి కేంద్రం నడుచుకుంటుంది’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్కు అనుగుణంగా బిల్లుపై ముందుకెళ్తారు ఈ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. దీనికి సమాధానం కేంద్ర కేబినెట్ కార్యదర్శి లేదా హోం శాఖ లేదా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి లభించవచ్చని.. వాటి షెడ్యూలు ప్రకారం సమయానుసారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజకీయ కోణంలో జాప్యం చేయడం.. వెంటనే చేయడం వంటి కోణాలకు ఆస్కారం ఉండదని వివరించారు. రాజధానిపై పార్లమెంటులో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందని ప్రశ్నించగా ‘ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పారు. చర్చకు వస్తే మా పార్టీ వాణిని వినిపిస్తాం. దీనిని రాజకీయంగా రాష్ట్రంలో ఎదుర్కోవాలని గతంలోనే నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలనడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం
-
మండలి రద్దు: కేంద్రం అడ్డు చెప్పే ఛాన్సే లేదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. (మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం) -
చంద్రబాబుకు సవాల్.. ఆ విషయం చెప్పగలరా?
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో రాజధాని అవసరంలేదని చెప్పే ధైర్యం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఉందా అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. వెనుకబడిన కర్నూలులో హైకోర్టు అవసరంలేదని బహిరంగంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. మంగళవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి రద్దుకు టీడీపీ వ్యతిరేకమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. వికేంద్రీకరణ, 13 జిల్లాల అభివృద్ధిపై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చట్టంను దేశ వ్యాప్తంగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. (కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం) ‘అసత్యాలు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఆయనలా దిగజారి మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డొస్తోంది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం దుర్గగుడి ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు రాజధానిని ఎలా నిర్మించగలరు?. ప్రభుత్వ నిర్ణయంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు దావోస్కు ఎందుకు వెళ్లారో చెప్పాలి. స్విస్ బ్యాంక్లో దాచుకున్న అక్రమ సొమ్ము కోసమే వెళ్లారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు చరిత్ర ఎలాంటిదో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు రాసిన పుస్తకం చూస్తే తెలుస్తుంద’ని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
మంత్రి పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం
-
కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం..
-
శాసన మండలి రద్దుపై మరో ముందడుగు
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. అనంతరం తీర్మానాన్ని పరిశీలించిన సీఎస్.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం హోంశాఖ అధికారులకు పంపారు. దీంతో మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసినట్లయింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించి.. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. -
చంద్రబాబు ఇదంతా చేసేది లోకేష్ కోసమే: అంబటి
సాక్షి, తాడేపల్లి: శాసనమండలి రద్దు అంధ్రప్రదేశ్ అభివృద్దికి దోహదపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా వైఎస్సార్ శాసనమండలి ఏర్పాటు చేశారని గుర్తు చేసిన అంబటి.. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. ‘నిన్న(సోమవారం) జరిగిన శాసన మండలి రద్దు ఒక కీలకమైన తీర్మానం. 1983లో నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయమే తిరిగి నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సభకు రాలేదు. ఇది మీ తప్పు కాదా? కౌన్సిల్కు శాసన పరిమితులు ఉన్నాయి. వాటిని ధిక్కరిస్తే ఏమి జరుగుతుందో.. నిన్నటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఏడు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఎలా అడుగుతారు? మీకు (చంద్రబాబు)కు అంత ఉబలాటమే ఉంటే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలచే రాజీనామా చేయించండి. ప్రజాతీర్పును తీసుకొని రండి. అసెంబ్లీ సాక్షిగా ప్రదర్శించిన చంద్రబాబు నాడు-నేడు మాట్లాడిన వీడియోల ద్వారా ఆయనేంటో రాష్ట్ర ప్రజలకు తెలిసింది. అయితే చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా సీఎం జగన్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా? నీ తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును మోసం చేసింది వాస్తవం కాదా? నీ కొడుకు లోకేష్ రాజకీయ వారసుడు కావాలని, అసలైన ఎన్టీఆర్ వారసులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడుని కూడా అన్యాయం చేశావు. లోకేష్ కోసం ఇన్ని ఘోరాలు చేశావు. భవిష్యత్లో మరిన్ని ఘోరాలు చేయడానికి వెనకాడవు. సీఎం జగన్పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశామని చంద్రబాబు వ్యాఖ్యలు అవాస్తవం. వైఎస్సార్ సీపీ విధానాలు అవి కావు’అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. చదవండి: ‘రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నాం’ ప్రజా ప్రయోజనాల కోసమే.. ‘రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నాం’ -
మూడు రాజధానుల ఆలోచన అద్భుతం
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ఆలోచన అద్భుతంగా ఉందని అనంతపురం జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమలో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడాన్ని వారు స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటువల్ల శ్రీభాగ్ ఒప్పందానికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ.. ఏపీలో అధికార, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. సీఎం యాక్షన్ ప్లాన్ బాగుంది ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ యాక్షన్ ప్లాన్ బాగుందని ఎస్కే యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అభివృద్ధి ఒకేచోట ఉంటే ప్రాంతీయ అసమానతలు వస్తాయని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి లక్ష కోట్ల అవసరమా? అని ప్రశ్నించారు. ఏపీలో మెగా క్యాపిటల్ అవసరం లేదని, మనకు కావాల్సింది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కాదు.. గ్రౌండ్ ఫీల్డ్ క్యాపిటల్ కావాలని, ఇదే విషయాన్ని బోస్టన్ గ్రూప్ కూడా స్పష్టం చేసిందని తెలిపారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదులుకోవటం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమని అన్నారు. మేధావుల మద్దతు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయానికి మేధావులు మద్దతు ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి ప్రజల హక్కు అని వారు స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి రద్దు.. ప్రతిపక్ష టీడీపీ స్వయంకృతాపరాధమేనని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర అభివృద్ధిపై తిరుపతిలో అవగాహన సదస్సు జరిగింది. ప్రజల అభిష్ఠానాన్ని అడ్డుకుంటూ.. మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చంద్రబాబు అడ్డుకోవడం దారుణమని అన్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పట్టిన చంద్రగ్రహణం వీడిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు మూడు రాజధానులు అవసరం గురించి తిరుపతి ఎస్వీయూలో అవగాహన సదస్సు జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రొపెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు బట్టారు. భారీ ర్యాలీ.. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. జేఏసీ నేత రాజా రెడ్డి నేతృత్వంలో వందలాదిమంది ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జేఏసీ నేతలు ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయానికి తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. స్వాగతిస్తున్న ప్రవాసాంధ్రులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రవాసాంధ్రులు స్వాగతిస్తున్నారు. సౌతాఫ్రికాలో నివాసం ఉంటున్న తెలుగువారు సీఎం వైఎస్ జగన్ కు మద్దతు తెలుపుతూ అక్కడ ప్రదర్శన నిర్వహించారు. పాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు. -
‘రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నాం’
సాక్షి, అమరావతి: శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సభలో నేను సభ్యుడినైనా మండలి రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ గతంలో మండలిని చాలా స్వల్పకాలిక ప్రయోజనం కోసం రద్దు చేశారు. ఈనాడు రామోజీరావు కోసం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం రద్దు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెబితే.. చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరం. శాసనసభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయ కుట్రలకు దాన్ని వేదికగా చేసుకున్నారు. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలే గానీ.. స్వార్థం కోసం కాదు. ఆటలో రిఫరీ నిష్పక్షపాతంగా ఉండాలి. బాల్ కొట్టకుండానే పాయింట్ ఇవ్వడం ఎంతవరకూ సమంజసం. మండలిలో చైర్మన్ చేసిన తప్పు అలాంటిదే. మండలి చైర్మన్ ఒక పార్టీ పట్ల పక్షపాతంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. సభాపతులుకున్న నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఒక కమిటీ వేయాలని కోరుతున్నా. మండలిలో జరిగిన దాని గురించి అసెంబ్లీలో చర్చించకూడదని కొందరు అంటున్నారు. జరిగిన తప్పును చర్చించకపోతేనే తప్పు అవుతుంది. చర్చించకపోతే ఇంకా తప్పులు చేస్తారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే’అని పిల్లి సుభాష్చంద్రబోస్ పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తా ‘మండలిలో సభ్యులుగా ఉన్న నేను, నా సహచర మంత్రి సుభాష్ చంద్రబోస్ పదవులను తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పెద్దల సభగా పిలిచే శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నాం. పాలకులు ప్రజల కోసం ఈ సభలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై పెద్దల సభలో మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. గడచిన నాలుగు రోజుల్లో చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే బిల్లులను అపహాస్యం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఆ చట్ట సభల్లోని సభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా టుడే సర్వేలో దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా దక్షత ఉన్న ముఖ్యమంత్రుల్లో నాలుగో స్థానంలో ఉన్న ఘనత జగన్ది. మా పార్టీ నుంచి మండలికి నామినేట్ అయిన సభ్యులు ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన వ్యక్తులు. చంద్రబాబు దోపిడీదారులను మండలికి నామినేట్ చేశారు’ అని మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వ్యాఖ్యానించారు. చదవండి: ప్రజా ప్రయోజనాల కోసమే.. శాసనమండలి రద్దు -
జిల్లాలో ఈ నలుగురి పదవులు పోయినట్లే
సాక్షి, విజయనగరం: శాసన మండలిని పెద్దల సభ అని పిలుచుకుంటుంటాం. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నుంచి ప్రతినిధులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల మేధావులు కొలువు తీరే సభ రాష్ట్ర ప్రభుత్వానికి పాలనలో సలహాలు, సూచనలు ఇవ్వాలి. అయితే, ఆ లక్ష్యం నెరవేరనీయకుండా రాజకీయ అవసరాలకు సభను రాష్ట్ర ప్రతిపక్షపార్టీ వాడుకోవాలని చూడడంతో అసలకే మోసం వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పాలనా వికేంద్రీకరణ జరగాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలనా బిల్లుకు మద్దతు తెలపకుండా రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీ వేసిన ఎత్తుగడ వారి పతనానికి దోహదపడింది. సలహాలు, సూచనలు ఇవ్వకుండా రాజకీయాలు చేసే సభ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని గుర్తించిన ప్రభుత్వం శాసనమండలి రద్దుకు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. లోక్సభ, రాజ్యసభతోపాటు రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే శాసనమండలి పూర్తిగా రద్దవుతుంది. వీరి పదవులు పోయినట్లే..! శాసన మండలి రద్దుతో జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్సీలు పదవులు కోల్పోనున్నారు. జిల్లా నుంచి స్థానిక సంస్థలు కోటాలో పార్వతీపురానికి చెందిన ద్వారపురెడ్డి జగదీష్ ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో సాలూరుకు చెందిన గుమ్మడి సంధ్యారాణి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా జిల్లాలోని భోగాపురానికి చెందిన పాకలపాటి రఘువర్మ కొనసాగుతుండగా, చినమేరంగికి చెందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం జిల్లా కోటాలో ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తున్నారు. వీరిలో రఘువర్మ తటస్థ సభ్యులుకాగా మిగతా ముగ్గురూ టీడీపీకి చెందిన నాయకులు. వీరి ముగ్గురి పదవీ కాలం మరో ఏడాదిన్నర వరకూ ఉంది. కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ పదవీకాలం ఏడాది మాత్రమే అయింది. ఇంకా ఆయనకు ఐదేళ్లు ఉంది. ఇకపోతే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీగా విశాఖకు చెందిన మాధవ్కు నాలుగేళ్లు పదవీకాలం ఉంది. శాసనమండలి రద్దుకు రాష్ట్ర పతి ఆమోదముద్ర వేసే వరకు కొనసాగుతారు. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) దెబ్బతీసిన ప్రతిపక్ష కుటిల రాజకీయాలు.. శాసనమండలిని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007లో పునరుద్ధరించారు. మేధావుల సూచనలు, సలహాలు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అవసరమని ఆయన గుర్తించి ఈ పని చేశారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా పని చేసిన 2014 నుంచి 2019 వరకు ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైంది. మేధావులు, నిపుణులను పక్కన పెట్టి తన రాజకీయ అవసరాలు తీర్చే వారిని పెద్దలు సభకు పంపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని తన కుమారుడు లోకేష్ను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని కట్టడబెట్టారు. జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు జగదీష్, సంధ్యారాణి రూల్ 71ను సమర్థిస్తూ ఓటు వేసి ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిపై వీరి ప్రభావం పడుతుందని గ్రహించిన ప్రభుత్వం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకుంది. బాబు తీరుతో ఎమ్మెల్సీలు పదవులు కోల్పోయారు. చదవండి: శాసనమండలి రద్దు -
మండలి రద్దుకు తీర్మానం
-
దటీజ్ జగన్..!
సాక్షి, అమరావతి : ‘పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. వారు నాకోసం ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలు భరించారు. వారికి ఎప్పటికీ అన్యాయం చేయను, జగన్ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు... దటీజ్ జగన్...’ అని కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నట్లు తెలిసింది. శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ‘ప్రజా మద్దతుతో ఎన్నికైన మన ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం బిల్లుల్ని రూపొందించి శాసనమండలికి పంపితే అక్కడ అడ్డుకుంటున్నారు. సుభాష్ చంద్రబోస్, వెంకటరమణారావు ఇద్దరూ పదవులు కోల్పోతున్నందుకు నేను బాధ పడుతున్నాను. అయితే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు’ అని భేటీలో సీఎం పేర్కొనట్లు తెలిసింది. ఇదే సందర్భంలో ఎల్లో మీడియా పత్రికలు, చానళ్లలో మండలికి సంబంధించిన వార్తా కథనాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనం ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నట్లు.. ఫిరాయిస్తే ఒక్కొక్కరికి ఐదారు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినట్లు అనుచిత కథనాలు ప్రచారం చేస్తున్నాయి. నిరాధారమైన ఇలాంటి వార్తలు, కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయి’ అని మంత్రివర్గ సహచరులతో ప్రస్తావించారు. మనం అనుమతిస్తే పది మందికిపైగా ఎమ్మెల్సీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఓ మంత్రి చెప్పగా.. ముఖ్యమంత్రి జగన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అలాంటి పనిచేస్తే... ఇక మనకూ చంద్రబాబుకూ తేడా ఏముంటుందని అన్నట్లు సమాచారం. రాజకీయాల్లో అందుకు తాను పూర్తి విరుద్ధమని.. అలాంటి అనైతిక చర్యలకు ఫుల్స్టాప్ పెట్టేందుకే శాసనమండలి రద్దు నిర్ణయానికి వచ్చామని చెబుతూ రద్దు నిర్ణయాన్ని ప్రతిపాదించారు. అందుకు మంత్రిమండలి సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థిస్తూ ఆమోదం తెలిపారు. 35 నిమిషాల సేపు జరిగిన ఈ సమావేశంలో మండలి రద్దుకు దారి తీసిన పరిస్థితులను మంత్రివర్గ సహచరులకు జగన్ వివరించారు. -
ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు చంద్రబాబు ముఖం చాటేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మండలిలో రెండు బిల్లుల్ని ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపిన తీరుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడం, మండలి రద్దుపై గతంలో చెప్పిన మాటలకు, ఇప్పుటి వాదనకు పొంతన లేకపోవడంతో.. కావాలనే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 22న మండలిలో వ్యవహరించిన తీరు, బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపిన విధానం, గ్యాలరీలో చంద్రబాబు చేసిన హడావుడిపై అసెంబ్లీలో నిలదీస్తారనే అనుమానంతో ఆ మరుసటి రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. తాజాగా మండలి రద్దు తీర్మానం కోసం నిర్వహించిన సమావేశానికీ గైర్హాజరయ్యారు. తాము చేసిన తప్పులపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే వ్యూహాత్మకంగా సభకు రాకుండా తప్పించుకున్నారనే వాదన వినిపిస్తోంది. 40 సంవత్సరాల అనుభవం, దేశ రాజకీయాల్లోనే సీనియర్ నేతగా చెప్పుకుంటూ.. కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే హాజరుకాకుండా డుమ్మా కొట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మండలిపై చర్చించకూడదంటూ కొత్త పల్లవి సోమవారం జరిగిన చర్చకు హాజరుకాకుండా మీడియా సమావేశం పెట్టి తన వాదన వినిపించడానికి చంద్రబాబు పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అధినేత బాటలో తమ అభిప్రాయాలతో టీవీ ఛానళ్లలో హోరెత్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. శాసన మండలి ఉండాలా? వద్దా? అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అయితే మండలిలో జరిగిన వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చించకూడదంటూ చంద్రబాబు తమ నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం మండలి పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, 2007లో మండలి పునరుద్ధరించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తున్నప్పుడు కూడా అదే విధంగా.. మండలి రద్దు చేసే అధికారం సీఎంకు లేదని, అసెంబ్లీకి తీర్మానం చేసే అధికారం లేదని కొత్త పల్లవి అందుకోవడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకే అంశంపై పరస్పర విరుద్ధంగా మాట్లాడడం ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల్ని తేటతెల్లం చేసిందని అంటున్నారు. ఏం చెప్పాలో తెలియకే: టీడీపీలో చర్చ అసెంబ్లీకి హాజరైతే ఈ ద్వంద్వ నీతిపై అధికార పక్షం నిలదీస్తుందనే జంకుతో సాకులు చూపి డుమ్మా కొట్టారని చెబుతున్నారు. రెండు వైఖరులపై నిలదీస్తే ఏం చెప్పాలో తెలియకే తాము అసెంబ్లీకి వెళ్లలేదని టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం లేకపోవడం వల్లే చంద్రబాబు వెళ్లలేదనే చర్చ టీడీపీలో జరిగిందని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. మండలి రద్దయితే నష్టం వైఎస్సార్సీపీకేనని చెబుతున్నా.. తన కుమారుడు రాజకీయ నిరుద్యోగి మారిపోతాడనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారని, ఆ కారణంగానే మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారనే టీడీపీ సీనియర్ల మధ్య చర్చ సాగినట్లు తెలిసింది. -
మండలితో ఎలాంటి లాభం లేదు
సాక్షి, అమరావతి: శాసనమండలి ఉండాల్సిందేనని ఇప్పుడు చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, 2004లో మండలి వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్పష్టంగా చెప్పారు. శాసనాలు ఆలస్యం అవుతాయని పేర్కొన్నారు. 2004 శాసనమండలి పునరుద్ధరణ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అప్పుడు ఏమన్నారో సోమవారం అసెంబ్లీలో ప్రదర్శించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘శాసనమండలి పునరుద్ధరించాలనే నిర్ణయం వల్ల వీళ్లల్లో (కాంగ్రెస్) కొంతమందికి రాజకీయ పునరావాసం కల్పిస్తారేమో గానీ.. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏం లాభం లేదు. బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనేది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందనేది వాస్తవం కాదు. చరిత్రను చూసినా ఇది అవసరం లేదు. ఒకప్పుడు అక్షరాస్యత ఎక్కువ ఉండేది కాదు. చదువుకునే వాళ్లు అసెంబ్లీకి ఎక్కువ వచ్చేవాళ్లు కాదు. అందుకే శాసనమండలికి మేధావులను తీసుకొచ్చి చర్చించాలన్న ఉద్దేశం ఉండేది. ఈ రోజు శాసనసభలో 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది. చదువుకున్న వాళ్లు, బాగా అనుభవం ఉండేవాళ్లు వచ్చారు. 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్రాలు రెండో సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ, దీనివల్ల ఏం లాభం ఉండదని, అప్పట్లో కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. 1934 అక్టోబర్ 26న బాబూ రాజేంద్రప్రసాద్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని, నష్టం ఉంటుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, శాసనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. 1950 నుంచి చూస్తే... 8 రాష్ట్రాల్లో మాత్రం రెండు సభలొచ్చాయి. కాలక్రమేణా మూడు రాష్ట్రాల్లో రద్దయ్యి ఐదు రాష్ట్రాల్లో మాత్రం మండలి ఉంది. మండలి వల్ల రూ.20 కోట్లు ఆర్థిక భారం పడుతుంది. బిల్లుల ఆమోదంలో కాలయాపన జరుగుతుంది. అసెంబ్లీ నుంచి ఒక బిల్లు పంపిస్తే అక్కడికి పోవడం, తిరిగొస్తే మళ్లీ చర్చించడంతో కాలయాపన అవుతుంది. ఆర్థిక సంబంధమైన బిల్లుల విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలు లేవు. ఈ బిల్లులన్నీ శాసనసభే ఆమోదిస్తుంది. ఏదైనా బిల్లును చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే చట్టమవుతుంది. ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే అసెంబ్లీ తప్ప మండలికి ఏమాత్రం ప్రమేయం లేదు. ఆఖరుకు రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ మండలి సభ్యులకు ఓటింగ్ హక్కు లేదు. పరిమిత అధికారాలు తప్ప ఏమీ మండలికి ఉండవు. అందులో కూడా పెద్ద మేధావులు వస్తారని లేదు.ఎవరిని పెడతారో తెలుసు. ప్రజాధనం దుర్వినియోగం చేసే మండలి బిల్లు వల్ల లాభం కాదు నష్టమొస్తుంది. ప్రజలకు భారమవుతుంది. దీని వల్ల ఏ ప్రయోజనం లేదని వ్యతిరేకిస్తున్నాను..’’ మండలి వద్దని అప్పుడు చెప్పా..: చంద్రబాబు మండలిని రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఏమన్నారంటే... ‘‘శాసనమండలి రద్దు విచారకరం. కౌన్సిల్ను రద్దు చేసే అధికారం శాసనసభకు లేదు. గతంలో మండలి వద్దని నేను చెప్పాను. కానీ ఇప్పుడు రద్దు సమంజసం కాదు. పరిస్థితుల ఆధారంగా సిద్ధాంతాలు మారుతుంటాయి. శాసనమండలి రద్దు చేయాలని అప్పట్లో ఎన్టీ రామారావు నిర్ణయించారు. అది టీడీపీ సిద్ధాంతం. దాన్ని సమర్థించాం. కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు మండలి ప్రాధాన్యత ప్రజల నుంచి తెలుసుకున్నాను. మండలి ఉంటే బడుగు బలహీనవర్గాలకు అవకాశం వస్తుంది. కౌన్సిల్ స్వతంత్ర ప్రత్తిపత్తి కలిగినది. 10 రాష్ట్రాలు మండలి కావాలంటున్నాయి. టీచర్లు, మేధావులు మండలికొస్తారు. ఆర్థిక భారం అని చెప్పడం ఓ సాకే. ఎందుకంటే ఏడాదికి 40 రోజులకు మించి సభ ఎప్పుడూ జరగదు. కౌన్సిల్కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు..’’ -
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని అధికార పక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఓడిపోయిన నేతలకు శాసనమండలి పునరావాస కేంద్రంగా మారిందన్నారు. రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, మంత్రి పేర్ని నాని, అధికార పక్ష ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ప్రజలు ఆమోదించిన,ప్రభుత్వ నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికార పక్ష సభ్యులు ఏమన్నారంటే... సాక్షి, అమరావతి: శాసనసభ తీసుకున్న ప్రజోపయోగ నిర్ణయాలను మండలి అడ్డుకుంటోందని.. అసలు అలాంటి సభ మనకు అవసరమా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ అప్రజాస్వామికంగా, అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్న టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు శాసనమండలిని రద్దు చేయొద్దని చెప్పే అధికారం లేదని అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ధర్మాన ప్రసంగించారు. గతంలో శాసనమండలిని రద్దు చేసినప్పుడు ధర్మవాక్యాలు వల్లించిన చంద్రబాబు ఈవేళ సభకు జవాబు చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో పలువురు ప్రముఖులు ఎగువ సభ రద్దు అవసరాన్ని నొక్కిచెప్పిన విషయాల్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. ధర్మాన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రజోపయోగ నిర్ణయాల్ని అడ్డుకుంటారా? ప్రపంచంలో 178 దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో ఉంటే కేవలం 68 దేశాల్లో మాత్రమే మండలి వంటి ఎగువ సభలు ఉన్నాయి. చాలా దేశాలు రద్దు చేస్తున్నాయే తప్ప కొత్తగా తీసుకొస్తున్నవి లేవు. బ్రిటీష్ వాళ్లు.. వారి అవసరాల కోసం ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి వీటిని ఏర్పాటు చేశారు. అందుకే మహాత్మాగాంధీ మొదలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, గోపాలస్వామి అయ్యర్, ఎన్జీ రంగా లాంటి మహనీయులు వ్యతిరేకించారు. కొందర్ని మేనేజ్ చేయడానికి ఈ పెద్దల సభలు ఉపయోగపడతాయని ఆనాడే గాంధీ పసిగట్టారు. ప్రస్తుతం ఆ విషయం మనకు కరెక్ట్గా సరిపోయే సందర్భం. ఎన్నికల్లో గెలవలేక పరాజయం పొందినవారికి మండలి పునరావాస కేంద్రంగా మారింది. ఖజానాపై భారం పడుతుంది. ప్రజలచే తిరస్కరణకు గురైన వ్యక్తులు గ్యాలరీలలో కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శాసనసభ ఔన్నత్యాన్ని పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? సెలెక్ట్ కమిటీని పద్ధతి ప్రకారం వేయలేదు. ఆ సభలో ఉండే చైర్మన్ రూల్స్ వక్రీకరించి నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ బిల్లును ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో టీడీపీ వాళ్లకు తెలియదా? మండలి అవసరం లేదని చంద్రబాబే చెప్పాడు అమరావతి ప్రాంత ప్రజలే చంద్రబాబు కుమారుడు లోకేష్ను ఓడిస్తే తిరిగి దొడ్డిదారిన తెచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టి మంత్రిని చేశారు. ఆయన మండలిలో కూర్చొని ఇది తప్పు..అది తప్పని చెబుతున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేసినట్టవుతుందా? కాదా? శాసనమండళ్లనే కాదు రాజ్యాంగపరమైన రాజ్యసభ రద్దుకు కూడా 1971, 72, 1975లలో ప్రయత్నాలు జరిగాయి. దేశ, ప్రజాక్షేమానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు ఎవరో ఒక దేశ భక్తుడు ఈ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ అవసరం వచ్చింది. మండలి అవసరం లేదని చంద్రబాబే అన్నాడు. అంతకుముందే మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి..గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడుద్దాం. సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నా’ అని ధర్మాన పేర్కొన్నారు. మండలి రద్దు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రజా శ్రేయస్సు కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే శాసనమండలి అడుగడుగునా అడ్డు తగులుతోంది. మండలిలో టీడీపీ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోవడానికి చంద్రబాబు కారణమయ్యారు. సోనియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా వద్దంటూ ప్రత్యేక ప్యాకేజీ కోసం తాపత్రయపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి తన స్వార్థం కోసం అమరావతిని రాజధాని చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలను, పోలవరం ప్రాజెక్ట్ను మర్చిపోయారు. భవనాలు కట్టడమే అభివృద్ధి కాదు. దీనికి భిన్నంగా మా నాయకుడు వైఎస్ జగన్ 6 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి పాలనను ప్రజల చెంతకు చేరుస్తుంటే సహించలేకపోతున్నారు. అమరావతిలో 4,500 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లునూ తిప్పిపంపడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్నది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. మండలి రద్దు చాలా సమంజసం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మండలి రద్దే మంచిది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని),ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ క్రిమినల్ పొలిటికల్ క్రిమినల్ ఎవరని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు చంద్రబాబే అని. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయన దొంగ రాజకీయాలు చేస్తున్నారు. గాయం చేసిన బాధ తెలిసిన వాడే సాయం చేయగలడన్నట్లు సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల గాయాలను తెలుసుకుని వారు కోరుకున్న విధంగా చట్టాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డు తగులుతున్నారు. ప్రజలు ఛీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చుని ఆదేశిస్తే శాసనసభ ఆమోదించిన బిల్లును అవమానిస్తారా. తన దగుల్బాజీ రాజకీయాన్ని నిలదీస్తామనే చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారు. పెద్దల సభకు వైఎస్ జగన్ అనుభవజ్ఞులైన నాయకులను పంపితే చంద్రబాబు తన ఇంట్లోని దద్దమ్మను పంపారు. అఖిల భారత మేధావుల సంఘానికి అధ్యక్షుడినని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న యనమలకు సింగపూర్ వెళ్లి జ్ఞానదంతం పీకించుకున్నా జ్ఞానం రాలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ముందు నోటీసు ఇవ్వాలని ఈ మేధావికి తెలియదా. ప్రజాభిప్రాయానికి, ప్రజాతీర్పుకు విలువ ఇవ్వని మండలి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకు శుభం కార్డు వేయాలి. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ప్రజాస్వామ్య ‘స్పిరిట్’తో మండలి తెస్తే టీడీపీ ఆల్కహాల్గా మార్చేసింది ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం శాసనమండలిని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారు. రాజకీయాలు ఫెయిర్గా ఉండాలనేది ముఖ్యమంత్రి అభిమతం. సీఎం వైఎస్ జగన్ అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారు కాదా? ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. ఇలాంటి మండలిని ఇంకా ఉండాలా? అని ఆలోచించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే స్పిరిట్తో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మండలిని తీసుకొస్తే.. చంద్రబాబు ఆ మండలిని ఆల్కహాల్గా మార్చేశారు. దేవాలయం లాంటి పెద్దల సభను దెయ్యాల కొంపగా మార్చారు. – చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రభుత్వ విప్ ప్రజాస్వామ్యవాదుల్ని ఆశ్చర్యపరిచింది శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్య వాదుల్ని ఆశ్యర్యానికి గురి చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్నీ ఆయన ప్రయోజనాల కోసమే. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఎండగట్టాల్సిందే. ఆయన పాలనలో దాడులు, అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశాం. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే.. మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే ప్రజాభిమతాన్ని అడ్డుకోవడమేనా? చంద్రబాబు లాంటి వ్యక్తులకు రాజకీయ క్రీడగా మారిన శాసనమండలి, ప్రజా ప్రభుత్వం చేసిన చట్టాలను అడ్డుకోవడానికే పరిమితమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను మండలి అడ్డుకోవడం వెనుక చంద్రబాబు కుతంత్రాలున్నాయి. వ్యవస్థలన్నీ ఆధిపత్య వర్గం చేతిలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాలనను వికేంద్రీకరించి, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకు తెచ్చారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు పేదలను బానిసలను చేశాయి. విద్యుత్ సంస్కరణల పేరుతో చంద్రబాబు ఆ రంగాన్ని దోచుకుతిన్నారు. గ్రీన్ జోన్ పేరుతో అమరావతి రైతులను దగా చేసి, సింగపూర్ కంపెనీలకు మేలు చేకూర్చే ఒప్పందాలు చేసుకోవడమా చంద్రబాబు చేసిన రాజధాని అభివృద్ధి?. రైతులకు చేసిన పాపమే చంద్రబాబుకు శాపమైంది. అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. కౌన్సిల్లో ఏదో జరిగిపోయిందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే వైఎస్ జగన్ మాదిరిగా 51 శాతం ఓట్లతో గెలిచిన నాయకుడు లేడు. ఎన్టీఆర్కు 1983లో 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 51 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన ఏకైక మగాడు వైఎస్ జగన్. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెగబడ్డారు. మండలిలో టీడీపీ సభ్యులు సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు. యనమల రామకృష్ణుడు వేసుకునే సూటు, బూటు కూడా ప్రభుత్వ సొమ్మే. ప్రభుత్వ సొమ్మును ఇంటి అద్దెలకు వాడుకున్న చరిత్ర యనమలది. ఇందుకు సంబంధించి జీవోలు ఉన్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో దంత చికిత్సకు సింగపూర్ వెళ్లిన ఘనుడు యనమల. తన 39 ఏళ్ల రాజకీయ చరిత్రలో దుర్మార్గం తప్ప సొంత జిల్లాకు, తన నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఎన్టీఆర్కు పొడిచినట్లే ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. శాసనసభ్యులను ఆబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. – దాడిశెట్టి రాజా, ప్రభుత్వ విప్ చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తొస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు కళ్లముందు కదలాడుతుంది. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మేనిఫెస్టోను వందకు వంద శాతం నెరవేర్చేలా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. ఒక్క ముస్లిం, మైనారిటీకి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మండలిపై కూడా చంద్రబాబు రెండు నాలుకల సిద్ధాంతాన్ని చూపించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. – విడదల రజని, ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని గాయపరిచింది శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారు. మండలి రద్దుపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు. సభలో చర్చించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చర్చించాలా?. పెద్దల సభలో పెద్దలు లేరు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. దానిని అడ్డుకుని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు. కానీ.. 13 జిల్లాలకు విలన్ అయ్యారు. – గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే చంద్రబాబుది నక్షత్రకుడి పాత్ర రాయలసీమది ఘనమైన చరిత్ర. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే దుష్ప్రచారం మొదలు పెట్టింది. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా వెలసిన తిరుపతి రాయలసీమలోనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారు రాయలసీమ వారు కాదా? ఎన్టీఆర్తో అద్భుతమైన హిట్ చిత్రాలు నిర్మించిన కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి వారు రాయలసీమ వారు కాదా?. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్ నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఆయన తాత రాజారెడ్డి గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తున్నారు. ‘రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో 23 ఏళ్లు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే జగన్ వల్ల నాకు శాప విముక్తి పొలిటికల్ ట్రాప్లో పడి ఎన్టీఆర్ అంతటి గొప్ప వ్యక్తికి వెన్నుపోటు పొడిచానని, అందుకు 15 సంవత్సరాలు రాజకీయంగా తెరమరుగయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల తనకు శాపవిముక్తి జరిగిందన్నారు. గొప్ప వ్యక్తుల వల్లే శాప విముక్తి జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్కు వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించగా స్పీకర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తృత చర్చ జరగాలి..: ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ సభాపతులు అనుసరించాల్సిన నిబంధనలు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన స్పీకర్ల సమావేశాల్లో ఫిరాయింపుల నిరోధక చట్టాలపై మంచి చర్చలు జరిగాయన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని తమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కచ్చితంగా చెబుతున్నారని తాను చాలా స్పీకర్ల సమావేశాల్లో చెప్పానని తెలిపారు. దీనిపై రాజ్యాంగ సమీక్ష జరగాలనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. బోస్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, దానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముందని స్పీకర్ అన్నారు. అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి? భావితరాల భవిష్యత్ కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసే చట్టాలను అడ్డుకోవడానికే శాసనమండలిని చంద్రబాబు లాంటి వాళ్లు వాడుకుంటున్నారు. మహా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లుగా జగన్ ప్రజా శ్రేయస్సు కోసం చేసే ప్రతి పనినీ చంద్రబాబు అడ్డుకుంటున్నారు. శాసనసభలో ఆమోదించిన చట్టానికి సూచనలు చేయాల్సిన బాధ్యత గల మండలి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాల్సిందే. ఇంగ్లిష్ మీడియం విద్య బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్ ఏర్పాటు చేసే చట్టాలను అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి. శాసనసభలో తాటకి మాదిరిగా చంద్రబాబు, కౌన్సిల్లో సుబాహు మాదిరిగా ఆయన కుమారుడు అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. కుట్రలు, కుతంత్రాలుతో నిండిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ దుర్మార్గాలకు తెర తీస్తోంది. శాసన మండలి రద్దు గురించి చంద్రబాబు చెప్పే సుద్దులు విడ్డూరంగా ఉన్నాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ 2004లో మండలి పునరుద్ధరణపై వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను అందరూ గమనించాలి (అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన మండలి రాష్ట్రానికి ఆర్థిక భారమన్న చంద్రబాబు ఇప్పుడు కావాలనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత మీరెవరు విడగొట్టేందుకు అని బస్సులో బయల్దేరారు. వాజ్పేయి ప్రభుత్వాన్ని మతతత్వ పార్టీ అని, తాను మద్దతు ఇవ్వనని చెప్పిన చంద్రబాబు తరువాత ఆ పార్టీతోనే జత కట్టారు. ప్రధాని మోదీ కాళ్లకు దండం పెట్టి బీజేపీతో అంటకాగారు. పత్రికారంగంలో దుర్మార్గ పోకడలు హేయం. – పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి -
ప్రజా ప్రయోజనాల కోసమే..
చంద్రబాబులా బాహుబలి లాంటి గ్రాఫిక్స్ సినిమాలు చూపించకుండా మనకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఆశ పడితే అది తప్పా? ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్లో ఆలస్యం జరగకూడదు. కుట్రలతో మంచి పనులు ఆగిపోవడం నాకిష్టం లేదు. అందుకే మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ‘ద టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్ టు డూ.. వాట్ ఈజ్ రైట్..’ (మంచి చేయాలనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదే) అని చెప్పిన అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ సూక్తిని ఈ సందర్భంగా అంతా గుర్తు చేసుకోవాలి. -సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకునే రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో నడుస్తున్నందు వల్లే శాసన మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ దీనికి కారణాలను సోదాహరణంగా వివరించారు. అసలు శాసనమండలి ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? గతంలో దీన్ని సమర్థించిన పత్రికలు, టీడీపీ ఇప్పుడు ఎలా యూటర్న్ తీసుకున్నాయి? అనే అంశాలను వివరించారు. నాడు రామోజీరావు కోసం శాసనమండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం తీర్మానం చేస్తే అద్భుత నిర్ణయమని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాసిన ఈనాడుకు ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం తాము తీసుకున్న నిర్ణయం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. ఇదేనా మీ ద్వంద్వనీతి? అని ప్రశ్నించారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా.. వద్దా? ‘‘అధ్యక్షా.. ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న సంగతి మనతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనందరి ముందు ఉన్న ప్రశ్న కేవలం మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా బతికించుకోవాలా.. వద్దా? అన్న ప్రశ్న మనముందు ఉంది. ప్రజా ప్రభుత్వాలు సజావుగా పని చేయలా.. వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (2) ప్రకారం సీఎం నేతృత్వంలోని క్యాబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేరుగా ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి. భరించలేక వద్దనుకున్నాయి.. ఇప్పుడు శాసనమండలి దేశంలో 28 రాష్ట్రాలకు గాను కేవలం ఆరు చోట్ల మాత్రమే ఉంది. (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర). మండలిని భరించలేక ఈ వ్యవస్థ వద్దని పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. నాడు మాకు బలమున్నా కొనుగోలు చేసి గెలిచారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరులో మాకు బలమున్నా అతి నీచంగా కొనుగోలు చేసి గెలిచారు. అప్పుడూ ఈ ఎల్లో మీడియా చంద్రబాబును ఒక్కరోజైనా ప్రశ్నించలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేసే అవకాశం ఉన్నా అలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. ఇదే విషయాన్ని తొలిరోజే సభలో చెప్పా. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాజకీయాలను మార్చడానికి ఈ చట్టసభలో అడుగుపెట్టామే తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. మండలి తప్పనిసరి కాదు రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ శాసన మండలి తప్పనిసరి అనుకుని ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీలులేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేది. రెండో సభను ఆప్షనల్గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి మండలి రద్దు అధికారాన్ని కూడా ఆర్టికల్ 169 ప్రకారం అసెంబ్లీకే అప్పగించారు. దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో.. మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు. నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదు. ఇదే శాసనసభలో ముగ్గురు పీహెచ్డీ చేసినవారు, 38 మంది పీజీ చేసినవారు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజనీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులు, ఇద్దరు గ్రూప్ – 1 అధికారులు, 1 ప్రొఫెసర్, 1 జర్నలిస్టు, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారు. వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఇలాంటప్పుడు మండలి అవసరం ఏముంది? సోమవారం శాసన మండలి రద్దు తీర్మానంపై చర్చిస్తున్న అసెంబ్లీ కాలయాపనకే కౌన్సిల్.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్న మండళ్లను ఏమనాలి? కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రజా ప్రయోజనం లేని మండలిపై డబ్బులు ఖర్చు చేయడం శుద్ధ దండగ. ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు ఈ మండలికి అర్హత లేదు. ఇటువంటి మండలికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా? అని అంతా ఆలోచించాలి. మండలికి శాసనసభ జవాబుదారీ కాదు. పేదలు రూపాయి కూడా ఖర్చు చేయకుండా వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం బిల్లు తెచ్చినా, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తెచ్చిన ప్రత్యేక కమిషన్ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకున్న మండలి కారణంగా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఎలా హాని చేయాలి? బిల్లులను ఎలా అడ్డుకోవాలి? కత్తిరించాలి? అనే దిక్కుమాలిన ఆలోచనలు చేసే అలాంటి సభ మనకు అవసరమా? అన్నది ఆలోచన చేయాలి. నాడు ఈనాడు సమర్థించలేదా..? మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు టీడీపీ పాంప్లేట్ పేపర్ ఈనాడు దాన్ని సమర్థిస్తూ సంపాదకీయాలు రాసింది. అప్పుడు ఈనాడు ఏమేం రాసిందంటే... (క్లిప్పింగ్లను సీఎం చదివారు) అనుభవంలో వాటి (మండళ్ల) నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయి. అందుకు పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయనవసరం లేదు. నిరర్ధకమే కాక గుదిబండలా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్లు గుండెలు బాదుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించిన ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది.రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గంలో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచిపేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఇలా ఎంత చక్కగా రాశారు అధ్యక్షా అప్పట్లో! రామోజీ కోసం రద్దు చేశారు.. ఆనాడు మండలిని ఒక మనిషి కోసం రద్దు చేశారు అధ్యక్షా. ఆ మనిషి సాక్షాత్తూ ఈనాడు అధినేత రామోజీరావు. ఆనాటి రాజకీయాల గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారందరికీ ఈ విషయం తెలుసు. ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా మండలినే రద్దు చేసిన పరిస్థితి. అటువంటి మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప సంపాదకీయాలు రాశారు. ఈరోజు కోట్లాది మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు రాజకీయ కోణంతో అడ్డుతగులుతున్నారు. అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలి రద్దు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మండలిని కొనసాగిస్తే వచ్చే ఏడాది మా పార్టీకి మెజారిటీ వస్తుందని తెలిసినా ప్రజల అవసరాలు, ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మండలి రద్దు కోసం తీర్మానం చేస్తున్నాం. ఆకర్ష్ అంటూ సిగ్గుమాలిన రాతలు.. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ చంద్రబాబు పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాస్తున్నాయి. ఇంత దిగజారిన రాతలు చంద్రబాబు పత్రికల్లో చూస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్లంతా చంద్రబాబు హయాంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏ రోజైనా కనీసం నోరెత్తారా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోతే ఎల్లో మీడియా కనీసం నోరెత్తలేదు. మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే ఈనాడు, ‘చంద్ర’జ్యోతి, టీవీ 5 ఎందుకు ప్రశ్నించలేదు? నోరెత్తకపోగా చంద్రబాబు గొప్ప రాజనీతి చాణక్యుడని, ఆయన పరిపాలన చూసి ముగ్దులై ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటూ దిక్కుమాలిన కథనాలు రాశాయి. చర్చ జరగాలనే మూడు రోజులు టైం మండలి రద్దు గురించే సభ పెడుతున్నామని గురువారం నాడే చెప్పాం. ప్రజలు చర్చించుకోవాలని సమయమిచ్చినా ఎమ్మెల్సీలను రూ. 5 కోట్లకు కొంటున్నామని టీడీపీ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. మేం సమయం ఇవ్వకుంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేసేవారు. విలువలు, విశ్వసనీయత లేని వారు ఎవరో, అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే నైజం ఎవరిదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో, మోదీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలో, బీజేపీ విషయంలో, మండలి విషయంలో చంద్రబాబు ఎన్నెన్ని యూటర్న్లు తీసుకున్నాడో గత ఐదేళ్లలో చాలా చూశాం. నిజంగా మాటలు ఎవరు మార్చారో ఒక్కసారి వీటిని చూస్తే తెలుస్తుంది (బాబు వివిధ సందర్భాల్లో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యల క్లిప్పింగ్లను ప్రదర్శించారు). అవసరం తీరిన తరువాత ఎవరినైనా వెన్నుపోటు పొడవటానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి బాబు. చంద్రబాబు యూటర్నులు కాంగ్రెస్ పార్టీ గురించి ముందు.. - కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీనా? చెత్త పార్టీ. ఇది సోనియాగాంధీ సామ్రాజ్యం కాదు. ఇది ఇటలీ కాదు ఇది ఇండియా - కాంగ్రెస్కు సహకరిస్తే వారిని ఏమనాలి...? ఆ పార్టీనే శాశ్వతంగా బాయ్కాట్ చేయాలి. అప్పుడు కూడా కసి తీరదు - సోనియా, రాహుల్ ఇంతవరకు ఒక్క మాట అయినా విభజన గురించి మాట్లాడారా? మీకు చేతకాదా? మీరు నాయకులా? ఏమనుకుంటున్నారు మీ గురించి అని అడుగుతున్నా. - ఆ మహాతల్లి (సోనియా)కి ఎక్కడ లేని డబ్బు పిచ్చి. డబ్బులు లేకపోతే ఆవిడకు నిద్ర పట్టదు. సోనియా ఇటలీ నుంచి వచ్చింది. మన కష్టాలు తెలిసిన వ్యక్తా? కాదు. - కాంగ్రెస్ను ఎండగడతాం. ఈ దేశంలో కాంగ్రెస్ను దోషిగా నిలబెడతా. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయింది. ఆ వెంటిలేటర్ ఎప్పుడు తీసేస్తే అప్పుడు చనిపోతుంది. - కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ఆలోచన చేస్తోంది. నీచమైన రాజకీయాలు చేస్తోంది. æ సోనియాగాంధీ ఈ దేశానికి వచ్చి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఈ రోజు అభద్రతాభావంతో బతికే పరిస్థితి తీసుకువచ్చిందంటే చాలా దుర్మార్గం - తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతో రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో పోరాడాం. కాంగ్రెస్తో లాలూచీ పడే పరిస్థితి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఉండబోదు తరువాత - కాంగ్రెస్, మేమూ కలసి పనిచేస్తున్నాం. మా మధ్య సమస్య ఉండదు. మేము కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. - పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్పార్టీ. 90 శాతం డబ్బులు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. - మోదీ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. కొత్త ప్రధాని వస్తారు. - మేము కూర్చొని మాట్లాడుతున్నాం. రాహుల్ను కూడా ఆయన పార్టీలో చర్చించమని కోరా. మేం ఓ ఉమ్మడి వేదిక మీదకు వస్తాం. కలసి ఎలా పనిచేయాలన్నది నిర్ణయిస్తాం. నరేంద్ర మోదీ గురించి ముందు.. - మోదీ సమర్థుడు. ఆయన ప్రధాని కాబోతున్నారు. ఎవరూ అడ్డుకోలేరు. నాదీ నరేంద్రమోదీదీ విన్విన్ కాంబినేషన్. - అభివృద్ధి కోసం మోదీతో కలసి పనిచేయాలని భావిస్తున్నాను. - స్వాతంత్య్రం వచ్చిన తరువాత చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు. కానీ భారతదేశం ప్రతిష్టను ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ. - సమర్థుడైన మోదీ నాయకత్వంలో భారతదేశం త్వరలోనే సూపర్వపర్గా తయారవుతుంది. - మోదీ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. తరువాత... - గురువుకు నామాలు పెట్టింది నరేంద్ర మోదీ. తల్లిని చూడలేదు. తల్లికి బిచ్చం పెట్టనివాడు దేశాన్ని ఉద్దరిస్తాడంట. - నరేంద్రమోదీ కంటే మిగతా నాయకులంతా మెరుగైన వారే. - నరేంద్రమోదీ కరుడుగట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. - నరేంద్ర మోదీకి ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. - హుందాతనం ఏమైంది. పోలవరం ఈయన ఇచ్చాడంటాడు... ఈయన ఇచ్చేదేంటి పోలవరం. మన రాజధాని శంకుస్థాపనకు ఆయన్ని పిలిచాను. ఏం ఇచ్చారు...మట్టీ, నీళ్లు మన ముఖాన కొట్టాడు. - మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ ప్రత్యేక హోదా గురించి ముందు .. - ప్రత్యేక హోదా ఇవ్వాలి ఐదేళ్లు ఇచ్చారు. నరేంద్రమోదీని కోరుతున్నా 15 ఏళ్లు ఇవ్వండి. ఐదేళ్లలో పరిశ్రమలు రావాలంటే రెండుమూడేళ్లవుతుంది. అది ప్రారంభమయ్యేలోగా ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే కనీసం 15ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నా. తరువాత - కావాలని కొందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే అదేదో సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందండి? రెండే వస్తాయి. ఒకటి ఈఏపీ... రెండు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు తగ్గించేశారు. 62 శాతం నుంచి 52శాతానికి వచ్చింది. ఇక ఈఏపీ ఏంటీ... కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు ఇస్తే ...మళ్లా వాళ్లు మంత్రిమండలిలో ఆమోదించాలి. - నేను మొదట అడిగింది ప్రత్యేక హోదానే. కాదు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారన్నారనుకో. నేను కాదనను కదా. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? - ప్రత్యేక హోదాతోనే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు , పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదేం... - ఈ రోజు కేంద్రం ఇచ్చిందానికి అభినందిస్తూనే...వాళ్లు ఎంతిచ్చినా తీసుకోవడం...ముందుకు పోవడం తప్పా మనకు మరో మార్గం లేదు. మళ్లీ : ప్రత్యేక హోదా మినహా మనకు మరో మార్గం లేదు. చంద్రబాబూ ఈ ప్రశ్నలకు బదులేది? - ఎస్సీ ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది. వారి క్షేమాన్ని కాంక్షించి ఇప్పుడు వేర్వేరుగా కమిషన్లు తెచ్చాం. దీన్ని అడ్డుకోవడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? - రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువులు తేవడం న్యాయమా.. అన్యాయమా? - ఏ అన్యాయం జరిగిందని ఆయన అమరావతి రైతులతో ఉద్యమాలు చేయిస్తున్నారు? రైతులకు కౌలు (యాన్యుటి) 15 ఏళ్లకు పెంచడం అన్యాయమా? - రాజధానిలో భూమి లేని నిరుపేదలకు జీవనభృతి రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచడం అన్యాయమా? - అసైన్డు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ప్లాట్లు ఇవ్వడం మేం చేసిన తప్పా? - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగితే నేరమా? - వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చాలనుకోవడం నేరమా? - స్వాతంత్య్రానికి పూర్వం 1937నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనుకోవడం తప్పా? -
శాసనమండలి రద్దు
సాక్షి, అమరావతి: రాజకీయ దుర్నీతికి వేదికగా మారిన శాసనమండలికి చరమగీతం పాడాల్సిందేనని రాష్ట్ర శాసనసభ తేల్చి చెప్పింది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడ్డంకిగా నిలిచిన మండలిని రద్దు చేయాలన్న చట్టబద్ధ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజాతీర్పుతో ఎన్నికైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రతిబంధకంగా మారుతూ, ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారి రాజకీయ లబ్ధికి సాధనంగా మారుతున్న శాసనమండలి కథకు ముగింపు పలకాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా 133 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శాసనమండలి రద్దు దిశగా ప్రధాన ప్రక్రియ సాఫీగా ముగిసింది. మండలి అనవసరం... వృథా వ్యయం టీ విరామం తర్వాత శాసనసభ తిరిగి 11.58 గంటలకు ప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ’రాష్ట్ర శాసనమండలి రద్దుకు ఏపీ శాసనసభ తీర్మానిస్తున్నది’ అని పేర్కొంటూ చట్టబద్ధమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో స్పీకర్ చర్చకు అనుమతించారు. దీంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా శాసనమండలి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసిందని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్మానంపై చర్చలో 16 మంది పాల్గొన్నారు. ప్రజాతీర్పును గౌరవించలేని మండలి అవసరం లేదని స్పష్టం చేశారు. మండలి రద్దు అప్రజాస్వామికమన్న టీడీపీ వాదనను సమర్థంగా తిప్పికొట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించని ఎగువ సభ అవసరం లేదని ఆనాడే గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్లు విస్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తీర్మానానికి మద్దతుగా లేచి నిల్చున్న సభ్యులు మండలి అనవసరమని, దానివల్ల ఆర్థికంగా భారం పడుతుందని, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్న.. రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు ఏజే కామత్ అభిప్రాయాన్ని సభ్యులు ప్రస్తావించారు. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి ఆమోదించిన బిల్లులను మరోసారి మండలికి పంపాల్సిన అవసరం ఏముందన్న రాజ్యాంగ పరిషత్ సభ్యుడు దేశ్ముఖ్ అభిప్రాయాన్ని కూడా సభ్యులు గుర్తుచేశారు. ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే సందేహించారో సరిగ్గా అదే రీతిలో ప్రస్తుత శాసనమండలి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తికి పెద్దపీట వేస్తూ శాసనమండలిని రద్దు చేయాలని ముక్తకంఠంతో కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన మండలి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రస్తుత శాసనమండలి సైంధవ పాత్ర పోషిస్తోందని శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మీడియం బిల్లు, ఎస్సీ–ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు బిల్లులను అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని అడ్డుకోవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరుపై సభ్యులు మండిపడ్డారు. రూల్–71 కింద చర్చను అనుమతించడం ద్వారా దురుద్దేశంతో వ్యవహరించిందని విమర్శించారు. బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి నివేదించే విషయంలో మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే చైర్మన్ విచక్షణాధికారాల పేరిట ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజాక్షేమం వద్దా? చంద్రబాబు లబ్ధే ముఖ్యమా...! ప్రజల ప్రయోజనాల కంటే కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధికే శాసనమండలి పెద్దపీట వేసిందని శాసనసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టిన ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడ్డుకునేందుకు మండలి టీడీపీకి ఓ సాధనంగా మారిందని సభ్యులు విమర్శించారు. అమరావతి ముసుగులో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా జరిపిన భారీ భూదందాను కాపాడేందుకు మండలి రాజకీయ వేదికగా పనిచేసిందని దుయ్యబట్టారు. శాసన, పరిపాలన, న్యాయ రాజధానులను మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేసే యత్నాలను మండలి అడ్డుకోవడం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఎండగట్టారు. ప్రజాస్వామ్య విలువలకు అద్దంపట్టిన సీఎం ప్రసంగం మండలి రద్దు తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టింది. ఏడాది ఆగితే మండలిలో వైఎస్సార్సీపీకి మెజార్టీ వస్తుందని తెలిసినప్పటికీ పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ మండలి రద్దుకు నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పడమే ఇందుకు నిదర్శనం. 5 కోట్ల మంది అభ్యున్నతి కోసం మండలి రద్దు శాసనమండలి సభ్యులను ప్రభుత్వం ప్రలోభపెడుతోందంటూ టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై సభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేస్తే కీర్తించిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు తాము అదే పనిచేస్తుంటే విమర్శిస్తోందని ధ్వజమెత్తింది. నాడు ఎన్టీఆర్ కేవలం ఓ వ్యక్తి (ఈనాడు రామోజీరావు) కోసం శాసనమండలిని రద్దు చేశారని...కానీ నేడు 5 కోట్లమంది రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం తాము శాసనమండలిని రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే సభ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. మండలి రద్దుకు జనసేన సభ్యుడు రాపాక సహా సభకు హాజరైన 133 మందీ మద్దతు ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను సత్వరమే అమలు చేసేందుకు వీలుగా శాసనమండలి రద్దు కోసం తాను ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అందరూ ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దాంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ తీర్మానంపై సభ నిర్ణయం కోసం ఓటింగ్ / డివిజన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులంతా లేచి నిలబడాలని కోరారు. సీఎం, అధికార పక్ష సభ్యులతోపాటు జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ కూడా లేచి నిలుచున్నారు. వారు కూర్చున్న తర్వాత స్పీకర్ తీర్మానాన్ని వ్యతిరేకించే వారు లేచి నిలబడాలని కోరగా ఒక్కరు కూడా లేవలేదు. తటస్థంగా ఉండేవారు లేచి నిలబడాలని కోరినా ఎవరూ స్పందించలేదు. సభకు హాజరైన సభ్యులు అందరూ మద్దతు తెలపడంతో తీర్మానాన్ని సభ ఏకగీవ్రంగా ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 133 మంది ఓటేశారు. కాస్త గందరగోళం కౌంటింగ్ సందర్భంగా కాస్త గందరగోళం నెలకొంది. తీర్మానానికి మద్దతుగా సభలో ఉన్న సభ్యులు అందరూ తమ స్థానాల్లో నిలబడ్డారు. శాసనసభ ఉద్యోగులు జట్లుగా విడిపోయి వరుసల వారీగా సభ్యుల స్థానాల వద్దకు వెళ్లి లెక్కించారు. ఆ ఓట్ల గణాంకాలను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు ఇచ్చారు. ఆయన వాటిని క్రోడీకరించి స్పీకర్కు అందజేశారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం తీర్మానానికి అనుకూలంగా 121 మంది ఓటు వేశారని, ప్రతికూలంగా, అలాగే తటస్థంగా కూడా ఎవరూ లేరని స్పీకర్ ప్రకటించారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు సభ్యులు అభ్యంతరం తెలిపారు. 121 కంటే ఎక్కువమందే ఉన్నారని, మళ్లీ లెక్కించాలని కోరారు. దీంతో ఓట్లను మళ్లీ లెక్కించాలని స్పీకర్ శాసనసభ ఉద్యోగులను ఆదేశించారు. దాంతో ఉద్యోగులు మరోసారి సభ్యుల వద్దకు వెళ్లి ఓట్లను లెక్కించి వివరాలను స్పీకర్కు అందజేశారు. దాంతో శాసనమండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా సభలో 133 మంది ఓటు వేసినట్లు తమ్మినేని ప్రకటించారు. వ్యతిరేకంగా, అలాగే తటస్థంగా కూడా ఎవరూ లేరని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ‘రాజ్యాంగంలోని 169 (1) అధికరణ ప్రకారం కౌన్సిల్ రద్దు చేయాలంటే మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం ఉండాలి. ఆ విధంగా ఈ తీర్మానం సభ ఆమోదం పొందింది’ అని స్పీకర్ తెలిపారు. తీర్మానాన్ని సభ ఏకగీవ్రంగా ఆమోదించినట్లు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. టీడీపీ సభ్యులు సోమవారం సభకు హాజరుకాలేదు. -
దండగమారి ‘మండళ్లు’!
‘‘భారత రాజ్యాంగ చట్టంలోని 168వ అధికరణ రాష్ట్రాలలో లెజిస్లేచర్ల ఏర్పాటు గురించి ఏమి చెప్పినప్పటికీ... పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రాలలోని ఎగువ సభల (లెజిస్లేటివ్ కౌన్సిల్స్)ను రద్దు చేయవచ్చు లేదా వాటిని ఏర్పర్చనూవచ్చు. అయితే సంబంధిత రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) మెజారిటీ సభ్యులు ఆ మేరకు నిర్ణయించిన ప్పుడు అందుకు పార్లమెంటు సమ్మతి ఉంటుంది’’ – భారత రాజ్యాంగంలో 169వ అధికరణ నిర్దేశం ‘‘గత కొన్నేళ్లుగా ఈ ఎగువ సభలను రద్దు చేయాలన్న ఆలో చనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పక్షాలేగాక ప్రజాస్వామ్య సంఘాల్లో కూడా ఎగువ సభలవల్ల అనర్థాలు, అనవసర వ్యయం మినహా ప్రయోజనాల్లేవన్న భావన పెరిగింది... రాజ్యాంగ నిపుణులు ఎగువ సభకు నిర్దేశించిన లక్ష్యం గాలికి కొట్టుకుపోయింది. 3 లక్షల మంది ఓటర్ల విశ్వాసం పొందిన ఎమ్మెల్యే కంటే ఎన్నికల్లో ఓటమి పాలై పార్టీ పెద్దల ప్రాపకంతో ఎమ్మెల్సీలు అవుతున్న వారికే ప్రొటోకాల్ ప్రకారం పెద్దపీట వేస్తున్నారు’’ – ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి ‘‘రాష్ట్రాలలో నూతనంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు అంతకు ముందు అక్రమంగా చోటు చేసుకున్న కాంట్రాక్టులను, అవినీతితో కూడిన ప్రాజెక్టులను సదుద్దేశంతో సమీక్షించే హక్కు ఉంది’’ – హైదరాబాద్లో అమెరికా కాన్సుల్ జనరల్గా పనిచేసిన సీనియర్ దౌత్యాధికారి క్యాథరిన్ హడ్డా. ‘ది హిందూ’ (18.1.2020) ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇంతవరకూ రాష్ట్రం కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజామోదం పొందిన అనేక సంక్షేమ పథ కాలు ‘ఉత్తుత్తి’ హామీలు కాకుండా వాస్తవ జీవనంలో క్షేత్ర స్థాయిలో అమలులోకి వచ్చి, నిలదొక్కుకోవడం ప్రారంభించి ఏడు మాసాలు కూడా పూర్తి కాలేదు. కాగా, ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా వదిలించు కుని కుట్రలు, కుహకాల ద్వారా అధికారంలోకి వచ్చిన ‘తెలుగుదేశం’ పార్టీ నాయకుడు చంద్రబాబు 2019 జనరల్ ఎన్ని కల్లో ఘోర పరాజయంవైపు పార్టీని నడిపించి అభాసుపాలయ్యాడు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న నూతన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బాబుకు కూర్చో వడమే కంపరమెత్తిపోతున్నట్లుంది. అంతేకాకుండా అసంఖ్యాక మెజారిటీతో గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులను సభా చర్చలలో ఎదుర్కొనే దమ్మూ, సత్తా లేక కేవలం 23 మంది సభ్యు లతో మిగిలి కుమిలిపోతున్న ప్రతిపక్షంగా ‘దేశం’ రోజులు గడప వలసి వస్తోంది. కాగా, ఈ పరాభవాన్ని భరించలేని బాబు నేతృ త్వంలోని టీడీపీ కుట్రలతో, డబ్బులు ఎరబెటి,్ట ఎగువసభ అయిన కౌన్సిల్లో దింపుడుకల్లం ఆశగా మిగిలిపోయిన బలంతో జగన్ అఖండ విజయాన్ని తారుమారు చేసే కుట్రకు తలుపులు తెరిచింది. తొలిరోజుల్లో శాసనసభ–శాసన మండలి బాంధవ్యాన్ని కొందరు రాజనీతిజ్ఞులు ‘కప్పు–సాసర్’ మధ్య బంధంగా భావిం చేవారు. అంటే– ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న దిగువ సభ అయిన శాసనసభలో చర్చలు వేడిగా, వాడిగా, ఉద్రేకంతో సాగుతాయి కాబట్టి ఆ ఉద్రేక వాతావరణాన్ని ‘పెద్దల సభ’ (కౌన్సిల్) విజ్ఞతా పూర్వక చర్చల ద్వారా తగ్గిస్తుందన్న నమ్మకం ఉండేది. అలా కప్పులో వేడిగా ఉండే కాఫీ సాసర్లోకి పోసినప్పుడు చల్లబడుతుందన్నది పాతకాలపు నానుడి. ఇప్పుడు భారత ప్రజాస్వామ్య విలువలన్నీ చౌరస్తాలో ‘చాకి రేవు’లో ఉతుకుడుకి, బాదుడికీ భారీ స్థాయిలో గురి అవుతున్నాయి. చంద్రబాబు కుళ్లు రాజకీయం రాష్ట్ర శాసనమండలిలో మరింత వికృత రూపం దాల్చింది. శాసనసభ ప్రత్యక్ష ఎన్నికల్లో తమకు కలిగిన శృంగభంగాన్ని కౌన్సిల్లో ప్రతిపక్ష తాత్కాలిక మెజారిటీ ద్వారా మభ్యపరుచుకుందామని భావించారు, అసెంబ్లీ ఆమోదం పొందిన ప్రజాహితమైన బిల్లులను పరోక్ష మార్గంలో ఎన్నికైన శాసనమండలిలో తన బలంతో అడ్డుకుందామని బాబు వర్గం చూసింది. ఆ ప్రయత్నంలో కౌన్సిల్ అధ్యక్షుణ్ణే బెదిరింపులతో ఇరకాటంలో పెట్టింది. నోటీసూ పాడూ లేని తీర్మాన ప్రతిపాదనను మూజువాణీగా తీసుకొని అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని సలహాల ద్వారా తప్ప తిరస్కరించే అధికారంలేని కౌన్సిల్ ఛైర్మన్ను ‘దేశం’ సభ్యులు ఇరకాటంలోకి నెట్టారు. ఆమోదం లేని ‘దేశం’ ప్రతిపాద నను సెలెక్టు కమిటీకి పంపినట్టు అబద్ధమాడి ప్రచారంలో పెట్టగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అసలు సెలెక్టు కమిటీకే పంపలేదని కౌన్సిల్ అధ్యక్షుడే ప్రకటించారు, అయితే బెదిరింపులవల్ల ఛైర్మన్ అని శ్చిత స్థితిలో దఫదఫాలుగా మాట మార్చవలసిన దుస్థితి వచ్చింది. ఇదీ–పెద్దల సభ ఎలా మారగలదో నిరూపించిన వైనం. దేశంలోని కౌన్సిళ్ల దుష్ట చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం. అసలు దేశంలో 28 రాష్ట్రాలకుపైగా ఉంటే, వాటిలో కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే (1956–1985 మధ్య 25 ఏళ్ల పాటు) అంటే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసేవరకు బతికి ఉండ టానికి కారణం ఏమిటి? ఇతర రాష్ట్రాలలో ఆ కౌన్సిళ్లు ఎందుకు లేవు? అసలు ‘కౌన్సిళ్ల’ లేదా ‘పెద్దల సభ’ పేరిట ఏర్పడినవి.. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకునే శాసనసభలకే ప్రాధాన్యమివ్వాల న్నది 1941 డిసెంబర్ 9 నుంచి 1948 జనవరి 27 మధ్య జరిగిన రాజ్యాంగ నిర్ణయ సభా చర్చల సారాంశమూ, నిర్ణయమూ. సర్వే పల్లి రాధాకృష్ణన్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, గోపాల స్వామి అయ్యంగార్, మౌలానా హజ్రత్, సిబిన్లాల్ సాక్సేనా లాంటి హేమా హేమీలు మాసాల తరబడి కౌన్సిళ్ల ఏర్పాటుపై చర్చించి, వ్యతిరేకిం చారు. కారణం–ఎగువ సభలు, దిగువ సభలన్న వివక్షకు వారు వ్యతి రేకులైనందుననే, స్వాతంత్య్రానంతర భారతంలో ప్రగతి శాసనాలకు అడ్డుపుల్లలుగా తయారైన కౌన్సిళ్లు ఎన్టీఆర్ రద్దు చేసే వరకు కేవలం ఆంధ్రప్రదేశ్లోనూ, తరువాత బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ నాడు, ఉత్తరప్రదేశ్లలో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాయి. మిగతా దేశమంతటా ఈ కౌన్సిళ్లు రాష్ట్రాల్లో ఏర్పడక పోవడానికి కార ణం–ప్రధాన రాజ్యాంగ నిర్మాతగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సహా పలువురు సభ్యులు ఎగువ సభల పేరిట ‘కౌన్సిళ్ల’ నిర్మాణం అన్నది బ్రిటిష్ వలస పాలనావశేషంగా భావించడంవల్లనే నని మరచి పోరాదు. అలాగే, శాసనమండలి (కౌన్సిల్) అన్నది ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే శాసనసభకు దాని నిర్ణయాలకూ మాత్రమే బద్ధమై ఉండాలని గోపాలస్వామి అయ్యంగార్ ప్రతిపాదించారని మరచి పోరాదు (రాజ్యాంగ సభ డిబేట్స్: వాల్యూం 1–6, పేజీ 860) అంతే గాదు, రాజ్యాంగ సభ సీనియర్ సభ్యులలో ఒకరైన మహ్మద్ తహీర్ ఇక్బాల్ కవిత ‘సారే జహాసే అచ్చా.. హిందూస్తాన్ హమారా’ను ఉటంకిస్తూ ‘మనల్ని పీడించి వదిలిన ఇంగ్లిష్వాడు ఇండియాను వదిలిపోయినా వాడు దెయ్యం రూపంలో మన దేశాన్ని వెంబడిస్తూనే ఉన్నాడని’ విమర్శించాడు.బ్రిటిష్ వలస పాలనావశేషంగా మనకు సంక్రమించిన ఇలాంటి ఎగువసభల (ఇంగ్లిష్ ప్రభువుల, సంపన్న వర్గాల కోసం ఏర్పడిన) సంప్రదాయాన్ని మనం విడనాడవలసిందేనని చెప్పాడు. ‘ఎగువ సభలు, అలాంటి ఇతర పెట్టుబడిదారీ వర్గ సాధనాలు సామ్రాజ్య వాదుల సృషి’్ట అని కూడా తహీర్ నిండు సభలో ప్రకటించాడు. అందువల్ల ‘ఇండియా లాంటి పేద దేశం ఇప్పటికీ ఎంతో రక్తమోడు తోందనీ, పేదలు రెక్కలు ముక్కలు చేసుకుని బతుకులీడుస్తున్నారనీ, ఈ భారాన్ని మెజారిటీ పేద వర్గాలు అసంఖ్యాకంగా ఉన్న ఇండి యాలో ఖర్చుతో కూడుకున్న ఎగువసభ లాంటి విలాస సంస్థలకు చోటివ్వరాదనీ’ హితవు చెప్పాడు. అలాగే ప్రొఫెసర్ శిబిన్లాల్ సాక్సేనా లాంటి మేధావి ‘ప్రపం చంలోని ఏ దేశంలోనూ ఈ ఎగువ సభలు సమాజాభ్యున్నతికి దోహదం చేయలేదు, ఈ విషయంలో ఇప్పటినుంచే జాగ్రత్తపడక పోతే, ప్రపంచంలోనే పెద్ద దేశమైన ఇండియా, రష్యా, అమెరికాలతో అభివృద్ధిలో పోటీ పడలేదు. సభాధ్యక్షులు గోపాలస్వామి అయ్యం గార్ మన నూతన రాజ్యాంగంలో రెండు సభల (అసెంబ్లీ కౌన్సిల్) కాకుండా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొనే శాసనసభ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని ప్రొఫెసర్ సాక్సేనా కోరారు. ఎందుకంటే హుందాగా, ఆచరణయుక్తమైన చర్చలకు తప్ప గిల్లి కజ్జాలకు, ప్రతిష్టంభనల ద్వారా ప్రగతిని నిరోధించే, లేదా జాగర ణతో బిల్లులను నిర్వీర్యం చేసే కౌన్సిళ్లను మనం ప్రోత్సహించరాదని మెజారిటీ సభ్యులు కోరారు. అసెంబ్లీలు గానీ, కౌన్సిళ్లు గానీ అసంఖ్యాకులైన పేద, మధ్యతర గతి, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడుతూ అభ్యు న్నతిని సాధించనప్పుడు, విఫలమైనప్పుడే సామాజిక, రాజకీయ విప్లవాలు ఆవిష్కరించుకుంటాయి. ఫ్రెంచి అసెంబ్లీ, ఎగువ సభలు, రష్యన్ పార్లమెంటు (డ్యూరా), బ్రిటిష్ పార్లమెంటులో సకాలంలో ప్రజాభీష్టాన్ని గౌరవించి మెలగనందువలనే, అణచివేతలకు, నిర్బంధ విధానానికి గజ్జె కట్టినందువల్లనే– ఫ్రెంచి విప్లవం వచ్చి, బాస్టిలీ దుర్గాన్ని కూల్చివేసింది, అందుకు అనుగుణంగానే తదనం తరం బ్రిటిష్ కాలనీగా ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలూ వలస పెత్తనానికి వ్యతిరేకంగా అమెరికన్ విప్లవమూ, ఆంగ్లో–అమెరి కన్–చాంగైషేక్ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపైన చైనా విప ్లవమూ బిళ్లాబీటుగా విరుచుకుపడాల్సి వచ్చింది. ఇది చరిత్ర పాఠం. అలాగే, ఆంధ్రప్రదేశ్లో నేడు పరాన్నభుక్కు వర్గాలే మెజారిటీ ప్రజ లపై పెత్తనం కోసం పడుతున్న పెనుగులాటకు కొనసాగింపే నేటి వైసీపీ సంస్కరణవాద ప్రభుత్వంపైన, దాని కొన్ని ప్రగతిశీల విధా నాలపైన ప్రతిపక్ష విదూషకులు పన్నుతున్న కుట్రలూ విఫలం కాక తప్పదుగాక, తప్పదు!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
మండలి రద్దు సరైన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు కోరుతూ రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం ఆహ్వానించదగ్గది. నిలకడలేని విధానాలతో, నిజాయితీ లేమితో సర్వ వ్యవస్థలనూ భ్రష్టుపట్టించడంలో ఘనాపాఠీ అయిన చంద్రబాబునాయుడు శాసనమండలిని సైతం తన రాజ కీయ క్రీడలో పావుగా మార్చుకోవడానికి ప్రయత్నించి, అది రద్దు కావడమే శ్రేయస్కరమన్న అభిప్రాయం అందరిలో ఏర్పడేందుకు కారకుడయ్యారు. కనుకనే ఈ రద్దు ప్రతిపాదనపై గత నాలుగైదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చలో సానుకూల ధోరణే వ్యక్తమైంది. బాబుకున్న రాజకీయ అనుభవం తక్కువేమీ కాదు. అవసరమున్నా లేకున్నా ఆయనే ఆ మాట పదే పదే చెప్పుకుంటారు. ముఖ్యమంత్రిగా ఆయనకున్న పాలనానుభవాన్నీ తోసిపారేయలేం. అలాంటి నాయకుడికి ప్రజాబలంతో ఏర్పడిన శాసనసభ కూలంకషంగా చర్చించి, ఆమోదించే బిల్లుల విషయంలో శాసనమండలి ఎలా మెలగాలో తెలియదనుకోగ లమా? దాన్ని పెద్దల సభగా అందరూ పిల్చుకుంటారు. ఆ పెద్దరికంతో శాసనసభ పంపే ఏ బిల్లు నైనా అది నిర్మాణాత్మకంగా చర్చించడాన్ని, అందులో లోటుపాట్లున్నాయని భావిస్తే సవరణలు ప్రతిపాదించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అక్కడ మెజారిటీగావున్న పక్షం శాసనసభ పంపే తీర్మానాలను అటకాయించడమే ఏకైక ఎజెండాగా పెట్టుకోవడం, ప్రజానుకూల నిర్ణయాలు అమలు కాకుండా వీలైనంత కాలం ఆపాలనుకోవడం ఏం రాజనీతి? బాబు శల్యసారథ్యంలోని తెలుగుదేశం శాసనమండలిలో అక్షరాలా ఆ పనే చేసింది. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలను బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గతంలో సైతం పలుమార్లు తప్పుబట్టారు. మొన్నటికి మొన్న సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల విషయంలోనూ తెలుగుదేశం వైఖరిని వారు వ్యతిరేకించారు. ఏం చేయడానికైనా శాసనసభకు సర్వాధికారం ఉన్నప్పుడు మండలిలో అనవసర వివాదాలు రేకెత్తించరాదని హితవు పలికారు. కానీ బాబు వాటన్నిటినీ బేఖాతరు చేశారు. ఈ రెండు బిల్లుల విషయంలో మాత్రమే కాదు... ఇంగ్లిష్ మీడియం విద్యనందించడానికి వీలుగా రూపొందించిన బిల్లునూ, ఎస్సీ, ఎస్టీ కులాలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసే బిల్లునూ తెలుగుదేశం ఆ రీతిలోనే అడ్డుకునే ప్రయత్నం చేసింది. కనీసం వాటికి తోచిన సవరణలు కొన్ని ప్రతిపాదించింది. అనంతరం నిబంధనల ప్రకారం ఆ బిల్లులు రెండూ శాసనసభ ముందుకు రావడం, అక్కడ ఆమోదం పొందడం పూర్తయింది. అయితే ఇందువల్ల కొంత కాలయాపన జరి గింది. ఇప్పుడు సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుల విషయంలో కూడా కనీసం ఆ బాణీనే కొనసాగించివుంటే ప్రజలు ఎంతోకొంత అర్థం చేసుకునేవారు. కానీ ఈ దఫా బాబు మరీ వింత పోకడలకు పోయారు. ఏకంగా శాసనమండలి గ్యాలరీ ఎక్కి అక్కడినుంచి తన కను సైగలతో సభను నడిపించేందుకు ప్రయత్నించారు. ఫలితంగా నిబంధనకు విరుద్ధంగా మండలి చైర్మన్ ఆ బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. ప్రజానీకం గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను చిత్తుగా ఓడించారని, రాష్ట్రాన్ని తన ఇష్టారాజ్యంగా నడిపించడం అసాధ్యమని ఏడు నెలలు దాటుతున్నా ఆయన గ్రహించుకోలేకపోతున్నారు. జనం గంపగుత్తగా వ్యతిరేకించిన పాత ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసి తీరాల్సిందేనన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఏ ప్రభుత్వానికైనా నిర్దిష్టమైన ఎజెండా ఉంటుంది. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకూ, వారి శ్రేయస్సుకు పనికొస్తాయన్న విధాన నిర్ణయాలు తీసుకునేందుకూ హక్కు, అధికారమూ ఉంటాయి. కానీ ఓడినా నాదే పైచేయి కావాలని, జనం ఛీత్కరించిన గత నిర్ణయా లను అమలు చేసి తీరాలని భీష్మించడం మతిలేని పని. అందుకోసం రాజకీయ కుట్రలు పన్నడం నీచాతినీచం. కానీ ఇవన్నీ మంచిదికాదని చంద్రబాబుకు చెప్పేదెవరు? గత బుధవారం తన కుట్ర పూరిత వైఖరితో ఆయన తన పార్టీ పరువునూ, శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పరువునూ తీయడమే కాదు... ప్రజాస్వామ్యాన్నే అపహాస్యంపాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపడం నిబంధనలకు విరుద్ధమని ఆ రోజు షరీఫ్ ప్రకటించడం అందరూ చూశారు. తెలుగుదేశం ఇచ్చిన నోటీసు నిబంధనల మేరకు లేదని సైతం ఆయన తెలియజేశారు. ఈలోగా ఏమైందో ఆ బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు రూలింగ్ ఇచ్చారు. బాబు నెరపిన మంత్రాంగంతో షరీఫ్ గందరగోళంలో పడ్డారని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఆ మర్నాడు తణుకు పర్యటనలో వుండగా ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇంకా పంపలేదని, ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచి పోయిందని కూడా ఆయనే చెప్పారు. ఈలోగానే అది సెలెక్ట్ కమిటీకి పోయిందంటూ తెలుగుదేశం ప్రచారం లంకించుకుంది. కరువేమో కాలమేమో అన్నట్టు చంద్రబాబు ఏకంగా గజమాలలు వేయించుకుని హడావుడి చేశారు. క్షీరాభిషేకాల డ్రామాలు సరేసరి.ఎటూ ఆపలేమని తెలిసికూడా రెండు బిల్లులకూ మోకాలడ్డేందుకు తెలుగుదేశం ఇంత హైరాన ఎందుకు పడినట్టు? రాజధాని కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన విలువైన సూచనలను బేఖాతరు చేసి, నారాయణ కమిటీ మాటున అమరావతి పేరిట లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ బాగోతానికి వేసిన పథకమంతా కళ్లముందు కుప్పకూలుతుంటే ఏం చేయాలో దిక్కుతోచకే బాబు ఇదంతా నడి పించారు. కానీ ఆ క్రమంలో శాసనమండలి ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ప్రజల ప్రయోజనాలు నెరవేర్చేందుకు అనువుగా నడవవలసిన ఆ సభను రాజకీయ దురుద్దేశాలకు వేదికగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో దాన్ని రద్దు చేయమని కోరడం మినహా శాసనసభకు వేరే ప్రత్యామ్నాయం ఎక్కడుంటుంది? -
‘శాసన మండలి రద్దు ను స్వాగతిస్తున్నాం’
సాక్షి, అమరావతి : ప్రజల తీర్పును తిరస్కరిస్తూ పెద్దల కనుసన్నలలో నడుస్తున్న శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని జనచైతన్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శాసన మండలి రద్దు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ‘భారతదేశంలో కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే కొనసాగుతున్న శాసనమండలి వ్యవస్థ వలన ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంవత్సరానికి 60 కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది. 50 శాతం ప్రజలు ఓట్లతో 154 మంది శాసనసభ్యులు బలపరిచిన పలు ప్రజా ఉపయోగ బిల్లులకు శాసనమండలి అడ్డుకట్ట వేయడం దుర్మార్గం. రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన శాసనమండలిని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు గతంలోనే చరమగీతం పాడాయి. మేధావులు, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయుల ప్రాతినిధ్యం కోసం ఏర్పడిన పెద్దల సభ ఆచరణలో గ్యాలరీ లో కూర్చుని రిమోట్ కంట్రోల్ తో నడిచే విధంగా మారటం శాసన మండలి డొల్లతనానికి నిదర్శనం. ఆచరణలో ఆరొవ వేలుగా మిగిలిన శాసనమండలిని చరమగీతం పాడటాన్ని హర్షిస్తున్నాం’ అని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. -
బాబు నాలుకకు ఎన్నీ చీలికలో..!
-
బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్
-
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
-
బాబు తప్పులకు రిపేర్లు చేస్తున్నాం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గతంలో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు ఈనాడులో ఆ నిర్ణయాన్ని కీర్తిస్తూ ఎడిటోరియల్స్ రాశారని అన్నారు. ఆనాడు కేవలం ఈనాడు అధిపతి రామోజీరావు కోసమే మండలిని రద్దుచేశారని గుర్తుచేశారు. కానీ నేడు కోట్లాది మంది ప్రజాప్రయోజనాల కోసం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దు తీర్మానంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమైన నిర్ణయంపై నేడు శాసనసభ సమావేశం జరుగుతోంది. మండలి రద్దు అనేది విషయం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మండళ్లు కచ్చితంగా అవసరం అనుకుంటే ప్రతి రాష్ట్రంలో మండలి ఏర్పాటు అయి ఉండేది. ఇప్పుడు 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే మండళ్లు ఉన్నాయి. మాకు మండళ్లు వద్దని అసోం, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు కోరుకున్నాయి. ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దు అధికారం కూడా శాసనసభకే ఉంది. ప్రస్తుతం సభలో ఇంజనీర్లు, డాక్టర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, రైతులు ఉన్నారు. వీరంతా ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు. మండలి ద్వారా ప్రజా ప్రయోజనాలకు ఆటంకం కలుగుతోంది. రాజకీయ అజెండాతో మండలిలో ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకున్నారు. మండలిలో కేవలం బిల్లును ఎలా అడ్డుకోవాలనేదే ఆలోచిస్తున్నారు. మండలికి ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక దండగ పనికి ఇంత సొమ్ము ఖర్చు చేయడం అవసరమా అనే ఆలోచన చేయాలి. మండళ్లు చేసిన సవరణలను శాసనసభ ఆమోదించనక్కర్లేదు. శాసనమండలిని కొనసాగిస్తే.. మరో కొద్ది రోజుల్లోనే అక్కడ వైఎస్సార్సీపీకి మెజారిటీ వస్తోందని అందరికీ తెలుసు. కానీ అన్ని అంశాలను ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆపరేషన్.. ఆకర్ష్ అంటూ చంద్రబాబు పత్రికలు సిగ్గుమాలిన వార్తలు రాశాయి. ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోతే ఎల్లో మీడియా కనీసం నోరెత్తలేదు. మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే అప్పుడు ఈనాడు, ‘చంద్ర’జ్యోతి, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదు?. మా ప్రభుత్వం ఎమ్మెల్సీలకు రూ. 5 కోట్లు ఆఫర్ చేస్తుందని దిక్కుమాలిన రీతిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు లాగా నేను చేస్తే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా రాదని ఎప్పుడో చెప్పాను. కానీ మేము అలా చేయడానికి రాలేదు. రాజకీయాలను మార్చడానికి అధికారంలోకి వచ్చామ’ని స్పష్టం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్, శాసమండలి, ప్రత్యేక హోదా విషయాలపై చంద్రబాబు ఎలా మాటలు మార్చారో తెలిపే వీడియోను స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతితో సభలో ప్రదర్శించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిసూ.. ‘ప్రత్యేక హోదాపై చంద్రబాబు గడికో మాట మాట్లాడారు. సోనియాను తిట్టారు.. మళ్లీ కాంగ్రెస్తోనే కలిశారు. మోదీని తిట్టిన చంద్రబాబు.. అదే మోదీని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఏ విషయంలో చంద్రబాబుకు స్థిరత్వం లేదు. మండలి విషయంలోనైనా క్లారిటీగా ఉన్నారంటే అది కూడా లేదు. అవసరం తీరితే కూతురిని ఇచ్చిన మామను పొడవడానికి కూడా చంద్రబాబు వెనుకడాడు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ల చట్టాన్ని, పేద విద్యార్థులకు మేలు చేసే ఇంగ్లిషు మీడియం చట్టాన్ని మండలిలో అడ్డుకున్నారు. వికేంద్రీకరణను కూడా అడ్డుపడ్డారు. అమరావతి రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తాం. రైతుల కౌలును 10 నుంచి 15 ఏళ్లకు పెంచడం అన్యాయమా?. అసైన్డ్ రైతులకు రైతులతో సమానంగా ప్లాట్లు ఇస్తాం. రైతు కూలీల భృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేల పెంచుతున్నాం. చంద్రబాబులాగా గ్రాఫిక్స్లో జపాన్, సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తామని చెప్పడం లేదు. ప్రజల కోసం చట్టాలు చేస్తుంటే రాజకీయ అజెండాతో అడ్డుపడుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పిదాలకు రిపేర్లు చేస్తున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చాం. అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా ఇక్కడే కొనసాగిస్తూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించాం. అందరికి న్యాయం చేయడానికి ప్రయత్నించడం తప్పా’ అని ప్రశ్నించారు. మంచి చేయాలనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదేనని అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ వ్యాఖ్యలను సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం శాసనమండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. చదవండి : మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం -
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు. మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్ శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. (మండలి రద్దుకు గర్వపడుతున్నాం: సీఎం జగన్) చర్చలో భాగంగా మండలి రద్దు తీర్మానంపై ప్రసంగించిన సీఎం జగన్.. దీనికి ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. అనంతరం సభలో ఓటింగ్కు పెడుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ సీతారాం ప్రకటించారు. ముందుగా సభలో సభ్యులు కాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్లను పక్కన కూర్చోవాలని సూచించారు. అనంతరం సభలో ఓటింగ్ చేపట్టి.. ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. కాగా ఏపీలో శాసనమండలి రద్దు కావడం ఇది రెండోసారి. తొలిసారి మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. -
మండలిలో టీడీపీ తీరు దురదృష్టకరం
-
రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం..
సాక్షి, అమరావతి: రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదు. నారాయణ కమిటీ వేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని’ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరమన్నారు. సభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మండలిలో తీర్మానం మూవ్ కాలేదని చైర్మన్ స్వయంగా చెబుతున్నారని.. విస్తృత అధికారులు ఉన్నాయని సెలెక్ట్ కమిటీకి పంపడం సబబా అని ప్రశ్నించారు. ప్రజాసంపద అన్ని ప్రాంతాలకు సమానంగా ఖర్చు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం చేసిన చట్టాలను కూడా మండలిలో అడ్డుకున్నారన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని.. లేకుంటే ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్నారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే.. సీఎం జగన్ తీర్మానాన్ని సమర్థిస్తున్నానని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలకు నిలయంగా మండలి మారిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన విధానాలు వలనే మండలి అప్రతిష్ట పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం బిల్లును తెస్తే మండలిలో టీడీపీ అడ్డుకుందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ప్రాంతాల మధ్య అసమానతలను సీఎం వైఎస్ జగన్ గుర్తించారని చెప్పారు. హైదరాబాద్ లాంటి ఉదాహరణతో వికేంద్రీకరణ జరగాలని ఆయన నిర్ణయించారన్నారు. పాక్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పమని తెలిపారు. మండలి రద్దు తీర్మానాన్ని బలపరుస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని మోపిదేవి తెలిపారు. -
చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారు
-
సమగ్రాభివృద్ధే సీఎం జగన్ సంకల్పం..
-
‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’
-
‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ పదవి పోతుందనే సరికి భయపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 2004లో మండలి అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్ పదవి కోసం కావాలంటున్నారని మండిపడ్డారు. ఇక్కడే ఆయన రెండు నాలుకల ధోరణి ప్రతి ఒక్కరికి అర్థమవుతోందన్నారు. శాసనసభ ద్వారా చట్టాలు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి మద్దతు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానంపై రోజా మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీకి పంపారని మండిపడ్డారు. శాసనసభలో ఆమోదించిన బిల్లును.. మండలిలో అవమానిస్తారా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయినా చంద్రబాబు అహంకారంతో వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విధానాలకు ప్రశ్నిస్తారనే.. ఈ రోజు శాసనసభకు రాకుండా పారిపోయారని విమర్శించారు. మండలి రద్దు చేయాలంటే రెండేళ్లు పడుతుందని చెబుతున్న చంద్రబాబు శాసనసభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పెద్దల సభకు చంద్రబాబు తన ఇంట్లో ఉన్న దద్దోజనాన్ని పంపించారని ఎద్దేవా చేశారు. యనమల రామకృష్ణుడు స్వయం ప్రకటిత మేధావిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం స్పీకర్ వ్యవస్థలను వాడుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని గుర్తుచేశారు. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పారు. గాయం విలువ తెలిసినవారే.. సాయం చేయగలరు పెద్దల సభ ప్రజాతీర్పును గౌరవించాలే.. కానీ అపహాస్యం చేయకూడదని అన్నారు. గాయం విలువ తెలిసినవారే.. సాయం చేయగలరని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ప్రజల గాయాలు తెలుసుకుని.. వారికి సాయం చేస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. అందుకే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఎదిగారని అన్నారు. 13 జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. మండలిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. -
మండలి రద్దు తీర్మానంకు మద్దతు : రాపాక
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో మేధావులు, డాక్టర్లు, ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఇక పెద్దల సభ ఎందుకంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నా అని అన్నారు. ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నాక.. మళ్లీ మండలి అవసరం లేదని రాపాక స్పష్టం చేశారు. శాసనసభలో రాపాక మాట్లాడుతూ.. ‘154 మంది శాసన సభ్యలు ఆమోదం తెలిపిన బిల్లును మండలి తిరస్కరించడం దురదృష్టకరం. ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా మండలిలో టీడీపీ అడ్డుకుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి దిగజారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మండలి చైర్మన్ షరీఫ్ను కూడా ఆయన ప్రభావితం చేశారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నాను అని చెప్పడానికి చైర్మన్ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా చేయడం చంద్రబాబుకు సరికాదు. అన్నాతమ్ముడిలా.. కలిసి జీవించే మాల, మాదిగలను రెండుగా చీల్చిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. బ్రిటీష్ సాంప్రదాయాలను పాటిస్తూ విభజించి పాలించే అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సీఎం జగన్ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధి కొరకు సీఎం జగన్ చేపడుతున్న చర్యలు అభినందనీయం. అన్ని వర్గాలు, ప్రాంతాలను అయన సమానంగా చూస్తున్నారు’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
దొడ్డీదారిన మండలికి వచ్చి ప్రజానిర్ణయాలను అడ్డుకుంటున్నారు
-
మండలిని బంగారు బాతులా చూశారు : రజనీ
-
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: మండలిలో రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిలో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని మండిపడ్డారు. ప్రజలు ఆమోదించిన, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మండలిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారని.. రాజకీయాలు ఫేర్గా ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని చెవిరెడ్డి కోరారు. ఆయన ప్రయోజనాల కోసమే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్ని ఆయన ప్రయోజనాల కోసమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ఎండగట్టారు. చంద్రబాబు పాలనలో దాడులు,అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశామని.. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారని దుయ్యబట్టారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే..మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికి తెలుసునన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ల బిల్లులను కూడా చంద్రబాబు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. మండలిని అడ్డం పెట్టుకుని.. మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి ప్రయత్నించారని మండిపడ్డారు. మండలిలో సైంధవుల్లా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. యనమల వేసుకునే సూటు,బూటు కూడా ప్రభుత్వ సొమ్మేనని విమర్శించారు. ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది అని దుయ్యబట్టారు. శాసనసభ్యులను ఆంబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. -
సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్లో చర్చించాలా?
సాక్షి, అమరావతి : శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన శాసన మండలి రద్దు తీర్మానంలో అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్వాతంత్ర లభించిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. (చదవండి : ‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’) శాసనమండలిలో టీడీపీ సభ్యుల నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందన్నారు. ‘ మండలి రద్దు అంశంపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు... సభలో చర్చింకుండా ఈనాడు, ఆంద్రజ్యోతిలో చర్చించాలా’ అని ప్రశ్నించారు. పెద్దల సభలో పెద్దలు లేరని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజల అభివృద్ధి కోసం సభలో చట్టాలు చేస్తుంటే.. రాజకీయం కోసం మండలిలో టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. వికేంద్రీకరణ బిల్లును మాత్రమే కాకుండా.. గతంలో తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి విశాఖపై టీడీపీ సభ్యులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబుకు రాష్ట్రం బాగోలు అవసరం లేదని, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు కానీ 13 జిల్లాకు విలన్ అయ్యారన్నారు. శాసన మండలి రద్దు బిల్లుతో ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం జగన్ ధైర్యాన్ని ఇచ్చారని అమర్నాథ్ పేర్కొన్నారు. -
సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్లో చర్చించాలా?
-
రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు..
-
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు
-
బాబు హయాంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది
-
బాబు తన బినామీలను కాపాడూకునే ఉద్దేశం
-
శాసన మండలిపై టీడీపీ దొంగాట!
సాక్షి, అమరావతి: ‘‘నేను అధికారంలో ఉన్నా ప్రజలకే రిస్కు.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకే రిస్కు.. ఏదేమైనా నాకు అనుకూలంగా ఉన్నంతవరకే.. నా వరకు రానంతవరకే.. నా పార్టీ గనుక మునిగిపోయే పరిస్థితి వస్తే.. ఎందాకైనా వెళ్లడానికి నేను రెడీ అన్నట్లుగా ఉంది’’ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు... ఊసరవెల్లి మాదిరిగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తారన్న విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన తీరుపై విమర్శలు గుప్పిస్తారు. ఇక తాజాగా శాసన మండలి రద్దు విషయంలోనూ ఆయన అనుసరిస్తున్న విధానంపై అదే రీతిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు కీలక బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్న విషయం విదితమే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని మరచి.. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మండలిని వాడుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) ఈ నేపథ్యంలో శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సభకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మండలి అంశంలో గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2004లో శాసన సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై 8, 2004లో అసెంబ్లీలో మండలి ఏర్పాటుపై చంద్రబాబు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. పదవులు అధికారం కోసం కాంగ్రెస్ వాళ్లు ఆత్రంగా ఉన్నారంటూ ఆనాడు ఆయన వ్యాఖ్యలు చేశారు.(అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన) ఆనాడు చంద్రబాబు ఏమన్నారంటే.. ‘‘అధికారపక్షం ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. కేవలం పదవుల కోసమే మండలిని పునరుద్ధరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మండలి వల్ల ఎలాంటి లాభం లేదు. ఒకప్పుడు అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండేది. కాబట్టి పెద్దలు అవసరం. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మంచి క్వాలిటీ ఉంది. అనుభవం ఉంది. మండలి వస్తే, శాసనాలు పాస్ కావడంలో ఆలస్యం అవుతుంది. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని మన్స్ఫర్డ్ కమిటీ కూడా చెప్పింది. 1930 రౌండ్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్పార్టీ కూడా మండలిని వ్యతిరేకించింది. అక్టోబరు 26, 1934న అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కూడా బాబు రాజేంద్రప్రసాద్ మండలిని వ్యతిరేకించారు. మండలి వల్ల లాభం ఉండదని రాజేంద్రప్రసాద్ అన్నారు. 1950 నుంచి కేవలం 8 రాష్ట్రాల్లోనే శాసన మండలి ఏర్పాటైంది. వాటిలో 3 చోట్ల రద్దయింది మండలి వల్ల ఏటా రూ. 20 కోట్ల ఆర్థిక భారం. ఒక బిల్లు మండలికి వెళ్లి అక్కడ పాస్ అయినా లేదా తిప్పి పంపితే మళ్లీ కాలాయాపన. ఏ బిల్లునైనా ఆపే అధికారం మండలికి కేవలం 4 నెలలే ఉంటుంది. కనీసం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కు కూడా మండలి సభ్యులకు లేదు.(‘చంద్రబాబు కోరుకున్నదే.. మేము అమలు చేస్తున్నాం’) ఇక ఆర్థికేతర విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలంటూ ఏమీ లేవు. ఆర్థిక బిల్లులన్నీ శాసన సభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. రాజ్యాంగ సవరణలు వచ్చినా శాసన సభకు తప్ప మండలికి ప్రమేయం ఉండదు. పరిమిత అధికారాలు తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. మేధావులు కూడా మండలికి వస్తారనుకోవడం లేదు. 1958లో నీలం సంజీవరెడ్డి నేతృత్వంలో మండలి ఏర్పాటేతే అది ఒక పునరావాస కేంద్రంగా మారింది. 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యతిరేకించిన ప్రతిపక్ష నేతలను కలుపుకోవడానికి మండలిని వాడుకున్నారు. ప్రజలపైన ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేశారు. జనవరి 23, 1990న మండలి కావాలని చెన్నారెడ్డి తీర్మానం చేస్తే నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తిరస్కరించింది. మండలి పెట్టాలంటే రెఫరెండం పెట్టాలి. చాలా రాష్ట్రాలు మండలి కావాలని అడిగినా కేంద్రం ఒప్పుకోలేదు. అనేక కారణాల వల్ల మండలి కావాలన్న బిల్లు లోక్సభలో లేదా రాజ్యసభలో తిరస్కరిస్తున్నారు’’ అని చంద్రబాబు మండలిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే కారణంతో శాసన సభ.. మండలిని రద్దు చేసే తీర్మానంలో చర్చపై కనీసం పాల్గొనలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
కాంట్రాక్టర్లకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారు..
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఐదేళ్లు చంద్రబాబు నాయుడుకి సమయం ఇచ్చినా ఉపయోగించుకోలేపోయారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ విమర్శించారు. శాసనమండలి రద్దుపై సోమవారం అసెంబ్లీలో చర్చలో భాగంగా ఆమె ప్రసంగించారు. మండలిపై చంద్రబాబు తొలినుంచి రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే చంద్రబాబుకు శాసనమండలి బంగారుబాతులా కనిపించిందని, కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రజనీ విమర్శించారు. మండలిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వాన్ని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. (మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్) నారా లోకేష్కు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన పెద్దల సభను.. తక్కువ చేసి మట్లాడం సరికాదని హితవుపలికారు. ప్రజల అవసరాలకు ఏమాత్రం ఉపయోగంలేని మండలిని రద్దు చేస్తామంటే పెద్దల సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ స్వాగతించారని సభలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని రజనీ స్పష్టం చేశారు. -
ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యూటర్న్
-
సైంధవుడి పాత్రకు ఆయన నిదర్శనం..
-
సైంధవుడి పాత్రకు ఆయన నిదర్శనం..
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ హయాంలోనే పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని.. సమితి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థలు తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన బిల్లులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ఆమోదంతో ఎప్పుడు గెలవలేదన్నారు. మండలిని కించపరిచిన చరిత్ర ఆయనదని విమర్శించారు. మండలి రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం లేదని పార్థసారధి పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు.. రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని.. ప్రాంతాల మధ్య సమతుల్యత చేయాలనుకున్నారని చెప్పారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమది ఘనమైన చరిత్ర అని, రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని టీడీపీ చిత్రీకరించిందని మండిపడ్డారు. మండలి రద్దు తీర్మానానికి మద్దతు.. ‘మహావిష్ణువు స్వయంభూ గా వెలసిన ప్రాంతం రాయలసీమ.. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య జన్మించిన ప్రాంతం..చిత్రరాజాలు తీసిన కేవిరెడ్డి జన్మించిన ప్రాంతమని’ భూమన తెలిపారు. రాయలసీమకు అన్యాయం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మండలిలో బిల్లులను అడ్డుకోవడం చంద్రబాబు సైంధవుడి పాత్రకు నిదర్శమన్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్లోని నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ చేస్తున్న మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని భూమన పేర్కొన్నారు. (చదవండి: శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం!) (చదవండి: టీడీపీది శునకానందం: పేర్ని నాని) -
టీడీపీది శునకానందం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్లు అడ్డుకుంటున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక బిల్లులను అడ్డుకుని టీడీపీ శునకానందం పొందుతుందని మండిపడ్డారు. ‘40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం ఆయనకు అలవాటు లేదని’ పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని విడగొట్టాలని లేఖ ఇస్తారు.. రాష్ట్రాన్ని ఎలా విడగొడతారని ప్రశ్నిస్తారు.. బీజేపీ మతతత్వ పార్టీ అంటారు.. అదే బీజేపీతో పొత్తు అంటారు’ అంటూ టీడీపీ తీరును దుయ్యబట్టారు. రాష్ట్రానికి హోదా అవసరమని చెప్పి ప్యాకేజీని స్వాగతించారని.. ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారని విమర్శించారు. ‘ఎన్నికల ముందు మోదీ, అమిత్షాను చంద్రబాబు తిట్టారని..ఇప్పుడు వాళ్లిద్దరు మా వెనుక ఉన్నారని ఆయన చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిచ్చామంటున్న చంద్రబాబుకు గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయని’ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన కొల్లేరు పరిరక్షణ కోసం రూ.350 కోట్లతో రెగ్యులేటర్ల ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చారని పేర్ని నాని పేర్కొన్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు కేబినెట్ నిర్ణయం) -
ప్రజల భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు
-
అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన
సాక్షి, అమరావతి: బ్రిటిషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పెద్దల సభను ఏర్పాటు చేశారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయాన్ని గమనించి స్వాతంత్ర్యానికి ముందే జాతిపిత మహాత్మా గాంధీ ఈ సభను వ్యతిరేకించారని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదని తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయపరమైన కారణాలతో చట్టాలు ఆలస్యమవుతున్నాయి కాబట్టి మండలి రద్దు సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేని వారి రాజకీయ పునరావాస కేంద్రంగా మండలి మారిందని.. అటువంటి సభ అవసరం లేదని గతంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని పేర్కొన్నారు.(ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) అరుదైన తీర్పు ఇచ్చారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతిచ్చారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు, అభిప్రాయాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. రాష్ట్రమంతా పూర్తిగా అధ్యయనం చేసిన ఆయనకు ప్రజలు అరుదైన తీర్పు ఇచ్చారు. ఇంతకు ముందెన్నడూ లేని భారీ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ అడ్డుకుంటోంది. మండలి వల్ల కోట్ల రూపాయలు దుర్వినియోగమని చంద్రబాబు గతంలో చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న చట్టాలను.. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మరీ అడ్డుకుంటున్నారు. టీడీపీ రాజకీయాల వల్ల కీలక బిల్లులు ఆలస్యమవుతున్నాయి’అని ధర్మాన.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.(మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి ) తాత్కాలికమని అంబేద్కర్ చెప్పారు.. ‘పెద్దల సభలు తాత్కాలికమే అని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారు. ఆర్టికల్ 169 కింద పెద్దల సభను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాదు గోపాలస్వామి అయ్యర్, ఆచార్య రంగా వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్ట సవరణలు చేసే అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన శాసన సభకు లేకుంటే ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరతాయి. మంత్రిగా ఉన్న నారా లోకేశ్ను మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే.. ఆయన మండలిలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే. 1971, 72, 75లో రాజ్యసభను రద్దు చేసే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు ముఖం చూపించలేకనే శాసన సభకు రాలేదు. మండలి అవసరం లేదన్న బాబు వ్యాఖ్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే చర్చకు రాలేదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గతంలో చంద్రబాబు తీర్మానం కూడా పెట్టారు. ఆ తీర్మానంలో ఉన్నవన్నీ కూడా తప్పులే. సీఆర్డీఏ చట్టం 171 పేజీలు ఉంది. దానిని శాసన మండలిలో ఎన్నిరోజులు చర్చించారు. దాన్ని సెలెక్ట్ కమిటీకి ఎందుకు పంపలేదు. 12 పేజీలు ఉన్న వికేంద్రీకరణ బిల్లును మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపడంలో ఉద్దేశం ఏమిటి’అని ధర్మాన ప్రశ్నించారు. -
సీఎం జగన్కు అందరూ సహకరించాలి: ఆళ్ల నాని
సాక్షి, అమరాతి : చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ల వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణమని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ధ్వజమెత్తారు. శాసన మండలి రద్దు తీర్మానంపై మంత్రి సభలో చర్చ సందర్భంగా రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ప్రాంతీయ అసమానతలు రాకుడదన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల ఏర్పాటు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.(మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించిన సీఎం జగన్) చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు కొనుగోలు చేసిన వారికోసం బాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియాతో కుమ్మకై.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు సహకరించారని మండిపడ్డారు. విభజనతో హైదరాబాద్లాంటి మహా నగరాన్ని కోల్పోయామని, రాష్ట్రం రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తును కోల్పోయామని అన్నారు. గత అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ అలుపెరగని పోరాటం చేశారని, హోదా కోసం పోరాటం చేసిన వారిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి పేరుతో అభివృద్ధిని కేంద్రీకరిస్తుందని ప్రజలు భయపడ్డారని, శివరామకృష్ణ కమిటీ కూడా అమరావతిలో రాజధాని వద్దని చెప్పిందని తెలిపారు. చంద్రబాబు నారాయణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. (అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన) చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని విమర్శలు గుప్పించారు. గత ఏడు నెలల్లో పశ్చిమగోదావరి జిల్లా ఎలా అభివృద్ధి చెందిందో స్వయంగా చూపిస్తానని, అభివృద్ధిని చూసేందుకు టీడీపీ నేతలు రావాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చేసిన ఘనత సీఎం జగన్ది అని, ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని బాబు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. మూడు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ రూ. 700 వందల కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారని, డయాలసిస్ సెంటర్, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారని తెలిపారు. (‘చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలి’) అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆళ్లనాని పేర్కొన్నారు. రియల్ ఎస్టేల్ వ్యాపారుల ప్రయోజనాలే బాబుకు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవని విమర్శించారు. మండలి గ్యాలరీలో కూర్చొని సభను ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికే మండలి ఏర్పాటు జరిగిందని అన్నారు. మండలిలో టీడీపీ సభ్యులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేలా ప్రయత్నించారని, ప్రజలే చంద్రబాబుకు గుణపాఠం చెప్తారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్కు అందరూ సహకరించాలని సూచించారు. -
మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంచలన నిర్ణయానికి వేదికగా మారింది. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానం శాసనసభ ముందుకొచ్చింది. సోమవారం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చ చేపట్టింది. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) మండలి రద్దు తీర్మానంపై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చర్చను ఆరంభించారు. ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని, మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో భూముల కొనుక్కున్న టీడీపీ నేతలే కావాలని రచ్చ చేస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను నివారించేందుకే మూడు రాజధానులు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం శాసన మండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గం నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)ని సమావేశపరిచారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరుకాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు శాసనసభ ప్రారంభం కాగానే మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులతో పాటు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు వంటి కీలకమైన బిల్లులను మండలి తిరిస్కరించిన విషయం తెలిసిందే. (‘సీఎం జగన్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం’) -
మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయంగా స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. 2004లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. శాసన మండలి పునరుద్ధరణ సమయంలో.. మండలి పెట్టడాన్ని చంద్రబాబు దుర్మార్గం అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 2004లో చంద్రబాబు శాసన సభలో మాట్లాడిన మాటల(‘‘అధ్యక్షా, ఏదైతే ఈరోజు శాసనమండలి తేవడం పట్ల దీనిని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ద్వారా ప్రజల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. మంచిపనులు చేస్తే తప్పకుండా సహకరించేవారము. అదే విధంగా ప్రజల పైన భారం పడే చర్యలు ప్రభుత్వం ప్రధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అనేకసార్లు చెప్పాము. మళ్లీ ఒకసారి రీయిటరేట్ చేస్తున్నాము. విధాన మండలికి చాలామంది చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వలన వారి మనుషులకు మళ్లీ పదవులు వస్తాయి తప్ప రాష్ట్రప్రజలకు లాభం లేదు. మీరే చూడబోతున్నారు. ఈ రోజు శాసనమండలి ఒకసారి చూస్తే, కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారు తప్ప దీనివలన బ్రహ్మాండంగా శాసనాలు వస్తాయి, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అనేది వాస్తవం కాదని తెలియజేస్తున్నాను. అందుకే మనం ఒకసారి ఆలోచించుకుఉంటే ఏ విధంగా ఇవన్నీ జరిగాయో, దేశంలో గానీ, ప్రపంచంలోగానీ ఒకసారి ఎనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’)ను చెవిరెడ్డి వినిపించారు. (ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు కేబినెట్ నిర్ణయం) అదే విధంగా... శాసన మండలి వల్ల రూ. 20 కోట్లు ఆర్థిక భారం పడుతుందని.. రాజకీయ ప్రయోజనాల కోసమే మండలిని... రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారంటూ బాబు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆరోజు చంద్రబాబు కోరుకున్న మాటను తాము ఈరోజు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘మీరు కోరుకున్నది నిజమవుతుంటే స్వాగతించకుండా ఎందుకు దాక్కుంటున్నారు. మీకు అనుకూలంగా ఉంటే ఒకవిధంగా.. వ్యతిరేకమైతే మరో విధంగా మాట్లాడుతారా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. మండలి ఉపయోగంపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు.