equality
-
National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?
స్త్రీని ఆదిశక్తిగా, చదువుల తల్లిగా, అన్నపూర్ణగా పేర్కొనే భారతీయ సంస్కృతికి భిన్నంగా ఆమె శక్తిహీనురాలిగా, నిస్సహాయురాలిగా అణిగిమణిగి సర్దుకు పోయే జీవితం గడపవలసిన దుర్భర పరిస్థితి కొనసాగుతోంది. ఈ వివక్ష పుట్టుకతోనే ఆరంభమవుతుంది. వివక్ష, హింస, లైంగిక వేధింపులు, సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుకోలేకపోవడం వంటి సవాళ్లు–ఇబ్బందు లను బాలికలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమాజంలో ఉన్న బాలికలకు సాధికారత కల్పించడం, వారిని రక్షించడం ప్రధాన అంశాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి మన దేశంలో జరుపుతున్నారు. బాలికల స్థితిని మెరుగుపరచడంలో దేశం పురో గతి సాధించిన మాట నిజమే. కాని, అది తగినంత కాదు. ఇప్పటికీ విద్య, పోషకాహారం, ఆరోగ్యం వంటి రంగాలలో అసమానతలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా జాతీయ బాలికా దినోత్సవ సందర్భాన్ని వినియోగిస్తోంది. లింగ వివక్షకు సంబంధించిన సమస్యలపై పని చేయడం, బాలికల ఆరోగ్యం, పోష కాహారం, లింగ నిష్పత్తి అంతరాన్ని తగ్గించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం; అవకాశాల పరంగా అసమానతలను తొల గించడం; ఆడపిల్లలందరికీ వారి హక్కులు, అర్హమైన గౌరవం, విలువలు లభి స్తాయని నిర్ధారించడం; కొత్త అవకాశాలను అందించడం, ఎదగడానికి వీలు కల్పించడం వంటివి ఈ లక్ష్యాలు. ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘బాలికాసమృద్ధి యోజన, ‘లాడ్లీ’ పథకం, మాధ్యమిక విద్య కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహకాల వంటి పథకాలను ప్రభుత్వాలు ఎన్ని తీసు కొస్తున్నా... ఆడపిల్లలు తగినంతగా అభివృద్ధి చెందకపోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించాలి.ఇవీ చదవండి: National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్! – డా‘‘ హెచ్. అఖ్తర్ బాను ‘ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్, కర్నూలు(నేడు జాతీయ బాలికా దినోత్సవం) -
ఆ న్యాయస్థానంలో అందరూ జవాబుదారులే!
దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అంటుండేవారు: మీలో ప్రతి ఒక్కడూ సంరక్షకుడే, జవాబుదారుడే. సావధానంగా వినండి: మీలో ప్రతి ఒక్కడూ (తమ తమ పరిధుల్లో) యజమానినే, సంరక్షకుడే. మీలో ప్రతి ఒక్కరిని, వారి సంరక్షణలో ఉన్న వారి బాపతు అడగడం జరుగుతుంది.వివరణ: ముస్లిం సమాజంలోని ప్రతి వ్యక్తి అనేక బాధ్యతలకు కట్టుబడి ఉన్నాడు. తనకు అందుబాటులో ఉన్నది, తాను ఖర్చు చేసే ప్రతి విషయం అల్లాహ్ అతనికి ప్రసాదించిన ఓ అమానతు. దైవానికి దాసునిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినందువల్ల అల్లాహ్ తనకు అందించిన ఆ అమానుతును కొల్లగొట్టకుండా దాన్ని ఎంతో మేళకువగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే మరణానంతరం ఈ భూమిలో తనకు లభించిన ప్రతి వరాన్ని, ప్రతి శక్తిని, సామర్థ్యాన్ని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా అక్కడ అడగడం జరుగుతుంది. ఒక ముస్లింగా మనిషి తాను పని చేసే పరిధిలో, శక్తి సామర్థ్యాల్లో స్వతంత్రుడు ఎంత మాత్రం కాడు, సరి కదా ఆ వరాలన్నింటికీ అతను సంరక్షకుడు. దైవ న్యాయస్థానం లో బాధ్యతలు, సంరక్షణకులకు సంబంధించిన పూర్తి రికార్డు ప్రశ్నల రూపంలో ఎదురవుతుంది. ఇస్లామీయ దేశాధ్యక్షుణ్ణి నేరుగాను, ఇస్లామీయ పాలనా వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి చిన్నా, పెద్దా అధికారుల్ని, ఉద్యోగుల్ని పరోక్షంగానూ హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరిక ఏమిటంటే మీరు ఏ హోదాల్లోనైతే పనిచేస్తున్నారో లేక ఏ ఏ ప్రభుత్వ శాఖలకు ఇన్చా ర్జీలుగా ఉన్నారో ఎంతో న్యాయంగా దైవభీతి కలిగి మీ బాధ్యతలను నెరవేర్చే ప్రయత్నం చేయండి.పరలోకంలో అల్లాహ్ ఏర్పరిచిన న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టి మీరు భూలోకంలో ఏ బాధ్యతలను నిర్వహించారో మీకు ఏ అమానతు అయితే అప్పగించడం జరిగిందో దాన్ని పూర్తిగా నిర్వర్తించారా లేదా అని అడగడం జరుగుతుంది జాగ్రత్త.ప్రతివాడు తన భార్య పిల్లల నైతికతలకు, విద్యాబుద్ధులకు కాపలాదారుడు. భార్య తన శీల సంపదకు, తన పిల్లల శిక్షణకు, భర్త ఆస్తికి, ఇంటిని నడిపేందుకు బాధ్యురాలు. భార్యాభర్తలను ఒకరి విషయాల్లో మరొకరిని బాధ్యులుగా, కాపరదారులుగా చేయడం జరిగింది. మొత్తానికి ప్రళయ దినం నాడు ప్రతివ్యక్తి తన జీవిత కర్మల చిట్టా చేతబట్టి అల్లాహ్ న్యాయస్థానంలో నిలబడవలసి ఉంది.ఇస్లామీయ రాజ్య పాలకుడు ఓ సంరక్షకుడు. అతనితో అతని రాజ్యంలోని ప్రజానీకం గురించి అడగడం జరుగుతుంది. ప్రతివాడు తన భార్య, పిల్లలకు యజమాని. అతడు తన బాధ్యతలను గురించి దేవునికి జవాబు చెప్పుకోవాల్సి ఉంది. ∙స్త్రీ (భార్య), తన భర్త ఇంటికి (అతని సంతానానికి) బాధ్యురాలు. గృహ సంబంధమైన బాధ్యతల గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. ∙నౌకరు తన యజమానికి; కుమారుడు తన తండ్రి ఆస్తికి సంరక్షకుడు. దేవుడు వారి బాధ్యతలను గురించి అడుగుతాడు. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
చీర, గాజులా..?! తీరు మారదా? మాట వరుస మారదా?
ఇటీవల ఒక నాయకుడు మరో నాయకుడిని దూషించాడు. ఆ దూషణ మహిళలను కించపరిచే అర్థంలో సాగింది. అసమర్థతకు సమానార్థకంగా చీర, గాజులను ప్రస్తావించాడు. దూషణలో ఒక కులాన్ని ప్రస్తావిస్తే కేసు పెట్టడానికి చట్టాలున్నాయి. స్త్రీల గౌరవానికి భంగం కలిగే ఇలాంటి వ్యాఖ్యలకు గట్టి చట్టాలెక్కడ? సమాజంలో నెలకొని ఉన్న వివక్షపూరిత భావజాలానికి అడ్డకట్ట ఎప్పుడు? ఈక్వాలిటీ అంటే ఇదేనా? రాజ్యాంగం స్త్రీపురుషులిద్దరికీ సమానమైన గౌరవాలనే చెప్పింది. వివక్షకు తావులేని నిబంధనలున్నా వివక్ష తప్పలేదు. ఐక్యరాజ్య సమితి 1975 ఉమెన్స్ ఇయర్గా ప్రకటించి, అధ్యయనానికి కమిటీని వేసింది. ఆ కమిటీ 1977లో ‘టూవార్డ్స్ ఈక్వాలిటీ’ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాం కదా, ఇంకా ఏం కావాలి అనే అభి్ర΄ాయంలో ఉన్న మన పాకుల కళ్లు తెరిపించింది ఆ నివేదిక. దీనికి కొనసాగింపుగా 1985 వరకు మహిళాభివృద్ధి కోసం పని చేయాలని కూడా సూచించింది ఐక్యరాజ్య సమితి. మహిళ సాధికారత సాధనలో ముందడుగు వేస్తున్న క్రమంలో 2001 సంవత్సరాన్ని ‘ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇయర్’గా ప్రకటించింది మన భారత ప్రభుత్వం. ఇన్ని జరుగుతున్నా సమాజం మాత్రం పితృస్వామ్య భావజాలం నుంచి బయటపడడం లేదు. ఒక మగవాడు సాటి మగవాడిని మాటలతో దాడి చేయాల్సి వచ్చినప్పుడు ‘చీర కట్టుకో, గాజులు వేసుకో’అంటున్నారు. ఎదుటి వ్యక్తి మీద అసమర్థత, అనైతికత ఆరోపణలు చేయడానికి స్త్రీత్వాన్ని ఆపాదించడం, స్త్రీల వస్త్రధారణతో గేలి చేయడం వంటి ప్రాక్టిస్ ఏ మాత్రం సరికాదు. ప్రజాజీవితంలోకి వచ్చే వాళ్లు ముందు దయచేసి రాజ్యాంగాన్ని చదవాలి. - ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి (రిటైర్డ్), వరంగల్ మౌనంగా ఉంటే మరింత దిగజారుతుంది! ‘ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు’ అనే మాట సమాజంలో వినిపిస్తూనే ఉంది. మగవాళ్ల నుంచే కాదు మహిళల నుంచి కూడా. ‘తాము అసమర్థులం కాదు, సమర్థులమే’ అని చెప్పుకోవడానికి మగవాళ్లు గాజులు, చీరలను మాట్లాడుతుంటారు. నిరక్షరాస్యుల్లో తరచూ వినిపిస్తుంటే చదువుకున్న వాళ్లలో అరుదుగా వినిపిస్తుంటుంది. అంతే తేడా. మరికొందరు ఎదుటి వారి మీద దుమ్మెత్తి పోయడానికి, అసమర్థుడివని దెప్పి పొడవడానికి, ‘నీకు చీర, గాజులు పంపిస్తా’ అనడాన్ని కూడా చూస్తున్నాం. మగవాళ్లు ఇలా అన్నప్పుడు ఆడవాళ్లు మౌనంగా ఉంటే ఆ మాటలను, వారి భావాన్ని, అభి్ర΄ాయాన్ని సమ్మతించి నట్లవుతుంది. అందుకే మహిళలు ప్రతిస్పందించాలి. మహిళ మౌనం వహిస్తే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. తప్పు చేసిన వాళ్లను ఒకప్పుడు గుండు గీయించి, సున్నం బొట్లు పెట్టి ఊరంతా తిప్పేవాళ్లు. ఇలా నోటి దురుసుగా మాట్లాడిన వాళ్ల వ్యాఖ్యలను ఖండించి, తగిన విధంగా తిప్పికొడుతూ ఉండాలి. అప్పుడే సమాజంలో తరతరాలుగా పాతుకు΄ోయిన ఇలాంటి మాటలకు అడ్డుకట్ట పడుతుంది. – ఎం. అమ్మాజీ, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ మాట వెనక్కి తీసుకోవాలి! ఇలాంటి మాటలు ఏ మాత్రం సమ్మతించదగినవి కావు. మగవాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడానికి ‘... కొడకా’ అంటూ ఆడవాళ్లనే నిందిస్తారు. వాటి మీద మా తరమంతా పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. స్త్రీల కట్టు, బొట్టుతో గేలి చేయడమూ ఎక్కువైంది. ఒక మగవాడు మరో మగవాడిని అవహేళన చేయాలంటే స్త్రీలతో పోల్చడం, స్త్రీలలాగ వస్త్రధారణ చేసుకోమని గేలిచేయడం అంటే వాళ్ల దృష్టిలో చేతకానివాళ్లకు ప్రతీక స్త్రీలే అనే అభిప్రాయం స్థిరంగా ఉందని అర్థం. ఆ మాటలను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయాలి. మాట వెనక్కి తీసుకునే వరకు పోరాడాలి. ప్రొఫెసర్ గూడూరు మనోజ (రిటైర్డ్), హైదరాబాద్ ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్కు మించి బ్యాక్టీరియా -
2036 కల్లా పెరగనున్న లింగ నిష్పత్తి
న్యూఢిల్లీ: భారత్లో లింగ నిష్పత్తి 2036 సంవత్సరాలికల్లా కొద్దిగా మెరుగుపడనుంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని గణాంక, ప్రణాళిక అమలు శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2011లో మన దేశంలో లింగ నిష్పత్తి 1000: 943గా ఉంది. లింగ సమానత్వం దిశగా సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 2036 కల్లా భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో జనాభాలో మహిళల శాతం స్వల్పంగా పెరిగి 48.8 శాతానికి చేరుకుంటుందని వివరించింది. 2011లో భారత జనాభాలో మహిళ శాతం 48.5 మాత్రమే కావడం గమనార్హం. 2011తో పోలిస్తే 2036లో పదిహేనేళ్ల లోపు వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, జననాలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని పేర్కొంది. మరోవైపు ఇదేకాలంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. -
‘ఆడామగా సమానమే, కానీ పురుషుల్లో..’ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి లింగ సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితం అనే బండికి చక్రల్లాంటివారు. జీవన యానం సాఫీగా సాగాలంటే ఇద్దరూ ఉండాలి.. తన దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే కానీ, వేర్వేరు మార్గాల్లో అన్నారు.లింగ సమానత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు సైకిల్కి రెండు చక్రాల్లాంటివారు. వీరిలో ఎవరూ లేకపోయినా బండి ముందుకు సాగదు.. అని ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి మూర్తి పేర్కొన్నారు.In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can't move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024మహిళలు పురుషులు ఇద్దరూ ఒకరికొకరు భిన్నం. ఇద్దరిలోనూ ప్లస్, మైనస్లు ఉంటాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా భాష తెలుసు. మేనేజ్మెంట్లో వారు చాలా అద్భుతం. పుట్టుకతోనే వారు మంచి మేనేజర్లు. ప్రేమ, జాలి కరుణ ఎక్కువ. అమ్మ, నాన్న, తోబుట్టువులు, అత్తమామలు, వదినలు, పిల్లలు ఇలా సన్నిహిత బంధువులు అందరికీ చక్కటి ప్రేమను పంచుతారు. మరోవైపు పురుషులు మహిళలంత భావోద్వేగులు కాదు. కొంచెం భిన్నం. పురుషుల్లో మంచి ఐక్యూ ఉండివచ్చు కానీ,మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
లింగసమానత్వమే మహిళల ఎజెండా
మహిళా ఓటర్లు రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, పురుషుల భాగస్వామ్యాన్ని మహిళా ఓటర్ల సంఖ్య అధిగమించింది. రానున్న సాధారణ ఎన్నికల్లో దాదాపు 47 కోట్ల మంది మహిళలు ఓటు వేయనున్నట్లు భారత ఎన్నికల సంఘం అంచనా వేసింది. మగవారి ఆదేశాల మేరకే మహిళలు ఓటు వేస్తారనే భావన క్రమంగా తన విలువను కోల్పోతోంది. పూర్తి స్పృహతో వారి ఎంపికలు ఉంటున్నాయి. సమానత్వం, గౌరవ ప్రదమైన జీవితం తప్ప మహిళలకు మరేదీ అంగీకారం కాదు. వీటిని సాధించే జెండర్ మేనిఫెస్టో తక్షణావసరం. లింగ సమాన ప్రపంచాన్ని సాధించ డానికి కొత్త పుంతలు తొక్కాలనే సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు. భారతదేశం సార్వత్రిక ఎన్నికల వైపు వెళుతున్నందున, నేను గత కొన్ని వారాలుగా మహిళలు, ఎల్జీబీటీక్యూ+ వ్యక్తులతో మాట్లాడి తదుపరి ప్రభుత్వంపై వారి అంచనాలను జెండర్ మేనిఫెస్టోలో పొందుపరిచాను. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 ప్రకారం, భారతదేశం ప్రస్తుతం లింగ సమానత్వంలో 146 దేశాలలో 127వ స్థానంలో ఉంది. ఈ విషయంలో కొన్ని చిన్న, కొన్ని భారీ అడుగులు పడ్డాయి. కానీ ఇది సరిపోదు. రాజ్యాంగ ప్రవేశిక పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమా నత్వానికి కట్టుబడి ఉంది. భారతదేశ జనాభాలో సగానికి పైగా, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఇప్పటికీ ఈ ప్రాథమిక హామీలను పొందేందుకు కష్టపడుతున్నారు. జెండర్ మేనిఫెస్టో కోసం సంప్రదింపుల ప్రక్రియను మొత్తంగా చూస్తే, భారతదేశంలోని మహి ళలు సమానత్వం, గౌరవప్రదమైన జీవితాన్ని తప్ప మరేమీ కోరు కోవడం లేదని స్పష్టమైంది. హక్కుల కోసం పోరాడాలా? చారిత్రకంగా నేరపూరితమైన సంచార, డీనోటిఫైడ్ తెగల (నేరస్థ తెగల చట్టం నుండి మినహాయించిన) జనాభాలో ఎక్కువ మందికి, ప్రత్యేకించి మహిళలకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఇప్పటికీ, వారి ‘మృత పేర్లను‘ (లింగ పరివర్తన తర్వాత ఉపయోగంలో లేనటువంటి వారి పుట్టుక పేర్లు) కలిగి ఉన్న రాతపనిని నవీకరించడానికి అధిగమించలేని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి గుర్తింపు హక్కు చాలా కాలంగా నిరాకరించబడింది. 2024లో, ఉనికిలో ఉండే హక్కు ఏ వ్యక్తికైనా పోరాటం కాకూడదు. అన్ని వర్గాలకు చెందిన మహిళలు, ఎల్జీబీటీక్యూ+ వ్యక్తుల ఆశలు, ఆశయాలను గుర్తించే జెండర్ ఎజెండాను అనుసరించడం మన రాజ కీయ పార్టీల కర్తవ్యం కావాలి. ఈ ఎజెండా కోసం ఇక్కడ కొన్ని సిఫార్సులు: రాజ్యాంగం సమానత్వానికి హామీ ఇస్తుండగా, లింగ నిర్ధారిత కోణం నుండి చూసినప్పుడు వ్యక్తిగత హక్కులు తక్కువగా ఉంటున్నాయి. వివాహం చేసుకునే ప్రాథమిక హక్కు పౌరులకు లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎల్జీబీటీక్యూ+ వ్యక్తులకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కును తిరస్కరించినట్లయితే మనం సమానత్వాన్ని ప్రకటించుకోలేం. వీలైనంత త్వరగా పార్లమెంటు దీనిపై చట్టం చేయాలి. ప్రతిరోజూ, మహిళలు తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ఇంట్లో ప్రారంభమవుతాయి. శిక్షాస్మృతిలో వైవాహిక అత్యాచారం మినహాయింపుగా ఉండటం అనాలోచితం. తదుపరి ప్రభుత్వం ఈ చట్టాన్ని తొలగించి, లింగ ఆధారిత హింస పట్ల జీరో–టాలరెన్స్(ఏమాత్రం సహించని) విధానాన్ని అనుసరించాలి. చాలామంది మహిళలు డీప్ ఫేక్ (మార్ఫింగ్ వీడియోలు), ఆన్ లైన్ దుర్వినియోగం పట్ల ఉన్న వారి భయాల గురించి నాతో మాట్లా డారు. పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత శాంతి భద్రతల యంత్రాంగాలు తగినంతగా సన్నద్ధంగా లేవు. మహిళలు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో సురక్షితంగా ఉండేలా చేయడానికి వీటిని తప్పనిసరిగా సంస్కరించాల్సి ఉంది. లింగ అపోహలు తొలగాలి అన్నిరకాల సామాజిక కలయికలు పెరగాలంటే, లింగ అపోహలను వదిలించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు తమ పరిసరాలలో లింగ పరమైన సామాజికీకరణ కారణంగా పితృస్వామ్య పద్ధతులను అవలంబిస్తారు. లింగపరమైన మూస పద్ధతులను తొలగించడానికి పాఠశాల పాఠ్యపుస్తకాలను సమీక్షించడం, తిరగరాయడం తక్షణ అవసరం. అదనంగా, లింగపరమైన సున్నితత్వాన్ని బోధించే వర్క్ షాప్లను పాఠశాల పాఠ్యాంశాలలో చేర్చాలి. తరువాత, పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యత అని మనం గుర్తించాలి. అన్ని అధికారిక సంస్థలలో వేతన చెల్లింపుతో కూడిన పితృత్వ సెలవును తప్పనిసరి చేయాలి. ఒక దృష్టాంతాన్ని నెలకొల్పడానికి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ‘క్రెష్’(శిశు సంరక్షణ కేంద్రం)లను కూడా ఏర్పాటు చేయాలి. తద్వారా పనిచేసే తల్లిదండ్రులు, లింగ భేదం లేకుండా పిల్లల సంరక్షణలో పాల్గొనేలా చేయాలి. కోవిడ్ తర్వాత, ఆరోగ్య హక్కుపై ఎక్కువ దృష్టి పడింది. అయితే, మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధ్యయనాలు కనుగొన్నాయి. ఆరోగ్య హక్కును కీలకమైనదిగా పరిగ ణించాలి. లింగపరమైన దృష్టితో విధానాలను రూపొందించాలి. గత కేంద్ర బడ్జెట్లో, గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తప్పనిసరిగా రొమ్ము, గర్భా శయ క్యాన్సర్కు ఉచిత పరీక్షలు చేయాలి. ఇంకా, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ద్రవ్యోల్బణంతో సరిపోయేలా ఆర్థిక సహాయాన్ని తప్పనిసరిగా పెంచాలి. మహిళలకు ఆర్థిక శ్రేయస్సును అందించడం తదుపరి ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సవాలు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్లకు నిర్దిష్ట నిధులను తప్పనిసరిగా కేటాయించాలి. మహిళా రైతులను గుర్తించకపోవడం, తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం మహిళలకు సంబంధించినంతవరకు రెండు ప్రధాన బాధాకరమైన అంశాలు. తదుపరి ప్రభుత్వం మహిళా రైతుల హక్కుల బిల్లు, 2011ను తప్పనిసరిగా అమలులోకి తేవాలి. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలను, ముఖ్యంగా ఉత్పాదక రంగంలో అమలు చేయాలి. తమ సిబ్బందిలో 20 శాతం కంటే ఎక్కువ మంది మహిళలను నియమించుకునే సంస్థలకు పన్ను రాయితీలు మంజూరు చేయడం ఒక మార్గం. ప్రభుత్వం అతిపెద్ద ఉద్యోగ కల్పనా దారులలో ఒకటి కాబట్టి, 30 లక్షలుగా అంచనా వేసిన ప్రస్తుత ఖాళీ స్థానాలను త్వరగా భర్తీ చేయాలి. ఈ ఉద్యోగాలకు మహిళా రిజర్వేషన్ ను తప్పనిసరిగా విస్తరించాలి. చట్టం చేయాల్సిన ఆవశ్యకత భారతదేశంలో మహిళల రాజకీయ హక్కులకు సంబంధించి గత సంవత్సరం చాలా ముఖ్యమైనది. మూడు దశాబ్దాలకు పైగా జరిగిన ఉద్యమాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వానికి దృఢ సంకల్పం ఉంటే లింగ సమానత్వం వైపు చరిత్రాత్మక అడుగు వేయవచ్చని ఇది సూచిస్తోంది. అయితే, చట్టం అమలులో లేకపోవడం మనందరినీ నిరాశకు గురిచేస్తోంది. రాబోయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ ను వీలైనంత త్వరగా అమలు చేసేలా చూడాలి. ఇది జనాభా లెక్కలను పూర్తి చేయడానికి లోబడి ఉండ కూడదు. పైగా, ప్రాతినిధ్యం అనేది ఎగువ మరియు దిగువ సభలు రెండింటిలోనూ ప్రతిబింబించే ఆదర్శం. రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సి ల్లలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు రిజర్వేషన్ల నిబంధనలపై పార్లమెంటు తప్పనిసరిగా చట్టం చేయాలి. భారతదేశం లింగ సమానత్వాన్ని సాధించడానికి ఒక శతాబ్దానికి పైగా కాలం పడుతుంది. గత స్త్రీవాద ఉద్యమాలు మన ప్రధాన లక్ష్యాల సాధనలో పట్టుదలతో కొనసాగుతూనే, చిన్నపాటి విజయా లను జరుపుకోవాలని బోధించాయి. పైన పేర్కొన్న సిఫార్సులు కీలక మైనవి, దూరదృష్టితో కూడుకున్నవి. ముఖ్యంగా, తదుపరి ప్రభుత్వా నికి దాని పదవీకాలంలోనే సాధించదగినవి. మనకు కావలసిందల్లా లింగ–సమాన ప్రపంచాన్ని సాధించడానికి కొత్త పుంతలు తొక్కాలనే నిస్సందేహమైన సంకల్పం మాత్రమే. ఏంజెలికా అరిబమ్ వ్యాసకర్త ‘ఫెమ్మె ఫస్ట్’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు -
వనిత ప్రగతి పరుగు?!
"ఆడాళ్ళు మీకు జోహార్లు .. ఓపిక,ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు.." - ఆచార్య ఆత్రేయ. అది అక్షరాలా నిజం. 'క్షమయా ధరిత్రి' అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తునే ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కరించారు. "ఆడవాళ్లు - మగవాళ్లు ఇద్దరూ సమానమే,కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం". ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే. 'ఆకాశంలో సగం' అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. కొంత ఛాందసాలు, చాదస్తాలు రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకోవడంతోనే సరిపోదు. నిజమైన పండుగ వారి గుండె గుడిలో నిండుగ ఉదయించాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే అమ్మను అమ్మవారుగా నిత్యం కొలిచే ఆచారం మనకు వేళ్లూనుకొని వుంది.అదే సమయంలో కష్టాలు,కన్నీళ్లు,బానిసత్వం, అణగదొక్కే విధానం,ఆచారాల పేరిట అసమానతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు.'నిర్భయ' చట్టాల వంటివి ఎన్ని వచ్చినా,ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా,అరాచకాలు ఆగడంలేదు.ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవ్వలేదు. ఓటు హక్కు వచ్చినా,చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా, ఆచరణకు ఏళ్ళుపూళ్ళు పట్టేలా వుంది. శాసనాలు చేసే అధికారం రావాలంటే ఇంకా చాన్నాళ్ళు ఆగాల్సిందే.అప్పటిదాకా శాసించే శక్తి మగవాళ్ల దగ్గరే వుంటుంది. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అందించిన అవకాశాలతో మహిళామణులు రాష్ట్రపతి , స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అందుకున్నా, అది సరిపోదు.సమత, సమతుల్యత ఇంకా సాధించాల్సి వుంది. ఇంకొక వైపు వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. 'స్త్రీలకు స్త్రీలే శత్రువులు' అన్నది ఇంకా వీడడం లేదు. లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ,సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు.కార్మిక సంఘాలు ఏర్పడినా,చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు,కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది.1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది.ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది.సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త నయం.అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం,బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది. పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. 'పని సంస్కృతి' (వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. 100 సంవత్సరాల పై నుంచీ 100 దేశాలకు పైగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ సమగ్రత,సంపూర్ణత సాధించాల్సి ఉంది. 'లింగ సమానత్వం సాధించడం' 2022 సంవత్సరంలో ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో, 'నవీనత్వం - సాంకేతికతలో లింగ వివక్షలేని సమానత్వం' 2023 ఎజెండాగా కల్పన చేసుకున్నారు. ' ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ - యాక్సలరేట్ ప్రోగ్రెస్ '- 2024 ఎజెండాగా పెట్టుకున్నారు. మహిళా సాధికారితను సాధించడానికి ఇంకెన్నాళ్లు పోరాడాలి? అనుకున్నది జరగాలి, ఈ పోరాటం ఆగాలి అన్నది మహిళాలోకం కోరుకుంటున్నది. మహిళా ప్రగతి వేగం పెరగాలని ఈ ఏటి ప్రధాన ఎజెండా. వినడానికి ఎజెండాలు ఎప్పుడూ బాగానే వుంటాయి. ఆచరణలో ఎక్కడ? అనే ప్రశ్నలు ఉదయించడం మానడంలేదు. మరోపక్క...స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు.అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి,పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు, దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు.కాకపోతే, సమానత్వంలో సమగ్రత సాధించాలి. మహిళాలోకం వెలగాలి, వెలుగులు పంచాలి (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మా శర్మ స్పెషల్ స్టోరీ..) - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
విశ్వ సమానత్వాన్ని తిరస్కరిస్తారా?
జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించే చట్టాలు అమెరికా, కెనడాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిని ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతిరేకించారు. అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారనీ వారు ఆరోపించారు. భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయులు సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, ఎవరైనా అలాంటి శాసనాలను ఎందుకు వ్యతిరేకించాలి? అమెరికాలో పలువురు వలస భారతీయుల కేంద్రంగా ఉన్న సుసంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా సెనేట్లో 2023 మార్చి 22న కుల వివక్ష వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ప్రపంచంలోనే కులాన్ని మరింత మౌలికంగా చర్చించే మొదటి చట్టం అవుతుంది. భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది కానీ కులాన్ని కాదు. హిందుత్వ ప్రవాసులు ఇలాంటి కీలక పరిణామం చోటు చేసుకోబోదని భావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ శక్తులు కూడా అలాంటి ఘటన జరగకూడదని భావించాయి. కానీ ప్రపంచం వీరి పరిధిని దాటిపోయింది. జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన పౌరులు, పెద్దలు లేదా పిల్లలపై వివక్షను నిషేధించే చట్టాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్(అమెరికా), టొరొంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(కెనడా) ఆమోదించినప్పుడు పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతి రేకించారు. ఇలాంటి శాసనాలను ‘హిందూఫోబియా’గా వారు ఖండించారు.అటువంటి శాసనాలను వ్యతిరేకిస్తూ పలు పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో రాశారు, మాట్లాడారు. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయుల సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, అలాంటి శాస నాలను ఎందుకు వ్యతిరేకించాలి? వివక్షకు సమర్థనా? సియాటిల్ సిటీ కౌన్సిల్ ఇటీవలే ఆమోదించిన తీర్మానంలో వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని కూడా జోడించడాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్య ‘సంస్థాగత మార్గం ద్వారా అమెరికాలో హిందూఫోబియాను ప్రోత్సహిస్తున్నారు, అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని పేర్కొన్నట్టుగా ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ రాసింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ వాదననే మరింత ముందుకు తీసుకు పోయారు. కుల వివక్షకు సంబంధించిన ఈ తప్పుడు జెండాను ఎత్తుతున్న బృందాలు సాధారణంగా హిందూభయంతో ఉంటు న్నాయని ఆయన ఒక జాతీయ దినపత్రికలో రాశారు. ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కేంద్రంగా వ్యవహరించే పరిశోధనా సంస్థ ‘ఈక్వాలిటీ ల్యాబ్’నూ, అలాగే అమెరికా, కెనడా, యూరప్ తదితర ప్రాంతాల్లో అలాంటి కుల వ్యతిరేక చట్టాలు, శాస నాలపై పనిచేసే పౌర సమాజ బృందాలనూ పశ్చిమ దేశాల్లోని హిందూఫోబిక్ గ్రూపులుగా రామ్ మాధవ్ తప్పుపట్టారు. పాంచజన్య ఆరెస్సెస్ అధికార పత్రిక. వివక్షా వ్యతిరేక చట్టం హిందూఫోబియాకు సంకేతమనీ, భారతీయ ప్రతిభ పురోగతిని అడ్డుకునే కుట్ర అనీ అది పేర్కొంటోంది. భారత్ లేదా ప్రపంచంలో గణనీయ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న చోట సంస్థాగత శాసనాలను రూపొందించకుండా కులవివక్ష సమస్యను పరిష్కరించడం ఎలా? వివక్షను ప్రదర్శిస్తున్న వారు అలాంటి వివక్షా వైఖరి తప్పు అని ఎన్నడూ భావించరు. ఒక వ్యక్తి లేదా వర్గ మానసిక లక్షణాల్లో వివక్షా పూరితమైన ప్రవర్తన భాగమవుతుంది. హిందూ మతానికి సంబంధించి, అలాంటి వివక్షను ఆధ్యాత్మిక పాఠ్య గ్రంథాల ద్వారా సమర్థిస్తున్నారు. దానికి పవిత్రతను కల్పిస్తున్నారు. వివక్షాపూరిత అనుభవాలెన్నో! భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. స్కూల్, కాలేజీ, పిల్లలు, యువత రోజువారీగా అను భవిస్తున్న వేదనకు సంబంధించిన ఇవి గాథలను వర్ణించాయి. వ్యక్తుల కుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి, అమలవుతున్న వివక్షా పద్ధతు లను కనుగొనడానికి సంబంధించిన యంత్రాంగాలను పలు నివేది కలు వెలికి తెచ్చాయి. ఉదాహరణకు, తెన్ మొళి సౌందరరాజన్ తాజా పుస్తకం ‘ద ట్రామా ఆఫ్ కాస్ట్ – ఎ దళిత్ ఫెమినిస్ట్ మెడిటేషన్ ఆన్ సర్వైవర్షిప్, హీలింగ్, అబాలిషన్’ అమెరికాలోని భారతీయ వలస ప్రజలలో వివక్షకు సంబంధించిన అసంఖ్యాక ఘటనలను గుది గుచ్చింది. ఈమె రెండో తరం భారతీయ అమెరికన్ దళిత మహిళ. టొరొంటో శాసనాలను రూపొందించిన తర్వాత, కెనడాలోని ఒక కాలేజీ విద్యార్థి త్రినా కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని సమగ్రంగా వర్ణించారు. తమ వేదనా గాథలను చెబు తున్న, భవిష్యత్తును ప్రేమిస్తున్న యువ మహిళగా ఆమె కనిపిస్తారు. ‘‘గ్రేటర్ టొరొంటో పాఠశాలల్లో కులపరమైన వేధింపును చాలానే ఎదుర్కొన్నాను. ఈ వేధింపు నాకు అయోమయం కలిగించింది. ప్రత్యేకించి మేమంతా కెనడియన్లమే అయినప్పటికీ నా తోటి క్లాస్ మేట్లకు కులం అంటే ఇంత ప్రాధాన్యం ఎందుకు అని నేను ఆశ్చర్య పడ్డాను’’ అని ఆమె చెబుతున్నారు. ‘‘వారి అగ్రకుల సంప్రదాయా లను నేను అనుసరించలేదు, దళిత క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వారు నన్ను ఆటపట్టించేవారు’’ అని ఆమె చెప్పారు. క్రిస్టియన్లు మెజారిటీగా ఉంటున్న దేశంలో వారు ఇలా చేస్తున్నారు. ఇది క్రిస్టోఫోబియా కాదా? పాశ్చాత్య కులతత్వ వలస ప్రజల్లో ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే, అమెరికాలో కుల వివక్షపై ఈక్వా లిటీ ల్యాబ్స్ అధ్యయనాన్ని రామ్ మాధవ్ తోసిపుచ్చారు. ఇలాగైతే, మొత్తంగా గోధుమవర్ణపు భారతీయులు తమ మీద శ్వేత అమెరికన్లు వివక్ష ప్రదర్శిస్తారని ఎలా ఆరోపించగలరు? సమానత్వం కోసం పనిచేస్తున్న గ్రూపులెన్నో! అమెరికా, కెనడాల్లో కుల వివక్షా వ్యతిరేక చట్టాలపై ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక్కటే పనిచేయలేదు. ఉత్తర అమెరికా అంబేడ్కర్ అసోసి యేషన్, బోస్టన్ స్టడీ గ్రూప్, పెరియార్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్,అంబేడ్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్, అంబేడ్కర్ కింగ్ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వివక్షను ఎండగట్టడానికీ, పీడిత కుల వలస ప్రజలను చైతన్యవంతం చేయడానికీ కృషి చేశాయి. భారత్లో కులం, మానవ అస్పృశ్యత ఎలా పనిచేస్తున్నాయో, దాన్ని అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలా విస్తరింపజేస్తున్నారో పాశ్చాత్య సమాజాలకు తెలియపర్చేందుకు ఈ సంస్థలు బహుముఖ కార్యక్రమాలను చేపడుతూ వచ్చాయి. ఎక్కడ ఉన్నా సరే... కుల అణచివేత, దాని కార్యకలాపాలు ఎంత అమానుషంగా ఉంటు న్నాయో ఈ దేశాల్లోని నల్లవారికీ, శ్వేత జాతీయులకూ తెలియజెప్పేందుకు ఈ సంస్థలు తమ వనరులనూ, మానవ శ్రమనూ చాలా వెచ్చించాయి. కులవ్యవస్థ గురించి, దాని అమానుషమైన ఆచరణ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడంలో తప్పేముంది? మానవ సమా నత్వం కోసం నిలబడకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యం కోసం ఎలా నిలబడతాయి? జాతి వివక్ష, ఇతర దేశాల పట్ల దురభిప్రాయం, దానికి సంబంధించిన అసహనాలకు వ్యతిరేకంగా డర్బన్ లో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగిన 2001 నుంచి ప్రపంచం చాలా దూరం పయనించింది. ఆనాటి సదస్సులో జాతి సమస్యతోపాటు కుల సమస్యను కూడా చర్చించడానికి అనుమతించలేదు. ఆనాడు ఐ.రా.స. అంగా లకు కుల వ్యవస్థ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి. కుల సమస్యను అంతర్గత అంశం అని ప్రకటించి, దానిపై ఎలాంటి చర్చను కూడా అనుమతించడానికి బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. హిందూఫోబియా పేరిట వివక్షను, అసమాన త్వాన్ని, జాతి హత్యాకాండను విశ్వగురువు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూయిజం మానవ సమానత్వాన్ని కోరుకోవడం లేదని దీని అర్థం కాదా? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఆమె పోరాడింది.. టాప్లెస్ సమానత్వం సాధించింది
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్ పూల్స్లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్లెస్గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్లెస్గా సన్బాత్ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్ ఆంబుడ్స్పర్సన్ ఆఫీస్ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్లెస్గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్కు అధికారులు దిగొచ్చారు. వివక్షకు పుల్స్టాప్ పెడుతున్నట్లు బెర్లిన్ అధికారులు ప్రకటించారు. బెర్లిన్లో స్మిమ్మింగ్ పూల్స్ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. -
International Womens Day: వాణిజ్య వాహనాల డ్రైవర్లుగా మహిళలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ ఎంబ్రేస్ ఈక్విటీ పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు సమాన అవకాశాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అశోక్ లేలాండ్కు చెందిన ట్రైనింగ్ సెంటర్లో భారీ వాణిజ్య వాహనాలు, బస్లు నడపడంపై శిక్షణ పొందేందుకు 100 మంది మహిళలను న్యూఢిల్లీకి ఆహ్వానించింది. ‘వాస్తవానికి భారీ వాణిజ్య వాహనాల డ్రైవింగ్ అనేది పురుషుల బలమనే ప్రచారం ఉంది. ఎంబ్రేస్ ఈక్విటీ ద్వారా దీనిని ఛేదించాలనేది కంపెనీ ఆలోచన’ అని అశోక్ లేలాండ్ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కోసం ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీనిలో భాగంగా 180 మంది మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ కల్పించింది. వీరిలో చాలా మంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్లుగా నియామకం అందుకున్నారని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లింగ అసమానతలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గడానికి ఇంకో 300 ఏళ్లు పడుతుందని, ఇది బాధాకరం అన్నారు. మహిళల హోదా విషయంపై ఐరాస సెషన్లో సోమవారం మాట్లాడుతూ గుటేరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కులను అవహేళన చేస్తూ, ప్రమాదంలోకి నెడుతూ, ఉల్లంఘిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. లింగసమానత్వంపై సాధించిన దశాబ్దాల పురోగతి మన కళ్ల ముందే కనుమరుగు కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. అఫ్గానిస్తాన్లో మహిళల హక్కులను తాలిబన్ ప్రభుత్వం కాలరాస్తున్న విషయాన్ని కూడా గుటెరస్ ప్రస్తావించారు. సాధారణ ప్రజా జీవితానికి వాళ్లను దూరం చేశారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కులను కూడా హరించివేస్తున్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో పాఠాశాలకు వెళ్లే చిన్నారులను కిడ్నాప్ చేసి దాడులు చేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింగ సమానత్వ అంతరం రోజురోజుకు మరింత పెరుగుతోందన్నారు. చదవండి: అంటార్కిటికా కరిగిపోతోంది! -
ఒకే దేశం, ఒకే చట్టం... సాధ్యమయ్యేనా?
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు యూసీసీ అమలుకు బీజేపీ సర్కారు కమిటీ వేయడం తెలిసిందే. తాజాగా గుజరాత్ కూడా అదే బాట పట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వరసగా యూసీసీ అమలుకు సై అంటూ ఉండడంపై చర్చ మొదలైంది. విభిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి... కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి. ఇది అమల్లోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, అప్పుడే సమానత్వ హోదా దక్కుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిని ఎన్నడో తన మేనిఫెస్టోలో చేర్చింది. తన రాజకీయ ఎజెండాలో ఆగ్రభాగాన ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయకుండా ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మొదలు పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ పాలిత యూపీ, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్ యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనుమానాలూ లేకపోలేదు... అయితే యూసీసీపై హిందువుల్లోనే కాస్త వ్యతిరేకత వచ్చే ఆస్కారముందా అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘‘భిన్న మతాలకు చెందిన వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఆచారాలు పాటిస్తున్నారు. వాటన్నింటికీ ఏకరూపత ఎలా సాధ్యం?’’ అన్నది ఒక వాదన. కేవలం మెజార్టీ ఓటు బ్యాంకును ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇది బీజేపీ ఎన్నికల స్టంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు అంటున్నారు. అందరికీ ఒకే చట్టాల్లేవా...? ప్రస్తుతం దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలకు వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యక్తిగత చట్టాలున్నాయి. ముస్లింలకు షరియా చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా అమలవుతోంది. దాని ప్రకారం ముస్లిం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతస్తులకు మాత్రం చట్టప్రకారం ఒక్క భార్యే ఉండాలి. సివిల్ అంశాల్లో కాంట్రాక్ట్ చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అనేకానేక ఉమ్మడి చట్టాలనూ పలు రాష్ట్రాల్లో భారీగా సవరించారు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నా అక్కడా కేథలిక్కులకు, ఇతర మతాలకు భిన్నమైన నియమాలు పాటిస్తున్నారు. నాగాలాండ్, మిజోర, మేఘాలయాల్లోనైతే హిందూ చట్టాల్లో కూడా భిన్నత్వం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ర్యాంకులు పోనాయండీ!
ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. హెచ్డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్డీఐ స్కోర్ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్లలో లేదు. లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి. అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా? -
సమానత్వంలో ఆరోగ్యమూ కీలకమే!
2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవి కానంతగా పెరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లయ్యే సువర్ణ ఘడియలపైనే ఉంది. భారతదేశం అప్పటికి ఎలా తయారవ్వాలి? నా దృష్టిలో అందరికీ సమాన అవకాశాలున్న దేశంగా; విద్య, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉన్న దేశంగా ఉండాలి! కులమతాలకు అతీతంగా... వ్యవ సాయం, పాడి పరిశ్రమలు పుష్టిగా సాగుతుండాలి. నాణ్యతే ప్రధానంగా పరిశ్రమలు వస్తువులను అందించాలి. ఇవన్నీ కూడా అందరికీ సమాన అవకాశాలు అన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడేవే. ప్రతి సమాజానికి విద్య, ఆరోగ్యం పునాదుల్లాంటివి. ఈ రెండు విషయాల్లోనూ దేశం సాధించిన ప్రగతికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. భారతీయ విద్యావిధానం అంతర్జాతీయ స్థాయి సీఈవోలను సిద్ధం చేస్తూంటే... భారతీయ ప్రైవేట్ రంగ ఆరోగ్య వ్యవస్థలు ప్రపంచం నలుమూలల్లోని వారికి మెడికల్ టూరిజంతో వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే ఈ రెండు ఉదాహరణలను మినహాయిం పులుగానే చూడాలి. పైగా ఈ రెండింటిలో అవకాశాలు కొందరికే. పిల్లలు తమ మేధోశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు మొట్ట మొదటి పునాది ఇంట్లోనే పడుతుంది. పసివాళ్లతో తగురీతిలో మాటలు కలపడం, ఇంద్రియజ్ఞానానికి సంబంధించిన పనులు చేయించడం వంటి పనుల ప్రాధాన్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే విద్యభ్యాసానికి గట్టి పునాది పడినట్లే. తల్లిదండ్రులిచ్చిన ఈ ప్రాథమిక విద్యకు సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నడిచే పాఠశాల కూడా తోడైతే బాలల వికాసం పెద్ద కష్టమేమీ కాదు. ఉమ్మడి కుటుం బమైనా... చిన్న కుటుంబమైనా సరే... సాంఘిక, ఆర్థిక పరిస్థితులే పిల్లలకు దక్కే విద్య నాణ్యతను నిర్ణయిస్తాయి. పాఠశాల వాతా వరణం సాంఘిక, ఆర్థిక లేమి ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించ గలదు కానీ... ఇది జరగాలంటే పాఠశాలలు సక్రమంగా పనిచేస్తూం డాలి. దీనర్థం భవనాలు, పరిపాలన వ్యవస్థలు సరిగా ఉండాలని కాదు. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు కావాలి. అణగారిన వర్గాల పిల్లల జీవితాలను మార్చడం మూకుమ్మడిగా జరగాల్సిన వ్యవహారం. ఈ మార్పు తీసుకు రావడం సాధ్యమనీ, అందుకోసం ఏమైనా చేయగలమనీ ఉపాధ్యాయులు సంకల్పించు కోవడం అవసరం. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చేదేమీ కాదు. ప్రభుత్వాల ఆదేశాలతో సాధ్యమయ్యేదీ కాదు. విద్యాబోధనలో గిరిజన సంస్కృతుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదా తర్క బద్ధమైన అభ్యాసాలను ప్రవేశపెట్టడమైనా సరే... పాఠశాలల్లో విద్యా ర్థుల మదింపు అనేది అందరికీ ఒకేలా ఉండటం సరికాదు. ఈ వాదనలకు ప్రతివాదనలూ లేకపోలేదు. భారత దేశం విశాలమైనదనీ, అన్ని రాష్ట్రాల్లోనూ ఏకరీతి విద్యాబోధన అవసరమనీ అనేవాళ్లూ ఉన్నారు. ప్రభుత్వం వనరుల కొరతను ఎదుర్కొంటోందని ఇంకొందరు అంటారు. విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం దశాబ్దాల దీర్ఘకాలిక ప్రక్రియ అని అంటారు. ఈ ప్రతివాదనలను విస్మరించాల్సిన అవసరమేమీ లేదు. కానీ విద్య ప్రాథమికమైన బాధ్యత సామాజిక వృద్ధి మాత్రమే కాదనీ, సమానతను సృష్టించేం దుకూ ఉపయోగపడాలనీ వీరు గుర్తించాలి. విద్య ద్వారా లింగవివక్షను తగ్గించడం వంటి అనేక లాభాలూ ఉన్నాయని తెలుసుకోవాలి. పాఠశాల విద్యను అభివృద్ధి చేస్తూనే... దీనికి సమాంతరంగా వృత్తి విద్య, పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఈ రెండు రకాల సంస్థలు ఉద్యోగాలు సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయి. అదే సమయంలో తక్కువ విద్యార్హతలతోనే అర్థవంతమైన ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఈ దేశానికి గతంలోనూ ఉన్నారు... భవిష్యత్తులోనూ పుట్టుకొస్తారు. ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియగానే చూడాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అవకాశాలను సృష్టించడం... అవి అందరికీ నిత్యం అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం. ఈ క్రమంలోనే విద్యనభ్య సించేందుకు డబ్బు ఒక ప్రతిబంధకం కాకుండా జాగ్రత్త పడాలి. సుమారు ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట. ఆరోగ్యకరమైన సమాజానికి ఆడపిల్లలు విద్యావంతులై ఉండటం ఎంతో అవసరమని ప్రపంచబ్యాంకు నివేదిక ఒకటి విస్పష్టంగా పేర్కొంది. తక్కువమంది పిల్లల్ని కనడం, సురక్షిత కాన్పులు, పిల్లల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుదల, సమాజంలో స్థాయి పెరగడం వంటి సానుకూల అంశాలకూ ఆడపిల్లలు, మహిళల చదువుకు దగ్గర సంబంధం ఉందని అలవోకగా అనేస్తారు కానీ... ఆరోగ్యం విషయానికి వస్తే అది కాన్పులు, పిల్లల సంరక్షణ పరిధిని దాటి బహుముఖంగా విస్తరించాల్సి ఉంది. రెండు మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చాలా వ్యాధులను మనం సమర్థంగా నియంత్రించగలుగుతున్నాం. కాబట్టి ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రాణాంతక వ్యాధుల నివారణ, రోగులకు మెరుగైన చికిత్స వంటివాటికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి 2030 నాటికి సాధించాలని ప్రపంచదేశాలకు నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరడం 2047 నాటికి కానీ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవికానంతగా పెరుగుతాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. 2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు తగ్గించడం, వ్యాధుల నివారణలపై శ్రద్ధ పెట్టడం జరగాలి. చాలా వ్యాధుల చికిత్సకు ఆసుపత్రుల అవసర ముండదు. ఆరోగ్య కార్యకర్తలను రోగులకు అందుబాటులో ఉంచి, భౌతిక, డిజిటల్ సౌకర్యాలు తగినన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అలాగే అత్యవసర పరిస్థితులకు వేగంగా స్పందించగల, అందరికీ అందుబాటులో ఉండేలా రెఫరెల్ ఆసుపత్రుల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. చికిత్స ఆలస్యం అవడం వల్ల రోగులకు అనవసరమైన ఇబ్బందులు ఎదురు కారాదు. ఇది సాధ్యం కావాలంటే తగిన వనరులు, సిబ్బంది మాత్రమే కాదు... ఇవన్నీ అవసరమైన చోట ఉండేలా చూడాలి. తగిన పద్ధతులను అమల్లోకి తేవడమూ అవ సరమే. ఇంకోలా చెప్పాలంటే వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యవస్థ రోగుల అవసరాలను తీర్చగలగాలి. అయితే ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే.. ప్రైవేట్ రంగాన్ని నియంత్రించక తప్పదు. సుశిక్షితులైన, చిత్తశుద్ధితో పనిచేసే సిబ్బందితో కేవలం చౌక మందులు, టీకాలతోనే మన వ్యవస్థను రోగి ప్రధానంగా పనిచేయించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో అక్కడక్కడ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న వారు ఉన్నారు. క్లిని కల్ సర్వీసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటిని సుస్థిర అమలు దిశగా మళ్లించాలి. 2047 అంటే ఇంకో పాతికేళ్లు కావచ్చు కానీ... స్వతంత్ర భారత చరిత్రలో ఇంకో శతాబ్దానికి బలమైన పునాది వేసేందుకు ఈ 25 ఏళ్లలో విద్య, ఆరోగ్యంపై మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులు కూడా సమాజంలోని ఉన్నత వర్గాల కోసం కాదు. అందరికీ. అయితే ఈ పెట్టుబడుల రాబడులు మాత్రం కొన్ని తరాలవారు అందుకుంటారు. గగన్దీప్ కాంగ్, వ్యాసకర్త సీనియర్ వైరాలజిస్ట్ (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
సమానతా భారత్ సాకారమయ్యేనా?
స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ అవకాశాలిస్తుంది. ఉదాహరణకు, ఒక మతానికి కట్టుబడి ఉండటం, నచ్చిన విధంగా జీవించడం, దేశ సంపద సృష్టిలో పాలుపంచుకోవడం వంటివి. అయితే ప్రస్తుతం మతపరమైన వివక్ష, జనాభాలో 10 శాతం మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతం కావడం వంటివి కనిపిస్తున్నాయి. దీనికి కారణం అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే చోదక శక్తుల లేమి. దేశాభివృద్ధి ప్రయాణంలో లోటుపాట్లను ఎత్తి చూపే భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉన్నప్పుడే అన్ని రంగాల్లో నిజమైన అభివృద్ధి సాధ్యం. కానీ విమర్శకులు ఈరోజు జైలుపాలవుతున్నారు. నూరు సంవత్సరాల భారత్... అంటే అది నాకు సంబంధించినంత వరకు శక్తిమంత మైన ఆలోచన. బంగాళాఖాతాన్ని నేను చూస్తున్నప్పుడు, సముద్రం దాని ధ్రువాన్ని లేదా అంచును తాకడానికి సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ తీరం నుంచే నా కోరికల జాబితా ఆకాశాన్ని తాకుతుంటుంది. సహజంగానే ఇక్కడ అనేక ప్రశ్నలున్నాయి. వృద్ధి అనేది ఎంత సమ్మిశ్రితంగా ఉంటుంది? మన సమాజంలో మార్పు సామాజిక న్యాయ పంథాలో సాగుతోందా? సమానత్వం అనేది సమాజ చలనసూత్రానికి కేంద్ర బిందువుగా ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని, మన సమాజ వృద్ధి, పురోగమన చలనం అనే ఒక సంక్లిష్ట వ్యవహారంగా మారు తున్నాయి. జాతీయ పురోగతికి నారీ శక్తిని అనుసంధానించడం ద్వారా మూలాలు అత్యున్నత శిఖరాలను చేరుకున్నట్లుంది. ప్రధాని ఈ ఆకాంక్షను చక్కగా పసిగట్టారు కదా! స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు పూర్తయ్యే సమయానికి అనేక ప్రభావిత రంగాల్లో భారత్ అత్యంత చోదక శక్తుల్లో ఒకటిగా ఉంటుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కొన్ని అంతర్జాతీయ సంభాషణల్లో భారత్ ఒక తప్పనిసరిగా వినాల్సిన స్వరంగా ఉంటోంది. కానీ 2047 నాటికి ఇదే స్వరం మరి కొన్ని వందల డెసిబెల్స్ స్థాయిలో మార్మోగుతుందని నేను భావిస్తున్నాను. వాతావరణ మార్పు, పెరుగుతున్న అసమానతా స్థాయులు, భౌగోళిక రాజకీయ మండలాల్లో ఎగుడుదిగుడులు వంటి అంతర్జాతీయ సవాళ్లను చూసినట్లయితే... భారత యూనియన్ లోపల ఇప్పుడు అవసరమైన స్నేహభావాన్ని సులభమైన పదాల్లో వివరించలేం. ఈ ప్రయాణం కోసం ఇండియా ప్రాజెక్టు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ సంపద సృష్టిలో 33 శాతం వాటా కలిగిన... ఒక్క శాతం మంది దీని సంగతి చూసుకుంటారని కొందరనవచ్చు గాక. కానీ అనేక ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపిన నేను ఇది చాలదని అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తీ భారత్ చెల్లించవలసిన మూల్యంలో భాగస్వామి అయినప్పుడే ఈ చెల్లింపు సాధ్యమవుతుంది. ఏ దేశమైనా సరే, అభివృద్ధి సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే రెండు ప్రధాన పాత్ర పోషి స్తాయి. మందబలం ఉన్న వారి భుజబల ప్రదర్శనకు వ్యతిరేకంగా వైఖరి తీసుకోవడంలో సమాజ ఇంగిత జ్ఞానానికి సంబంధించినంత వరకు చరిత్రలో ఈ క్షణం ఒక శంఖారావం లాంటిది. నిరంకుశ చట్టాలతో స్వారీ చేయడం, సమాజం ముక్కలుగా చీల్చివేయడాన్ని తారస్థాయికి తీసుకెళుతున్నారు. జనాభాలో 10 శాతం మంది దేశ సంపదలో 64.6 శాతం సంపదను సృష్టిస్తున్నారు. అదే దిగువ భాగంలో ఉంటున్న 50 శాతం మంది ప్రజలు కేవలం 5.9 శాతం సంపదను మాత్రమే సృష్టిస్తున్నారు. ఆర్థిక వృద్ధి ఇంకా సమ్మిశ్రితం కాలేదు. అంటే అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం దీంట్లో ఇంకా సాకారం కాలేదు. ఫలితంగా అసమానతలను ఇది ఇంకా విస్తృతం చేస్తుందన్నమాట. కాబట్టే ఇండియా ప్రాజెక్టును ఇంకా విభిన్న స్థాయికి తీసుకెళ్లడంలో ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది. దేశం శాఖో పశాఖలుగా చీలిపోతే చరిత్రలో అంధకార యుగాలతోనే పోల్చి చూడగలం. ఆర్ఎస్ఎస్ స్వాతంత్య్రానికి పెద్దగా దోహదం చేయ లేదని డి. రాజా చెప్పారు. కానీ ఇప్పుడు అదే ఆరెస్సెస్ స్వాతంత్య్ర సమర వారసత్వాన్నే ప్రమాదంలో పడవేస్తోంది కదా? సామాజిక న్యాయం గురించి ఇంకా విస్తృత స్థాయిలో సంభాషిం చడానికి ఇది తిరిగి మేల్కొల్పవలసిన సమయం. ఇంత పెద్ద రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో దార్శనిక పత్రంలో సామాజిక న్యాయానికి ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేదు. రాజ్యాంగ ప్రవేశిక తొలి భాగమే ఏం చెబుతోందంటే ‘‘...పౌరులందరికీ న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను పదిలపర్చడం...’’ సామా జిక న్యాయం సమానత్వానికి హామీ ఇస్తుంది. తదుపరి 25 సంవత్స రాలు ఆ తర్వాత ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ సమాజంలో సానుకూల మార్పుకు ఉత్ప్రేరకం ఏమిటంటే, సమగ్రవృద్ధికి హామీ పడటమేనని ఇది భారత పౌరులకు తెలుపుతుంది. సామాజిక న్యాయంలో మూలాలు కలిగిన అభివృద్ధికి విజయవంతంగా పునాది వేయడం వల్లనే తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా సాధించిన వృద్ధి సాధ్యమైంది. పెరియార్తో సహా, కామరాజర్, సీఎన్ అన్నాదురై, కలైజ్ఞర్ ఎం. కరుణానిధి వంటి నేతలు ప్రజా స్వామ్య సమ్మిశ్రిత స్వభావానికి ప్రతినిధులుగా ఉంటూ వచ్చారు. ఉదాహరణకు, తమిళనాడులో ప్రభుత్వ వైద్య కళాశాలలను స్థాపించ డానికి కరుణానిధి తీసుకున్న చొరవ ఆనాటికి వెనుకబడివున్న ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పించింది. తక్కువ ఫీజులతో వైద్య విద్య చదవాలనుకున్న ప్రతి ఒక్క పిల్లాడికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ‘నీట్’ ఆ వ్యవస్థను విధ్వంసం చేయడానికి ప్రవేశించింది. మన చరిత్ర శకలం పితృస్వామిక రంగుతో రూపొందింది. దీనివల్లే మార్పులు చోటు చేసుకోవడం కష్టమవుతోంది. ఈ దేశంలో 18 శాతం మంది మహిళలు మాత్రమే నేటికీ వేతన రూపంలోని ఆదాయాలను ఆర్జిస్తున్నారు. ఉద్యోగాల లేమి, నైపుణ్య స్థాయుల విషయంలో... వ్యవస్థ దురభిమానాలు, వేతనం చెల్లించని కుటుంబ విధుల వంటివి మహిళలకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నాయి. 2047 నాటికి మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. 33 శాతం రిజర్వేషన్ అనేది వాస్తవమవుతుందని భావిస్తున్నా. అప్పుడు 50 శాతం వాటా కోసం బలంగా కృషి చేయాలి. ప్రాథమిక స్థాయిలో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వల్ల ఉత్పత్తిలో గణనీయంగా పెరుగుదల నమోదు అవుతోంది. కానీ మీరు లోతుకు వెళ్లే కొద్దీ మరింత ఉత్తమంగా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ ప్రభావం ఆర్థికవ్యవస్థపై గణనీయంగా ఉంటుందని ఆర్థికవేత్తలంటుంటారు. దీని ప్రతిఫలనం ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగిస్తుంది. స్వాతంత్య్రం దాని స్వభావ రీత్యానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇస్తుంది. ఉదాహరణకు, ఒక మతానికి కట్టుబడి ఉండే అవకాశం. తమకు నచ్చిన మతాన్ని ఆచరించేందుకు వ్యక్తులు ఎంపిక చేసుకో వచ్చు. వ్యక్తి స్థాయిలో స్వాతంత్య్రానికి చెందిన నిజమైన అర్థం ఏమి టంటే, అస్తిత్వాలకు అతీతంగా ప్రత్యేకించి మైనారిటీ అస్తిత్వాలకు అతీతంగా హక్కులు, సౌకర్యాలను పంపిణీ చేయడం. 2047 నాటికి, ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ... అంటే సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటి ఎలాంటి తిరోగమన నిబంధనల ద్వారా సవాలు చేయబడకుండానే సామాజిక, రాజకీయ పరిధిలో జీవితాన్ని సాగిస్తుంది. వ్యవస్థలో సహానుభూతి లేకపోవడం వల్ల, మైనారిటీ లను వారికి అర్హమైన గౌరవంతో వ్యవస్థ వ్యవహరించదు. సమా నత్వం, సామాజిక న్యాయం ఉన్న చోటే వారి స్వరాలు వినిపిస్తాయి, వారి సమస్యలు ప్రతిధ్వనిస్తాయి. మన పంథాలో దిద్దుబాటు అవసరం. అప్పుడే మన భవిష్యత్ తరాలు స్వేచ్ఛాయుతమైన, సంపద్వంతమైన సమాజాన్ని చూడగలు గుతాయి. మన రిపబ్లిక్ పౌరులందరినీ కాపాడేలా, శాస్త్రీయ ధృతితో ఈ ప్రయాణంలో తనిఖీకేంద్రాలను అప్రోచ్ అయ్యేలా మనం జాగ్రత్త వహించాలి. చరిత్రను విజేతలే రాస్తారనే ప్రసిద్ధ సూక్తిని నేను గుర్తు చేసుకుంటాను. ఆశావహుల ద్వారా భవిష్యత్తు లిఖితమవుతుందని నా భావన. ఆశావహులకు భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉన్నప్పుడే వారు ఆ పని చేస్తారు. భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం లేకుండా పోయిన అనేకమంది ఆశావహులు ఈరోజు జైల్లో ఉంటున్నారు. నిరంకుశ రాజ్యవ్యవస్థలో ఈ నిరాకరణకు మూలాలు ఉన్నాయి. కానీ సాహస పదాలను రాయడాన్ని, గట్టిగా మాట్లాడటాన్ని, 2047 వరకు మాట్లాడుతుండటాన్ని మనం కొనసాగిస్తుంటాం. దీనికోసం తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయార్ మాటలను మనసులో ఉంచుకోవాలి. దారిద్య్రంలో లేదా బానిసత్వంలో ఏ ఒక్కరూ ఉండకూడదు. కులం పేరుతో దేశంలో ఎవరూ అణిచివేతకు గురికాకూడదు. విద్యా సంపదను ప్రశంసించుదాం. సంతోషంలో మునిగి తేలుదాం. మనం అందరం ఒకటే అనే విధంగా సమానత్వంలో జీవిద్దాం. కనిమొళి కరుణానిధి, డీఎంకే పార్లమెంట్ సభ్యురాలు -
లింగ సమానత్వం: స్కూల్లో ఏం చెబుతున్నారు?!
‘ఆడ–మగ సమానత్వం ఎప్పుడు సాధ్యమౌతుంది?!’ ‘ఇప్పట్లో అయితే కాదు..’ అనేది ప్రపంచంలోని అన్ని సమాజాల్లో బలంగా పాతుకుపోయిన ఒక ఆలోచన. కానీ, సాధనతో అన్నీ సమకూరుతాయనేది మనందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఐక్యరాజ్యసమితి 2030 సంవత్సరానికి గడువును నిర్ణయించింది. లింగ సమానత్వం అనేది ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. శాంతియుత, సంపన్నమైన, స్థిరమైన ప్రపంచానికి అవసరమైన పునాది. లింగ సమానత్వంలో పిల్లల వైఖరిని రూపొందించడంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారు. జెండర్ రోల్స్ పట్ల పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి టీచర్ల శిక్షణ కచ్చితంగా సహాయపడుతుంది. అయితే, ‘అమ్మాయిలా ఏడుస్తున్నావేంటి?’ అని అబ్బాయిలను.. ‘ఏంటా వేషాలు, నువ్వేమైనా అబ్బాయివా?’ అంటూ అమ్మాయిలను.. జెండర్ రోల్ని ప్రధానంగా చూపుతూ ఉపయోగించే భాష వల్ల పిల్లల మైండ్సెట్లలో ‘వివక్ష’ ముద్రించుకుపోతున్నది కూడా వాస్తవం. మహిళల హక్కులను ప్రోత్సహించే సామాజిక మార్పును తీసుకురావడానికి విద్య అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో ఒకటి. టీచర్లు విద్యావ్యవస్థకు మూల స్తంభం కాబట్టి, పాఠశాల స్థాయి నుంచే మార్పుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే, తరగతి గదుల్లో పాత మూస పద్ధతిలో భాషను ఉపయోగించకుండా, ప్రణాళికాబద్ధమైన శిక్షణ ద్వారా టీచర్లు లింగ అసమానతలను తొలగించడానికి కృషి చేయవచ్చు. తమకు తెలియకుండానే.. కొన్ని లింగ అవగాహన చర్చల ఆధారంగా లింగ వివక్షకు దూరంగా అందరూ ఆలోచించాలని ఆశించడం వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలుండవు. పిల్లల బాల్యం నుంచే ఈ విషయాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లింగ మూస పద్ధతులను నివారించడంలో టీచర్లు కీలకపాత్ర పోషిస్తారన్నది తెలిసిందే. నిజానికి టీచర్లు విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పటికీ, వారి సాధారణ బోధనలో తరచూ తమకు తెలియకుండానే జెండర్ లైన్స్ను ఉపయోగిస్తుంటారు. మారుతున్న సమాజ ధోరణులు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లు ‘లింగ’ భాషను మార్చుకోవడం కూడా తప్పనిసరి అని అంగీకరిస్తున్నారు ఉపాధ్యాయులు. ఆ దిశగా తామూ ముందడుగు వేస్తున్నామంటున్నారు. శిక్షణ అవసరం లింగ వివక్షలో టీచర్లు ప్రాథమికాంశాలను లోతుగా తెలుసుకుంటే పిల్లల మెదళ్లలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి శ్రద్ధ వహిస్తారు. తరగతి గదిలో ‘జెండర్’ భాషను వాడకుండా మానవసంబంధాలలోనూ, సామాజిక పరమైన పరివర్తన తీసుకురావడానికి, లింగ వివక్ష తగ్గించడానికి టీచర్లకు నైపుణ్యం అవసరం. లింగ సమానత్వానికి అన్ని స్థాయిలలో, అన్ని దశలలోనూ శిక్షణ అవసరం. మూస పద్ధతులకు స్వస్తి తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే విధమైన బోధన అందించేటప్పుడు ‘జెండర్’ గురించి ప్రస్తావన వస్తే మధ్యలో తటస్థ పదాలను ఉపయోగించడం ముఖ్యం. అంటే, కథనాలలో పాత్రలను ఉదాహరణగా తీసుకుంటున్నప్పుడు గత కాలపు మూస లక్షణాలను ఉపయోగించకూడదు. ఉదాహరణకు: ‘అబ్బాయిలు ధైర్యంగా’, ‘బలంగా ఉన్నారు. ‘అమ్మాయిల్లా ఏడ్వకండి’, ‘అమ్మాయిలు సున్నితమైనవారు,’... ఇలాంటివి. వాటిని వీలైనంతవరకు తొలగించడమే మంచిది. పాఠంలోనూ, సాధనలోనూ అబ్బాయిలు–అమ్మాయిలు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా చదువు ఉండాలి. వీటిని తరగతి గదుల్లోనే కాదు ఇతర నైపుణ్యాలను పెంచే కార్యక్రమాల్లోనూ భాగం చేయచ్చు. అలాగే, కుటుంబ సభ్యుల మాటల్లోనూ, రోజువారీ పనుల్లోనూ ఈ లింగ నిబంధనలు పిల్లల మనస్సుల్లో బలంగా నాటుకుపోతాయి. అందుకని, పాఠశాలలు, కుటుంబాలు పిల్లలను లింగ సమానత్వంవైపు మళ్లించేందుకు కృషి చేయాలి. సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కావల్సిన మార్పును తీసుకు రావాలంటే అన్ని స్థాయిలలో అందరూ కృషి చేయడమే దీనికి సరైన పరిష్కారం. అవగాహన వర్క్షాప్స్ చాలావరకు ఇంటి దగ్గరే వివక్ష ఉంటుంది. చదువు అంటే తరగతి గదిలోనే కాదు ఎన్సిసి వంటి వాటిల్లోనూ అమ్మాయిలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకురావాలి. పిల్లలను వయసుకు తగినట్టు గైడ్ చేయాలని మా టీచర్స్కి చెబుతుంటాం. కానీ, జెండర్ ని దృష్టిలో పెట్టుకొని కాదు. స్కూల్ పరిధులు దాటి కూడా పిల్లల నైపుణ్యాలు ఉండాలి. వివిధ రకాల వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలి. అందుకే.. ఆటలు, ఇంటర్స్కూల్ కాంపిటిషన్స్, ఇతర విద్యార్థులతో కలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. పిల్లలను వేదికల మీద మాట్లాడనివ్వాలి. గెస్ట్ లెక్చరర్స్తో క్లాసులు ఇప్పించాలి. ఇవన్నీ కూడా అమ్మాయిలు–అబ్బాయిలు ఇద్దరూ సమానంగా పాల్గొనేవే. ఇలాంటప్పుడు వారిలోని ప్రతిభనే చూస్తారు తప్ప, వివక్ష అనేదానికి చోటుండదు. దీని వల్ల సమానత్వం అనేది దానికదే వస్తుంది. – సంగీతవర్మ, ప్రిన్సిపల్, రిచ్మండ్ హైస్కూల్, హైదరాబాద్ ఇద్దరూ విద్యార్థులే! ఈ మధ్య కాలంలో స్కూల్లో ఏ కార్యక్రమాల్లో అయినా అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. తరగతిగది వరకే కాకుండా ఇతర ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాం. కాకపోతే, గ్రామీణ స్థాయిలో అమ్మాయిలనే ఎక్కువ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలి. తరగతిలో టీచర్కి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ విద్యార్థులే. – శైలజా కులకర్ణి, టీచర్, జడ్పిహెచ్ఎస్, కల్హర్, సంగారెడ్డి సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పాలి.. ‘నువ్వేమైనా అబ్బాయివా?’ అని అమ్మాయిలను. ‘నువ్వేమైనా అమ్మాయివా?’ అని అబ్బాయిలను మాటలు అనకూడదు. నాకంటే వాళ్లు ఎక్కువ, వీళ్లు తక్కువ అనే ఆలోచన కూడా రాకూడదు. సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పించాలి. ఇద్దరికీ ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్పాలి. ఇద్దరికీ ధైర్యం నేర్పాలి. ఇద్దరికీ చదువు నేర్పాలి. ప్రపంచంలో అందరికీ సమానహక్కులు ఉన్నాయి. అన్నింటా సమానత్వం ఉండాలి. ఎదిగే క్రమంలో పడే ‘మాటలు’ వారి మనసులో బలంగా ముద్రవేస్తాయి. మాటల ద్వారా కూడా ఇద్దరినీ వేరుగా చూడకూడదు. వీరే కాదు ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఎవరినీ చులకన చేయకూడదు. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమెన్ సేఫ్టీ, గర్ల్ సేఫ్టీ అని ఉంటాయి. ఎందుకో కూడా వాటిని వివరించగలగాలి. పీరియడ్స్ సమయంలో సెన్సిటైజ్ విషయంలో ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. అబ్బాయిలకు కూడా ఇలాంటి విషయంలో అవగాహన కలిగించాలి. ఎదిగేక్రమంలో శరీరాకృతులు వేరుగా ఉంటాయి కానీ, మేధోపరంగా ఇద్దరూ ఒకటే. అవగాహన కల్పించడమే ముఖ్యం. – మేఘన ముసునూరి, ప్రిన్సిపల్, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ హైదరాబాద్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మహిళలు, బాలికలపై అన్ని రకాల వివక్ష, హింస, హానికరమైన పద్ధతులను అంతం చేయడం ద్వారా 2030 వరకు లింగసమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎస్డిజి 5. మహిళల పూర్తి భాగస్వామ్యం, రాజకీయ, ఆర్థిక నిర్ణయాధికారం అన్నిస్థాయిలలో నాయకత్వానికి సమాన అవకాశాల కోసం పిలుపునిచ్చింది. 2015లో ఐక్యరాజ్యసమితి చేసిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఇది 5వది. – నిర్మలారెడ్డి -
భారత్లో లింగ సమానత్వానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
జెనీవా: భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా లింగ సమానత్వంలో మాత్రం వెకబడిపోయింది. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 'వార్షిక లింగ అంతర నివేదిక 2022' ప్రకారం భారత్ 135వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగైనా.. ఇంకా అట్టడుగునే కొనసాగుతోంది. ఐలాండ్స్ మరోమారు లింగ సమానత్వంలో తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజీలాండ్, స్వీడన్లు ఉన్నాయి. మరో 132 ఏళ్లు.. మొత్తం 146 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. భారత్ అట్టడుగున 135వ స్థానంలో నిలవటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ కన్నా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్, ఛాడ్ వంటి 11 దేశాలు మాత్రమే వెనబడి ఉన్నాయి. జీవన వ్యయం పెరిగిపోతుంటటం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య అంతరం పెరిగిపోతోందని డబ్ల్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దాని ప్రకారం భారత్లో స్త్రీపురుషులు సమానంగా మారేందుకు మరో 132 ఏళ్లు(2021లోని 136వ ర్యాంకు ప్రకారం) పడుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సైతం లింగ అంతరంలో ఓ తరం వెనక్కు వెళ్లేలా చేసిందని తెలిపింది. గడిచిన 16 ఏళ్లలో భారత ర్యాంకు 7 స్థానాలు ఎగబాకినా.. ఇంకా అట్టుడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూఈఎఫ్.' భారత్లోని సుమారు 662 మిలయన్ల మంది మహిళ జనాభాతో ప్రాంతీయ ర్యాంకులపై ప్రభావం పడుతోంది. 2021తో పోలిస్తే.. ఆర్థిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, అవకాశాల్లో మెరుగైనప్పటికీ.. కార్మిక శక్తిలో మరింత కిందకు పడిపోయింది. శాసనకర్తలు, ఉన్నతాధికారులు, మేనేజర్స్ విభాగాల్లో మహిళలు 14.6 శాతం నుంచి 17.6 శాతానికి చేరుకున్నారు. సాంకేతిక, వృత్తి నిపుణుల్లో మహిళలు 29.2 నుంచి 32.9 శాతానికి చేరారు. వారి ఆదాయం పెరిగింది. అయితే.. మగవారితో పోలిస్తే వారికి అందే గౌరవంలో మాత్రం అంకా వెనకబడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మగవారి కోసం వారిని తిరస్కరిస్తున్నారు.' అని పేర్కొంది నివేదిక. ఆ విభాగంలో ఊరట.. మహిళల రాజకీయ సాధికారతలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. గత యాభై ఏళ్లుగా మహిళలకు రాజకీయాల్లో దక్కుతున్న స్థానం చాలా తక్కువ. దాంతో ఈ ర్యాంకు మరింత పడిపోయినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. మరోవైపు.. ఆరోగ్యం, జీవన విధానంలో భారత్ 146వ స్థానానికి పరిమితమైంది. లింగ అంతరం 5 శాతానికిపైగా ఉన్న ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. భారత్కు ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రాథమిక పాఠశాలల నమోదులో లింగ సమానత్వంలో టాప్లో నిలిచింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
సర్వమానవ సమానత్వానికే..
సాక్షి, హైదరాబాద్: రామానుజాచార్య సర్వ మానవ సమానత్వం కోసం కృషి చేశారని, జాతి, కుల, మత, లింగ వివక్షలు కూడదని బోధించారని అందుకే దీనిని సమతా పండుగ (ఫెస్టివల్ ఆఫ్ ఈక్వాలిటీ)గా పిలుస్తున్నామని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావనను, వసుదైవ కుటుంబం స్ఫూర్తిని అందించేందుకే ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. శంషాబాద్లోని ముంచింతల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సహస్రాబ్ది సమారోహం సంరంభం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాలకు చినజీయర్ స్వామి సారథ్యం వహించారు. తాము తలపెట్టిన మహా యజ్ఞం నుంచి వెలువడే పొగ, పరిమళాల వల్ల మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. ఈ మహా క్రతువులో వేలాది మంది పాల్గొంటుండడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక పారవశ్యంలో భక్తులు తొలుత రామానుజాచార్యుల శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం ప్రపంచంలోనే మున్నెన్నడూ జరగనంత భారీ స్థాయిలో లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 5 వేల మంది రుత్వికులు, 1,035 హోమ కుండాలు, 144 హోమశాలలు, 2 ఇష్టి శాలలు ఈ మహా క్రతువులో భాగం అయ్యాయి. యాగానికి సిద్ధం చేయడంలో భాగంగా భూమి శుద్ధి చేసి విష్వక్సేనుడి పూజ చేశారు. అలాగే హోమద్రవ్యాల శుద్ధి, వాస్తు శాంతిలో భాగంగా వాస్తు పురుషుడిని ప్రతిష్టించి పూజ నిర్వహించారు. యాగశాలల్లో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ, మంత్రరాజంగా పేరొందిన అష్టాక్షరి మహా మంత్రాన్ని పఠిస్తూ, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు పారాయణం చేస్తూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులలో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని నింపారు. అష్టాక్షరి మహామంత్ర జపం 12 రోజుల పాటు నిర్విరామంగా సాగనుంది. ఉత్సవాలు ముగిసే సమయానికి మొత్తంగా కోటిసార్లు జపించాలనే భారీ లక్ష్యాన్ని చేరుకోనుంది. తరలివచ్చిన స్వాములు, విదేశీ భక్తులు, ప్రముఖులు ఈ సమతా పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు, రుతి్వకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అహోబిల జీయర్స్వామి, దేవనాథ జీయర్ స్వామి, రామచంద్ర జీయర్ స్వామి, రంగ రామానుజ జీయర్ స్వామి, అష్టాక్షరి జీయర్ స్వామి, వ్రతధర జీయర్ స్వామి తదితర అతిరథ మహారథులనదగ్గ స్వాములు తరలివచ్చారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వందలాదిగా భక్తులు, 20 మంది రుత్వికులు రావడం విశేషం. యూరప్ నుంచి, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగర యువత సైతం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సెలవు పెట్టి మరీ వాలంటీర్లుగా ఇక్కడ సేవలు అందిస్తుండడం విశేషం. -
Viral: షేర్వాణీ ధరించి పెళ్లి కూతురు గుర్రపు స్వారీ!
పెళ్లి వేడకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంటాయి. సంప్రదాయం ఏదైనా వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వరుడు షేర్వాణీ ధరించి గుర్రం మీద పెళ్లికూతురు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు వస్తాడు. అయితే వరుడు వచ్చినట్లుగానే వధువు.. షేర్వాణీ ధరించి గుర్రం మీద తన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమంలో పాల్గొంటుంది. రాజస్థాన్లోని సికర్ జిల్లాలో రనోలి గ్రామానికి చెందిన వధువు కార్తిక గుర్రంపై వచ్చి.. ప్రీ-వెడ్డింగ్ ‘బండోరి’ వేడుకల్లో అందరినీ దృష్టిని ఆకర్షించింది. తాము జెండర్ ఇక్వాలిటీ పాటిస్తామని కొడుకు అయినా కూతురైనా ఒకేలా చూస్తామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అందుకోసమే కార్తిక వివాహం సందర్భంగా ఇలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆమె వివాహం సోమవారం జరగాల్సి ఉంది. ‘బండోరి’ వేడుక కోసం కార్తిక స్వయంగా షేర్వాణీ తయారు చేయటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘గుర్రంపై వరుడి కంటే వధువు వస్తేనే బాగుంటుంది’.. ‘జెండర్ ఇక్వాలిటీకి ఇది ఓ ముందడుగు’ అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
అదృష్టం సరే అర్హతను కల్పిస్తున్నామా?
ఒక ఆలోచన ఆడపిల్లను చిట్టి తల్లి బంగారు తల్లి అంటాం మనం. అదృష్టం అంటాం మనం. అమ్మాయిది లక్ష్మీ పాదం అని మురిసిపోతాం. తల్లులకు తండ్రులకు సాధారణ స్థాయిలో ఈ మురిపెం ఉంటుంది. అయితే దీనికి ఆవల ఈ అదృష్ట దేవతకు సకల అర్హతలు అందే వీలు కల్పించడం జరుగుతున్నదా? ఆడపిల్ల చేత డబ్బు ఇచ్చి బీరువాలో దాచి పెట్టించే సెంటిమెంటు పాటించే తల్లిదండ్రులు తమ ఆర్థిక, వ్యాపార వారసత్వాలలో ఆమెకు మగ పిల్లలతో పాటు సమాన అవకాశం ఇవ్వొచ్చనే ఆలోచనకు వస్తున్నారా? ఆడపిల్ల కొన్నింటికే యోగ్యురాలు, కొన్నింటికే పరిమితం అనే ఆలోచనా చట్రం ఉన్నంత కాలం ఆమెను అదృష్టానికి చిహ్నమని ఎంత భావించినా అసలైన అదృష్టం ఆమెకు దక్కుతుందా? ఆమె అదృష్టం ఆమెతో అదృష్టం ఆమెకు సమాన అవకాశాలను కల్పించడంలోనే ఉంటుందని ఇటీవలి ఒక చర్చ సూచిస్తోంది. ఇటీవల ట్విట్టర్లో ఒక వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఒక తండ్రి కొత్తగా కొన్న ట్రాక్టర్ మీద తన చిన్న కుమార్తె అదృష్టానికి చిహ్నంగా ఆమె పాదముద్రలను ముద్రించాడు. కుమార్తెకు విలువనిచ్చినందుకు ఆ తండ్రిని చాలా మంది ప్రశంసించారు. ఎందుకంటే మన కుటుంబాల్లోని ఆడపిల్లలను అదృష్టానికి గుర్తుగా చూస్తారు. ఆడపిల్ల పాదం ఇటు పుట్టింటికీ, అటు అత్తగారింటికీ అత్యంత శుభాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఉత్తర భారతదేశంలో ఘరోండా (దీపావళి సందర్భంగా జరుపుకునే పూజ) సమయంలో కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే దేవతలు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. అందులో భాగంగానే ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ఓ తండ్రి పంచుకున్నాడు. ఈ నమ్మకాలు ఆడపిల్ల ఎంత విలువైనదో చెప్పేందుకు పెద్దలు ఏర్పరిచిన సంకేతాలు అనుకోవచ్చు. ఇవి ఆడ శిశుహత్యల రేటుకు విరుద్ధంగా సానుకూల సంకేతాలను ఇస్తాయి. అయితే, రచయిత్రి, నెటిజన్ రుద్రాణి గుప్త ఈ వీడియోపై స్పందిస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు. ఇవీ ఆ ప్రశ్నలు... ‘ఒక తండ్రి తన కుమార్తెను అధికంగా ప్రేమిస్తూండవచ్చు. ఆ తండ్రి మనసును మనం వేనోళ్లగా కొనియాడవచ్చు. అయితే, ఆ తండ్రి ఆమెను తన కుటుంబ వ్యాపారానికి అదృష్టంగా మాత్రమే చూసుకుంటే సరిపోతుందా?! స్త్రీని డబ్బుకు, శ్రేయస్సుకి దేవతగా కొనియాడిన తల్లిదండ్రులు నిజ జీవితంలో ఆమె ఆర్థిక సాధికారతకు మార్గం వేస్తున్నారా? కూతురును లక్ష్మీగా భావించే కుటుంబాలు తమ కుటుంబ వ్యాపారాలలో ఆమెను వారసురాలిగా, యజమానిగా ఉంచాలనే ఆలోచన కలిగి ఉన్నారా?!’ ఇవీ నెటిజన్ రుద్రాణి గుప్త సంధించిన ప్రశ్నలు. వీటితో పాటు తన కుటుంబంలోనే జరిగిన ఓ సంఘటననూ ఆమె పంచుకున్నారు. వ్యాపారానికి వారసురాలు అవగలదా?! ‘‘ఈ వీడియో నా ఇంట్లో జరిగిన ఇలాంటి సంఘటనను ఒకటి గుర్తు చేసింది. నా తండ్రి తన ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటుపై కూర్చోవడానికి నా చెల్లెలికి సహాయం చేశాడు. ఆమె వల్ల వచ్చిన అదృష్టంగా భావించి, ఆమె పుట్టినరోజున ఆ ట్రక్కు కొన్నాడు. ఆ క్షణంలో సరదాగా కొన్ని సెల్ఫీలు తీసుకున్నారు. ఎప్పుడైనా ఆమె ఆ ట్రక్కు లేదా వ్యాపారాన్ని సొంతం చేసుకుంటుందా అనే ఆలోచన నా తండ్రి ఊహల్లో కూడా వస్తుందంటే నేను నమ్మను. ‘ఆమె’ ఎప్పుడైనా వ్యాపారానికి వారసత్వంగా ఉంటుందా? ‘ఆమె’ సంపాదనతో కుటుంబం నడుస్తుందని గర్వంగా చెప్పుకునే స్థితి ఉంటుందా? ఆమె ఆత్మవిశ్వాసంతో కుటుంబ వ్యాపారాన్ని నడుపుతుందా? అంటే మనలో చాలా మంది దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నా చెల్లెలు వివాహం చేసుకుని మరొక కుటుంబానికి పంపబడుతుందనే భావనలో నా కుటుంబం ఇప్పటికే ఉంది. అప్పుడు వ్యాపారాన్ని ఆమెకు అప్పగించే పాయింట్ ఎలా చేరుతుంది? నేను మరింత వాదించడానికి ముందు, ఓ విషయం గమనించాను. నా సోదరుడు అప్పటికే నా తండ్రి రోలింగ్ కుర్చీపై కూర్చోవడానికి వారసుడిగా సిద్ధంగా ఉన్నాడు. (నా చెల్లెలు అత్తింటికి వెళ్లినా అక్కడి వ్యాపారాల్లోనూ ఆమె ఎప్పటికీ కీలకం కాలేదు.. ఎక్కడో అరుదుగా ఎంతో శ్రమ పడితే తప్ప. అది మరో గమనించాల్సిన విషయం) సామర్థ్యం ఎంపిక కూతురికేనా?! వీడియో చూశాక రేపు ఆ కుమార్తె పెద్దయ్యాక, తండ్రి ఆమెను ట్రాక్టర్ నడపడానికి అనుమతిస్తాడా అనే ప్రశ్న దగ్గరే నా ఆలోచన ఆగిపోయింది. ఆమె ఎర్రటి పాదముద్రలతో అలంకరించబడిన ట్రాక్టర్ ఎప్పుడైనా ఆమె సాధికారతకు మాధ్యమంగా మారుతుందా? తల్లితండ్రుల ఆస్తిలో ‘ఆమె’ వాటా ఉంటుందా అని నేను నా తల్లిని అడిగినప్పుడు, ఆమె వెంటనే దానిని ఖండించింది. ఆమె సోదరుడు ఆస్తికి నిజమైన వారసుడని, దానిలో ఆమె వాటా ఐచ్ఛికమని చెప్పింది. చట్ట ప్రకారం కుమార్తె వారసురాలు అయితే, ఆమెలో సామర్థ్యం ఉందా, లేదా అని వేరొకరు ఎందుకు నిర్ణయించాలి? ఒక కొడుకు తన సామర్ధ్యం లేదా ఎంపికతో సంబంధం లేకుండా, అప్పటికే వారసుడిగా భావించబడుతున్నప్పుడు, కుమార్తె వారసురాలిగా తన సమర్థతను ఎందుకు నిరూపించుకోవాలి?! నిరుపేద కూతురు..?! మన కుటుంబాలు కుమార్తెను లక్ష్మిగా వర్ణిస్తాయన్నది కాదనలేని నిజం. కానీ, నిరుపేద కుటుంబాల్లో కూతురు చదువుకోవడానికంటే ముందు పని చేయాల్సి వస్తే ఆ కుటుంబాల్లో లక్ష్మి స్థానం ఏంటి?! కుటుంబానికి సహాయంగా పనిచేసే చాలా మంది మహిళలు, కూలీలు తమ కుమార్తెలను అదే పనిలోకి లాగడం వల్ల వారు ఆ పనుల్లోనే నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఆమె వయస్సు 18 ఏళ్ళకు మించి ఉంటే, కుమార్తె తనకు నచ్చిన విద్య, ఉపాధిని పొందడం కంటే కుటుంబం కోసం సంపాదించాలనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇంటి లక్ష్మి కావడం అంటే ఒక స్త్రీ తన కుటుంబానికి.. ఆ కుటుంబ ఆనందానికి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనీ ఆ పేరుతో ఇంటి గడప లోపలే ఉండిపోవాలి అనేనా సమాజపు ఆలోచన? ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? ప్రియమైన తల్లిదండ్రులారా మీ కుమార్తెలను అదృష్టదేవతగా చూసే బదులు ఆమెను కుటుంబంలో నిజమైన వారసురాలిగా పరిగణించండి. ఆమెను ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగనివ్వండి. దాని కోసం ఆమె చేపట్టే మార్గం కూడా ఆమెకు నచ్చినదిగా ఉండాలి. ఆమెను ఎదగనివ్వండి, ఎన్నుకోనివ్వండి, సంపాదించనీయండి, పాలించనీయండి. అదృష్ట స్వరూపం అని ఓ వైపు అంటూనే మరోవైపు ‘నీకు ఇందులో హక్కు లేదు’, ‘నీవు ఆడ..పిల్లవు’ అని అంతర్లీనంగా హెచ్చరికలు జారీచేయడం ఎందుకు. ద్వంద్వ ప్రమాణాల(డబుల్ స్టాండర్స్)తో కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. ఆడపిల్లను ఆడపిల్లగానైనా ఎదగనివ్వండి.’’ ఇటీవల కోర్టులో నానుతున్న వల్లి అరుణాచలం కేసు విషయమే తీసుకుందాం. తమిళనాడులోని అంబాడి ఇన్వెస్ట్మెంట్ బోర్డ్లో వల్లి అరుణాచలంను నియమించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా మురుగప్ప (ఆమె పుట్టింటివారే) కుటుంబ సభ్యులే అధికంగా ఓటువేశారు. భారత రాజ్యాంగం ప్రకారం కుమార్తెకు తన కుటుంబం ఆస్తి, వ్యాపారాన్ని వారసత్వంగా పొందటానికి సమాన హక్కులు ఉన్నాయి. కానీ, వల్లి అరుణాచలం వంటి ప్రభావవంతమైన, విద్యావంతురాలైన స్త్రీ తన రాజ్యాంగ హక్కులను పొందటానికి సమర్థతను నిరూపించుకోవడానికి సుదీర్ఘ పోరాటం చేయవలసి వస్తే, సాధారణ కుటుంబాలు మరింత శ్రద్ధగా ఉంటాయని ఆశించవచ్చా?! వల్లి అరుణాచలం కొత్తగా కొనుగోలు చేసి ట్రాక్టర్ మీద కుమార్తె పాదముద్రలను ముద్రిస్తున్న తండ్రి – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
దేశానికి ఎంత గర్వకారణం.. అయినా వివక్ష
ఒక కుండలో నీళ్లు ఉన్నాయి. ఇద్దరు ఎండనపడి వచ్చారు. ఒక స్త్రీ.. ఒక పురుషుడు. నడిచొచ్చింది సమాన దూరం. మోసుకొచ్చింది సమాన భారం. పురుషుడికి గ్లాసు నిండా నీళ్లిచ్చి.. స్త్రీకి అరగ్లాసు ఇస్తే ఏమిటర్థం?! ఆమెది నడక కాదనా? ఆమెది బరువు కాదనా? ఆమెసలు మనిషే కాదనా? ఎండ ఈక్వల్ అయినప్పుడు.. కుండా ఈక్వల్ అవాలి కదా! ఇప్పుడు కొంచెం నయం. ఉండండి, 83 శాతం అంటే కొంచెం కాకపోవచ్చు. చాలా నయం. ఎనభై మూడు శాతం క్రీడాంశాలలో స్త్రీ, పురుషులన్న వ్యత్యాసం చూపకుండా ‘ఈక్వల్ పేమెంట్’ ఇస్తున్నారు! బి.బి.సి. రిపోర్ట్ ఇది. బి.బి.సి. మీడియాలో కూడా ఆమధ్య ఒకరిద్దరు పైస్థాయి మహిళా ఉద్యోగులు జాబ్ని వాళ్ల ముఖాన కొట్టేసి బయటికి వచ్చేశారు. జార్జికి వంద పౌండ్లు ఇస్తూ, అదే పనికి ఒలీవియాకు 60 పౌండ్లు ఇస్తుంటే ఎవరైనా అదే పని చేస్తారు. ఇదిగో, ఇలా అడిగేవాళ్ల వల్లనే ఎప్పటికైనా మహిళలకు సమాన ప్రతిఫలం వస్తుంది. ఫురుషులతో సమానంగా. మన దేశంలో ఇలా అడిగినవాళ్లు.. స్పోర్ట్లో.. ఐదుగురు మహిళలు ఉన్నారు. తక్కినవాళ్లూ ‘పేమెంట్లో ఏంటీ పక్షపాతం!’ అని అంటూనే ఉన్నా.. ప్రధానంగా సానియా మీర్జా, దీపికా పల్లికల్, అతిది చౌహన్, అపర్ణా పపొట్, మిథాలీరాజ్ ఎప్పటికప్పుడు ఈ ఎక్కువతక్కువల్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఐపీఎల్నే తీస్కోండి. పురుషులు ఆడేదీ అదే ఆట, స్త్రీలు ఆడేదీ అదే ఆట. వచ్చే క్యాష్ మాత్రం స్త్రీలకు తక్కువ. టెన్నిస్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, స్క్వాష్.. ఏదైనా వీళ్లకు వచ్చేది వాళ్లకు ఇచ్చే దాంట్లో నాలుగింట ఒక వంతు తక్కువే! ‘‘మీకు న్యాయంగా అనిపిస్తోందా.. తక్కువ చేసి ఇవ్వడానికి’’ అని ఉమెన్ ప్లేయర్స్ అడిగితే.. ‘‘స్పాన్సరర్స్ రాకుంటే మేమైనా ఏం చేస్తాం. పురుషులు ఆడితే చూసినంతగా, స్త్రీలు ఆడితే చూడరు. ఉమెన్ ఈవెంట్లకు ఖర్చు తప్ప, లాభం ఎక్కడిది!’’ అని సమాధానం. నిజమే కదా పాపం అనిపించే అబద్ధం ఇది. డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులు ఇవ్వడానికే మనసు రాదు. ∙∙ మార్చిలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. అదీ బి.బి.సి. వాళ్లదే. పురుషులతో సమానంగా మహిళలకూ పారితోషికం, ఇతరత్రా బెనిఫిట్స్ ఇవ్వాలని ఎక్కువమంది ఇండియన్ క్రీడాభిమానులు అంటున్నారట. అంటే వాళ్లు స్పోర్ట్స్ని చూస్తున్నారు కానీ, స్పోర్ట్స్ ఉమన్ అని స్పోర్ట్మన్ అనీ చూడ్డం లేదు. పైగా పద్నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సర్వేలో నాలుగింట మూడొంతుల మంది.. ఆటల్ని ఇష్టపడేవాళ్లే. సినిమాలు, పొలిటికల్ న్యూస్ లేకున్నా బతికేస్తాం కానీ, కళ్లముందు ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లేకుంటే ఆ పూటకు బతికినట్లే ఉండదని కూడా చెప్పారట. వాళ్లకు కోహ్లీ అని, మిథాలీ అని కాదు. క్రికెట్ కావాలి. సెరెనా అనీ, జకోవిచ్ అని కాదు. టెన్నిస్ కావాలి. ‘కోహ్లీనే కావాలి’ అని వాళ్లు అడిగినా మిథాలీకి రెమ్యునరేషన్ తగ్గించడం కరెక్టు కాదు. గెలిచేందుకు పెట్టే ఎఫర్ట్.. ఆ కష్టం.. వాటికి మనీని తగ్గించి ఇవ్వడం క్రీడాకారిణుల ప్రతిభను, తపనను, శ్రమను తక్కువగా చూడటమే. ఈ అసమానత్వాన్ని ప్రశ్నించకుండా రిటైర్ అయిపోతే, తమకు తాము అన్యాయం చేసుకోవడం మాత్రమే కాదు, కొత్తగా వచ్చేవాళ్లకూ అన్యాయం చేసినట్లే. అందుకే క్రీడాకారిణులు గళం విప్పుతున్నారు. తమ స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే విదేశీ క్రీడా క్లబ్బులు, ఆసోసియేషన్లు, ఫెడరేషన్లు, కౌన్సిళ్లు, లీగ్లు, బోర్డులు, కమిటీలు.. ‘ఈక్వల్ పే’ అమలు చెయ్యడానికి అతి కష్టం మీదనైనా ఒళ్లొంచుతున్నాయి. నాలుగేళ్లు నిరసన భారతదేశపు అత్యుత్తమస్థాయి స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్.. ప్రైజ్ మనీలోని అసమానతలకు నిరసనగా 2012 నుంచి 2015 వరకు వరుసగా నాలుగేళ్లు ‘నేషనల్ స్క్వాష్ చాంపియన్ షిప్’ను బాయ్కాట్ చేశారు. ‘స్పోర్ట్స్మ్యాన్ స్పిరిట్ లేదు. డబ్బే ముఖ్యమా!’ అని ఆమెపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన నిర్ణయం మీద తను ఉన్నారు. స్త్రీ పురుషులిద్దరికీ ప్రైజ్ మనీ సమానంగా ఉండేంత వరకు నేషనల్స్ ఆడేది లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఆమె ర్యాంకింగ్ పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండేది! నేటికీ తక్కువే మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు.. దేశానికి ఎంత గర్వకారణం! అయినా వివక్ష ఉంటోంది. స్త్రీ పురుష సమానత్వం, సాధికారత అని ఎంత మాట్లాడుకున్నా మనమింకా పురుష ప్రపంచంలోనే జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది నాకు. మన క్రీడా ప్రతిభ మెరుగైంది కానీ, క్రీడాకారిణులకు ఇచ్చే ప్రైజ్ మనీ పురుషులకు వచ్చే మొత్తం కన్నా తక్కువగానే ఉంటోంది. – సానియా మీర్జా, టెన్నిస్ స్టార్ (నిరుడు ‘ఫిక్కీ’ చర్చా వేదికపై) ఆటతో సాధించొచ్చు ఈక్వల్ పే ఉండాలి. ఈక్వల్ ప్రైజ్ మనీ ఉండాలి. ఆట తీరుతో కూడా వీటిని సాధించవచ్చు. గుడ్ బ్రాండ్ క్రికెట్ ఆడితే మంచి మార్కెటింగ్ జరుగుతుంది. మ్యాచిల వల్ల ఆదాయం వస్తుంది. పురుషుల ఆటల్లో వచ్చే లాభాల్లోంచి మాకేం పంచి పెట్టనక్కర్లేదు. మా విజయాల్లోని షేర్ను తీసుకోడానికే మేము ఇష్టపడతాం. మొత్తానికైతే పారితోషికాల విషయంలో మునుపటి కన్నా కొంత బెటర్ అయ్యాం. – మిథాలీ రాజ్, స్టార్ క్రికెటర్ (ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) నమ్మకంగా చెప్పలేం ఆర్థికంగా కొంచెం మెరుగయినట్లే ఉంది. అయితే ఈక్వల్ ప్లేకి ఈక్వల్ పే ఉందా అని నమ్మకంగా చెప్పగలిగిన పరిస్థితి అయితే లేదు. పురుషులకు సమానంగా స్త్రీలకు ప్రైజ్ మనీ ఇవ్వాలి. – అపర్ణా పొపట్, బాడ్మింటన్ (గత ఏడాది ఎకనమిక్ టైమ్స్ ‘పనాచ్’ రౌండ్ టేబుల్ చర్చలో) పోలికే లేదు ప్రైజ్ మనీలోనే కాదు, అన్నిట్లోనూ మహిళా జట్లు, మహిళా క్రీడాకారులకు వివక్ష ఎదురౌతోంది. పురుషుల ఫుట్బాల్తో మహిళల ఫుట్బాల్ను పోల్చనే లేము. వాళ్ల లీగ్తో మా లీగ్ను పోల్చలేం. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ని (సక్సెస్ అయ్యేందుకు ఉండే అవకాశం) కూడా కంపేర్ చెయ్యలేం. ప్రతి దాంట్లోనూ ఇంతని చెప్పలేనంత అసమానత్వం ఉంది. – అదితి చౌహాన్, ఫుట్బాల్ గోల్ కీపర్ -
మారిపోయేది ధర్మమ్,మారనిది సత్యమ్
స్త్రీ పురుషుడి శాంతికి కారణమవుతుంది. ఆమె పరిమితి, ఆమె ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం. ‘ధర్మము’ అనే మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం ఎప్పుడూ కూడా అవతలి వారిని బట్టి ఉండదు. ధర్మం అంటే వ్యావహారికంలో ఒక దీనుడికి జేబులోనుంచి ఒక రూపాయి ఇస్తే ధర్మం చేసాడు అంటూంటారు... ఇది అది కాదు. ధర్మం అంటే–ఎలా ప్రవర్తించమని పరమేశ్వరుడు వేదంలో చెప్పాడో తెలుసుకుని అలా ప్రవర్తించడానికి ‘ధర్మము’ అని పేరు. అందుకే ఏది ధర్మం? అని చెప్పే సాధికారత ఒక్క వేదానికే ఉంది. వేదం తరువాత అటువంటి అధికారం స్మృతికి ఉంది. తరువాత వరుసగా పురాణం, శిష్టాచారాలు, అంతరాత్మ. ఈ అయిదూ ప్రమాణాలు. ‘ధర్మం ఇది’ – అని చెప్పడానికి ఆరవ ప్రమాణం లేదు. ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు తనకి దేశకాలాల్లో ఏది విధింపబడిందో దాన్ని అవతలివారి ప్రమేయం లేకుండా చేస్తారు. అప్పడు అది ధర్మమవుతుంది. అందుకే ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. కానీ సత్యం మాత్రం మార్పు లేకుండా ఒక్కలాగే ఉంటుంది. మనం సినిమా చూడ్డానికి వెడతాం. ముందు ఒక తెర ఉంటుంది. ఆ తెర మారదు. 50 సంవత్సరాలపాటు ఆ సినిమా హాలు అలాగే ఉన్నా, అందులో ఇప్పటికి ఏడువేల సినిమాలు వేసినా...ఎంతో మంది ఏడ్చిన వాళ్ళున్నారు, నవ్వినవాళ్ళు ఉన్నారు...పరమానందంతో వెళ్ళిపోయిన వాళ్ళున్నారు... కథలు మారాయి, పాత్రలు మారాయి, బుద్ధులు మారాయి...కానీ తెర మాత్రం అలాగే ఉంది. సత్యమూ అంతే. సత్యం మారదు. మారని దానిని సత్యము అంటారు. మారిపోయే దానిని ధర్మం అంటారు. మారిపోయే ధర్మాన్ని శాస్త్ర విహితంగా ఎవడు పట్టుకున్నాడో వాడు మారని సత్యంగా మారిపోతాడు. అదే మోక్షం.ధర్మం దేశ, కాల, వర్ణ, ఆశ్రమాలనే నాలుగింటినిబట్టి మారిపోతూ ఉంటుంది. ఒక దేశంలో(ప్రాంతంలో అని) ఉన్న ధర్మం మరొక దేశంలో ఉండదు. నేనింట్లో ఎంత పూజ చేస్తానో దానిలో పదోవంతు నేను పై ఊరు వచ్చినప్పుడు కూర్చుని చేస్తే చాలు. ఏకాదశినాడు ఉపవాసం ధర్మం, ద్వాదశినాడు తినడం ధర్మం. దేశాన్నిబట్టి, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. అలాగే వర్ణం కూడా. యజ్ఞోపవీతం ఉన్నవాడికి సంధ్యావందనం ధర్మం. అదిలేనంతమాత్రం చేత తక్కువ వారు కాదు. సూర్యనమస్కారం చేసి సూర్యస్తుతి చదివితే చాలు, వారికది ధర్మం. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారికి చదువుమీద దృష్టి పెట్టడం ధర్మం. ఆయనకు ఉపవాసం లేదు. గృహస్థు భార్యతో సహజీవనం చేస్తాడు. భవిష్యత్ అవసరాలకోసం ఇల్లు కట్టుకుంటాడు. ఆయనకా అధికారం ఉంది. వానప్రస్థు భార్యను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళి ఒక కుటీరం కట్టుకుని ఎప్పుడూ తనలో తాను ఆత్మవిచారం చేస్తుంటాడు. పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుని చేరడానికి ప్రయత్నిస్తాడు. చిట్టచివరిదయిన తురీయాశ్రమంలో ఇక దేనితో సంబంధం ఉండదు. కాబట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారిలా గృహస్థు బతక కూడదు. గృహస్థులా వానప్రస్థు బతకకూడదు. ఒకరిలా మరొకరు బతకరు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది మారిపోతున్న ధర్మాన్ని పట్టుకునేటప్పుడు అవతలివాడి వలన ఇవతలివాడి ధర్మం మారదు. -
సమానత్వానికి ఆమడ దూరంలో!
కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుంటారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలూ పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్లో దొరుకుతుందని వెతుకుతున్నాం. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. 21వ శతాబ్దిలోనూ భారత్లో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. నా బాల్యంలోనూ, ప్రస్తుతం కూడా మా గ్రామంలో ఓ సాధారణ ప్రక్రియ జరుగుతూ వస్తోంది. ప్రతి వృత్తినీ ఒక్కో సామాజిక బృందం మాత్రమే నిర్వహిస్తూంటుంది. ప్రతి కమ్యూనిటీకీ ఒక్కో పేరు ఉంటుంది. పొలాలను దున్నడం, గొర్రెలు కాయడం లేదా పశువుల పెంపకం, చేపలుపట్టడం, కల్లుగీత, కుండల తయారీ, బట్టలు ఉతకడం, నేతపని, క్షురక వృత్తి, చెప్పుల తయారీ, జంతువులు లేక మనుషుల మృతదేహాలకు అంతిమసంస్కారం నిర్వహించడం వంటి ఒక్కో పనిని ఒక్కో కులం ప్రత్యేకంగా చేసేది. గ్రామంలో ఏదైనా వృత్తి చేతులు మారుతూ ఉంటుందంటే అది పొలం దున్నడం మాత్రమే. ఇతర వృత్తులన్నీ వేర్వేరు కులాల చేతుల్లోనే ఉంటాయి. నా బాల్యంలో అన్ని కులాలూ కలిసి భోజనం చేసే పద్ధతి ఉండేది కాదు. ఇప్పుడు అన్ని కులాలు కలిసి భోంచేయడం సాధ్యపడుతోంది కానీ, కులాంతర వివాహం ఇప్పటికీ కష్టసాధ్యమే. మార్పు ఏదైనా జరిగిందంటే అది పైపైన మాత్రమే జరుగుతోంది తప్ప వ్యవస్థాగతంగా కాదు. అంతరాల పరమైన అసమానత్వం ఇప్పటికీ అలాగే ఉంది. బ్రాహ్మణ, వైశ్య కులాలు ఇప్పటికీ ప్రత్యేకంగా ఉంటూ మిగతా కులాలకంటే అగ్రస్థానంలో ఉంటున్నాయి. కులపరమైన సమానత్వం గ్రామంలోనూ లేదు. నగరంలోనూ లేదు. 72 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ప్రజాజీవితంలో సమానత్వం లేనేలేదు. 20వ శతాబ్ది మధ్య నుంచి, 21వ శతాబ్ది ప్రారంభం వరకు భారతదేశంలో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. స్త్రీపురుషులతో సహా మనుషులందరినీ సమానంగా సృష్టించాడని చెబుతున్న దేవుడు నేటికీ మా సామాజిక చట్రంలోకి ప్రవేశించలేకున్నాడు. ప్రతి గ్రామంలోనూ పశువుల, మనుషుల మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించే వారిని అంటరానివారిగా గుర్తిస్తుం టారు. ఇక రజకులు, క్షురకులను కూడా హీనంగా చూస్తుంటారు. దాదాపుగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఉత్తరాదిన ఇది కఠినంగా అమలవుతుంటే దక్షిణాదిలో కాస్త తక్కువ స్థాయిలో అమలవుతోంది. ఆర్ఎస్ఎస్/బీజేపీ ఉత్తరాదిన బలంగానూ, దక్షిణాదిలో బలహీనంగానూ ఉండటానికి ఇదే కారణం. గ్రామాల్లో ఉమ్మడి పాఠశాలల వ్యవస్థ ఉనికిలోకి రాకముందు చారిత్రకంగా చూస్తే, అన్ని వృత్తులను ఐక్యం చేసేది ఒక్క ఆలయం మాత్రమే. దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడన్న భావంతో గ్రామంలోని ఆలయం అన్ని కులవృత్తుల వారికి ఉమ్మడి స్థలంగా ఉండేది. భారతీయ గ్రామాలు చాలా విభిన్నమైనటువంటివి. ఆలయ పూజారి వారికి ఏం చెబుతాడన్నది ఊహించుకోండి మరి. మీ వృత్తిపరంగా ఉండే మీ విధులను నిర్వహించండి, అన్ని వృత్తులూ మన మనుగడ కోసం అవసరమైనట్టివే, మీరూ మీ వృత్తిపరమైన విధులూ దేవుడి రా>జ్యంలో సమానమైనవే. కానీ దీనికి భిన్నంగా గ్రామీణ పూజారి గ్రామస్థులకు ఏం చెబుతూ వచ్చాడో తెలుసా? అసమానత్వాన్ని, అంటరానితనాన్ని పాటించడం మీ పవిత్ర ధర్మం. ఎందుకంటే దేవుడు లేక దేవుళ్లు మిమ్మల్ని అసమానంగానే సృష్టించారు అనే. దేవుడి ప్రతినిధిగా భావించే వ్యక్తే గ్రామీణులకు ఇలా చెబుతూ వస్తే దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక సమానత్వం ఎలా వస్తుంది? ఉమ్మడి బోధనా స్థలంగా పాఠశాల గ్రామాల్లో ప్రవేశించడానికి ముందు ఆలయం ఒక ఉమ్మడి సామాజిక స్థలంగా ఉండాలి. గ్రామ దేవాలయానికి సమానత్వమే సూత్రమైతే, ఆ సమానత్వం గ్రామీణ జీవితంలో భాగమై ఉండాలి. అన్ని కులవృత్తుల ప్రజలూ పక్కపక్కనే కూర్చుని ఆహారాన్ని ఆరగించాలని గ్రామ దేవాలయం మొదటినుంచి ప్రబోధించి ఉంటే, గ్రామాల్లో అసమానత్వం అసలు ఉండేది కాదు. కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుం టారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలతో పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. అలాంటి వాతావరణంలో ఆర్టికల్ 15 వంటి సినిమా ఏదీ మనకు అవసరమై ఉండేది కాదు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్లో దొరుకుతుందని వెతుకుతున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఆలయం గురించి పేర్కొనలేదు. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. మన వివాహ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి అర్చక కులం సిద్ధపడనంతవరకు కులాంతర వివాహాలు మన దేశంలో విజయవంతం కావు. అర్చకత్వం అనేది కుల వృత్తిగా కాకుండా వ్యక్తులు చేసే వృత్తిగా మారనంతవరకు మన వివాహ వ్యవస్థ మారదు. కుల సంబంధాలు మారవు. అప్పుడు మాత్రమే శ్రమను గౌరవించడం మన కుటుంబ సంస్కృతిలో సాధ్యపడుతుంది. ఈ ప్రాథమిక అంశాలను మనం సాధించి ఉంటే, ఇస్లామిక్ మసీదు మన గడ్డపైకి అడుగుపెట్టగలిగేదే కాదు. అలాగే క్రిస్టియన్ చర్చి కూడా భారతదేశంలోకి వచ్చేది కాదు. ముస్లిం ఆక్రమణదారులు కానీ, క్రిస్టియన్ వలసపాలకులు కానీ వచ్చి ఉన్నా, వారు భారత్లో ఇంతటి విజయాలు సాధించి ఉండేవారు కాదు. మరోమాటలో చెప్పాలంటే, ఆధునిక కాలంలో మన సమాజాలన్నింటిలోనూ మానవ సమానత్వానికి ఆధ్యాత్మికపరమైన ప్రజాస్వామ్య వ్యవస్థే నిజమైన పునాదిగా ఉంటోంది. మన దేశంలో అలాంటి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని బ్రాహ్మణ పండితులే ప్రతిపాదించి ఉండాలి. ఆధ్యాత్మిక సమానత్వ సూత్రాన్ని దేవుడు ప్రసాదించిన సూత్రంగా ఆలయం ఆచరించి ఉంటే మన దేశం మరో విభిన్న దశలో సాగి ఉండేది. సాధారణంగా మన కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రాజకీయ సమానత్వం పట్లే చర్చలు సాగుతుంటాయి. కానీ గ్రామ స్థాయినుంచి మానవ సంబంధాలన్నింటినీ ఆధ్యాత్మిక సమాజమే పూర్తిగా నియంత్రిస్తున్నప్పుడు మన పౌర సమాజ పొరల్లోకి రాజకీయ సమానత్వాన్ని తీసుకురావడం ఎలా సాధ్యం? మానవ సమానతా సమాజాన్ని నిర్మించాలంటే ఇక్కడే ఆలయం, చర్చి, మసీదు కీలకపాత్ర పోషించాల్సి ఉంది. పరిశుద్ధమైన శాకాహార తత్వమే జాతీయ ఆహా రంగా హిందుత్వ శక్తులు చాలాకాలంగా పేర్కొంటూ వస్తున్నాయి. వీరి అభిప్రాయం ప్రకారం మాంసాహారులు ఎవ్వరు భారతీయులు కారు. అందుకే ఇప్పుడు శాకాహారులైన బ్రాహ్మణులు, వైశ్యులు, ఆరెస్సెస్ కంటే శూద్ర, దళిత, ఆదివాసీ మాంసాహారులను తక్కువజాతికింద పరిగణిస్తున్నారు. ఇప్పుడు అసమానత్వాన్ని నిర్మూలించడానికి బదులుగా అసమానత్వాన్ని పెంచి పోషించే అత్యంత శక్తివంతమైన నూతన శాకాహార కులంగా ఆరెస్సెస్ అవతరించింది. జాతీయవాదాన్ని ప్రజల ఆహార ఆర్థికవ్యవస్థకు అనుసంధానించడం తగదంటూ.. ఆరెస్సెస్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఏ శూద్రకులానికి చెందిన కార్యకర్త కూడా నొక్కి చెప్పలేరు. ఎందుకంటే రుగ్వేద కాలం నుంచి శూద్రులను బౌద్ధికంగా తక్కువస్థాయి కలిగినవారిగా గుర్తిస్తూ వస్తున్నారు. శాకాహారమే తమ ఆహారంగా ఉండినట్లయితే 5 వేల సంవత్సరాల క్రితమే హరప్పా వాసులు మన గొప్ప నాగరికతను నిర్మించి ఉండేవారు కాదని ఆరెస్సెస్కు అర్థం కావడం లేదు. వెయ్యి సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో శాకాహార ఉత్పత్తి జరిగి ఉండలేదు. ఆహారంతో సహా అన్ని రంగాల్లోనూ సమానత్వాన్ని రద్దు చేసిపడేశారు. హిందూ కుల అంతరాల వ్యవస్థకే కాదు. భారతీయ ఇస్లాం, భారతీయ క్రిస్టియానిటీకి కూడా ఇది పెద్ద సమస్యగానే ఉంటోంది. మన గ్రామాల్లో నేటికీ గుణాత్మకమైన మార్పు జరగలేదు. ఆలయం అదే కులధర్మంతో నడుస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న యువతీయువకులను చంపేయడాన్ని, గర్భగుడిలోకి ప్రవేశించిన దళితులపై దాడి చేయడాన్ని అది ఆమోదిస్తోంది. హిందూ దేవుళ్ల కంటే ఓటుహక్కే దళితులను కాపాడుతోంది. పూజారి వైఖరి మాత్రం కులధర్మాన్ని ఆచరిస్తూనే సాగుతోంది. ఇదే అన్ని అసమానతలకు తల్లివంటిది. మనం ఆలయాన్ని మార్చలేనట్లయితే, ప్రతి పాఠశాలలో ఉదయం ఇలా ప్రార్థన చేయవలసిందిగా మన విద్యార్థులను కోరదాం. ఆలయ దేవుడు సమానత్వం తేనట్లయితే, పాఠశాల దేవుడు దేశంలో సమానత్వాన్ని తెచ్చేలా చేద్దాం. దేవుడా మమ్మల్ని సమానులుగా సృష్టించావు దేవుడా స్త్రీపురుషులను సమానులుగా సృష్టించావు దేవుడా మాలో కులాలు లేకుండా సృష్టించావు దేవుడా మామధ్య అంటరానితనం లేకుండా చేశావు దేవుడా పనిచేసి జీవించమని మా అందరికీ చెప్పావు దేవుడా మా తల్లిదండ్రులను గౌరవించమని చెప్పావు దేవుడా గర్విస్తున్న భారతీయులుగా మేం నిన్ను ప్రార్థిస్తున్నాం దేవుడా భారతీయులందరినీ సమానులుగా సృష్టించావు వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
అధికారం అందరిదీ...
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని మరోసారి రుజువైంది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని కొత్త అర్థాన్నిచ్చిన వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే దిశగా అడుగులు వేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం విడుదల చేశారు. సీట్ల కేటాయింపులో బీద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 అసెంబ్లీ సీట్లలో 41 సీట్లు బీసీలకు కట్టబెట్టి తాను వారి పక్షపాతినని రుజువు చేసుకున్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బీసీ, మహిళలకు సముచిత స్థానం కల్పించారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మూడు సీట్లను బీసీలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం, రేపల్లె నుంచి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, చిలకలూరిపేట నుంచి రజక సామాజికవర్గానికి చెందిన విడదల రజని బరిలో నిలుస్తున్నారు. మహిళలకు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులో సముచిత స్థానం ఇచ్చింది. మహిళలకు మూడు సీట్లు కేటాయించగా, ఆ మూడు ఎస్సీ, బీసీ మహిళలకు ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లోనూ ముగ్గురు మహిళలకు సిట్లు ఇచ్చింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వైఎస్ జగన్కు ఉన్న గౌరవానికి నిదర్శనమని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు. ఒక్క సీటూ కేటాయించని టీడీపీ.. ‘ఆడది ఇంట్లో ఉండాలి.. కారు షెడ్లో ఉండాలి’.. అంటూ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్, ‘కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అంటూ సీఎం చంద్రబాబు మహిళను కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపులో కూడా టీడీపీ మహిళలపై వివక్ష చూపింది. జిల్లాలో ఇటీవల 14 సీట్లు కేటాయించిన సీఎం ఒక్క సీటు కూడా మహిళలకు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో సైతం వారికి మొండిచేయి చూపారని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. బీసీ సీటును లాక్కున్న లోకేష్.. ‘మాదీ బీసీల పార్టీ’అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సీట్ల కేటాయింపులో బీసీల తీరని ద్రోహం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ 14 సీట్లు కేటాయించగా ఒక్క సీటు మాత్రమే చంద్రబాబు బీసీకి కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గంలో గత ఏడాది బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవి టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఈ సారి ఆ సీటును చంద్రబాబు తన తనయుడు లోకేశ్కు కేటాయించి ద్రోహం చేయడంతో బీసీలు మండిపడుతున్నారు. మమ్మల్ని గుర్తించిన నేత జగన్ బీసీ కులాల్లో అట్టడుగు స్థానంలో ఉన్న వడ్డెర సామాజికవర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. మా సామాజికవర్గానికి చెందిన చంద్రగిరి ఏసురత్నానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించి రాజకీయ గుర్తింపునిచ్చారు. వడ్డెర మహిళను గుంటూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎంపిక చేశారు. – వేముల శివ, వడ్డెర సంక్షేమసంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళలంటే అంత అలుసా.. మహిళలంటే టీడీపీ ప్రభుత్వానికి అంత అలుసా. ఒక్క సీటూ కేటాయించలేదు. వివక్ష చూపుతూ మాది సామాజిక న్యాయం పాటించే పార్టీ అని ఎలా ప్రచారం చేసుకుంటారు. బీసీలు, మహిళలలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి, పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టీడీపీకి బుద్ధి చెబుతాం. – బత్తుల మృదుల, మహిళ, బ్రాహ్మణపల్లి -
అసమానత్వంపై పోరే అసలు విముక్తి
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినో త్సవం జరుపుకుంటున్న సందర్భంలో మనం ఉన్నాం. గతం కంటే మహిళలకు మహిళా దినం జరుపుకోవాలనే స్పృహ పెరిగింది. దీనితోపాటు మార్చి 8 స్ఫూర్తిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా గత 15 సంవత్సరాలుగా సాగుతున్నాయనేది మరో వాస్తవం. ‘హ్యాపీ ఉమెన్స్ డే’ అంటూ వారం రోజుల ముందు నుండే బహుళజాతి కంపెనీలు టీవీ లలో ప్రకటనలు గుప్పిస్తుంటారు. 170 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను చూస్తే... మానవ హక్కులు మహిళల హక్కులుగా పరిణామం చెందని రోజులవి. 1848లో అమెరికా బట్టల ఫ్యాక్టరీల్లో కార్మిక మహి ళలు 10 గంటల పని దినం, సమాన పనికి సమాన వేతనం, మెరుగైన పని పరిస్థితుల కోసం గడ్డకట్టిన చలిలో ర్యాలీలు, సమ్మెలు, వాకౌట్లు చివరికి ప్రాణ త్యాగాలు కూడా చేసి చరిత్రలో నిలిచిపోయారు. మహిళా ట్రేడ్ యానియన్లను ఏర్పాటు చేసుకు న్నారు. కార్మిక మహిళల పోరాటాలతో మహిళల ఓటు హక్కు ఉద్యమం కూడా జత కలిసింది. నాటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల డిమాండ్లతో మహిళలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి లైంగిక వేధిం పులకు వ్యతిరేకంగా సమాన వేతనం కోసం జరిగిన ‘మీటూ’ ఉద్యమం పెద్దదిగా చెప్పుకోవచ్చు. చేదునిజం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా దేశ పార్లమెంట్లలో మహిళల వాటా నేటికీ 22 శాతం మాత్రమే, భూమిపై హక్కులు 20 శాతంకన్నా తక్కువ కాని మహిళా కూలీలు మాత్రం 43 శాతంగా ఉంటూ సమానత్వానికి సుదూర స్థాయిలో ఉన్నారు. ఇక భారత్ మహిళల పరిస్థితి నాలుగేళ్లలో ప్రమాద కర స్థాయికి చేరిందని రాయిటర్ సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. రాజకీయ రంగంలో మహిళల పరి స్థితి 188లో భారత్ 147వ స్థానంలో ఉందంటే మోదీ ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేద నేది ఒక వాస్తవం. హిందూత్వ సంస్కృతి, సంప్రదా యాల గురించి మాట్లాడుతున్న బీజేపీ దృష్టిలో స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉంటూ ఇంటికి, పిల్లలకి, భర్తకు సేవ చేస్తూ ఉండాలి. అమ్మాయిలపై అత్యాచారాలు జరగడానికి వారు వేసుకునే జీన్స్ పాంట్లు, టీషర్టులే కారణమని వాదిస్తున్నారు. కశ్మీర్ కథువా బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న మైన ర్లపై అత్యాచారాల్లో రాజకీయ నాయకులే భాగమై నారు. ఎప్పటిలాగే చట్టం వారిని రక్షిస్తున్నది. పైగా చట్టసభల్లో మైనర్లపై అత్యాచారం జరిపితే ఉరిశిక్షలు అమలు చేస్తామని చట్టాలను రూపొందిస్తున్నారు. మనువాద బ్రాహ్మణీయ హిందూత్వ సంస్కృతి అమ లులో ఉన్నంత కాలం మహిళలపై హింస ఆగదు. ఈ ప్రభుత్వాలే మరోవైపు ఆధునిక జీన్స్ మార్కెట్కు పేరున్న డెనిమ్ లాంటి బహుళజాతి కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందాల పోటీలను గల్లీనుండి మహానగరాల వరకు ఆహ్వానం పలుకుతున్నారు. అందాల పోటీలను గల్లీనుంచి మహానగరాల వరకు అనుమతులివ్వడంతో సెక్స్ వ్యాపారం, ట్రాఫికింగ్, టూరిజం, సినిమాలలో విదేశీ పెట్టుబడులు, ఇంటర్నెట్, సెల్ఫోన్, కాస్మో టిక్స్ మార్కెట్ యథేచ్చగా నడుస్తున్నాయి. చట్టాల ద్వారా శిక్షపడేది చాలా తక్కువ. అది కూడా పేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు మాత్రమే. కోర్టుల చుట్టూ తిరగలేక బాధితులు కోర్టులపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. 2014 మేనిఫెస్టోలో మహిళలు జాతి నిర్మాతలు అన్న మోదీ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తేవడంవలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 80 శాతం మహిళలు గ్రామ పరిపాలనకు దూరమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఊసే లేదు. నేటి పాలకులకు దళిత మహిళలు మనుషులే కాదు. ఇన్ని అరాచకాలు మహిళలపై జరు గుతున్నా, పీడిత మహిళలవైపు నిలిచినా, పాలకు లను ప్రశ్నించినా మహిళా నాయకులను దేశ వ్యాప్తంగా ఉపా చట్టంతో నెలల తరబడి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. వీళ్లను అర్బన్ నక్సలైట్లుగా పత్రి కలలో తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేస్తారు. ఇక రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల్లో, కుటుంబ హింసలో ముందే ఉండి శిక్షలు కూడా తక్కువ శాతం పడుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుల దురహంకార హత్యలు విపరీతంగా పెరిగాయి. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలోనే మాదిగ కులానికి చెందిన సుశ్రూత కొడుకు దేవర్శల దారుణ హత్య, సజీవ దహనం, ప్రణయ్ హత్య, అమృతపై వేధింపులు మహిళలకు ముప్పును కలిగిస్తున్నాయి. మహిళల చైతన్యం, వ్యక్తిత్వం, ఆమెపట్ల దాడులకు పురికొల్పుతున్నాయి.. అదేసమయంలో పురుషుడి ఆధిపత్యం, స్త్రీ అంటే విలాస వస్తువని, సొంత ఆస్తి అనే భావజాలం మరింత పెరుగుతున్నది. స్త్రీ పురు షుల మధ్య అంతరాలు పాలకుల విధానాలవల్ల మరింత పెరుగుతున్నాయి. స్త్రీలు పురుషుల బాని సలు కాదని పితృస్వామ్య సంకెళ్లను తెంపుకుని అంత ర్జాతీయ మహిళాదినంను ప్రతిపాదించిన క్లారాజె ట్కిన్ సూచించిన స్త్రీ విముక్తి మార్గమే నేడు కూడా శాస్త్రీయమైనది. సవ్యమైనది. (నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం) వ్యాసకర్త: అనిత, రాష్ట్ర అధ్యక్షురాలు, చైతన్య మహిళా సంఘం anithacms@gmail.com -
మాట వింటే దేవత.. మీటూ అంటే దెయ్యం
ఒక స్త్రీ.. పితృస్వామ్య సమాజం రూపొందించిన చట్రంలో ఇమిడిపోతే ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమెను ఇంటికి దీపం అంటారు. అదే స్త్రీ తనకు తాను స్వతంత్ర అభిప్రాయాలతో, వ్యక్తిత్వంతో రాణిస్తుంటే దెయ్యం అనేస్తారు. మగ ఉద్యోగులు లేడీ బాస్లను భరించలేకపోవడానికి కారణం కూడా ఈ భావజాలమేనా? ‘ఎస్’ అంటున్నారు సుధా మీనన్. ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే అంశం మీద గత నెలలో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ఒక చర్చాగోష్ఠి జరిగింది. మహిళలు ఎన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారో తలుచుకుంటూ స్ఫూర్తిదాయకంగా సాగుతోంది చర్చ. ప్రపంచంలో స్త్రీ– పురుషుల మధ్య సమానత్వం అనేది ఎక్కడా ఆచరణలో లేదని, అవకాశాల్లో అది ప్రతిబింబిస్తూనే ఉంటుందని, అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగడంలో మహిళలు ఎక్కడా వెనుకడుగు వేయకపోవడం వల్లనే ఈ లక్ష్యాలు సాధ్యమయ్యాయని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుధా మీనన్ వంటి రచయితలు తమ అనుభవాలను పంచుకున్నారు కూడా. ఇదే సభలో ఒక వ్యక్తి లేచి ‘ఒక వైపు ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది. మరోవైపు ‘ఉమెన్ ఆన్ టాప్’ అని చర్చా వేదికలూ మీరే నిర్వహిస్తారు. దీనిని ద్వంద్వ వైఖరిగా చూడవచ్చా?’ అనే ప్రశ్న లేవనెత్తాడు. దీని మీద హక్కుల కార్యకర్త వసంత కన్నభిరాన్ స్పందిస్తూ ‘‘అది ద్వంద్వ వైఖరి కాదు, అవి రెండూ రెండు వేర్వేరు కోణాలు మాత్రమే’’ అన్నారు. ‘‘మీటూ ఉద్యమం పట్ల మగవాళ్ల అసహనం ఇలా బయటపడుతోందంతే. మగ సమాజం నుంచి ఎదురవుతున్న సవాళ్లకు బెంబేలు పడి వెనక్కిపోయే మహిళలకు ధైర్యం చెప్పడానికి ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే అంశం మీద చర్చ చాలా అవసరం’’ అన్నారామె. ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు ‘ఉమెన్ ఆన్ టాప్’ చర్చలో భాగంగా సుధా మీనన్.. మహిళలకు ఎదురయ్యే అనేక సామాజిక పరిమితులను ప్రస్తావించారు. వాటన్నింటినీ అధిగమించి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, దానిని నిలబెట్టుకోవడంలో మహిళలకు తానే చక్కటి నిదర్శనమని కూడా చెప్పారామె. ‘‘చిన్నప్పుడు నేను చాలా ముభావంగా ఉండేదాన్ని. నా భావాన్ని బయటకు చెప్పడం వచ్చేది కాదు. బాల్యం అంతా బిడియంతోనే గడిచింది. మాట్లాడేటప్పుడు ఎదుటి వారి కళ్లలోకి చూడడానికి కూడా భయపడేదాన్ని. అమ్మ ఎప్పుడూ ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు’ అని చెప్తుండేది. ఎందుకు? ఏమిటి? అని తెలియకపోయినప్పటికీ ఆమె మాటను పాటించడం ఒక్కటే నేను చేసింది. చదవడం వల్ల నాకు నా భావాలను వ్యక్తం చేయడానికి రచన అనే వేదిక దొరికింది. నేను రాసిన ఐదు రచనలకూ సమాజంలో స్త్రీనే ఇతివృత్తం. ఏదీ ఫిక్షన్ కాదు. ప్రతిదీ వాస్తవిక సంఘటనల ఆధారంగా మలిచిన కథనాలే. దశాబ్దాలు దాటినా ఆ రచనలు ఇప్పటికీ కాలదోషానికి గురికాలేదంటే... మన సమాజంలో మహిళ పట్ల మగవాళ్లు చూపిస్తున్న వివక్ష అలాగే ఉందని అర్థం. ఇప్పటికీ ఆడపిల్లలు తమ భావాలను మనసులో దాచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప వ్యక్తం చేయడానికి సాహసించడం లేదు. ఎందుకంటే సమాజం ఒక లేబిల్ వేస్తుంది. ఆ లేబిల్ని భరిస్తూ జీవించాల్సి వస్తుందనే భయం. చెప్పినట్లు వింటే దేవత. వినకుంటే దెయ్యం. ‘దేవి, దివా ఆర్ షీ డెవిల్’లో అదే రాశాను’’ అని తెలిపారు సుధా మీనన్. సర్దుబాట్లు మహిళకే! ‘‘ఒక మగవాడు కెరీర్లో బిజీ అయితే ఆ ఇంట్లో అందరూ అతడికి సహకరిస్తారు. బంధువుల ఫంక్షన్లకు అతడు హాజరుకాలేకపోతే భార్య, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ‘అతడి తీరికలేనితనాన్ని’ ఇంట్లో వాళ్లతోపాటు బంధువులు కూడా గౌరవిస్తారు. అదే ఒక మహిళ తన ఆఫీస్లో బాధ్యతల కారణంగా ‘ఫలానా ఫంక్షన్కి నేను రాలేను, మీరు వెళ్లండి’ అంటే ఇంటి నుంచే వ్యతిరేకత మొదలవుతుంది. ‘ఎలాగోలా సర్దుబాటు చేసుకుని రావాలి’ అని ఒత్తిడి చేస్తారు. ఈ పరిస్థితి చూస్తూ పెరిగిన ఆ ఇంటి ఆడపిల్లలు తమ ఇష్టాలను, అభిప్రాయాలను గొంతులోనే నొక్కేసుకుంటున్నారు. ఆడపిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాతావరణం కల్పించలేని ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి తనకేం కావాలో సమాజంలో మాత్రం నోరు ఎలా తెరవగలుగుతుంది’’ అని ప్రశ్నించారు సుధ. ‘సమాజంలో అవరోధాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని నిలబడిన వాళ్లే టాప్లో నిలవగలుగుతారు. టాప్లో నిలవడానికి చేస్తున్న ప్రయత్నంలో లోపం ఉండరాదు’ అన్నారామె. అదే సందర్భంలో వ్యక్తం అయిన ‘మీటూ ఉద్యమం – ఉమెన్ ఆన్ టాప్’ అంశాల పట్ల విశ్లేషణాత్మక వాదన కొనసాగింది. అంతిమంగా... ‘మీటూ అంటూ ఉద్యమించాల్సిన పరిస్థితులు సమాజంలో అడుగడుగునా ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని పెద్ద స్థానాలను అధిరోహించిన మహిళలను గుర్తు చేసుకోవడం ఎప్పుడూ అవసరమే. ఇప్పుడు మరింత అవసరం. ఎందుకంటే ‘మీటూ’ ఉద్యమంలో బయటపడుతున్న భయానకమైన అనుభవాలను చూసి ఆడపిల్లలు చాలెంజింగ్ జాబ్స్లోకి రావడానికి జంకే ప్రమాదం ఉంటుంది. భయపడి దాక్కోవడం కాదు, బయటకొచ్చి నిలబడాలని చెప్పడానికి ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే చర్చ ఎప్పుడూ అవసరమే. మీటూ ఉన్నంతకాలం ఈ చర్చకు ప్రాసంగికత ఉంటూనే ఉంటుంది’ అనే ముగింపుతో గోష్ఠి ముగిసింది. మీటూపై పురుషుల అసహనం లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు ‘మీ టూ’ అంటూ ముందుకు రావడంతో ఎంతోమంది ప్రముఖుల ముసుగులు తొలిగాయి. ఇలా ఇంకా ఎన్ని తలలు రాలుతాయోననే భయం మగ సమాజాన్ని వెంటాడుతోందిప్పుడు. ఆ అభద్రతలో నుంచి వస్తున్న వితర్క వాదనలే ఇవన్నీ. ఆడవాళ్లకు ఇంత ధైర్యం వచ్చిందేమిటి... అనే అసహనం కూడా పెరిగిపోతోంది. మహిళలు లక్ష్యాలను సాధిస్తున్నారు, టాప్లో నిలుస్తున్నారనే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కూడా అహం అడ్డు వస్తోంది. తనకు ఇంత వరకు తెలిసిన సమాజం తమకు ఫ్రెండ్లీగా ఉంది, ఇప్పుడు మహిళలు గళమెత్తితే వచ్చే మార్పు తమకు అనుకూలంగా ఉండకపోవచ్చు.. అనే ఆందోళన మగవాళ్ల చేత ఇలా మాట్లాడిస్తోంది. చలనశీలి సుధా మీనన్.. బిజినెస్ జర్నలిస్టు, రచయిత, మోటివేషనల్ స్పీకర్. మహిళల్లో నాయకత్వ లక్షణాలు, స్త్రీ–పురుష వైవిధ్యతల ఆధారంగా కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో తలెత్తే అంశాలను చర్చించి పరిష్కరించడంలో ఆమె నిష్ణాతురాలు. నాన్ఫిక్షన్ రచనలు ఐదు చేశారు. అవి ‘ఫైస్టీ యట్ ఫిఫ్టీ’, ‘దేవి, దివా ఆర్ షీ డెవిల్’, ‘గిఫ్టెడ్: ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీస్’, ‘విరాసత్’, ‘లెగసీ: లెటర్స్ ఫ్రమ్ ఎమినెంట్ పేరెంట్స్ టు దెయిర్ డాటర్స్’. వీటితోపాటు ఆమె ‘గెట్ రైటింగ్’, ‘రైటింగ్ విత్ ఉమెన్’ పేరుతో రైటింగ్ వర్క్షాపులు నిర్వహించారు. - వాకా మంజులారెడ్డి -
సమానత్వానికి మరో 200 ఏళ్లు
మానవుడు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా లింగ వివక్షత మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో లింగ భేదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్థికం, రాజకీయం, ఉద్యోగం ఇలా దాదాపు అన్ని రంగాల్లో ఇంకా మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ లింగ వివక్షతను దాటి స్త్రీపురుష సమానత్వం సాధించడానికి ఇంకా 200 ఏళ్లు పడుతుందట. అంతర్జాతీయంగా అధ్యయనం చేసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం తేల్చిన సత్యమిది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2018 భారత్లో స్త్రీపురుష సమానత్వానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పింది. దేశంలోని ఆర్థిక రంగంలో ఉన్న లింగ అసమానతలను పరిష్కరించుకోవాల్సిన తక్షణ ఆవశ్యకతను అది నొక్కి చెప్పింది. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా నాలుగు కీలకాంశాల ఆధారంగా లింగపరమైన ఆర్థిక అసమానతలను అంచనా వేసింది. ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్య రంగాల్లో స్త్రీపురుష అంతరాలను కొలమానంగా తీసుకుని మన దేశంలో కొనసాగుతున్న అసమానతలపై దృష్టి సారించాలని చెప్పింది. గత దశాబ్దకాలంగా ఆరోగ్యం విషయంలో ప్రపంచంలోనే మన దేశం చివరి నుంచి మూడోస్థానంలో ఉండటం ప్రమాదానికి సంకేతంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం భావించింది. స్త్రీపురుషుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగడానికి రెండు శతాబ్దాల కాలం పడుతుందని స్పష్టం చేసింది. అమెరికా కన్నా బెటర్... రాజకీయ సాధికారతలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 54వ స్థానంలో ఉన్న అమెరికా, 33వ స్థానంలో ఉన్న యుకె కన్నా మెరుగైన ఫలితాలను కనబర్చి మన దేశ మహిళలు ప్రపంచంలోనే 15వ స్థానంలో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం రిపోర్టు వెల్లడించింది. పది ప్రధాన ప్రమాణాలను గమనిస్తే.. బంగ్లాదేశ్, శ్రీలంకతో పోలిస్తే మన దేశం లింగ అసమానతలను జయించాలంటే చాలా విషయాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. 100 ప్రధాన కంపెనీల్లో కేవలం 5 శాతం మంది మహిళలు మాత్రమే కీలక స్థానాల్లో ఉన్నారు. అలాగే అతి కొద్ది మందికి మాత్రమే నూతన కంపెనీల స్థాపనకు ఆర్థిక తోడ్పాటునిచ్చినట్లు తేలింది. నిర్వహణ రంగం స్త్రీ భాగస్వామ్యం - ముంబై స్టాక్ ఎక్చేంజీలోని టాప్ 100 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న మహిళలు 2018 జనవరి నాటికి ఐదుగురు మాత్రమే. అలాగే 2019 జనవరి నాటికి ఇందులో ఎలాంటి మార్పు లేదు. - ముంబై స్టాక్ ఎక్సేంజీలోని టాప్ 500 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న స్త్రీలు 2018 జనవరి నాటికి 18 మంది కాగా, 2019 జనవరి నాటికి 25 మందికి చేరారు. - ముంబై స్టాక్ ఎక్చేంజీలోని టాప్ 100 కంపెనీల్లో బోర్డు సభ్యులుగా ఉన్న మహిళలు 2018 నాటికి 172 మంది ఉండగా, 2019 జనవరి నాటికి 180 మందికి చేరారు. - టాప్ 482 కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మహిళలు 2018 నాటికి 14.08 శాతం ఉండగా, 2019 జనవరి నాటికి 14.49 శాతానికి పెరిగింది. మెరుగ్గా ఐస్లాండ్... ప్రపంచ దేశాల్లో ఐస్లాండ్ గత పదేళ్లుగా మహిళా సాధికారతలో మెరుగ్గా ఉంది. మహిళా శాసనకర్తలు, సీనియర్ అధికారులు, మేనేజర్లు మాత్రం ఐస్లాండ్లో గతంకన్నా కొద్దిగా తగ్గినప్పటికీ.. మిగిలిన దేశాలకన్నా అసమానతలు ఈ దేశంలో తక్కువగా ఉన్నట్లు తేలింది. గత అక్టోబర్లో ఐస్లాండ్ ప్రధాని కత్రిన్ జాకోబ్స్డాటిర్తో సహా ఐలాండ్ మహిళలంతా వేతనాల్లో అసమానత్వానికి, లైంగిక వేధింపులకు నిరసనగా పనిమానేసి వీ«ధుల్లోకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆధారంగా రాజకీయాలు, పనిలో భాగస్వామ్యం, ఆరోగ్యం, విద్యారంగాల్లో అంతరాలను అధిగమించడంలో ప్రపంచవ్యాప్తంగా 0.1 శాతం మెరుగుదల సాధించాం. ఈ లెక్కన సమానతకు ప్రపంచం చాలా దూరంలో ఉంది. స్త్రీ పురుష సమానత్వం కోసం ఇంకా 202 ఏళ్లు ఎదురుచూడటం చాలా సుదీర్ఘ ప్రయాస అని యుఎన్ ఉమన్ రీజనల్ డైరెక్టర్ అన్నా కరీన్ జాట్ఫోర్స్ వ్యాఖ్యానించారు. సమాన వేతన విధానాలు, మహిళల అవసరాలకు తగినట్లుగా గర్భిణులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అవకాశాలు కల్పించడం, ప్రసవానంతరం మహిళలకు చట్టబద్ధమైన ఉద్యోగ భరోసా ఇవ్వడం ద్వారా స్త్రీ పురుషుల ఆర్థిక అంతరాలను కొంతవరకైనా తగ్గించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 200 ఏళ్లు ఆగాల్సిందే.. జెనీవాకు చెందిన అంతర్జాతీయ సంస్థ 149 దేశాల్లో విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత తదితర రంగాల్లో కొనసాగుతున్న అసమానతలను రికార్డు చేసింది. ఈ యేడాది విద్య, ఆరోగ్యం, రాజకీయ భాగస్వామ్యంలో ఉన్న అంతరాలను ప్రపంచ ఆర్థిక సంస్థ వెల్లడించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నైపుణ్యం తదితర విషయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్లు ఈ రిపోర్టు గుర్తించింది. పశ్చిమ యూరప్ దేశాలు మరో ఆరు దశాబ్దాల్లో ఆర్థిక అంతరాలను అధిగమిస్తారని, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో లింగ వివక్షను అధిగమించేందుకు మరో 153 ఏళ్లు వేచిచూడాల్సిందేనని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య అసమానతలు పూడ్చటానికి కనీసం 202 ఏళ్లు పడుతుందని ఫోరం అంచనా వేసింది. -
కు.ని. క్యాప్సూల్స్ ఇక మగాళ్లే మింగాలి!
‘‘ఎన్నో విషయాల్లో స్త్రీలు సమానత్వాన్ని సాధించారు. కానీ, కుటుంబ నియంత్రణ విషయంలో మాత్రం 99 శాతం భారం స్త్రీలే మోస్తున్నారు. ఈ బాధ్యతని మగవారు కూడా పంచుకోవాలని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కుటుంబ నియంత్రణ మాత్రలు కనుక్కోవాలని ప్రయోగాలు ప్రారంభించి సఫలమయ్యాం’’ అని చెప్పారు షమీమ్ సుల్తానా. తెలంగాణ, వికారాబాద్లోని పరిగికి చెందిన షమీమ్ అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటలో ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. యూనివర్సిటీ పరిశోధనలో భాగంగా పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్రలు కనిపెట్టిన శాస్త్రవేత్తల బృందానికి షమీమ్ టీమ్ లీడర్గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచం గుర్తించే పనిలో మన తెలుగు యువతి షమీమ్ సుల్తానా ప్రధాన భూమికగా ఉండటం దేశానికే గర్వకారణం. టీ క్యాంటీన్ నుంచి పరిగి బస్స్టాండులో ఓ చిన్న క్యాంటీన్ నడుపుకునే సయ్యద్ మగ్బూల్ కూతురు షమీమ్. ఆయనకు 21 మంది సంతానం. షమీమ్ పదేళ్లు దాటే వరకు బడి గడప తొక్కింది లేదు. క్యాంటీన్లో చాయ్లు అందిస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ పెరిగింది. పిల్లలందరినీ చదివిస్తూ ఈమెనొక్కదాన్నే ఇంటిపట్టున ఉంచి పనులు చేయించటం ఎందుకనుకున్న తండ్రి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని సాయంతో షమీమ్ 12వ ఏట నేరుగా 6వ తరగతిలో చేర్చాడు. అప్పటి వరకు పుస్తకాల ముఖం చూడని షమీమ్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అ, ఆ.. లతో మొదలు పెట్టి ఏడాది తిరక్కుండానే అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించి ప్రతిభావంతురాలు అనిపించుకుంది. ఐదేళ్లలోనే 10వ తరగతి పూర్తి చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఆమె పట్టుదలను గుర్తించిన తల్లిదండ్రులు పరిగి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివించారు. ‘బంగారు’ తల్లి పరిగిలో డిగ్రీ కళాశాల లేకపోవటంతో హైదరాబాద్లోని వనిత కళాశాలలో చేరింది షమీమ్. మొదట్నించి చురుకుగా ఉండే షమీమ్ డిగ్రీలోనూ మంచి మార్కులతో పాస్ అయింది. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకున్నప్పటికీ షమీమ్ ప్రతిభను గుర్తించి ఉన్నత చదువుల వైపే మొగ్గు చూపారు తల్లీదండ్రి. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో చేరిన షమీమ్ తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకుంది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఇద్దరు గవర్నర్లు రంగరాజన్, రామేశ్వర్ ఠాకూర్ల చేతుల మీదుగా ఎమ్మెస్సీలో గోల్డ్మెడల్ అందుకుంది. ఇదే సమయంలో ఫీజు రీయింబర్స్మెంటు కూడా చదువు కొనసాగించటానికి దోహదపడిందని షమీమ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రస్తుత ఐఐసీటీలో పీహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. పరిగి టు అమెరికా షమీమ్ పట్టుదల తెలిసినవారంతా ఆమెను ఇంకా చదివిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నవారే. దీంతో ఎంత కష్టమైనా సరే కూతుర్ని విదేశాలలో ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు మగ్బూల్. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటలో షమీమ్కు పరిశోధనలలో అవకాశం రావడంతో అక్కడకు పంపించాడు. అక్కడే కాలేజ్ ఆఫ్ ఫార్మసి మెడికల్ కెమిస్ట్రీలో పరిశోధనలు ప్రారంభించారు షమీమ్. ఆరుగురు సభ్యుల బృందానికి టీంలీడర్గా వ్యవహరిస్తూ అనుకున్న సమయానికి ముందుగానే పరిశోధనలను అధికారుల ముందుంచారు. ‘కుటుంబ నియంత్రణ పాటించేందుకు ఆడవారికి 1960 నుంచే మాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ట్యూబెక్టమీ, డీపీఎల్.. లాంటి ఇతర కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయి. కుటుంబ నియంత్రణ కోసం మగవారు పాటించే వాసెక్టమి ఆపరేషన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ఆపరేషన్ చేయించుకునే వారి సంఖ్య 1 శాతానికి మించిన దాఖలాలు లేవు. కుటుంబ నియంత్రణ బాధ్యత పూర్తిగా మహిళలే మోస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ నియంత్రణ బాధ్యతను పురుషులకు కూడా పంచాలని భావించింది మా శాస్త్రవేత్తల బృందం. ఆపరేషన్ ద్వారా శుక్ర కణాలను నిలిపివేసే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించటాన్ని పురుషులు అంగీకరించటంలేదనే సత్యాన్ని గ్రహించాం. అందుకే తాత్కాలిక పద్ధతిలో మాత్రలను పురుషులకు పంచితే స్త్రీల ఆరోగ్యం బాగుంటుందని, అంతేకాకుండా మగవారూ దీనిని అంగీకరించి స్వాగతించే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చాం. దీంతో పురుషులు వేసుకునే కుటుంబ నియంత్రణ మాత్రలు తయారు చేయాలని నిర్ణయించి పరిశోధనలు ప్రారంభించి, సక్సెస్ అయ్యాం. అధికారిరంగా ఇది వెలుగులోకి రావాల్సి ఉంది’’ అని వివరించారు షమీమ్. మరింత వివరంగా ‘‘ఆఫ్రికాలోని ఓ అరుదైన మొక్కనుంచి లభించే ఒవాబిన్ పదార్థాన్ని గుండె జబ్బులు తగ్గించటంతో పాటు, కొన్ని రకాల రోగాలకూ ఇప్పటికే వినియోగిస్తూ వస్తున్నారు. ఈ పదార్థాన్ని వినియోగించే పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలను తయారు చేయాలని సంకల్పించాం. ఈ మొక్కలోని రసాయనాలు కేవలం శుక్రకణాల్లో మాత్రమే ఉండే ఎక్స్–4 ను అచేతన పరిచి, వాటి పరుగును మందగింపజేస్తుంది. దీంతో శుక్రకణాలు అండంతో ఫలదీకరణ చెందడం ఆగిపోతుంది. అయితే, ఈ ఎక్స్–4.. వృద్ధి చెందిన శుక్ర కణాలను మాత్రమే అడ్డుకుంటుంది. కొత్తగా వృద్ధి చెందే శుక్రకణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ మాత్రలు వేసుకున్నప్పుడు మాత్రమే కుటుంబ నియంత్రణ జరుగుతుంది. వేసుకోవటం మానేస్తే తిరిగి సంతానాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందవచ్చు. ఈ మాలిక్యూల్ పురుషులకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ వ్యవస్థగా ఉపయోగపడనుంది. మా బృందం తయారు చేసిన కుటుంబ నియంత్రణ మాలిక్యూల్ను మొదటి దశలో ఎలుకలు, తరువాత దశలో కుందేళ్లపై ప్రయోగించి సఫలీకృతమయ్యాం. ప్రస్తుతం కోతులపై ఈ ప్రయోగం జరుగుతోంది. అనంతరం మనుషులపై ప్రయోగించి ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ మందు తయారీ విషయంలో ఇప్పటికే మా శాస్త్రవేత్తల బృందం పేటెంట్ హక్కులు సైతం పొందింది’’ అని తెలిపారు షమీమ్ సుల్తానా. ఇష్టపడి చదివాను పరిగి నుంచి అమెరికా వరకు ప్రతి అడుగులోనూ నా తల్లిదండ్రుల కృషి ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ పై చదువులు చదివించారు. ఆడపిల్ల అని వెనుకంజ వేయకుండా అమెరికా యూనివర్సిటీలో చేరడానికి ప్రోత్సహించారు. ప్రపంచ స్థాయి సైంటిస్టుగా గుర్తింపు పొందటానికి మరో అడుగు దూరంలో ఉన్నాను. ఇప్పటికే అమెరికాలోని ప్రసారమాధ్యమాల్లో మా ప్రయోగాలకు సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి. – షమీమ్ సుల్తానా, సైంటిస్టు చదువే పరిష్కారం పరిగి బస్స్టాండులో 16 ఏళ్లపాటు క్యాంటిన్ నడిపాను. నా కుటుంబం పెద్దది. కుటుంబం బాగుపడాలంటే చదువొక్కటే మార్గమని నమ్మినవాడిని. ఎంత కష్టమైనా ఆడా మగ తేడా లేకుండా పిల్లలందరినీ చదివించాను. టిఫిన్లు, చాయ్లు అమ్ముతూనే పిల్లలందరినీ ఉన్నత విద్యావంతులను చేశాను. ఈ రోజు వారందరూ ప్రయోజకులయ్యారు. ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, వ్యాపారవేత్తలుగా, డాక్టర్లుగా ఇండియాతో పాటు ప్రపంచంలోని ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. షమీమ్ సైంటిస్టుగా అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం పరిగిలోనే ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాను. నా బిడ్డ సాధించిన విజయానికి నాకెంతో గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. -
స్త్రీలోక సంచారం
మూడేళ్ల పదవీకాలం ముగియడంతో గత ఏడాది సెప్టెంబర్లో ఎన్.సి.డబ్లు్య. (నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్) చైర్పర్సన్గా లలితా కుమారమంగళం తన పదవీ బాధ్యతల నుంచి వైదొలగినప్పటి నుంచీ, ఆ స్థానంలో అదనంగా విధులను నిర్వహిస్తూ వస్తున్న మహిళా కమిషన్ సభ్యురాలు రేఖాశర్మ (54) ఇప్పుడు పూర్తిస్థాయి ఎన్.సి.డబ్లు్య. చైర్పర్సన్గా నియమితులయ్యారు. క్రైస్తవ సంఘాలలో కొన్నిచోట్ల ఉండే ‘ఒప్పుకోలు’ (కన్ఫెషన్) సంప్రదాయం మహిళల్ని బెదిరించడానికి ఒక ఉద్వేగ సాధనంగా దుర్వినియోగం అవుతోందని అంటూ, అందుకు ఉదాహరణగా కేరళలో జరిగిన ఒక ఘటనను నిదర్శనంగా చూపి, కన్ఫెషన్ సంప్రదాయాన్ని నిషేధించాలని రేఖాశర్మ వ్యాఖ్యానించడం ఇటీవల వివాదాస్పదం అయింది. ►ముంబైలోని ‘జిన్నా హౌస్’ వారసత్వ హక్కుల కోసం 2007 నుంచీ న్యాయపోరాటం చేస్తున్న ముహమ్మద్ అలీ జిన్నా కుమార్తె, ఆయన ఏకైక సంతానం అయిన డైనా వాడియా 2017 నవంబర్లో తన 98 యేట మరణించిన దాదాపు ఏడాది తర్వాత ఈ కేసును ఆమె తనయుడు నస్లీ వాడియా కొనసాగించడానికి ముంబై హైకోర్టు అనుమతించింది. దేశ విభజనకు పూర్వం 1936లో జిన్నా కట్టించిన ఈ ‘హౌస్’ను ఆయన స్మృత్యర్థం పాకిస్తాన్ కాన్సులేట్ ఆఫీసుగా మార్చుకునేందుకు అమ్మడం కానీ, లీజ్ ఇవ్వడం గానీ చేయాలని ఒకవైపు పాకిస్తాన్ ఏళ్లుగా అడుగుతుండగా.. హిందూ చట్టం ప్రకారం జిన్నా కూతురిగా జిన్నాహౌస్పై తనకు మాత్రమే హక్కు ఉందని డైనా వాడియా కోర్టును ఆశ్రయించారు. ►అసభ్యతను నియంత్రించే నెపంతో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో కనీసం ఒక్క డ్యాన్స్ బార్నైనా నడవనివ్వకపోవడం ‘నైతికనిఘా’కు (మోరల్ పోలీసింగ్) పాల్పడటమేనని సుప్రీంకోర్టు విమర్శించింది. ముద్దులకు, మానవ ‘కలయిక’కు సంకేతంగా సినిమాల్లో పూలను, పక్షులను చూపించే కాలం నాటి నుంచి అసభ్యతకు ఒక పరిణామక్రమంగా అర్థం మారిపోతూ వస్తున్నప్పుడు.. డ్యాన్స్ గర్ల్స్ చేసే నృత్యాలన్నిటినీ అసభ్యమైనవని తీర్మానించి, ఏ ఒక్క డ్యాన్స్బార్కూ అనుమతిని ఇవ్వకపోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ►35 ఏళ్ల కెన్యా–మెక్సికో సంతతి హాలీవుడ్ నటి లుపిటా న్యాంగో తొలిసారి తన జుట్టు గురించి బహిరంగంగా మాట్లాడారు. ‘‘నీ జుట్టు ఇలా ఉంటే నీకెవ్వరూ ఉద్యోగం ఇవ్వరనీ.. ఇంత అనాగరికంగా, ‘అరణ్యగోచరం’గా నువ్వెక్కడా నెగ్గుకు రాలేవని అంతా అనేవారు. ఇదంతా పడలేక నన్ను నేను దాచుకునే ప్రయత్నం చేసేదాన్ని. అప్పుడు మా అమ్మే నాకు ధైర్యం చెప్పింది. ‘సహజంగా వచ్చిన జుట్టును చూసుకుని గర్వపడాలే కానీ, సిగ్గు పడకూడదు’ అని చెప్పింది. హార్వీ వైన్స్టీన్ లైంగిక వేధింపుల గురించి నా అనుభవాలను బయటికి చెప్పుకున్నానంటే ఆ మనోబలం కూడా నాకు మా అమ్మ ఇచ్చిందే’’ అని ‘పోర్టర్’ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యాంగో వెల్లడించారు. ►ఇప్పటి వరకు కేవలం అత్యాచారం వల్ల ధరించిన గర్భానికో, లేక ప్రాణాంతక పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే అబార్షన్ చేయించుకునేందుకు అర్జెంటీనాలో చట్టపరమైన అనుమతి ఉండగా, వాటితో నిమిత్తం లేకుండా గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) కి అనుమతి ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతమైన నేపథ్యంలో గురువారం నాడు అర్జెంటీనా సెనేట్ (ఎగువసభ) అబార్షన్ (చేయించుకునే హక్కు) బిల్లును తిరస్కరించింది. గత నెలలో దిగువసభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఇప్పుడు సెనేట్ కూడా సమ్మతి తెలిపి ఉంటే 14 వ వారం వరకు కూడా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకు లభించి ఉండేది. ►ఐక్యరాజ్య సమితిలోని ‘లైంగిక సమానత్వం’, ‘మహిళా సాధికారత’ల ప్రత్యేక విభాగాల సలహాదారు రవి కర్కారపై కనీసం ఎనిమిది మంది పురుషులు లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు చేయడంతో ఆయన కోసం వేట మొదలైంది! ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కోసం (అప్పటికి ఇతడేనని తెలియదు) గత ఏడాదిగా ‘యు.ఎన్. ఉమెన్ ప్లానెట్ 50–50 చాంపియన్స్’ అధికారులు ప్రయత్నిస్తుండగా.. ప్రస్తుతం సెలవులో ఉన్న రవి కర్కారే నిందితుడని బయపడటంతో పాటు, ఒక హోటల్ గదిలో అతడు తన కింది పురుష ఉద్యోగుల జననాంగాలను తాకడం, గిల్లడం వంటి అసభ్యకరమైన పనులు చేసినట్లు బాధితుల సాక్ష్యం వల్ల బహిర్గతమయింది. ►భారత మహిళా క్రికెట్ జట్టు ‘కోచ్’ పోస్టు కోసం మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకోగా పురుష అభ్యర్థులతో పాటు వారిలో మహిళా జట్టు మాజీ కెప్టెన్ మమతా మాబెన్, సుమన్శర్మ (గతంలో పూర్ణిమా రావ్కు అసిస్టెంట్ కోచ్), మరియా ఫాహే (న్యూజిలాండ్ క్రికెటర్, ప్రస్తుతం గుంటూరు అకాడమీలో కోచ్) దరఖాస్తు చేసినవారిలో ఉన్నారు. ►హాలీవుడ్ చిత్రంలో అవకాశం రావడంతో చేతిలోని బాలీవుడ్ చిత్రం ‘భారత్’ను వదిలేసి వెళ్లిన ప్రియాంక చోప్రాకు.. మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత ఒలకబోసుకున్నట్లయింది! క్రిస్ ప్రాట్ సరసన ‘కౌబాయ్ నింజా వైకింగ్’ చిత్రంలో నటించడానికి ప్రియాంక సిద్ధమౌతున్న తరుణంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న యూనివర్సల్ పిక్చర్స్.. స్క్రిప్టులో తలెత్తిన సమస్యల వల్ల చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది! -
సెక్షన్ 497 నిరంకుశం..!
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 సమానత్వపు హక్కునకు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది నిరంకుశత్వంగా ఉందని గురువారం స్పష్టం చేసింది. వివాహితుడైన పురుషుడు, మరో వివాహితురాలిని వేర్వేరుగా పరిగణిస్తోందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్ 497 ‘నిరంకుశం’ అని స్పష్టం చేసింది. భర్త అనుమతితో వివాహిత మహిళ – వివాహితుడైన మరో పురుషుడితో సంబంధం పెట్టుకున్న సందర్భాల్లో.. మహిళను ఓ గృహోపకరణంగా చూస్తున్నారని మండిపడింది. ఓ వివాహితురాలు మరో వివాహితుడితో.. తన భర్త అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పు కాదని సెక్షన్ 497 చెబుతోంది. ‘భార్యాభర్తలు కాని ఓ పురుషుడు, మరో మహిళ.. లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం చేసినట్లు కాదు. కేవలం వివాహేతర సంబంధమే’ అని ఈ సెక్షన్ పేర్కొంది. అయితే ఈ సెక్షన్ సరికాదని ధర్మాసనం తెలిపింది. వివాహ బంధం పవిత్రమైంది ‘ఇక్కడ వివాహ బంధం పవిత్రతను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చట్టంలోని నిబంధనలు ఆర్టికల్ 14 (అందరికీ సమానత్వం) అనే రాజ్యాంగం కల్పించిన హక్కును హరించివేస్తోంది’ అని కోర్టు చెప్పింది. సమానత్వపు హక్కును ఈ సెక్షన్ కల్పిస్తుందా లేదా? అనేది విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ‘భర్త అనుమతి ఉంటే.. ఆ వివాహేతర సంబంధంలో తప్పులేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మహిళను ఓ ఆటవస్తువుగా పరిగణించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఓ వివాహితుడు, మరో వివాహితురాలితో (భర్త అనుమతితో) లైంగిక సంబంధం పెట్టుకుంటే అది తప్పుకాదు. మరోవైపు, ఓ వివాహితుడైన వ్యక్తి వివాహం కాని మహిళతో కలవడం తప్పుకాదు. ఇక్కడ వివాహేతర సంబంధం వర్తించదు. ఇలాంటి కేసులో భార్య ఆ వ్యక్తిపై కేసు పెట్టలేదు. ఇదెంత నిరంకుశం’ అని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 497లో లింగ సమానత్వం లోపించిందని కోర్టు తెలిపింది. 1954లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం కూడా సెక్షన్ 497 సమానత్వపు హక్కుకు భంగం వాటిల్లదని, ఈ సెక్షన్కు రాజ్యాంగ బద్ధత ఉందంటూ తీర్పునిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. ఇలాంటి కేసులపై గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించాల్సిన అవసరముందని ధర్మాసనం పేర్కొంది. భార్యాభర్తలు విడాకులు కోరేందుకు వివాహేతర సంబంధాన్ని ఓ కారణంగా పరిగణించబోమని కూడా కోర్టు వెల్లడించింది. ఎవరి వాదన వారిదే! సెక్షన్ 497కు ఉన్న రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో పిటిషనర్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కాళేశ్వరం రాజ్ తన వాదనలు వినిపిస్తూ.. సెక్షన్ 497లోని నిబంధనలు వివాహేతర సంబంధం పెట్టుకున్న స్త్రీ, పురుషులకు వేర్వేరు శిక్షలు సూచిస్తోందని పేర్కొన్నారు. పురుషుడిని నేరస్తుడిగా గుర్తిస్తూ.. మహిళల విషయంలో మాత్రం సానుకూలంగా ఉందన్నారు. కేసులో ఓ వర్గం తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు. ‘మహిళలు భర్తల చేతిలో ఇంట్లోని ఓ వస్తువుగా మారిపోయారు. ఇక్కడ భర్తతోపాటు సదరు విటుడిని కూడా తీవ్రంగా శిక్షించాల్సిందే’ అని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేసును ఆగస్టు 7కు వాయిదా వేసింది. మహిళకు లైంగిక స్వేచ్ఛ వివాహేతర సంబంధానికి నో అని చెప్పేందుకు ఓ మహిళకు ఎంత హక్కుందో.. తన లైంగిక స్వతంత్రతను కాపాడుకునేందుకు కూడా అంతే హక్కుంటుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘ఓ వ్యక్తి వివాహేతర సంబంధంలో ఉన్నాడని తెలిస్తే.. అతని భార్య ఈ సంబంధం తెంచుకునేందుకు ఇదో కారణం అవుతుంది. ఇలాంటి సంబంధంలో ఉన్న మహిళ తనకు వివాహం అయిందన్న కారణంతో తన లైంగిక స్వతంత్రతను కోల్పోకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇంతలో సీజేఐ జోక్యం చేసుకుని.. మానసికంగా మహిళకు వేధింపులుంటేనే విడాకులకు వెళ్లొచ్చని లేనిపక్షంలో వివాహేతర సంబంధాన్ని కారణంగా చూపి విడాకులు కోరలేరని పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్లోని 497వ సెక్షన్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ ధర్మాసనంలో ఆర్ఎఫ్ నారీమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందూ మల్హోత్రా తదితర న్యాయమూర్తులు ఉన్నారు. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇదే వాదనను పాటించినట్టయితే ఇప్పుడున్న నేరం కన్నా తీవ్రమైన నేరంగా దీనిని పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే.. ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే.. పెళ్లి రద్దుకు దారితీసేవిధంగా ఈ చట్టం ఉందని ఆయన అన్నారు. సెక్షన్ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ కూడా ఆ ఆర్టికల్కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్ను చెల్లబోదని పిటిషనర్ వాదిస్తున్నారు. -
తగని ప్రశ్న తగిన జవాబు
‘నేను ఫెమినిస్టును కాదు’ అంటున్నారు. కానీ స్త్రీ, పురుష సమానత్వం ఉండాలంటున్నారు! ఫెమినిజం, సమానత్వం రెండూ ఒకటే కదా! త్రిష : ఎస్! నేను ఫెమినిస్టును కాదు. ఫెమినిజం అనే భావన విస్తృతమైనది. ‘సమానత్వం’ అనే అర్థంతో ఫెమినిజం అనే మాటను సరిపెట్టేయలేం. ఫెమినిస్టులు ఒక్క సమానత్వం గురించే మాట్లాడరు. వాళ్లు చాలా చేస్తారు. అసమానత్వాన్ని ప్రశ్నిస్తారు. బయటికి వచ్చి పోరాడతారు. స్త్రీల సమస్యలపై, స్త్రీల సంక్షేమంపై, స్త్రీల భద్రతపై సామాజిక, రాజకీయ, సృజనాత్మక వేదికలపై ప్రసంగిస్తారు. ఉద్యమాలు చేస్తారు. మగవాళ్లలో స్త్రీల సమస్యలపై సహానుభూతిని కలిగిస్తారు. నేను ఇవన్నీ చేయడం లేదు. కాబట్టి ఫెమినిస్టును కాదు. స్త్రీ, పురుష సమానత్వం ఆశిస్తున్న ఒక సాధారణ మహిళను. అంతే. త్రిష నటించిన హారర్ థ్రిల్లర్ ‘మోహిని’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఆ చిత్రం ప్రోమో కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో త్రిష వెలిబుచ్చిన అభిప్రాయాలివి. -
అసలు సిసలు స్త్రీవాది
‘మహిళల విముక్తే మానవ జాతి విముక్తి’ అంటారు అంబేడ్కర్. రాజకీయ, సామాజిక ఆర్థిక అసమానతలో పాటు లింగ వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తోందనీ స్త్రీపురుష సమానత్వం మాత్రమే సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలదనీ ఆయన మనసా వాచా నమ్మారు. అసమానతలను తరిమికొట్టేందుకు రాజ్యాంగ రచనను ఒక సమున్నతావకాశంగా అంబేడ్కర్ భావించారు. ఆర్టికల్ 14 నుంచి 16 వరకు స్త్రీపురుష సమానత్వాంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతేకాకుండా స్త్రీల రక్షణకు ఉద్దేశించిన అనేక చట్టాలకు ఆయన రూపకల్పన చేశారు. అందులో భాగమే.. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు న్యాయ శాఖా మంత్రి హోదాలో అంబేడ్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్. భారత స్వతంత్య్రానంతర తొలి న్యాయ శాఖా మంత్రి అయిన అంబేడ్కర్.. వివాహం, విడాకులు, సంపద హక్కుతో పాటు సంరక్షణ హక్కులకు హామీ యిచ్చే హిందూ కోడ్ బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా స్త్రీల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను ఆశించారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందకుండా నెహ్రూ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తిరస్కరిస్తూ న్యాయ శాఖా మంత్రి పదవినే తృణప్రాయంగా వదులుకున్న ఘనత డాక్టర్. బిఆర్ అంబేడ్కర్కే దక్కుతుంది. మహిళా చట్టాలకు ఆద్యుడు స్త్రీజనోద్ధరణకోసం అంబేడ్కర్ అనేక చట్టాలకు రూపకల్పన చేశారు. ఉమన్ లేబర్ వెల్ఫేర్ ఫండ్, ఉమన్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ ఫర్ వుమెన్ లేబర్ బిల్, లీవ్ బెనిఫిట్ టు పీస్ వర్కర్స్, రివిజన్ ఆఫ్ స్కేల్ ఆఫ్ పే ఫర్ ఎంప్లాయీస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్యాన్ ఆన్ వుమెన్ వర్కింగ్ అండర్గ్రౌండ్ మైన్స్, మెయింటెనెన్స్ అలవెన్స్ ఫ్రం హస్బెండ్స్ ఆన్ గెటింగ్ లీగల్లీ సెపరేషన్, వేతనాల్లో లింగ వివక్ష పాటించకుండా సమాన పనికి సమాన వేతనం.. ఇలాంటì చట్టాలన్నిటికీ అంబేడ్కరే ఆద్యుడు. ప్రధానంగా మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ రూపకల్పనలో అంబేడ్కర్ కృషి అత్యంత కీలకమైంది. 1929లో ముంబై అసెంబ్లీలో దేశంలోనే తొలిసారిగా మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ ఆమోదం పొందింది. ఆ తరువాతే 1934లో మద్రాసు లెజిస్లేచర్ కౌన్సిల్ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ని ఆమోదింపజేసుకుంది. 1942– 46 మధ్యన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ‘మైన్స్ మెటర్నిటీ బెనిఫిట్స్ బిల్ ఫర్ ఉమెన్’ బిల్లుని తీసుకురావడంలో కూడా ఆయన పాత్రే కీలకం. ఈ చట్టమే గనుల్లో పనిచేసే మహిళలకు 8 వారాల పాటు జీతంతో కూడిన సెలవుని ప్రసాదించింది. అనంతరం 1961లో ‘కామన్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్’తో కేంద్రం ఈ చట్టాన్ని దేశంమొత్తానికీ వర్తింపజేసింది. సమాన పనికి సమాన వేతనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(డి) డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్లోని నాల్గవ భాగం సమాన పనికి సమాన వేతనాన్ని ఖరారు చేస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ధనికులకు, ఉన్నత వర్గాల వారికీ, భూస్వాములకూ, పన్నులు కట్టేవారికీ మాత్రమే ఉన్న ఓటు హక్కుని పురుషులందరితో పాటు స్త్రీలకు సైతం వర్తింపజేయాలని చెప్పి స్త్రీల రాజకీయ హక్కుకు పునాది వేసిన స్త్రీజన పక్షపాతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. – అత్తలూరి అరుణ -
మహిళా ఉద్యమ వారధులు
మారామనీ, మారుతున్నామనీ ఎంతగా చెప్పుకుంటున్నా.. సమాజంలో స్త్రీ, పురుషులింకా ఈక్వల్ ఈక్వల్ కాలేదు. లైంగిక సమానత్వం కోసం కలిసి ప్రయాణించవలసిన దూరం ఇంకా మిగిలే ఉంది! అయితే అసలంటూ ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణాన్ని మొదలు పెట్టినవారు కూడా మహిళలే కావడం స్ఫూర్తినిచ్చే విషయం. వారిని మన ప్రతి అడుగులోనూ గుర్తుచేసుకోవడం.. మన సమానత్వ ప్రయాణానికి చోదక శక్తి అవుతుంది. మహిళా సమాజానికి ప్రేరణను, శక్తిని ఇచ్చిన ఆ మహిళల్లో ఎక్కువమంది వర్కింగ్ ఉమెనే! వాళ్ల ప్రయత్నం, వాళ్ల సంకల్ప బలం కారణంగానే సమానత్వం వైపుగా ఇవాళ మనం ఇంతమాత్రపు ‘ఈక్వాలిటీ’నైనా సాధించగలిగాం. ‘ఫస్ట్ లేడీ’ సంప్రదాయ పాత్రను మార్చిన ఎలినార్ రూజ్వెల్ట్ దగ్గర్నుంచి, యు.ఎస్. కాంగ్రెస్కు ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ షిర్లీ ఛిజమ్ వరకు.. ప్రపంచ గతిని మలుపు తిప్పిన పది మంది మహిళల వివరాలు, విశేషాలు ఇవి. రోజీ ది రివెటర్ ‘వియ్ కెన్ డు ఇట్’ అనే క్యాప్షన్ ఉన్న చిత్రం ప్రపంచ ప్రసిద్ధమైనది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో అమెరికన్ గృహిణుల్ని ఇళ్లలోంచి బయటికి రప్పించి.. పరిశ్రమల్లోకి, కర్మాగారాల్లోకి, సైనిక దళాల్లోకి ఉద్యోగినులుగా వచ్చేందుకు వాళ్లకు స్ఫూర్తినిచ్చిన ఈ పోస్టర్కు ప్రేరణ... నవోమీ పార్కర్ ఫ్రేలే అనే స్త్రీ మూర్తి ఫొటో. కాలిఫోర్నియాలో ఆమె వెయిట్రెస్గా పనిచేస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీసి ఓ పత్రికకు ఇస్తే, ఆ పత్రికలో నవోమీని చూసిన ఓ చిత్రకారుడు ‘వియ్ కెన్ డు ఇట్’ చిత్రాన్ని రూపొందించారు. దానిని అమెరికా ప్రభుత్వం తన అధికార మహిళా నియామకాలకు ఒక స్ఫూర్తిదాయకమైన చిత్రంగా ఉపయోగించుకుంది. రూస్ బేడర్ గిన్స్బెర్గ్ 1993లో బిల్ క్లింటన్ సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్గా రూస్ను నియమించారు. అప్పటికి సుప్రీంకోర్టుకు ఆమె రెండో మహిళా న్యాయమూర్తి. అంతకుముందు 1980లో జిమ్మీకార్టర్ రూస్ను కొలంబియా సర్క్యూట్ డిస్ట్రిక్ట్కు యు.ఎస్.అప్పీళ్ల న్యాయమూర్తిగా నియమించారు. అయితే రూజ్ ప్రతిభా సామర్థ్యాలు తన విధి నిర్వహణకు మాత్రమే పరిమితం కాలేదు. స్త్రీ, పురుష సమానత్వం, మహిళల హక్కుల కోసం ఆమె కృషి చేశారు. ‘ఉమెన్ రైట్స్ ప్రాజెక్టు’కు స్వచ్ఛంద న్యాయవాదిగా పని చేశారు. షిర్లీ ఛిజమ్ రాజకీయవేత్త, టీచర్, రచయిత్రి. యు.ఎస్. కాంగ్రెస్కు ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసిన తొలి మహిళ కూడా. రాజకీయాల్లోకి వెళ్లే ముందు వరకు బ్రూక్లిన్లో, మన్హట్టన్లో స్కూళ్లు, డేకేర్ సెంటర్లు నిర్వహించారు. తన కెరీర్ మొత్తంలో, ఏడుసార్లు యు.ఎస్. ప్రతినిధుల సభలో సభ్యురాలిగా ఉన్న కాలంలో.. మహిళల, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం పాటు పడ్డారు. విద్యకు, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. మేరీ టైలర్ మూర్ 1960లు, 70లు, 80లలో హాలీవుడ్ చిత్రాల్లోని మహిళల మూస పాత్రలు.. కాస్త వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలుగా పరివర్తన చెందడంలో మేరీ టైలర్దే ప్రధాన పాత్ర. అలా దర్శకుల్ని, నిర్మాతల్ని ఆమె ‘ఎడ్యుకేట్ చెయ్యగలిగారు. అప్పట్లో టీవీలో ‘ది మేరీ టైలర్ మూర్ షో’ పెద్ద సంచలనం. పురుషాధిక్యంపై ఆ షోలో ఆమె పిడిగుద్దులు కురిపించేవారు. ఉద్యోగినులుగా, పరిశ్రమల నిర్వాహకులుగా మహిళల సామర్థ్యాన్ని చూపించే కార్యక్రమాలను రూపొందించారు. సామాజిక, రాజకీయ రంగాలలోనూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మేరీ టైలర్.. ఆ రంగాలలోనూ మహిళ సమానత్వం కోసమే వ్యూహరచన చేశారు. గ్లోరియా స్టైనమ్ ఎనభై ఏళ్ల వయసులోనూ గ్లోరియా లైంగిక సమానత్వం కోసం పోరాడారు! గ్లోరియా ఫెమినిస్టు. యాక్టివిస్టు. 1960లు, 70లలో అమెరికన్ ఫెమినిస్టు ఉద్యమంలో ఆమెది సారథ్యగళం. ప్రసిద్ధ ‘ఎస్క్వెయర్’, ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలకు ఫ్రీలాన్సర్గా పనిచేశారు. ప్రధానంగా మహిళా సమస్యల్యే రిపోర్ట్ చేశారు. ‘ఉమన్ యాక్షన్ అలయెన్స్’, ‘నేషనల్ ఉమెన్స్ పొలిటికల్ కాకస్’, ‘ఉమెన్స్ మీడియా సెంటర్’, ‘మిస్ ఫౌండేషన్ ఫర్ ఉమెన్’ వంటి సంస్థలకు సహ వ్యవస్థాపకురాలిగా, వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. బిల్లీ జీన్ కింగ్ ‘బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్’తో బిల్లీ జీన్ కింగ్ ప్రసిద్ధురాలయ్యారు. ప్రపంచ చరిత్రలో స్త్రీ, పురుషుల మధ్య మొట్టమొదటిసారిగా జరిగిన ఆ టెన్నిస్ ‘యుద్ధం’లో ఓడిపోయింది ఎవరో తెలుసా? పురుషులు!! అధికులమని, అరివీరభయంకరులమని నిత్యం నిద్రలేవడంతోనే అహకరిస్తుండే పురుషులు ఆ రోజున తోక ముడిచి, మహిళల ఆత్మవిశ్వాసానికి మోకరిల్లారు. ప్రపంచ మహిళల పరువును నిలబెట్టడం కోసం టెన్నిస్ బరిలోకి దిగిన బిల్లీ జీన్ కింగ్... 6–4, 6–3, 6–3 తేడాతో మగ దురహంకార వరాహం... బాబీ రిగ్స్ను ఘోరాతిఘోరంగా ఓడించి మగవాళ్ల ఆధిక్యపు లోకాలను తిరగేసి, తలకిందులు చేశారు. టీవీల ముందు కూర్చుని సుమారు ఐదు కోట్లమంది, ప్రత్యక్షంగా ముప్పై వేల మంది చూస్తుండగా హోస్టన్లోని ఆస్ట్రోడోమ్ టెన్నిస్ కోర్టులో 1973 సెప్టెంబర్ 20న ‘బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్’ సాగింది. పురుషాధిక్యపు ఓడలు తిరగబడిన రోజు అది. ఎలినార్ రూజ్వెల్ట్ అమెరికాను ‘గ్రేట్ డిప్రెషన్’ నుండి తప్పించే ప్రయత్నంలో అధ్యక్షుడు రూజ్వెల్ట్ డిప్రెషన్లో పడిపోకుండా చెయ్యి అందించిన గ్రేట్ ఉమన్.. మిసెస్ రూజ్వెల్ట్! దేశాన్ని గట్టెక్కించేందుకు రూజ్వెల్ట్కు వచ్చిన ‘న్యూ డీల్’ఐడియా.. డైనింగ్ హాల్లో మిసెస్ రూజ్వెల్ట్ ఇచ్చిందేనని డీల్కు కాళ్లడ్డు పెట్టిన కన్జర్వేటివ్ల అనుమానం. ఎవరేం అనుకున్నా. ప్రత్యక్షంగా అధ్యక్షుడికి, పరోక్షంగా అగ్రరాజ్యానికీ ఆమె.. కొత్త ఊపిరి, ఉత్సాహం ఇచ్చిన మాట వాస్తవం. ఇందుకోసం ఎలినార్ వ్యూహ సారథుల శ్వేతసౌధాన్ని సైతం అమెరికన్ పౌరుల అతిథిగృహంలా మార్చారు.ఎలినార్ ప్రత్యేకించి మహిళల స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు. బెట్టీ ఫ్రైడే ఫ్రైడే 1963లో రాసిన ‘ది ఫెమినైన్ మిస్టిక్’ అనే పుస్తకంతో బెట్టీ మహిళా హక్కుల కార్యకర్తగా వెలుగులోకి వచ్చారు. ప్రసిద్ధ సంస్థ ‘నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్’ సహవ్యవస్థాపకులలో ఆమె ముఖ్యులు. ‘నేషనల్ అబార్షన్ రైట్స్ యాక్షన్ లీగ్’ ఆవిర్భావంలోనూ ఆమె కృషి ఉంది. తన జీవితకాలమంతా బెట్టీ మహిళల హక్కుల కోసమే పాటుపడ్డారు. అనేక పుస్తకాలు రాశారు. బార్బారా వాల్టర్స్ అమెరికన్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు. టెలివిజన్ పర్సనాలిటీ. వ్యాఖ్యాత. సామాజిక కార్యకర్త. మహిళల కోసం అనేక ‘షో’లను రూపొందించారు. మహిళా సమస్యలపై డిబేట్లు నిర్వహించారు. వృత్తిధర్మంగానే కాక, వ్యక్తిగతంగా కూడా బార్బారా.. మహిళా సంక్షేమం దిశగా సమాజంతో చైతన్యం తెచ్చే అనేక సూచనలు, సలహాలను తన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. మాయా ఏంజెలో రచయిత్రి, కవయిత్రి, నాటకకర్త, నాట్యకారిణి, గాయని, హక్కుల కార్యకర్త. తన జీవితాన్ని సందేశంగా, సంకేతంగా తన సృజనాత్మక ప్రక్రియలతో మహిళలకు అందించారు. ఈజిప్టులో, ఘనాలో జర్నలిస్టుగా చేశారు. అక్కడి మహిళా సమస్యల్ని ప్రపంచం దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా లైంగిక వివక్ష, లైంగిక సమానత్వం అనే అంశాలపై జీవితకాల కృషి సల్పారు. -
లైసెన్స్లో అమ్మ పేరు
మహిళలు ఇంటిని నడిపారు, ప్రపంచాన్నీ నడిపిస్తున్నారు. అయితే ఎక్కడ, ఏ రంగంలో ఏ అప్లికేషన్ ఫామ్ నింపాలన్నా వీరి పేరు నడవడం లేదు! ఇప్పుడా పరిస్థితి క్రమంగా మారుతోంది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వేస్తున్న ఈ తొలి అడుగు... స్త్రీ పురుష సమానత్వం సాధన కోసమా, అభ్యుదయ పథంలోపయనించడానికా అనేది పక్కన పెడితే అది.. ఒక సామాజిక అవసరం అయిందనే చెప్పాలి. ఓ సింగిల్ ఉమన్ పేరెంట్ తన బిడ్డను స్కూల్లో చేర్చాలంటే ఆ బిడ్డ తండ్రి పేరు రాయవలసిన కాలమ్ మాత్రమే కనిపిస్తుంది. స్కూలు ఫీజు కట్టడానికి, బుక్స్ కొనడానికి తల్లి డబ్బు పనికొస్తుంది. కానీ అప్లికేషన్ ఫారమ్లో తల్లి పేరు రాయడానికి కాలమ్ ఉండదు! ఆ తండ్రి అనే మనిషి పాపాయి పుట్టినప్పటి నుంచి ముఖం చూడకపోయినా, తన ముఖం బిడ్డకు చూపించకపోయినా సరే తండ్రి కాలమ్ తప్పని సరి! సాఫ్ట్వేర్లోనే దారి లేదు! ‘నేను పెళ్లి చేసుకోలేదు, బిడ్డను దత్తత తీసుకున్నాను, తండ్రి కాలమ్ నింపడం కుదరదు’ అని వాదించి, సుస్మితాసేన్ లాంటి వాళ్లు ఒక దారి చూపారు. ఆ దారిలో నడిచేందుకు సమాజంలో అనేక మంది సింగిల్ ఉమన్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ వాదనను అంగీకరించడానికి స్కూళ్లు, కాలేజ్లు ఇటీవలి వరకు సిద్ధంగా ఉండేవి కాదు. కొన్ని స్కూళ్లు అందుకు సంసిద్ధంగా ఉన్నప్పటికీ కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఆ కాలమ్ ఉండదు. కాబట్టి గార్డియన్ కాలమ్ దగ్గరే తల్లి పేరు రాసుకోవాల్సి వచ్చేది. అలాగే ఇతర రంగాలు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ ఫామ్లో తల్లి పేరున కూడా ప్రత్యేకంగా ఒక కాలమ్ ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సమానత్వం కాదు.. అవసరం ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వేస్తున్న ఈ తొలి అడుగు... స్త్రీ పురుష సమానత్వం సాధన కోసమా, అభ్యుదయ పథంలో పయనించడానికా అనేది పక్కన పెడితే అది.. ఒక సామాజిక అవసరం అయిందనే చెప్పాలి. ఇప్పుడు అనేక కారణాలతో సింగిల్ పేరెంట్స్ ఎక్కువవుతున్నారు. ఇండియాలో సింగిల్ పేరెంట్ అంటే సాధారణంగా.. తల్లి మాత్రమే. అలా తల్లి పెంపకంలో పెరిగిన పిల్లలు ఏ అప్లికేషన్లో అయినా తల్లి పేరు మాత్రమే రాయగలుగుతారు. ఒకవేళ తండ్రి పేరు ఫలానా అని తల్లి చెప్పినా సరే... బాధ్యత లేని ఆ తండ్రి పేరుతో తమ ఐడెంటిటీని ఇష్టపడటం లేదు ఈ తరం పిల్లలు. వీటన్నింటి దృష్ట్యా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ విభాగం తల్లి పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమలులోకి రానుంది. మిగతావీ తల్లి పేరు మీదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ దేశమంతటా చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఐడీ ప్రూఫ్ ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే మరే కార్డు అయినా తల్లి పేరుతోనే ఉంటుందని, దేశంలో ఇలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఢిల్లీనే అని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాస్పోర్ట్ విషయంలో ఈ వెసులుబాటు కల్పించింది. భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలలో వారి పిల్లలు నాచురల్ గార్డియన్ అయిన తల్లి సంరక్షణలో ఉండే అవకాశాలే ఎక్కువ. ఆ పిల్లలకు జారీ చేసే పాస్పోర్టులో తండ్రి పేరు ఇప్పుడు తప్పని సరి కాదు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడంలో చొరవ తీసుకున్నది మాత్రం ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వమే. ఓ పదేళ్ల కిందట ఒక మహిళ తాను సింగిల్ పేరెంట్నని చెప్పుకోవడానికి బిడియ పడేది. అప్పటి సామాజిక పరిస్థితులు అలా ఉండేవి. ఇప్పుడిక ఇలాంటి భరోసా కూడా దొరికితే ఇకపై ధైర్యంగా జీవించగలుగుతారు. వాళ్ల పిల్లలను వేధిస్తున్న ‘మీ నాన్న ఎవరు? ఎప్పుడూ కనిపించడేంటి’ వంటి ప్రశ్నలు దాదాపుగా ఉండవు. హర్ నేమ్ యొలాండా రీనీ ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ అన్నారు మార్టిన్ లూథర్ కింగ్. ఇప్పుడు ఆయన మనవరాలు 9 ఏళ్ల యొలాండా రీనీ అదే మాట అంటోంది. నలుపు, తెలుపు అనే తేడా లేకుండా మనుషులంతా ఒక్కటే అవ్వాలని మార్టిన్ కలగన్నారు. ‘అయిందేదో అయింది. గన్ కల్చర్ లేని గొప్ప దేశం కావాలి అమెరికా’ అని యొలాండా ఇప్పుడు కలగంటోంది. శనివారం వాషింగ్టన్లో జరిగిన ‘మార్చ్ ఫర్ అవర్ లైవ్జ్’ ప్రదర్శనలో మాట్లాడే చాన్స్ వచ్చినప్పుడు.. యొలాండా తన శక్తిమంతమైన గొంతుతో వేలాదిమందిని ఉర్రూతలూగించింది. ఎవరినైనా కట్టిపడేసే కంఠం అది. ఇంకో 27 ఏళ్ల తర్వాత 2036లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పే స్వరం అది. అప్పటికి ఏడాది ముందు మాత్రమే యొలాండాకు అధ్యక్షురాలిగా పోటీ చేసే కనీస వయసు (35 ఏళ్లు) వస్తుంది. లతీతియా కాయ్ ‘ఆహా.. ఎంత అందమైనదీ ప్రపంచం?!’ అని విస్మయం చెందుతుంది లతీతియా కాయ్. అత్యాచార దోషాన్ని బాధితుల మీదికే నెట్టేసే ఈ ప్రపంచంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసే తీరు ఇది! ఈ ఐవరీ కోస్ట్ దేశపు టీనేజ్ కళాకారిణి.. సామాజిక రుగ్మతలను ప్రశ్నించడానికి తరచు తన జుట్టును కూడా ముడి వేస్తుంటుంది. ‘మీటూ’ఉద్యమానికి మద్దతుగా లతీతియా వేసుకున్న ఈ ముడి.. వాటిల్లో ఒకటి. మినీస్కర్ట్లు వేసుకుంటున్నందువల్లనే అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయనే వాదనకు నిరసనగా ఈ అమ్మాయి ఇలా ‘హెయిర్డ్’ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోను పోస్ట్ చేసుకుంది. ఇదొక ఆలోచనాత్మకమైన సందేశం. ఆరాధ్యా రాయ్ అచ్చం ఐశ్వర్యలా ఉన్న ఆరాధ్య ఫొటోను చూసి సోషల్ మీడియా ఇప్పుడు ముద్దుగా మెటికలు విరుస్తోంది. ఇందులో ఆ నవ్వు, ముఖ కవళికలు అచ్చు అమ్మనే పోలివున్నాయి. ‘ఆరాధ్య తనకు తానుగా, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా ఎదగాలి’ అని ఐశ్వర్య అదే పనిగా అంటుంటారు. ఇక ముందు అలా అనే అవసరం ఆమెకు ఉండకపోవచ్చు. గ్లామర్ ఫీల్డులో ఉన్న అమ్మానాన్నను, తాతయ్యను చూస్తూ పెరుగుతున్న ఆరాధ్య ఒక మామూలు అమ్మాయిగా పరిణతి చెందడాన్ని ‘బిగ్’ ఫ్యామిలీ ఆనందంతో వీక్షిస్తోంది. బనితా సంధూ ఏప్రిల్లో విడుదల అవుతున్న ‘అక్టోబర్’ చిత్రంలో ప్రధాన కథానాయికగా మనం ఈ అమ్మాయిని చూడొచ్చు. పేరు బనితా సంధూ. అయితే అది హిందీ చిత్రం. అంతమాత్రాన ఆమెను చూడలేకపోతామని తెలుగువాళ్లం నిరాశ చెందే పనే లేదు. నటనలో ఆమె ప్రదర్శించిన ‘ఒడుపు’ను చూసి ముగ్ధుడైన చిత్ర దర్శకుడు షూజిత్ సర్కార్.. ఆమె ఎలా చేస్తే అలా చెయ్యనిచ్చి, అదే అసలైన నటన అని ప్రశంసించడంతో పాటు.. ‘పరభాషా చిత్రాలకు త్వరలోనే మీకు పిలుపు వస్తుంది’ అభినందించారు కూడా! బనితా వయసు ఇరవై. లండన్లో పుట్టారు. లండన్లోనే చదువుతున్నారు. పీజా తినడం, స్పెయిన్ వెళ్లడం ఆమెకు ఇష్టమైన విషయాలు. –మంజీర -
ఒకే శ్లాబు జీఎస్టీ తెస్తాం
మైసూర్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో ఒకే శ్లాబు తెస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ శనివారం మైసూర్లోని మహారాణి కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు. ఏడు శాతంగా ఒకే శ్లాబు కలిగిన సింగపూర్లో ఆరోగ్య సంరక్షణ ఉచితంగానే లభిస్తుండగా, 28 శాతం పన్ను వసూలు చేస్తున్న భారత్లో ఆ సౌకర్యం ఎందుకు లేదని రాహుల్ను ఓ విద్యార్థిని ప్రశ్నించింది. ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మోదీయేనని రాహుల్ అన్నారు. బహుళ శ్లాబుల జీఎస్టీ విధానం వల్ల అవినీతి పెరుగుతుందని, 28 శాతం పన్నుకు తాము వ్యతిరేకమని పునరుద్ఘాటించారు.మైసూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..నోట్లరద్దు, జీఎస్టీ ద్వారా ప్రజల నుంచి వారి సొమ్మును దూరం చేసిన బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందని అన్నారు. బూటకపు వార్తలతో న్యాయమంత్రి బిజీ.. ‘పెండింగ్ కేసులతో న్యాయ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో 55 వేలు, హైకోర్టుల్లో 37 లక్షలు, దిగువ కోర్టుల్లో 2.6 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. జడ్జీలు, ఇతర న్యాయాధికారుల నియామకాలు అటకెక్కాయి. న్యాయమంత్రి మాత్రం నకిలీ వార్తలను జోరుగా ప్రచారం చేస్తున్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. -
అమ్మాయికి నచ్చక్కర్లేదా?
‘‘ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే’’ అన్నారు రాశీ. సమానత్వం గురించి, ఇతర విశేషాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. ► సినిమా ఇండస్ట్రీ ‘మేల్ డామినేటెడ్’ అంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా మీది లాంగ్ కెరీర్. ఈ డామినేషన్ గురించి మీరేమంటారు? ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా. నేను, తమిళ్, మలయాళ సినిమాలు కూడా చేశాను. మలయాళంలో అంతగా డామినేషన్ కనిపించదు. అక్కడ అందరూ ఈక్వల్ అన్నట్లుగానే వ్యవహరిస్తారు. మనతో పోల్చితే తమిళంలో డామినేషన్ తక్కువ. మనకు చాలా ఎక్కువ. ► ‘పెళ్లి చూపులు’ అప్పుడు ‘అమ్మాయి నచ్చిందా’ అని అబ్బాయిని అడుగుతారు. కొన్ని చోట్ల ‘అబ్బాయి నచ్చాడా’ అని అడగకుండానే సంబంధం ఖాయం చేసేస్తారు. అమ్మాయి అభిప్రాయం అవసరంలేదా? ఎగ్జాక్ట్లీ. అది మాత్రం చాలా దయనీయమైన స్థితి. జీవితాంతం కలిసి బతకాల్సిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే హక్కు అమ్మాయికి ఉండదా? అబ్బాయికి నచ్చితే చాలా? అమ్మాయికి నచ్చక్కర్లేదా? పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా పెంచి, అత్తింటికి పంపాల్సి వచ్చినప్పుడు మాత్రం అమ్మాయి నిర్ణయం గురించి పట్టించుకోకపోవడం దారుణం అనే చెప్పాలి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు అబ్బాయికి ఉన్నప్పుడు అమ్మాయికి కూడా ఉండాలి. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఫర్వాలేదు. ఇంకా మారాలి. ► డిపెండెంట్ ఉమన్కి ఇండిపెండెంట్ ఉమన్కి తేడా ఏంటి? నేను మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా. నాకు ఊహ తెలిసినప్పుడు భర్త జాబ్ చేయాలి భార్య ఇంట్లో వంట చేయాలి, ఇంట్లో విషయాలు చూసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు పెరిగిన ధరల వల్ల కావచ్చు, ఇంట్లో ఏమీ తోచక.. ఇంకేదైనా రీజన్ వల్ల కావచ్చు ఆడవాళ్లు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు. వాళ్లు చదువుకున్న చదువుకి తగ్గ జాబ్ లేదా ఏది చేయగలిగితే ఆ పని చేసి సంపాదించాలనుకుంటున్నారు. అది మంచి పరిణామం. నాకు తెలిసినంత వరకు ఉమన్ ఇండిపెండెంట్గానే ఉండాలి. ఉండటమే మంచిది. డిపెండెన్సీలో ఓ ఇన్సెక్యూర్టీ ఉంటుంది. ఏది చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సిందే. సొంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయలేరు. ఇండిపెండెంట్ ఉమన్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉంటూనే ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అవ్వడం తప్పు కాదు. ► రెమ్యునరేషన్ హీరోలకు ఎక్కువ.. హీరోయిన్లకు తక్కువ. దీని గురించి ఏమంటారు? ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు కొంచెం బెటర్. నేను హీరోయిన్ గా చేసినప్పుడు హీరోకి ఓ 70 లక్షలు ఇచ్చారనుకోండి.. మాకు 8 నుంచి 10 లక్షలు ఇచ్చేవారు. అంత డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు హీరోకి 3 కోట్లు ఇస్తే హీరోయిన్కి కూడా దగ్గర దగ్గర కోటి రూపాయలు ఇస్తున్నారు. ఆ మార్పు వచ్చినందుకు హ్యాపీ. అయితే ఎప్పుడూ హీరోకే ఇంపార్టె ఉంటుంది. ఎందుకంటే సినిమా బిజినెస్ జరిగేదే హీరో మార్కెట్ని బేస్ చేసుకుని అంటారు కదా. అలాగని హీరోయిన్ లేని సినిమా ఉంటుందా? నెవర్. హీరో లేని సినిమాలు వస్తున్నాయి కదా. అందుకే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. ► కొందరు హీరోయిన్లు ‘ఫైనాన్షియల్ మేటర్స్’ని మీలా అమ్మకో, నాన్నకో, అన్నయ్యకో అప్పజెప్పేస్తారు. ఎందుకలా? ‘ఫైనాన్షియల్ మేనేజ్మెంట్’ చేత కాకపోవడం వల్లనా? చేత కాదని కాదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి, ఆ తర్వాత హీరోయిన్ అయ్యాను. చిన్నప్పుడు అమ్మానాన్న చూసుకున్నారు. పెద్దయ్యాక అదే కంటిన్యూ అయింది. నేను ఏ సినిమాలు చేయాలి? ఎంత బాగా యాక్ట్ చేయాలి? అనే విషయాల మీదే దృష్టి పెట్టేదాన్ని. నేనంటే చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చేశాను కాబట్టి నేను ‘డిపెండ్’ అయ్యాను. ఇప్పుడు కొందరు హీరోయిన్లు ‘ఇండిపెండెంట్’గా ఉంటున్నారు. అది మంచిదే. మా జనరేషన్ హీరోయిన్స్ కంటే ఇప్పుడు హీరోయిన్స్ చాలా బెస్ట్. మాలా 14, 15 ఇయర్స్, 20 ఇయర్స్ లోపు రావటం లేదు. చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటున్నారు. మాలాగా రైట్ సైడ్లో అమ్మ, లెఫ్ట్ సైడ్లో నాన్న ఉండాలనుకోవడంలేదు. వాళ్లంతట వాళ్లే షూటింగ్స్కు వెళ్లిపోతున్నారు. కేవలం స్టాఫ్ ఉంటే చాలు. మొత్తం వాళ్లే మేనేజ్ చేసుకుంటున్నారు. ఎవరి మీదా ఆధారపడటంలేదు. అలానే ఉండాలి. ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో తెలుసుకుంటున్నారు. ‘సేఫ్’గా లైఫ్ని ప్లాన్ చేసుకుంటున్నారు. హీరోయిన్లనే కాదు.. ఆడవాళ్లందరూ చాలా తెలివిగా ఉండాలి. మనకెందుకులే? మగవాళ్లు చూసుకుంటారు అనుకోకూడదు. ‘ఆధారపడటం’ అంటే మన లైఫ్ని వేరేవాళ్ల చేతిలో పెట్టేసినట్లే. ఉన్న ఒక్క లైఫ్ మన చేతుల్లో లేకపోతే ఎలా? ► ‘నీకేం తెలుసులే’ అని భార్యను భర్త అనడం చాలా ఇళ్లల్లో చూస్తుంటాం. ఇంట్లో ‘డెసిషన్ మేకింగ్’ ఎవరిదైతే బాగుంటుంది? ఆడవాళ్లదైతేనే బాగుంటుంది. ఎందుకంటే పుట్టినింటి బంధువులను, మెట్టినింటి బంధువులను కలిపి ఉంచగలిగేది ఆడవాళ్లే. ఇంటి మేనేజ్మెంట్ ఆడవాళ్ల చేతుల్లోనే ఉండాలి. మా ఇంటికి సంబంధించినంతవరకూ చాలావరకు నా నిర్ణయాలే. అయినా డెసిషన్ అనేది ‘విషయం’ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మీద భర్తకు పట్టు ఉంటే తనే డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ భార్యకు ఉంటే ఆమెకే వదిలేయాలి. అంతేకానీ నేను మగాణ్ణి.. నేనే డెసిషన్ తీసుకోవాలి. నేననుకున్నదే జరగాలనుకోకూడదు. ఎందుకంటే ‘రాంగ్ డెసిషన్ ’ ఇంటిని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇద్దరూ ఓ అండర్స్టాండింగ్కి వచ్చి, ‘ఇదిగో ఈ విషయంలో నువ్వైతే బెటర్. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఫర్వాలేదు’ అని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ► భార్య కన్నా భర్త ఎక్కువ సంపాదిస్తే భర్తకు డైజెస్ట్ కాదు. సొసైటీ ఆ భర్తకు పెద్దగా విలువ ఇవ్వదు. ఏం.. భార్య ఎక్కువ సంపాదించకూడదా? సొసైటీ దాకా ఎందుకు? భార్యాభర్త.. ఇద్దరూ సంపాదిస్తున్న ఒక ఇంటిని తీసుకుందాం. భార్యకు భర్త కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే.. ఇంట్లో పని చేసేవాళ్లు కూడా ‘మేడమ్ మేడమ్’ అని భార్యకే ఎక్కువ విలువ ఇస్తారు. భార్య ఆ విషయాన్ని మామూలుగా తీసుకుంటే ఓకే... తన గురించి తాను ఎక్కువ అనుకుని, భర్తను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఆటోమేటిక్గా పిల్లలకు, రిలేటివ్స్కు కూడా ఆ భర్త చులకన అయిపోతాడు. అలా కాకుండా ‘మన కుటుంబం కోసం సంపాదిస్తున్నాం’ అనే ఫీలింగ్తో భార్య ఉండాలి. బాగా సంపాదించే భర్త కూడా అలానే అనుకోవాలి. అప్పుడా సంసారం బాగుంటుంది. ఆడవాళ్లు ఎక్కువ సంపాదిస్తే తప్పేం కాదు. ఇద్దరూ సమానం అనుకోగలిగితే ఎటువంటి సమస్యలూ రావు. – డి.జి. భవాని -
ద్రవిడ్ మాట మన్నించారు
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం, విజయవంతమైన జూనియర్ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది. అండర్–19 ప్రపంచకప్లో భారత జట్టు విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ద్రవిడ్తో పాటు బృంద సభ్యులందరికీ రూ. 25 లక్షల చొప్పున నజరానా అందిస్తామని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. కప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్ కోచ్ ద్రవిడ్కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. దీనిపై ద్రవిడ్ అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ (బెంగళూరు)లో జట్టు సన్నాహాల్లో పాల్గొన్న సహాయ సిబ్బందికి కూడా నజరానా అందనుంది. మొదటి నజరానా జాబితాలో ఉన్న పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), అభయ్ శర్మ (ఫీల్డింగ్ కోచ్), యోగేశ్ పార్మర్ (ఫిజియోథెరపిస్ట్), ఆనంద్ దతే (ట్రెయినర్), మంగేశ్ గైక్వాడ్ (మసాజ్), దేవ్రాజ్ రౌత్ (వీడియో అనలిస్ట్)లతో పాటు స్వదేశంలోని సన్నాహాల్లో పాలుపంచుకున్న మరో ఐదుగురు డబ్ల్యూవీ రామన్ (కోచ్), మనుజ్ శర్మ, సుమిత్ మలహపుర్కర్ (లాజిస్టిక్స్ మేనేజర్స్), అమోఘ్ పండిట్ (ట్రెయినర్), రాజేశ్ సావంత్ (దివంగత ట్రెయినర్)లకు బోర్డు బెనిఫిట్స్ దక్కనున్నాయి. ద్రవిడ్కు సగం నజరానా (రూ.25 లక్షలు) తగ్గినా అతను కోరుకున్న సమానత్వం మాత్రం దక్కింది. ఔరా... ద్రవిడ్ ఔదార్యం పృథ్వీ షా నేతృత్వంలోని కుర్రాళ్ల జట్టు ఒక్క మ్యాచ్ (ఫైనల్)తో అండర్–19 ప్రపంచకప్ గెలిచింది. కానీ ఆ ఒక్క విజయం కోసం ద్రవిడ్ సారథ్యంలోని కోచింగ్ బృందం ఓ ఏడాదికిపైగా విశేష కృషి చేసింది. ఈ బృంద సభ్యుల్లో కొందరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలందిస్తే, ఇంకొందరు న్యూజిలాండ్ (ఆతిథ్య దేశం)కు జట్టుతో పాటు వెళ్లి చెమటోడ్చారు. అయితే బీసీసీఐ మొదట కివీస్ వెళ్లిన కోచింగ్ బృందానికే నజరానా ప్రకటించగా... టీమ్ ట్రెయినర్ రాజేశ్ సావంత్ గతేడాది మరణించారు. రాజేశ్ కూడా యువ జట్టును తీర్చిదిద్దిన రాహుల్ అండ్ కో సభ్యుడు. దీంతో అతనికి ప్రోత్సాహకం అందాలని ద్రవిడ్ గట్టిగా కృషిచేశాడు. ఇప్పుడు బోర్డు అతని కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడింది. అందినకాడికి వచ్చిన దాంతో తన ఇంటిని మాత్రమే చక్కబెట్టుకునే వాళ్లున్న ఈ రోజుల్లో అందరికి పేరు, ప్రోత్సాహం రావాలన్న ద్రవిడ్ నిజంగా గ్రేట్... గ్రేటెస్ట్ కదా! -
శభాష్ తల్లీ
సృష్టికి జన్మ ఇస్తూ... ఇస్తూ... ఇస్తూ... పురిటినొప్పులు పడుతూ... పడుతూ... పడుతూ... లేస్తూ... లేస్తూ.. లేస్తూ... పునర్జన్మలు పొందుతూ... పొందుతూ... పొందుతూ... తల్లి భారతి సమాజానికి పునరుజ్జీవనం ఇస్తూ... ఇస్తూ... ఇస్తూ.. రాబోయే కొత్త సంవత్సరానికి మనకు స్ఫూర్తిని పంచుతూ... పంచుతూ... పంచుతూ... అసలు మహిళ విజయం సాధించనిదెప్పుడు? కుటుంబంలో.. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎవరి విజయమైనా అది మహిళదే! తన శక్తియుక్తులను ఇంటికి, కుటుంబానికి ధారపోస్తేనే కదా.. ఏలికలు సవ్యంగా పాలించేది! సమాజాన్నయినా.. దేశాన్నయినా.. చివరకు ఈ లోకాన్నయినా! ప్రతి పురుషుడి గెలుపు వెనక స్త్రీ త్యాగం ఉందని లోకోక్తి కూడా కదా! ఇలా ఇంటిని చూస్తూ బయట పనులూ చక్కబెట్టే మహిళ శక్తికి మాటలు గట్టే ప్రయత్నం చేస్తే విశ్వమంత పేజీ అయినా సరిపోదు. ఆమె ఆత్మనిబ్బరం, ఆత్మవిశ్వాసం, సాహసాన్ని ఏ భాషా నిర్వచించలేదు. ఒక్క ఉదాహరణ.. ఉత్తరప్రదేశ్కి చెందిన లక్ష్మీ అగర్వాల్. టీవీ చానళ్లలో రియాలిటీ షోస్లో పాడుతూ.. సింగర్గా మంచి పేరు తెచ్చుకోవాలని పధ్నాలుగేళ్ల వయసు నుంచీ కలలు కన్నది. వాటిని నెరవేర్చుకోవడానికి సాధన చేసింది. 32 ఏళ్ల ఓ వ్యక్తి లక్ష్మి మీద మనసు పడ్డాడు. మగాడు మనసు పడ్డ అమ్మాయి అతని ఆస్తి అనే భావం ఈ దేశంలో జాస్తి కదా! అందుకే అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆర్డర్ వేశాడు. నువ్వు నాకే అని. కాదు.. నేను నాకే అంది లక్ష్మి. అహం దెబ్బతిన్న పురుషుడు ఆమె మొహం మీద యాసిడ్ పోశాడు. దాదాపుగా మరణం అంచుకు వెళ్లి మళ్లీ జీవం నింపుకుంది. కొన్ని యేళ్లు పట్టింది. అయినా ఆశను చావనివ్వలేదు. నెమ్మదిగా నిలదొక్కుకుంది. తనకు జరిగిన అన్యాయం ఇంకో ఆడపిల్లకు జరగొద్దని ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ క్యాంపెయిన్ను ప్రారంభించింది. యాసిడ్ అటాక్ తర్వాత గొంతు దగ్గర చర్మం బిగుసుకుపోయి పాటకు సహకరించకపోయేసరికి టెలివిజన్ హోస్ట్గా మారింది. 2014లో అప్పటి అమెరికా మొదటి పౌరురాలు మిషెల్లీ ఒబామా చేతుల మీదుగా ఇంటర్నేషనల్ విమెన్ కరేజ్ అవార్డును అందుకుంది. అంతేకాదు, ఎన్డీవీ వాళ్ల ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్నీ పొందింది. అనురిమా సిన్హాది ఇంకో రకమైన గెలుపు. జాతీయస్థాయి వాలీబాల్, ఫుట్బాల్ ప్లేయర్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో చేరాలన్నది ఆమె స్వప్నం, ఆశయం కూడా. ఆ పరీక్ష రాయడానికే రైలెక్కింది. అందులో ఉన్న కొంతమంది దుండగులు అనురిమ మెడలో బంగారు గొలుసును దొంగిలిద్దామని ఆమె ఒంటి మీద చేయి వేశారు. నిలువరించింది అనురిమ. అంతే! అందరూ కలిసి ఆమె మీద పడ్డారు గొలుసు లాక్కొని కదులుతున్న రైల్లోంచి ఆమెను బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది అనురిమా. కాని కలను కాదు. కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కింది. పెట్టుడుకాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఎన్నో అవార్డులు తీసుకుంది. కిలిమంజారో ఎక్కడం గురించీ ఇప్పుడు ఆలోచిస్తోంది. ఫరిదాబాద్కు చెందిన కిరణ్ కనోజీది కూడా ఇలాంటి అనుభవమే. ఆమె హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రైల్లో ఫరిదాబాద్కు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ను దొంగిలించబోతూ రైల్లోంచి ఆమెను కిందకు తోశారు. ఆ దుర్ఘటనలో ఆమె ఒక కాలు కోల్పోయింది. అయినా స్థయిర్యం కోల్పోలేదు. బ్లేడ్ రన్నర్గా గెలుపును వరించింది. జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆరోగ్య సిరి పశ్చిమ బెంగాల్కు చెందిన సుభాషిణీ మిస్త్రీ... ఊరందరి క్షేమం కోసం తపించిన తల్లి. ఆమె భర్త కూరగాయలు అమ్మేవాడు. ఒకసారి జబ్బు చేసి ఊళ్లో హాస్పిటల్ లేక.. వైద్యసహాయం అందక చనిపోయాడు. అప్పటికే వాళ్లకు నలుగురు పిల్లలు. సుభాషిణి ఏమీ చదువుకున్నది కాదు. అయినా కుటుంబ బండిని లాగే భారం ఆమె తీసుకోక తప్పలేదు. భర్త పనినే అందుకుంది. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించ సాగింది. అయితే మనసులో ఒకే కోరిక. తన భర్తలాగే ఆ ఊళ్లో వైద్యం అందక ఎవరూ చనిపోకూడదు. అందుకే వచ్చిన డబ్బుల్లో కొంతలో కొంత దాచేది. ఓవైపు కూరగాయలు అమ్ముతూనే ఇంకోవైపు ఇళ్లలో పనిచేసింది. కూలికి వెళ్లింది. అలా 20 ఏళ్లు కూడబెట్టిన డబ్బులతో ఒక ఎకరం భూమి కొన్నది. అంతకుముందు ఆమె ప్రయత్నాన్ని చూసి నవ్విన వాళ్లంతా ఆశ్చర్యంతో నొసలు ముడివేశారు. కొడుకులూ అందివచ్చారు. ఆ నేలలో ఒక గదితో క్లినిక్ కట్టాలనే తమ తల్లి నిశ్చయానికి ఊతమిచ్చారు. తెలిసిన వాళ్ల దగ్గర్నుంచి కొంత చందా తెచ్చారు. అంతా కలిపి ఎట్టకేలకు ఒక గది ఉన్న క్లినిక్ను కట్టారు. వీళ్ల సంకల్పానికి ముచ్చటపడ్డ డాక్టర్లు వంతులవారీగా వచ్చి వైద్యసేవలందించడం మొదలుపెట్టారు. కేవలం పది రూపాయల ఫీజుతో. ఆ ఫీజునూ ఈ క్లినిక్ను ఇంకా విస్తరించడానికే ఖర్చు చేస్తున్నారు. ఇది సుభాషిణి విజయం! సమానహక్కు.. ముంబైకి చెందిన సఫీనా హుసేన్.. సమాన హక్కులు సాధించడానికి చదువొక్కటే సాధనం అని నమ్మే వ్యక్తి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పట్టాపొందిన సఫీనా 2007లో బాలికల చదువుకోసం ఒక ఎన్జీవో ప్రారంభించింది. బేటీ బఢావో కార్యక్రమాన్ని మోదీ కంటే ముందునుంచే ప్రచారం చేయడమే కాదు.. పనీ చేస్తోంది. జీవితమంతా దానికే అంకితం అంటోంది. వ్యాపార దక్షత.. విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అంటూ ఈ యేడు మహిళా వ్యాపార దక్షతను ప్రోత్సహించడానికి ప్రపంచమంతా నడుం కట్టింది. సాక్షాత్తు అమెరికా ఆడపడచు ఇవాంకా ట్రంప్ దానికి సారథ్యం వహించింది. వేదిక మన దేశమైంది. నిజమే! మహిళకు ముందు స్థానమిస్తే అందరి సంక్షేమాన్నీ ఆమె కాంక్షిస్తుంది. ఆమెకు జెండర్ డిస్క్రిమినేషన్ తెలియదు. ఆలస్యమైనా ఆ ఆలోచన చేసిన జగత్తుకు జేజేలు. అలాంటి దక్షత ఉన్న ఒక సామాన్య స్త్రీ పరిచయం ఇది. ఆమె పేరు కమల్ కుంభార్. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ ఆమె ఊరు. తనలాగా పేదరికంలో ఉన్న మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడం కోసం తన వెరైటీ కోళ్లతో ఒక చిన్న పౌల్ట్రీ ఫామ్ను స్థాపించింది ముందు. అది ఇప్పుడు మహారాష్ట్ర అంతటా విస్తరించి ఎంతోమంది ఒంటరి, పేద మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తన పౌల్ట్రీ బిజినెస్ మీద వచ్చిన లాభాలతో ఆమే ఇంకో ఆరు వ్యాపారాలు మొదలుపెట్టి వాటిని లాభాల బాటలో నడిపిస్తోంది. దాదాపు 5వేల మంది మహిళలకు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టించి ఎంట్రప్రెన్యూర్కి రోల్ మోడల్గా నిలిచింది. కనికాటేక్రివాల్ కూడా ఎంట్రప్రెన్యూరే. అయితే ఆమె ప్రయాణం మరోలా సాగింది. ఆమె పుట్టిపెరిగిందంతా భోపాల్లోనే. పదిహేడేళ్లకే ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పార్ట్టైమ్ జాబ్తో. ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలున్నాయని, అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్గా పరిణామం చెందబోతోందని ఆ వయసులోనే గ్రహించింది కనిక. అంతేకాదు, ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్స్కి మంచి డిమాండ్ ఉందని కూడా తెలుసుకోగలిగింది. ఆ దిశగా అడుగులు వేద్దామనుకునేలోపే అంటే తన 21వయేట క్యాన్సర్ బారిన పడింది. ఒకవైపు క్యాన్సర్తో పోరాడుతూనే ఇంకోవైపు ఏవియేషన్ ఇండస్ట్రీలో తన పెట్టుబడి ఆలోచనలకు పిల్లర్స్ వేసుకోనారంభించింది. ట్రీట్మెంట్ సమయంలో ఆ ఇండస్ట్రీ గురించి అధ్యయనం చేసింది. క్యాన్సర్ను జయించింది. ఏవియేషన్ ఇండస్ట్రీలోనూ తన కంపెనీని టేకాఫ్ చేసింది. 2013లో ‘జెట్సెట్గో’ తో. చార్టెడ్ జెట్స్కి ఫస్ట్మార్కెట్ ప్లేస్ అదే. ఇప్పుడు ఆమెకు 28 ఏళ్లు. పదహారు ఎయిర్క్రాఫ్ట్స్తో కాంట్రాక్ట్ సైన్ చేసి రోజుకు నాలుగు నుంచి 20 విమానాలను రన్వే మీద పరిగెత్తిస్తోంది కనిక టేక్రివాల్. లేడీ టార్జాన్.. జమునా తుడు.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని మతుర్ఖమ్ స్వస్థలం. అదంతా అటవీప్రాంతం. స్మగ్లర్ల బెడద చాలా ఎక్కువ. వాళ్లంతా మాఫియాగా మారి అడవిని నాశనం చేస్తూ ఆ ప్రాంత గిరిజనుల బతుకును దుర్భరం చేయసాగారు. వాళ్ల ఆగడాలను అటవీశాఖా ఆపలేకపోయింది. ఒక్క చేవ చూపించింది పదిహేడేళ్ల ఒక సివంగి. ఆమే జమునా. తనతోపాటు 25 మంది మహిళలను కలుపుకొని విల్లంబులు చేత పట్టుకొని అడవిని పహారా కాసే బాధ్యతను తీసుకుంది. 50 హెక్టార్ల ఆ వనం నుంచి మాఫియా ముఠాను తరిమి కొట్టింది. ఇప్పుడు ఆమె సైన్యంలో 60 మంది మహిళలున్నారు. ఆ ప్రాంతమంతా ఆమెను లేడీటార్జాన్ అని పిలుచుకుంటారు గౌరవంగా! సైంటిస్ట్ అమ్మ అవసరాలే పరిష్కారాలను కనిపెడ్తాయి. ఈ అమ్మ కథ అలాంటిదే. బెంగళూరుకు చెందిన రాజలక్ష్మి బొర్తాకుర్కు ఒక కొడుకు. ఎపిలెప్సీతో బాధపడ్తున్నాడు. ఎప్పుడు బాగుంటాడో.. ఎప్పుడు ఫిట్స్ వస్తాయో తెలియదు. ఒక్క క్షణం బాబును వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. కనీసం ఫలానా సమయంలో ఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలిసినా జాగ్రత్తగా ఉండొచ్చు. బాబు అనారోగ్యంతో ఆమె చాలా నీరసించి పోయింది. విపరీతంగా అలసిపోయింది. నిరాశా నిస్పృహలకు లోనయ్యింది. అసలు ఫిట్స్ ఎప్పుడు వస్తాయో కనిపెట్టే పరికరం ఏమైనా ఉందా అని అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. లేదని తేలి.. తానే ఎందుకు కనిపెట్టకూడదని పరిశోధనా ప్రారంభించింది. మూడేళ్ల ఆ కష్టానికి ఫలితం కనపడింది. ఒక సింపుల్ గ్లోవ్ను కనిపెట్టింది. అందులోని సెన్సర్లు ఫిట్స్ వచ్చే ప్రమాదాన్ని హెచ్చరిస్తుంటాయన్నమాట. ఇలా తన కొడుకు కోసం రాజలక్ష్మి కనిపెట్టిన ఈ పరికరం అలాంటి ఎంతోమంది జీవితాలను రక్షిస్తోంది. ఫైర్ ఫైటర్.. నాగ్పూర్వాసి హర్షిణీ కన్హేకర్ తొలి మహిళా ఫైర్ ఫైటర్. అదొక కోర్స్ ఉంటుందని కూడా తెలియని ఆమె తన స్నేహితురాలికి సహాయంగా వెళ్లి దాని గురించి తెలుసుకొని ఫైర్ సర్వీస్లో సీట్ తెచ్చుకుంది. పెద్ద పెద్ద ఫైర్స్ యాక్సిడెంట్స్ను ఒంటిచేత్తో హ్యాండిల్ చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. వెటర్నరీ డాక్టర్.. మహారాష్ట్రకే చెందిన సునీతా కాంబ్లే ఆ ప్రాంతంలోని తొలి మహిళా వెటర్నరీ డాక్టర్. మహాస్వాడ్.. కరువు ప్రాంతం. ప్రధాన జీవనాధారం గొర్రెలు. కాని అక్కడి పరిస్థితుల వల్ల వాటిని కాపాడ్డం చాలా కష్టంగా ఉండింది. అవి బతికితేనే ఆ ఊళ్లకు బతుకు. అప్పుడే అనుకుంది సునీత. పశువుల డాక్టర్.. ప్రత్యేకించి గొర్రెల ఆరోగ్యాన్ని రక్షించే డాక్టర్ కావాలని. కుటుంబం, కమ్యూనిటీ ఆడపిల్లకు చదువేంటి, అందునా అలాంటి చదువేంటి? అని వ్యతిరేకరిస్తున్నా.. వెనక్కి లాగుతున్నా.. వెటర్నరీ డాక్టర్ అయింది. ప్రస్తుతం మహాస్వాడ్కి దేవతలా గౌరవాన్నందుకుంటోంది. ఈ మెచ్చుకోలు మచ్చుకే! స్త్రీ ఇంటిని చక్కదిద్దుతున్నా.. బయట వ్యవహారాలను చక్కబెడుతున్నా.. ఏకాగ్రత, చిత్తశుద్ధి, నిబద్ధత ఆమె అలంకారాలు! సహనం ఆమె ఆయుధం! ఇవన్నీ ఆమె వ్యక్తిత్వంలో ఒదిగిన కలికితురాయిలు! – సరస్వతి రమ -
ఈక్వల్ ఈక్వల్
దేవుడి సృష్టిలో మనుషులమంతా సమానమే. కాకపోతే సృష్టి అవసరాల కోసం ఆడ, మగ అని వేరు చేసి ఎవరి దేహధర్మాలను వారికి ఇచ్చాడు. ఆ ధర్మాలకు అనువుగా స్త్రీ పురుషుల పని విభజన జరిగింది తప్ప ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని కాదు. ఒక పని ఎక్కువ, ఒక పని తక్కువ అని కాదు. ప్రపంచాన్ని ఇప్పుడు కంప్యూటర్ నడిపిస్తోంది. అందులో హార్డ్వేర్ గొప్పా? సాఫ్ట్వేర్ గొప్పా? రెండూ గొప్పే. ఒకటి లేకపోయినా పని కాదు. అంటే రెండింటికీ సమానవైన విలువ ఉంది. దేన్నీ తక్కువ చెయ్యడానికీ, దేన్నీ ఎక్కువ చెయ్యడానికీ లేదు. ఈక్వల్ ఈక్వల్. ఇందులోనూ మళ్లీ హార్డ్వేర్ అంటే మగవాడనీ, సాఫ్ట్వేర్ అంటే స్త్రీ అనీ పోలిక తెస్తున్నారు. అదీ కరెక్టు కాదు. ఆడవాళ్లల్లో హార్డ్వేర్ నిపుణులు ఉన్నారు. మగవాళ్లలో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్లు ఉన్నారు; బైక్లు నడుపుతున్న ఆడవాళ్లు ఉన్నారు. ఇంటిపనులన్నీ చక్కగా చేసే మగవాళ్లూ ఉన్నారు. ఎవరి ప్రాముఖ్యం వాళ్లది. అయితే గుర్తింపులో, కష్టానికి ప్రతిఫలం పొందడంలో మాత్రం మహిళలు మగవాళ్లకంటే తక్కువగా ఉంటున్నారు. ఎంత అన్యాయం! ఎంత అసమానత! పని గంటలు సమానం అయినప్పుడు, ప్రతిఫలం కూడా సమానంగానే కదా ఉండాలి. అలా కాకుండా.. వివక్ష చూపుతున్నామంటే దేవుడి సృష్టిపైనే వివక్ష చూపుతున్నాం అని. ఎంత అపరాధం! చరిత్రలో ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. 1975 డిసెంబర్ 29న బ్రిటన్ పార్లమెంటు.. ‘ఈక్వల్ పే, ఈక్వల్ రైట్..’ చట్టాన్ని తెచ్చింది. ఆఫీస్లలో, సమాజంలో స్త్రీపురుష సమానత్వం ఉండాలని శాసించింది. మనుషులు అనుకోవాలే కానీ, శాసనాలు అవసరమా? అవసరం లేదు. దేవుడి అభీష్టాన్ని నెరవేర్చడానికి మనిషికి శాసనాలు అక్కర్లేదు. సంకల్పం చాలు. -
సమసమాజమే రామానుజుల లక్ష్యం
- అందుకోసం వెయ్యేళ్ల క్రితమే జీవితాంతం కృషి - కొనియాడిన త్రిదండి చినజీయర్ స్వామి సాక్షి, న్యూఢిల్లీ: అసమానతల్లేని సమాజమే లక్ష్యంగా వెయ్యేళ్ల క్రితమే శ్రీ రామానుజా చార్యులు జీవితాంతం కృషి చేశారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్స్వామి కొనియాడారు. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని తన ఆశ్రమమైన ‘జీవ’లో ప్రతిష్టించనున్న 216 అడుగుల రామానుజుల పంచలోహ విగ్రహ (సమతా విగ్రహం) ఏర్పాట్ల వివరా లను చినజీయర్స్వామి శనివారం ఢిల్లీలో విలే కరులకు వెల్లడించారు. సుమారు రూ. 1,000 కోట్ల వ్యయంతో వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టించనున్న రామానుజుల విగ్రహ ఏర్పా ట్లు నవంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 21 వరకు 27 రోజుల పాటు ఆశ్రమంలో వివిధ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నామన్నారు. ఈ సందర్భంగానే రామా నుజుల విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లను మూడు దశల్లో చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నట్టు చెప్పారు. రామానుజాచార్యుల జీవితాన్ని వివరిస్తూ మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆడిటోరియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. సమసమాజ స్థాపన తోపాటు సమస్త మానవాళికి వేదాల అవస రాన్ని చాటేందుకు రామానుజులు జీవితాం తం పాటుపడిన విధానాన్ని వర్చువల్ చిత్రాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తామన్నారు. రామానుజుల జీవిత విశేషాలపై షార్ట్ ఫిలిం ఫెస్టివల్... రామానుజుల జీవిత ఇతివృత్తం, ఆయన అనుసరించిన ఆదర్శాల వల్ల సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించేలా అంతర్జాతీయ లఘు చిత్ర ఉత్సవాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు హైదరా బాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించనున్నట్లు చినజీయర్స్వామి తెలిపారు. ఇందులో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి మొదటి బహు మతికి రూ. 10 లక్షలు, రెండో బహుమతికి రూ. 8 లక్షలు, మూడో బహుమతికి రూ. 6 లక్షలు ఇస్తామన్నారు. బహుమతుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 4న తమ ఆశ్రమంలో జరుగు తుందన్నారు. లఘు చిత్రాల చిత్రీకరణలో వైష్ణవ తెంకలి సంప్రదాయాన్ని పాటించాలని కోరారు. లఘు చిత్రాలను ఏ భాషలో అయినా చిత్రీకరించవచ్చని, అయితే అందులో ఆంగ్లం లో సబ్ టైటిల్స్ ఉండేలా చూడాలని, చిత్రం నిడివి 8 నిమిషాలకు మించకుండా ఉండాల న్నారు. సంబంధిత వివరాలు సేవ్టెంపుల్. ఓఆర్జీలో ఉంటాయన్నారు. సమావేశంలో మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, గజల్ శ్రీనివాస్, జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు పాల్గొన్నారు. ప్రధాని గుర్తించడం అభినందనీయం.. సమానత్వం కోసం రామాను జులు చేసిన కృషిని ప్రధాని మోదీ గుర్తించి ఆచరించడం అభినందనీ యమని చిన్నజీయర్స్వామి పేర్కొన్నా రు. మోక్షానికి సంబంధించిన గురు మంత్రాన్ని సర్వజనుల హితం కోసం రామానుజులు బహిర్గతం చేశారని మే 1న రామానుజుల తపాలాబిళ్ల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని పేర్కొనడం సంతోషకరమన్నారు. దేశ స్వాతంత్య్రం అనంతరం రామానుజుల కృషిని గుర్తించిన ఏకైక ప్రధాని మోదీయేనన్నారు. -
స్వేచ్ఛ, సమానతలకు ప్రతీక
కొత్త కోణం భారత రిపబ్లిక్ దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యతను, రాజకీయ, పాలనా పరమైన విస్తృతిని కలిగి ఉంది. ఆ రోజున అమలులోకి వచ్చిన మన రాజ్యాంగం అత్యంత విశిష్టమైనది. అది ప్రపంచంలోనే అత్యంత వివరమైన రాజ్యాంగం. అది భాష, ప్రాంత, కుల, మత, లింగ వివక్షలను వ్యతిరేకిస్తున్నది. అంతేకాదు భాష, మత, మైనారిటీలకు, తరతరాలుగా వివక్షకు గురవుతున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు కల్పించడం మన రాజ్యాంగం ప్రత్యేకత. ‘‘మన దేశ వర్తమాన, భవిష్యత్తులను సుందరంగా, అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతలను మనం మన భుజస్కంధాల మీదికి ఎత్తుకున్నాం. చిన్న చిన్న విషయాలపైన దృష్టి పెట్టడం మంచిది కాదు. భారత దేశం ప్రపంచ వేదిక మీద ఒక ప్రధాన భూమికను పోషించే వైపు పయనిస్తున్నది. ప్రపంచంలోని కళ్లన్నీ మన వైపే చూస్తున్నాయి. నూతన భారతదేశ అవతరణకు మనం అడుగు దూరంలోనే ఉన్నాం. గతంలోని సంఘటనలు, వర్తమాన దృశ్యాలు, భవిష్యత్ ఆవిష్కరణలన్నీ మన ఆలోచనలలో ప్రతిబింబించాలి.’’ భారత రాజ్యాంగ సభలో రాజ్యాంగ రచనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపె డుతూ 1940, డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలివి. అప్ప టికింకా మనకు స్వాతంత్య్రం రాలేదు. డిసెంబర్, 9, 1946 నుంచి ప్రారంభ మైన రాజ్యాంగ సభ డిసెంబర్, 26, 1949 వరకు కొనసాగి, భారత రాజ్యాం గాన్ని అందించింది. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది మాత్రం 1950, జనవరి 26న. ఆ రోజునే ఎంచుకోవడం కాకతాళీయం కాదు. అది ఒక చారిత్రక సందర్భానికి, మన స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ఒక మైలురాయికి సంకేతం. జనవరి 26 చరిత్రలో మైలురాయి 1929లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా భారత దేశానికి పరిమిత స్వేచ్ఛ (డొమినియన్ స్టేటస్)ను ఇవ్వడానికి మాత్రమే అంగీకరించింది. దానిని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.1929 డిసెం బర్ 31, 1930 జనవరి 1 తేదీలలో జరిగిన లాహోర్ కాంగ్రెస్ మహాసభ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తదుపరి 1930 జనవరి 2న కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశం చేసిన తీర్మానం మేరకు దేశ వ్యాప్తంగా ఉద్యమకారులందరూ జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య దినం పాటించి, సంపూర్ణ స్వరాజ్య సాధనకు ప్రతిజ్ఞలు చేశారు. చరఖా చిహ్నం ఉన్న మూడు రంగుల జెండాను ఎగురవేశారు. ఆ చారిత్రక ఘట్టానికి చిహ్నం గానే 1950 జనవరి, 26న భారత ప్రథమ రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే రాజ్యాంగ సభ ఆమోదం పొందిన మన రాజ్యాంగం ఆ రోజు నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి జనవరి 26ను గణతంత్ర (రిపబ్లిక్) దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. స్వాతంత్య్రం పొందడం అంటే కేవలం బ్రిటిష్ పాలన అంతం కావ డమని మనం సర్దిపెట్టుకోలేదు. దేశ భవిష్యత్తును, ప్రజలందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని ఒక నియమబద్ధమైన విధాన సమూదాయంగా తీర్చిదిద్దాలనే మనం రాజ్యాంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. భావి భారత దేశాన్ని ప్రపంచ దేశాల సరసన సమున్నతంగా నిలిపేందుకు రాజ్యాంగ సభ సభ్యులు ఎంతో సమయాన్ని వెచ్చించారు, అహరహం శ్రమించారు. అసమా నతలు, అంతరాలు లేని భారతావనిని కాంక్షించారు. రాజ్యాంగంలో పొందు పరిచిన ప్రతి అంశంపైన ఎంతో విస్తృతమైన చర్చను జరిపారు. ఎన్నో విష యాలను ఆచి తూచి పరిగణనలోనికి తీసుకున్నారు. ఎంతో శ్రద్ధతో అక్షరీక రించి తుది రూపునిచ్చారు. స్వతంత్రమా? ప్రజాస్వామ్యమా? కేవలం రాజ్యాంగ సభ సభ్యులు మాత్రమే కాకుండా, దేశంలోని పౌరులెవ రికైనా దీని మీద వ్యాఖ్యానించే అధికారం ఉంటుందని నెహ్రూ మొదటే ప్రక టించారు. దానికి అనుగుణంగానే నెహ్రూ ప్రతిపాదించిన కొన్ని విషయాలపై సైతం రాజ్యాంగ రచనా సంఘం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను చేసింది. నెహ్రూ భారత్ను ‘స్వతంత్ర సర్వ సత్తాక గణతంత్ర దేశం’గా పేర్కొనగా... రాజ్యాంగ సభ దాన్ని ‘సర్వ సత్తాక ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం’గా ప్రకటించింది. నెహ్రూ పేర్కొన్న స్వతంత్ర, సర్వసత్తాక అనే రెండు పదాలలో స్వతంత్ర పదం అవసరంలేదని, సర్వసత్తాక అనేదే స్వతంత్ర దేశమనే భావనను కూడా బలంగా వ్యక్తం చేస్తుందని రాజ్యాంగ సభ అభిప్రాయపడింది. గణతంత్ర అనే పదం ఉన్నందువల్ల ప్రజాస్వామ్యం అని విడిగా పేర్కోనవసరం లేదని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్గా ఉన్న అంబేడ్కర్ ప్రజాస్వామ్యమనే భావన పట్ల, ఆ పదానికి ఉన్న విస్తృతమైన అర్థం పట్ల ఎక్కువగా మొగ్గు చూపారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యమనే తాత్వికత భారత సామాజిక పరిస్థితులకు మరింతగా సరిపోతుందని అభి ప్రాయపడ్డారు. నెహ్రూలాంటి తిరుగులేని నాయకుడు కూడా అంబేడ్కర్ లాంటి వాళ్ళు ప్రతిపాదించిన విషయాలను విశాల దృక్పథంతో ఆలోచించి, చాలా సానుకూలంగా స్పందించారు. అందువల్లనే భారత రాజ్యాంగం ఒక బృహత్తర గ్రంథంగా రూపొందింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన ఆ రాజ్యాంగాన్ని ఆనాటి సభ ఆమోదించింది ప్రజాస్వామ్యమే కాదు గణతంత్రం కూడా రాజ్యాంగంలోని అన్ని అంశాలతో పాటు పీఠిక (ప్రియాంబుల్)లో పొందు పర్చిన అంశాలు చాలా ప్రా«ధాన్యతను కలిగి ఉన్నాయి. అంబేడ్కర్ అమెరి కాలో విద్యాభ్యాసాన్ని సాగిస్తున్న కాలం నుంచి ప్రజాస్వామ్యమనే భావనల పైన ఎంతో అధ్యయనం చేశారు. 1936లో కుల నిర్మూలన రచించే నాటికే ప్రజాస్వామ్యంపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఏర్పడింది. భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, గణతంత్రం అనే భావ నలపైన కూడా చాలా లోతైన చర్చలు, అధ్యయనాలు జరిగాయి. పైపైన చూస్తే ఈ రెండు పదాలకు పెద్ద తేడా లేనట్టుగా కనిపిస్తున్నదని, కానీ అవి రెండూ వేర్వేరుగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయని రాజనీతి తత్వవేత్తలు భావి స్తున్నారు. ప్రజాస్వామ్యమంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభు త్వమని, వ్యవస్థ అని అర్థం చెప్పుకుంటాం. ప్రజాస్వామ్యంలో వంశపారం పర్యంగా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పాలన చేస్తారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. సిద్ధాంతపరంగా ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష విధానాలు ఉన్నాయి. అయితే మెజారిటీ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం విధానాలు రూపొందుతాయి, పరిపాలన సాగుతుంది. అంటే మైనారిటీగా ఉన్న కొందరి అభిప్రాయాలకు విలువ లేకుండా పోతుంది. అందువల్ల మెజారిటీ వర్గం అధికారాలకు అంతు ఉండదు. అందుకే మెజారిటీ అధికారం మైనారిటీ రాజకీయాల పట్ల, జీవి తాల పట్ల అణచివేసే విధానాలను అవలంబిస్తుంది. ఇది ఇప్పుడు చాలా దేశాల్లో మనం చూస్తున్నాం. రిపబ్లిక్ పరిపాలన దీనికి పూర్తిగా విరుద్ధమైనది కాకపోయినా, కొన్ని ఇతర ముఖ్యమైన అంశాలను అలాంటి వ్యవస్థలు కలిగి ఉంటాయి. రిపబ్లిక్ దేశాల్లో ప్రభుత్వాలను ప్రజలే ఎన్నుకుంటారు. అయితే ఎన్నికైన ప్రభుత్వా లుగానీ, ప్రజా ప్రతినిధులుగానీ వ్యక్తిగతమైన, పార్టీ పరమైన విధానాలతో మాత్రమే పనిచేసే వీలుండదు. ఒక నిర్దిష్టమైన పద్ధతి ద్వారా రూపొం దించుకున్న రాజ్యాంగం గానీ, చట్టంగానీ ప్రభుత్వాల పని విధానానికి ప్రాతి పదిక అవుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ అంశాల వెలుగులో ప్రభు త్వాలు పనిచేయాలి. ప్రజాప్రతినిధులకు కూడా మార్గదర్శకం రాజ్యాంగమే తప్ప సొంత అభిప్రాయాలు గానీ, ఆలోచనలు గానీ కావు. ఇది భారత రిపబ్లిక్ వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. అందుకే భారత రాజ్యాంగం విశిష్టతను కలిగి ఉన్నది. ప్రపంచంలో అత్యంత వివరమైన రాజ్యాంగం మనదే కావడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే విశిష్ట రాజ్యాంగం అంతే కాకుండా మరొక ప్రత్యేకత కూడా మన భారత దేశపు రాజ్యాంగానికి ఉన్నది. ఈ దేశం వివిధ మతాల సమ్మేళనం మాత్రమే కాదు. ఎన్నో వందల పేర్లతో ఉన్న కులాలతో కూడి ఉండడం కూడా భారత దేశ ప్రత్యేకత. అందు వల్ల భాష, ప్రాంత, కుల, మత, లింగ వివక్షలను భారత రాజ్యాంగం వ్యతి రేకిస్తున్నది. ముఖ్యంగా భాష, మత మైనారిటీలకు ఇక్కడ చాలా రక్షణలు కల్పించారు. అంతేకాకుండా, ముఖ్యంగా హిందూ మతంలో తరతరాలుగా వివక్షకు గురవుతున్న అంటరాని కులాలైన షెడ్యూల్డ్ కులాలు, అడవుల్లో నివసించే షెడ్యూల్డ్ తెగలను సామాజిక రంగంలో మైనారిటీలుగా గుర్తించి.. వారిని సామాజికంగా ప్రధాన స్రవంతిలోనికి తీసుకురావడానికి వీలుగా ప్రత్యేక రక్షణలు కల్పించడం మన రాజ్యాంగం ప్రత్యేకత. రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానంలోని ప్రధానాంశం కూడా అదే. అందుకే రాజ్యాంగంలో మైనారిటీలనే పదానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ప్రాంతీయ విభేదాల వల్ల వివక్షకు గురయ్యే ప్రమాదాన్ని పసిగట్టి, వాటి పరిరక్షణకు కూడా కొన్ని అంశాలను రాజ్యాం గంలో పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, ఆర్టికల్ 38లను అందులో భాగంగానే చూడాలి. ఇటువంటి ముఖ్యమైన అంశాలు రిపబ్లిక్ దేశాల్లో మాత్రమే, అందులోనూ రాజ్యాంగ పరిధిలో పాలన జరిగే దేశాలోన్లే ఎక్కువగా అమలులో ఉన్నాయి. భారత రిపబ్లిక్ దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యతను, రాజ కీయ, పాలనాపరమైన విస్తృతిని కలిగి ఉంది. భారత దేశంతోపాటు, ప్రపం చంలో పలు శతాబ్దాలుగా ఎన్నో రిపబ్లిక్లు ఎన్నో చోట్ల ఉనికిలో ఉన్నాయి. బౌద్ధానికి ముందు మన దేశంలో 16 గణాలతో కూడిన జనపదాలు ఉనికిలో ఉన్నాయి. అయితే వాటికి ఈనాడు మనం రూపొందించుకున్న రిపబ్లిక్కు ఎంతో తేడా ఉన్నది. భారతదేశంలో వేల ఏళ్లుగా సాగిన సామాజిక ఉద్య మాలు, భారత స్వాతంత్య్ర సమరం సమయంలో సాగిన అనేకానేక ఆలో చనల సారమే రాజ్యాంగం. వీటన్నింటినీ అత్యంత లోతుగా పరిశీలించే శక్తి కలిగిన మేధావి, రాజనీతివేత్త బాబా సాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలో ఏర్ప డిన రాజ్యాంగ రచనా సంఘం రూపొందించిన రాజ్యాంగం భారతదేశ భవి ష్యత్ గమనానికి ఒక వాహకంలాగా పనిచేసి, రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ప్రాతిపదికగా ఏర్పడే సమా జాన్ని నిర్మాణం చేస్తుం దని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 -
అమ్మాయంటే అబద్ధం
అమ్మాయంటే లక్ష్మి అనంటారు.. అబద్ధం. అమ్మాయంటే సరస్వతి అనంటారు అబద్ధం. అమ్మాయంటే దుర్గ అనంటారు అబద్ధం. అమ్మాయి అంటే అదృష్టం అంటారు.. అబద్ధం. అమ్మాయంటే మహాలక్ష్మి అనంటారు.. అబద్ధం. మనదేశంలో దేవతలకు గుళ్లు కట్టినట్లు ఆడపిల్లలను గుండెలో పెట్టి చూసుకుంటారనంటారు... అబద్ధం. మరి నిజమేంటి? దేవతలకు గుళ్లు.. ఆడపిల్లలకు సమాధులు. సమాధి దేనికి? అమ్మాయి గౌరవానికి, స్వేచ్ఛా సమానత్వానికి, ఆమె ప్రతి హక్కుకు, ఆమె ప్రతి అవకాశానికి. కల్పన నమశక్యం కాకుండా ఉండొచ్చు. కాని వాస్తవం కూడా నమ్మశక్యం కాకుండా ఉంటే. ఈ ఘటన అలాంటిది. ఆమెకు మొదట ఓ కూతురు పుట్టింది. ఆ తర్వాత అత్తింట్లో కొడుకును కనమని అత్త, ఆడపడుచుల పోరు ఎక్కువైంది. మళ్లీ గర్భం దాల్చింది. దురదృష్టవశాత్తు మూడోనెలలో గర్భస్రావం అయింది. కాని ఇంట్లో తెలిస్తే ఆరళ్లు ఎక్కువవుతాయనే భయంతో ఆ విషయం దాచిపెట్టి గర్భం ఉన్నట్టుగానే నటించింది. నెలల నిండగానే కాన్పుకు తల్లిగారింటికి వెళ్తానని బట్టలు సర్దుకొని బయలుదేరింది. వేములవాడలో దిగింది. కొడుకును కంటేనే ఆ ఇంట్లో తనకు స్థానం. లేకపోతే ఇంటి చూరు కిందే జీవితం అని ఆందోళన చెందింది. భయపడింది. ఎలాగైనా ఓ మగబిడ్డను సంపాదించాలని వేములవాడంతా తిరిగింది. ఎక్కడా పసిబిడ్డ దొరకలేదు. అలసిపోయి రాజరాజేశ్వరుడి సన్నిధి చేరుకుంది. ‘ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలే రాజన్నా...’ అని దేవుడికి మొర పెట్టుకుంటుంటే చంటిపిల్లాడి ఏడుపు చెవినపడింది. గబుక్కున కళ్లు తెరిచి చూసింది ఏడుపు వినిపించినవైపు. పొత్తిబట్టల్లో పసిపిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. దగ్గరకి వెళ్లింది. బాబు తప్ప ఆ దరిదాపుల్లో ఎవరూ కనిపించలేదు. రెండు దిక్కులా చూసింది. అంత రద్దీలో తనెనవరూ గమనించట్లేదు. అంతే. మెరుపువేగంతో బాబును తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన లావణ్య జీవితం ఇది. కాని ఈ దొంగతనం దాగుతుందా? ఆమె పిల్లాడిని తీసుకొని వెళ్లిపోయిన కొన్ని క్షణాలకు ఆ పసివాడి అసలు తల్లి వచ్చి చూసుకుంది. తాను పడుకోబెట్టిన చోట కొడుకు లేకపోయేసరికి లబోదిబోమంది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆ కొడుకుతో లావణ్యను పట్టుకున్నారు. జైల్లో పెట్టారు. దాంతో అత్తింట్లో, పుట్టింట్లో లావణ్య ఆడిన నాటకం బయటపడింది. ఆమెకు బెయిల్ వచ్చాక అత్తింటికి వెళితే నాటకాలు ఆడేవాళ్లకు ఇంట్లో చోటులేదుపొమ్మని గెంటేశారు. భర్తా కనికరించలేదు. పుట్టింటికి ఫోన్ చేస్తే తమ దగ్గరకీ రావద్దని చెప్పేశారు. చిన్నపిల్లైన కూతురితో ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఆచూకీలేదు. ఆ తల్లి దొంగలా ఎందుకు మారింది? ఈ వార్తాకథనం పత్రికల్లో వచ్చినప్పుడు గర్భం ఉందని నాటకం ఆడ్డమేకాక ఇంకో తల్లి కన్నబిడ్డను ఎలా ఎత్తుకుపోతుంది? అంటూ లావణ్యను చాలామందే ఆడిపోసుకుని ఉంటారు. కాని ఆమె ఆ నాటకం ఆడడానికి కారణం, మూలం గురించి ఆలోచించి ఉండరు. అవును అదే.. మగసంతానం పట్ల ఆసక్తి.. ఆడపిల్లంటే విరక్తి. చదువు, అవగాహనలేని కుటుంబాల్లో ఇలా జరుగుతుందిగాని అవగాహన ఉన్న కుటుంబాల్లో ఇలా జరగదు అని అనుకుంటున్నారా? అయితే ఇంకో కేస్స్టడీ గురించి మీకు చెప్పాల్సిందే! బిడ్డకు పాలు కూడా ఇవ్వని తల్లి... విజయ, అజయ్ దంపతులు. ఇద్దరివీ ఉన్నత ఉద్యోగాలే. ఇంకా చెప్పాలంటే విజయ లెక్చరర్. మొదటి సంతానం కొడుకే పుడతాడని, పుట్టాలనీ ఇష్ట దైవం ఏడుకొండలవాడికి ముడుపుకట్టింది. కాని పాప పుట్టింది. రెండో చాన్స్ ఉందికదా అని సర్దుకుంది. రెండో కాన్పులో కొడుకే అని ఫిక్స్ అయిపోయింది. మళ్లీ కూతురే పుట్టింది. ఈసారి ఆమె భర్తా అప్సెట్ అయ్యాడు. మూడో చాన్స్ తీసుకున్నారు. ఎవరో కొడుకు పుట్టడానికి ఏదో మందు ఇస్తారని చెబితే అక్కడికి వెళ్లి ఆ మందు తిని వచ్చింది. తన పొట్టలో పెరుగుతున్నది వంశోద్ధారకుడే అని మురిసిపోయింది. డెలివరీ అయింది. పండంటి ఆడపిల్ల. బాధ, కోపం, అవమానంతో కనీసం ఆ బిడ్డను చూడనైనా లేదు. భర్త అయితే ఆసుపత్రి దరిదాపులకే రాలేదు. తల్లి కూడా బిడ్డను ఎత్తుకోలేదు. పాలసలపరం మొదలైనా భరించింది కాని ఆడపిల్లను వ్యతిరేకించింది. లాభం లేదనుకున్న విజయతల్లి ఓ జ్యోతిష్యుడితో మొగుడు పెళ్లాలిద్దరికీ ఆ మూడోపిల్ల అదృష్టజాతకురాలని, ఆ పిల్లతో వాళ్లింటి దశ తిరుగుతుందని, పట్టిందల్లా బంగారమవుతుందని చెప్పించింది. అప్పుడు ఆ బిడ్డను చూశారు విజయ, అజయ్! ఆశ... అబార్షన్... ఇక ఇది నవనాగరికత విలసిల్లుతున్న ముంబైలో వెలుగుచూసిన సత్యం. భర్త డాక్టర్. భార్య ముంబై మున్సిపాలిటీలో గ్రూప్వన్ ఉద్యోగిని. అత్తారింట్లో నలుగురు ఆడపిల్లల మీద ఆమె భర్త ఒక్కడే మగసంతానం. పెళ్లయిన మొదటిరాత్రే భర్త తనమనసులో మాట, వాళ్ల అమ్మానాన్న కోరికా చెప్పాడు భార్యకు. తను కొడుకునే కనాలని. అవాక్కయింది భార్య. తన చేతుల్లో ఉందా? ప్రశ్నించింది. నీ చేతుల్లో లేదు కాని నా మెదడులో ఉపాయం ఉంది అన్నాడు. ఆమె గర్భం దాల్చినప్పుడు ఆ ఉపాయాన్ని చెప్పాడు. స్కానింగ్ సెంటర్కు తీసుకెళ్లాడు. ఆడపిల్ల అని తేలగానే అబార్షన్ చేయించాడు. అలా అయిదుసార్లు జరిగింది. ఆరోసారి గర్భానికి ఆమె అనారోగ్యం పాలైంది. ఇప్పుడూ కడుపులో ఉన్నది అమ్మాయే అని తేలగానే ఆమె అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. తోటి డాక్టర్లు వారించినా వినలేదు. ఈలోపే వీక్నెస్ వల్ల భార్యకు అబార్షన్ అయింది. తర్వాత మగపిల్లాడిని కనిచ్చే యోగ్యత ఆమెకు లేదని విడాకులూ ఇచ్చేశాడు. ఇది బ్లాక్ అండ్ వైట్ జమానా సంగతి కాదు. మూడేళ్ల కిందటి ముచ్చట. అంటే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి, ఇంటికి కళ వంటి మాటలన్నీ ఉట్టివే. ఓ వైపు కేంద్రప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పఢావో అంటుంటే దాని ప్రభావం సామాన్యుల మీద ఆవగింజంతైనా ఉండట్లేదు. ఉంటే ఉత్తర భారతంలోని ఎన్నో సంతానసాఫల్యకేంద్రాలు మగపిల్లాడినే పుట్టించే ఫ్యాక్టరీలుగా ఎందుకు మారేవి? అక్కడి చాలా సంతానసాఫల్యకేంద్రాలు మగపిల్లాడి కోసం చేస్తున్న పని ఏమిటో తెలుసా? తండ్రి వీర్యం నుంచి వై క్రోమోజోమ్ను మాత్రమే తీసుకొని తల్లి అండానికి జత చేయడం! ఇలాంటి నమ్మశక్యంకాని ఇంకెన్నో సత్యాలు మరెన్నో పైకప్పుల కింద, నాలుగు గోడల మధ్య నిస్సిగ్గుగా తలదాచుకుంటున్నాయి. కంటే కూతురినే కనాలి.. ఆడపిల్లే పుట్టాలి.. కూతురైనా కొడుకునై ఆరోగ్యంగా పుడితే చాలు.. అని కోరుకుంటున్న కోరికలు, అనుకుంటున్న మాటలు... చాలావరకు అబద్ధాలే అని.. కొడుకు పట్ల పక్షపాతమే అని తేలడానికి.. తేల్చడానికి .. నమ్మడానికి పైన వివరించిన వాస్తవాలు చాలేమో! - సరస్వతి రమ వెయ్యికోట్ల ఇండస్ట్రీ లింగనిర్థారణ పరీక్షలు,లింగ నిర్ధారణ పరీక్షలు, సెక్స్ సెలక్టివ్ అబార్షన్స్ ఈ రోజు దేశంలో వెయ్యికోట్ల ఇండస్ట్రీగా మారాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్,మహారాష్ట్ర హిమాచల్ప్రదేశ్, ఒరిస్సా, బెంగుళూరు వంటి పారంతాలు భ్రూణహత్యల్లో ముందున్నాయి. వెయ్యి మందికి 943 మందే... 2015 సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో ప్రతివెయ్యి మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 993 మంది స్త్రీలు ఉన్నారు. పిల్లల్లో ప్రతి వెయ్యిమంది బాలురకు 930 మంది మాత్రకే బాలికలున్నారు. పురుషుల కన్నా స్త్రీల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. ప్రతి వెయ్యిమంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉన్నారు. కాని పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఈ ఆధిక్యత లేదు. అక్కడ ప్రతి వెయ్యిమంది బాలురకు 964 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. స్త్రీల జనాభా అత్యంత కనిష్ఠంగా డామన్, డయ్యూ కేంద్రపాలితం ప్రాంతంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ ప్రతి వెయ్యిమంది పురుషులకు కేవలం 618 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. అలాగే పిల్లల విషయంలో ప్రతి వెయ్యిమంది బాలురకు 904 మంది బాలికలే ఉన్నారు. రాష్ట్రాలకు వస్తే అత్యంత కనిష్టంగా ఢిల్లీ, హర్యానాలు ఆ అపకీర్తిని మోస్తున్నాయి. ఢిల్లీలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 868 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. పిల్లల్లో కూడా ప్రతి వెయ్యిమంది బాలురకు 871 మంది మాత్రమే బాలికలున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రాజధాని చండీగఢ్లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 818 మంది స్త్రీలు ఉంటే ప్రతివెయ్యిమంది బాలురకు 880 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. -
ఆయుష్షులోనూ తక్కువ సమానులే!
మెన్టోన్ లోకంలో సమానత్వం ఎక్కడుంది? చట్టాల్లో తప్ప మరెక్కడా అది కనిపించదు. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తప్ప మరెక్కడా అది వినిపించదు. సమానత్వం ఒక దేవతావస్త్రం. మగువల కంటే మగాళ్లు ఎప్పుడూ తక్కువ సమానులే. వివక్ష ఒత్తిడిలో నలిగి నలిగి, కృంగి కృశించి రాలిపోతున్నది మగాళ్లే. యుగయుగాల చరిత్రను తరచి తరచి చూస్తే తేలే వాస్తవం ఇదే! చివరకు ఆయుర్దాయంలోనూ మగాళ్లు తక్కువ సమానులే! ఆదిమ యుగాల నాటి గణాంకాలేవీ లెక్కలకెక్కలేదు. ఇప్పుడు వాటి జోలికి పోలేం. మధ్యయుగం నాటి నుంచి దొరికే ఆధారాలను చూసుకుంటే, మహిళల కంటే పురుషులే అల్పాయుష్కులనేది ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవం. కుటుంబ పోషణభారం, భార్యా బిడ్డల రక్షణ భారం, శత్రువుల బెడద నుంచి దేశ రక్షణ భారం... తలకు మించిన భారాలన్నీ మగాళ్ల నెత్తిన యుగాలుగా సవారీ చేస్తున్నాయి. యుద్ధాలు, దాడులు, దండయాత్రలలో మరణించిన వారి లెక్కలను పక్కనపెట్టినా, మధ్యయుగంలో మగాళ్ల సగటు ఆయుర్దాయం మహిళల సగటు ఆయుర్దాయం కంటే దాదాపు పదేళ్లు తక్కువే ఉండేది. యూరోపియన్ దేశాల్లో అప్పట్లో పురుషుల సగటు ఆయుర్దాయం 21.7 ఏళ్లు మాత్రమే అయితే, మహిళల సగటు ఆయుర్దాయం 31.1 ఏళ్లుగా ఉండేది. కాస్త హెచ్చుతగ్గులతో మిగిలిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండేది. యుగం మారింది. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచ గమనం పెనువేగం పుంజుకుంది. అయినా, ఆయుర్దాయంలో మగ బతుకుల వెనుకబాటుతనంలో పురోగతి స్వల్పమే. మూడు దశాబ్దాల కిందట పుట్టిన ప్రస్తుత యువతరంలో మహిళలతో పోలిస్తే మగాళ్ల సగటు ఆయుర్దాయం ఆరేళ్లు తక్కువగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. -
'పిల్లల్ని కనడానికి మాత్రమే వాళ్లు'
-
అగ్రరాజ్యం అందులో వెనుకబడే ఉందట..!
స్వేచ్ఛా సమానత్వాల్లో అగ్రరాజ్యం వెనుకబడే ఉందట. స్త్రీలను ఉద్ధరిస్తున్నామని తెగ పోజులు కొట్టే దేశాల్లో ఒకటైన ఆమెరికా అంతర్జాతీయ ర్యాంకింగ్ ను బట్టి చూస్తే మహిళల పట్ల వివక్షను చూపడంలో ముందుందని లెక్కలు చెప్తున్నాయి. యూరప్, అమెరికా లాంటి దేశాల్లో సమానత్వ చట్టాలు వచ్చి ఏళ్ళు గడిచినా...అవి ఎక్కువ కాలం నిలిచే అవకాశాలు మాత్రం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అక్కడి చట్టాలను, సంస్కృతిని సైతం మార్కెట్ శక్తులే నిర్దేశిస్తుంటాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక ఫోరమ్ విడుదల చేసిన 145 దేశాల సమగ్ర అంతర్జాతీయ ర్యాంకింగ్ ప్రకారం వివక్షత ప్రదర్శించడంలోనూ ఆమెరికా అగ్రభాగానే నిలవడం ఒకింత ఆశ్చర్యాన్నే కలిగించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లెక్కలను బట్టి ప్రపంచంలోని 28 దేశాలతో పోలిస్తే అమెరికా లింగ వివక్ష విషయంలో చివరి స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. కేవలం క్యూబా కు తర్వాత, మొజాబిక్ కు ముందు అమెరికా చేరినట్లు తెలుసుకున్నారు. ప్రసిద్ధ జెనీవా ఆధారిత సంస్థ... దావోస్ లో జరిగిన తమ వార్షిక బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలను వెల్లడించింది. ఆర్థిక, రాజకీయ సాధికారతల్లోనూ, విద్యాప్రాప్తి, ఆరోగ్య చర్యల విషయంలోనూ పదేళ్ళుగా మహిళలు, పురుషుల మధ్య కొనసాగుతున్న అంతరాలపై అందుబాటులో ఉన్న లెక్కలను సంస్థ పరిశీలించింది. మంత్రి వర్గ స్థాయిలో ఉద్యోగులుగా ఉన్న మహిళల సంఖ్య కూడ 32 శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని, రాజకీయాల్లో పాల్గొనే మహిళల శాతం ఎక్కువగానే ఉన్నా... లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో విధానాలు సహకరించకపోవడం దురదుష్టకరంగా మారినట్లు ప్రస్తుత పరిశోధనలు తెలుపుతున్నాయి. మహిళలు, పురుషుల మధ్య వేతనాల్లో కూడ అత్యంత వ్యత్యాసం కనిపిస్తోందని లెక్కలు చెప్తున్నాయి. మహిళలకు ఆర్థిక అవకాశాలు అందించే కొన్ని దేశాల్లో ఆమెరికా కొంతవరకు ముందున్నట్లు కనిపిస్తున్నా... ర్యాంకింగ్ లో మాత్రం వ్యత్యాసం అధికంగానే ఉంది. అయితే మిగిలిన ఎన్నో దేశాలు పురుషులకంటే మహిళలకు..తక్కువ అవకాశాలు ఇవ్వడంతో పోలిస్తే ఆమెరికా ముందుందనే చెప్పాలి. అయితే అక్కడ మహిళలు అధిక శాతం శ్రామికులుగానే పనిచేయాల్సి వస్తోంది. పిల్లల సంరక్షణ, సెలవుల విషయంలో మాత్రం యూ.ఎస్ విధానాల్లో ప్రత్యేకత కనిపించడం లేదు. దీంతో చాలామంది మహిళలు వ్యాపార మార్గాలను ఎంచుకోవడమో.. లేదంటే ఇంట్లో కేర్ టేకర్లను పెట్టుకోవడమో చేస్తున్నారని వారి వ్యక్తిగత జీవితాలను పరిశీలించిన సంస్థ తెలిపింది. ప్రపంచంలోని ఏ దేశ నివేదిక పరిశీలించినా... పురుష, స్త్రీ సమానత్వంలో అంతరాన్ని పూరించడానికి కనీసం 118 ఏళ్ళు పట్టొచ్చని ప్రస్తుత నివేదిక అంచనా వేసింది. సమానత్వంలో ముందున్నామనే అమెరికాకు చెందిన ప్రఖ్యాత రచయిత జాన్ గ్రే... మెన్ ఆర్ ఫ్రం మార్స్... ఉమెన్ ఆర్ ఫ్రం వీనస్ అనే పుస్తకాన్ని రాస్తే... 300 పేజీల ఆ పుస్తకం 5 కోట్ల కాపీలు పైగానే అమ్ముడుపోవడమే కాదు... ఇంకా అమ్ముడుపోతూనే ఉంది తప్పించి... ఇప్పటిదాకా ఆ రచయితని మహిళల పట్ల వివక్ష ఎందుకని నిలదీసిన వారు మాత్రం కనిపించకపోవడం... అగ్రరాజ్యంలో మహిళలపై వివక్షతకు మరోరూపంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సమానత్వంపై బలమైన సంప్రదాయాన్ని కలిగి ఉన్న యూ.ఎస్., నార్డిక్ దేశాలు వివక్షతను చూపడంలో ముందున్నాయని ప్రస్తుత లెక్కలు చెప్పడం మాత్రం... కాస్త శోచనీయంగానే కనిపిస్తోంది.