fishermans
-
జనసేన MLA పంతం నానాజీ అనుచరుల దాష్టీకం
-
ఐదేళ్ళ లో అంచెలంచెలుగా ఎదిగిన మత్స్యకారులు
-
చేపల వేటలో నాగచైతన్య .. ఎందుకో తెలుసా?
మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకునే పని మీద నాగచైతన్య శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లిన విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసమే టీమ్ కసరత్తులు చేస్తోంది. గురువారం శ్రీకాకుళంలోని మత్స్యకారులను స్వయంగా కలిసి, వారి సంస్కృతి, జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు చైతన్య, చందు, ‘బన్నీ’ వాసు. శుక్రవారం వైజాగ్ పోర్టును సందర్శించారు. మత్స్యకారులతో కలసి చేపల వేటకు వెళ్లారు. సముద్ర ప్రయాణం, వేట, అక్కడ ఎదురయ్యే పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. -
సీఎం జగన్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు : సీదిరి అప్పలరాజు
-
Uppada: మత్స్యకారుల వలకు ‘బాహుబలి’
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): బంగాళాఖాతం సముద్ర జలాల్లో తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు బాహుబలి చేప చిక్కింది. కంబాల టేకుగా పిలిచే ఈ చేప సుమారు 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల మేర వెడల్పు ఉంది. బరువు సుమారు 300 కేజీలు. దీనిని అతి కష్టంపై బోటు నుంచి క్రేన్తో ఆటో పైకి ఎక్కించి, కాకినాడకు తరలించారు. అర డజను మంది మత్స్యకారులు తాళ్ల సాయంతో కిందకు దింపి విక్రయించగా వెంకన్న అనే వ్యాపారి రూ.16,500కు కొనుగోలు చేశాడు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు -
చెరువులో విషప్రయోగం.. లక్షల్లో చేపలు మృత్యువాత
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని వెల్ది బుడమాయి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. దీంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ముదిరాజ్ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ చెరువులో ముదిరాజ్ కులస్తులు చేపలు పడుతూ జీవనం సాగిస్తుండగా, శుక్రవారం ఉదయాన్నే వందలాదిగా చేపలు చనిపోయి ఒడ్డుకు వస్తుండడాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కుల పెద్ద ఆళ్ల కొమురయ్య మాట్లాడుతూ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెరువు చైర్మన్ ఆళ్ల గట్టయ్యతో పాటు కావాటి దానయ్య, కావాటి నాగరాజు, రాజు, లింగరాజు, బోయిని కృష్ణ పాల్గొన్నారు. -
వలేసి పట్టేద్దాం!
మానికొండ గణేశ్, సాక్షి, అమరావతి: పది గ్రాముల పిత్తపరిగి మొదలు 25 కేజీల ట్యూనా చేపలను వేటాడేందుకు, ఉప్పాడ వంటి మారుమూల గ్రామం నుంచి ఉత్తర అమెరికా వరకు సముద్ర మత్స్య సంపద ఎగుమతికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడి సముద్ర జలాల సరిహద్దులు దాటి పాకిస్తాన్కు చిక్కి బాధలు పడిన మత్స్యకారుల పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీటిని నిర్మించనుంది. హార్బర్ల ద్వారా ఇకపై కోస్తా తీరాన్ని సంపదలకు నెలవుగా, ఉపాధి అవకాశాలు కల్పించే కల్పతరువుగా రూపు మార్చనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణం కానున్నాయి. ► దాదాపు రూ.2,639 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయనుంది. వీటిలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాలకు నాబార్డు రూ.450 కోట్లను ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద (ఎఫ్ఐడిఎఫ్) రుణం ఇవ్వనుంది. ► ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, నాబార్డుకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, మచిలీపట్నం, నిజాంపట్నాల్లోని ఫిషింగ్ హార్బర్ల రెండో దశ నిర్మాణాలకు, ఉప్పాడ ఫిషింగ్ హార్బరు నిర్మాణాలకు రూ.1,015.219 కోట్లతో అంచనాలు తయారు చేసింది. ఇందులో నిజాంపట్నం హార్బరు నిర్మాణానికి రూ.379.17 కోట్లు, మచిలీపట్నం హార్బరు నిర్మాణానికి రూ.285.609 కోట్లు, ఉప్పాడ నిర్మాణానికి రూ.350.440 కోట్లు అవసరవవుతాయని అంచనా. ► వీటిల్లో ఒక్కోదానికి ఎఫ్ఐడీఎఫ్ కింద లభించే రూ.150 కోట్ల రుణం పోను మిగిలిన ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం 90% నిధులను ఎన్ఐడీఐ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) రుణం ద్వారా సమకూర్చనుంది. మిగిలిన 10% నిధులను రాష్ట్రం ఖర్చు చేయనుంది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ రూ.288.80 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ ► నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బరు నిర్మాణానికి రూ.288.80 కోట్లతో అంచనాలు తయారు చేయగా, సాగరమాలలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్, బీఆర్) కింద కేంద్రం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించనున్నాయి. ► మొదటి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.18 కోట్లు విడుదల చేశాయి. ఇటీవల అప్పటి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి, ఆ జిల్లా శాసన సభ్యులు రేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. ► శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం హార్బరుకు రూ.332.09 కోట్లు, విశాఖ జిల్లా పూడిమడక హార్బరుకు రూ.353.10 కోట్లు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం హార్బరుకు రూ.325.16 కోట్లతో అంచనాలు తయారయ్యాయి. ► ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకం కింద ఒక్కో హార్బరుకు రూ.120 కోట్ల రుణం విడుదల కావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప హార్బరు నిర్మాణానికి అవసరమైన నివేదికను బెంగళూరుకు చెందిన సీఐసీఈఎఫ్ (సైసెఫ్) ఇవ్వాల్సింది. ► మొదట్లో దీనిని ఫిష్ ల్యాండింగ్ సెంటరుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, హార్బరుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.300 కోట్లతో అంచనాలు రూపొందించారు. హార్బర్ల నిర్మాణాలతో ఎన్నో ప్రయోజనాలు ► కొత్తగా నిర్మించనున్న హార్బర్ల వల్ల అదనంగా 11,280 ఫిషింగ్ బోట్లకు లంగరు వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా ట్యునా చేపలు శుభ్రం చేయడానికి, నిల్వ చేయడానికి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ► వీటి ద్వారా 76,230 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే ఐస్ప్లాంట్లు, ప్రీప్రాసెసింగ్ సెంటర్లు, చేపల రవాణా, మార్కెటింగ్ ఇతర అనుబంధ సంస్థల్లో పనులు చేయడానికి మత్స్యకారులకు అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హార్బర్లలోని పనుల నిర్వహణకు మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా వినియోగ రుసుములను వసూలు చేసి హార్బర్ల నిర్వహణ ప్రభుత్వానికి భారం కాకుండా చూస్తాయి. ► రొయ్యలు, చేపలకు మంచి రేటు వచ్చే వరకు హార్బరులోనే నిర్మించే కోల్డు స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల మత్స్యకారులు, మర పడవల నిర్వాహకులకు లబ్ధి చేకూరడమే కాకుండా విదేశీ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. ► సాలీనా 4.22 లక్షల టన్నుల చేపలు, రొయ్యల పట్టుబడి అదనంగా జరుగుతుంది. ► తుపానులు, ప్రకృతి వైపరీత్య సమయాల్లో మర పడవలు సురక్షితంగా హార్బర్లలో లంగరు వేసుకునే సౌకర్యం లభిస్తుంది. ► వేట విరామ సమయాల్లో మత్స్య కార్మికులు హార్బరులో నిర్మించే భవనాల్లో వలలు, ఇతర పరికరాల మరమ్మతులు చేసుకునే సౌకర్యం ఏర్పడుతుంది. మొగ వద్ద ఇసుక మేటలతో ఇక్కట్లు మొగ (సముద్ర ముఖ ద్వారం) దగ్గర ఇసుక మేటలు వేస్తోంది. సముద్ర అలల వేగం వల్ల మా ఊళ్లో అనేక బోట్లు దెబ్బ తిన్నాయి. వాటిని బాగు చేయించుకోవాలంటే ఓనర్లు లక్షలు పోయాల్సిందే. ఇక్కడి హార్బర్ నుంచి మొగ దగ్గరకు వెళ్లే కాల్వ లోతు పెంచక పోవడం వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇందువల్లే చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు పోతున్నాం. ఇన్నాళ్లూ మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ మా సమస్యపై దృష్టి పెట్టారు. మొగ వద్ద ఇసుక మేటలు తొలగించాకే మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. – మల్లికార్జునరావు, గిలకలదిండి, కృష్ణా జిల్లా బోట్లు పెరుగుతుంటే లంగరుకు చోటేదీ? హార్బరులో బోట్లు పెరుగుతున్నాయి. మంచి సీజనులో గిలకలదిండి, నరసాపురం నుంచి బోట్లు వస్తాయి. అప్పుడు ఒడ్డుకు ఎవరు ముందు వస్తే వాళ్లు జట్టీలకు బోట్లు కట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా తీరానికి దగ్గరలోని చెట్లకు తాళ్లతో కట్టుకుంటున్నారు. భారీ వర్షాలు, గాలులు వచ్చినప్పుడు చెట్లకు కట్టిన తాళ్లు తెగి బోట్లు గల్లంతవుతుంటాయి. అలలకు కొట్టుకుపోతాయి. కొన్నిసార్లు వలలు, ఇంజన్లను దొంగలెత్తుకెళ్తారు. వాటిని కొనుక్కుని వేటకు వెళ్లాలంటే నెల పడుతుంది. ఈ సమస్యలన్నీ తీరాలంటే జట్టీల సంఖ్య పెంచాలి. – ఆర్.రాము, నిజాంపట్నం, గుంటూరు జిల్లా విస్తారమైన అవకాశాలు హార్బర్ల ద్వారా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విస్తారమైన అవకాశాలున్నాయి. పెద్ద పెద్ద బోట్ల ద్వారా సముద్రలోతుల్లో మత్స్య సంపదను పట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాలు లేక రాష్ట్రంలోని పెద్ద పడవల నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఈ పడవలకు హార్బర్లలో అన్ని సౌకర్యాలు సమకూర్చితే రాష్ట్ర ప్రభుత్వానికి సముద్ర సంపద ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. పోషక విలువలు కలిగిన సముద్ర జాతి వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. – కన్నబాబు, ఫిషరీస్ కమిషనర్ ఫిషింగ్ హార్బర్లు ► పెద్ద పెద్ద పడవలు మత్స్య సంపదను సముద్ర ఒడ్డుకు తేవడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. సముద్రపు ఒడ్డున లోతు ఎక్కువగా ఉండేలా వీటిని నిర్మించడం వల్ల మత్స్యకారులకు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎగుమతులకు వీలుంటుంది. ► జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్త పట్నం, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ► వేటాడి తెచ్చిన చేపలను అన్లోడ్ చేయడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. విక్రయాలకూ అవకాశం ఉంటుంది. ► మంచినీళ్లపేట, బీమిలీ, నక్కపల్లి, చింత పల్లిలో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచి నీళ్లపేటలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.11.95 కోట్లు కేటాయించింది. పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థను కూడా ఖరారు చేసింది. మాకు కష్టాలు తప్పుతాయి.. మా జువ్వలదిన్నెలో చేపలరేవు కడతామని చంద్రబాబు అనేకసార్లు చెప్పాడు. మాట నిలుపుకోలేదు. సీఎం జగన్ మా జిల్లాకు వచ్చినప్పుడు మా రేవు నిర్మాణం గురించి హామీ ఇచ్చారు. మొన్నీమధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మా ఊరొచ్చి రేవు కట్టడానికి అనువైన ప్రాంతాన్ని చూశారు. వెంటనే రేవు కడతారంట. నిధులు కూడా వచ్చేశాయని మా ఓనర్లు చెబుతున్నారు. ఇక్కడ రేవు కడితే మద్రాసు, గుజరాత్ వెళ్లక్కర్లేదు. బాధలు తప్పుతాయి. ఇక్కడి నుంచే చేపల వేటకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. – కొమరిరాజు, తుమ్మలపెంట, కావలి మండలం, నెల్లూరు జిల్లా -
ఆశల వేటకు గంగపుత్రులు సిద్ధం..
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఆశల వేటకు అంతా సిద్ధమైంది. సుమారు 61 రోజుల తర్వాత సముద్రాన్ని మదించేందుకు గంగపుత్రులు సిద్ధమవుతున్నారు. బోట్లను తీర్చిదిద్దుతూ, వలలను అల్లుకుంటూ, ఇంధనాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. వేట నిషేధ కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకారులు ఇక ఆ కష్టాలను మరిచిపోయి తమ బతుకు వేటవైపు సాగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నెల 1న వేటకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ నెల 2న అర్ధరాత్రి నుంచి వేటకు బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సందడిగా ఫిషింగ్ హార్బర్ తూర్పు తీరంలో ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోయిన చేపల వేట తిరిగి ఈ నెల 2న మొదలు కానుంది. చేపల వేట నిషేధం నేపథ్యంలో జిల్లాలో సుమారు ఆరు వేల బోట్లు తీరంలో నిలిచిపోయాయి. వేటకు బయలుదేరే సమయం ఆసన్నం కావడంతో ఫిషింగ్ హార్బర్లోని బోట్ల యజమానులు తమ బోట్లకు దాదాపు మరమ్మతులు పూర్తి చేసుకుని, ఇంధనం, ఇతర సామగ్రి సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. చేపల రేవు కేంద్రంగా నిత్యం 678 పడవలు, 2,996 మరపడవలు, సంప్రదాయ పడవలు 742, (జిల్లా వ్యాప్తంగా మొత్తం మరపడవలు 4,416) 1100 తెప్పలు నిత్యం చేపలు, రొయ్యల వేట సాగిస్తుంటాయి. తొలి రోజు 150 వరకూ బోట్లు వేటకు వెళ్లే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. బోట్లలో పనిచేసే కుర్రాళ్లు సైతం ఎప్పుడెప్పుడు వేటకు వెళ్తామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చేపల వేట విరామ సమయంలో కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకార కార్మికులు తిరిగి నగరానికి చేరుకున్నారు. వేట కొనసాగుతుందన్న ఉత్సాహం వారి కళ్లలో కనిపిస్తుంది. ఒక బోటు వేటకు వెళ్లేందుకు చేసే ఖర్చు... ►20 రోజులపాటు వేట సాగించే బోటుకు 4 వేల లీటర్లు ఇంధనం అవసరమవుతుంది. సుమారు రూ.3 లక్షలు. ►వలలు సుమారు రూ.30 వేలు. ►బీమా చెల్లింపులు సుమారు రూ.60వేలు. ►ఆహార సామగ్రి రూ.10 నుంచి రూ.15వేలు. ►సుమారు 15 టన్నుల ఐస్ రూ.22 వేలు. ►ఇతర సామగ్రి ఖర్చులు సుమారు 30 వేలు. ►మొత్తంగా యజమానులు ఒక్కో బోటుపై సుమారు రూ.4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజు వేటకే మొగ్గు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెల్లవారుజామున వేటకు వెళ్లి అదేరోజు సాయంత్రం జెట్టీకి చేరేందుకు అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ బోట్లు జెట్టీలకు చేరుకున్నా చేపలు అమ్మే విషయంలో విధివిధానాలు విధించడంతో లాంగ్ రన్ వేట కన్నా రోజువారీ వేటకే బోటు యజమానులు సిద్ధపడుతున్నారు. బోట్లు 2వ తేదీ అర్ధరాత్రి వెళ్లి 3వ తేదీ జెట్టీలకు చేరడం వల్ల చేపల మార్కెట్ కూడా 3న తెరుచుకోనుంది. టన్ను ఐస్ రూ.1400 ఫిషింగ్ హార్బర్లో ఉన్న 11 ఐస్ ఫ్యాక్టరీల్లో నాలుగు మాత్రమే తెరుచుకున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే కారి్మకులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారంతా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. కొన్ని రోజులపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఐస్ వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఐస్ ధర టన్ను రూ.1400లు వరకూ ఉన్నా అన్ని బోట్లు ఒకేసారి వెళ్లకపోవడం, లాంగ్రన్కు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఐస్కు డిమాండ్ లేదేని యజమానులు చెబుతున్నారు. నిబంధనలు తప్పక పాటించాలి మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పక పాటించాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కె.ఫణిప్రకాష్ పేర్కొన్నారు. మరబోట్ల సంఘాల అధ్యక్షులు, బోటు యజమానులు, ఎగుమతిదారులు, చేపల వర్తక సంఘాల ప్రతినిధులతో ఫిషింగ్ హార్బర్లోని మత్స్యశాఖ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడీ మాట్లాడుతూ బోట్లమీద పనిచేసే కలాసీలు, జెట్టీల మీద ఉండేవారు, చేపల వ్యాపారులు తప్పనిసరిగా మాస్్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హార్బర్ జెట్టీల మీద ఐదుగురికి మించి ఉండరాదన్నారు. జూన్ 1 నుంచి వేటకు అనుమతిచ్చినా బోటు యజమానులు 2వ తేదీ అర్ధరాత్రి బయలుదేరనున్నారని, వీరు వేట ముగించి ఏ జెట్టీకి తమ బోటును చేరుస్తారో అక్కడే సరకు దించాలని సూచించారు. వేటకు వెళ్లి తిరిగి వచ్చిన అన్ని బోట్లను ఒకే జెట్టీమీదకు చేర్చకూడదని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆటోలు, వ్యాన్లకు హార్బర్లోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. హార్బర్లోని షెడ్లలో వేలం నిర్వహణ కొనసాగుతుందని, వేలంలో పాల్గొనే మత్స్యకారులు తప్పనిసరిగా మాస్్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణరావు, మరబోట్ల సంఘాల ప్రతినిధులు పి.సి.అప్పారావు, బర్రి కొండబాబు, సీహెచ్.సత్యనారాయణమూర్తి, పోర్టు సిబ్బంది, వివిధ మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అండమాన్లో ఆర్తనాదాలు
కాశీబుగ్గ: అండమాన్ నికోబర్ దీవుల్లో సిక్కోలు వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ ఉండలేక స్వగ్రామాలకు వెళ్లలేక కుటుంబాలకు దూరమై ఆకలి కేకలు పెడుతున్నారు. అక్కడ తమ అగచాట్లను వాట్సాప్ ద్వారా వీడియో, చిత్రాలు పంపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత తొందరగా తెలుగు వాళ్లను రప్పించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అండమాన్ నికోబర్ దీవుల్లోనూ కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడ నుంచి రాష్ట్రానికి వెళ్లే అన్ని రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిపివేశారు. దాంతో అభర్డెన్ బజార్, జంగ్లీఘట్, డైరీఫారం, బృక్షబాద్, డిగిలిపూర్, కమ్మలబ్యాగ్, వండూరు, మాయబందర్, బాతుబస్తీ, గేరాచలంలో రెండు వేల మంది మత్స్యకారులతోపాటు పర్యాటకులు కరోనా లాక్డౌన్లో చిక్కుకున్నారు. (ఆ ఆరు రాష్ట్రాలు హైరిస్క్) అండమాన్ నికోబర్ దీవిలో చిక్కుకున్న మత్స్యకారులు జిల్లాలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం మండలాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేక వేట సాగక తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఫిషింగ్ జెట్టీల బోట్లపై పడుకుని కాలం గడుపుతున్నారు. రెండు నెలలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండమాన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, ఆకలి బాధలతో అలమటిస్తున్నామని కంటతడి పెడుతున్నారు. ఈ నెల 25 నుంచి రవాణా సౌకర్యం పునరుద్ధరించడంతో అండమాన్ నుంచి వైజాగ్కు ఓడ లేదా విమానంలో తరలించాలని కోరుతున్నారు. ప్రస్తుతం అండమాన్లో ఒక్క కరోనా వైరస్ రోగి లేరని చెబుతున్నారు. ఇప్పటి వరకు గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చడంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. (ఎన్ 95 మాస్క్ల పేరుతో భారీ మోసం) ఓడలపై తలదాచుకుంటున్న మత్స్యకారులు -
6న మత్స్యకారులకు విరామ భృతి
సాక్షి, అమరావతి: లాక్డౌన్, చేపల వేటపై నిషేధం కారణంగా ఈ ఏడాది మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు విరామ భృతి అందించే కార్యక్రమాన్ని ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఒక్కో కార్మికుడి బ్యాంకు ఖాతాలో రూ.10 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ భృతికి అర్హుల పేర్లు, వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 1.09 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 24న లాక్డౌన్ ప్రకటించడంతో అప్పటి నుంచి సముద్రంలో చేపల వేటను మత్స్యకారులు నిలిపివేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో వేటను నిషేధించింది. ఈ రెండు కారణాలతో సముద్రంలో చేపల వేటకు అవకాశం లేకపోయింది. దీంతో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వీరికి విరామ సాయం వెంటనే అందిస్తే కొంత వరకు సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ సాయం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు మరో 1600 మంది మత్స్యకారులు క్వారంటైన్ సెంటర్లకు తరలింపు కరోనా కారణంగా గుజరాత్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు శుక్రవారం రాత్రి నుంచి విశాఖకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం 16 వందల మంది మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు. 22 డబుల్ డెక్కర్ బస్సుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి చెందిన మత్స్యకారులు 16 వందల మంది రాగా, వీరిలో 323 మంది విశాఖకు చెందిన వారున్నారు. వీరందరికీ జిల్లా యంత్రాంగం భోజన సౌకర్యం, స్నాక్స్ అందించింది. అంతకుముందు శుక్రవారం రాత్రి 890 మంది విశాఖకు చేరుకున్నారు. వీరందరినీ లంకెలపాలెం కూడలి వద్ద జిల్లా యంత్రాంగం ఆహ్వానించి నగరంలోని నాలుగు క్వారంటైన్లకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం విశాఖకు చెందిన 381 మంది వచ్చారు. లాక్డౌన్ అమలుతో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోయారు. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 2911 మంది ఉన్నారు. అలాగే విజయనగరం జిల్లా నుంచి 711, విశాఖపట్నం నుంచి 418, తూర్పుగోదావరి జిల్లా నుంచి 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. తమిళనాడు నుంచి కూడా.. తమిళనాడు రాష్ట్రంలో కాసిమేడ్ ప్రాంతంలోచిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన 900 మంది మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయడానికి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. వీరిని త్వరలోనే స్వస్థలాలకు చేర్చుతామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం/రామవరప్పాడు(గన్నవరం)/జగ్గయ్యపేట/రాజానగరం: గుజరాత్లో చిక్కుకున్న మన రాష్ట్ర మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 12 బస్సుల్లో 890 మంది రాగా.. మిగిలిన 3,178 మంది శనివారం వారి స్వగ్రామాలకు చేరుకుంటారు. లాక్డౌన్తో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 2,911 మంది ఉండగా, విజయనగరం జిల్లాకు చెందిన వారు 711, విశాఖపట్నం జిల్లాకు చెందినవారు 418, తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు, ఒడిశాలో ఉంటున్న మరో 14 మంది ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్లో నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక 37 రోజుల పాటు వీరంతా అష్టకష్టాలు పడ్డారు. వారి కుటుంబసభ్యుల వినతి మేరకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు. మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు రాష్ట్రానికి తీసుకురావడానికి రూ.3 కోట్లు విడుదల చేయించారు. ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇస్తాం: మోపిదేవి మత్స్యకారులకు శుక్రవారం విజయవాడ సమీపంలోని నిడమానూరులో మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు స్వాగతం పలికి అల్పాహారం, మంచినీటి బాటిళ్లను అందించారు. వారు ఇళ్లకు వెళ్లాక వారి కుటుంబ అవసరాలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అంతకుముందు ఆంధ్రా సరిహద్దు.. కృష్ణా జిల్లాలోని గరికపాడు చెక్పోస్టు వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రనాథ్బాబు తదితరులు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం రాజమహేంద్రవరం సమీపంలో అందరికీ భోజన సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ వారికి మాస్కులు అందించారు. మత్స్యకారులకు గరికపాడు వద్ద స్వాగతం పలుకుతున్న విప్ ఉదయభాను, ఎస్పీ రవీంద్రనాథ్బాబు తదితరులు విజయ్ రూపానీకి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు సాక్షి, అమరావతి: లాక్డౌన్ వల్ల గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు జాలర్లను క్షేమంగా ఏపీకి తీసుకురావడానికి సహాయ సహకారాలు అందజేసిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు జగన్ ట్వీట్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే సహకారం అందుతుందని ఆశిస్తూ అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటాం.. కుటుంబ పోషణ కోసం ఆరునెలల క్రితం గుజరాత్కి వెళ్లాను. లాక్డౌన్ కారణంగా గుజరాత్లోనే చిక్కుకుపోయా. తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డా. మా కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించిన సీఎం వైఎస్ జగన్ మేము రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. – చిన దానయ్య, మత్స్యకారుడు, రెల్లివీధి (విశాఖపట్నం) ఆంధ్రా బోర్డర్కు వచ్చాకే భోజనం తిన్నాం గుజరాత్లో బయలుదేరి మూడు రోజులైనా ఎక్కడా షాపులు, హోటళ్లు లేకపోవడంతో ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆంధ్రా బోర్డర్కి వచ్చినప్పటి నుంచి కడుపునిండా భోజనం తిన్నాం. భీమవరంలో బిర్యానీ పెట్టారు. – వి. శంకర్, విజయనగరం జిల్లా -
చిక్కుకుపోయాం.. ఆదుకోండి
సాక్షి, ముంబై: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ముంబైకి సమీపంలో చిక్కుకుపోయి నానా అగచాట్లుపడుతున్నారు. థాణే జిల్లా లోని ఉత్తన్ తీరప్రాంతంలో ఉన్న వీరంతా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. సుమారు నాలుగు నెలల కిందట కళింగపట్నం, కపాసుకుద్ది, ఇద్దివానిపాలెం, కళింగపట్నం కుసుకుంపురం తదితర ప్రాంతాల నుంచి సుమా రు 200 మంది ముంబైకి సమీపంలోని ఉత్తన్కు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పనుల్లేవని, లాక్డౌన్ కారణంగా ఇంటికొచ్చే అవకాశమూ లేకుండాపోయిందని ఆందోళన చెందుతున్నారు. తమలో ఒకరికి కిడ్నీ సమస్య ఉందని.. మందులు కూడా లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను స్వగ్రామాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారు పడుతున్న వెతలను ‘సాక్షి’తో చెప్పుకున్నారు. మమ్మల్ని ఇంటికి చేర్చండి.. మమ్మల్ని ఎలాగైనా మా గ్రామాలకు చేర్చండి. ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. మా కుటుంబ సభ్యులు కూడా∙ఆందోళనలో ఉన్నారు. – ఇద్ది దుర్యోదన్ ఒక పూటే తింటున్నాం.. ఇక్కడ పనులు కూడా లేకపోవ డంతో ఒక పూటే తింటున్నాం. ఒక నెల పాటు బాగానే ఉన్నా.. లాక్డౌన్ పొడిగించడంతో కష్టాలు మొదలయ్యాయి. – మద్దు మోహన్రావు ఏపీకి తీసుకొస్తాం.. ముంబైలో చిక్కుకున్న మత్స్య కారులను ఏపీకి తెచ్చే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. ముంబై సమీపంలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్య కారులనూ రాష్ట్రానికి తీసుకొస్తాం. – మంత్రి మోపిదేవి వెంకటరమణారావు -
సీఎం జగన్ చొరవతోనే మత్స్యకారుల విడుదల
సాక్షి, అమరావతి/భావదేవరపల్లి–నాగాయలంక (అవనిగడ్డ): పాకిస్తాన్ జైల్లో ఉన్న మత్స్యకారులను విడిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశారని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో బాధిత కుటుంబ సభ్యులు సమస్యను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ ప్రధాని, అమిత్షా దృష్టికి తీసుకెళ్లారన్నారు. అమిత్షాకు 2019 ఆగష్టు 31న సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని, తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం డిసెంబర్ 31న మత్స్యకారులను రిలీజ్ చేయడానికి అంగీకరిస్తూ విదేశాంగ శాఖకు సమాచారం పంపించిందన్నారు. సీఎం చొరవతో ఈనెల 6న సాయంత్రం 4 గంటలకు 20 మంది మత్స్యకారులు వాఘా సరిహద్దు ద్వారా భారతదేశంలోకి చేరుకుంటారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మరో నెల రోజుల్లో వస్తారన్నారు. కాగా, కోస్తా తీరంలో చేప ఉత్పత్తులకు సంబంధించి దివిసీమ జోన్లో ప్రత్యేక క్లస్టర్గా పాంపినో, సీబాస్, జెల్ల చేపల విత్తన కేంద్రాలు (హేచరీస్)ను మార్కెట్లోకి తీసుకువచ్చే కార్యాచరణ చేపట్టబోతున్నట్లు మంత్రి మోపిదేవి తెలిపారు. నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ప్రయోగాత్మకంగా చెరువులలో పెంచిన ఉప్పునీటి చందువా చేపల పట్టుబడి కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుతో కలసి ఆయన ప్రారంభించారు. -
6న పాక్ చెర నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ/ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం జిల్లా)/ విజయనగరం: పాకిస్తాన్లో బందీలుగా ఉన్న 20 మంది ఉత్తరాంధ్ర జాలర్లు వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్కు డిసెంబర్ 31న సమాచారం అందించింది. గుజరాత్కు చెందిన చేపల వేట బోటు యజమానులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది జాలర్లను, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లను చేపల వేట కోసం నియమించుకున్నారు. 2018 నవంబర్ 28న జీపీఎస్ పనిచేయకపోవడంతో పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి మూడు బోట్లలో 20 మంది జాలర్లు వెళ్లడంతో వారిని పాకిస్తాన్ కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి వీరు కరాచీ జైలులో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 10న రాజ్యసభ సభ్యులు(ప్రస్తుత వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత) వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నాటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ను కలిసి సమస్యను నివేదించారు. తదనంతరం అనేకమార్లు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం ఈ విషయాన్ని విదేశాంగ దృష్టికి తెచ్చింది. 22 ఆగస్టు 2019న కూడా మరోసారి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. పలుమార్లు లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాలు, ఇతర సందర్భాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న వాఘా సరిహద్దు నుంచి వారు స్వదేశానికి రానున్నట్టు పాకిస్తాన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. చెర వీడనున్న జాలర్లు వీరే.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన కె.ఎర్రయ్య, కేశం రాజు, సన్యాసిరావు, ఎం.రాంబాబు, జి.రామారావు, ఎస్.అప్పారావు, కల్యాణ్, ఎస్.కిశోర్, గురుమూర్తి, సుమంత్, బడివానిపేటకు చెందిన బాడి అప్పన్న, శామ్యూల్, వెంకటేశ్, మణి, శ్రీకాకుళం మండలం దమ్మలవీధికి చెందిన శివ, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన బవిరిడు, నక్కా అప్పన్న, ధనరాజు, నక్కా కొండ, భోగాపురం మండలం ముక్కామకు చెందిన ఎం.గురువులు పాకిస్తాన్ చెర వీడనున్నారు. వీరిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు శ్రీకాకుళం ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ వీవీ కృష్ణమూర్తితో కూడిన అధికారుల బృందం ఢిల్లీ పయనమైంది. ఉపాధి కోసం గుజరాత్కు.. ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఉపాధి కోసం ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళుతుంటారు. చిత్రమేమిటంటే వలసదారుల్లో 2,500 మంది వరకు చిన్నపిల్లలే. డ్రైవర్లు దళారులుగా మారి గుజరాత్ బోటు యజమానుల నుంచి అడ్వాన్సులు తీసుకుని ఉత్తరాంధ్ర మత్స్యకారులను పనికి తీసుకువెళుతున్నారు. అక్కడ తండేలు, సహాయ తండేలు, కళాసీలుగా పనిచేస్తే రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకూ జీతం ఇస్తుంటారు. పిల్లలకైతే రూ.6 వేల లోపు జీతం వస్తుంది. ఏడాదిగా ఎదురు చూస్తున్నాం ఏడాది తరువాత మా కొడుకు వస్తున్నాడని విదేశాంగ శాఖ ద్వారా సమాచారం అందింది. ఈ విషయం తెలిసి ఎంతో ఆనందపడుతున్నాం. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రాలు దాటి కూలికి పంపిస్తే అనుకోని విధంగా శత్రు దేశమైన పాక్కు పొరపాటున మా వాళ్లు బందీ అయ్యారు. –నక్కా నర్సమ్మ, తిప్పలవలస ఏకాకిగా మిగిలాను నా భర్త నక్కా అప్పన్న, కుమారుడు నక్కా ధనరాజు పాక్కు బందీలుగా చిక్కడంతో ఏకాకిగా మిగిలి వారి కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాను. రెండు రోజుల్లో వారు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏడాదిగా చాలా బాధగా వున్నాం. –నక్కా పోలమ్మ, తిప్పలవలస -
మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
సాక్షి, మచిలీపట్నం: కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులకు మంచిరోజులొచ్చాయి. గంగమ్మ తల్లినే నమ్ముకున్న వారి బతుకులు బాగుపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సముద్రంలో వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు వేటనిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాకుండా డీజిల్ సబ్సిడీని లీటర్కు రూ.6.03 నుంచి రూ.9లకు పెంచింది. తాజాగా మైదాన ప్రాంతాల్లో చెరువుల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులకు కిసాన్ క్రిడెట్ కార్డులివ్వాలని నిర్ణయించింది. జిల్లాలో ఇన్లాండ్ మత్స్యకార సంఘాలు 211, మెరైన్ మత్స్యకార సంఘాలు 43, మహిళా మత్స్య కార సంఘాలు 81 ఉన్నాయి. వీటి పరిధిలో 38,914 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. మత్స్య కారులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో ఉంటూ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టే మత్స్యకారులు తగిన ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతున్నారు. రొయ్యలు చెరువులు సాగు చేసే మత్స్యకారులైతే దాణా, మందులు కొనుగోలు చేయడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సౌకర్యం గతంలో ఉండేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతకాలం నిలుపుదల చేశారు. కాగా కేంద్రం మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరింపజేసింది. ప్రస్తుతం సొసైటీల పరిధిలో యాక్టివ్గా ఉన్న మత్స్యకారులకు ఈ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. చేప రైతుల(వ్యక్తిగతంగా, గ్రూపులు, భాగస్వాములు, కౌలుకు సాగు చేసే వారు)తో పాటు సెల్ఫ్హెల్ప్, జాయింట్ లైబలిటీ, మహిళా మత్స్యకార గ్రూపులు ఈ కార్డులు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. అలాగే వర్కింగ్ కాపిటల్ కాంపొనెంట్తో సాగు చేసే మత్స్యకారులకు కూడా ఈ కార్డులు పొందేందుకు అర్హులు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సీడ్, ఫీడ్, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, హార్వస్టింగ్స్, మార్కెటింగ్ చార్జీలు, ఆయిల్, విద్యుత్ చార్జీలు, ఐస్, ల్యాండింగ్ చార్జీలు లేబర్, లీజ్ల కోసం ఈ కార్డుల ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు.ఈ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. చేపల పెంపకం, వేట, విక్రయాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించవచ్చు. అర్హులైన వారిని గుర్తిస్తున్నామని, జనవరి 1వ తేదీ నుంచి వారికి మత్స్యశాఖ తరఫున కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్టు మత్స్యశాఖ డీడీ రాఘవరెడ్డి తెలిపారు. -
ఉడికిన పీత..లాభాలమోత
పిఠాపురం: సముద్ర పీతలు.. ఒకసారి తింటే ఆ రుచి మరచిపోలేం.. ఇక మన రాష్ట్ర తీరంలో దొరికే సముద్ర పీతలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. కొన్ని రకాల పీతల ధర విదేశాల్లో కిలో వేలల్లో ఉంది. మత్స్యకారులు, వ్యాపారులకు లాభాల పంట పండిస్తున్న ఈ పీతలు ఎగుమతికి అంత అనుకూలం కాకపోవడంతో.. ఐస్లో ఎంత పకడ్బందీగా పంపినా కొన్నిసార్లు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు పరిష్కారం కనుగొన్నారు. అదే పీతల్ని ఉడికించి ఎగుమతి చేయడం. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు రుచిలో కూడా శ్రేష్టంగా ఉండడంతో ఈ విధానంలో ఎగుమతులు జోరందుకున్నాయి. సముద్ర పీతల ధర మన వద్ద కిలో రూ. 350 నుంచి రూ. 500 ఉంటే.. విదేశాల్లో రూ.5 వేల వరకూ పలుకుతుంది. బ్లూ క్రాబ్, త్రీస్పాట్ క్రాబ్, పచ్చ పీత, మండ పీత, జీలా పీత, చుక్క పీత తదితర రకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని తీరప్రాంతాల నుంచి రోజూ సుమారు 20 నుంచి 25 టన్నుల పీతలు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో జీలా రకం పీతలకు క్రేజ్ ఎక్కువ. సాధారణంగా పీతలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అమెరికా లాంటి దేశాలకు పంపాలంటే ఎక్కువ రోజుల నిల్వ చేయాల్సి రావడంతో ఎగుమతులు తక్కువగా ఉండేవి. పీతల్ని ఉడకబెట్టడం ద్వారా అవి ఎక్కువకాలం పాడవకుండా ఉండడాన్ని గుర్తించారు. దీంతో వేటాడి తెచ్చిన పీతలను కొనుగోలు చేసిన వ్యాపారులు తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాల్లో ఉడకబెట్టి, ఐస్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈ పీతలు కాకినాడ నుంచి ముంబయి, చెన్నై వంటి నగరాల్లోని కంపెనీలకు ప్రత్యేక కంటైనర్లలో తరలించి అక్కడి నుంచి విమానాల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పీతల వేటకు పెట్టుబడి ఎక్కువే.. పీతల్లో మొత్తం 7,693 రకాలున్నాయి. మన వద్ద 10 నుంచి 15 రకాలు మాత్రమే దొరుకుతాయి. పీతల్ని పట్టాలంటే బలమైన వలలు అవసరం. ఒక్కోసారి వల ఎంత గట్టిగా ఉన్నా.. పీతల డెక్కల నుంచి రక్షించడం కష్టం. అందుకే పీతల వేటకు ప్రత్యేక వలలు ఉపయోగిస్తారు. ఒక వల రెండు మూడు వేటల కంటే ఎక్కువ ఉపయోగపడదు. అందువల్లే వీటి వేటకు పెట్టుబడి ఎక్కువ. ఒకసారి పాడైతే అవి మరమ్మతులకు కూడా పనికిరావు. చేపల వేటకైతే 20 నుంచి 30 వేటల వరకు వల పనికొస్తుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినప్పుడు పీతల కోసం ప్రత్యేక వలలు వేస్తారు. కొంచెం లోతుగా ఉండే ప్రాంతాల్లో పీతలు ఎక్కువగా దొరుకుతాయి. ఆ ప్రదేశాల్లో ఎక్కువ పీతలు పడితే ఆ రోజు పంట పండినట్లే. అర కేజీ నుంచి సుమారు రూ.8 కేజీల బరువైన పీతలు దొరుకుతాయి. మాంసాన్ని వేరు చేసి ఎగుమతులు విదేశాల్లో పీతల్ని కాకుండా.. వాటి నుంచి వేరు చేసిన మాంసాన్ని కొనుగోలు చేస్తారు. దీంతో పీతల అవయవాల్ని బట్టి రేటు మారుతుంది. డెక్కల్లో మాంసానికి ఒక రేటు, కడుపు భాగంలో మాంసానికి మరో రేటు పలుకుతుంది. మన తీరప్రాంతంలో కొన్న పీతలను ఉడకబెట్టి.. ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తారు. అక్కడ వాటిని శుభ్రం చేసి డిప్పలు, డెక్కలు పూర్తిగా తొలగించి కేవలం మాంసాన్ని మాత్రమే ఎగుమతి చేస్తారు. విడివిడిగా ప్యాకింగ్లు చేసి విదేశాలకు పంపుతారు. గిరాకీ పెరిగింది ఉప్పాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రతీ రోజు సుమారు టన్ను వరకు పీతలు కొనుగోలు చేస్తున్నారు. వేట ఎక్కువ ఉంటే 2 నుంచి 5 టన్నుల వరకు పీతలు కొంటున్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన పీతలను కంటైనర్ ద్వారా చెన్నై, ముంబయిల్లోని ఫ్యాక్టరీలకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మేము అమ్మే కంపెనీలు పీతల్ని అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. – మల్లిబాబు, పీతల వ్యాపారి, ఉప్పాడ జోరుగా ఎగుమతులు గతం కంటే పీతల ఎగుమతులు పెరిగాయి. ఉడకబెట్టి ప్యాకింగ్ చేయడం వల్ల పీతలు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు నాణ్యంగా ఉంటాయి. అందువల్లే విదేశాల్లో వీటికి గిరాకీ పెరిగింది. ఈ పీతల రకాలు మన తీర ప్రాంతంలోనే లభ్యమవుతాయి. చెరువుల్లో పెంచే పీతలకంటే సముద్ర పీతలకు గిరాకీ ఎక్కువ. ఉప్పాడ, కాకినాడ, అంతర్వేది తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని కేజీల లెక్కన కొంటున్నారు. జీలా రకం పీత ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. –శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ, కాకినాడ -
మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు
సాక్షి, అమరావతి: మత్స్యకారులు కోరుకున్న ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జెట్టీల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనువుగా ఉన్నాయో తొలుత పరిశీలన చేయాలని సూచించారు. మరపడవల లంగరు కోసం అనువైన జెట్టీలు లేకపోవడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మత్స్యకారులు చెన్నై, గుజరాత్కు తరలి వెళ్లిపోతున్నారని, వారంతా సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా వాడరేవుల్లో రెండు పెద్ద జెట్టీల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జట్టీలను నిరి్మంచాలని సూచించారు. బందరు పోర్టును మేజర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. నిజాంపట్నం హార్బర్ రెండోదశ విస్తరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్.. చేపలు, రొయ్యలు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేపలు, రొయ్య పిల్లలు, మేతను పరీక్షించడానికి అనువుగా ల్యాబ్లు ఏర్పాటు చేయాలన్నారు. సీడ్, ఫీడ్ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్ల సహాయంతో రైతులు ప్రభుత్వ పథకాలను సది్వనియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో కాలుష్యం అంతా సముద్రంలోకి చేరుతోందన్నారు. ఇదే ప్రాంతం నుంచి తాను పాదయాత్ర చేసినట్టు సీఎం గుర్తు చేశారు. ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట జోన్గా ప్రకటించిన తర్వాత అక్కడ ఇతర పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, పర్యావరణాన్ని కలుíÙతం చేయడం సరికాదన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని సవాల్గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారి బ్రాండ్ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతిభావంతుల సహకారం తీసుకుంటే మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగై రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ప్రతి గ్రామానికి పశు వైద్యశాల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పశుపోషణ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలన్నారు. పశువులకు కూడా హెల్త్కార్డులను జారీ చేసి చెవులకు ట్యాగ్, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర నిధులను ఇందుకు వినియోగించాలని సూచించారు. పశువుల ఔషధాల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలన్నారు. పులివెందులలోని ‘ఏపీకార్ల్’కు నేరుగా నీటిని సరఫరా చేసేలా నీటిపారుదలశాఖతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అక్కడ ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు బాధిత ప్రాంతాల్లో పశువుల మేతకు కొరత లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు రూ.50 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. పశువుల వైద్యం కోసం వచ్చే ఏడాది నుంచి 102 వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పశు సంవర్ధకశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. సీఎం సమీక్షలో మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్ నాయక్, పశు సంవర్థకశాఖ డైరెక్టర్ సోమశేఖరం తదితరులు పాల్గొన్నారు. ►రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలి. – అధికారులకు సీఎం ఆదేశం -
మృగశిరొచ్చే..
ఖమ్మంవ్యవసాయం: మృగశిర అనగానే గుర్తుకొచ్చేది ఆ రోజున చేపలు తినడం. అయితే దీని వెనుక అనేక రకాల కారణాలున్నాయి. కార్తె ఆరంభమైందంటే దాదాపు వేసవి కాలం నుంచి వర్షాకాలంలోకి అడుగిడినట్లే. వర్షాకాలం ఆరంభం.. మృగశిర కార్తె తొలిరోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి మృగశిర కార్తె రోజున హైదరాబాద్లో బత్తిని సోదరులు చేపమందు వేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అంతదూరం వెళ్లలేని వారు మృగశిర రోజున తప్పక చేపలు తింటారు. అంతేకాక వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందని, అది చేపలు తినడం వల్ల దూరమవుతుందనేది పెద్దల మాట. దీంతో కూడా మృగశిర ఆరంభం రోజున చేపలను తింటుంటారు. ఈ క్రమంలో మృగశిర రోజున చేపలకు మంచి గిరాకీ ఉంటుంది. చేపల విక్రయదారులు కార్తె ఆరంభం రోజును పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి చేపలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయాలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వైరా, పాలేరు రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున చేపల పెంపకం జరుగుతోంది. వైరా రిజర్వాయర్లో ఇప్పటికే చేపల వేట జరుగుతుండగా.. పాలేరు రిజర్వాయర్లో శనివారం నుంచి చేపలు పట్టడానికి అంతా సిద్ధం చేశారు. 100 టన్నులకు పైగానే విక్రయానికి సిద్ధం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 100 టన్నుల చేపలను మత్స్యకారులు, చేపల విక్రయదారులు అమ్మకానికి సిద్ధం చేసినట్లు సమాచారం. చేపలను వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని.. ఐస్ బాక్స్ల్లో నిల్వ చేస్తున్నారు. మృగశిర కార్తె ఆరంభం రోజైన శనివారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 నుంచి 150 టన్నుల చేపలను విక్రయించే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్క ఖమ్మంలోనే సుమారు 40 నుంచి 45 టన్నుల చేపలు విక్రయించే అవకాశాలున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా రహదారుల వెంట చేపల విక్రయాలకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. పెద్ద పట్టణాలు కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు, మధిర, వైరా, భద్రాచలం, అశ్వారావుపేటతోపాటు మండలాల్లో కూడా మృగశిర రోజున చేపల విక్రయాలు భారీగానే జరుగుతాయి. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో దాదాపు 40 నుంచి 50 టన్నుల మేర చేపలు విక్రయించే అవకాశం ఉంది. ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం వంటి ప్రాంతాల్లో కూడా క్వింటాళ్ల కొద్దీ చేపలను విక్రయాలకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. ఆంధ్రా నుంచి దిగుమతి ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో పెంచిన చేపలు మృగశిర రోజున విక్రయానికి సరిపోవని గుర్తించిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా దిగుమతి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, బాపట్ల, విజయవాడ, గోదావరి జిల్లాలోని రాజమండ్రితోపాటు పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నారు. టన్నుల కొద్దీ చేపలను వాహనాల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకొని.. ఐస్ వేసుకొని తీసుకొచ్చి నిల్వ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. రకాన్నిబట్టి డిమాండ్ చేపల రకాన్నిబట్టి ధర పలికే అవకాశం ఉంది. సహజంగా మన ప్రాంతంలో అధిక ధర ఉండే కొర్రమీను చేప ధర మృగశిర కార్తె ఆరంభం రోజున రెట్టింపు పలుకుతుంది. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలో రూ.300 ఉంటుంది. కానీ.. మృగశిర రోజున కిలో రూ.500 ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఇక పచ్చి రొయ్యలు, బొచ్చలు, రవ్వు, గ్యాస్కట్, బంగారు తీగ వంటి రకాలు సాధారణ రోజుల్లో కంటే అధిక ధరలు పలికే అవకాశాలు ఉన్నాయి. కిలో ఒక్కంటికి అదనంగా మరో రూ.30 నుంచి రూ.50 వరకు అధిక ధర పలికే అవకాశం ఉంది. సమృద్ధిగా చేపలు ప్రభుత్వం చేప పిల్లల పథకం చేపట్టిన తర్వాత చెరువుల్లో సమృద్ధిగా చేపల ఉత్పత్తి జరుగుతోంది. స్థానిక చెరువులు, జలాశయాల్లో ఉత్పత్తి అయ్యే చేపలను మత్స్యకారులు ఆయా గ్రామాలు, మండలాల్లోనే విక్రయిస్తున్నారు. మృగశిర కార్తె రోజున పలు చెరువుల్లో చేపలు పట్టడానికి మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. అన్ని ప్రాంతాల్లో మృగశిర రోజున సమృద్ధిగా చేపలు లభించే అవకాశాలున్నాయి. – బుజ్జిబాబు, జిల్లా మత్స్య శాఖాధికారి -
చెరువుకు చేరని ‘చేప’
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేప పిల్లల పంపిణీ నత్తనడకన కొనసాగుతోంది. మత్స్యకారులకు చేయూతను అందించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఐదు జిల్లాల్లో మొత్తం 13.01 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.31 కోట్ల చేప పిల్లలను మాత్రమే మత్స్యకారులకు అందించారు. చెరువుల్లో చాలా వరకు 20 రోజులక్రితం కురిసిన వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో చేప పిల్లల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. 50 శాతం కూడా పంపిణీ కాలేదు.. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారం వరకే చేప పిల్లలను పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే వర్షాలు ఆలస్యంగా కురవడంతో సెప్టెంబర్ చివరి వారం వరకు సమయమిచ్చారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరడంతో చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని మాధన్నపేట చెరువులో ఆగస్టు 28న చేప పిల్లలు వదిలి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాన్ని సమయమిచ్చారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరడంతో చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని మాధన్నపేట చెరువులో ఆగస్టు 28న చేప పిల్లలు వదిలి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో 50 శాతం చేప పిల్లల పంపిణీ కూడా పూర్తి కాలేదు. వరంగల్ అర్బన్ జిల్లాలో 1.49 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 83 లక్షలు, వరంగల్ రూరల్ జిల్లాలో 2.16 కోట్ల చేప పిల్లలకుగాను 85 లక్షల చేపల పిల్లలు మహబూబాబాద్ జిల్లాలో 4.43 కోట్ల చేప పిల్లలకు 2.50 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2.13 కోట్లకుగాను 85 లక్షలు, జనగామ జిల్లాలో 2.80 కోట్ల చేపపిల్లలకుగాను 28 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. మండల కేంద్రాల్లో పంపిణీ.. చేప పిల్లల పంపిణీ కోసం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు హన్మకొండలోని భీమారం ఫిషరీస్ నిర్వాహకులతోపాటు కొండా సుష్మితాపటేల్, పట్టాభి చేప పిల్లల పంపిణీని దక్కించుకున్నారు. భీమారం ఫిషరీస్ వారు వరంగల్ అర్బన్ జిల్లాలోని మెజార్టీ చెరువులకు పంపిణీ చేయాల్సి ఉండగా, మిగిలిన చెరువులతోపాటు వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పట్టాభి, సుష్మితా పటేల్ చెరిసగం చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉంది. పటాభికి వరంగల్లోని కాజీపేట మండలం అమ్మవారిపేటలో ఫాం ఉండగా, కొండా సుష్మితా పటేల్కు గీసుకొండ మండలం వంచనగిరిలో ఫాం ఉంది. సదరు కాంట్రాక్టర్లు ఆయా మండల కేంద్రాలకు చేప పిల్లలను తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేస్తాం జిల్లాలో ఎంపిక చేసిన అన్ని చెరువుల్లో సెప్టెంబర్ చివరికల్లా చేప పిల్లల పంపిణీ పూర్తిచేస్తాం. మా శాఖ పర్యవేక్షణలో చేప పిల్లల పంపిణీ జరుగుతోంది. చేప పిల్లలు గతంలో నేరుగా చెరువుల్లో వదలడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. అందుకే ఫాం దగ్గరనే పంపిణీ చేస్తున్నాం. – నరేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
సామాన్యులే రియల్ హీరోలు
వారంతా సాధారణ ప్రజలు. ఇతరులకు సాయం చేయడానికి కోట్లకొద్దీ డబ్బు లేదు. చేతిలో అధికారం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అవసరమైన అధునాతన పరికరాలు లేవు. ఉన్నదల్లా కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయాలనే సంకల్పం. ఆ ఆశయంతోనే ఎంతోమంది సాధారణ ప్రజలు ముందుకు కదిలారు. వారిలో పదేళ్లు కూడా నిండని పిల్లలు, జైలు ఖైదీలూ ఉన్నారు. అలాంటి కొందరు స్ఫూర్తిప్రదాతల గురించి తెలుసుకుందాం. కిడ్డీ బ్యాంక్ ఇచ్చేసింది.. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన 9 ఏళ్ల అనుప్రియ సైకిల్ కొనుక్కోవాలనే లక్ష్యంతో చాలా రోజుల నుంచి ఒక్కో రూపాయీ పోగేస్తోంది. రూ.9,000దాకా ఆమె కిడ్డీ బ్యాంక్లో పోగయ్యాయి. అదే సమయంలో టీవీల్లో కేరళ ప్రజల దైన్యాన్ని చూసి చలించిపోయింది. సైకిల్ కొనుక్కోడానికి దాచిన నగదంతా సహాయక కార్యక్రమాలకు పెద్ద మనసుతో ఇచ్చేసింది ఈ చిన్నారి. ఈ విషయం తెలుసుకున్న హీరో సైకిల్స్ సంస్థ బాలికపై ప్రశంసలు కురిపించింది. మానవత్వానికి అనుప్రియను ప్రతీకగా అభివర్ణించిన హీరో సైకిల్స్.. ఆమె జీవితాంతం ఏడాదికొక సైకిల్ను అనుప్రియకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మత్స్యకారుల మానవీయత చేపల వేట కోసం రోజూ సముద్రంలోకి వెళ్లే గంగపుత్రులు వారు. లోతైన నీటిలోనూ ఎలాంటి బెరుకూ లేకుండా ఈదడం వారికి వెన్నతో పెట్టిన విద్య. తమకు తెలిసిన విద్యతో కేరళలో వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడాలని వారు తలచారు. అనుకున్నదే తడవుగా సొంత ఖర్చుతోనే తమ పడవలను ట్రక్కుల్లోకి ఎక్కించి తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరారు. వారిలో ఎక్కువగా త్రివేండ్రానికి చెందినవారే ఉన్నారు. మత్స్యకారుల సాయం గురించి తెలుసుకున్న కొందరు ట్రక్కు డ్రైవర్లు, యజమానులు.. వారి పడవలను ఉచితంగానే రవాణా చేశారు. పతనం తిట్ట, ఎర్నాకుళం, త్రిస్సూర్ సహా అనేక చోట్ల మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సహాయక సిబ్బంది తాము చేరుకోలేమంటూ చేతులెత్తేసిన చోటుకి కూడా జాలరులు వెళ్లి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కేపీ జైసాల్ అనే మత్స్యకారుడు ఇలా బలగాలకు సాధ్యంకాని చోటుకు కూడా చేరుకుని తన వీపును మెట్టుగా మార్చి ముగ్గురు మహిళలను బోటులోకి ఎక్కించి రక్షించడం మనకు తెలిసిందే. ఈ నిజమైన హీరోల సేవలను గుర్తించిన సీఎం విజయన్.. వారందరికీ ఒక కొత్త బోటుని, సహాయక చర్యల్లో పాల్గొన్నన్ని రోజులకూ రోజుకు రూ. 3 వేల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. నిరాశ్రయులకు ఖైదీల చపాతీలు వరదల్లో నిరాశ్రయులుగా మారిన వారికి ఆహారం అందించేందుకు త్రివేండ్రం పూజాప్పురలో ఉన్న కేంద్ర కారాగారంలోని ఖైదీలు తీవ్రంగా శ్రమించారు. మంచినీటి సీసాలతోపాటు దాదాపు 50 వేల చపాతీలను ఖైదీలతో తయారు చేయించి జైలు అధికారులు సహాయక బృందాలకు అందజేశారు. నీటిలో చిక్కుకుని ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారికి హెలికాప్టర్ల నుంచి జారవిడిచేందుకు తమ చపాతీ ప్యాకెట్లు బాగా ఉపయోగపడ్డాయని అధికారులు చెప్పారు. 2015లో చెన్నైలో వరదల సమయంలోనూ ఇదే జైలు నుంచి 50 వేల చపాతీలను పంపారు. సాధారణ రోజుల్లోనూ ఖైదీలు చపాతీతోపాటు శాకాహార, మాంసాహార వంటకాలను తయారుచేసి త్రివేండ్రంలో ‘ఫ్రీడమ్’ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. ప్రేమతో.. ఫేస్బుక్ దళం 2015లో చెన్నై వరదల సమయంలో సహాయక కార్యక్రమాల కోసం పురుడుపోసుకున్న ఫేస్బుక్ గ్రూప్ ఒకటి ప్రస్తుతం కేరళలో సహాయక చర్యల్లో పాల్గొంటోంది. నాడు 9 మందితో ప్రారంభమైన ఈ గ్రూప్లో నేడు వేలాది మంది ఉండగా దాదాపు 2,000 మంది సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆ గ్రూప్ పేరే ‘అన్బోదు కొచ్చి’ (ప్రేమతో కొచ్చి). కొచ్చిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలోనే ఈ గ్రూప్లోని 500 మంది ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ప్యాక్ చేసి నిరాశ్రయులకు పంపించే పనిలో ఉన్నారు. బిస్కెట్లు, రస్క్, వంట పాత్రలు, దుస్తులు తదితరాలను ప్యాక్ చేసి సహాయక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ దళాల ద్వారా అవసరమైన వారికి అందిస్తున్నారు. కొచ్చిలో ఓ పాఠశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరంలో భోజనం చేస్తున్న ఓ వరదబాధిత చిన్నారి -
మత్స్యకారుల మధ్య స్పీడ్ బోట్ల చిచ్చు
-
తీరంలోనే లంగరు..
ప్రకృతి వైపరీత్యాలు.. పాలకుల నిషేధాజ్ఞలతో జిల్లాలోని మత్స్యకారుల గ్రామాల్లో చేపల వేట తీరం దాటడం లేదు. సముద్రం నిండుగా చేపలు ఉన్నా.. అందులోకి వెళ్లి వేట చేయలేని దుస్థితి. తీరం వెంబడి సముద్రంలోకి వెళ్లే ముఖద్వారాల వద్ద ఇసుక మేటలతో వేట సాగించే బోట్లు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి పూడికతీతకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడంతో గంగపుత్రులు వేటకు దూరం అవుతున్నారు. వాకాడు(నెల్లూరు): జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులకు చేపల వేటకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో వేట అంతంత మాత్రంగా సాగుతోంది. దీనికి తోడు పునరుత్పత్తి కాలంగా ఏటా రెండు నెలలు వేటను నిషేధిస్తున్నారు. మిగిలిన కాలంలో సజావుగా వేట సాగించడానికి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలు వేటకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి తీర గ్రామం నుంచి సముద్రంలోకి వెళ్లడానికి ముఖద్వారాలు ఉన్నాయి. సముద్రంపై సజావుగా వేటసాగాలంటే సాగర ముఖద్వారాలు తెరుచుకుని నిండుగా నీరు ప్రవహించాల్సి ఉంది. మత్స్యకారులు తమ బోట్లను ఎలాంటి ఆటంకం లేకుండా సముద్రంలోనికి తీసుకెళ్లడం, వేట తర్వాత మత్స్య సంపదను తీరానికి చేర్చడానికి వీలు అవుతుంది. కానీ ప్రస్తుతం సముద్రంతీరం ఆటు, పోటుల కారణంగా అన్ని చోట్ల ముఖద్వారాల వద్ద 10 మీటర్లు ఎత్తులో ఇసుక మేటలు వేయడంతో పూడిపోయింది. వేటకు పాట్లు జిల్లాలో 14 చోట్ల సముద్ర ముఖద్వారాలు ఉన్నాయి. అందులో ముత్తుకూరు, జువ్వలదిన్నె ముఖద్వారాలు మినహా మిగిలిన ద్వారాలు మూసుకుపోవడంతో మత్స్యకారులు వేటకు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలోని 113 మత్స్యకార గ్రామాలకు చెందిన 6 వేల ఫైబర్ బోట్లపై ఆధారపడిన 60 వేల మంది మత్స్యకారులు నానా పాట్లు పడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సముద్రుడు కరుణించడంతో మత్స్యకారులకు ఇప్పుడు మత్స్యసంపద దండిగా దొరుకుతుంది. అయితే మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్లలేక తమ బోట్లకు తీరం ఇవతలే లంగర్ వేయాల్సిన పరిస్థితి దాపురించింది. పట్టించుకోని పాలకులు, అధికారులు మత్స్యకారుల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న పాలకులు, అధికారులు సముద్ర ముఖద్వారాల్లో పూడిక తీతను పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా మత్స్యకార సంఘాల నాయకులు, గ్రామ కాపులు, మత్స్యకారులు సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సభల్లో విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మత్స్యకారులే అప్పులు చేసి ఏటా రూ. 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ముఖద్వారాల పూడిక తీత పనులు చేయించుకుంటున్నారు. జిల్లాలో వాకాడు, కోట, చిల్లకూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, విడవలూరు, కొడవలూరు, అల్లూరు మండలాల్లో మత్స్యకారులే చందాలు వేసుకుని ప్రస్తుతం ముఖద్వారాల పూడికలు తీయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాకాడు మండలం కొండూరుపాళెం సముద్ర ముఖద్వారం వద్ద మత్స్యకారులు పూడిక పనులను వేగంగా సాగిస్తున్నారు. నిషేధ కాలానికి పరిహారం.. కాగితాలకే పరిమితం రెండేళ్లుగా వేట నిషేధిత కాలంలో మత్స్యకారులకు అందించే సాయం కాగితాలకే పరిమితమైంది. గతంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట విరామం కింద రూ. 2 వేలు సాయం అందించే వారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని రెట్టింపు చేసి రూ.4 వేలు సాయంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన మత్స్యకారుల్లో ఆనందాన్ని నింపినప్పటికీ రోజులు గడిచే కొద్దీ నిరాశే మిగిల్చింది. వేట విరామం నగదు సాయం కోసం జిల్లాలో అధికారికంగా 3,500 బోట్లు, 21 మర పడవలపై ఆధారపడిన 15 వేల మంది మత్స్యకారులు నమోదు చేసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రేషన్ కార్డు, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్ విధిగా ఉండాలని మెలిక పెట్టి ఆంక్షలు విధించడంతో రెండేళ్లుగా దాదాపు 10 వేల మందికి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వేట విరామంలో ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించి ఉంటే మత్స్యకారులకు కొంత మేర ఉపయోగపడేది. కానీ రెండేళ్లుగా ఒక్కపైసా కూడా అందకపోవడం, వేట సజావుగా సాగకపోవడంతో మత్స్యకారులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తీర గ్రామాల్లోని ముఖద్వారాల వద్ద పూడిక తీత పనులకు చర్యలు చేపట్టాలని జిల్లాలోని మత్స్యకారులు కోరుచున్నారు. నెల రోజులుగా వేట లేదు సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో నెల రోజులుగా వేట చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని అనేకసార్లు జిల్లా కలెక్టర్కు, ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. తూపిలిపాళెం, కొండూరుపాళెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు చందాలు వేసుకుని రూ. 5 లక్షలు వ్యయంతో పూడిక తీయిస్తున్నారు. – మేలంగారి పోలయ్య, కాపు కొండూరుపాళెం రెండేళ్లుగా డబ్బులు రావడం లేదు రేషన్కార్డు, ఆధార్ కార్డులను అధికారులు తప్పులుగా ఉన్నాయంటూ మెలిక పెట్టి రెండేళ్లుగా వేట విరామం డబ్బు ఇవ్వడం లేదు. నిజంగానే ఆధార్, రేషన్ కార్డులు తప్పులుగా ఉంటే తమకు రేషన్, పింఛన్, బ్యాంక్, తదితర లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం, పాలకపక్షాన ఉన్న అధికారులు ఆడుతున్న నాటకం మాత్రమే. గత ప్రభుత్వంలో వేట విరామం నగదు సకాలంలో అందేది. – కె. రాజు, మత్స్యకారుడు, కొండూరుపాళెం సముద్ర ముఖద్వారాల పూడిక పనులపై ప్రభుత్వానికి నివేదించాం ఇసుక మేటలతో పూడిపోయిన సముద్ర ముఖద్వారాల పూడిక పనుల విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. పూడికతీత పనులు వేల రూపాయలతో జరిగేవి కావు. రూ.లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. – కె రమేష్బాబు, ఎఫ్డీఓ -
స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళన
సాక్షి, నెల్లూరు : పోలీసులు అకారణంగా తమపై దాడి చేశారంటూ గిరిజనులు చేపట్టిన ఆందోళన సంగంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. నెల్లూరు జిల్లా సంగం పరిధిలోని నీలగిరి జలాశయం వద్ద రోజు మాదిరిగానే గిరిజజన మత్సకారులు చేపల వేటకు వెళ్ళారు. అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు.. మత్సకారులను తరిమేసే ప్రయత్నం చేశారు. దీంతో మత్సకారులకు పోలీసులకు గొడవ మొదలైంది. ఏ కారణం లేకుండా పోలీసులు కొట్టడంతో గిరిజనులు తిరగబడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు 8 మందిని మత్స్యకారులను అరెస్టు చేసి సంగం పోలీసు స్టేషన్కు తీసుకెళ్ళారు. దీనిపై స్థానిక గిరిజన మహిళలు స్టేషన్ ముందు ఆందోళకు దిగారు, ఏ కారణం లేకుండానే వారిని కొట్టారని ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న మత్సశాఖ అధికారిని వెంటనే పోలీసు స్టేషన్కు రావడంతో పోలీసులు అతడిని కూడా అడ్డుకున్నారు. -
ట్యూన్..అయ్యేనా?
ఒంగోలు టౌన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మత్స్యకారులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సాధారణంగా పది నుంచి పదిహేను కిలోమీటర్ల లోపలికి వెళ్లి వేట సాగిస్తే చేపలు ఎక్కువగా పడుతుంటాయి. ప్రస్తుతం ఎంతసేపు వేట సాగించినా చేపలు తక్కువగానే పడుతున్నాయి. కొంతమంది మత్స్యకారులు అనుమతికి మించి సముద్రం లోపలికి వెళ్లి వేట సాగిస్తున్నారు. డీప్ సీలోకి వెళ్లి వేటాడుతున్నారు. డీప్ సీలో ట్యూనా చేపలు ఎక్కువగా పడుతుంటాయి. వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. చైనా, జపాన్ దేశాలకు భారత్ నుంచి ట్యూనా చేపలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ట్యూనా చేపలు భారత కరెన్సీ ప్రకారం చూస్తే కేజీ వెయ్యి రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇంతటి డిమాండ్ ఉన్న ట్యూనా చేపలు పట్టుకునేందుకు మత్స్యకారులు సాహసం చేస్తున్నారు. డీప్ సీలోకి వెళ్లి వేట సాగించాలంటే ప్రస్తుతం మత్స్యకారులు ఉపయోగిస్తున్న పడవలు అనుకూలించవు. ఆదాయం కోసం మత్స్యకారులు సాహసం చేస్తూ డీప్ సీలోకి వెళ్లి ట్యూనా చేపలు పట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డీప్ సీలోకి వెళ్లి ట్యూనా చేపలు పట్టుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్ బోట్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నిజాంపట్నంలోనే స్టీల్ బోట్లు ఉన్నాయి. ఎంతో ఖరీదైన ఈ స్టీల్ బోట్లను మత్స్యకారులకు రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంత జిల్లాలకు యూనిట్లు కేటాయించింది. అందులో భాగంగా జిల్లాకు 20 యూనిట్లను కేటాయించింది. ఒక్కో స్టీల్ బోటు 70 నుంచి 80 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ స్టీల్ బోటును 40 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందించాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం మత్స్యకారులు గ్రూపుగా ఏర్పడి తమ సొంత డబ్బుతో లేదా బ్యాంకు రుణంగా పొందేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇంత వరకూ ఒక్క యూనిట్ను కూడా మంజూరు చేయలేదు. కాగితాలపైనే యూనిట్లు కదులుతూ ఉండటం గమనార్హం. విషయం తెలుసుకొన్న కొంతమంది మత్స్యకారులు మత్స్యశాఖ అధికారులను స్టీల్ బోట్ల విషయమై అడుగుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో వారు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. -
ఇదేం అ'న్యాయం'!
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న సమయం.. సందర్భం.. పక్కనే కొనసాగుతున్న మత్స్యకారుల దీక్షలను పట్టించుకోకపోవడం ఇప్పుడు వివాదానికి తావిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి వారమైంది. ఇన్నాళ్లూ నోరుమెదపని వాసపల్లి ఈరోజే పనిగట్టుకొని కొంతమందిని వెంటేసుకొచ్చి నిరసన పేరుతో కాసేపు హడావుడి చేశారు.. ఆ పక్కనే తన సామాజికవర్గీయులే ఎస్టీ జాబితాలో చేర్చాలని 43 రోజులుగా చేస్తున్న దీక్షలను మాత్రం ఆయనగారు పట్టించుకోలేదు.. కనీసం శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు.. బడ్జెట్ కేంద్రం పరిధిలోనిది.. తనకు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఏదో చేశానన్న మెహర్బానీ కోసం నిరసన తెలిపిన ఎమ్మెల్యే.. రాష్ట్ర పరిధిలోని అంశమైన మత్స్యకారుల ఎస్టీ సాధన డిమాండ్ను పట్టించుకోకపోవడం.. సీఎంను ఒప్పించ లేకపోవడం.. దీక్షలను ఉపేక్షించడంపై నిరసన వ్యక్తమవుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గంలోనే మత్స్యకార జనాభా ఎక్కువగా ఉన్నా.. ఎమ్మెల్యే వాసుపల్లి అంటీముట్టనట్లు వ్యవహరించడం చర్చలకు తావిచ్చింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. కేంద్ర బడ్జెట్కు నిరసనగా బుధవారం నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తనదైన శైలిలో నిరసన చేపట్టిన ఎమ్మెల్యే.. ఆ పక్కనే ఉన్న మత్స్యకారుల దీక్షా శిబిరం వైపు తొంగిచూడకపోవడం విమర్శలపాలవుతోంది. తమను ఎస్టీ జాబితాలో చేర్పించాలంటూ పార్టీలకతీతంగా మత్స్యకారులు గత డిసెంబర్ 27 నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో దీక్షాశిబిరం జోలికి వెళ్లని వాసుపల్లి.. సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడు మాత్రం ఏదో చేశానని చెప్పుకోవడానికి మత్స్యకార నాయకులను ఆయన వద్దకు తీసుకుని వెళ్లారు. కానీ సీఎం అందరి ముందు వాసుపల్లిని చెడామడా తిట్టేశారు. ఆయనతోపాటు మత్స్యకార నేతలపైనా బాబు విరుచుకుపడ్డారు. కనీసం వినతిపత్రం కూడా తీసుకోకుండా ‘తొక్క తీస్తా.. బ్లాక్మెయిల్ రాజకీయాలు నా వద్ద చేస్తున్నారా’.. అంటూ వాసుపల్లి ముందే మత్స్యకారులపై మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్తో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మత్స్యకారులపై సీఎం అలా మాట్లాడినా వాసుపల్లి ఏమీ స్పందించలేని పరిస్థితిలో మిన్నకుండిపోయారు. ఆ ఘటన దరిమిలా వాసుపల్లి మత్స్యకారుల దీక్షాశిబిరం జోలికి వెళ్లలేదు. పోలీసులు వేధిస్తున్నా.. పట్టించుకోని ఎమ్మెల్యే మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత దీక్షలతో నిరశన తెలియజేస్తున్న మత్స్యకారులపైకి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీక్షలకు అనుమతి లేదంటూ శిబిరాన్ని ఎత్తివేయాలని గత రెండు రోజులుగా నేతలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకారుల దీక్షలు భగ్నం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ అనుకూల కుట్రదారులు దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. అటువంటి ఘటనలు ఇక్కడా చోటుచేసుకోవచ్చన్న నెపంతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వాస్తవానికి అటువంటి పరిస్థితి విశాఖలో లేదు. గత 43రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రశాంతంగానే దీక్షలు కొనసాగుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఓ విధంగా మత్స్యకార నేతలను వేధిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులకు అండగా నిలవాల్సిన వాసుపల్లి అస్సలు పత్తా లేకుండా పోయారు. బుధవారం బడ్జెట్పై నిరసన చేపట్టిన సందర్భంగానైనా పక్కనే ఉన్న మత్స్యకారుల శిబిరం వద్దకు వస్తారని అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యే అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలపాలవుతోంది. వాసుపల్లి తీరు గర్హనీయం ఓ వైపు పగపట్టిన విధంగా ప్రభుత్వ తీరు.. పోలీసుల ఆంక్షలతో నిరసనకారులు అల్లాడిపోతుంటే కనీసం దీక్షా శిబిరం వద్దకు రావాలన్న కనీస స్పృహ కూడా ఎమ్మెల్యే వాసుపల్లికి లేకపోయిందని వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు విమర్శించారు. న్యాయమైన డిమాండ్తో గంగపుత్రులు 43 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యేగా, మత్స్యకార వర్గీయునిగా ఉన్న వాసుపల్లి ఏమాత్రం పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. తీరిక లేదేమో దీక్షా శిబిరం వైపు తొంగిచూడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరుపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మత్స్యకార సంఘం నేత నీలకంఠం వ్యాఖ్యానించారు. బహుశా ఆయనకు తీరిక లేదేమో.. అందువల్లనే వచ్చి ఉండరు.. అని వ్యంగాస్త్రం సంధించారు. -
గంగపుత్రుల సర్వే
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో మత్స్యకారుల లెక్క తేలనుంది.. గంగపుత్రుల సంక్షేమం కోసం జాతీయ మత్స్య సహకార ఫెడరేషన్ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేక సర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే సబ్సిడీ, రాయితీ, బీమా పరిహారం వంటివి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా మత్స్యకారుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు జిల్లాలో సర్వే చేస్తున్నాయి. మత్స్యకారుల బీమా వంటి ప్రత్యేక పథకాలను కేంద్రం ఈ ఫెడరేషన్ ద్వారా అమలు చేస్తోంది. ఉదాహరణకు ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే అందించే బీమా పరిహారాన్ని ఇప్పటివరకు కుటుంబసభ్యులకు చెక్కుల రూపంలో చెల్లిస్తోంది. ఈ చెక్కులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా మత్స్యశాఖ అధికారులకు వచ్చేవి. వాటిని జిల్లా మత్స్యశాఖ అధికారులు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ఇకపై ఇలాంటి పథకాల లబ్ధిని నేరుగా మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా అధికారులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక బృందాలు.. జిల్లాలో 260 మత్స్య సహకార సంఘాలుండగా, సుమారు 16 వేల మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో దాదాపు 1,400 మంది జలాశయ మత్స్యకారులు. వీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, బ్యాక్వాటర్లలో చేపలు వేటాడతారు. ఇలా 16 వేల మంది మత్స్యకారులకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను జిల్లాకు పంపింది. జిల్లా మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది సహాయంతో ఈ బృందాలు మత్స్యకారుల వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కో మత్స్యకారుడికి సంబంధించి మొత్తం 21 అంశాలను నమోదు చేసుకుంటున్నారు. పేరు, వయస్సు, తండ్రి పేరు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు సహకార సంఘంలోని సభ్యత్వానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నారు. సంఘం పేరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఎన్ని సంవత్సరాలుగా వృత్తిలో ఉన్నారు.. చేపలు పడుతున్న చెరువు పేరు, ఆ చెరువుకు ఆధారమైన నీటి వనరుల వివరాలు, మత్స్యకారుడి బ్యాంకు ఖాతా, ఆధార్ వంటి వివరాలను సేకరిస్తున్నారు. అయితే, జిల్లాలో ఇప్పటికే చాలా మంది మత్స్యకారుల వివరాలు మత్స్యశాఖ అధికారుల వద్ద ఉన్నాయి. ఈ వివరాలు నమోదు కాని వారి వివరాలను ఈ సర్వే బృందాలు సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని అంతా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తున్నారు. కాగా జాతీయ మత్స్య సహకార ఫెడరేషన్ ద్వారా మత్స్యకారులకు వృత్తి నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ వంటి పథకాల అమలు చేస్తోంది. ఈ సర్వే వివరాలను సేకరించడం ద్వారా పథకాల లబ్ధి నేరుగా మత్స్యకారునికి అందించవచ్చని ఆ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. సర్వే పూర్తవుతోంది.. మత్స్యకారుల సర్వే జిల్లాలో పూర్తి కావస్తోంది. మా శాఖ ఎఫ్డీవోలు, ఇతర సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలు వివరాలను సేకరిస్తున్నాయి. ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా మత్స్యకారులకు అందించేందుకు వీలుంటుంది. – మహిపాల్, జిల్లా మత్స్యశాఖాధికారి -
ఓక్కి’కి 39 మంది మృతి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/సాక్షి, ముంబై: పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన ఓక్కి తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఐదు రోజుల క్రితం తమిళనాడు, కేరళ, లక్షదీవుల్లో భారీ వర్షాలతో ప్రారంభమైన తుపాను క్రమంగా మహారాష్ట్రకు విస్తరించడంతోపాటు ఇప్పుడు గుజరాత్పై కూడా ప్రభావం చూపింది. కేరళ, తమిళనాడుల్లో కలిపి ఇప్పటివరకు ఓక్కి ధాటికి 39 మంది మరణించగా, 167 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. మరోవైపు మూడు రోజుల్లో తొలిదశ శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో వర్షాల కారణంగా మంగళవారం రాజకీయ నాయకుల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కేరళ, తమిళనాడు తీరాల్లో చేపల వేటకు వెళ్లిన 809 మంది మత్స్యకారులు వారి పడవలతో సహా మహారాష్ట్ర తీరానికి క్షేమంగా వచ్చారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. అయితే తుపాను క్రమంగా బలహీనపడుతోందనీ, గుజరాత్లో ఎన్నికలు జరిగే డిసెంబరు 9 నాటికి దాని ప్రభావం ఉండే అవకాశాలు తక్కువని ఓ అధికారి చెప్పారు. భారీ వర్షాల వల్ల తమిళనాడులో 10 మంది మరణించగా, 74 మందికిపైగా జాలర్లు కనిపించకుండా పోయారు. అలాగే కేరళలో 29 మంది మృతిచెందగా, 93 మంది జాలర్లు గల్లంతయ్యారు. వానల వల్ల ముంబైలో ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదు. నిరంతరం పర్యవేక్షిస్తున్నా: మోదీ ఓక్కి తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను తాను నిరంతరం పర్యవేక్షిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీటర్ ద్వారా తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు సాయం చేయాలని బీజేపీ కార్యకర్తలను ఆయన కోరారు. రాహుల్, అమిత్ షా ర్యాలీలు రద్దు గుజరాత్లో పలు జిల్లాల్లో జల్లులు కురవడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పాల్గొనాల్సిన పలు ర్యాలీలు రద్దయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, రానున్న రెండ్రోజుల్లో అది మరింత తీవ్రంగా మారొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉండే అవకాశం ఉందంది. -
మత్స్యకారుల బతుకు వేట
వాకాడు: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరుస వాయుగుండాలు, భారీ వర్షాలు, అధికారుల హెచ్చరికలు వెరసి మత్స్యకారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి వరకు వేట నిషేధంతో ఏదో ఒక రకంగా బతుకీడ్చిన మత్స్యకారులకు నేడు ప్రతికూల వాతావరణం నిరాశకు గురి చేస్తోంది. మత్స్య సంపద అభివృద్ధి కోసం 60 రోజులు వేటకు దూరంగా ఉన్నారు. ఈ వేట విరామానికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు ఇంతవరకు అందలేదు. ఇలా అన్ని విధాలా మత్స్యకారులు నష్టపోతున్నారు. జిల్లాలో 56 వేల మంది మత్స్యకారులు జిల్లాలో 12 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 113 మత్స్యకార గ్రామాల్లో 56 వేల మంది జాలర్లు ఉన్నారు. వీరంతా కేవలం మత్స్య సంపదతోనే జీవనం సాగిస్తున్నారు. అయితే వేట విరామం సమయంలో ప్రభుత్వం అందించాల్సిన పరిహారం ఇంకా ఒక్కరికీ అందలేదు. మత్స్యకారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అలల సాగరంలో మత్స్య సంపదను పట్టి సంతోషంగా ఉండే గంగపుత్రులు నేడు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. జిల్లా సముద్ర తీరం వెంబడి 40 మరపడవలు, 4,995 ఇంజిన్బోట్లుతోపాటు సాధారణ పడవలు ద్వారా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి వస్తుంటారు. వరుస ప్రతికూల వాతావరణంతో బోట్లన్నీ తీరంలో నిలిపివేశారు. పూటగడవక కొందరు మత్స్యకారులు బకింగ్ హామ్కెనాల్, పులికాట్, ఉప్పుకయ్యల్లో నాటు పడవలద్వారా రోజులు తరబడి వేటకెళ్లినా మత్స్య సంపద అంతంత మాత్రంగానే దొరుకుతోంది. ఏవో చిన్నపాటి చేపలు వలలో పడుతుండటంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. దొరికిన చేపలను చిల్లరగా రోడ్లపై విక్రయించి పొట్ట నింపుకుంటున్నారు. మరికొందరు సమీప రొయ్యల హేచరీలలో కూలి పనులుకు వెళుతున్నారు. మత్స్యకారులకు ఎలాంటి పనులు చేతకాకపోయినా హేచరీ యజమానులు వీరిపై జాలితో పనుల్లో పెట్టుకుని ఎంతో కొంత డబ్బులు ఇచ్చిపంపుతున్నారు. వాతావరణం ఎప్పుడు చక్కబడుతుందో.. వేటకు ఎప్పుడు వెళ్తామా అని మత్స్యకారులు సముద్రం వద్ద నిరీక్షిస్తున్నారు. కొందరు తెగిన వలలకు మరమ్మతులు చేసుకుంటున్నారు. పోరుగాలితో బోట్లు తిరగబడుతున్నాయి వేటకు వెళితే సముద్రంపై పోరుగాలి వీస్తూ బోట్లు తిరగబడుతున్నాయి. తీరంలో ఈదురు గాలులుతోపాటు సముద్రంలో అలలు ఉద్ధృతి పెరిగింది. రెండు నుంచి నాలుగు మీటర్లు ఎత్తుకు అలలు ఎగసి పడుతున్నాయి. వేట మానేసి ఇంటి వద్ద పస్తులతో ఉంటున్నాం. –సోమయ్య, మత్స్యకారుడు, తూపిలిపాళెం మేము ఎలా బతకాలి? సముద్రం ఉగ్ర రూపం దాల్చి భీకరమైన శబ్దాలతో కెరటాలు ఎగసి పడుతున్నాయి. వారం నుంచి బోటు సముద్రంపై వెళ్లలేకపోతోంది. మొన్నటి వరకు వేట విరామంతో పస్తులున్నాం. ఇప్పుడు మత్స్య సంపద దొరుకుతున్నా.. వాతావరణం అనుకూలించక వేట చేయలేకపోతున్నాం. వేట విరామం డబ్బులు రెండేళ్ల నుంచి అందడం లేదు. మేము ఎలా బతకాలో అర్థం కావడం లేదు. –పామంజి యార్నావూర్, మత్స్యకారుడు కొండూరుపాళెం -
వేటకు ఎసరు..!
► మత్స్యకారుల బతుకుల్లో చిచ్చు... ► కొండవీటివాగు పేరిట ‘గూడు’ కూల్చివేత ► నదీ గర్భాన్ని కబ్జా చేసి పొట్టకొట్టే యత్నం ► గంగపుత్రులపై ప్రభుత్వ పెద్దల ప్రతాపం ప్రభుత్వ అండతో అక్రమార్కులు మత్స్యకారులపై ప్రతాపం చూపుతున్నారు. నదిని ఆక్రమించుకుని వారి పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కోసమంటూ మత్స్యకారులకు నిలువ నీడలేకుండా చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మత్స్యకారుల బతుకులు ప్రశ్నార్థకం కానున్నాయి. తాడేపల్లి çసమీపంలో కృష్ణా నదిని నమ్ముకుని సుమారు 500కుపైగా మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా నదీ తీరప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అదే విధంగా గుంటుపల్లి, తుమ్మలపాలెం, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం పరిధిలో మరో 500 కుటుంబాలు నదిలో చేపల వేటపై ఆధారపడి బతుకుతున్నాయి. అయితే రాజధానిలోని అక్రమార్కుల అరాచకం కారణంగా మత్స్యకారుల బతుకులు ప్రశ్నార్థకం కానున్నాయి. కొండవీటి వాగు పేరిట... రాజధాని నిర్మాణానికి కొండవీటి వాగు ముప్పుపొంచి ఉన్న విషయం తెలిసిందే. ఆ ముప్పును తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాడేపల్లి సమీపంలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం పూర్తి కావాలంటే నదీతీర ప్రాంతంలో నివాసం ఉంటున్న సమారు 500 కుటుంబాల వారిని అక్కడి నుంచి తరిమివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 140 నివాసాలను కూలదోశారు. మిగిలిన నివాసాలను సైతం తొలగించేందుకు ఒత్తిడి చేస్తున్నారు. ఖాళీ చేయించటానికి మత్స్యకారులకు రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. అయితే ప్రభుత్వ చర్యలను మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై పలుమార్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేశారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వ పెద్దలను కలసి న్యాయం చేయాలని విన్నవించారు. అయినా ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవటం లేదు. నదిని ఆక్రమించి పొట్టకొట్టే యత్నం ... తాడేపల్లిలో మత్స్యకారుల నివాసాలకు ఎసరుపెట్టిన ప్రభుత్వం... గుంటుపల్లి సమీపంలో టీడీపీ పెద్దలు కొందరు ఏకంగా కృష్ణానదినే కబ్జా చేశారు. టీడీపీ పెద్దలు ప్రయత్నాలు ఫలిస్తే మత్స్యకారులు చేపల వేటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. గుంటుపల్లి, తుమ్మలపాలెం, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం పరిధిలో 500 కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణా, ప్రకృతి వైపరీత్యాలతో చేపల వేట ద్వారా జీవనం కష్టతరమైంది. ఇక నది కూడా ఆక్రమణకు గురైతే ఉన్న ఆ చిన్నపాటి ఆశ కూడా వదులుకోవాల్సిన పరిస్థితి. నదిలో నిరసన... కృష్ణానది ఆక్రమణ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావటంతో మత్స్యకారులు స్పందించారు. కబ్జారాయుళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆదివారం సుమారు 500 మందికిపైగా మత్స్యకారులు 250 బోట్లతో నదిలో ధర్నా చేపట్టారు. కబ్జారాయుళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆక్రమిత ప్రాంతం చుట్టూ తిరుగుతూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
వేటకు విరామం!
► 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం ► మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం ► ప్రత్యామ్నాయ ఏర్పాట్లు శూన్యం ► గత ఏడాది పరిహారం అందరికీ అందని వైనం ► తీరప్రాంత గ్రామాల్లో అమలు కాని ఉపాధి హామీ పథకం చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో మర పడవలతో వేటను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి సీజన్ కావడంతో 60 రోజుల పాటు వేటను నిషేధించిన సర్కార్.. సముద్రాన్ని నమ్ముకొని బతుకుబండిని నడుపుతున్న మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మాత్రం చేయలేదు. నిషేధ సమయంలో రూ. నాలుగు వేలు చొప్పున అర్హులైన వారికి అందజేయాల్సి ఉన్నా గతంలో చాలామందికి ఇవ్వలేదు. ఈసారైనా తమను ఆదుకోవాలని గంగSపుత్రులు వేడుకుంటున్నారు. ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకూ 193 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో చేపల వేటే జీవనాధారంగా చేసుకొని ప్రత్యేక్షంగా..పరోక్షంగా సుమారు 56 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాగే జిల్లాలో 5,400 ఇంజిన్ మరబోట్లు, 3,500 నాటు పడవులు ఉన్నాయి. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం 2,000 లోపు ఇంజిన్ మర బోట్లు ఉన్నట్టు లెక్కలుఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకూ 193 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో చేపల వేటే జీవనాధారంగా చేసుకొని ప్రత్యేక్షంగా..పరోక్షంగా సుమారు 56 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాగే జిల్లాలో 5,400 ఇంజిన్ మరబోట్లు, 3,500 నాటు పడవులు ఉన్నాయి. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం 2,000 లోపు ఇంజిన్ మర బోట్లు ఉన్నట్టు లెక్కలు చూపిస్తున్నారు. ఏటా చేపల వేట నిషేధ సమయంలో వీరిలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మిగిలిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వేట నిషేధ సమయంలో మతస్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. లూజ్ సోయిల్ నెపంతో తీర ప్రాంతాల్లో పనులు చేపట్టక పోవడంతో 60 రోజుల పాటు స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది ఈ సమయంలో ఉపాధి కోసం పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, వీరావల్, రత్నగిరి, కాండ్లా, సూరత్, మంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ బోట్ డ్రైవర్లుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తుండగా, కొందరు వంట మనుషులుగా పని చేస్తున్నారు. గుర్తింపు కార్డులు నిల్: మరో పక్క చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ గుర్తింపు కార్డులు కూడా ఉండడం లేదు. దీంతో వేట నిషేధ సమయంలో ప్రభుత్వ అందించే పరిహారం చాలామంది అందని పరిస్థితి. సముద్రాన్ని నమ్ముకొని బతుకు నావను నడుపుతున్న అందరికీ పరిహారం ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అరకొరగా ఇస్తున్న పరిహారం చెల్లించే సమయంలో రాజకీయాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మత్స్యకార కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరో పక్క నిషేధ సమయంలో కొన్నేళ్లగా అందిస్తున్న నాలుగు వేల రూపాయల పరిహారాన్ని పెంచాలని మత్స్యకారులు కోరుతున్నా ప్రయోజనం లేదు.ఇతర రాయతీలు సైతం వీరికి వర్తించటం లేదు. గతంలో ఇచ్చే 30 కిలోల బియ్యాన్ని కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. ఉపాధి చూపాలి: నిషేధ కాలంలో మత్స్యకారులు రెండు నెలల పాటు ఉపాధి కోత్పోతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో అమలు చేయాలి. మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా 100 రోజులు పని కల్పించాలి. అర్హులందరికీ పరిహారం చెల్లించటం, పరిహారం పెంచటం, బియ్యం, కిరోసిన్ అందజేసేలా చర్యలు తీసుకోవాలి. –ఎం.రామారావు, మత్స్యకార యూనియన్ నాయకుడు అన్ని మత్స్యకార కుటుంబాలకు పరిహారమివ్వాలి: జిల్లాలోని అన్ని మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో పరిహారం అందజేయాలి. నిషేధ కాలంలో అందరు జీవనోపాధి కోల్పోతున్నారు. నష్టపోతున్న కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకోవాలి. పారదర్వకంగా నష్ట పరిహారం పంపిణీ చేయాలి. – ఎం.పట్టాభి, బడివానిపేట, ఎచ్చెర్ల మండలం అర్హులందరికీ అందజేస్తాం: చేపల వేట నిషేధ కాలంలో అర్హులం దరికీ పరిహారం అందజేస్తాం. జిల్లాలో సుమారు 2,000 వరకూ మరబోట్లు ఉన్నవారు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వీరికి పరిహారం అందజేస్తాం. సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకు రావచ్చు. – కృష్ణమూర్తి, డీడీ, మత్స్యశాఖ -
రెండు రాత్రులు.. మూడు పగళ్లు నరక యాతన
► వేటకోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ► అంతర్వేది బీచ్ లో ఒడ్డుకు చేరుకున్న బాధితులు ► గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు అంతర్వేది (సఖినేటిపల్లి)/ రేపల్లె : రోను తుపాను ప్రభావంతో గతి తప్పిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ బోటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద బోల్తా పడింది. దానిలో ఉన్న ఒక వ్యక్తి గల్లంతవగా, మరో ఆరుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నిజాంపట్నం కేంద్రంగా బాలవర్థన్ అనే వ్యక్తికి చెందిన బోటులో ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 17న సముద్రంపై వేటకు వెళ్లారు. ఆ బోటులో కొత్తపాలేనికి చెందిన మత్స్యకారులు పుల్లంగుంట నాగమల్లేశ్వరరావు, కొప్పాడి రవి, పీతా వెంకటేశ్వరరావు, నీలం బాబూరావు, సున్నంపూడి మగదారయ్య, చెన్ను రవి, మన్నం ఏసోబు (65) ఉన్నారు. వీరంతా 18వ తేదీ రాత్రి రోను తుపానులో చిక్కుకున్నారు. లైటు వెలుతురు చూసి అప్రమత్తం.. ఇంజన్లో ఆయిల్ అడుగంటడంతో బోటు ఎటు వెళ్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వారంతా రెండు రాత్రులు, మూడు పగళ్లు సముద్రంపై నర కయాతన అనుభవించారు. ఆదివారం తెల్లవారుజామున ఎక్కడో దూరంగా మిణుకు మిణుకుమంటున్న లైటును గుర్తించి, ఆ దిశగా నెమ్మదిగా తెడ్లతో బోటును నెట్టుకుంటూ కొంత దూరం వచ్చారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో అంతర్వేది తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనే ఉండిపోయారు. తమ దుస్థితిపై పడవలోని ఓ వ్యక్తి నిజాంపట్నం పోర్టుకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు సఖినేటిపల్లి ఎస్సై కృష్ణభగవాన్ బీచ్ వద్దకు చేరుకున్నారు. సముద్రంపై బోటు ఎక్కడ ఉన్నదీ గుర్తించడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. చివరికి ఒడ్డుకు.. నిజాంపట్నం పోర్టు అధికారులు సాంకేతిక సహాయంతో మత్స్యకారుల బోటును అంతర్వేది తీరం వైపు మళ్లించేలా చేశారు. దీంతో బోటును పోలీసులు గుర్తించారు. బోటులో ఉన్నవారి సెల్ నంబర్తో ఎస్సై సంప్రదింపులు జరుపుతూ, వారిని ఒడ్డుకు చేర్చేందుకు యత్నించారు. ఈ దశలో ఒడ్డుకు సమీపంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల మధ్య లంగ రు వేయడంతో అకస్మాత్తుగా బోటు తిరగబడిందని సున్నంపూడి మగదారియా చెప్పారు. దీంతో సముద్రంలోకి వెళ్లిన పోలీసులు వారిని ఒడ్డుకు చేర్చారు. మన్నం ఏసోబు సముద్రంలో గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సర్పంచ్లు భాస్కర్ల గణపతి, చొప్పల చిట్టిబాబు, మాజీ సర్పంచ్లు వనమాలి మూలాస్వామి, నల్లి సుభాష్లు వారిని పరామర్శించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇచ్చిన సమాచారంతో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని వారిని పరామర్శించారు. -
కల్లోల కడలి
డోకులపాడు(వజ్రపుకొత్తూరు): కడలి కల్లోలమైంది. మత్స్యకారుని గుండె చెరువైంది. వేట సాగక అలల ఉధృతికి పూడగడవని పరిస్థితి నెలకొంది. పైగా గత 20 ఏళ్లుగా లేని పరిస్థితులు నేడు ఉత్పన్నమవుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు మండలంలోని డోకులపాడు నుంచి బైపల్లి వరకు తీరం కోతకు గురవ్వడమే గాకుండా తీరం వెంబడి ఉన్న సరుగుడు వనాలు ధ్వంసమయ్యాయి. జీడి, కొబ్బరి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. అల్పపీడ ప్రభావంతో తీరం వెంబడి అలలు 20 మీటర్లు ఎత్తున ఎగసిపడి కల్లోలం సృష్టించిందని, 70మీటర్ల ముందుకు సముద్రం వచ్చేసిందని మత్స్యకారులు తెలిపారు. ఇప్పటివరకూ లోతట్టు ప్రాంతాలైన మంచినీళ్లపేట, దేవునల్తాడ, బైపల్లి తీరాల్లో మాత్రమే గతంలో సముద్రకోత ఉండేది. ఈసారి ఇక్కడ సముద్రం ముందుకు రావడం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. సరుగుడు వనాలకు నష్టం మండలంలో గ్రీన్ బెల్టు ప్రాంతం ఉంది. తీరం వెంబడి అప్పట్లో అటవీశాఖ, రైతులు సంయుక్తంగా సరుగుడు వనాలు పెంచారు. ఇంకా రైతులు తమ జీడి, కొబ్బరి తోటలకు ఆనుకుని అలల ఉధృతినుంచి రక్షణగా ఇసుక దిబ్బలపై సరుగుడు వనాలు పెంచారు. ఉవ్వెత్తున ఎగసిన అలలు 20 అడుగులు ఎత్తులో ఉన్న ఇసుక దిబ్బలను, సరుగుడు వనాలను తాకడంతో ఏడుకిలో మీటర్లు మేర తీరం కోతకు గురైంది. సుమారు 20 మంది రైతులకు చెందిన సరుగుడు తోటల్లోని 40 వరకు చెట్లు సముద్రంపాలై నీటిలో కొట్టుకుపోయి వివిధ తీరాలకు చేరాయని రైతులు చెబుతున్నారు. ఉప్పు నీటి ప్రభావం వల్ల తమ జీడి, కొబ్బరి చెట్లు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ చర్యలు శూన్యం వజ్రపుకొత్తూరు తీర ప్రాంతంలో ఐదే ళ్లుగా సముద్రం ముందుకు వచ్చి నష్టం కలిగిస్తున్న విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్రస్తుతం తీరం వెంబడి పరిశ్రమల స్థాపనకు సర్వేలు చేస్తున్నారు తప్ప తీర ప్రాంతంలో ప్రజలకు ఎదురవుతున్న ముప్పుపై ఎలాంటి పరిశోధనలు జరగడం లేదని వాపోతున్నారు. ఎన్నడూ చూడలేదు నాకు 36 ఏళ్లు. 15 ఏళ్లుగా సంద్రంలో చేపల వేట చేస్తున్నాను. ఎప్పుడూ ఈ స్థాయిలో అలల ఉధృతి చూడలేదు. పైగా ఈ స్థాయిలో తీరం కోతకు గురవడం చూస్తే భయమేస్తోంది. ప్రస్తుతం తీరం కల్లోలంగా ఉంది. దీని వల్ల వేట సాగడం లేదు. -వై. పాపారావు, మత్స్యకారుడు, డోకులపాడు. -
నడిరేయి దాటినా చెదరని సంకల్పం
* అలుపెరుగని బాటసారి కోసం జననిరీక్షణ * ముగిసిన వైఎస్ జగన్ పర్యటన సాక్షిప్రతినిధి, కాకినాడ: ఆపన్నులకు ఆసరాగా నిలవాలన్న చెదరని సంకల్పం ముందు నడిరేయి చిన్నబోయింది. అలుపెరుగని బాటసారికి జనాభిమానం పోటెత్తింది. అయిన వారిని కోల్పోయి దుఖఃసాగరంలో ఉన్న బాధిత కుటుంబాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతూ వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గోదావరి జిల్లాల పర్యటన సాగింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా తూర్పుగోదావరిలో 185 కిలోమీటర్లు పర్యటించిన జగన్ సముద్ర వేటకు వెళ్లి మృత్యువు కబళించిన 28 మత్స్యకార కుటుంబాలను ఓదార్చారు. రంపచోడవరం ఏజెన్సీలో పెళ్లి వ్యాన్ బోల్తాపడి మృతిచెందిన తొమ్మిది మందికి చెందిన గిరిజన కుటుంబాలను పరామర్శించారు. తునిలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన జగన్ జిల్లా పర్యటన శనివారం రాజమండ్రితో ముగిసింది. తొలిరోజు తుని నియోజకవర్గం పెరుమాళ్లపురం సెంటర్లో జరిగిన సభలో జగన్ ప్రసంగం సెజ్ బాధిత కుటుంబాలకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. తీరప్రాంత మత్స్యకారులు జగన్ను చూసేందుకు, మాట్లాడేందుకు ఎగబడటంతో సుమారు 75 కిలోమీటర్లు పర్యటనకు 7.30 గంటల సమయం పట్టింది. పిఠాపురం నియోజకవర్గంలో తీరప్రాంతం యు కొత్తపల్లి మండలం రామన్నపాలెం, కొత్తపట్నం గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేసరికి రాత్రి 12.18 గంటలైంది. అయినా ఆయన అలిసిపోకుండా రెండోరోజు శుక్రవారం కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఏజెన్సీ గంగవరం మండలం సూరంపాలెం చేరుకోవాల్సి ఉండగా వెల్లువలా పోటెత్తిన జనాభిమానంతో 12 గంటలు ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక కొత్తాడ చేరుకుని పెళ్లి వ్యాన్ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. పోలవరం ముంపు మండలాలు, రంపచోడవరం నియోజకవర్గం ఇతర మండలాల నుంచి సూరంపాలెం వచ్చిన గిరిజనులు అర్ధరాత్రి సమయం దాటిపోయినా జగన్ రాకకోసం ఎదురుచూశారు. పిల్లలతో కలిసి అక్కడే వేచి ఉన్న వందలాది మంది గిరిజనులను చూసి జగన్ చలించిపోయారు. త్వరలోనే ముంపు మండలాల్లోను పర్యటిస్తానని వారికి హామీ ఇచ్చారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా ఉదయం నుంచి క్షణం విశ్రమించకుండా సుమారు 18 గంటలపాటు 60 కిలోమీటర్లు పర్యటించిన జగన్ 19 కుటుంబాలను పరామర్శించారు. కేవలం నాలుగు గంటలు నిద్ర తర్వాత శనివారం తెల్లవారుజామున సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి చేరుకున్న జగన్ దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా దొమ్మేరులో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి భారీగా తరలివచ్చిన పొగాకు రైతులను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. వారికి కనీస మద్దతు కోసం చంద్రబాబు సర్కార్కు 10 రోజులు గడువు ఇచ్చి అప్పటికీ ధర పెంచకుంటే సమరశంఖం పూరిస్తానని హెచ్చరికలు జారీచేసి రైతుల్లో మనోధైర్యాన్నినింపారు. తూర్పుగోదావరి జిల్లా పాత రామవరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ -
శివాజీ స్మారకం చుట్టూ ముదురుతున్న వివాదం
-
శివాజీ స్మారకం చుట్టూ ముదురుతున్న వివాదం
సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో నిర్మించ తలపెట్టిన ఛత్రపతి శివాజీ స్మారకాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్మారకం నిర్మాణం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిళ్లడమే గాకుండా తమ ఉపాధికి గండిపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నగరానికి వచ్చిన పార్లమెంటరీ కమిటీ సభ్యులకు మత్స్యకారుల సంఘటన ప్రతినిధులు విన్నవించారు. దీంతో స్మారకంపై వివాదం రాజుకునే పరిస్థితి ఏర్పడింది. స్మారకం నిర్మాణం విషయంలో ప్రభుత్వం తమ ఆవేదనను పట్టించుకోకపోతే, ఆందోళనను తీవ్రతరం చేస్తామని సంఘటన ప్రతినిధులు హెచ్చరించారు. విజ్ఞాన, సాంకేతిక, అటవీ, పర్యావరణ తదితర అంశాలపై చర్చించేందుకు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ అశ్వినికుమార్ శుక్రవారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో మత్స్యకారుల సంఘం ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల నుంచి సముద్రంలో కలుస్తున్న కలుషిత నీరు, రసాయనాలవల్ల మత్స్య సంపద రోజురోజుకు తగ్గిపోతోందని తెలిపారు. ‘‘స్టీమర్లలో చాలా దూరం వెళితే తప్ప చేపలు లభించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మిస్తున్నందున పర్యాటకుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో లాంచీలు, పడవల రాకపోకలు పెరిగిపోతాయి. వీటి నుంచి విడుదలయ్యే చమురు, ఇతర రసాయన వ్యర్థాల వల్ల చేపల సంతతి ప్రమాదంలో పడిపోతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని స్మారకాన్ని ఇక్కడ నిర్మించవద్దు’’ అని వారు అశ్వినికుమార్కు విజ్ఞప్తి చేశారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మించాలని పదేళ్ల కిందటే అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన వివిధ శాఖల అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. కాని ఇలాంటి సందర్భంలో మత్స్యకారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సమస్యలు పరిష్కరిస్తా..
సెలైన్స్.. సెలైన్స్ అంటూ అసెంబ్లీని కొనసాగించే స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం సాయంత్రం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శాయంపేట మండలంలో ‘సాక్షి’ రిపోర్టర్గా మారారు. చలివాగు రిజర్వాయర్ వద్ద మత్స్యకారులు, బీడీ, చేనేత కార్మికులు, గ్రామస్తులతో సుమారు రెండు గంటల పాటు ముచ్చటించి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. రాడికల్ విద్యార్థి నేత నుంచి రాజకీయాల్లోకి.. నిరుపేద కుటుంబంలో పుట్టినా.. రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ)లో పని చేశాను. రోజు ‘సాక్షి’ దిన పత్రిక చూస్తా. అందులో ప్రచురితం అయ్యే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. శాయంపేట మండల కేంద్రంలో మోడల్ స్కూల్, 30 పడకల ఆస్పత్రి, జోగంపల్లి, రాజుపల్లిల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. మత్స్యకారులు, బీడీ, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. - మధుసూదనాచారి, స్పీకర్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్లో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి : ఏం తమ్మి బాగున్నావా? చలివాగు రిజర్వాయర్ మత్స్యకారులతో కళకళలాడుతోందా? అయిరబోయిన బిక్షపతి, మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్, పెద్దకోడెపాక : సర్కారు ఇచ్చిన చేపలను ఈ రోజు చెరువులో పోస్తున్నాం సార్. అందుకే మా వాళ్లు అందరూ వచ్చారు. స్పీకర్ : సరే.. మీ జీవనం ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బిక్షపతి : ఈ ఏడాది వర్షాలు లేవు. మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. మీ కృషితో దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్లోకి నీరు చేరింది. ఈ ఏడాది ప్రభుత్వం రుణం మాఫీ చేయాలని కోరుతున్నాం. స్పీకర్ : ‘మిషన్ కాకతీయ’ లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారా? నిమ్మల మహేందర్ : లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నాం. చలివాగు రిజర్వాయర్ను అభివృద్ధి చేస్తే మాతోపాటు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్పీకర్ : సంఘం ఎదుర్కొంటున్న అవస్థలు? పల్లెబోయిన అశోక్ : మా మండలానికి సర్కారు రెండు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేసింది. అవి గ్రామాల్లో నిర్మించనున్నారు. శాయంపేట మండల కేంద్రానికి ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తే సమావేశాలు నిర్వహించుకునేందుకు సులువుగా ఉంటుంది. స్పీకర్ : చేపలు పట్టడంలో కూలీ గిట్టుతుందా? ఇళ్లు గడస్తుందా? చాడ కిష్టస్వామి : దయనీయంగా ఉంది. చలివాగులో కొన్నేళ్లుగా కాంట్రాక్టరే చేప పిల్లలు పోస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి మత్స్యకారులను తీసుకొచ్చి చేపలను పట్టిస్తున్నాడు. మాకు కూలీ కూడా లేదు. ఈ ఏడాది చేప పిల్లలను ప్రభుత్వమే పోసినందున స్థానిక మత్స్యకారులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలి. స్పీకర్ : ఎన్నేళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? మీ పిల్లలను ఇదే వృత్తిలో కొనసాగించాలని అనుకుంటున్నారా? ఐరవేని సదయ్య : తరతరాలుగా ఇదే వృత్తిపై బతుకుతున్నాం. మా పిల్లలతో ఈ పని చేయించాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. మా కులస్తుల కోసం ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. స్పీకర్ : మీ కుటుంబాల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? పల్లెబోయిన సారయ్య : చాలా తక్కువగా ఉన్నారు. మా కులాన్ని బీసీ‘డీ’ నుంచి బీసీ‘ఏ’కి మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తే మా పిల్లలకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. స్పీకర్ : ఆర్టీసీకి సంబంధించి సమస్యలు ఉన్నాయా? పెండ్యాల పైడి : శాయంపేట-పెద్దకోడెపాక గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. మాందారిపేట క్రాస్రోడ్ వద్ద ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటున్నందున బస్షెల్టర్ ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్డి నిర్మించాలి. స్పీకర్ : ప్రభుత్వం నుంచి ఏ పథకాలు ఆశిస్తున్నారు? ఐరబోయిన చేరాలు : ముదిరాజ్ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగలేదు. కళ్యాణలక్ష్మి పథకాన్ని ముదిరాజ్లకు వర్తింపజేయూలి. స్పీకర్ : ఏం తల్లి.. ఏం పని మీద చెరువు దగ్గరికి వచ్చావు? కూచనం సమ్మక్క : ఇక్కడికి సార్లు వస్తున్నరని తెలిసి వచ్చిన. నాకు 70 ఏళ్లు. ఇంతకు ముందు రూ.200 పింఛన్ వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ రూ.1000 ఇస్తందని తెలిసి మండలాఫీసుల దరఖాస్తు చేసుకున్న. కాని పింఛన్ రాలేదు నాయనా. స్పీకర్ : తల్లులు బాగున్నారా? బీడీలు చేస్తే రోజు కూలీ గిట్టుతుందా? క్యాతం విజయ : పదేళ్ల నుంచి బీడీలు చేస్తున్నాం. నెలలో పది రోజులే పని దొరుకుతాంది. రూ.1000 వస్తున్నాయి. కటింగ్ పోను రూ.700 చేతికి వస్తాయి. వ్యవసాయం, బీడీలు చుట్టడం.. రెండు పనులు చేసినా ఇళ్లు గడవడం కష్టంగానే ఉంది సారూ. స్పీకర్ : ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి కోరుకుంటున్నారు? గుండు సౌందర్య : పొగాకు పడక చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వయసు పరిమితితో సంబంధం లేకుండా పింఛన్లు అందించాలి. మాకు హెల్త్ కార్డులు అందజేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలి. స్పీకర్ : కరెంటు సమస్య ఏమైనా ఉందా? మెండు చంద్రకళ: కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. వర్షాలు కురియక, కరెంటు ఉండక పంటలు ఎండినయ్. స్పీకర్ :చేనేత కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయా? బాసాని లక్ష్మీనారాయణ : గ్రామంలో సుమారు 600 మంది చేనేత కార్మికులు ఉండేవారు. కూలీ గిట్టక బీవండి, సిరిసిల్లకు వలసెళ్లారు. కొందరు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 150 మంది చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించాలి. స్పీకర్ :కాలుష్య ఇబ్బందులు ఉన్నాయా? దైనంపల్లి సుమన్ : కాలుష్య సమస్య లేదు. కానీ.. గ్రామ సమీపంలోని క్రషర్లతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్రషర్ల సమీపంలో కస్తూర్బా స్కూల్ సైతం నిర్మిస్తున్నారు. విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలి. స్పీకర్ : పంటలకు మద్దతు ధర లభిస్తుందా? శ్రీనివాస్ : ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రరుుస్తే మద్దతు ధర లభిస్తోంది. కానీ.. దళారులతో మోసపోతున్నాం. పత్తి, మిర్చి పంటలను విక్రయించేందుకు వరంగల్కు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రంలో మూసివేసిన సబ్ మార్కెట్ను తెరిస్తే చాలు. స్పీకర్ :విద్యాపరంగా శాయంపేట పరిస్థితి ఎలా ఉంది? పరకాల దేవేందర్ : మండలానికి చెందిన వందలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగావకాశాలు పొందారు. మోడల్ పాఠశాల లేకపోవడమే లోటు. నిర్మిస్తే బాగుంటుంది. స్పీకర్ : తాగునీరు దొరుకుతుందా? అమ్మ అశోక్ : జోగంపల్లి గ్రామస్తులు తాగునీరు దొరకడం లేదు. గత ప్రభుత్వం డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ను పూర్తికాకముందే హడావుడిగా ప్రారంభించింది. కానీ.. నీరు సరఫరా కావడం లేదు. నాసిరకం పనుల మూలంగా పైప్లైను పైపులు పగిలిపోతున్నాయి. ప్రస్తుత సర్కారు మరమ్మతులు చేపట్టి గ్రామస్తులకు నీరందించాలి. స్పీకర్ : ఇంకా ఎక్కడ తాగునీటి సమస్య ఉంది? కానుగుల నాగరాజు : మండలంలోని రాజుపల్లిలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. చిన్నపిల్లలు నీటిని తాగి ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారు. గ్రామంలో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ను నిర్మించి గ్రామస్తులకు తాగు నీరందించాలి. -
మాట్లాడుకుందాం... రండి
* కొవ్వాడ రైతులకు కలెక్టర్ ఆహ్వానం * వ్యతిరేకించిన సర్పంచ్లు, మత్స్యకారులు రణ స్థలం: అణు విద్యుత్ కేంద్రంకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్లో నిర్వహించే సమావేశానికి హాజరుకావాల్సిందిగా మండలంలోని కొవ్వాడ, కోటపాలెం, అల్లివలస తదితర పంచాయతీలకు చెందిన గ్రామ పెద్దలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య రైతులను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆహ్వానించారు. అయితే అందుకు వారు తిరస్కరించారు. వివరాలు ఇవీ... శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో తుఫాన్ను దీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన సమావేవంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సమావేశానికి వచ్చిన కొవ్వాడ సర్పంచ్ మైలపల్లి పోలీసు, కోటపాలెం సర్పంచ్ సుంకరి ధనుంజయరావు, అల్లివలస మాజీ సర్పంచ్ మైలపల్లి వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకమని ఏళ్లతరబడి చెబుతున్నామని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రణస్థలం మండల పర్యటనలో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం రద్దు చేయాలని వినతి పత్రం ఇస్తే తిరిగి అదే సమస్యపై మీరేమి మాట్లాడుతారని కలెక్టర్ని నిలదీశారు. అంతగా అణు విద్యుత్ కేంద్రంపై మాట్లాడాలంటే జిల్లా అధికారులు, అణు విద్యుత్ అధికారులు కొవ్వాడ వచ్చి మాట్లాడితే ప్రజల సమస్యలు చెబుతారని అన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అణు విద్యుత్ కేంద్రం రద్దు అయితే ఫర్వాలేదని ఒకవేళ రద్దు కాకపోతే భూములకు ఏంత డబ్బు కావాలి, పునరావాసం ఎక్కడ కల్పించాలని, ఆర్ఆర్ ప్యాకేజీలో ఏంత కోరుతున్నారో చెబితే ఈనెల 14వ తేదీన హైదరాబాద్లో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని చెప్పారు. కాగా ఎంపీపీ గొర్లె విజయ్కుమార్నాయుడు మాట్లాడుతూ ఈ సమస్య కొవ్వాడ పంచాయతీ ఒక్కదానిదే కాదని మండలంలోని సుమారు నాలుగు పంచాయతీలకు చెందిన సమస్యని అణు విద్యుత్ కేంద్రంపై సమావేశం స్థానిక ఎమ్మెల్యే కళావెంకటరావుని సంప్రదించి తెలుపుతామని, ఈ రోజు సమావేశం వాయిదా వేయాలని కోరారు. -
మత్స్యకారుల రుణాలు మింగేసిన నాయకుడు
- 22 మంది సభ్యులతో సంతకాలు చేయించుకుని రూ.13.20 లక్షల రుణం బొక్కేసిన వైనం - ఆంధ్రాబ్యాంకు బ్రాంచి మేనేజర్ పాత్రపైనా అనుమానం కంచుస్తంభంపాలెం (యలమంచిలి) : కంచుస్తంభంపాలెం పంచాయతీ వాకలగరువుకు చెందిన మత్స్యకారులకు వారి సంఘం నాయకుడే రూ.13.20 లక్షల రుణానికి టోకరా వేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇవి.. గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు ఏడాది కిందట సంఘంగా ఏర్పడి ఆంధ్రాబ్యాంకు భీమలాపురం శాఖలో ఖాతా తెరిచారు. అనంతరం బీసీ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్కరికి రూ.60 వేలు చప్పున రూ.13.20 లక్షల రుణం మంజూరైంది. సంఘం నాయకుడు ఓలేటి రామదాసు సభ్యులకు రుణం మజూరైన విషయం చెప్పలేదు. వారికి బ్యాంకుకు తీసుకెళ్లి మనకు త్వరలో రుణం వస్తుంది, సంతకాలు పెట్టాలని చెప్పడంతో వారంతా సంతకాలు చేశారు. వస్తుందని ఎదురు చూడసాగారు. రెండు రోజుల క్రితం బ్యాంకు అధికారులు వచ్చి రుణ వాయిదాలు చెల్లించడం లేదేమిటని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వారంతా రామదాసును నిలదీయగా రుణం తీసుకున్నామని చెప్పాలని, డబ్బు తాను కడతానని చెప్పగా సభ్యులు అంగీకరించలేదు. ఆ రుణం తాము తీసుకున్నామని చెపితే బ్యాంకు అధికారులు తమను కట్టమంటారని, అయినా మాకు మంజూరైన రుణాన్ని తీసుకోవడం ఏమిటని రామదాసును నిలదీశారు. తాము చాలాసార్లు బ్యాంకుకు వెళ్లి రుణం మంజూరైందా అని అడిగితే అప్పతి బ్రాంచి మేనేజర్ మంజూరు కాలేదని చెప్పేవాడని బాధితులు వాపోయూరు. ఆ మేనేజర్ గత నెలలో బదలీ కొత్త మేనేజర్ రావడంతో విషయం బయటపడిందని బాధితులు ఓలేటి శ్రీను, కొప్పనాతి చినపెద్దిరాజు తెలిపారు. మత్స్యకారుల సంఘం జిల్లా నాయకుడు అండ్రాజు చల్లారావు సోమవారం ఉదయం ఫోన్చేసి ‘మీరు గొడవ చేయకండి, నేను వల్లూరు వచ్చి సమావేశం పెడతాను, బ్యాంకు అధికారులకు మాత్రం లోన్ తీసుకున్నామని చెప్పండి’ అన్నాడని బాధితులు తెలిపారు. దీంతో ఈ విషయంలో అతని పాత్ర కూడా ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తామంతా రెక్కాడితే కాని డొక్కాడని నిరు పేదలమని, తమను మోసం చేసిన వారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు. తమకు లోను ఇవ్వకపోయినా ఫర్వాలేదుకాని, తెలియకుండా చేసిన సంతకాలను ఎరగా చూపి బాకీ తీర్చమంటే ఆత్మహత్యలే శరణ్యమని గగ్గోలు పెడుతున్నారు. -
షికారుకు గడ్డుకాలం
- కృష్ణమ్మను నమ్ముకున్న వందలాది కుటుంబాలు - యాభై ఏళ్లుగా ఎదుగూ బొదుగూ లేని జీవితాలు - సాగర్ జలాశయంలో మొన్న మరబోట్లు.. - నేడు వేటపై నిషేధం షికారు సాగక పస్తులుంటున్న మత్స్యకారులు - ఉపాధి లేక వలసలు పోతున్న వైనం ఐదు దశాబ్దాలుగా కృష్ణమ్మనే న మ్ముకున్నారు.. ముంచినా తేల్చినా నీవే దిక్కని ఆ నదీమ తల్లిపైనే భారం వేశారు. నది ఒడ్డే వారికి నివాస స్థలం.. చేపల వేటే జీవనాధారం. ఎర్రటి ఎండను.. ఎముకలు కొరికే చలిని.. తుఫాను తాకిడిని దేన్నీ లెక్క చేయక రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు కష్టపడినా నాలుగు రాళ్లు వెనుకేసుకోలేక పోయారు. చాలీచాలని సంపాదన తో బతుకీడుస్తున్న వారికి ఈ ఏడాది మరింత గడ్డు పరిస్థితులు దాపురించాయి. వేట సాగక.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పస్తులుంటున్నారు. కనీసం తమకు ఉపాధి హామీ పనులైనా కల్పించాలని వేడుకొంటున్నారు. విజయపురిసౌత్ : పొట్టచేత పట్టుకుని యాబై ఏళ్ల కిందట విశాఖ నుంచి విజయపురిసౌత్కు వచ్చిన మత్స్యకార కుటుంబాలు కృష్ణానది ఒడ్డున జీవనం సాగిస్తున్నాయి. సాగర్ జలాశయాన్ని నమ్ముకుని స్థానిక డౌన్మార్కెట్, సాగర్ క్యాంప్లలో నివసిస్తున్నారు. ప్రభుత్వం అందించే పక్కా ఇళ్లు కూడా మంజూరు కాలేదు. 110 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న జలాశయం చుట్టూ పుట్టీలే నివాసాలుగా నదిలో షికారు(వేట) చేస్తున్నారు. ఏళ్ల తరబడి నిత్యం శ్రమిస్తున్నా వీరి జీవిత గమనంలో మార్పు రాలేదు. రోజు మొత్తం షికారు చేసినా చేపలు చిక్కని దైన్యస్థితి. కుటుంబ పోషణకు తప్పని అప్పులు.. నాగార్జునసాగర్ జలాశయంలో నీరు తగ్గిపోవటంతో పాటు మత్స్యశాఖ రెండేళ్లుగా జలాశయంలో చేపపిల్లలు వదలడం లేదు. దీంతో చేపల షికారు జరగక మత్స్యకారులు కుటుంబపోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వీరు చేపల వ్యాపారుల వద్ద కుటుంబపోషణకు ముందుగానే అడ్వాన్స్లు తీసుకొని చేపలను వారికే అమ్ముతుంటారు. ఈ క్రమంలో రెణ్నెల్ల కిందట అటవీశాఖ అధికారులు కృష్ణానదిలో మరబోట్లను నిషేధించారు. ఇది చాలదన్నట్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగు నెలల పాటు సాగర్ జలాశయంలో చేపలు పట్టడం నిషేధించారు. షికారు సాగక పస్తులుండలేక పనుల కోసం వలస బాట పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవటంతో పుట్టీలతో సహా వాహనాల్లో తరలిపోతున్నారు. ఇంతటి గడ్డు పరిస్థితి ఎన్నడూ లేదు.. గత ఏడాది అక్టోబర్లో కురిసిన తుపాన్లకు సాగర్ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో జలాశయం నిండింది. ఆ నెల 25వ తేదీన 12 గేట్లెత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో పైనుంచి మురికినీరు రావడం వల్ల చేపలు గేట్ల ద్వారా చాలా వరకు దిగువ కృష్ణానదిలోకి వెళ్లిపోయాయని మత్స్యకారులు తెలిపారు. పనిలేక ఒక్కపూటైనా కడుపు నింపుకోలేక పోతున్నామని, ఇంతటి చేపల కరువు డ్యాం నిర్మాణం నుంచి రాలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేయాలని, కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం లోనైనా పని ఇప్పించి ఆదుకోవాలని అర్థిస్తున్నారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలి.. సాగర్ జలాశయంలో చేప పిల్లలను వదిలి రెండేళ్లయింది. చేపలు షికారు జరగక వందలాది కుటుంబాలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయినా ప్రభుత్వ అధికారులలో చలనం లేదు. మత్స్యకారులను ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవటం వలనే ఈ దుస్థితి నెలకొంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కనీసం ఉపాధి పనులన్నా కల్పించి, ఉచితంగా బియ్యం పంపిణీ చేయకపోతే కాలనీలన్నీ వలసపోయే పరిస్థితి ఉంది. - మైలపల్లి నూకరాజు, కనకదుర్గ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు, విజయపురిసౌత్ గోడకడితే షికారుకు సెలవే.. రెక్కాడితే కానీ డొక్కాడని మేం చేపల షికారు జరగక ఆకలితో అల్లాడిపోతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. డ్యాం భద్రత పేరుతో కృష్ణా జలాశయం ఒడ్డున భద్రత గోడను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే మా పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. జలాశయంలోకి వెళ్లే అవకాశం ఉండదు. డ్యాం అధికారులు జలాశయంలోకి వెళ్లేందుకు మత్స్యకారుల కోసం ఒక గేటును నిర్మించి, సెక్యూరిటీని నియమిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. - గరికన మస్సేను, మత్స్యకారుడు, విజయపురిసౌత్ -
బలహీనపడుతున్న 'మాది' తుపాను
విశాఖపట్నం: 'మాది' తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన మాది తుపాను రేపటికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం వల్ల రాగల 48గంటల్లో కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తుపాను ప్రభావంతో గంటకు 40-50కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరంలో అలల ఉధృతి ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
చెన్నైకి తూర్పుదిశగా.. కేంద్రీకృతమైన `మాదీ` తుపాను
విశాఖపట్నం: చెన్నైకి తూర్పుదిశగా 490కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాను `మాదీ` కేంద్రీకృతమైనట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మాదీ తుపాను ఉత్తరదిశగా కదులుతున్నట్టు పేర్కొంది. రేపు బంగాళాఖాతంలో బలహీనపడి.. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రభావంతో గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలుకురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పోర్టుల్లో అధికారులు 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
మరో24 గంటలు!
విజయనగరం కలెక్టరేట్/ఫోర్ట్ న్యూస్లైన్: రైతుల కళ్లలో సుడులు రేపుతున్న హెలెన్ ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటినా శనివారం సాయంత్రానికి దీని ప్రభావం తగ్గుతుందని వారు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో రైతులు పరుగులు తీస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతన్న వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే 220 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే వేయి ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పార్వతీపురం డివిజన్లో కోసిన వరి పనలు నీళ్లలో తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కురి సిన వర్షంతో పొలాల్లో నీరు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది చీపురుపల్లి, గరివిడి, కొత్తవలస, పాచిపెంట మండలాల్లో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. పనలపై ఉన్న వరి పంటను చక్కబెట్టుకోవటానికి రైతులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 24గంటల పాటు ప్రభావం.... హెలెన్ తుఫాన్ శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటింది. దీంతో కొంత వరకూ ముప్పు తప్పింది. అయితే మరో 24 గంటల పాటూ ఉంటుందని, ఆ తరువాత పూర్తిస్థాయిలో గండం గట్టెక్కినట్టేనని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా మత్స్యకారులు సముద్రంపైకి వేటకకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్లో 1077 టోల్ఫ్రీ నంబర్ కంట్రోల్ రూమ్ కొనసాగుతుంది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పస్తులతో మత్స్యకార కుటుంబాలు హెలెన్ కారణంగా నాలుగు రోజులుగా చేపలవేట లేకపోవడంతో తీరంలో మత్స్యకార కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వారు వేటకు వెళ్లడంలేదు. పడవలను తీరంలో లంగరు వేశారు. బోట్లు, వలలు పాడవకుండా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాలులు, వర్షాల కారణంగా భోగాపురం మండలం లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజులగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.