gopal reddy
-
వేంపల్లికి చెందిన ప్రకాష్ పై బీటెక్ రవి అనుచరుల దాడి
-
దళారి రాజకీయం
రాజీవ్ కనకాల, ‘షకలక’ శంకర్, అక్షా ఖాన్ ప్రధాన పాత్రల్లో కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘దళారి’. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ని నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెంకట్ రెడ్డిగారిలాంటి కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ‘దళారి’ ట్రైలర్ బాగుంది.. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆకృతి క్రియేషన్స్ పతాకంపై రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ రెడ్డి. ‘‘సమాజంలో ఏ పని జరగాలన్నా ఒక దళారి ఉంటాడు. అలాంటి దళారి పాత్ర రాజకీయంలో ఉంటే ఎలా ఉంటుందో తెలిపేదే మా సినిమా’’ అన్నారు గోపాల్ రెడ్డి. -
తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు.. అసలు ఏమైంది..??
మెదక్: తవ్వినకొద్దీ అక్రమాలే.. అన్నట్లుగా మారింది ఏడుపాయల ఆలయ ఈఓ వ్యవహార శైలి. వనదుర్గామాత ఆభరణాల వ్యవహారం ఇంకా సమసిపోకముందే తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయం తెరమీదకు వచ్చింది. మొక్కులో భాగంగా 2018లో ఎమ్మెల్యే మదన్రెడ్డి అమ్మవారికి బంగారు గొలుసును సమర్పించారు. దీనిని అప్పటి ఈఓ శ్రీనివాస్కు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆ గొలుసు రికార్డుల్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బయటకొచ్చింది ఇలా.. 2016 నుంచి 2019 వరకు కౌడిపల్లి మండలం తునికినల్ల పోచమ్మ ఆలయంలో శ్రీనివాస్ ఈఓగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అమ్మవారికి 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు. 2019 జూన్లో ఈఓ శ్రీనివాస్ ఏడుపాయల ఆలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఎమ్మెల్యే దంపతులు నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్నారని, ఆయన అందించిన బంగారు గొలుసును అమ్మవారికి అలంకరించాలని ఆలయ చైర్మన్ గోపాల్రెడ్డి ప్రస్తుత ఈఓ మోహన్రెడ్డికి సూచించారు. కాగా.. శ్రీనివాస్ బదిలీ అయిన సమయంలో తనకు చెక్బుక్, క్యాష్బుక్లు మాత్రమే ఇచ్చారని, అమ్మవారి ఆభరణాలు ఏమీ ఇవ్వలేదంటూ మోహన్ రెడ్డి చెప్పడంతో అసలు విషయం బయటకువచ్చింది. ఆలయానికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఎందుకు రికార్డు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎమ్మెల్యే బహూకరించిన గొలుసునే రికార్డులో లేదంటే మామూలు భక్తులు అందించిన కానుకల మాటేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయంపై ఈఓ సార శ్రీనివాస్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎమ్మెల్యే మదన్రెడ్డి బంగారు చైన్ బహూకరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కాగా అది తన సంరక్షణలోనే ఉందని చెప్పడం కొసమెరుపు. -
మార్చిలో దళారి
‘షకలక’ శంకర్ హీరోగా, అక్సఖాన్, రూపిక హీరోయిన్లుగా రాజీవ్ కనకాల ప్రధాన ΄ాత్రలో నటించిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. కాగా తెలంగాణలోని వేములవాడలో ‘ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ సింగర్స్’(ఐటీఎఫ్) నిర్వహించిన గూగులమ్మతల్లి బోనాలు కార్యక్రమంలో ‘దళారి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ కరీంనగర్ జిల్లా బిడ్డగా అందర్నీ మెప్పించే కథతో ‘దళారి’ సినిమా తీశాను’’ అన్నారు కాచిడి గోపాల్ రెడ్డి. ‘‘ఈ సినిమా కథ,పాటలు, డ్యాన్సులు, ఎమోషన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటాయి’’ అన్నారు వెంకట్ రెడ్డి. -
ర్యాలీలో చంద్రబాబు భౌతిక దూరం పాటించలేదు
-
అందనంత దూరం అక్షర జ్ఞానం
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్గా 1973 నుంచి 1982 వరకు పనిచేసిన గోపాల్ రెడ్డి.. 1982–2006 వరకు వయోజన విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2003లో సత్యమత్ర మెమోరియల్ లిటరసీ అవార్డును అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రామకృష్ణతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి గోపాల్రెడ్డి అందుకున్నారు. విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రభుత్వ విద్య ఏవిధంగా నిర్వీర్యమైంది, జగన్ ప్రకటించిన నవరత్నాల్లోని అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా డ్రాపవుట్స్ సంఖ్య ఎలా నిర్మూలన అవుతుందో ‘సాక్షి’కి వివరించారు. క్వాలిటీ విద్యకు కేరాఫ్ ‘గతంలో క్వాలిటీ విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్గా నిలిచేవి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పరిశోధన చక్కగా నిర్వహించేవారు. విద్యార్థులకు సబ్జెక్టు పరంగా మంచి పట్టు వచ్చేది. టీచింగ్ నోట్స్ రాసుకుని విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించేవారని’ గోపాల్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చూద్దామన్నా కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ తగ్గిపోయింది. దాంతో అనేక మంది ఉపాధ్యాయులు విద్యేతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. చివరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింద’ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్కు పెద్దపీట! ‘సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ప్రైవేట్ విద్యకు చంద్రబాబు పునాదిరాయి వేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్లో ప్రైవేట్ విద్యను పరుగెత్తించారు. ఒక విద్యా సంస్థల అధినేతను తన క్యాబినెట్లో మంత్రిగా చేర్చుకున్నారంటే ప్రైవేట్ విద్యపట్ల చంద్రబాబుకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చని’ తాటిపర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రిగా నారాయణ, ఆయన బంధువైన గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రభుత్వ విద్యను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాథమిక పాఠశాలల్లో విద్యపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు అవసాన దశకు చేరుకున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే ఉన్నత పాఠశాలలకు కూడా ఈ దుస్థితి పట్టే ప్రమాదం ఉంద’ని అన్నారు. వయోజన విద్యకు గండి ‘జిల్లాలో అక్షరాస్యత శాతం ఏటా పెరుగుతోందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వయోజనుల్లో అక్షరాస్యత శాతం క్రమేణా పడిపోతోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 74 శాతం చూపించగా, ప్రకాశం జిల్లాలో 63 శాతంగా ప్రకటించారు. వయోజన విద్యను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం దానిని కూకటివేళ్లతో పెకలించేసింది. రాష్ట్రంలో వయోజన విద్యకు సంబం«ధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నియమితులైన 23 వేల మందిని చంద్రబాబు ప్రభుత్వం తొలగిండడం దారుణమైన చర్య. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన తరువాత వారు నేర్చుకున్న చదువు మర్చిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన సాక్షర భారత్ కేంద్రాలు కనుమరుగైపోయాయి. ‘అమ్మ ఒడి’ కొండంత అండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అమ్మ ఒడి పేదలకు అండగా ఉంటోంది. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థుల చదువుకు భరోసా కలగనుంది. అమ్మ ఒడి ద్వారా తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం మంచి పరిణామమ’ని గోపాల్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమలుచేసే కార్యక్రమాల్లో అమ్మ ఒడిని ఇతర రాష్ట్రాలు కూడా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సోమిశెట్టీ.. నోరు అదుపులో పెట్టుకో
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల ప్రధాన కార్యదర్శులు గోపాల్రెడ్డి, కరుణాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకొని..పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. ఇది చరిత్రాత్మకమవడంతో టీడీపీ నేతల్లో వణుకు పుడుతోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత సోమిశెట్టికి లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిందె నీళ్లతో చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు నటించడం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డికే చెల్లుతుందన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు పెరుగు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో సీఈసీ సభ్యుల నియామకం
సాక్షి, హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లసిరి గోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, టీజీ కృష్ణారెడ్డిలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
బుట్టా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆదోని టౌన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక...మా ఎంపీలను విమర్శించడం హేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవనకొండ మండలంలో గురువారం జరిగిన నవ నిర్మాణ దీక్షలో వైఎస్ఆర్ ఎంపీలపై బుట్టా చేసిన విమర్శలపై శుక్రవారం ద్వారకా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు... ఆమరణ దీక్షలపై బుట్టా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. హోదా, డబ్బుకోసం పార్టీ ఫిరాయించిన మీకు రాజకీయ విలువలు ఏమి తెలుసని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేప్పుడు నోరు అదుపులోఉంచుకోవాని, లేని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు జనం నీరాజనం పలుకుతున్న తీరును ఓర్వలేక విమర్శలు చేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్మండల అధ్యక్షుడు కల్లుపోతుల సురేష్, మహిళౠ విభాగం నాయకురాలు శ్రీలత, కౌన్సిలర్ సుధాకర్, నాయకులు రామలింగేశ్వర యాదవ్, నజీంవలి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పంబలిలో భార్గవ్రెడ్డి అంత్యక్రియలు
వాకాడు : సినీ నిర్మాత, దివంగత ఎస్.గోపాల్రెడ్డి తనయుడు ఎస్.భార్గవ్రెడ్డి అంత్యక్రియలు గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలిలో నిర్వహించారు. భార్గవ్రెడ్డి సముద్రంలో మునిగి మంగళవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. పంబలిలోని తల్లిదండ్రులు గోపాల్రెడ్డి, రాజేశ్వరమ్మ సమాధుల వద్దనే భార్గవ్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. భార్గవ్రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సోదరి పావని తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆమే అంత్యక్రియలు నిర్వహించారు. తన చేతులతో అన్నకు తల కొరివి పెట్టాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. హీరో విశాల్ తల్లిదండ్రులు జీకే రెడ్డి, జానకీ దేవి, సోదరి ఐశ్వర్యరెడ్డి, సినీ నటుడు చిన్నాతోపాటు పలువురు సినీ నటులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో భార్గవ్రెడ్డి మృతి
వాకాడు: సినీ నిర్మాత, భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత దివంగత ఎస్.గోపాల్రెడ్డి కుమారుడు ఎస్.భార్గవ్రెడ్డి (42) అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పంబలి వద్ద తన భార్గవ్ రొయ్యల హేచరీ వద్దకు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు భార్గవ్రెడ్డి కారులో (ఏపీ 09 బీఎన్ 4885) వచ్చాడు. అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ, పనివాళ్లతో మాట్లాడి వారికి జీతాలు, హేచరీ కరెంట్ బిల్లులు, తదితర లెక్కలు చూసి డబ్బులు అందజేశాడు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తను ప్రాణ సమానంగా పెంచుకుంటున్న కుక్కకు స్నానం చేయించే నిమిత్తం హేచరీ ముందు భాగంలో ఉన్న సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లాడు. ఒక్కరే సముద్రం వద్దకు వెళ్లొద్దు.. మేము వస్తామని సిబ్బంది కోరగా ఆయన ఎవరూ అవసరం లేదు. నేనే వెళ్తానని కుక్కని తీసుకెళ్లాడు. రాత్రంతా వెతికినా.. సముద్రం వద్దకు వెళ్లి భార్గవ్రెడ్డి గంట దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన హేచరీ సిబ్బంది సముద్రం వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఒడ్డున భార్గవ్రెడ్డి చెప్పులు, ప్యాంట్ మాత్రమే ఉన్నాయి. అందులో ఏటీఎంలు, ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసెన్స్, ఓటర్ కార్డు, కొంత నగదు, విస్టింగ్ కార్డులున్నాయి. కంగారు పడిన సిబ్బంది వెంటనే వాకాడు గొల్లపాళెం గ్రామంలోని భార్గవ్రెడ్డి పెద్దమ్మ కుమారుడు పాపారెడ్డి మనోజ్కుమార్రెడ్డి, నెల్లూరులో ఉన్న చిన్నాన్న ఎస్.కృష్ణారెడ్డిలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు పంబలికి చేరుకుని గ్రామస్తుల సాయంతో సముద్రం ఒడ్డున మంగళవారం తెల్లవారుజాము వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 6.00 గంటల సమయంలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాసపురం గ్రామం వద్ద సముద్రం ఒడ్డుకు భార్గవ్రెడ్డి మృతదేహం కొట్టుకువచ్చింది. కుక్క ఆచూకీ మాత్రం తెలియరాలేదు. మృతిపై అనుమానాలు భార్గవ్రెడ్డి మృతిపై అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయాడా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పంబలిలోని భార్గవ్ హేచరీకి తీసుకెళ్లారు. బంధువుల ఫిర్యాదు మేరకు వాకాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పంబలి గ్రామంలోనే మృతదేహానికి వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. నాయుడుపేటలో విషాదం నాయుడుపేటటౌన్: భార్గవ్రెడ్డి (44) మృతిచెందడంతో మంగళవారం నాయుడుపేటలోని బేరిపేట సమీపంలో ఉన్న ఆయన నివాసం వద్ద విషాదం నెలకొంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్రెడ్డి 2008లో మృతిచెందిన తర్వాత భార్గవ్ ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో నుంచి ఎప్పుడూ బయటకు వచ్చే వారు కాదని, పనివారే అన్ని వసతులు సమకూర్చేవారని స్థానికులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం పదిరోజుల పాటు ఇంటికి రానని చెప్పి పంబలిలో ఉన్న గెస్ట్హౌస్ వద్దకు వెళుతున్నానని భోజనాలు ఏర్పాటుచేసే నిర్వాహకులకు భార్గవ్ తెలిపారు. ఆయన సోదరి పావని తైవాన్లో నివాసం ఉంటున్నారు. ఆమె ఐక్యరాజసమితి సభ్యురాలిగా పనిచేస్తున్నారని, పదిరోజుల క్రితం నాయుడుపేటలో ఉన్న భార్గవ్రెడ్డిని చూసేందుకు వచ్చి తిరిగి వెళ్లినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. పావని వచ్చేందుకు మూడురోజులకు పైగా పడుతుందని చెబుతున్నారు. ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంది. నెల్లూరులోని ఓ ఆస్పత్రి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసేందుకు పలువురు వెళుతున్నారు. -
ఎస్. గోపాల్రెడ్డి తనయుడి అనుమానాస్పద మృతి
సాక్షి, నెల్లూరు: బాలకృష్ణ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్. గోపాల్రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నెల్లూరి జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద సముద్రంలో భార్గవ్ మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. భార్గవ్ రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎలా చనిపోయాడనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. కొడుకు భార్గవ్ పేరు మీదే భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించిన గోపాల్ రెడ్డి.. బాలకృష్ణ, కోడి రామకృష్ణలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2008లో గోపాల్రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబసభ్యులెవరు ఇండస్ట్రీలో కొనసాగలేదు. -
అగ్నిప్రమాదం: రూ.7 లక్షల ఆస్తి నష్టం
మెదక్: జిల్లాలోని జగదేవ్పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గోపాల్ రెడ్డి ఇంట్లో షార్ట్ సర్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఇల్లు పూర్తిగా తగులబడింది. ఇంట్లో ఉంచిన రెండు క్వింటాళ్ల పత్తి, 100 డ్రిప్ పైపులు తగులబడ్డాయి. ఆయన బట్టల వ్యాపారం చేస్తుంటారు. బట్టలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం ఆస్తి నష్టం, సుమారు రూ.7 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. మెదక్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా గోపాల్రెడ్డి
ఆదోని టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా ఆదోనికి చెందిన ఎస్ గోపాల్రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఆదివారం ఆదోనిలో రాజశ్రీ ఫంక్షన్హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాల్రెడ్డి మాట్లాడారు. మూడేళ్లుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ పార్టీ పటిష్టతకు కృషి చేశానన్నారు. పార్టీ అధిష్టానం తన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పదవిని ఇచ్చిందన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణమున్నంతవరకు సాయిప్రసాద్రెడ్డిని వదిలి ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. సమావేశంలో కల్లుబావి వార్డు ఇన్చార్జ్ నాయకులు వీరభద్రారెడ్డి, మోహన్రెడ్డి, మాధవరెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. -
ప్రజాక్షేత్రంలో బాబుకు ఓటమి తప్పదు
– పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం – గోపాల్రెడ్డి విజయంతో సంబరాలు – కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్న కైవాసం చేసుకుంటామని ధీమా కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అధికార బలం, డబ్బు, దౌర్జన్యాలతో ప్రజాతీర్పును అడ్డుకోవాలని చూస్తే ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి తప్పదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హెచ్చరించారు. పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి విజయం సాధించిన సందర్భంగా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ జిల్లా కార్యాలయంలో ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు, కడప, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచారన్నారు. అదే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్ని కోట్లు గుమ్మరించి ఓటర్లను కొనాలని చూసినా ఓటమి తప్పలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే తెలియజేశాయన్నారు. 2019 ఎన్నికల్లో విజయం తథ్యం తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే 2019 ఎన్నికల్లో విజయం తథ్యమని, తద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖామన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఏ ఎన్నికల్లో మూడు స్థానాల కోసం 300 కోట్లను ఖర్చు చేయలేదన్నారు. కర్నూలు మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ తెలిపారు. వెంటనే కేఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు విజయకుమారి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ఖాన్, నాయకులు జహీర్ అహ్మద్ఖాన్, సత్యం యాదవ్, స్వరూప్కుమార్, రసూల్ఖాన్, నురుల్లాఖాద్రీ, హెచ్ఏ రహిమాన్, షబ్బీర్, ఫిరోజ్, రామకృష్ణ, ఈశ్వర్, మహబూబ్బాషా పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపాల్రెడ్డి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్య త ఓట్లలో గోపాల్ రెడ్డికి 53,714 ఓట్లు లభించగా.. కేజే రెడ్డికి 41,037, గేయానంద్కు 32,810 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో ‘మ్యాజిక్ ఫిగర్’గా నిర్ధారించిన 67,887 ఓట్లను.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గోపాల్రెడ్డి దక్కించుకున్నారు. ఫలితాల అనంతరం గోపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఉండటం మూలంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలే తనను గెలిపించాయన్నారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు వైఎస్ఆర్ సీపీ వైపే మొగ్గు చూపారన్నారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం కౌన్సిల్లో సమస్యలపై పోరాడతానని తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం
-
విజయం ముంగిట గోపాల్రెడ్డి
- పూర్తయిన మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు - 12,677 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి - ‘మ్యాజిక్ ఫిగర్’ దాటాలంటే మరో 14,173 ఓట్లు అవసరం - రెండు, మూడో స్థానాల్లో కేజే రెడ్డి, గేయానంద్ - కొనసాగుతున్న ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు - నేడు తుది ఫలితం వెలువడే అవకాశం అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే, విజయానికి అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ గోపాల్రెడ్డికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యతలో కేజే రెడ్డి, పీడీఎఫ్ అభ్యర్థి గేయానంద్కు పోలైన ఓట్లు, ‘మ్యాజిక్ ఫిగర్’కు అవసరమయ్యే ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే గోపాల్రెడ్డికే విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు వాకిట నిలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవుతోంది. ప్రతి రౌండ్లో వైఎస్సార్సీపీకి మెజారిటీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో 1,55,711 ఓట్లు పోలయ్యాయి. వీటిని సగటున 26 వేల ఓట్ల చొప్పున విభజించి ఆరు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొదటి రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకూ ప్రతి రౌండ్లోనూ గోపాల్రెడ్డికి ఆధిక్యత లభించింది. ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. కేజే రెడ్డికి 41,037, గేయానంద్కు 32,810 ఓట్లు పోలయ్యాయి. మిగిలిన అభ్యర్థులు స్వల్ప ఓట్లు సాధించారు. మ్యాజిక్ ఫిగర్కు 14,173 ఓట్ల దూరంలో... పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువ.. అంటే 67,887 ఓట్లను ‘మ్యాజిక్ ఫిగర్’గా ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. అలాగే కేజే రెడ్డి 26,850, గేయానంద్ 35,077 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను చేరుకునేందుకు గోపాల్రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవ్వాలంటే మరో 10 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున లేదా ఉదయం తుదిఫలితం వెలువడనుంది. -
కర్నూలులో పేపరు మిల్లును పునరుద్ధరించాలి
– ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్రెడ్డి డిమాండ్ కర్నూలు (ఓల్డ్సిటీ): కర్నూలులో రాయలసీమ పేపర్మిల్లు ప్రారంభించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్తో పాటు మాజీ ఎమ్మెల్యే, సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్రెడ్డిలతో కలిసి మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ యువకులు నిరుద్యోగ సమస్యతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలంటే కర్నూలులో ఎస్ఆర్పీఎం, హిందూపురంలో నిజాం షుగర్స్, గుంతకల్లులో స్పిన్నింగ్ మిల్లు, కడపలో బ్రాహ్మణి స్టీల్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తనకు అవకాశం లభిస్తే ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకొస్తానని తెలిపారు. ఎన్నోరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఆయన 100 అబద్ధాలు చెబితే, ప్రస్తుతం రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థి కె.జె.రెడ్డి పరిశ్రమలు స్థాపిస్తానంటూ 150 అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఉద్యమాలు చేస్తే పీడీ యాక్టు, నిరుద్యోగులపై నాసా యాక్టు పెడతామనడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణచివేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్రూరత్వం తగ్గించుకోకపోతే ముఖ్యమంత్రి పాలనకు కాలంచెల్లే రోజులొస్తాయని హెచ్చరించారు. సీమ సమస్యలపై పోరాడతారు.. రాయలసీమ జిల్లాల అభివృద్ధి పాలకులకు పట్టడం లేదని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వ పాలనలో అన్యాయం జరుగుతుందన్నారు. వెన్నపూస గోపాల్రెడ్డి ఎమ్మెల్సీగా అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటూ ఎంతో చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన గెలిస్తే చట్టసభల్లో సీమవాసుల వాణి వినిపించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, తద్వారా రాయలసీమ వాసులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అవగాహన కలిగిన అభ్యర్థి అవసరం.. రాష్ట్ర ఎన్జీవోల సంఘం చైర్మన్గా పనిచేసిన వెన్నపూస గోపాల్రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై మంచి అవగాహన ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అభ్యర్థి ఎంతో అవసరమని వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థికి మూడు జిల్లాల పరిధి ఉండటం వల్ల అందర్ని కలుసుకోకపోయినా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాల్లో, ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. ప్రజాసేవా అనుభవం కలిగిన వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయని తెలిపారు. నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లందరు ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు శ్రీకర్, వైద్యనాథ్రెడ్డి, కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోపాల్రెడ్డి విజయానికి పిలుపు
కోవెలకుంట్ల: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి విజయానికి కృషి చేయాలని నిరుద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ దేవరాజు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. 26వేలకు పైగా గ్రూప్ -1,2 పోస్టులు ఖాళీగా ఉండగా 980 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. 1.60 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 8వేల పోస్టులు భర్తీ చేశారని, మిగిలిన శాఖల్లో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదన్నారు. నెలకు రూ. 2వేలు నిరుద్యోగ భృతి హామీని గాలికి వదిలేశారని, నిరుద్యోగులకు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి నిరుద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ సభ్యులు దస్తగిరి, బాషా, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
బాబు వచ్చాడు ... జాబులు ఊడాయి
– ప్రతి నిరుద్యోగికి రూ.60 వేల బకాయి చెల్లించాలి – వైఎస్సార్సీపీ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస కదిరి టౌన్ : ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలని నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి విమర్శించారు. ఒక్కో నిరుద్యోగికి రూ.2 వేలు ఇస్తామని మాటతప్పారన్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ. 60 వేల చొప్పున సీఎం చంద్రబాబు బకాయి పడ్డారన్నారు. సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం రద్దు అయ్యేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకై నిరంతర పోరాటం చేస్తామనీ, మహిళా ఉపాధ్యాయ, ఉద్యోగులకు 22 నెలల ఛైల్డ్ కేర్ లీవ్లను సాధన కోసం కృషిచేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్గా ప్రకటించేలా సర్కారుపై మరింత ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల లోకోశ్వర్రెడ్డి, పట్టణ అ«ధ్యక్షుడు కేఎస్ బహవుద్దీన్, కౌన్సిలర్ ఖాదర్బాషా, కదిరి, గాండ్లపెంట మండల కన్వీనర్లు ప్రకాష్, చంద్రశేఖర్రెడ్డిలు పాల్గొన్నారు. -
తీవ్రంగా కొట్టి.. గొంతులో సూది గుచ్చారు
ఎర్రవల్లి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి లో గురువారం దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కర్రలతో దాడి చేశారు. అనంతరం తీవ్రంగా హింసించి గొంతులో సూది గుచ్చారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన భూమిని ఇతరుల పేరుతో దొంగ రిజిస్ట్రేషన్ చేశారని గత కొన్ని రోజులుగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పోరాడుతున్నాడు. సదరు వ్యక్తి ఈ రోజు వ్యవసాయ బావి వద్ద నుంచి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం గొంతులో సూదిని గుచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓయూ సెట్ దరఖాస్తు గడువు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూసెట్-2016 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు శనివారంతో (7న)తో ముగిసినా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడవచ్చు. -
టీడీపీ కుట్ర
అనంతపురం అగ్రికల్చర్ : పెద్దవడుగూరు మండలం కిష్టపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) అధ్యక్ష పీఠాన్ని అడ్డదారుల్లో కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. గతంలో సొసైటీ పరిధిలోని 13 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన అప్పేచెర్ల విజయభాస్కర్రెడ్డి సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల గోపాల్రెడ్డి అనే డెరైక్టర్ చనిపోవడంతో డెరైక్టర్ల సంఖ్య 12కు చేరింది. దీన్ని ఆసరాగా చేసుకుని అధ్యక్ష పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కొందరు డెరైక్టర్లను ప్రలోభాలకు గురి చేశారు. అధ్యక్షుడికి మెజార్టీ లేదంటూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇప్పించారు. సోమవారం అవిశ్వాస తీర్మానం జరగనుంది. వాస్తవానికి నోటీసు ఇవ్వాలంటే తొమ్మిది మంది డెరైక్టర్ల సంతకాలు తప్పినిసరి. అయితే, ఏడుగురి సంతకాలతోనే నోటీసు ఇచ్చినా.. అధికారులు ఆమోదముద్ర వేయడం గమనార్హం. ఈ ఏడుగురిలోనూ కంబన్న అనే డెరైక్టర్ అవిశ్వాస తీర్మానం నోటీసుపై వేలిముద్ర వేయలేదని, వేరొక వ్యక్తితో వేయించి కంబన్నవిగా చూపారని కొందరు డెరైక్టర్లు ఆరోపిస్తున్నారు. రెండు వర్గాల్లో ఆరుగురు చొప్పున డెరైక్టర్లు ప్రస్తుతం టీడీపీ, వైఎస్సార్సీపీ శిబిరాల్లో ఆరుగురు చొప్పున డెరైక్టర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన చింతలచెరువు శేషు, రావులుడికి జయశంకర్, అప్పేచెర్ల విజయభాస్కర్రెడ్డి, జయరామిరెడ్డి, భీమునిపల్లి కంబన్న, రావులుడికి రామలక్ష్మమ్మ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కానున్నారు. ఈ విషయాన్ని కొందరు డెరైక్టర్లు ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు పెద్ద కుట్రకు వ్యూహం పన్నినట్లు వారు వివరించారు. తాము అందుబాటులో లేకపోయినా తమ పేర్లతో బయటి వ్యక్తులను డెరైక్టర్లుగా హాజరుపరిచి.. ఓటింగ్ నెగ్గాలని చూస్తున్నారని వారు తెలిపారు. కాబట్టి సొసైటీ సీఈవో దాదాపీర్, డివిజనల్ సహకార అధికారి (డీఎల్సీవో) ఇ.అరుణకుమారి అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచించారు. డెరైక్టర్లుగా ఎన్నికైన తర్వాత గుర్తింపుకార్డులు ఇచ్చారని, వాటితో పాటు ఆధార్కార్డులను పరిశీలించి డెరైక్టర్లు ఎవరనేది గుర్తించాలని వారు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు ఎలా వ్యవహరిస్తారనేది అంతుచిక్కడం లేదు. అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లాలంటే కచ్చితంగా ఏడుగురు డెరైక్టర్లు హాజరుకావాలి. లేదంటే కోరం సమస్య తలెత్తుతుంది. తీర్మానం మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. మరుసటి రోజు కూడా కోరం లేకపోతే ప్రస్తుతమున్న పాలకవర్గాన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యే డెరైక్టర్లను గుర్తించడానికి అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. -
ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తాం
ఎర్రచందనం స్మగ్లర్లందరినీ ఏరేస్తాం పింఛన్ల విషయంలో రాద్ధాంతం తగదు మాట వినని అధికారులను మార్చేస్తాం టీడీపీ సమావేశంలో మంత్రి బొజ్జల చిత్తూరు(సిటీ): రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ, సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడి టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం సీనియర్ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడి అధ్యక్షతన నిర్వహించారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, అంతా మేలు జరుగుతుందని మంత్రి చెప్పారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి గ్రూపునకు వర్తింపజేయాలా, సభ్యులవారీగా వర్తింపజేయాలా అనే అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పింఛన్ల విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారని, అలా చేయడం తగదని చెప్పారు. భర్తలు ఉన్నవారు, వృద్ధులు కాని వారు పింఛన్లు తీసుకుంటున్నారని, అలాంటి వాటిని రద్దు చేసేందుకే సర్వే చేస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లందరినీ ఏరిపారేస్తామన్నారు. గత 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదనే అపోహలో అందరూ ఉన్నారని, అలాంటివేమి పెట్టుకోవద్దని చెప్పారు. ఇకపై అంతా మంచే జరుగుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తల మాటలను ఖాతరు చేయని అధికారులను తప్పక బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. మద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ వచ్చే గ్రామాల్లోనే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. చిత్తూరు ఎమ్మేల్యే డీఏ సత్యప్రభ మాట్లాడుతూ సీఎం సహకారంతో చిత్తూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీఎన్ రాజసింహులు మాట్లాడుతూ వచ్చే నెల 15 తరువాత పార్టీకి కొత్త అడహాక్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేస్తామని వెల్లడించారు. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, నగర మేయర్ కఠారి అనురాధ తదితరులు ప్రసంగించారు. ఉద్యానపంటలకూ రుణమాఫీ చేయాల్సిందే - తంబళ్లపల్లె నియోజకవ ర్గ తమ్ముళ్లు ఉద్యానపంటలకూ రుణమాఫీ చేయాల్సిందేనని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు సమావేశంలో పట్టుబట్టారు. 100 రోజులుగా రుణమాఫీపై కాలయాపన చేస్తున్నందున కార్యకర్తలతో పాటు, రైతులు మనోవేదనకు గురవుతున్నారని మండిపడ్డారు. మంత్రి కలగజేసుకుని అధికార పార్టీలో ఉంటూ సీఎం ప్రకటనలకు మద్దతు పలకకుండా, వ్యతిరేకంగా మాట్లాడటం తగదని వారిని వారించారు. మంత్రి ఎంత చెప్పినా వినకుండా రుణమాఫీ, పింఛన్ల విషయంపై కార్యకర్తలు నిలదీస్తుండటంతో సమావేశ మందిరం వద్ద గందరగోళం నెలకొంది. దీంతో చేసేదిలేక సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు.