-
లంగా ఓణీలో తేజస్విని గౌడ.. ఇంత అందంగా ఉందేంటి! (ఫొటోలు)
-
Tejaswini Gowda: సముద్రతీరాన ఏంజెల్లా తేజస్విని (ఫోటోలు)
-
Tejaswini Gowda: ఉగాది సెలబ్రేషన్స్.. క్యూట్ పిక్స్తో సీరియల్ బ్యూటీ తేజస్విని సెన్సేషన్ (ఫోటోలు)
-
Kavya Gowda Baby Shower Pics: వైభవంగా కన్నడ నటి కావ్య గౌడ సీమంతం (ఫోటోలు)
-
Tejaswini Gowda: అమర్దీప్ భార్య, నటి తేజస్విని బ్యూటిఫుల్ లుక్స్ (ఫోటోలు)
-
ఐక్యతే పెట్టుబడి.. గుర్తింపే లక్ష్యం..
రాజ్యాధికారం లేకే వెనుకబడిపోతున్నాం ఆత్మీయ సత్కార సభలో ప్రజాప్రతినిధులు గౌడ, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : ఐక్యతే పెట్టుబడిగా బీసీలంతా నడవాలని, సంఘానికి నేనేమైనా చేశానా.. చేయగలనా అని ప్రతి బీసీ ప్రశ్నించుకోవాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. అధిక జనాభా కలిగిన బీసీలను ఆయా రాజకీయ పార్టీలు గుర్తించేలా మన ఉద్యమాలు, పోరాటాలు ఉండాలన్నారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసన మండలి ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావులకు ఆదివారం రాజమహేంద్రవరంలోని జేకే గార్డెన్స్లో రాజమహేంద్రవరం గౌడ, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కారం నిర్వహించారు. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ మంజునాథ కమిషన్ విచారణకు మనమంతా బాగా స్పందించామని, పార్టీలకు అతీతంగా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని, ఐక్యతే మన శక్తి... స్ఫూర్తి అని నినదించారు. బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. మంత్రి పితాని మాట్లాడుతూ తమకు ప్రస్తుతం లభించిన పదవులు కేవలం బీసీ కులాలు, ఆ సంఘాల ప్రజలను చూసి ఇచ్చినవేనని, ఈ విషయాన్ని మరచిపోయి రాజకీయాలు చేయబోమని, బీసీల కోసం ఎల్లపుడూ తపిస్తామన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ, సంఘాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. తాము ఏ స్థాయిలో ఉన్నా సంఘాన్ని మరువబోమన్నారు. అంబేద్కర్ భవన్ లాగే ప్రతి జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ల నిర్మాణానికి ప్రయత్నిస్తామని, అందుకు స్థల దాతలు ముందుకు రావాలన్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామన్నారు. దీనిలో భాగంగా కొత్తపేటలో బీసీ కన్వెన్షన్ నిర్మిస్తున్నామన్నారు. అంగర రామ్మోహన మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా బీసీలు ఒక శక్తిగా అవతరించాలన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమౌళి తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, విప్ అంగర రామ్మోహనరావులను సత్కరించారు. కార్పొరేటర్లు గుత్తుల మురళీధరరావు, బాపన సుధారాణి, పిల్లి నిర్మల, ఆత్మీయ అభినంద సత్కార సభ ఆహ్వాన కమిటీ సభ్యులు బుడ్డిగ శ్రీనివాస్, కుడుపూడి పార్థసారధి, వాసంశెట్టి గంగాధర్, ఆతిథ్య కమిటీ సభ్యులు సూరంపూడి శ్రీహరి, మార్గాని రామకృష్ణగౌడ్, బీసీ సంఘం నాయకులు రెడ్డి రాజు, పాలిక శ్రీను, పెంకే సురేష్, లక్ష్మితులసి తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే !
జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ బెంగళూరు : వేరే పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో బహిరంగ రహస్యమేనని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ వ్యంగ్యంగా అన్నారు. ఇందుకు బంగారప్ప, రాజశేఖరమూర్తిల రాజకీయ జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణలని పేర్కొన్నారు. బెంగళూరులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ... ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన శ్రీనివాస్ ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితే తన మద్దతు ఉంటుందన్నారు. ఇతర బీజేపీలోకి కాని, ఇతర పార్టీల్లోకి కాని వెళ్తే తాను ఏమీ చేయలేనని తెలిపారు. నాకు ఒక్కలిగ సంఘానికి సంబంధం ఏమి. నేను ఒక రాజకీయ వేత్తను. అరుునా ఒక్కలిగ సంఘాన్ని బాగు చేస్తానని మంత్రి డీ.కే శివకుమార్ చెప్పారు. కదా? చూద్దాం.’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు దేవెగౌడ సమాధానమిచ్చారు. -
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం
కేంద్ర మంత్రి డి.వి.సదానంద గౌడ నగరంలో బీజేపీ బృహత్ చైతన్య ర్యాలీ బెంగళూరు: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కేంద్ర మంత్రి డి.వి.సదానంద గౌడ విమర్శించారు. ఆదివారమిక్కడి బ్యాటరాయణపుర ప్రాంతంలో నిర్వహించిన క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశం, బృహత్ చైతన్య ర్యాలీని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సదానంద గౌడ మాట్లాడుతూ....‘ప్రధాని నరేంద్రమోదీ నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. 3-4నెలలకోసారి జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి కేంద్రంతో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. అయితే ఈ సమావేశాలకు సీఎం సిద్ధరామయ్య హాజరు కావడమే లేదు. ఏదో ఒక సాకు చెప్పి ఈ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. దీన్నేనా అభివృద్ధి మంత్రం అంటారు. బహుశా రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు అధికారుల ఆత్మహత్యలపై ప్రధాని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే సమావేశానికి గైర్హాజరయ్యారేమో!’ అని కేంద్ర మంత్రి సదానందగౌడ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తైదని, అయినా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ....కాంగ్రెస్ ప్రభుత్వ అరచకాలతో ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందని మండిపడ్డారు. సిద్ధరామయ్య మంత్రి వర్గ సహచరులు రూ.11లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాధ్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను గెలిచే దిశగా కార్యాచరణ ప్రణాళికలను రచిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కార్యకర్తలు యడ్యూరప్పను వెండి కిరీటంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎస్.ఆర్.విశ్వనాథ్, మునిరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కావాలి
బెంగళూరు : రైతులు, శ్రామికులు, చిన్నస్థాయి ఉద్యోగులు.... ఇలా సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజల కష్టాలకు స్పందించి వారికి మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి అవసరం ప్రస్తుతం కర్ణాటకకు ఉందని మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ అభిప్రాయపడ్డారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్ పార్టీ కెంగేరి ఉపనగరలో యశ్వంత్పుర నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల బృహత్ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవెగౌడ మాట్లాడుతూ... ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. దేశానికి వెన్నముకలాంటి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుండటం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 213 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందడం లేదని తెలిపారు. గతంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పల్లె నిద్ర పేరుతో చేపట్టిన కార్యక్రమం వల్ల రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలను చూపెట్టేవారని గుర్తు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సిద్ధరామయ్య వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుండటం వల్లే రైతుల బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. పార్టీలోని కొంతమంది నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా బీబీఎంపీ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలన్నారు. అప్పుడు మాత్రమే మెజారిటీ సీట్లు సాధించడానికి వీలవుతుందని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్టు కేటాయిస్తామని ఈ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి, శాసనమండలి సభ్యుడు ఈ.కృష్ణప్పతోపాటు నియోజకవర్గానికి చెందిన పలువురు జేడీఎస్ నేతలు హాజరయ్యారు. -
హైకోర్టు విభజన ప్రారంభిస్తాం
ఎంపీల బృందానికి కేంద్ర న్యాయమంత్రి హామీ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణ ఎంపీలు, అధికారుల బృందానికి హామీ ఇచ్చారు. హైకోర్టు విభజనకు అవసరమైన భవనాలను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ సీఎం కె.చంద్రశేఖర్రావు రాసిన లేఖతోపాటు తెలంగాణ శాసనసభ, శాసనమండలి చేసిన ఏకగ్రీవ తీర్మానాల ప్రతులను న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి, ఎంపీలు, న్యాయవాదుల జేఏసీ నేతలు కేంద్ర మంత్రికి గురువారమిక్కడ ఆయన నివాసంలో అందజేశారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష డిప్యూటీ నేత బి.వినోద్కుమార్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, బాల్క సుమన్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, న్యాయవాద జేఏసీ ప్రతినిధులు రాజేందర్రెడ్డి, సహోదర్రెడ్డి, మోహన్రావు, కొండల్ రెడ్డి, జగత్పాల్రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చని, తెలంగాణ హైకోర్టు నిర్వహణకు గచ్చిబౌలిలో బహుళ అంతస్తుల భవనాన్ని సమకూరుస్తామని లేఖలో సీఎం వివరించారు. ఈ నేపథ్యంలో వెంటనే విభజన ప్రక్రియ ప్రారంభిస్తామని సదానందగౌడ హామీ ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవానికి హైకోర్టు సిద్ధం: వినోద్ న్యాయమంత్రిని కలసిన అనంతరం ఎంపీలు వినోద్, కవిత, న్యాయవాదుల జేఏసీ నేత మోహన్రావు, రాజేందర్రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. జూన్ 2 నాటికి హైకోర్టు విభజన పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. -
రాజ్యాధికారమే ధ్యేయం
కోటగుమ్మం (రాజమండ్రి) :గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, యాత, శ్రీశయన కులాలకు చెందినవారందరూ విభేదాలు పక్కనపెట్టి రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర గౌడ, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. ఇందుకోసం సంఖ్యాబలం పెంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు రాజమండ్రి జేకే గార్డెన్స్లో మంగళవారం జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. అన్ని కులా లూ సంఘీభావంతో మెలగి రాజ్యాధికారం దిశగా కృషి చేయాలన్నా రు. జిల్లాలో విస్తృతంగా పర్యటించి సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఫిబ్రవరి 15న గౌడ, శెట్టిబలిజ మహాసభ విజయవాడలో జరుగుతుందని, ఇందులో భాగంగా ఆ రోజు చలో విజయవాడ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా గౌడ, శెట్టిబలిజ, అనుబంధ కులాలకు చెందిన సమస్యలను అధికార, ప్రతిపక్షాల దృష్టికి తీసుకువెళ్తామని నారాయణరావు చెప్పారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ, రాజ్యాధికారం ద్వారానే సంఘీయుల అభివృద్ధి సాధ్యమని అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో రాజకీయాల్ని శాసించే స్థాయికి గౌడ, శెట్టిబలిజ సంఘం ఎదిగిందని అన్నారు. ఈ సభతో గౌడ, శెట్టిబలిజ, శ్రీైశయన, యాత తదితర కులాలను చిన్నచూపు చూస్తున్న పార్టీలకు కనువిప్పు కలగాలని అన్నారు. ఇప్పటికే 14 శాతం సీట్లు పొందుతున్న సంఘీయులు మరో 19 శాతం సీట్లు సాధిస్తే అధికారం వస్తుందన్నారు. ఐక్యతతో రాజకీయంగా సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు. గౌడ, శెట్టిబలిజ కులాలవారు విద్యావంతులు కావాలని సూచించారు. మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్నా గౌడ, శెట్టిబలిజ సంఘీయులకు గుర్తింపు లేదని అన్నారు. రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించలేదన్నారు. విజయవాడలో జరిగే మహాసభ ద్వారా సత్తా చాటాలన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోటీ ఏర్పడిందని, శాసనసభలో, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని, ఇందులో భాగంగా మద్యం షాపుల్లో కొన్నిటిని గౌడ, శెట్టిబలిజలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ బుడ్డిగ శ్రీను, రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు సన్మానం ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ, శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన 411 మంది ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక విప్, ఒక ఎంపీ, 11 ఎంపీపీలు, తొమ్మిదిమంది జెడ్పీటీసీ సభ్యులు, రాజమండ్రి నగరపాలక సంస్థకు చెందిన ఎనిమిదిమంది కార్పొరేటర్లు, జిల్లాలోని 36 మంది కౌన్సిలర్లు, 175 మంది ఎంపీటీసీ సభ్యులు, 157 మంది సర్పంచ్లు, ఐదుగురు బ్యాంక్ డైరక్టర్లకు ఈ అభినందన మహోత్సవం నిర్వహించారు. రాష్ట్ర గౌడ, శెట్టిబలిజ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్ పాలిక శ్రీను, మార్గాని చంటిబాబు, కుడుపూడి సత్తిబాబు, కడియాల వీరభద్రరావు, సూరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
శిరసా వహిస్తాం
సుప్రీం తీర్పు మేరకు కార్యాలయాన్ని అప్పగించేందుకు మేం సిద్ధం జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ బెంగళూరు : సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకు అప్పగించనున్నామని జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన న్యూ ఇయర్ డైరీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కార్యాలయాన్ని నమ్ముకుని తాను పార్టీని స్థాపించలేదన్నారు. కార్యకర్తల నుంచి విరాళాలు సేకరించి నూతన కార్యాలయాన్ని నిర్మించగలనని దేవెగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘జేడీఎస్ రాజకీయ పార్టీ. రాజకీయ కార్యకలాపాల కోసం కార్యలయ స్థాపనకు సరైన చోట స్థలాన్ని కేటాయించండి. పూర్తి స్థాయి కార్యాలయాన్ని నిర్మించేంత వరకూ లీజు ప్రతిపాదికన ఓ కట్టడాన్ని కేటాయించండి’ అని బీడీఏకు లేఖ రాసినా అధికారులు స్పందించడం లేదన్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తముందని ఆరోపించారు. జేడీఎస్ను రూపుమాపాలని ఆయన భావిస్తున్నారని, అయితే అది ఎన్నటికీ జరగదని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజ్కుమార్ విగ్రహానికి నిప్పుపెట్టిన వారిని అరెస్ట్ చేయాలి
బళ్లారి టౌన్:కన్నడ నటుడు డాక్టర్ రాజ్కుమార్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక శివరామ గౌడ వర్గం ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం శవయాత్ర చేపట్టారు. అనంతరం స్థానిక రాయల్ సర్కిల్లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఎస్.సురేష్ మాట్లాడుతూ బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగరం బంగారప్పనగర్లో రాజకుమార్ విగ్రహానికి కొంత మంది దుండగులు నిప్పంటించడం దారుణమన్నారు. ఇందుకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ అధ్యక్షుడు రాజశేఖర్, వేదిక నేతలు అశోక్, రామమూర్తి, దేవేంద్రప్ప, మృత్యుంజయ, లోకేశ్, మంజు, మల్లికార్జున, కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు
ముఖ్యమంత్రి సిద్దరామయ్య గంగావతి, న్యూస్లైన్ : నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోష్యం చెప్పారు. ఆయన శనివారం స్థానిక క్రీడా మైదానం ఆవరణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభనుద్దేశించి మాట్లాడారు. నరేంద్రమోడీ గుజరాత్లో 13 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నాడని, అయినా ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మానవ అభివృద్ధి దృష్ట్యా గుజరాత్ 9వ స్థానంలో ఉందని, మనిషి సగటు అభివృద్దిని పరిశీలిస్తే 12వ స్థానంలో ఉందని చెప్పారు. పౌష్టికాహారం కొరత ఉన్నవారు 55 శాతం మంది ఉన్నారన్నారు. ఒకటవ తర గతి విద్యాభ్యానికి స్వస్తి పలికి బడులు మానుకున్న పిల్లలు 60 శాతం మంది ఆ రాష్ట్రంలో ఉన్నారని విమర్శించారు. నరేంద్రమోడీ అపద్దాలను ప్రచారం చేస్తూ దేశంలో సంచరిస్తున్నారని విమర్శించారు. ఆయన కర్ణాటక రాష్ట్రానికి నాలుగు సార్లు పర్యటించినపుడు ఆయన కుడి ఎడమ వైపు అవినీతి పరులను పెట్టుకొని తాను ఉపన్యసిస్తూ అవినీతిని అంతమొందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన అవినీతిలో కూరుకుపోయి జైలుపాలు అయిన యడ్యూరప్ప, కట్ట సుబ్రమణ్యం నాయుడు, సదానందగౌడ, జగదీశెట్టర్లాంటి అవినీతిపరులతో ప్రచారం చేపట్టడం విచారకరమన్నారు. ఆయన సభలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి ఈశ్వరప్ప ఇంట్లో దొంగనోట్లను ముద్రించే రెండు యంత్రాలను లోకాయుక్త స్వాధీనం చేసుకోవడం ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వధర్మాలను పరిగణలోకి తీసుకొని వారికి సముచితమైన న్యాయాన్ని కల్పించే ఏకైక పార్టీ అన్నారు. బీజేపీ ఒకే ధర్మం, ఒకే సంస్కృతి, ఒక్కరే నాయకుడన్న ధోరణులతో దేశాన్ని పాలించగలదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి సిద్దరామయ్య ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శలు చేయడం సరికాదన్నారు. తమ పాలనలో పేద ప్రజలకు రుణాలను మాఫీ చేయడం, అలాగే పక్కా ఇళ్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. రూ.2.10 కోట్లను రాష్ట్రంలో పాలఉత్పత్తి దారులకు సహాయధనాన్ని అందిస్తున్నామన్నారు. కోటి 5 లక్షల మంది పిల్లలకు వారంలో మూడు రోజులకు ఒకసారి 150 మిల్లిలీటర్ల పాలు అందిస్తున్నామన్నారు. రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలను, రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మూడు శాతం వడ్డీతో రుణసౌకర్యం కల్పించామన్నారు. ఆర్టికల్-371 కు సంబంధించి రూ.1630 కోట్ల ప్రత్యేక గ్రాంట్ను కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. కొప్పళ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బసవరాజ్ హిట్నాళ్కు మీ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ వేదికపై కేంద్ర మాజీ మంత్రి సీఎం.ఇబ్రహీం, యలబుర్గా ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి, రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి, మాజీ సభాపతి వీరణ్ణ మత్తికట్టి, మాజీ ఎమ్మెల్సీ హెచ్ఆర్ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు, కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, మాజీ మంత్రులు మల్లికార్జున నాగప్ప, సాలోణి నాగప్ప, కొప్పళ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బసవరాజ్ హిట్నాళ్, పార్టీ కనకగిరి బ్లాక్ అధ్యక్షుడు రెడ్డిశ్రీనివాస్, గంగావతి బ్లాక్ అధ్యక్షులు హనుమంతప్ప నాయక్, జిల్లా పంచాయితీ అధ్యక్షులు పీ. జనార్దన్, గంగావతి తాలూకా పంచాయితీ అధ్యక్షులు రాజేశ్వరి సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆ రెండు పార్టీలతో పొత్తు ఉండదు
సాక్షి, బెంగళూరు : వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. పార్టీ మైనారిటీ విభాగం బెంగళూరులో ఆదివారం ఏర్పాటు చేసిన ‘ముస్లిం మేధావుల సమావేశం’లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్తోపాటు బీజేపీతో చేరి జేడీఎస్ కొన్ని ఎన్నికలు ఎదుర్కొవాల్సి వ చ్చిందన్నారు. అయితే దీని వల్ల జేడీస్ పార్టీ కొంత నష్టపోయిన మాట వాస్తవమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు సమదూరంలో ఉండాలని నిర్ణయించామని దేవెగౌడ తెలిపారు. ఆ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముస్లిం వర్గీయులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాల సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. కేంద్రంలో లౌకిక పార్టీ అధికారంలోకి రావాలనేది తన అభిమతమని దేవెగౌడ పేర్కొన్నారు. అంతకు ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... తమ ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమ పథకాల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టామన్నారు. తాను కాని తమ పార్టీ కాని జాతి పేరుతో రాజకీయాలు నడపలేదన్నారు. కార్యక్రమంలో శాసనసభ ప్రతిపక్షనాయకుడు కుమారస్వామి, జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఏ.కృష్ణప్ప, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీం, పార్టీ నాయకులైన జఫరుల్లా, సయ్యద్ వ ూహిద్ ఆల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఏపీలో అల్లర్లు చేసింది వీరే..
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
కర్నూల్ లో వజ్రాల వేట
యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్..
హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
తప్పక చదవండి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
Advertisement