harrassment
-
మేడం మీరు మోడ్రన్ డ్రెస్లో బాగుంటారు.. వర్సిటీ డీన్ వేధింపులు..
దేశంలో మహిళలు, యువతులపై ఏదో ఒక చోట.. వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. పనిచేసేచోట, ప్రయాణ సమయాల్లో మహిళలు వేధింపులకు గురువుతూనే ఉన్నారు. తాజాగా ఓ డిపార్ట్మెంట్ డీన్.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్కు వేధింపులకు గురిచేశాడు. విదేశీ దుస్తుల్లో నువ్వు అందంగా ఉంటావ్ అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గురుగ్రామ్ యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్ ధీరేంద్ర కౌశిక్ పనిచేస్తున్నారు. అదే వర్సిటీలో ఓ మహిళ.. అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తన్నారు. ఈ క్రమంలో డీన్ ధీరేంద్ర.. ఆమెపై కన్నేసి అనుచితంగా ప్రవర్తించాడు. శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. ఇటీవల ధీరేంద్ర.. ఆమెతో మాట్లాడుతూ.. మీరు మోడ్రన్ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తారు. మీ భర్త లేనప్పుడు నన్ను హోట్ల్లో కలవండి అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే, పలు సందర్భాల్లో ఆమె ప్రైవేటు భాగాలను తాకే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆమె.. తనతో ఇలా ప్రవర్తించవద్దని ధీరేంద్రను కోరింది. అనంతరం.. ఈ విషయాలపై వీసీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన నిరాకరించడం గమనార్హం. ఇలా, ధీరేంద్ర.. ఆమెను వేధింపులకు గురిచేయడం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఏప్రిల్ 28వ తేదీన యూనివర్సిటీ ఆవరణలోని ఒక గదిలో తనను వేధించడంతో ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె.. గురుగ్రామ్లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, ఫిర్యాదు సమయంలో తనపై జరిగిన వేధింపులను వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న కొన్ని సంబంధాల కారణంగా వీసీ పట్టించుకోలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: థాయ్లాండ్లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. -
రూ.6వేలు అప్పు ఇచ్చి.. రూ.54వేలు కట్టించుకున్నారు.. అయినా..!
సాక్షి, ఖమ్మం: ఆన్లైన్ యాప్ లోన్ ఆగడాలకు ఖమ్మంలో ఓ యువకుడు బలయ్యాడు. యాప్ వారి వేధింపులకు భరించలేక పురుగుమందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బాపూజీ తండాకు చెందిన భూక్యా భావ్సింగ్ కుమారుడు ఆకాశ్(24) నగరంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ యాప్ ద్వారా రూ.6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును సకాలంలో చెల్లించడంతోపాటుగా అదనంగా రూ.54 వేలు చెల్లించినా....ఇంకా అప్పు ఉన్నావని, అప్పు చెల్లించకుంటే ‘నీ ఫొటో, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతాం’అంటూ వేధింపులకు పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక ఈ నెల 9న తాను పనిచేసే షాపు వెనుకనే పురుగు మందు తాగాడు. షాపు యాజమాన్యం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆకాశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీఐ సర్వయ్య మాత్రం లోన్యాప్ వేధింపులనే ఫిర్యాదు తమకు అందలేదని, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం ఉందని, దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నార్సింగి కేసులో వీడిన మిస్టరీ.. ఇద్దరు అరెస్ట్ -
ప్రేమోన్మాది దాడిలో ముగ్గురికి గాయాలు
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. యువతితో పాటు ఆమె అక్క, తల్లిపై దాడి చేసి గాయపర్చాడు. పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ కడియపులంకకు చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 20న యువతి తండ్రికి ఫోన్ చేసి.. నీ చిన్న కుమార్తె నన్ను ప్రేమించకుంటే చంపేస్తా.. అంటూ బెదిరించాడు. అనంతరం శుక్రవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లాడు. యువతితో పాటు, ఆమె అక్క, తల్లిపై సుత్తితో దాడి చేసి గాయపర్చాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో తన మెడ, చేతిపై గాయపర్చుకున్నాడు. తల్లి, ఇద్దరు కుమార్తెలను బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వెంకటేష్ను అతడి స్నేహితులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఉన్న బాధితులను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందననాగేశ్వర్, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పరామర్శించారు. ఇదిలా ఉండగా నిందితుడు దాసరి వెంకటేష్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అనుచరుడని గ్రామస్తులు చెబుతున్నారు. -
లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు. తమను వేధిస్తున్న హెడ్ మాస్టర్ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. #mandya A senior teacher of a govt school in Kattigeri beaten up by students before handing him over to police.There were several complaints of sexual misconduct against Chinmayanand.Yesterday,students got together & hit him with sticks for harassing a girl student #Karnataka pic.twitter.com/ud2WSMCkLx — Imran Khan (@KeypadGuerilla) December 15, 2022 -
పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే.. మహిళలపైనే అధికం!
ఐక్యరాజ్యసమితి: పని ప్రదేశాల్లో దిగువస్థాయి సిబ్బందికిపై హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారాయని ఓ సర్వేలో తేలింది. యువత, వలసదారులు, రోజువారీ వేతన జీవులు, ముఖ్యంగా మహిళలే ఇందుకు బాధితులుగా మారుతున్నారని వెల్లడైంది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన మొట్టమొదటి సర్వే ఇది. ఐరాస అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్, గాల్లప్ సంస్థ కలిసి గత ఏడాది చేపట్టిన ఈ సర్వే ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల్లోని 75 వేల మంది సిబ్బందిపై సర్వే జరపగా 22% మందికి పైగా ఏదో ఒక రకమైన వేధింపులు, హింసకు గురవుతున్నట్లు తెలిపారని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు పని ప్రదేశంలో ఏదో ఒకవిధమైన వేధింపులకు గురవుతున్నట్లు తెలపగా, 6.3% మంది భౌతిక, మానసిక, లైంగిక హింసను, వేధింపుల బారినపడ్డారు. 17.9% మంది మాత్రం ఉద్యోగం చేసుకునే చోట ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉపాధి పొందే చోట భౌతికంగా హింస, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు 8.5% మంది పేర్కొనగా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. ‘పని ప్రదేశాల్లో వేధింపులు ప్రమాదకరమైన అంశం. దీనివల్ల వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆదాయ నష్టం వాటిల్లి, వారి కెరీర్ దెబ్బతింటోంది’అని సర్వే అభిప్రాయపడింది. ప్రభావవంతమైన చట్టాలు, విధానాలను రూపొందించి ఈ సమస్యను పరిష్కరించవచ్చునని పేర్కొంది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
ఆరేళ్ల క్రితం అదృశ్యమైన పోలీసు ఉద్యోగి ప్రత్యక్షం
నెల్లూరు రూరల్: వరకట్న వేధింపులతో జైలుపాలై ఆరేళ్ల క్రితం అదృశ్యమైన పోలీసు ఉద్యోగి శుక్రవారం నెల్లూరులో ప్రత్యక్షయ్యాడు. జిల్లాలోని ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే శివకుమార్సింగ్ నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు పోలీసు కాలనీలోని అపార్ట్మెంట్లో నివశిస్తుండేవాడు. మొదటి భార్య నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న అతను తిరిగి గుంటూరుకు చెందిన సుభాషిణిని రెండో వివాహం చేసుకుని పోలీసు కాలనీలో ఉంటుండేవాడు. రెండో భార్యతో కూడా వివాదాలు తలెత్తడంతో ఆమె మహిళా పోలీసుస్టేషన్లో శివకుమార్సింగ్పై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. పోలీసుగా ఉండి జైలులో గడపడంతో భార్య సుభాషిణిపై తీవ్రంగా మనస్తాపం చెందాడు. రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యాడు. దీంతో రెండో భార్య సుభాషిణి సోదరుడు తులసీరామ్సింగ్ నెల్లూరు రూరల్ పోలీసులకు 2016లో ఫిర్యాదు చేశాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో సుభాషిణి గుంటూరుకు వెళ్లి అక్కడే ఉంటుంది. అదృశ్యమైన అతడిని ఈ ఏడాది జూలైలో కేరళలోని ఓ సేవాసంస్థ వారికి కనిపించాడు. అనారోగ్యంతో ఉన్న అతడికి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. తాను నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్నట్లు వారికి చెప్పాడు. దీంతో సేవాసంస్థ ప్రతినిధి అతడిని వెంటబెట్టుకుని నెల్లూరు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
విజయవాడ : బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన యువకుడికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో న్యాయస్థానం (స్పీడ్ ట్రయల్ కోర్టు) జడ్జి డాక్టర్ ఎస్.రజిని సోమవారం తీర్పు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సుందరయ్యనగర్ కరకట్ట ప్రాంతానికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన తన్నీరు నాగార్జున (20) పలుమార్లు అత్యాచారం చేసిన వైనం 2017 ఏప్రిల్ 29న వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కేసు విచారణాధికారి విజయవాడ పశ్చిమ పోలీస్ డివిజన్ ఏసీపీ గుణ్ణం రామకృష్ణ నిందితుడిని అరెస్టుచేసి 2021 మే లో∙చార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి.నారాయణరెడ్డి బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారసంస్థను ఆదేశించారు. -
బీజేపీ మహిళా నేతకు లైంగిక వేధింపులు.. సొంత పార్టీ నాయకుడే
చెన్నై: తమిళనాడు బీజేపీ నాయకురాలు శశికళ పుష్పను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోన్ బాలగణపతి లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డీఎంకే ఐటీ వింగ్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శశికళను బాలగణపతి పదే పదే తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె చీర కొంగును పట్టుకునేందుకు, చేతిని ముట్టుకునేందుకు పలుమార్లు ట్రై చేశాడు. ఆమె మాత్రం ఈ చేష్టలకు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. பாஜகவில் சேரும் பெண்கள், தங்களை பாஜகவினரிடம் இருந்து தற்காத்துக் கொள்வதே பெரும் போராட்டம் தானா? @annamalai_k #ShameOnBJP pic.twitter.com/lNZXVTCKYY — இசை (@isai_) September 13, 2022 ఈ వీడియోను సరిగ్గా చూపేందుకు స్లో మోషన్లో ఎడిట్ చేసింది డీఎంకే ఐటీ వింగ్. బీజేపీలో చేరే మహిళలు ఆ పార్టీ నుంచి తమను తాము కాపాడుకోవడమే అది పెద్ద సమస్యా? అని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించింది. దళిత నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఇమాన్యుయెల్ శేఖరన్ జయంతి సందర్భంగా రామనాథపురం జిల్లాలో నివాళులు అర్పించేందుకు బీజేపీ నేతలు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే డీఎంకే ఆరోపణలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో బీజేపీ నేత ఖండించారు. బాలగణపతి వేధింపులకు పాల్పడలేదని, పుష్పగుచ్చాన్ని పట్టుకునేందుకే ప్రయత్నించారని పేర్కొన్నారు. డీఎంకే దురుద్దేశంతోనే ఈ వీడియోను ఎడిట్ చేసిందన్నారు. మరోవైపు బాలగణపతి మాత్రం ఈ వీడియోపై ఇప్పటివరకు స్పందించలేదు. చదవండి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు -
పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు మృతి చెందాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బైక్ ఎన్ఓసీ విషయంలో బాలిజీ మోటర్స్ షోరూం యజమానితో ఈ నెల 10న ప్రశాంత్, శ్రావన్ అనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. దీనిపై షోరూం యజమాని గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశాంత్, శ్రావన్లను పోలీసు స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ ఉదయ్ కిరణ్ వేధించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ ఉదయ్ కిరణ్ వేధింపులు భరించలేకనే ఈ నెల 12 న ప్రశాంత్ పోలిసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. 12 రోజులుగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. ఈ ఘటనలో గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్, షోరూం యజమానిపై కేసులు నమోదు అయ్యాయి. ఎస్ఐ ఉదయ్కిరణ్కు సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
జనసేనలో మహిళలకు రక్షణలేదు
సీటీఆర్ఐ (తూర్పు గోదావరి): జనసేన పార్టీలో మహిళలకు రక్షణలేదని.. ఇక్కడ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నా పార్టీ అధినేత పవన్కళ్యాణ్ పట్టించుకోవటంలేదని పార్టీ వీర మహిళా విభాగం సభ్యురాలు సునీత బోయ ఆరోపించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడింది. జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సినీ నిర్మాత ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు 2019 ఎన్నికల సమయంలో రాజమహేంద్రవరం వచ్చినప్పుడు తనకు పరిచయం అయ్యాడని చెప్పింది. జూనియర్ ఆర్టిస్టుగా చేస్తున్నానని తాను చెప్పడంతో సినిమాల్లో అవకాశమిస్తానని నమ్మబలికాడని తెలిపింది. జనసేనలో తాను క్రియాశీలకంగా ఉండటంతో వీర మహిళ విభాగంలో పనిచేయాలని చెప్పాడని సునీత వెల్లడించింది. నిజానికి, తాను సొంత డబ్బుతో పవన్కళ్యాణ్ కోసం పనిచేశానని.. ఎన్నికల సమయంలో బన్నీ వాసు రాజమహేంద్రవరంలో ఆయన వెంట తిప్పుకుని లైంగికంగా లోబరుచుకున్నాడని, డ్రగ్స్ ఎక్కించి పిచ్చిదాన్ని చేయాలని చూశారని ఆరోపించింది. మూడేళ్లుగా ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నా తనని మానసిక రోగిగా చిత్రీకరించి తనపై కేసులు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ దృష్టికి కూడా తీసుకెళ్లానని సునీత తెలిపింది. పార్టీలో వీర మహిళ విభాగంలో పనిచేస్తున్న తనకే రక్షణ కల్పించలేని పవన్కళ్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించింది. రెండ్రోజుల్లో పవన్ స్పందించకపోతే న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని హెచ్చరించింది. -
భర్తను చంపి పిల్లల ఎదుటే మహిళపై లైంగిక దాడి.. ఆ తర్వాత..
జైపూర్: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని శిక్షించినప్పటికీ కొందరు మృగాల్లో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఓ అమానవీయ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్లోనిధోల్పుర్లో ఓ దళిత మహిళ.. తన భర్త, పిల్లలతో కలిసి పొలం నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి.. సదరు మహిళ భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత బాధితురాలిని, ఆమె పిల్లలను తుపాకీతో బెదిరించి.. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. వారంతో బాధిత మహిళ గ్రామానికే చెందిన వారని వెల్లడించారు. నిందితులను లాలూ ఠాకూర్, ధన్ సింగ్ ఠాకూర్, విపిన్ ఠాకూర్, లోకేంద్ర సింగ్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్, సచిన్ ఠాకూర్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. -
సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారు..
కడప అర్బన్: ‘వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నారు. వారు చెప్పినట్లు చెప్పకపోతే కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఆఫీసులో, ఇంటి వద్ద అవమానించారు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే మాకు శరణ్యం’ అని వైఎస్సార్ జిల్లా పులి వెందుల నివాసి, యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి గజ్జల ఉదయ్కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గౌరవంగా జీవిస్తున్న సామాన్య కుటుంబం మాది. కానీ, సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పేరిట ఏడాదిగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఆయన హత్య గురించి అందరికీ తెలిసినట్లుగానే మాకూ తెలిసింది. అయితే ఈ ఏడాదిలో విచారణ పేరిట నన్ను 22 సార్లు పిలిచారు. ఆరేడు సార్లు నోటీసులు ఇచ్చారు. మిగిలిన సందర్భాల్లో వాట్సాప్ కాల్ చేసి పిలిచారు. వ్యవస్థల పట్ల గౌరవం, నమ్మకంతో అన్నిసార్లూ వెళ్లాను. నాకు తెలిసిన విషయాలు చెప్పాను. కానీ సీబీఐ అదనపు ఎస్పీ రాంసింగ్ ఆయన చెప్పినట్లు చెప్పాలంటూ బెదిరిస్తూ భౌతికదాడి చేశారు. హత్య జరిగిన రోజు ఉదయం నేను, ఈసీ సురేంద్రనాథ్రెడ్డి కలిసి శివశంకర్రెడ్డి ఇంటికి వెళ్లినట్లు, అనంతరం శివశంకర్రెడ్డితో కలిసి ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళ్లినట్లు, అక్కడ శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఏదో మాట్లాడుకున్న ట్లు చెప్పాలంటున్నారు. నేను ఆ రోజు ఉదయం ఎక్కడికీ వెళ్లలేదు. సురేంద్రనాథ్రెడ్డిని, శివశంకర్రెడ్డిని కలవలేదు. గంగిరెడ్డి ఇంటికి కూడా వెళ్లలేదు. చేయని పని చేసినట్టుగా చెప్పలేను. ఇదే విషయాన్ని రాంసింగ్కు ప్రతిసారీ చెబుతున్నాను. కానీ ఆయన చెప్పినట్లు చెప్పకపోతే నన్నూ, నా కుటుంబాన్ని ఈ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నారు. శనివారం బ్యాంక్ అకౌంట్స్ పేపర్లు ఇచ్చా ను. సోమవారం కూడా పిలిపించారు. వారు చెప్పినట్టు చెప్పకపోతే మా నాన్నను ఈ కేసులో ఇరికిస్తానని బెదిరించారు. కుటుంబమంతా ఆందోళనలో ఉన్నాం. మీరు వెంటనే విచారించి నిజానిజాలు తెలుసుకొని, రాంసింగ్, సీబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అని అదనపు ఎస్పీని కోరారు. -
సచిన్ వీరాభిమానిపై పోలీస్ జులుం.. ప్రారంభోత్సవం చేసిన స్టేషన్లోనే..!
Sachin Die Hard Fan Beaten By Police: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి అంటే తెలియని వాళ్లు బహుశా భారత క్రికెట్ వర్గాల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. సచిన్ రిటైర్మెంట్ వరకు టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్లో అతను స్టాండ్స్లో దర్శనమిచ్చే వాడు. ఇంటా, బయటా అన్న తేడా లేకుండా సచిన్ ఆడిన ప్రతి మ్యాచ్ను చూసేందుకు అతను ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. అతనికి కొన్ని సందర్భాల్లో బీసీసీఐయే ప్రత్యేక రాయితీలు కల్పించి మ్యాచ్ వీక్షించేందుకు పంపేది. సచిన్ సైతం సుధీర్కి చాలా మర్యాద ఇచ్చే వాడు. చాలా సందర్భాల్లో అతన్ని సత్కరించడంతో పాటు అతని అవసరాలను కూడా తీర్చాడు. విదేశాల్లో జరిగే టోర్నీల కోసం అతని విమాన చార్జీలను కూడా సచినే స్వయంగా భరించేవాడు. సచిన్ను దైవంతో సమానంగా ఆరాధించే సుధీర్.. క్రికెటేతర కారణాల చేత తొలిసారి వార్తల్లోకెక్కాడు. బిహార్లోని ముజఫర్పూర్ పోలీసులు తనపై దాడి చేసి హింసించారని ఆయన ఆరోపించాడు. ఓ కేసు విషయంలో సోదరుడు కిషన్ కుమార్ను ముజఫర్పూర్ పోలీసులు అరెస్ట్ చేయగా, అతన్ని కలిసేందుకు వెళ్లిన తనను స్థానిక డ్యుటీ ఆఫీసర్ దుర్భాషలాడాడని, అంతటితో ఆగకుండా కాళ్లతో తన్ని, స్టేషన్ బయటికి గెంటేశాడని సుధీర్ ఆరోపించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనను దూషించి, గాయపరచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు. కాగా, రెండేళ్ల క్రితం ఇదే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని సుధీర్ వెల్లడించడం విశేషం. చదవండి: రైతుగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్.. -
మాజీ లవర్ను ఇరికించాలని.. తనే ఇరుక్కుంది!
ప్రేమించుకున్న వాళ్లు విడిపోతే.. కొంతమంది ఎవరి దారి వారు చూసుకుంటారు! అయితే మరికొంత మాత్రం తమ ప్రేమ విషయంలో మనస్పర్థలు తలెత్తితే అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తారు. అయితే తాజాగా ఓ అమ్మాయి సోషల్ మీడియా వేదికగా తన మాజీ ప్రేమికుడిని వేధింపులకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఐర్లాండ్కు చెందిన 20ఏళ్ల కర్టనీ ఎయిన్స్ వర్త్ అనే ఓ అమ్మాయి, లూయిస్ జాలీని ప్రేమించింది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అయితే అప్పటి నుంచి తన మాజీ ప్రేమికుడి మీద పగ పెంచుకుంది కర్టనీ. ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని భావించిన కర్టనీ.. 30 నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి.. తనకు తానే చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్లు పంపించుకుంది. అనంతరం వాటిని లూయిస్ పంపించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ప్రియుడిపై పగతో వేధించాలని కర్టనీనే పలు మెయిల్ ఐడీలతో 30 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించినట్లు పోలీసులు తేల్చారు. ఆమె ఫిర్యాదు కారణంగా లూయిస్ ఉద్యోగం కూడా కోల్పోవల్సి వచ్చింది. పోలీసులు కర్టనీని అరెస్ట్ చేసి.. న్యాయస్థానంలో హాజరుపరిచారు. లూయిస్ ఏ తప్పు చేయలేదని కర్టనీ కావాలని అతన్ని వేధింపులకు గురి చేసి ఉద్యోగం కోల్పోయేలా చేసినందుకు కోర్టు ఆమెకు 10 నెలల జైలు శిక్ష విధించింది. -
విషాదం: ఏమైందో తెలియదు.. అత్తింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
ఒంగోలు: ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీరు. మరో సాఫ్ట్వేర్ ఇంజినీరును పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు నిత్యం నరకం కనిపించింది. భర్తతోపాటు మామ కూడా చేయి చేసుకుంటున్నాడంటూ తండ్రికి ఫోన్లో మొరపెట్టుకుంది. చివరకు ఇంట్లోకి సైతం రానివ్వడం లేదంటూ విలపించింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తన కుమార్తెను చంపేశారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషాద సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగింది. జిల్లాలోని రాచర్ల మండలం సోమిదేవిపల్లికి చెందిన రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి అయినాబత్తుల వెంకటేశ్వర్లు కుమార్తె స్వాతికి, ఒంగోలు భాగ్యనగర్లో ఉంటున్న సంగా శ్రీహరి కుమారుడు వెంకటశ్రీకాంత్కు గత ఏడాది మేనెల 13న వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు 25 తులాల బంగారం, రూ.50 లక్షలు కట్నంగా ఇచ్చారు. స్వాతి హైదరాబాద్ విప్రో కంపెనీలోను, వెంకటశ్రీకాంత్ ఇన్ఫోసిస్లోను సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. (చదవండి: వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు) ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీహరికి గత ఏడాది జూలైలో యాక్సిడెంట్ కావడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తూ స్వాతి దంపతులు ఒంగోలులోనే శ్రీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. శ్రీహరి ఉద్యోగం చేయలేని నేపథ్యంలో కుమారుడు వెంకటశ్రీకాంత్కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి స్వాతిని వదిలించుకోవాలని పథకం పన్నారు. నల్లగా ఉన్నావంటూ కించపరుస్తూ విడాకులివ్వాలంటూ వేధించారు. ఈ ఏడాది మార్చిలో స్వాతిని పుట్టింటికి పంపారు. మళ్లీ పెద్దల సమక్షంలో ఈ ఏడాది జూలైలో స్వాతి ఒంగోలులోని అత్తగారింటికి చేరింది. అప్పటినుంచి భర్త, మామ శారీరకంగా, మానసికంగా హింసించసాగారు. శనివారం రాత్రి ఆమెను కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వాతి తన తండ్రికి ఫోన్చేసి తనను ఇంట్లోకి రానిచ్చారని చెప్పింది. 5.07 నిమిషాలకు ఆయనకు వాచ్మెన్ ఫోన్చేసి స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే ఒంగోలు చేరుకున్న వెంకటేశ్వర్లు దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీసులు.. స్వాతి భర్త, అత్తమామలతో పాటు మరికొందరిపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్వాతి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!) -
498ఏ కింద గర్ల్ఫ్రెండ్ను విచారించేందుకు వీల్లేదు..
సాక్షి, అమరావతి: గర్ల్ఫ్రెండ్ను ఐపీసీ సెక్షన్ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించేందుకు వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే ఈ సెక్షన్ కింద విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. భర్త సంబంధీకుల్లోకి గర్ల్ఫ్రెండ్ రాదని, అందువల్ల ఆమెను 498ఏ కింద విచారించడానికి వీల్లేదంది. ఓ వ్యక్తి గర్ల్ఫ్రెండ్పై పోలీసులు సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అరెస్ట్తో సహా ఎలాంటి ఇతర కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. తనను వేధిస్తున్నారంటూ కొమ్మి సునీత.. భర్త ధర్మయ్య, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, భర్తకు గర్ల్ఫ్రెండ్గా ఉన్న ఓ యువతిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిశా మహిళా పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి, రెండో నిందితురాలిగా చేర్చారు. దిశా పోలీసులు నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ ఆ యువతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ విచారణ జరిపారు. వివాదంలోకి పిటిషనర్ను అనవసరంగా లాగారు.. పిటిషనర్(యువతి) తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు సునీత, ఆమె భర్త ధర్మయ్యకు మధ్య ఉన్న గొడవల్లో పైచేయి సాధించేందుకు వారి మధ్య వివాదంలోకి పిటిషనర్ను లాగారని తెలిపారు. ఫిర్యాదుదారు చెబుతున్న వేధింపులతో పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెక్షన్ 498ఏ ప్రకారం భర్త, ఆయన బంధువులపై మాత్రమే వేధింపుల కేసు పెట్టేందుకు అవకాశం ఉంటుందని, అయితే పిటిషనర్ ఏ రకంగానూ ఫిర్యాదుదారు భర్తకు బంధువు కాదని తెలిపారు. అందువల్ల పిటిషనర్పై పోలీసులు పెట్టిన కేసు చెల్లదని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకునేంత బలంగా పిటిషనర్ వాదనలున్నాయన్నారు. 498ఏ కింద రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
మైనర్ బాలికకు వేధింపులు; మాట వినకపోవడంతో
ఇండోర్: తన వెంటపడి వేధించొద్దని వారించినందుకు ఒక మైనర్ బాలికపై అమానుష దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని తుకోగంజ్లో చోటుచేసుకుంది. వివరాలు.. అమిత్ అనే యువకుడు కొంతకాలంగా ఒక మైనర్ బాలికకు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. బుధవారం స్కూల్ అడ్మిషన్ కోసం బాలిక ఫ్రెండ్తో కలిసి స్కూల్కు వెళ్లి తిరిగి వస్తుండడం గమనించిన అమిత్ ఆమెను వెంబడించాడు.బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమె అక్కడ గట్టిగా అరుస్తూ పారిపోయేందుకు ప్రయత్నించగా.. అమిత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె ముఖంపై పొడిచాడు. అయినా బాలిక మరోసారి ప్రతిఘటించడంతో ఆమె ముఖంపై బ్లేడ్తో గాటు పెట్టాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో సృహతప్పి పడిపోయిన బాలికను తన ఫ్రెండ్ స్థానికుల సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు అమిత్ ఇండోర్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: జూడో క్లాస్; బాలుడిని 27 సార్లు నేలకేసి కొట్టాడు -
నటి గీతాంజలికి సైబర్ వేధింపులు
-
అక్కతో బావ గొడవ..తట్టుకోలేక బావమరిది
యశవంతపుర: పెళ్లయి అత్తింటికి పంపారు. అక్కడ తరచూ అక్కను బావ వేధించడంతో ఆమె తమ్ముడు తట్టుకోలేకపోయాడు. తన అక్కను వేధిస్తున్న బావపై అతడి బావమరిది దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన కర్నాకటలోని యశవంతపురలో చోటుచేసుకుంది. మొహమ్మద్ బాబా అలియాస్ బండి బాబా యశ్వంతపురలో ఆటో డ్రైవర్గా పని చేస్తూ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్యతో తరచూ ఘర్షణ పడేవాడు. తాజాగా ఆదివారం కూడా గొడవ జరగడంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు చాంద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అక్కను వేధిస్తున్న బావ మొహమ్మద్ బాబాతో గొడవకు దిగాడు. దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా మృతుడిపై 2019లో ఒక హత్య కేసు నమోదై ఉండడం గమనార్హం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
ఛీ.. ఛీ: ప్లాస్మా కోసం సోషల్ మీడియాలో నంబర్ షేర్ చేస్తే..
ముంబై: మగవారిలో కొందరు మగానుభావులు ఉంటారు. వీరికి సమయం, సందర్భం ఇలాంటి ఏం పట్టవు. ఆడగాలి సోకితే చాలు.. చిత్తకార్తి కుక్కలా మారిపోతారు. అవతలి మనిషి పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా వారిని వేధింపులకు గురి చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ మహిళా కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం ప్లాస్మా, వెంటిలేటర్స్ కావాలి.. దాతలు ఎవరైనా సాయం చేయండని కోరుతూ.. సోషల్ మీడియాలో తన పర్సనల్ మొబైల్ నంబర్ షేర్ చేసింది. ఇంకేముంది.. మహిళ సెల్ నంబర్ దొరికడంతో కొందరు మృగాళ్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా.. లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దాంతో సదరు మహిళ ‘‘సాయం కోసం నంబర్ షేర్ చేసాను.. ఇలాంటి సమయంలో కూడా ఆడవారిని ఏడిపించే ప్రబుద్ధులు.. మెడికల్ ఎమర్జెన్సీలో కూడా కేవలం జననేంద్రియాలతో ఆలోచించే దరిద్రులు ఉంటారని అస్సలు అనుకోలేదు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు తమ నంబర్ను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు’’ అంటుంది బాధితురాలు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన శస్వతి శివ అనే యువతి కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. వారి చికిత్సలో భాగంగా ప్లాస్మా, వెంటిలేటర్స్ అవసరం అయ్యాయి. దాంతో తనకు తెలిసిన వారందరికి కాల్ చేసి సాయం చేయమని అడిగింది. కానీ లాభం లేకపోయింది. లేట్ చేసిన కొద్ది కోవిడ్ బారిన పడిన వారికి ప్రమాదం. దాంతో ఆమె తన పరిస్థితిని వివరిస్తూ.. ప్లాస్మా, వెంటిలేటర్స్ కోసం అర్థిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది. దాతలు తనను సంప్రదించేందుకు వీలుగా ఆమె పర్సనల్ సెల్ నంబర్ని షేర్ చేసింది. ఇక మొదలైంది టార్చర్. ఫోన్ మోగిన ప్రతి సారి ఆమె తనకు సాయం లభిస్తుందనే ఉద్దేశంతో ఆశగా కాల్ లిఫ్ట్ చేసేది. కానీ చాలా సార్లు ఆమెకు నిరాశే ఎదురయ్యింది. ఆమెకు కాల్ చేసిన వారు అందరూ మగవారు. వారిలో చాలా మంది ‘‘మీరు ఎక్కడ ఉంటున్నారు’’.. ‘‘మీరు సింగిలా’’.. ‘‘నేను మీకు సాయం చేస్తాను కానీ నాతో డేట్కి వస్తారా’’.. ‘‘మీ డీపీ చాలా బాగుంది’’ వంటి చెత్తంతా వాగేవారు. ఇక మరి కొందరు ప్రబుద్ధులు మరో అడుగు ముందుకు వేసి.. వీడియో కాల్ చేయడం.. మార్ఫడ్ ఫోటోలు పంపడం చేశారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె ఫోటో కొన్ని అశ్లీల వెబ్సైట్లలో ప్రత్యక్షం అయ్యింది. ఏడుగురు వ్యక్తులు అయితే ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఆమెకు వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు. జరిగిన సంఘటనలు చూసి ఆమెకు చిరాకెత్తింది. సాయం చేయమని కోరుతూ నంబర్ షేర్ చేస్తే.. ఇతంటి భయానక అనుభవం ఎదురయ్యింది అంటూ వాపోయింది. దాంతో శస్వతి శివ ట్విట్టర్ ద్వారా తన బాధను వెల్లడించారు. తను ఎదర్కొన్న అనుభవాలను చెప్తూ.. ‘‘మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో కూడా చాలా మంది మగవారు కేవలం తమ జననేంద్రియాలతో మాత్రమే ఆలోచిస్తారని.. పరిస్థితితో సంబంధం లేకుండా ఆడవారిని వేధిస్తారని ఈ ఘటనతో నాకు బాగా అర్థం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వ్యక్తిగత నంబర్ను సోషల్ మీడియాలో షేర్ చేయకండి’’ అంటూ ట్వీట్ చేశారు. I thought it wouldn't get worse, but since this morning, I've received (on whatsapp) 3 dick pics, and 7 men trying to video call me continuously. Even in a medical emergency, men think only with their genitals. Women: NEVER, EVER let your number out in public forums. https://t.co/CAJJKiQmR6 — Shasvathi Siva (@shasvathi) April 16, 2021 చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది’ -
బంజారాహిల్స్: ప్రేమిస్తావా.. చస్తావా.. చావాలా.. !
బంజారాహిల్స్: ప్రేమిస్తావా.. లేదంటే చస్తావా.. నేనే చావాలా.. అంటూ ఓ యువకుడు వెంటపడి వేధిస్తున్నాడని ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్లో నివసించే ఓ యువతి(24) ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఇదే ప్రాంతానికి చెందిన గణేష్ అలియాస్ చింటు నిత్యం ఆఫీస్కు వెళ్లే సమయంలో ఆమె వెంటపడి అడ్డగిస్తూ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె పని చేస్తున్న చోటుకు వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తరచూ తన ఇంటికి వచ్చి ప్రేమిస్తావా లేదా అని డిమాండ్ చేయడమే కాకుండా ఆఫీస్లో అందరి ముందే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె ఫోన్ను కూడా ట్రాప్ చేసి సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు గణేష్పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కొత్త ట్విస్ట్: వదినా..మరిది..కొడుకు.. ఓ క్రైం కథ) -
‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా’
సాక్షి, హైదరాబాద్: గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ చేసి వివాహితతో అసభ్యంగా మాట్లాడటమే కాక.. వేరే వారికి ఆమె నంబర్ ఇచ్చి వేధింపులకు గురి చేస్తోన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాలు.. ఆదిభట్ల మున్సిపాలిటిలోని పటేల్ గూడకు చెందిన గడుసు నరసింహ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడు. వేర్వేరు నంబర్ల నుంచి ఆమెకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ‘‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా’’ అంటూ అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ.. వేధింపులకు గురి చేసేవాడు. అంతటితో ఊరుకోక ఇతరులకు వివాహిత నంబర్ ఇచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన సదరు మహిళ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి నిందితుడిని నరసింహంగగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నరసింహంతో పాటు అతడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. మరో షాకింగ్ అంశం ఏంటంటే నరసింహం గత జూలైలో అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికి అతడు తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. చదవండి: కి‘లేడీ’: ఎస్సైలనే బ్లాక్మెయిల్ చేస్తూ.. -
యువతిని కాళ్లు, చేతులు కట్టేసి..
-
ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు
-
ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు
సాక్షి, మేడ్చల్ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని మాట్లాడదామని పిలిచి చిత్రహింసలు పెట్టారు ముగ్గురు వ్యక్తులు. ఈ సంఘటన మేడ్చల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఈసీ నగర్కు చెందిన లింగాస్వామి అనే వ్యక్తి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగాస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు లింగాస్వామిని మాట్లాడదామని కారులో తీసుకెళ్లారు. చర్లపల్లి ఈసీ నగర్లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లింగా స్వామి నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు. ఆ రాత్రి మొత్తం కారులో తిప్పి బాగా కొట్టి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావటంతో బాధితుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. చదవండి : నిందితుడి ఆత్మహత్య.. ఎస్ఐ సస్పెన్షన్ భార్య ఫిర్యాదు, ఆందోళనతో భర్త ఆత్మహత్యాయత్నం -
వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్
హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగా తనను సోషల్ మీడియాలో వేధింపులు చేస్తున్నారని.. ఓ వర్గం వారు వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్యకర పోస్టులు చేస్తున్నారని సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కమిషనర్ సజ్జనార్ను కలిసి లిఖిపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది. నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాలు చేసిన మాధవీలత కొన్నేళ్ల కిందట బీజేపీలో చేరింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. అయితే ఇటీవల ఆమెను సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఓ వర్గం తనను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు చేస్తున్నారని తెలిపింది. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితో అందులో తాను ఉన్నానని లేనిపోనివి కథనాలు సృష్టిస్తున్నారని చెప్పింది. దీనిపై ఇన్నాళ్లు సోషల్ మీడియాలో పోరాటం చేశానని.. ఇకపై మీరు చూసుకోవాలని కమిషనర్ను మాధవీలత కోరింది. ఈ తప్పుడు ప్రచారం తనను మానసికంగా కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె విజ్ఞప్తి చేసింది. Met @cyberabadpolice Commissioner Sajjanar sir and gave a written complaint against abuse and character assassination on social media. This time not just a complaint very soon all those who are abusing me will be booked as per law. pic.twitter.com/2S1tisQ39x — MADHAVI LATHA (@actressmadhavi) February 4, 2021 -
అనుమానాస్పదంగా పంచాయతీ కార్యదర్శి మృతి
సాక్షి, మల్యాల(చొప్పదండి): పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మండలంలోని గొర్రెగుండం జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కోమలత(29) ఆదివారం అర్ధరాత్రి రామన్నపేట గ్రామంలోని అత్తగారింట్లో లాట్రిన్ గదిలో కాలిపోయి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం గొడిశెలపేటకు చెందిన కోమలతకు నాలుగేళ్లక్రితం మల్యాల మండలం రామన్నపేటకు చెందిన కొండ గణేశ్తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కొడుకు హిమాన్షు ఉన్నాడు. వివాహ సమయంలో గణేశ్కు రూ.6 లక్షల కట్నం ఇచ్చారు. అయితే మరో రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంతో వచ్చే వేతనం తన సొంతానికి వినియోగించుకుంటున్నాడు. ఇటీవలే కోమలత సోషియాలజీలో పీహెచ్డీ ఫెలోషిప్కు ఎంపిక కాగా, మార్చి నుంచి ఫెలోషిప్ కోసం వచ్చే రూ. 40వేలు కూడా తనకే ఇవ్వాలంటూ, అదనపు కట్నం కావాలంటూ వేధించేవాడు. ఆదివారం అర్ధరాత్రి సైతం తనను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులతో కోమలత మొరపెట్టుకుంది. సోమవారం ఉదయం వస్తామని, గొడవపడొద్దంటూ కుటుంబ సభ్యులు సర్ధిచెప్పారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అర్ధరాత్రి సమయంలో తమ కూతురును హత్య చేసి, కాల్చివేశాడంటూ ఆరోపించారు. మృతికి కారణమైనవారు వచ్చే వరకు శవాన్ని తరలించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో ఎస్సై నాగరాజు మాట్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిశోర్, ఎంపీడీఓ శైలాజరాణి సందర్శించారు. తమ కూతురు మృతికి భర్త గణేశ్, అత్త శారద, ఆడబిడ్డలు రజని, లావణ్యలే కారణమంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
‘నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలా ఉంది’
ముంబై : ఓ ఉద్యోగిని వేషధారణను అవహేళన చేస్తూ వేధింపులకు పాల్పడిందో మహిళ. హిజ్రాలా ఉన్నావంటూ వెక్కిరిస్తూ ఇబ్బందులకు గురిచేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 36 ఏళ్ల ఓ మహిళ గోరెగావ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తోంది. 2020 డిసెంబర్లో అదే ప్రాంతలోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగింది. ఆ అపార్ట్మెంట్లో నివాసముండే 56 ఏళ్ల మహిళకు ఉద్యోగినికి మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు మహిళ ‘పొట్టి జుట్టు, బట్టలు.. హిజ్రాలా ఉన్నావ్’ అంటూ ఉద్యోగినిపై వేధింపులకు దిగేది. దీంతో సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై వేధింపులకు పాల్పడుతున్న మహిళపై ఫిర్యాదు చేసింది. దీనిపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు తన ఫిర్యాదులో ‘‘ నేను అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి వచ్చిన కొత్తలో సదరు మహిళ దగ్గరే టిఫిన్ కొనుక్కునేదాన్ని. రుచిగా వండకపోవటంతో ఆమె దగ్గర తినటం మానేశాను. తర్వాత ఆమె కుమారుడితోనూ చిన్న వాగ్వివాదం అయింది. ఆ రోజునుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. అప్పటినుంచి నన్ను వేధించటం మొదలుపెట్టింది. ‘‘ నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలాగా ఉంది’’ అంటూ నీచంగా మాట్లాడేది. నేను ఓ నెల రోజుల పాటు దీన్నంతా భరించాను. ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి నన్ను బూతులు తిట్టేది. స్నేహితుల ముందు అవమానించేది’’ అని పేర్కొంది. -
అర్ధరాత్రి యువతిపై అమానుషం!
జయపురం: ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా.. అదే సమయంలో 18ఏళ్ల ఆదివాసీ యువతిపై అత్యాచారం జరిపి, అనంతరం మారణాయుధాలతో దాడి జరిపారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవరంగపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఈ అమానుష ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా గుడుపుతుండగా నవరంగపూర్కు 15 కిలోమీటర్ల దూరంలోని తెంతులికుంఠి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరి కంటే ఎక్కువమంది యువకులు ఆమెపై దాడి జరిపి, సామూహికంగా అత్యాచారం జరిపి తీవ్రంగా గాయపరిచినట్లు అనుమానిస్తున్నారు. బాధితురాలు తీవ్రంగా గాయపడి గ్రామం సమీపంలోని జీడితోటలో సృహతప్పి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది గ్రామస్తులు మలవిసర్జన వెళ్లగా.. యువతి పరిస్థితిని గమనించి, బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. అనంతరం యువతిని నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సైగలే.. సంకేతం? ఇదిలా ఉండగా... బాధితురాలి తలపై తీవ్రంగా గాయమైంది. ఏదో ఆయుధతో తలపై గట్టిగా కొట్టడంతో ఈ విధంగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటం వల్ల వివరాలు తెలియ రావడం లేదు. దీనిపై ఆమె తల్లిని ప్రశ్నించగా.. యువతి రెండు చేతి వేలు చూపించడం తప్ప, ఏమీ చెప్పలేకపోతోందని కన్నీటి పర్యంతమైంది. దాడిలో ఇద్దరు యువకులు ఉన్నట్లు సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా..ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు నవరంగపూర్ పోలీసులు బాధితురాలిని కలిసి, వివరాలను సేకరించేందుకు ప్రయ త్నించారు. యువతి కోలుకునే వరకు వివరాల కోసం వేచి ఉండక తప్పదని పోలీసు అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. -
'డబ్బు కోసమే బాబర్ను బ్లాక్మెయిల్ చేస్తుంది'
కరాచీ : నాలుగు వారాల క్రితం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ తనను లైంగికంగా వేధించాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ హమీజా ముక్తర్ అనే మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె బాబర్ అజమ్పై సంచలను ఆరోపణలు చేసింది. ఇదే విషయమై ఆమె బాబర్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బాబర్పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్కు దిగింది. ఇదే విషయమై బాబర్ తనకు భరణం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హమీజా పిటిషన్పై గురువారం సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. బాబర్ తరపు లాయర్ మాట్లాడుతూ.. హమీజ్.. బాబర్పై అనవసర ఆరోపణలు చేస్తుంది.. కేవలం డబ్బు కోసమే ఈ నాటకమాడుతుందని, ఒక్కపైసా కూడా చెల్లించేది లేదని కోర్టుకు తెలిపారు. బాబర్ అజమ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడంపై తమవద్ద ఆధారాలు ఉన్నాయని హమీజా తరపు లాయర్ కోర్టుకు స్పష్టం చేశాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు అన్ని అంశాలు పరిశీలిస్తామని తెలిపి కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది. ('బాబర్ అజమ్ నన్ను నమ్మించి మోసం చేశాడు') కాగా హమీజా గతంలో చేసిన వ్యాఖ్యలు పాక్ మీడియాలో సంచలనంగా మారాయి. 'బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. బాబర్పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని పేర్కొంది. బాబర్ అజబ్ ఇటీవలే పాకిస్తాన్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పాక్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే వేలి గాయంతో బాబర్ అజబ్ టీ20 సిరీస్కు దూరమయ్యాడు. తాజాగా డిసెంబర్ 26 నుంచి పాక్, న్యూజిలాండ్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. అయితే బాబర్ గాయం తీవ్రత అలాగే ఉండడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ పాక్ జట్టకు నాయకత్వం వహించనున్నాడు. కాగా మూడు టీ20ల సిరీస్ను కివీస్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసకుంది. -
తరచూ ఫోన్ చేసి భార్యను వేధిస్తున్నాడని..
సాక్షి, విజయవాడ : విజయవాడలోని పటమట స్టెల్లా కాలేజీ సమీపంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తన భార్యకు ఫోన్ చేసి తరచుగా వేధిస్తున్న వ్యక్తిని భర్త కత్తితో పొడిచాడు. వివరాలు.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆ మహిళ తన భర్త సిద్దుల రవిపాల్కు విషయాన్ని తెలిపింది. రవిపాల్ తన భార్యతో పిచ్చయ్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. అనంతరం రవిపాల్ కత్తితో పిచ్చయను పలుమార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పిచ్చయ్యను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడ్డ రవిపాల్పై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. (చదవండి : ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య) -
కమలం పార్టీ.. రచ్చ రచ్చ
సాక్షి, కరీంనగర్: ‘నా దగ్గర వీడియోలు, ఆడియోలు ఉన్నయని జూలై 12న ఓ పోలీస్స్టేషన్లో కేసు పెట్టిండు. ఇన్స్పెక్టర్ సార్ దగ్గరకు నన్ను పిలిపించి నా ఫోన్ కూడ ఫార్మాట్ చేయించిండు. ఇంకో ఫోన్ గుంజుకున్నడు’ ‘ఏసీపీ సార్ దగ్గరికి నేనే వెళ్లిన. గీ వీడియో ఉంది.. నన్ను ఇబ్బంది పెడుతున్నరు అని పోతే నాకు 5లక్షలు ఇస్త. ఒక ఫోన్ కొనిస్త అని చెప్పిండు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నయి’ బీజేపీ కరీంనగర్ జిల్లా ‘బాస’యిన ఓ వ్యక్తితో తన వ్యక్తిగత సంబంధాల గురించి ఓ మహిళా కార్యకర్త మీడియాలో చెప్పిన మాటలు ఇవి. రాజకీయ నాయకుల వ్యక్తిగత సంబంధాల వ్యవహారం సాధారణ ప్రజానీకానికి అవసరం లేకపోయినా.. ఆర్థికపరమైన సెటిల్మెంట్లలో పోలీసుల ప్రమేయం గురించి సదరు మహిళ వివరించిన తీరు చర్చనీయాంశమైంది. పార్టీ జిల్లా బాస్కు, మహిళకు చెడిన వ్యవహారంలో పోలీస్స్టేషన్, ఏసీపీల వద్దకు వెళితే... ఆర్థిక పరమైన సెటిల్మెంట్తో సమస్యను పరిష్కారం చేసుకోమని సూచించినట్లు లీకైన ఆడియో టేపులతోపాటు కొన్ని టీవీ ఛానెళ్ల ‘లైవ్’ టెలికాస్ట్ల ద్వారా స్పష్టమవుతోంది. దీనిపై పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్రెడ్డి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సమాచారం తెప్పించుకున్నట్లు సమాచారం. ప్రైవేటు వ్యవహారంలో పోలీసు అధికారులు తలదూర్చినట్లు మహిళ చెప్పిన మాటల్లో నిజమెంత..? ఒకవేళ నిజమైతే ఎవరి ప్రోద్బలంతో జోక్యం చేసుకున్నారనే దానిపై వివరణ కోరినట్లు తెలిసింది. మసక బారిన పార్టీ నాయకుల నైతికత క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకొనే బీజేపీలో పనిచేసే కొందరు వ్యక్తుల నైతికతను దెబ్బతీసేలా సదరు మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు పార్టీ నేతలకు ఇబ్బందిగా తయారైంది. కరీంనగర్ పట్టణానికి చెందిన ముగ్గురు లీడర్ల పేర్లు చెబుతూ వారు సాగించిన వ్యవహారాలను బహిర్గతం చేయడంతో పార్టీలోని నేతలంతా తల పట్టుకుంటున్నారు. ఓ వైపు పార్టీ పిలుపిచ్చిన ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే.. పార్టీ నాయకుని వ్యక్తిగత వ్యవహారం రచ్చరచ్చగా మారి పార్టీ ప్రతిష్టకే ముప్పుగా పరిణమించడంతో నేతలకు ఏం చేయాలో తోచని పరిస్థితి. సదరు మహిళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పైన విమర్శలకు దిగడాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయినా పార్టీ నైతికతకు ఇబ్బందిగా పరిణమించడంతో ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుండిపోతున్నారు. ఢిల్లీ నుంచి సమీక్షిస్తున్న బండి సంజయ్ తన సొంత జిల్లా కరీంనగర్లో చోటు చేసుకున్న పరిణామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఢిల్లీ నుంచే సమీక్షిస్తున్నారు. పార్టీ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనాలని సూచించారు. కాగా పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణలపై కూడా ఆయన దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. -
జీతం అడిగితే.. అశ్లీల వీడియోలు
మీరట్ : యూపీలోని మీరట్లో స్కూల్ యాజమాన్యం వికృత చర్యలు ఆలస్యంగా వెలుగుచూశాయి. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన మహిళా ఉపాధ్యాయులను వేధించడమే గాక టాయిలెట్స్లో రహస్యంగా స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయటపడింది. వివరాలు.. మీరట్లోని సర్ధార్ బజార్లో రిషబ్ అకాడమీ స్కూల్ నడుపుతున్నారు. లాక్డౌన్ ఉండడంతో పాఠశాలను మూసివేశారు. దీంతో ఆ స్కూల్లో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు అందాల్సిన జీతాలను ఇవ్వాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల సెక్రటరీగా ఉన్న రంజీత్ జైన్ అతని కొడుకు అభినవ్ జైన్లు జీతాలు ఇవ్వకుండా వేధించడమే గాక మహిళల టాయిలెట్ రూంలో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చినట్లు తేలింది.(చదవండి : విషాదం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) జీతాలు అడగానికి వచ్చిన సదరు మహిళా ఉపాధ్యాయులకు వారి వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు తెలిసింది. దీంతో పాఠశాల గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు అక్కడినుంచి మీరట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి రంజిత్, అభినవ్లపై ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తండ్రీ, కొడుకులు తమకు తెలియకుండా తీసిన రహస్య వీడియోలను చూపించి చనువుగా ఉండాలంటూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని ఒక మహిళ ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము వారికి లొంగకపోతే చేతబడి చేయించి మమ్మల్ని చంపేందుకు కూడా వెనకాడమని బెదిరించారంటూ మరికొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. (చదవండి : ప్రణయ్ని చంపినట్లు చంపుతామని..) -
బాలింతను బలి తీసుకున్నారు
జైపూర్ (చెన్నూర్): భూతవైద్యం పేరిట చిత్రహింసలకు గురైన బాలింత చివరకు మృతి చెందింది. దెయ్యం పట్టిందని భూతవైద్యుడు ఆమెను తీవ్రంగా కొట్టడంతో కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచింది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రజితను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం రజిత పండంటి పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మల్లేశ్ కట్నం కోసం రజితను వేధించడం మొదలు పెట్టాడు. అతడికి కుటుంబసభ్యులు కూడా జత కలిశారు. ఎలాగైనా రజితను వదిలించుకోవాలని పథకం రచించారు. రజితను దెయ్యం ఆవహించిందని, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంతటితో ఆగక ఓ భూతవైద్యుడిని పిలిపించి మరీ చిత్రహింసలు పెట్టించారు. దెబ్బలు తాళలేక రజిత మంచంపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోమాలోకి వెళ్లిన ఆమెను ఈ నెల ఒకటిన కరీంనగర్లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న రజిత.. సోమవారం అర్ధరాత్రి కన్నుమూసింది. దీంతో తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన ఆ పసిపాప 3 నెలలకే అనాథగా మారింది. తల్లిపాల కోసం ఆ పసి హృదయం ఏడుస్తున్న సంఘటనను చూసి స్థానికుల గుండె తరుక్కుపోతోంది. -
చంద్రదండు అధ్యక్షుడిపై వేధింపుల కేసు
-
మహిళా ఎస్ఐ వేధింపులు
సాక్షి, అమరావతి బ్యూరో/గన్నవరం: పోలీస్ స్టేషన్కు పిలిచి మందలించారనే మనస్తాపంతో కృష్ణా జిల్లాలో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరంలోని సొసైటీపేటలో నివసించే చిట్టూరి మురళి (21) తండ్రి చనిపోవడంతో తల్లితో కలసి టీస్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విజయవాడలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మురళి ఆదివారం సాయంత్రం స్కూటీపై రాంగ్రూట్లో వెళ్తుండగా పాత స్టేట్బ్యాంక్ ఎదుట భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న గన్నవరం మహిళా ఎస్ఐ పి.నారాయణమ్మ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ విషయమై ఎస్ఐ అతడిని మందలించడంతోపాటు పోలీస్స్టేషన్కు రప్పించారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మురళి ఇంటికి వెళ్లి భోజనం చేశాక ఇప్పుడే వస్తానంటూ తల్లికి చెప్పి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఎస్ఐ నారాయణమ్మ తనను మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారని, తన చావుకు ఆమే కారణమంటూ అనంతరం కొద్దిసేపటికి తన మిత్రులకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పంపించాడు. సోమవారం మధ్యాహ్నం గన్నవరం కొనాయి చెరువు సమీపంలో మురళి స్కూటీ, పాదరక్షలను గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృత దేహాన్ని వెలికి తీశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్నారు. జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన మురళి తన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కనీస మర్యాద లేకుండా వ్యవహరించాడని మహిళా ఎస్ఐ నారాయణమ్మ పేర్కొన్నారు. దీనిపై సీఐకి సమాచారం ఇచ్చి స్టేషన్కు పిలిచి మందలించామన్నారు. -
సాక్షాత్తూ ఆఫీసులోనే.. మహిళా ఐఏఎస్ సంచలన ట్వీట్
న్యూఢిల్లీ: తన సొంత కార్యాలయంలోనే పురుషుల నుంచి అసభ్య ప్రవర్తనను ఎదుర్కొన్నానని ఓ ఐఏఎస్ అధికారిణి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చాంబర్లోని పురుషులు తనపట్ల అనుచితంగా వ్యవహరించారని, పరిధికి మించి ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయిన వర్షా జోషీ ఈమేరకు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఆకతాయిల నుంచి మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, ఎగతాళి వ్యాఖ్యల గురించి ఓ మహిళ ట్విటర్ వేదికగా వర్షా జోషి దృష్టికి తీసుకొచ్చారు. ‘ఈ వీధి గుండా వెళ్లడం ఏ మహిళకైనా చాలా కష్టం. ఇక్కడ కూచున్న పురుషులు రోజంతా అదే పనిగా మహిళలను చూస్తూ.. హుక్కా పీలుస్తూ.. పేకాట ఆడుతూ ఉంటారు. దీని గురించి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయమై దయచేసి చర్య తీసుకోండి’ అని ఓ మహిళ వర్షా జోషిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నిజానికి పోలీసులు చర్య తీసుకోవాల్సిన అంశమే కానీ. ఉత్తర భారతమంతా నిరంతరం మహిళలు ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. నా ఆఫీస్ చాంబర్లోనే నేను అసభ్య ప్రవర్తనను ఎదుర్కొన్నాను. పురుషులు తమ పరిధికి మించి ప్రవర్తించారు. వారు ఏం చేస్తున్నదీ వారికి అర్థం కావడం లేదు. దీనికి పరిష్కారాలు ఏమున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. మహిళలు పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న వేధింపులను చాటుతున్న ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్పై స్పందించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జయప్రకాశ్.. ఈ విషయమై వర్షా జోషితో మాట్లాడి.. ఆమె ఎందుకు ఇలా ట్వీట్ చేయాల్సి వచ్చిందో వాకబు చేస్తానని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మహిళలకు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
క్రూర వాంఛ తీర్చనందుకు.. ఆర్నెళ్ల జైలు
‘ఒక మహిళగా... కాదు కాదు ఒక మనిషిగా నేను రక్షింపబడాలి. కానీ ఈరోజు బాధితురాలినైన నేను దోషిగా ప్రపంచం ముందు నిలుచున్నాను. ఇంతటి అన్యాయం ఎక్కడైనా ఉంటుందా. నిజానికి వేధింపబడిన వారిని శరణార్థులుగా స్వీకరించే చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇండోనేషియాకు చెందిన ఓ మహిళా లైబ్రేరియన్. లైంగిక వేధింపులకు గురైనందుకు ఇప్పటికే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆమె.. మరో ఆరు నెలల పాటు బంధీఖానాలో ఉండబోతున్నారు. అవును... వేధింపులకు గురైనందుకే ఆమెకు కారాగారవాసం. నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇదే వాస్తవం. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఈ తీర్పునిచ్చింది.. అదే విధంగా జరిమానా రూపంలో అక్షరాలా 35వేల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అలా జరగని పక్షంలో శిక్షను పొడగించాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. బాధితురాలే దోషిగా మారిన ఈ విచిత్ర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఆ బాధితురాలి(దోషిగా పేర్కొనేందుకు మనస్కరించనందున) పేరు నురిల్ మక్నున్. వయస్సు 41 సంవత్సరాలు. ఇండోనేషియాలోని లంబోక్ ద్వీపంలో ఉన్న ఓ ఉన్నత పాఠశాలలో లైబ్రేరియన్గా పనిచేసేవారు.అయితే ఉద్యోగం చేస్తూ...కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటున్నానన్న సంతోషం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు. తాను పనిచేస్తున్న పాఠశాల హెడ్మాస్టర్ రూపంలో ఉపద్రవం ముంచుకొచ్చింది. సహోద్యోగి అయిన నురిల్తో అతడు నెమ్మదిగా పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచుగా ఫోన్ చేసి వృత్తికి సంబంధించిన విషయాలను ఆమెతో చర్చించేవాడు. కానీ కొన్నాళ్ల తర్వాత అతడిలో దాగున్న కామప్రకోపం నిద్రలేచింది. ఈ క్రమంలో ఓరోజు నురిల్కు ఫోన్ చేసి.. తన పడకగదిలో జరిగే విషయాలను ఆమెతో చర్చించసాగాడు. ఊహించని పరిమాణానికి కంగుతిన్న ఆమె ఒక్కసారిగా ఫోన్ కట్ చేసి.. ఇక అతడితో మాట్లాడటం మానేసింది. ఇంతటితో సమస్య ముగుస్తుందనుకుంది. కానీ ఆ కామాంధుడు నురిల్ను వదిలిపెట్టలేదు. వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్ చేస్తూ జుగుప్సాకర విషయాలు చెబుతూనే...తనతో సంబంధం పెట్టుకోవాలంటూ పశువులా మాట్లాడేవాడు. తన క్రూర వాంఛ తీర్చాలంటూ ఎంతగా బతిమిలాడినా నూరిల్ కరగకపోవడంతో ఆమె పరువు తీయాలని భావించాడు. ఈ క్రమంలో నురిల్తో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లుగా స్కూల్ మొత్తం ప్రచారం చేయించాడు. దీంతో అక్కడ పనిచేసే వారంతా నురిల్ను ఓ వ్యక్తిత్వం లేని మహిళగా చూడటం మొదలుపెట్టారు. మనోవేదనను తట్టుకోలేని నురిల్ ఎలాగైనా తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా అతడి ఫోన్లకు స్పందించడం మొదలుపెట్టింది. ఫోన్ చేసిన ప్రతీసారి ఆ మృగాడి మాటలు వింటున్నట్టుగా నటిస్తూ... కాల్స్ రికార్డు చేసింది. అయితే అదే తన పాలిట శాపమవుతుందని నురిల్ ఊహించలేకపోయింది. నా ‘పరువు’ తీస్తావా?! తనపై హెడ్మాస్టర్ వేసిన నిందలు చెరిపేసేకునే క్రమంలో కాల్ రికార్డులను తన భర్తతో పాటుగా సహోద్యోగులకు కూడా వినిపించింది నురిల్. ఈ విషయం ఈనోటా ఆనోటా పాకి చివరికి ఆ మృగాడి చెంతకు చేరింది. దీంతో తాను పెద్ద మనిషిని, ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాననే విషయం స్ఫురణకు వచ్చి తనకున్న పరువు గురించి బెంబెలెత్తిపోయాడు. అంతేకాదు నురిల్ను మరోసారి ఇబ్బందుల పాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరో టీచర్తో కలిసి కుట్ర పన్ని.. ఆమెపై పరువునష్టం దావా వేశాడు. తనవి కాని మాటలు తనకు ఆపాదిస్తూ.. అసభ్యతను వ్యాప్తి చేస్తుందంటూ ఆమెపై ఫిర్యాదు చేశాడు. నురిల్కు ఆర్నెళ్ల జైలు.. జరిమానా 2012లో మొదలైన వేధింపుల ఘటనకు సంబంధించిన ఈ కేసులో నురిల్ను దోషిగా తేలుస్తూ శుక్రవారం ఇండోనేషియా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో గతంలో ఇప్పటికే నెలరోజుల పాటు శిక్ష అనుభవించిన నురిల్కు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించడంతో పాటుగా.. 35 వేల డాలర్లు జరిమానా వేసింది. బాధితురాలినైన తనను దోషిగా తేల్చవద్దని.. తన ఫోన్లోని రికార్డింగ్స్ను డౌన్లోడ్ చేసుకున్న మరో టీచర్ వాటిని సర్క్యులేట్ చేశారు కాబట్టి... తీర్పును సమీక్షించాలన్న ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. తీర్పు ప్రకారం జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల పాటు శిక్ష పొడిగించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ తీర్పు గురించి నురిల్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘తనను తాను రక్షించుకోవడానికి నురిల్ చేసిన ప్రయత్నం ఆమెను దోషిని చేసింది. హెడ్మాస్టర్ ఎదుర్కొన్న అవమానం ముందు నా క్లైంట్కు ఎదురైన వేధింపులు చాలా చిన్నవిగా మారిపోయాయి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పుల కారణంగా లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులనే నిందితులుగా చిత్రీకరించేందుకు ఊతం దొరుకుతుందంటూ లీగల్ ఎయిడ్ ఫౌండేషన్ ఫర్ ప్రెస్ హెడ్ ఆడే వహీయుద్దీన్ అభిప్రాయపడ్డారు. క్షమాభిక్ష పెట్టేందుకు సిద్ధం.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నురిల్కు జరిగిన అన్యాయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మానవ, మహిళా హక్కుల సంఘాలు ఈ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మాట్లాడుతూ...‘ ఈ కేసును నేను సునిశితంగా పరిశీలిస్తున్నాను. ఒకవేళ నురిల్కు న్యాయం జరగకపోయినట్లయితే తను క్షమాభిక్ష కోరవచ్చని గతంలో సూచించాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. నాకున్న అధికార పరిమితులకు లోబడి నా వంతు కర్తవ్యం నెరవేరుస్తా’ అని పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై నురిల్ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లైంట్ క్షమాభిక్ష కోరినట్లైతే తప్పు చేసిందని ఒప్పుకొన్నట్లే అవుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయలో విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపి... సమాన హక్కులు కల్పించాలంటూ ఆ దేశ మహిళలు నిరసనలు చేపట్టి రెండు నెలలు కూడా తిరగకముందే ఇండోనేషియాలో ఇలాంటి తీర్పు రావడం బాధించే విషయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూవారీ ఘటనలను పరిశీలిస్తే నిజానికి కేవలం నురిల్ ఒక్కరికి మాత్రమే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం లేదనే విషయం స్పష్టమవుతోంది. బాధితురాలిని నిందితురాలిగా చిత్రీకరించడం సమాజానికి పరిపాటిగా మారినా.. కోర్టుల్లోనైనా వారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ ఉండేది. అయితే నూరిల్ విషయంలో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక మన దేశంలో ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలతో కోర్టు మెట్లెక్కిన బాధిత మహిళ పరిస్థితి ఎలా ఉందో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ పూర్తిగా చదివితే అర్థమవుతుంది. పితృస్వామ్య వ్యవస్థలో ఓ మహిళ వ్యక్తిత్వాన్ని ఎంత హేయంగా చిత్రీకరించవచ్చో ఆ డాక్యుమెంట్ కళ్లకు కడుతుంది. అంతేకాదు బాధితురాలు.. క్యారెక్టర్లేని మనిషిగా ఎలా నిరూపించబడుతుందో తేటతెల్లం చేస్తుంది. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ (ది న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో) -
ఇండస్ట్రీ ధోరణి మారాలి
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీలను కేవలం గ్లామర్ వస్తువుల్లా మాత్రమే చూస్తారు. కానీ దానికి మించి ఇంకా చాలా ఉంటుంది స్త్రీలలో’’ అన్నారు సమీరా రెడ్డి. ఇండస్ట్రీలో స్త్రీలను ట్రీట్ చేసే విధానం, స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం గురించి ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మారాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది స్త్రీల నుంచి ఎక్స్పెక్ట్ చేయడమే. చాలా సందర్భాల్లో నన్ను అభ్యంతరకరంగా అప్రోచ్ అయ్యారు కూడా. స్త్రీలను కేవలం గ్లామర్ కోసమే అనేట్టుగా చూడటం మానేయాలి. ఇండస్ట్రీలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఒకేలాంటి గౌరవం ఉండదు. ఒకవేళ ఇండస్ట్రీలో ఏదైనా మార్చాలనుకుంటే అది ఇదే అని కోరుకుంటాను. ప్రస్తుతం ఇండస్ట్రీ ఆ విధంగానే అడుగులేస్తోంది అనుకుంటున్నాను. చాలా చిన్న చిన్న అడుగులు. బేబీ స్టెప్స్లాగా’’ అని పేర్కొన్నారు. ‘అసభ్యకరంగా అప్రోచ్ అయ్యారు’ అని పేర్కొనడం వెనక కారణం క్యాస్టింగ్ కౌచ్కు సంబంధించిందా? లేద సెక్సువల్ హెరాస్మెంటా? అన్నది క్లారిటీగా చెప్పలేదు సమీర. -
క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు అండగా..
సాక్షి, హైదరాబాద్ : క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టాలీవుడ్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునే కమిటీని నియమిస్తూ బుధవారం జీవో నంబర్ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మి సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సుధాకర్ రెడ్డిని కూడా కమిటీ సభ్యులుగా నియమించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు ఫిర్యాదు చేయవచ్చు. ప్యానెల్ సభ్యులు మాట్లాడుతూ... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కాగా క్యాస్టింగ్ కౌచ్కు వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. -
6నెలలుగా తిరుగుతున్నా.. కోర్కె తీరుస్తావా.. లేదా?
తిరుపతి క్రైం: యువతిపై సస్పెన్షన్లో ఉన్న నగరి మున్సిపల్ మాజీ కమిషనర్ శనివారం దాడి చేశాడు. ప్రయాణికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి నగరంలో నివాసముంటున్న ఓ యువతి పుత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఆమె తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటోంది. ఆరు నెలలుగా యువతిని నగరి మున్సిపాలిటీ మాజీ కమిషనర్ బాలాజీ యాదవ్ తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది. బాలాజీ యాదవ్ అక్కడికి చేరుకుని ఆమెను అడ్డగించాడు. ‘ఆరు నెలలుగా నీ వెంట తిరుగుతున్నాను. నా కోర్కెను తీరుస్తావా.. లేదా?’ అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆమె మాట్లాడకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికులు ప్రశ్నించడంతో తిరగబడ్డాడు. ప్రయాణికులు అతనికి దేహశుద్ధి చేసి ఈస్టు పోలీసులకు అప్పగించారు. బాలాజీయాదవ్ నగరి మున్సిపల్ కమిషనర్గా పని చేసేవాడు. 2015లో నగరి ఎమ్మెల్యేతో గొడవపడ్డాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడడంతో సస్పెన్షన్కు గురయ్యాడు. -
మాదాపూర్లో బాలుడి పైశాచికత్వం
హైదరాబాద్: మాదాపూర్లో ఓ బాలుడి పైశాచికత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీస్తూ వికృత ఆనందం పొందుతున్నాడు. అమ్మాయిలు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా.. హాస్టల్ ప్రక్కనే ఉన్న బిల్డింగ్లో నుంచి బాలుడు ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అయితే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్ఫోన్ ఫ్లాష్ లైట్ వెలగడంతో ఓ అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తున్న విషయాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వీడియోలను తన దగ్గరే ఉంచుకున్నాడా? లేక స్నేహితులకు ఎవరికైనా పంపించాడా? అన్న అంశంపై పోలీసులు కూపీలాగుతున్నారు. బాలుడు 8వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులే సెల్ఫోన్ కొనిచ్చిట్టుగా దర్యాప్తులో తేలింది. సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు చూడటం వల్ల బాలుడి ప్రవర్తనలో మార్పు వచ్చి.. ఇలా వికృత చేష్టలకు తెగబడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
యువకుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
కోల్సిటీ(రామగుండం): యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని అంబేడ్కర్నగర్కు చెందిన నేహ(15) నానమ్మ జులేఖాబేగం వద్ద ఉంటోంది. శనివారం ఆమె నానమ్మ తో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాబాయ్ రజాక్ ఇంటికి వెళ్లింది. సాయంత్రం బాబాయ్, నానమ్మ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో నేహ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద ‘నన్ను క్షమించండి.. నేను ఏ తప్పు చేయలేదు’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన మాతంగి కిరణ్ అలియాస్ నిఖిల్ కొంతకాలంగా ప్రేమ పేరుతో నేహను వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి బాబాయ్, నానమ్మ తెలిపారు. నిం దితుడిని అరెస్ట్ చేయాలని మృతు రాలి బంధువులు, ముస్లింలు గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐలు వాసుదేవరావు, మహేందర్ జోక్యం చేసుకొని వారికి నచ్చజెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ 100 కోట్లిస్తే అలా చేస్తావా..
సాక్షి, ముంబై : బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు బ్రేక్ పడటం లేదు. పలువురు మహిళలు సాజిద్ ఖాన్ వేధింపులపై బాహాటంగా ముందుకు రాగా, తాజాగా మరో నటి అహానా కుమ్రా సాజిద్ ఆగడాలను వెల్లడించారు. సాజిద్ వ్యవహారం తెలిసినప్పటికీ గత ఏడాది తాను ఆయనను సాజిద్ నివాసంలో కలిశానని ఆమె చెప్పారు. లైట్లు లేని గదిలోకి తనను తీసుకువెళ్లగా బయట కూర్చుందామని కోరగా, అక్కడ తన తల్లి ఉన్నారని ఆమెకు అసౌకర్యం కలిగించడం తనకు ఇష్టం లేదని సాజిద్ చెప్పాడన్నారు. సాజిద్ సరిగ్గా ప్రవర్తించాలని ఆశిస్తూ తన తల్లి పోలీస్ అధికారి అని చెప్పానన్నారు. అలా చెప్పినా జుగుప్ప కలిగించేలా సంభాషణ ప్రారంభించాడని చెప్పుకొచ్చారు. తాను రూ 100 కోట్లిస్తే శునకంతో లైంగిక చర్యకు పాల్పడతారా అని సాజిద్ అడిగారన్నారు. ఆయన వేసే జుగుప్సాకర జోక్లకు తాను నవ్వాలని సాజిద్ ఆశిస్తున్నట్టు గ్రహించానన్నారు. సాజిద్పై ఇప్పటికే పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో హౌస్ఫుల్ 4 మూవీ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సాజిద్పై నటి సలోని చోప్రాతో పాటు ప్రియాంక బోస్, మందనా కరిమి, రేచల్ వైట్ వంటి పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. -
ఆలయ చైర్మన్ రాసలీలలు!
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఆయన అధికారపార్టీలో ఓ ముఖ్యనేత. పైగా శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ కమిటీకి చైర్మన్. నలుగురికి మంచి చెప్పాల్సిందిపోయి వక్రమార్గం పట్టాడు. ఓ మహిళతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆమె భర్తకు ఉద్యోగం కల్పిస్తానని నమ్మబలికి ఆ మహిళకు సంబంధించిన భూమిని అమ్మిచ్చి.. ఏకంగా రూ.మూడు లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగమైనా పెట్టించాలని, లేకుంటే తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగితే తనకు బడా నాయకులు తెలుసని, దిక్కున్న చోట చెప్పుకోమ్మంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీసులు సైతం చైర్మన్కే వత్తాసు పలుకుతూ.. ఫిర్యాదులో మార్పు చేయాలని హుకూం జారీ చేశారు. దీంతో చేసేది లేక సదరు మహిళ మీడియా ముందు తన గోడు వెల్లబోసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్గా ఎక్కటి సంజీవరెడ్డి కొనసాగుతున్నాడు. మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి కల్లు తాగేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తనకు అధికారులు, బడా నాయకులు తెలుసని పేర్కొంటూ సదరు మహిళా భర్తకు ఉద్యోగం కల్పిస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన మహిళ రెండేళ్లక్రితం వారికున్న 20 గుంటల భూమిని విక్రయించగా వచ్చిన రూ.మూడు లక్షలు సంజీవరెడ్డికి ఇచ్చింది. రెండేళ్లయినా ఉద్యోగం కల్పించకపోవడంతోపాటు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అందరికీ చెబుతానని తీవ్రంగా కొట్టాడు. ఆ సమయంలో అడ్డుగా వచ్చిన ఆమె భర్తపైనా దాడికి పాల్పడ్డాడు. తన మాట వినాలని, లేకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించాడు. ఈ విషయమై స్థానికంగా కొద్దిరోజులుగా పంచాయితీలు కూడా నడుస్తున్నట్లు సమాచారం. పట్టించుకోని పోలీసులు.. తనపై, తన భర్తపై దాడి చేశాడని పేర్కొంటూ.. సదరు మహిళా న్యాయం కోసం ఇల్లందకుంట పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కనీసం పట్టించుకోలేదు. సంజీవరెడ్డి పెద్ద హోదాలో ఉన్నాడని, ఆయనపై ఇచ్చిన ఫిర్యాదును మార్పు చేయాలంటూ ఎస్సై నరేశ్కుమార్ నాలుగు గంటలపాటు ఒత్తిడి తెచ్చారని మహిళ మీడియా ఎదుట వాపోయింది. వివాహేతర సంబంధం కాకుండా భార్యాభర్తలు కౌన్సెలింగ్ కోసం వచ్చినట్లు రాసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. ఈ విషయమై ఎస్సై నరేశ్కుమార్ను వివరణ కోరగా.. సంజీవరెడ్డి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు.. డబ్బులు కూడా ఇచ్చేది ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చిందని, పూర్తి సమాచారం తెలుసుకునేందుకే కొంత సమయం తీసుకున్నానని, ఫిర్యాదును మార్చాలని తాను మహిళపై ఒత్తిడి తేలేదని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
మహిళా ప్రొఫెసర్కు ఎన్ఆర్ఐ వేధింపులు
హైదరాబాద్ : సోషల్ మీడియా వేదికగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించినందుకు ఓ మహిళా ప్రొఫెసర్ వేధింపులకు గురయ్యారు. హైదరాబాద్కు చెందిన దీప నాయర్ మర్రిచెన్నారెడ్డి హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైరల్ అయిన ప్రధాని నరేంద్రమోదీ ప్రచార వీడియోకు ఆమె ఈనెల 18న కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ఆర్ఐ విజయ్ శేఖర్ అనే వ్యక్తి అసభ్యకర పదజాలంతో కామెంట్ చేశాడని దీప నాయర్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ప్రొఫెసర్ దీప ఫిర్యాదుతో జుబ్లీహిల్స్ పోలీసులు ఎన్ఆర్ఐ విజయ్పై కేసు నమోదు చేశారు. ఓ కామన్ ఫ్రెండ్ షేర్ చేసిన వీడియోకు తాను కామెంట్ చేశానని, ఈ కామెంట్కు ఎన్ఆర్ఐ విజయ్ శేఖర్ మాటల్లో చెప్పలేని పదజాలంతో వేధించాడని ఆమె సాక్షికి తెలిపారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినా అతను వెనక్కు తగ్గకుండా తనకు సవాల్ విసిరాడన్నారు. భావప్రకటన స్వేచ్చ లేని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కామెంట్ల పట్ల ఫేస్బుక్కు సైతం ఫిర్యాదు చేశానని, వారు ఆ కామెంట్స్ను తొలిగించారని చెప్పారు. ఈ విషయంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, అమెరికా ఎంబసీలకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మహిళా ప్రొఫెసర్కు అసభ్యపదజాలంతో ఎన్ఆర్ఐ కామెంట్స్
-
ప్రియుడితో భార్య పెళ్లి, భర్త ఆత్మహత్య.. వీడియో వైరల్
మంచిర్యాల : కట్టుకున్న భర్తను కాదని మరో యువకుడిని పెళ్లి చేసుకుంది ఓ యువతి. అంతేకాకుండా ప్రియుడితో కలిసి పెళ్లి దృశ్యాలను ఏకంగా భర్త మొబైల్కే వాట్సాప్లో పంపించి మానసికంగా వేధించింది. తీవ్రమనస్తాపానికి లోనైన భర్త.. పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడితో కలిసి భర్తకు పంపిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయ్యో మరీ ఇంత దారుణమా.. తాళి కట్టిన పాపానికి ఇంతలా వేధిస్తారా అంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకు, కష్టం అయితే విడాకులు ఇవ్వు అంతే కానీ, భర్తని ప్రియుడితో కలిసి ఇలా కూడా వేధిస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాలు.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన నక్క ధర్మరాజు(27)కు గతేడాది మార్చిలో జగిత్యాల జిల్లా కన్నాపూర్ గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం జరిగింది. నాగలక్ష్మికి వెల్గటూర్కు చెందిన మంత్రి మహేష్తో పెళ్లికి ముందు నుంచే సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా అతనితో సంబంధాన్ని కొనసాగించింది. తన ప్రియుడు మహేష్కు తరచూ ఫోన్ చేస్తూనే ఇంట్లో భర్తను తీవ్ర వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో నాగలక్ష్మితో కలిసి ఉన్న అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలను మహేష్.. ఇటీవల ధర్మరాజు ఫోన్కు వాట్సాప్లో పంపించాడు. మరోవైపు ఈ నెల 4న పుట్టింటికి వెళ్లిన నాగ లక్ష్మి భర్త కట్టిన తాళిని తీసేసి ప్రియుడు మహేష్తో తాళి కట్టించుకుంది. ఈ వీడియోను కూడా ధర్మరాజుకు పంపించారు. వీటిని ధర్మరాజు బంధువులు కూడా చూశారు. వెంటనే వారు మహేష్కు ఫోన్ చేసి ప్రశ్నిస్తే.. తాను, నాగ లక్ష్మి పెళ్లి చేసుకున్నామని, ధర్మరాజు చనిపోయినా తమకు అభ్యంతరం లేదని సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధర్మరాజు ఈ నెల 9న తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందుతాగగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి సోదరుడు నక్క సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి బాధ్యులైన భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడి మంత్రి మహేష్పై కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో, అయ్యే ఇంత దారుణమా.. తాళి కట్టిన పాపానికి ఇంతలా వేధిస్తారా, ప్రియుడితో కలిసి భర్తను ఇలా వంచిస్తారా అని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
భర్త కోసం హాకీ క్రీడాకారిణి ఆందోళన
-
అత్తింటి ముందు హాకీ క్రీడాకారిణి ఆందోళన
గుంటూరు రూరల్: వివాహమైన 15 రోజులకే తనను వదిలి వెళ్లిన భర్త జాడ చెప్పాలని జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి అత్తింటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన శనివారం రాత్రి గుంటూరులో సంచలనం రేపింది. గుంటూరు పండరీపురం 4వ లైన్కు చెందిన బసవ కవిత హాకీ క్రీడాకారిణి. ఆమెకు అదే కాలనీకి చెందిన బసవ కిరణ్కుమార్తో 2016 ఏప్రిల్ 19న వివాహం జరిగింది. కిరణ్కుమార్ అదే సంవత్సరం మే 3న ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు కవిత అత్తమామలతోనే ఉంది. తర్వాత ఐదు నెలల పాటు తమకు వేరే పని ఉందంటూ 1వ లైనులో ఉన్న ఇంట్లో కవితను వదిలివెళ్లారు. అప్పటి నుంచి అత్తమామల ఆచూకీ కోసం వెతుకుతుండగా నెల రోజుల క్రితం గుంటూరులోనే ఎన్జీవో కాలనీలో ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లగా నీకూ, మాకు ఎలాంటి సంబంధం లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే న్యూసెన్స్ కేసు పెడతామని అత్తమామలు బెదిరించారు. దీంతో కవిత నగరంలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సైతం భర్త ఆచూకీ తెలపకపోవడంతో శనివారం రాత్రి అత్తమామల ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి కవితను బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. న్యాయం చేయండి: పెళ్లి సమయంలో రూ.50 లక్షలు, 60 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చామని, అయినా అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు డిమాండ్ చేస్తున్నారని బాధితురాలు కవిత వాపోయింది. తాను 2010–13 వరకు జాతీయ స్థాయిలో హాకీ ఆడానని, ఎన్నో పతకాలు సాధించానని తెలిపింది. తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని వేడుకొంది. -
వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
మెట్పల్లి: తనకు ఎదురవుతున్న వేధింపులను తట్టుకోలేని ఓ యువకుడు పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగింది. క్రషర్ యాజమాని వేధిస్తున్నాడంటూ మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట వెంకటేష్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీన్ని గమనించిన పోలీసులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. -
మౌనం వీడిన నామా!
సాక్షి, అమరావతి: ఓ మహిళను వేధించి.. బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మౌనం వీడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన గురించి అందరికీ తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎవరినీ బ్లాక్మెయిల్ చేయలేదని అన్నారు. 'ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరో చెబితే విన్నాను. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తాను' అని ఆయన అన్నారు. మీపై కేసు పెట్టిన సుజాతా రామకృష్ణన్ మీకు తెలుసా? అని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండానే నామా వెళ్లిపోయారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సుజాతా రామకృష్ణన్ అనే మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన నగ్న చిత్రాలు బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ నామా బెదిరించారని, తనను ఆయన వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే..! బాధిత మహిళ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 'సాక్షి'కి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తనను అందరూ చూస్తారనే భయం లేదని, తన మొహాన్ని బ్లర్ చేయొద్దని కూడా కోరారు. నామా నాగేశ్వర్రావు ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే ఉన్నారని చెప్పారు. మీ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు నామా తనను వేధిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్కు తాను నామాతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కూడా వాట్సాప్ చేశానని, వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామా, సీతయ్యలపై కేసు నమోదు మహిళను బెదిరించిన వ్యవహారంలో మాజీ ఎంపీ నామా, సీతయ్యలపై కేసు నమోదు చేశామని, నామా బెదిరించిన ఆడియో, వీడియో టేపులు తమ వద్ద ఉన్నాయని బంజరాహిల్స్ ఏసీపీ మురళి తెలిపారు. నామా, సుజాతా రామకృష్ణన్ మధ్య విభేదాలు ఏంటనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ కేసు వెనుక పొలిటికల్ మోటివ్ ఉందా? లేదా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
వేధింపుల్లో ఘనులు!
మహిళలపై వేధింపుల కేసుల్లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు ♦ దేశవ్యాప్తంగా నాలుగో స్థానం.. ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ నివేదికలో వెల్లడి ♦ అత్యాచార యత్నం కేసులో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ♦ మహిళలపై వేధింపుల్లో ఏపీ మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు.. ♦ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా.. ♦ ఈ జాబితాలో బీజేపీ టాప్.. టీడీపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపుల కేసుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా, మరో ఎమ్మెల్యే అత్యాచార యత్నం చేసినట్లుగా కేసులున్నాయని ఢిల్లీకి చెందిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి.. వారిలో మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసులున్న వారి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆ జాబితాలో పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీ నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పరిశీలించి.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచినవారు ఎన్నికల్లో పోటీ సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్ సంస్థ సేకరించి.. పరిశీలించింది. దేశవ్యాప్తంగా 774 మంది ఎంపీలు, 4,078 మంది ఎమ్మెల్యేల వివరాలను విశ్లేషించి.. ‘క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ (మహిళలపై వేధింపులు)’ కేసులున్న వారి వివరాలతో నివేదిక రూపొందించింది. మొత్తంగా 51 మంది ప్రజాప్రతినిధులు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా కేసులున్నాయని.. అందులో 48 మంది ఎమ్మెల్యేలుకాగా, ముగ్గురు ఎంపీలని తెలిపింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీల నుంచి పోటీచేసి ఓడిపోయిన 334 మంది అభ్యర్థులపైనా ఈ తరహా కేసులున్నట్లు తేల్చింది. ఈ జాబితాలో ఉన్న 48 ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధినేతగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఉన్నారు. మొత్తంగా చూస్తే... 14 మందితో నేరారోపితులతో బీజేపీ తొలిస్థానంలో, ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎస్హెచ్ఎస్ (శివసేన)రెండో స్థానంలో, ఆరుగురితో ఏఐటీసీ (తృణమూల్ కాంగ్రెస్) మూడో స్థానంలో ఉన్నాయి. ఐదుగురు ఎమ్మెల్యేలపై కేసులతో టీడీపీ నాలుగో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, బీజేడీ, జేఎంఎం, డీఎంకే, సీపీఎం ఉన్నాయి. ఏడీఆర్ వెల్లడించిన జాబితా ప్రకారం.. మహిళలను వేధించిన కేసుల్లో ఏపీ సీనియర్ మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర్రావు, మరో సీనియర్ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఇక ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై అత్యాచారయత్నం కేసు ఉంది. ఈయనపై 376 ఐపీసీతో పాటు 506, 511, 379, 366, 324 సెక్షన్ల కింద మహిళలపై వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని తెలిపింది. విప్ చింతమనేని ప్రభాకర్పై అత్యధికంగా 20 కేసులున్నట్టు పేర్కొంది. ఇటీవల ఎత్తేసిన కేసుల్లో ఇవి కూడానా? ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ జీవోలు జారీచేసింది. హత్యలు, దోపిడీ కేసులు, మహిళలపై వేధింపులకు పాల్పడ్డ కేసులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలకు సంబంధించిన అనేక కేసులు ఈ ఉపసంహరణ జాబితాలో ఉన్నాయి. వాటిల్లో ఎమ్మెల్యేలపై కేసులు కూడా ఉన్నాయా అన్న సందేహం తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులై ఉండి.. తప్పుడు చేష్టలకు పాల్పడినవారిపై కేసులను ఎత్తివేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బరితెగించిన ఆకతాయిలు!
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఆకతాయిలు బరితెగించారు. ఆటోలో వెళ్తున్న యువతిని వెంబడించి మరి వేధించారు. సోమవారం సాయంత్రవేళ నడిరోడ్డు మీద ఈ ఘటన జరిగింది. జైరా అనే బాను అనే యువతి షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఐదుగురు యువకులు ఆమెను దారిలో అడ్డిగించే ప్రయత్నం చేశారు. ఏకంగా ఆమె ప్రయాణిస్తున్న ఆటోలోకి ఎక్కి.. ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. ఆమెను బయటకు లాగి దాడి చేసేందుకు యత్నించారు. ఈ ఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించిన బాధిత యువతి మైలార్ దేవ్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆకతాయిల్లో ఒకతను తనను పెళ్లి చేసుకోవాలని బలవంతపెడుతూ ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అమ్మాయికి తెలిసిన ఆకతాయే ఇలా ప్రవర్తించినట్టు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మొత్తం ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని గుర్తించారు. వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
వేధింపులకు వివాహిత బలి
ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం భర్త, అత్తామామలపై కేసు నమోదు గండేడ్: జీవితంపై కోటిఆశలతో ఆ యువతి అత్తింట్లోకి అడుగుపెట్టింది. ఎన్నో కలలు కన్నది. ప్రేమ వివాహం.. ఇద్దరి సామాజిక వర్గాల నేపథ్యంలో అవన్నీ చెదిరిపోయాయి. అత్తింటి వేధింపులు భరించలేక పెళ్లి అయిన 10 మాసాలకే వివాహిత ఉరివేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన గండేడ్ మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జూలపల్లికి ముదిరాజ్ తిరుపతయ్య, అదే గ్రామానికి చెందిన ఈడిగి ప్రమీల (19)గత 10 నెలల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. తిరుపతయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులపాటు వారి కాపురం సాఫీగానే సాగింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో కొంతకాలం నుంచి ప్రమీలను ఆమె భర్త తిరుపతయ్య, అత్తామామలు వేధించసాగారు. ఇటీవల వేధింపులు భరించలేనంత తీవ్రమవడంతో జీవితంపై విరక్తి చెందిన ప్రమీల శుక్రవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమేరకు పోలీసులు ప్రమీల ఆమె భర్తతోపాటు అత్తామామలైన రాములమ్మ, బుచ్చయ్యపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు మహమ్మదాబాద్ ఎస్ఐ రాజేందర్రెడ్డి తెలిపారు. -
ఇక లొల్లి అలహాబాద్ యూనివర్సిటీలో!
అలహాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా వార్తల్లో నిలుస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ, జాతి వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో ఢిల్లీలోని జేఎన్యూ పతాక శీర్షికలకు ఎక్కగా తాజాగా అలహాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్.. తనను యూనివర్సిటీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించింది. యూనివర్సిటీలో కొందరు అధికారుల నియామకాన్ని తాను వ్యతిరేకించడంతో తనను లక్ష్యంగా చేసుకొని యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని అలహాబాద్ యూనివర్సిటీ మొదటి మహిళా విద్యార్థి నాయకురాలు జ్యోతీ సింగ్ ఆరోపించింది. యూనివర్సిటీ అధికారులు తన అడ్మిషన్ను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె మీడియాతో తెలిపారు. యూనివర్సిటీ పరిసరాల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ యోగి ఆదిత్యానంత్ నిర్వహించిన కార్యక్రమాన్ని తాను వ్యతిరేకించినప్పటి నుంచి.. తనపై దూషణలు పెరిగాయని ఆమె వెల్లడించింది. కాగా యూనివర్సిటీలో ఆమె ప్రవేశం పొందటంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చేపట్టిన విచారణలో యూనివర్సిటీ అధికారుల తప్పిదం వల్లనే జ్యోతీ సింగ్కు పరిశోధక విద్యార్థిగా సీటు లభించిందని తేలినట్లు సమాచారం. -
భర్త వేధింపులతో మెడికో ఆత్మహత్య
అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిత్యం వేధిస్తుండడంతో మనస్థాపం చెందిన ఓ వివాహిత మంగళవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం పట్టణంలో జరిగింది. అనంతపురం పట్టణానికి చెందిన చంద్ర, లక్ష్మి దంపతుల కుమార్తె మీనాక్షి బెంగుళూరులో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించిన శ్రీనివాస్ను పెళ్లిచేసుకుంది. దాంతో తల్లిదండ్రులు ఆమెతో తెగదెంపులు చేసుకున్నారు. ఆస్తిలో హక్కులేకుండా రాయించుకుని వారు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి మీనాక్షి భర్త శ్రీనివాస్తో అనంతపురంలోని రైల్వే క్వార్టర్స్లో ఉంటోంది. క్లాసులు ఉన్నప్పుడు బెంగుళూరు వెళ్లి వస్తోంది. వీరికి నాలుగు నెలల చిన్నారి ఉంది. తను ఆశించిన ఆస్తి దక్కకపోవడంతో మద్యానికి అలవాటుపడిన శ్రీనివాస్ భార్యను తరుచూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మీనాక్షి మంగళవారం వేకువజామున ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రంతా బార్లో గడిపిన శ్రీనివాస్ వేకువజామున ఇంటికొచ్చి చూస్తే భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
ఆదిలాబాద్: తాగుడుకు బానిసైన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాదలేని చిన్నయ్య(30) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు. మద్యానికి బానిసైన చిన్నయ్య గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరనే కారణంతో భార్యను వేధిస్తుండేవాడని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. (కడెం) -
వడ్డీ వ్యాపారి అమానుషం
తిరుపతి: తిరుపతి-రేణిగుంట రోడ్డు శ్రీనివాసపురంలో దారుణం జరిగింది. తన వద్ద రూ. 16 లక్షలు అప్పుతీసుకుందన్న కారణంతో ఈశ్వరమ్మ అనే వృద్ధురాలిపై వడ్డీ వ్యాపారి మోహన్ దాడి చేశాడు. తనకు చెల్లించాల్సిన డబ్బుకు బదులుగా రూ. 2 కోట్ల విలువైన ఆమె నివాస గృహాన్ని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా ఆమె ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. -
మేనత్తను వేధిస్తున్నాడని మామను చంపిన అల్లుడు
మేనత్తను వేధిస్తున్నాడని ఆమె భర్తను మేనల్లుడు దుడ్డుకర్రతో కొట్టి చంపాడు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జియాగూడ ఇందిరానగర్ నివాసి నర్సింహ (22) కూలీ. ఇతని మేనత్త అనూరాధను బంజారాహిల్స్కు చెందిన హన్మంతు (28)కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కూలీ అయిన హన్మంతు నిత్యం తాగి వచ్చి అనూరాధను హింసించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చి ఉండేది. కొద్ది రోజులకు హన్మంతు వచ్చి సర్దిచెప్పి తన వెంట తీసుకెళ్లేవాడు. నాలుగు రోజుల క్రితం భర్త తాగి వచ్చి కొట్టడంతో అనూనురాధ మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. మంగళవారం మధ్యాహ్నం హన్మంతు భార్యను తీసుకెళ్లేందుకు జియాగూడకు రావడంతో గొడవ జరిగింది. ఆ తర్వాత నర్సింహ, హన్మంతు కలిసి బయటకు వెళ్లి.. మద్యం తాగి ఇంటికి చేరుకున్నారు. అనూరాధ, హన్మంతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అక్కడే ఉన్న నర్సింహ తీవ్ర ఆగ్రహానికి గురై.. పక్కనే ఉన్న దుడ్డు కర్రతో హన్మంతు తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన హన్మంతును పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హన్మంతు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.