hijab wearing
-
హిజాబ్పై ఆలోచిస్తున్నాం
మైసూరు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై మాత్రమే రాష్ట్ర సర్కార్ లోతుగా ఆలోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయిలో విస్తృతస్థాయిలో సంప్రతింపులు జరిపిన తర్వాతే ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శనివారం మైసూరులో మీడియాతో ఆయ మాట్లాడారు. ‘ హిజాబ్పై నిషేధాన్ని ఇంకా అమల్లోకి తేలేదు. ఈ విద్యాసంవత్సరంలోనే అమలుచేయాలా వద్దా అనే దానిపై ఇంకా సంప్రతింపులు కొనసాగుతున్నాయి’’ అని చెప్పారు. కర్ణాటకవ్యాప్తంగా విద్యాలయాల్లో మతపరమైన వ్రస్తాలు ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవుకదా. అయినా ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి ఆహారం తినాలి అనేది పూర్తిగా వ్యక్తిగతం’’ అని శుక్రవారం వ్యాఖ్యలుచేసిన ఆయన మరుసటిరోజే ఇలా విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ చర్యల ఫలితంగా విద్యాసంస్థల్లోని లౌకక వాతావరణం దెబ్బతినే ప్రమాదముందని బీజేపీ ఆందోళనవ్యక్తంచేసింది. ‘‘ రాష్ట్రాల్లోని విద్యా వాతావరణాన్ని సీఎం చెడగొడుతున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన బుజ్జగింపు రాజకీయలకు పాల్పడుతున్నారు’’ అని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఆరోపించారు. -
మరోసారి హిజాబ్ వివాదం తెరపైకి.. ప్రిన్సిపాల్ క్షమాపణ
శ్రీనగర్: శ్రీనగర్లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్ధినులను బుర్ఖా వేసుకోకూడదని వారించిన ప్రిన్సిపాల్ కు ఉగ్రవాదుల నుండి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ ప్రినిసిపాల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తన వలన ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మాత్రం క్షమించమని కోరారు. ఉవ్వెత్తున నిరసన జ్వాల.. విశ్వభారతి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు చెప్పిన వివరాల ప్రకారం సదరు ప్రిన్సిపాల్ మేడమ్ కొంతమంది విద్యార్థినులను మాత్రం స్కూల్లో బుర్ఖా ధరించవద్దని చెప్పేవారట. అది మా ఆచారమని దయచేసి అనుమతించమని పదే పదే వేడుకుంటూనే ఉన్నాము. కానీ ఆమె ఇతర విద్యార్థినులకు అనుమతినిచ్చి మాకు మాత్రమే అనుమతినిచ్చేవారు కాదు. అంతగా కావాలంటే మమ్మల్ని పోయి మదర్సాలో చేరమని చెప్పారు. ఈ వివక్షను వ్యతిరేకిస్తూ మేము నిరసన చేపట్టామని తెలిపారు. బెదిరింపులు.. విద్యార్థినుల నిరసన వీడియోలు బాగా వైరల్ అయిన తర్వాత ఉగ్రవాదుల నుండి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫోన్ బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. దీంతో అదేరోజు సాయంత్రం ప్రిన్సిపాల్ విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇది కూడా చదవండి: కెనడాలో ఇందిరా గాంధీకి ఘోర అవమానం! -
ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్న వారితో పాటు వారికి మద్దతు తెలుపుతున్న వారిపైనా ఉక్కుపాదం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే వందల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో వేసింది. పలువురిని బహిరంగంగానే ఉరి తీసిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలినందుకు ప్రముఖ సినీ నటి, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38)ను అరెస్ట్ చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు కారణమవుతున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తస్నిమ్ న్యూస్ నివేదించింది. 2016లో ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ద సేల్స్మ్యాన్’ ద్వారా నటి తరనేహ్ అలిదూస్తి అందరి దృష్టిని ఆకర్షించారు. డిసెంబర్ 8న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు అలిదూస్తి. అదే రోజు మొహ్సెన్ షేకారి(23) అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగానే ఉరి తీయటం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఇన్స్టాగ్రామ్ వేదిగా ఓ పోస్ట్ చేశారు.‘మీరు మౌనంగా ఉండడం అంటే అణచివేత, అణచివేతదారులకు మద్దతుగా నిలిచినట్లే. ఇలాంటి రక్తపాతాన్ని చూసి ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు ఉండడం మానవత్వానికి అవమానకరం’అని రాసుకొచ్చారు నటి తరనేహ్ అలిదూస్తి. టీనేజ్ నుంచి ఇరాన్ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నటి తరనేహ్ అలిదూస్తి. ఇటీవల విడుదలైన ‘లైలా బ్రదర్స్’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
బుర్ఖా ధరించి బాయ్స్ డ్యాన్స్.. కాలేజీ ఈవెంట్పై దుమారం!
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బుర్ఖా ధరించి నలుగురు విద్యార్థులు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. బుర్ఖా ధరించి నలుగురు బాయ్స్ నృత్యం చేస్తున్న వీడియో వైరల్గా మారిన క్రమంలో వారిని సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ప్రస్తుతం ఈ సంఘటన కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నలుగురు బాయ్స్ బుర్ఖా ధరించి నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్గా మారిన క్రమంలో కళాశాల యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మతపరమైన సెంటిమెంట్ను దెబ్బతీసేలా ఇలాంటి డ్యాన్సులకు అనుమతి ఇవ్వటమేంటని పలువురు ప్రశ్నించారు. మరోవైపు.. బాలీవుడ్ సాంగ్కు తాము అనుమతించలేదని, విద్యార్థులు తమకు తెలియకుండా స్టేజ్ పైకి వెళ్లారని కాలేజీ అధికారులు తెలిపారు. తమ కళాశాల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ‘కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు స్టేజ్పైకి వెళ్లి డ్యాన్స్ చేశారు. అప్పుడు తీసిన వీడియో వైరల్గా మారింది. అది కళాశాల ఆమోదించిన కార్యక్రమంలో భాగం కాదు. వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశాం. దర్యాప్తు జరుగుతోంది.’ అని కళాశాల ప్రిన్సిపాల్ ఓ ప్రకటన చేశారు. మతసామరస్యాలను దెబ్బతీసే కార్యక్రమాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. This is from #Mangaluru, #Karnataka. In an Event at St.Joseph Engineering College, Mangaluru students seen wearing #Burkha and performing obscene steps for a item song mocking #Burqa & #Hijab.#DakshinKannada #Mangalore #StJosephEngineeringCollege pic.twitter.com/Q6jmN5p77F — Hate Detector 🔍 (@HateDetectors) December 7, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా? -
ఇరాన్లో ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్.. కారణమెంటో తెలుసా?
ఇరాన్లో హిజాబ్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు, యువతులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో హిజాబ్ను తొలగించారన్న కారణంగా ఇరాన్కు చెందిన ఇద్దరు హీరోయిన్లను అరెస్ట్ చేశారు. కాగా, వీరి అరెస్ట్పై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. వివరాల ప్రకారం.. ఇరాన్ హిజాబ్ వ్యతిరేక నిరసనకారులపై అణిచివేత కొనసాగుతున్నందున క్రమంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ నటీముణులు హెంగమెహ్ ఘజియానీ, కటయోన్ రియాహిలను హిజాబ్ తీసి కనిపించడం కలకలం సృష్టించింది. పబ్లిక్గా వారు హిజాబ్ను తొలగించడంతో ఇరాన్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది. కాగా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీంతో, వారి అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. ఇక, అరెస్ట్ అనంతరం.. హెంగామెహ్ ఘజియాని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బహుశా ఇది నా చివరి పోస్ట్ కావచ్చు. ఈ క్షణం నుండి నాకేం జరిగినా ఎప్పటిలాగే నా చివరి శ్వాస వరకు నేను ఇరాన్ ప్రజలతోనే ఉన్నానని తెలుసుకోండి అంటూ కామెంట్స్ చేశారు. కాగా, వీడియోలో నటి ఘజియానీ.. రద్దీగా ఉన్న ప్రాంతంలో హిజాబ్ను తొలగిస్తుంది. ఈ సందర్భంగా కెమెరాకు ఎదురుగా నిలబడి ఏమీ మాట్లాడకుండా తన జుట్టును ముడివేసుకుంటుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో కొన్ని క్షణాల్లోనే ఇరాన్లో వైరల్గా మారింది. దీంతో, ప్రభుత్వం ఆమెను వెంటనే అరెస్ట్ చేసింది. ఇదే కారణంతో కటయోన్ రియాహిలను కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Hengameh Ghaziani (@hengamehghaziani) -
హిజాబ్ హీట్: పాఠశాలలో పోలీసుల లాఠీఛార్జ్.. 15ఏళ్ల బాలిక మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించి.. హిజాబ్లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. హిజాబ్ ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టటం వల్ల మృతి చెందినట్లు ద గార్డియన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి హిజాబ్లు తొలగించి నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 13న అర్దాబిల్లోని షహేద్ గర్ల్స్ హైస్కూల్లో భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు నిరాకరించారు విద్యార్థులు. దీంతో స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు ద గార్డియన్ పేర్కొంది. ఈ దాడిలోనే గాయపడిన 15 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా దళాలు కొట్టటం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతోనే మరణించినట్లు బాలిక బంధువు ఒకరు తెలపటం గమనార్హం. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్.. సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల దాడిలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా బలగాల దాడుల్లో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. “Death to the dictator!” School girls waving forced-hijabs, chanting in the streets of Sanandaj. Oct 17 #Mahsa_Amini #مهسا_امینی pic.twitter.com/CggC37eVy9 — IranHumanRights.org (@ICHRI) October 17, 2022 ఇదీ చదవండి: హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్! -
హిజాబ్ తీర్పు: సుప్రీంలో ఊహించని పరిణామం
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. సుమారు పదిరోజులపాటు హిజాబ్ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా.. మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హిజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్!
టెహరాన్: మాహ్సా అమీని(22) అనే యువతి మృతితో ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిజాబ్ సరిగా ధరించలేదన్న ఆరోపణలతో నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, అమీని మృతిపై విచారణ చేపట్టిన అధికారి నివేదిక మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆమె అనారోగ్య కారణాలతోనే మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. తల, శరీర భాగాలకు దెబ్బలు తగలడం వల్ల ఆమె చనిపోలేదని.. సెరిబ్రల్ హైపాక్సియా కారణంగా అవయవాల వైఫల్యంతో మరణించినట్లు అందులో తేలిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ శుక్రవారం పేర్కొంది. కుటుంబంతో కలిసి టెహ్రాన్ ట్రిప్కు వెళ్లిన యువతిని హిజాబ్ ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. అయితే.. ఆ తర్వాత స్ప్రహ కోల్పోయిందంటూ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో అమినీకి గాయాలయ్యాయని, ఆమె మృతికి పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, తల, కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం వల్ల అమినీ మరణించలేదని నివేదిక పేర్కొనటం గమనార్హం. కానీ, ఆమెకు ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతర్లీన వ్యాధుల కారణంగా కస్టడీలో ఉన్న సమయంలో ఆమె కుప్పకూలిందని తెలిపింది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ఆమె హైపాక్సియాకు గురైందని, ఫలితంగా మెదడు దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: హిజాబ్ ధరించలేదని పోలీసుల టార్చర్?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి -
‘గీత’ దాటితే శిక్ష తప్పదు.. హిజాబ్ అల్లర్లపై అధ్యక్షుడి ‘రెడ్ లైన్’
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజు రోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. హిజాబ్కు వ్యతిరేకంగా మహిళలు కదంతొక్కటంతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిందేనంటూ నిరసనలు మరింత ఉధృతం చేస్తున్నారు. మరోవైపు.. నిరసనలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే బుధవారం తలెత్తిన గందరగోళ పరిస్థితులను తప్పుపట్టారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని రైసీ హెచ్చరించారు. ‘పౌరుల రక్షణే ఇరాన్ ప్రజల రెడ్ లైన్. చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేందుకు ఎవరికీ అధికారం లేదు. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకొన్న శత్రువు.. ప్రజలను ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇది ప్రజల నిర్ణయం‘ అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందని, ఇరాన్కు బద్ధశత్రువైన అమెరికానే ఈ అగ్గికి ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించారు. మాసా అమీని మరణంతో దేశం ఎంతో చింతిస్తోందని.. ఫోరెన్సిక్, నిపుణుల బృందం నివేదిక త్వరలోనే వస్తుందని తెలిపారు. హిజాబ్ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే 22 ఏళ్ల యువతి సెప్టెంబర్ 16న పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇరాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. అమీని మరణించిన మరుసటి రోజు నుంచి మొదలైన నిరసనలు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 76 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొందరు భద్రతా సిబ్బంది ఉండగా.. ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్న మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇరాన్లో హిజాబ్ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి -
ఇరాన్లో హిజాబ్ హీట్.. చైనా తరహా పరిస్థితే అక్కడ కూడా ఉందా?
ఆడోళ్లు పిడికిళ్లు బిగించడంతో ఇరాన్ భగ్గుమంటోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఓ అమ్మాయిని అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపిస్తూ మహిళలు వీధులకెక్కి ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే హిజాబ్లను తీసి నడివీధిలో దగ్ధం చేశారు. పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హిజాబ్ అనేది తమ కల్చర్ కానే కాదని అది కేవలం మహిళలను కల్చర్ ముసుగులో అణచివేసే ఒత్తిడి మాత్రమేనని వారు దుయ్యబడుతున్నారు. ఇరాన్లో కొనసాగుతోన్న ఈ ఉద్యమానికి పలు ప్రపంచ దేశాల్లో ప్రజల నుండి సంఘీభావం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వంపైనా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. పోలీసుల తీరుకు.. పాలకుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ మంటలు పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలీని భయం పాలకులను కంగారు పెడుతోంది. గత ఏడాదో అంతకు ముందో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటిన వేళ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. ఆ తర్వాత ఇంతగా జనం బయటకు వచ్చి ఆందోళనలకు దిగిన సంఘటనలు ఒక్కటి కూడా లేవు. ఇపుడు ఈ ఉద్యమం రోజు రోజుకీ తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే ఈ ఆందోళనలో పోలీసుల తూటాలకు లాఠీ దెబ్బలకు చాలా మంది తలలు వాల్చేశారు. ఆందోళన కారుల తిరుగుబాటు దాడిలో ఒకరిద్దరు భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. మొత్తం మీద అటూ ఇటూ కలిసి ఇప్పటివరకు 75 మందికి పైనే మరణించి ఉంటారని ప్రాధమిక అంచనా. కాకపోతే చైనా తరహాలోనే ఇరాన్ లో కూడా ఉద్యమాల సమయంలో మరణించే వారి సంఖ్య బయటకు రాదు. ప్రభుత్వాలు అంత గట్టిగా ఉక్కుపాదానికి పని చెబుతారు. అంతటి కఠిన నిబంధనల చట్రంలోనూ 75 మంచి చనిపోయారన్న వార్త బయటకు వచ్చిందంటే వాస్తవంగా ఈ లెక్క ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో ఊహించడానికే భయమేస్తుందంటున్నారు మేథావులు. అసలింతకీ ఇరాన్లో మహిళలు ఎందుకిలా వీధుల్లోకి వచ్చి ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందో తెలుసుకోవాలి ముందు. మహసా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి టెహ్రాన్ కు వచ్చింది. ఆమెను మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేసిన తప్పేంటంటే హిజాబ్ ను సరిగ్గా ధరించకపోవడమే. ఇరాన్ లో ప్రతీ మహిళ హిజాబ్ ను ధరించాలి. అది అక్కడి డ్రెస్ కోడ్. ఆ హిజాబ్ ను కూడా ఒక పద్ధతి ప్రకారం ధరించాలి. ఎలాగంటే అలా తలకి చుట్టేయకూడదు. ఈ నిబంధనలను మహిళలు అమలు చేస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించేందుకే మోరల్ పోలీసు విభాగాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మహాసా అమిని హిజాబ్ ను సరిగ్గా కట్టుకోలేదని గమనించిన మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత అత్యంత దారుణంగా హింసించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా లాభం లేకపోయింది . సెప్టెంబరు 16న అమిని చనిపోయింది. Thousands of people at the #Vancouver Art Gallery, standing in solidarity with the people of Iran, following Mahsa Amini's death in custody. Their message: “stop Islamic regime’s brutality, put an end to compulsory hijab, end the use of capital punishment in Iran.” @cbcnewsbc pic.twitter.com/gtdKea1p2w — Janella Hamilton (@JanellaCBC) September 26, 2022 అమిని మరణ వార్త క్షణాల్లో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో అధికారులను తిట్టిపోసిన జనం ఈ విషయంలో ప్రభుత్వానికి గట్టి అల్టిమేటం ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. గంటల్లోనే అమిని హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. మహిళలు తమ పోనీ టెయిల్ జుట్టును కత్తిరించుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఉంచి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇరాన్ అంతటా వ్యాపించేసింది. అక్కడితో ఆగలేదిది. ఇరుగు పొరుగు దేశాలకూ విస్తరించింది. ప్రతీ దేశంలోనూ ఇరాన్ మహిళల ఉద్యమానికి మద్దతుగా మహిళలు యువకులు కూడా బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. టర్కీలో నివసించే ఇరాన్ యువతి నసీబే ఇరాన్ కాన్సులేట్ ఎదురుగా నిరసన ప్రదర్శనలో పాల్గొని అందులోనే తన పోనీ టెయిల్ ను కత్తిరించుకుంది. ఈ ఆందోళనల్లో చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ముందు పెట్టుకుని కుటుంబ సభ్యులు రోదిస్తోన్న సమయంలో అతని సోదరి తన జుట్టు కత్తిరించి సోదరుని మృతదేహంపై పెట్టి నిరసన వ్యక్తం చేసింది. "Women have been protesting against the compulsory hijab for four decades now, and this time around, there has been a real outpouring of support from people from all walks of life, from many different provinces across Iran." - @UNHumanRights #Iran #IranProtests #MahsaAmini pic.twitter.com/slGRXebak0 — UN Geneva (@UNGeneva) September 27, 2022 అసలు హిజాబ్ సంస్కృతి ఎలా మొదలైందో కూడా తెలసుకోవాలి.. 1979 ప్రాంతంలో ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖొమైనీ దేశంలో మహిళలంతా విధిగా హిజాబ్ ధరించి తీరాలని ఆదేశించారు. దాంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి దాన్ని వ్యతిరేకించారు. ఆ ఉద్యమ సెగకు కంగారుపడిన పాలకులు అబ్బే అదేమీ ఆంక్ష కాదు కేవలం ఆయన సిఫారసు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ తర్వాత దేశంలో విప్లవం వచ్చింది. దాని తర్వాత 1983 నుండి హిజాబ్ ధారణతో పాటు మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక డ్రెస్ కోడ్ ను ప్రకటించారు. అప్పటి నుండి హిజాబ్ ను ధరించడమే కాదు దాన్ని చట్టంలో చెప్పిన విధంగానే ధరించాలన్న ఆంక్ష అమలవుతూ వస్తోంది. 1979కి ముందు దేశాన్ని పాలించిన లౌకిక పాలకుడు మహమ్మద్ రెజా పహలావి హయాంలో హిజాబ్ ధరించాలన్న ఆంక్షలు లేవు కానీ.. చాలా మంది మహిళలు స్వచ్ఛందంగా హిజాబ్ ధరించేవారు. దానికి రకరకాల కారణాలున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకైతేనేం ఓ సంప్రదాయంగా భావించడం వల్లనైతేనేం తమ మతానికి సంబంధించిన ఓ చిహ్నంగా గౌరవించడం వల్లనైతేనే మహిళలు తమంతట తాము ధరించేవారు. అయితే 1983కి ముందు వరకు ఎవరైనా హిజాబ్ ధరించకపోయినా అది నేరమేమీ కాదు. ఎలాంటి శిక్షలూ ఉండేవి కావు. ఎవరూ ఒత్తిడి చేసేవారు కూడా కాదు. కానీ ఎప్పుడైతే అది ఒక చట్టమై కూర్చుందో అప్పటినుంచే సమస్య మొదలైంది. దాన్ని కఠినంగా అమలు చేసే క్రమంలో మోరల్ పోలీసులు మరీ కఠినంగా వ్యవహరించడంతో మహిళల్లో హిజాబ్ పట్ల ఒకరకమైన వ్యతిరేకత వస్తోందని ప్రముఖ ఇరాన్ జర్నలిస్ట్, కవి అమిని అంటున్నారు. హిజాబ్ ధరించకపోతే అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తారన్న భయమే మహిళల్లో హిజాబ్ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యిందని మేథావులు అంటున్నారు. హిజాబ్ను అడ్డుపెట్టుకుని మహిళలను అణచివేస్తున్నారన్న భావన రావడంతోనే హిజాబ్ ను అణచివేతకు ఓ సింబల్ గా భావిస్తున్నారు మహిళలు. ప్రస్తుతం ఇరాన్ ను అట్టుడికిస్తోన్న ఉద్యమం కేవలం హిజాబ్ కు వ్యతిరేకంగా మాత్రమే కాదంటున్నారు ఇరాన్ మహిళలు." మాకు స్వేచ్ఛ కావాలి. మాకు ప్రజాస్వామ్యం కావాలి. సంప్రదాయాలు సంస్కృతుల ముసుగులో మమ్మల్ని అణచివేసే నిరంకుశ పోకడలు పూర్తిగా పోవాలి మా బతుకులు మేం ప్రశాంతంగా బతికే వీలు ఉండాలి" అని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. ఇరాన్లో రకరకాల జాతులు, తెగల వాళ్లు జీవిస్తున్నారు. వాళ్లల్లో ఒక్కో తెగ ఒక్కో రకమైన వస్త్ర ధారణ చేస్తారు. అది వారి సంప్రదాయం. హిజాబ్ను కూడా ఒక్కో తెగ ఒక్కో విధంగా కట్టుకుంటారు. అది కూడా వారి సంస్కృతి. పాలకుల ఆంక్షలు మాత్రం అందరూ ఒకేలా హిజాబ్ కట్టాలి. ఇష్టం వచ్చినట్లు హిజాబ్ ను కట్టుకుంటే అరెస్ట్ చేసి జైలుకు పంపేస్తారు. ఈ తలా తోకా లేని పాలకుల విధానాలే వివిధ తెగలు జాతుల స్వేచ్ఛను మంటకలుపుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇరాన్లో పర్షియన్లు, కుర్దులు, అజర్ బైజానీయులు, గిలాకీలు, అరబ్బులు, బలూచ్లు, టర్క్ మెన్లతో పాటు మరికొన్ని జాతులు నివసిస్తున్నాయి. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో జీవనశైలి. ఒక్కొక్కరిదీ ఒక్కో సంప్రదాయం. ఒక్కో సంస్కృతి. అందరినీ ఒకే గాటన కట్టేసి మీరు ఇలాగే చేయండని ఆంక్షలు విధించడమంటే వారి జీవించే స్వేచ్ఛను అణచివేయడమే అవుతుందంటున్నారు హక్కుల నేతలు. ప్రజలకు నచ్చని పనులు చేసి తీరాలని ఆంక్షలు విధించడం హక్కులను హరించడం కిందే లెక్క అంటున్నారు మహిళలు. ఇరాన్ పాలకులు రకరకాల ఆలోచనలతో చేస్తున్నది అదే అంటున్నారు వారు. తల నుంచి పాదాల వరకు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే నల్లటి బట్టను ధరించాలని ప్రభుత్వం ఓ విధానాన్ని ప్రతిపాదించింది. వ్యవస్థలో మార్పు రావాలన్న కసి అందరిలోనూ ఉంది. అందుకే హిజాబ్ అనేది కేవలం మహిళల సమస్యగా చూడ్డంలేదు ఇరానియన్లు. మహిళలతో పాటు పురుషులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా వీధుల్లోకి వచ్చి పాలకుల తీరును ఎండగడుతున్నారు. దేశంలోని మొత్తం 31 ప్రావిన్సులు, 80కి పైగా నగరాల్లో ఉద్యమం ఉధృత రూపంలో కొనసాగుతోంది. జనజీవితాలు స్తంభించాయి. ఈ ఉద్యమ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోక తప్పదంటున్నారు ఇరాన్ అధినేత ఎబ్రహీం రైజీ. దేశ సమగ్రత అంతర్గత భద్రతలకు ముప్పు వాటిల్లేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి ఉండనే ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు. దానర్ధం ఉద్యమం ఎంత ఉధృతం అయినా అణచివేసి తీరతాం అనా? అని మేధావులు నిలదీస్తున్నారు. Why are Iranian women burning their hijabs and cutting their hair? Al Jazeera's @DorsaJabbari explains how Mahsa Amini has become a symbol for Iranian women’s rights after her death ⤵️ pic.twitter.com/puw0gZYTN4 — Al Jazeera English (@AJEnglish) September 27, 2022 ఆందోళనలే అయితే ఫరవాలేదు. ఇవి ఆందోళనల్లా కనపడ్డం లేదు. అంతకు మించి తీవ్రమైన లక్ష్యాలేవో ఉన్నాయని అనిపిస్తోంది అని రైజీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ కు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఆస్కార్ అవార్డ్ విజేత అస్ఘర్ ఫర్హాదీ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులంతా కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. అమిని హత్యోదంతం యావత్ ప్రపంచం సిగ్గుతో తలదించుకోవలసిన ఘటన అని అస్ఘర్ అభివర్ణించారు. యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాల్లోని ఇరానియన్లు ఈ ఉద్యమానికి మద్దతుగా ఆయా దేశాల్లో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ సమాజం అంతా ఇరాన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతోంది. ఇది ఇరాన్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే ఉంది. అలాగని ఇప్పటికిప్పుడు హిజాబ్ తప్పనిసరి కాదు అని ఎలాంటి ప్రకటన చేసే పరిస్థితులూ లేవు. అమెరికా ఆంక్షలతో ఆర్ధికంగా చితికిపోయి ఉన్న ఇరాన్కు హిజాబ్ ఉద్యమం పెద్ద తలనొప్పిగానే పరిణమిస్తోంది. ఏదో ఒకటి చేయకపోతే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందంటున్నారు మేథావులు. Famous Turkish singer Melek Mosso cut her hair on stage in a show of support to the anti-hijab protests in Iran following the death of Mahsa Amini.#MelekMossco #MahsaAmini #Hijab pic.twitter.com/IbMIqJC2gp — TIMES NOW (@TimesNow) September 28, 2022 ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలే పోరాడారు. సతీసహగమనానికి వ్యతిరేకంగా హిందువులే ఉద్యమించారు. అదే వేరే మతాల నుంచి ఒత్తడి వస్తే ఆ సమస్యలు ఎప్పటికీ అలానే ఉండేవి కావచ్చు. అందుకే ఆంక్షలు విధించడం అనేది పాలకులకు, వ్యవస్థలకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు మేథావులు. అది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని వారంటున్నారు. అందరికీ స్వేచ్ఛనిచ్చే మంచి సమాజాన్ని ఆవిష్కరించడమే ప్రభుత్వాల విధానం కావాలని వారు సూచిస్తున్నారు. Ruthless: Look how this Young Iranian Girl is Brutally thrashed by Monster Police of Iran on roads😡4 Protesting against Forced Hijab & Murderer Regime of Predators that her Head Hit d Pavement on d Road #Hijab #IranProtests2022 #Iran #IranProtests #IranRevolution #MahsaAmini pic.twitter.com/mOe1FJRMQ5 — Jyot Jeet (@activistjyot) September 26, 2022 -
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు.. జుట్టు ముడవడమే ఆమె తప్పైంది..
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు హిజాబ్పై వ్యతిరేకత తీవ్రతరమవుతోంది. హిజాబ్ ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే పలువురు మృత్యువాతపడగా.. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. అనేకమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. This 20 Yr old girl who was getting ready to join the protest against the murdering of #MahsaAmini got killed by 6 bullets.#HadisNajafi, 20، was shot in the chest, face and neck by Islamic Republic’s security forces. Be our voice.#مهسا_امینیpic.twitter.com/NnJX6kufNW — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 25, 2022 కాగా 23 ఏళ్ల హదీస్ నజాఫీ అనే ఇరాన్ యువతి.. తన జుట్టు ముడుచుకుంటూ హిజాబ్ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్నాని తెలుపుతూ పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. అయితే సదరు యువతిని ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. యువతి చాతీ, ముఖం, చేతులు, మెడపై కాల్పులు జరిపారు. హదీస్ మరణించినట్లు జర్నలిస్ట్, మహిళా హక్కుల నేత మసీష్ అలినేజాద్ సెప్టెంబర్ 25న ట్వీట్ చేశారు. చదవండి: చరిత్రలోనే తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ఓ మహిళ.. ఎవరీ జార్జియా మెలోని? This is the funeral of 20 year old #HadisNajafi, who was shot dead on the streets by security forces for protesting. Hadis was a kind hearted girl & loved dancing. She was protesting against the brutal death of #MahsaAmini. Their crime: wanting freedom.#مهسا_امینی pic.twitter.com/do9dMoxtxE — isa (@isa63241322) September 25, 2022 అసలేంటి హిజాబ్ వివాదం హిజాబ్ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో కొద్దిరోజుల క్రితం మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేయగా.. సెప్టెంబర్ 16న కస్టడీలోనే ఆమె మరణించిన విషయం తెలిసిందే. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండగా.. యువతి గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు హింసించడం వల్లే మరణించిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. హిజాబ్కు వ్యతిరేకంగా మహిళలు, యువత గళమెత్తారు. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ, తమ జుట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది. -
స్జేజీపైనే జుట్టు కత్తిరించుకున్న సింగర్.. వీడియో వైరల్
ఇస్తాన్బుల్: హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆ దేశ మహిళలకు టర్కీ ప్రముఖ సింగర్ మెలెక మొసో మద్దతు తెలిపారు. స్టేజీపైనే జుట్టు కత్తిరించుకుని ఇరాన్ మహిళల పోరాటానికి అండగా నిలిచారు. దీంతో సింగర్ జుట్టు కత్తిరించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Turkish singer @MelekMosso cuts off her hair on stage in solidarity with the Iranian women. Thank you Melek!#MahsaAmini #مهسا_امینی #IranProtests2022 pic.twitter.com/ZjISxjGkAL — Omid Memarian (@Omid_M) September 27, 2022 హిజాబ్ ధరించనందుకు ఇరాన్లో 22 ఏళ్ల యువతి మహస అమీనిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె మరణించింది. పోలీసులు హింసించడంతోనే ఆమె చనిపోయిందని ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం వీరిపై ఉక్కుపాదం మోపింది. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఇప్పటివరకు 75 మంది నిరసనకారులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్కు ఇతర దేశాల్లోని ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. షరియా, ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏడేళ్లు పైబడిన ముస్లిం అమ్మాయిలు జుట్టు కన్పించకుండా తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. బుర్ఖా లాంటి పొడవైన వస్త్రాలు ధరించాలి. కొన్ని ముస్లిం దేశాలు దీన్ని పాటించకపోయినప్పటికీ ఇరాన్ ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. జులై 5న అధికారిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడి మహిళలతో పాటు వారి కుటుంబసభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చదవండి: హిజాబ్ ఆందోళనల్లో సోదరుడు మృతి.. జుట్టుకత్తిరించుకున్న యువతి -
హిజాబ్పై నిషేధం సబబే!
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద కుట్రకు తెరతీసిందని ఆరోపించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషిన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ సాగింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అనంతరం ముస్లిం పిటిషనర్ల తరఫున దుష్యంత్ దవే..‘హిజాబ్పై నిషేధంతో దేశంలోని మైనారిటీల మత విశ్వాసాన్ని దెబ్బతీసింది. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లింది’అని పేర్కొన్నారు. హిజాబ్ వంటి మతాచారాలు అత్యవసరమైనవి కాకపోయినా, ఒక వ్యక్తి నచ్చిన వాటిని ఆచరించే క్రమంలో కోర్టులు, యంత్రాంగం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఇదీ చదవండి: హిజాబ్ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు -
Iran: యువతి ప్రాణం తీసిన హిజాబ్ రూల్.. ఆందోళన
కఠిన మత చట్టాలకు పేరుగాంచిన ఇరాన్ గడ్డపై మరో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యే ఉరి శిక్ష పడ్డ ఓ మహిళకు.. ఆమె కూతురితోనే కుర్చీ తన్నించి తల్లికి ఉరి వేసింది అక్కడి ప్రభుత్వం. తాజాగా హిజాబ్ ధరించనందుకు ఓ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శవంగా ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఇరాన్ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. మహ్సా అమినీ(22) అనే యువతి గతవారం తన కుటుంబంతో టెహ్రాన్ ట్రిప్కు వెళ్లింది. అయితే ఆమె హిజాబ్ ధరించకపోవడంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన డ్రెస్ కోడ్ను ఉల్లంఘించిందంటూ అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆమెను హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు. అమినీ కోమాలోకి వెళ్లిందని ప్రకటించిన పోలీసులు.. చివరకు శనివారం ఆమె కన్నుమూసినట్లు ప్రకటించారు. అమినీ మృతిపై పోలీసులు అనుమానాస్పద ప్రకటన చేయకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా వందల మంది ప్రజలు ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్కు ఆమెను తరలించినప్పటి నుంచి ఆస్పత్రిలో చేర్చే వరకు ఏం జరిగిందో ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఓ ప్రైవేట్ఛానెల్ మాత్రం.. కస్టడీలో ఆమెను హింసించారని, తలకు బలమైన గాయం అయ్యిందని, ఒంటిపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. కస్టడీలో ఆమె హింసకు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. గత మంగళవారం అమినీతో పాటు మతపరమైన డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన కొందరిని స్టేషన్కు తరలించామని, సందర్శకుల హాలులో ఉన్న టైంలో ఆమె ఉన్నట్లుండి కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించామని, అక్కడ ఆమె కోమాలోకి వెళ్లిందని చెప్పిన వైద్యులు.. శుక్రవారం మరణించిందని ప్రకటించారని పోలీసులు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటన రాజధాని టెహ్రాన్ను ఆందోళనకారులతో కుదిపేస్తుండడంతో అధ్యక్షుడు ఎబ్రహీమ్ రైసీ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. జులైలో భద్రతా సిబ్బంది వ్యాన్ ఎదుట తన కూతురిని వదిలేయాలంటూ ఓ తల్లి బతిమిలాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యి.. చర్చకు దారి తీసింది. మరో ఘటనలో.. సెఫీడెహ్ రష్నో అనే యువతి హిజాబ్ వ్యవహారం తర్వాత కనిపించకుండా పోయింది. మతపరమైన మోరల్ పోలీసింగ్ పేరిట అక్కడ జరుగుతున్న దారుణాలను మానవ హక్కుల సంఘాలు నిలదీస్తున్నా లాభం లేకుండా పోతోంది. -
లాజిక్ లేకుండా మాట్లాడొద్దు.. హిజాబ్ వాదనలపై సుప్రీం అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలల్లో హిజాద్ నిషేధంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదికి కోర్టుకు మధ్య వాదోపవాదనలు వాడివేడిగా సాగాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం కూడా ఓ హక్కు అని న్యాయవాది దేవ్దత్ కమాత్ కోర్టుకు తెలిపారు. దీనిపై ఘాటుగా స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా.. అహేతుకంగా మాట్లాడవద్దని న్యాయవాది దేవ్దత్కు సూచించారు. ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? అని ప్రశ్నించారు. దీనికి దేవ్దత్ స్పందిస్తూ స్కూళ్లలో ఎవరూ దుస్తులు తీసేయరని పేర్కొన్నారు. అసలు సమస్య ఏంటంటే.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించాలని ఓ వర్గం వారు మాత్రమే కోరుకుంటున్నారు, మిగతా విద్యార్థులంతా డ్రస్ కోడ్ను పాటిస్తున్నారని జస్టిస్ హేమంత్ గుప్తా అన్నారు. మిగతా వర్గాల వారు మేం అది ధరిస్తాం, ఇది ధరిస్తామని చెప్పడం లేదని పేర్కొన్నారు. న్యాయవాది దేవ్ దత్ మాట్లాడుతూ.. స్కూళ్లలో కొంతమంది విద్యార్థులు మతపరమైన రుద్రాక్షను కూడా ధరిస్తున్నారని కోర్టుకు చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. రుద్రాక్షను షర్టు లోపలే ధరిస్తారని, రుద్రాక్ష ఉందా? లేదా ? అని ఎవరూ చెక్ చేయరని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లలో హిజాబ్ను నిషేధించడాన్ని హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరుగుతోంది. చదవండి: భారత్ జోడో యాత్ర.. లేఖ విడుదల చేసిన సోనియా -
హిజాబ్పై స్పందించిన ‘నిఖత్ జరీన్’.. ఆమె ఏమన్నారంటే..?
Boxing world champion Nikhat Zareen.. ఇటీవల హిజాబ్ ధరించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నాటకలో హిజాబ్ కారణంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో అక్కడ కర్ఫ్యూ సైతం విధించారు. హిజాబ్ వివాదం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా హిజాబ్ వ్యవహారంపై మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్పందించారు. సోమవారం నేషనల్ మీడియాతో ఇంటర్ప్యూలో నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. ‘‘హిజాబ్ ధరించడం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. హిజాబ్ ధరించడంపై కామెంట్స్ చేయడం నాకు ఇష్టం లేదు. హిజాబ్ ధరించడాన్ని నేను ఇష్టపడతాను. హిజాబ్ విషయంలో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దుస్తుల విషయంలో నాకు నా కుటుంబ సభ్యులు స్వేచ్ఛనిచ్చారు. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని నేను అస్సలు పట్టించుకోను’’ అని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన నిఖత్ జరీన్కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిస్ ఒలింపిక్స్లో దేశానికి పతకం సాధించడమే తన అంతిమ లక్ష్యమని తెలిపారు. ఒలింపిక్స్ పతకం కోసం సాధన కొనసాగిస్తానని చెప్పారు. ఇది కూడా చదవండి: ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో సత్తా చాటిన తెలుగమ్మాయి -
హిజాబ్: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కామెంట్లు వైరల్
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు.. హిజాబ్ అంశంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. హిజాబ్తో పాటు పలు అంశాలలో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవడం ఆపేయాలంటూ ఆమె సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. హిజాబ్ అంశంపై మీ స్పందన ఏంటంటూ ఓ రిపోర్టర్ హర్నాజ్సంధును ప్రశ్నించగా.. ఆమె స్పందించారు. మహిళలను వాళ్లకు నచ్చినట్లుగా బతకనివ్వాలంటూ ఆమె.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. మార్చి 17న ఆమె రాకకు గౌరవంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి.. ఆమె మిస్ యూనివర్స్ ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని నిర్వాహకులు ముందుగానే రిపోర్టర్లకు సూచించారు. అయితే ఓ రిపోర్టర్ మాత్రం హిజాబ్కు సంబంధించిన ప్రశ్నను అడిగాడు. దీంతో నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆమెను మాట్లాడనివ్వండంటూ రిపోర్టర్ బదులు ఇచ్చాడు. దీంతో ఆమె స్పందించారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. మీరు ఎప్పుడూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు. హిజాబ్ విషయంలో కూడా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు (అమ్మాయిలు) వాళ్లు ఎంచుకున్న విధంగా జీవించనివ్వండి.. వాళ్ల గమ్యాన్ని చేరుకోనివ్వండి, ఎగరనివ్వండి, ఎందుకంటే అవి వాళ్ల రెక్కలు, వాటిని కత్తిరించవద్దు. ఒకవేళ కత్తిరించాల్సి వస్తే.. మీ రెక్కలు కత్తిరించుకోండి’ అంటూ సమాధానమిచ్చారు ఆమె. అంతేకాదు తన ప్రయాణం, తాను ఎదుర్కొన్న కష్టాలు.. ఇబ్బందుల గురించి ఎదైనా ప్రశ్నలు అడిగితే సంతోషిస్తానని ఆ రిపోర్టర్కు బదులిచ్చారు. దీంతో సదరు రిపోర్టర్ గమ్మున ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. हिजाब पर बोलती हुई मिस यूनिवर्स हरनाज़ संधु♥️#Hijab #HarnaazSandhu pic.twitter.com/imSJamLrTh — Mohd Amir Mintoee (@MAmintoee) March 26, 2022 -
టెన్త్ పరీక్షలు షురూ.. హిజాబ్పై విద్యాశాఖ మంత్రి సంచలన ప్రకటన
శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ పరీక్షలు రానేవచ్చాయి. రాష్ట్రమంతటా నేడు సోమవారం నుంచి ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ బెడద వల్ల పరీక్షలు జరపకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేశారు. అయితే ఈసారి కోవిడ్ లేకపోవడంతో మామూలుగా పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 10:30 నుంచి ఆరంభం - రాష్ట్రంలో మొత్తం 3,444 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. - పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు జరుగుతుంది. - 5,387 పాఠశాలల నుంచి మొత్తం 8,73,846 మంది విద్యార్థులు రాయబోతున్నారు. ఇందులో 4,52,732 బాలురు, 4,21,110 బాలికలు, శారీరక, మానసిక దివ్యాంగ విద్యార్థులు 5,307 మంది ఉన్నారు. - అక్రమాల నివారణకు విస్తృతంగా స్క్వాడ్లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ క్రింద నిషేధాజ్ఞలను విధించారు. - విద్యార్థులు హాల్టికెట్ను చూపించి కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. - సమాధాన పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 21 నుంచి జరుగుతుంది. హిజాబ్కు అనుమతి లేదు: విద్యామంత్రి కోర్టు ఆదేశాన్ని పాటించి విద్యార్థులు హిజాబ్తో కాకుండా యూనిఫాం ధరించి పరీక్ష రాయాలి. హిజాబ్ కోసం పరీక్షను కాదనుకుంటే మళ్లీ పరీక్ష కూడా ఉండదని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ ఆదివారం తెలిపారు. హిజాబ్ ధరించి వచ్చే వారిపై పోలీసులు చర్యలు తీసుకొంటారన్నారు. -
హిజాబ్ వివాదం ఎందుకు?: సీఎం కేసీఆర్
హైదారబాద్: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. హిజాబ్ వ్యవహారంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. మతకలహాలు సృష్టిస్తూ దేశాన్ని విచ్చినం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఏ దుస్తులు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. హిజాబ్ వివాదం ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఓవైపు దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వంపై అనేక రకాల నిందలు వేసి, ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. దేశంలో ఎదైనా పెరిగింది ఉందంటే.. అది కేవలం మత పిచ్చి మాత్రమేనని మండిపడ్డారు. వాళ్లు పెంచుతున్న మత పిచ్చి.. ఓ కార్చిర్చులా మారి దేశాన్నే దహించి వేస్తుందని దుయ్యబట్టారు. తాను దేశ యువత, దేశంలోని మేధావులకు అప్పీల్ చేస్తున్నానని.. ఇటువంటి వ్యవహారం దేశానికి మంచిది కాదని అన్నారు. మత పిచ్చి వల్ల దేశంలో నెలకొల్పబడిన వాతావరణం, దశాబ్దాల పాటు కొనసాగిన కృషి ఒక్కసారిగా కుప్పకూలుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని.. దేశంలో దారుణమైన పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం దేశం అటువంటి స్థితిలోనే ఉందని అన్నారు. దేశంలో మనోత్మాదం, అల్లరి మూకదాడులు పెరుగుతున్నాయని.. దేశాన్ని నడిపే విధానం ఇదేనా? అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. CM KCR: People wear different kinds of clothes. Some wear shirts, some wear waist coats, some wear dhotis, some wear sherwanis. What does the govt have to do? It is being projected as an issue out of nothing. Where will the country go with such narrow mindedness? #HijabVerdict pic.twitter.com/8WrJaVRcss — Paul Oommen (@Paul_Oommen) March 15, 2022 -
హిజాబ్ తీర్పుపై ఒవైసీ స్పందన ఇది
హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసి మరీ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కర్ణాటక హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా స్పందన కనిపిస్తోంది. ఈ తరుణంలో.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోర్టు తీర్పుపై స్పందించారు. తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ పదిహేను పాయింట్లతో ట్విటర్లో ఒవైసీ సుదీర్ఘమైన సందేశం ఉంచారు. తీర్పు.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉంది. మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన, రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 15 లాంటి వాటిని ఉల్లంఘించినట్లే అవుతుంది. ముస్లిం మహిళల మీద ఈ తీర్పు ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. వాళ్లు లక్ష్యంగా మారుతారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు. హిజాబ్ వేసుకుంటే ఏంటి సమస్య? అని ఒవైసీ స్పందించారు. తీర్పు వెలువడిన వెంటనే ట్విటర్లోనూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. హిజాబ్పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను ఏకీభవించను. తీర్పుతో విభేదించడం నా హక్కు. పిటిషనర్లు సుప్రీం కోర్టు ముందు అప్పీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, మతం, సంస్కృతి, స్వేచ్ఛపై ప్రాథమిక హక్కులను నిలిపివేసినందున @AIMPLB_Official మాత్రమే కాకుండా ఇతర మత సమూహాల సంస్థలు కూడా ఈ తీర్పును అప్పీలు చేయాలని ఆశిస్తున్నాను అంటూ వరుస పోస్టులు చేశారు. 1. I disagree with Karnataka High Court's judgement on #hijab. It’s my right to disagree with the judgement & I hope that petitioners appeal before SC 2. I also hope that not only @AIMPLB_Official but also organisations of other religious groups appeal this judgement... — Asaduddin Owaisi (@asadowaisi) March 15, 2022 -
హిజాబ్ వ్యవహారం: అందుకే హైకోర్టు అలాంటి తీర్పు ఇచ్చింది
నెలరోజుల ఘర్షణ వాతావరణానికి, ఉద్రిక్తతలకు తెరదించుతూ కర్ణాటక హైకోర్టు హిజాబ్ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఐదు వ్యాజ్యాలను కొట్టేసిన కోర్టు ‘హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాద’ని తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ తీర్పుపై కేంద్రం తరపున హర్షం వ్యక్తం అయ్యింది. ‘‘కోర్టు తీర్పును మేం స్వాగతిస్తున్నాం. దేశం ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ శాంతిని పాటించాలి.. కోర్టు తీర్పును గౌరవించాలి. విద్యార్థుల ప్రాథమిక పని చదవుకోవడం. కాబట్టి, ఇవన్నీ పక్కనపెట్టి అంతా కలిసి కట్టుగా చదువుకోండి’’ అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్డర్ కాపీలో అంశాల ప్రకారం.. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హఠాత్తుగా అదీ అకడమిక్ ఇయర్ మధ్యలో.. హిజాబ్ వివాదం ఎలా పుట్టుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేసిన బెంచ్.. దీనివెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాల్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వాలదే అధికారం: హైకోర్టు కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. వ్యక్తిగత ఎంపిక కంటే సంస్థాగత క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 యొక్క వివరణలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. బహుశా అందుకే కోర్టు హిజాబ్పై ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని అడ్వొకేట్ జనలర్ ప్రభూలింగ్ నవద్గి అభిప్రాయపడ్డారు. మరోవైపు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ‘‘ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యాజమాన్యాల ప్రాథమిక హక్కు. కాబట్టి అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చు’’ అని తేల్చి చెప్పింది. హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వ స్పందన ఇది మరోవైపు హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేస్తూనే.. పిల్లల భవిష్యత్తును, వాళ్ల చదువును పరిరక్షించే ప్రయత్నం చేస్తామని అన్నారాయన. ఇక కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని కర్ణాటక హైకోర్టు సమర్థించినందుకు సంతోషంగా ఉంది. కోర్టుకు వెళ్లిన అమ్మాయిలు తీర్పును పాటించాలని నేను అభ్యర్థిస్తున్నాను, ఇతర విషయాల కంటే చదువు ముఖ్యం అని అన్నారాయన. కాగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పిటిషనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత దానిని విశ్లేషించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ షాహుల్ చెప్పారు. కోర్టు తీర్పుపై పలువురు నేతలు, ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. HC verdict on Hijab row | Everyone should follow court order for benefit of children. It is a question of fate & education of our children. Necessary arrangements have been made to maintain law and order: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/5aw1GiKoX1 — ANI (@ANI) March 15, 2022 I welcome the HC's decision. Muslim students of the state faced problems for a long time. Someone had misguided them that's why there was this issue. Quality education should be given to all students, so everyone should accept the order: Karnataka Min KS Eshwarappa #HijabRow pic.twitter.com/R4Ni7mlSQn — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the judgment of the Karnataka High Court; it's a very important step towards strengthening the educational opportunities & rights of girl students, especially for those belonging to the Muslim community: BJP MP Tejasvi Surya pic.twitter.com/xBSTurLxiB — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the decision of the Karnataka High Court, as it is firstly not a religious practice, as per Quran. Secondly, when a student enters an institute, they must follow the rules & regulations...: Rekha Sharma, Chairperson, National Commission for Women pic.twitter.com/YDuu3JO9F1 — ANI (@ANI) March 15, 2022 -
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక తీర్పు
-
హిజాబ్ వివాదం.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదని ప్రకటించింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం.వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 129 పేజీలు తీర్పు వెలువరించింది. తీర్పును సవాలు చేస్తూ కొందరు మంగళవారమే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. తీర్పు మత విశ్వాసాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. తామూ సుప్రీంకు వెళ్తామని వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా షఫీ తెలిపారు. హిజాబ్ ధారణ గురించి ఖురాన్లో స్పష్టంగా ఉందని, ఏ ఆధారాలతో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. తీర్పును ముస్లిం విద్యార్థినులు వ్యతిరేకించారు. కర్ణాటకలో పలుచోట్ల వారు పరీక్షలు బహిష్కరించారు. చదువుతో పాటు హిజాబ్ కూడా ముఖ్యమేనని, దాన్ని ధరించి తీరతామని అన్నారు. 11 రోజుల విచారణ కర్ణాటకలో జనవరిలో మొదలైన హిజాబ్ వివాదం రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే. హిజాబ్కు పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించడంతో వివాదం మరింత రాజుకుంది. దాంతో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు సంఘాలతో పాటు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. సింగిల్ బెంచ్ కేసును స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం 11 రోజులు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సీజే ఇంటికి భద్రత తీర్పు నేపథ్యంలో బెంగళూరులో సీజే, మిగతా ఇద్దరు న్యాయమూర్తుల నివాసాలకు పోలీసు భద్రత పెంచారు. రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ►వివాదంపై హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. విద్యార్థులకు చదువు కంటే ఏదీ ముఖ్యం కాదు. కోర్టు ఆదేశాలను అంతా పాటించాలి. శాంతిభద్రతలను కాపాడాలి. –సీఎం బసవరాజు బొమ్మై ►పిల్లలకు చదువు ముఖ్యం. హైకోర్టు ఆదేశాలను పాటించాలి. –జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ►హైకోర్టు తీర్పును శిరసావహించాలి. తీర్పును చదివాక పూర్తిగా స్పందిస్తా. –సీఎల్పీ నేత సిద్ధరామయ్య ►హిజాబ్ ధారణ గురించి ఖురాన్లో స్పష్టంగా ఉంది. – వక్ఫ్ బోర్డు కీలకమైన నాలుగు ప్రశ్నలు, సమాధానాలు కేసుకు సంబంధించి నాలుగు ప్రముఖ వివాదాంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 1.ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి ఆచరణా. హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కింద సమర్థనీయమేనా? ధర్మాసనం: ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదు. 2.విద్యా సంస్థల్లో యూనిఫాంను తప్పనిసరి చేయడం ఆర్టికల్ 19 (1) కింద వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఆర్టికల్ 21 కింద వ్యక్తి హక్కును కాలరాయడం అవుతుందా? ధర్మాసనం: విద్యా సంస్థల్లో యూనిఫాంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొన్ని అంశాల్లో నిషేధాజ్ఞలను విధించడం ప్రభుత్వానికున్న రాజ్యాంగ హక్కు. దీన్ని విద్యార్థులు ప్రశ్నించడానికి వీల్లేదు. 3.యూనిఫాం జీవో నిబంధనలకు వ్యతిరేకమా? ఆర్టికల్ 14, 115లను ఉల్లంఘించడమా? ధర్మాసనం: జీవోలో ఎలాంటి ఉల్లంఘన, చట్ట వ్యతిరేక చర్య లేవు. 4.విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా, అందుకు కాలేజీలు అభ్యంతరపెట్టకుండా ఆదేశాలివ్వాలా? ధర్మాసనం: అవసరం లేదు. -
Hijab Row: తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
బెంగళూరు: హిజాబ్ వ్యవహారం.. ప్రధానంగా కర్ణాటకను ఆపై దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అంతా ఎదురు చూస్తున్న కర్ణాటక హైకోర్టు తీర్పు రేపు(మార్చి 15న) వెలువడనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిజాబ్ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై 11 రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. తీర్పును ఫిబ్రవరి 25వ తేదీన రిజర్వ్లో ఉంచిన సంగతి తెలిసిందే. మార్చి 15న మంగళవారం ఉదయం 10గం.30ని. తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. ఇక ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్లో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి కూడా ఉన్నారు. తీర్పు నేపథ్యంలో కన్నడనాట పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. హిజాబ్ దుమారం.. ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఉడుపికి చెందిన ప్రభుత్వ కళాశాలలో.. హిజాబ్ ధరించిన ఆరుగురు విద్యార్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్లను అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి హిజాబ్ వ్యవహారం మొదలైంది. ఈ విషయంలో విజ్ఞప్తులను సైతం కళాశాల ప్రిన్సిపాల్ రుద్రే గౌడ తోసిపుచ్చారు. అంతేకాదు.. తల మీద గుడ్డతో క్యాంపస్లోకి అనుమతించినా.. తరగతి గదిలోకి మాత్రం అనుమతించలేదు. దీంతో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్లతో విద్యాసంస్థల దగ్గర నిరసన ప్రదర్శనలు వ్యక్తం చేశారు. ఆపై ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అయ్యింది. హిజాబ్ అభ్యంతరాలు.. పోటీగా కాషాయపు కండువాతో స్టూడెంట్స్ ర్యాలీలు నిర్వహించేదాకా చేరుకుంది. వాళ్లను అనుమతిస్తే.. మమ్మల్ని అనుమతించాలంటూ హిందూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆపై హిజాబ్ అభ్యంతరాలు.. కర్ణాటక నుంచి దేశంలోని మరికొన్ని చోట్లకు విస్తరించాయి. ఆపై ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు ఇవ్వగా.. ఆ ఆదేశాలు తమకు అభ్యంతరకంగా ఉన్నాయంటూ కొందరు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. సంబంధిత వార్త: హిజాబ్పై కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఏమన్నారంటే.. -
హిజాబ్ సెగ: సిక్కు బాలికకు చేదు అనుభవం.. ఎక్కడికి దారితీస్తుంది..?
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక చోట మళ్లీ హిజాబ్ విషయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరులో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అయితే, హిజాబ్ వివాదంపై హైకోర్టు తుది తీర్పు వెల్లడించే వరకు స్కూల్స్, కాలేజీలకు విద్యార్థులు.. హిజాబ్లు, శాలువాలు, మతపరమైన జెండాలను ధరించి రావద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గురువారం ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఓ కాలేజీని సందర్శిస్తున్న క్రమంలో కొందరు విద్యార్థినిలు హిజాబ్ ధరించి ఉండటాన్ని గమనించారు. దీంతో వారిని పిలిచి కోర్టు ఆదేశాలను పాటించాలని సూచించారు. అనంతరం బాలికలు కోర్టు తీర్పును సిక్కులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేయడంతో వారు షాకయ్యారు. దీంతో చేసేదేమీ లేక ఓ సిక్కు బాలిక(17) అమృతధారి(బాప్టిజం తీసుకున్న బాలిక) తలపాగాను తొలగించాలని కాలేజీ యాజమాన్యం కోరింది. వెంటనే సదరు కాలేజీ యాజమాన్యం కోర్టు తీర్పును బాలిక తండ్రి దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కాగా, తన కూతురు తలపాగా తొలగించదని ఆయన కాలేజీ యాజయాన్యానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే సిక్కుల తలపాగా గురించి కోర్టు ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో హిజాబ్ వివాదం కాస్తా సిక్కులను తాకడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కిందకు రాదు: కర్ణాటక ప్రభుత్వం
సాక్షి, బెంగుళూరు: భారత్లో హిజాబ్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే విద్యా సంస్థల్లో క్రమశిక్షణ పరంగా హిజాబ్పై కొన్ని రకాల పరిమితులున్నాయని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందన్న వాదన సరైంది కాదన్నారు. అయితే ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం హిజాబ్ ధరించే హక్కుని రాజ్యాంగం కల్పించిందన్నారు. చదవండి: హిజాబ్ కాకున్నా చద్దర్తో అయినా కప్పుకోండి! దీని ప్రకారం కొన్ని సంస్థల్లో సహేతుకమైన కారణాలతో హిజాబ్ ధరించకూడదని చెప్పే అధికారాలు ఉంటాయని తన వాదనల్ని వినిపించారు. ఫుల్ బెంచ్ ఈ వారంలో విచారణను పూర్తి చేయనుంది. హిజాబ్ పిటిషన్దారుల్లో ఒకరైన హజ్రా షిఫా అల్లరిమూకలు తన సోదరుడిపై దాడికి దిగారని, తమ ఆస్తుల్ని ధ్వంసం చేశారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే దాడులకు దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సంఘ్ పరివార్ పనేనని ఆమె ఆరోపించారు. చదవండి: హిజాబ్ వివాదం: యువతికి చేదు అనుభవం -
హిజాబ్ కాకున్నా చద్దర్తో అయినా కప్పుకోండి!
భారత్లో హిజాబ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో వివాదం చేటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కర్టాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. దేశంలోని పలు రాష్ట్రాలకు పాకుతోంది. ఇదిలా ఉండగా మతం పేరుతో మహిళల పట్ల నిరంకుశంగా వ్యవహరించే తాలిబన్లు.. హిజాబ్ విషయంలో తాజాగా కఠిన ఆదేశాలు జారీచేశారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం.. మహిళలు బుర్ఖా తప్పనిసరిగా ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు ధరించాల్సిందేనని పేర్కొంది. మహిళలు పనిచేసే చోట తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని, లేదంటే చద్దర్ అయినా ముఖానికి అడ్డుగా పెట్టుకొవాలని పేర్కొంది. అయితే తాలిబన్ ప్రభుత్వ ఏర్పడిన మొదట్లో దేశ మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించింది. కొన్ని రోజుల తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకొని.. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల్లో.. బుర్ఖా, హిజాబ్ ధరించడం, గైడ్లైన్స్ను పాటించకపోతే సదరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
హిజాబ్ వివాదం: యువతికి చేదు అనుభవం
Bihar Bank Stops Muslim Girl From Withdrawing Money: హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో మొదలైన ఈ వివాదం కాస్త ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తోంది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ఓ ముస్లిం యువతిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా హిజాబ్ తొలగించాలంటూ ఆమెతో వాదనకు దిగారు. ఈ ఘటన బీహార్లోని బెగుసరాయ్లో జరిగింది. ఓ ముస్లిం యువతి డబ్బులు విత్ డ్రా చేసేందుకు మన్సూర్ చౌక్లోని యూకో(యూసీవో) బ్యాంకు శాఖకు శనివారం వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమె హిజాబ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. హిజాబ్ను తీసి డబ్బులు డ్రా చేయాలని వాదనకు దిగారు. దీంతో సదరు యువతి హిజాబ్ తీసివేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనను ఆ యువతి తన మొబైల్లో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా షేర్ చేశారు. ఈ ఘటనపై ఆయన బీహార్ సీఎం నితీశ్కుమార్పై మండిపడ్డారు. माननीय मुख्यमंत्री @NitishKumar जी, कुर्सी की ख़ातिर आप बिहार में यह सब क्या करवा रहे है? माना आपने अपना विचार, नीति, सिद्धांत और अंतरात्मा सब भाजपा के पास गिरवी रख दिया है लेकिन संविधान की जो शपथ ली है कम से कम उसका तो ख़्याल रखिए। इस कुकृत्य के दोषी लोगों को गिरफ़्तार कीजिए। https://t.co/Ryg9FXzOMX — Office of Tejashwi Yadav (@TejashwiOffice) February 21, 2022 -
హిజాబ్ వివాదం: ఎట్టకేలకు స్పందించిన అమిత్ షా
Amit Shah On Hijhab Row: హిజాబ్పై ప్రభుత్వ నిషేధాజ్ఞాలపై కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ‘హిజాబ్’ ఎఫెక్ట్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెదవి విప్పారు. సోమవారం ఓ ప్రముఖ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా ఎట్టకేలకు హిజాబ్ అంశంపై స్పందించారు. ‘నా వరకైతే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే.. యూనిఫామ్ ధరించి మాత్రమే స్కూల్కు వెళ్లడం మంచిది. ఒకవేళ కోర్టు గనుక తీర్పు వెలువరించాక నా ఈ నిర్ణయంలో ఏమైనా మార్పు రావొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. న్యాయస్థానాల నిర్ణయాల్ని ఎవరైనా అంగీకరించాలి కాబట్టి. అంతిమంగా.. దేశం రాజ్యాంగం లేదంటే ఇష్టానుసారం నడుస్తుందా? అనేది మనమే నిర్ణయించుకోవాలి’ అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉండగా.. హిజాబ్ వ్యతిరేక ఆజ్ఞలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం వాదనల సందర్భంగా కోర్టులో గట్టిగా తన చర్యలను సమర్థించుకుంటోంది. మరోపక్క బీజేపీ, అనుబంధ విభాగాలు కొన్ని ఈ వ్యవహారాన్ని దేశస్థాయిలోకి విస్తరిస్తున్నాయి. -
హిజాబ్ వివాదం.. కర్నాటక పోలీసుల సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశంలో సంచలనంగా మారింది. ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. కర్నాటకలోని విద్యాసంస్థల వద్ద హిజాబ్ను తీసివేసి లోపలికి వెళ్లాలని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో వారి నిర్ణయంపై విద్యార్థినిలు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో నిరసన తెలిపిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల ప్రకారం.. కర్నాటకలో తుమకూరులోని ఎంప్రెస్ కాలేజీలో హిజాబ్ ధరించడంపై ఆంక్షలు విధించారు. అయితే, విద్యార్థినిలు మాత్రం హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చారు. ఈ క్రమంలో కాలేజీలోకి వారిని అనుమతించలేదు యాజమాన్యం. ఈ సందర్బంగా కాలేజీ యాజమాన్యం, విద్యార్థినిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విద్యార్థినిలు తాము హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో, కాలేజీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 10 మంది విద్యార్థినిలపై కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు కూర్గ్ జిల్లాలోని జూనియర్ కాలేజీలో విద్యార్థులు హిజాబ్ ధరించి రావడంతో కళాశాల ప్రిన్సిపాల్ కాలేజీ ప్రాంగణం నుంచి వారు వెళ్లిపోవాలని అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కర్ణాటకలో హిజాబ్ ఆందోళన: 58 మంది విద్యార్థుల సస్పెన్షన్
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. హిజాబ్ ఆందోళనలో పాల్గొన్న 58 మంది విద్యార్థులను శివమొగలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదట నుంచి హిజాబ్కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు. అయితే తాము కేసును తేల్చే దాకా మతపరమైన వస్త్రాలు ధరించి స్కూళ్లకు వెళ్లొద్దని కర్ణాటక హైకోర్టు సూచించింది. అయినప్పటికీ కొంత మంది విద్యార్థులు హిజాబ్ ధరించి స్కూళ్లకు వస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన శివమొగలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం 58 మందిని సస్పెండ్ చేసింది. అలాగే హిజాబ్కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కొందరిపై 144 సెక్షన్ ఉల్లంఘన కింద శివమొగ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..) మరోవైపు ముస్లిం వస్త్రధారణలో హిజాబ్ భాగం కాదని ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. స్కూళ్లలో యూనిఫామ్ ధరించాలన్న గవర్నమెంట్ ఆర్డర్స్ రాజ్యాంగంలోని మత స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్చకు వ్యతిరేకం కాదని అడ్వకేట్ జనరల్ అన్నారు. అయితే హిజాబ్ ధరించడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా లేదా అన్నది తేల్చాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. -
నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి: గుత్తా జ్వాల
హైదరాబాద్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. 'చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుంది. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి' అంటూ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. Stop humiliating small girls at the gates of the school where they come to empower themselves…school is supposed to be their safe haven!! Head scarf or no head scarf Spare them from this ugly politics….stop scarring there small minds 🙏🏻🙏🏻 Just stop this!! 💔 — Gutta Jwala (@Guttajwala) February 15, 2022 చదవండి: (హిజబ్ వివాదం.. టీచర్ శశికళ రాజీనామా) -
హిజబ్ వివాదం.. టీచర్ శశికళ రాజీనామా
బనశంకరి (బెంగళూరు): హిజబ్ వివాదంలో చిక్కుకున్న బెంగళూరు చంద్రా లేఔట్ విద్యాసాగర్ ప్రైవేటు స్కూల్ టీచర్ శశికళ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పాఠశాలలో పని చేయలేను, అనారోగ్యం వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. హిజబ్ ధరించిన విద్యార్థినులను స్కూల్లోకి అనుమతించలేదని ఇటీవల తల్లిదండ్రులు గొడవ చేశారు. హిజబ్కు వ్యతిరేకంగా శశికళ బోర్డుపై రాశారని ఆరోపణలు వచ్చాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ తరుణంలో రాజీనామా చేశారు. చదవండి: (ఆంగ్సాన్ సూకీపై విచారణ ఆరంభం) -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
హిజాబ్ వివాదంపై కర్ణాటక అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కాలేజీలో చిన్నపాటి గొడవగా మొదలై చినికి చినికి గాలి వానల మారిన రగడ దేశాన్ని కుదిపేస్తోంది. రాజకీయ నాయకులు కూడా హిజాబ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ హిజాబ్ రగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. చదవండి: హిజాబ్ వ్యవహారం: అత్యవసర పిటిషన్కు సుప్రీం నో.. చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు ఏఎన్ఐ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' హిబాజ్ అనే పదానికి ఇస్లాంలో పరదా అనే అర్థం ఉంది. యువతులు తమ అందాన్ని దాచుకోవడానికి హిజాబ్ను ధరించాల్సి ఉంటుంది. దేశంలో అత్యాచారాల రేటు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం మహిళలు హిజాబ్ ధరించకపోవడమే. అంటూ పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయేమోనని ఎమ్మెల్యే జమీర్ వెంటనూ మాట మార్చారు. హిజాబ్ అనేది కచ్చితంగా ధరించాలనే రూల్ ఏం లేదు. ఎవరైతే తమ అందాన్ని కాపాడుకోవాలనుకుంటారో.. ఇతరుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు మాత్రమే హిజాబ్ను ధరిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇది అమలులో ఉంది'' అంటూ చెప్పుకొచ్చారు. కాగా జమీర్ అహ్మద్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. చదవండి: పాఠశాలలు ప్రశాంతమేనా?.. ఉద్రిక్తతల మధ్య నేడు పునఃప్రారంభం #WATCH | Hijab means 'Parda' in Islam...to hide the beauty of women...women get raped when they don't wear Hijab: Congress leader Zameer Ahmed on #HijabRow in Hubli, Karnataka pic.twitter.com/8Ole8wjLQF — ANI (@ANI) February 13, 2022 -
పాఠశాలలు ప్రశాంతమేనా?.. ఉద్రిక్తతల మధ్య నేడు పునఃప్రారంభం
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): పది రోజులుగా హిజబ్, కేసరి వివాదంతో పలు జిల్లాల్లో బుధవారం నుంచి మూతపడిన పాఠశాలలు సోమవారం ప్రారంభమతుండగా, గొడవలు తలెత్తకుండా ప్రభుత్వం భారీ బందోబస్తును కల్పిస్తోంది. ముందు జాగ్రత్తగా బెంగళూరు, మైసూరు, ఉడుపితో పాటు పలు జిల్లాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించింది. సీఎం బొమ్మై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. తొలి విడతలో 1 నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు మొదలవుతాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్ 144 జారీ చేశారు. 12 నుంచి 19వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయి. బడుల వద్ద గుంపులుగా ఉండరాదని, ధర్నాలు చేయరాదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. హిజబ్లు, కేసరి కండువాలను వేసుకొస్తే అధికారులు ఎలా వ్యవహరిస్తారో. కాగా, పాఠశాలల పరిస్థితిని గమనించిన తరువాత కాలేజీల ఆరంభంపై నిర్ణయానికి వస్తామని సీఎం చెప్పారు. -
హిజాబ్ వ్యవహారం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొంది. రేపు(సోమవారం) నుంచి ఈ నెల 19 వరకు ఉడిపిలో 144 సెక్షన్ అమలు కానుంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులను ఈ నెల16 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఉడిపి డిప్యూటీ కమిషనర్ కూర్మారావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల వద్ద 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు కొనసాగుతాయని తెలిపారు. -
Fact Check:: హిజాబ్ దుమారం: నజ్మా చాలా హాట్ గురూ అంటూ..
Fact Check On JDS Leader Photos Viral Amid Hijab Issue: న్యాయస్థానాలకు చేరిన హిజాబ్ వ్యవహారంపై విచారణ నడుస్తోంది. మరోవైపు కర్ణాటకలో ఈ అంశంపై వేడి చల్లారేలా కనిపించడం లేదు. సినీ ప్రముఖుల దగ్గరి నుంచి మేధావుల దాకా ప్రతీ ఒక్కరూ ఈ అంశంపైనే చర్చిస్తుండడం చూస్తున్నాం. ఈ క్రమంలో రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. జేడీఎస్ సభ్యురాలు నజ్మా నజీర్ చిక్కనెరలేకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. దుమారం రేపుతున్నాయి. హిజాబ్ అభ్యంతరాల వ్యవహారంపై పోరాడుతున్న వాళ్లలో జనతా దళ్ సెక్యులర్ పార్టీకి చెందిన నజ్మా కూడా ఉన్నారు. అయితే ఆమె అసలు రూపం ఇదంటూ ఇంటర్నెట్లో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బుర్ఖా, హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ వాదిస్తున్న ఆమె.. అవి లేకుండానే తిరుగుతుందని, పైగా హాట్ హాట్ ఫొటోలను సైతం అప్లోడ్ చేస్తుందంటూ గౌరవ్ మిశ్రా అనే ట్విటర్ అకౌంట్ నుంచి కొన్ని ఫొటోలు కనిపించాయి. రియల్ హిజాబ్ వారియర్, ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచే ఈ ఫొటోలు తీశాం అంటూ గురురాజా అనే ట్విటర్ అకౌంట్ నుంచి సెటైరిక్ పోస్టుగా అవి వైరల్ అయ్యాయి. అలా నజ్మా నజీర్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. Pic 1: Alleged Sherni In Burqa & Hijab Pic 2: She is not part of Tukde Tukde Gang Pic 3 & 4: Ofcourse she is not politically Motivated#HijabBan pic.twitter.com/5kcbfgDSyM — Gaurav Mishra 🇮🇳 (@IamGmishra) February 9, 2022 నజ్మా నజీర్ ఒక కాలేజీ స్టూడెంట్. 2018లో ఆమె తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. కాలేజీ టైం నుంచే ఆమె పలు ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఇప్పుడు జేడీఎస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. హిజాబ్ పేరిట వైరల్ అవుతున్న ఆమె ఫొటోలు అన్నీ మార్ఫింగ్ ఫొటోలని తేలింది ఇప్పుడు. రెడ్ కలర్ టాప్లో ఉన్న అమ్మాయి అసలు పేరు తన్యా జేనా. ఆమె ఇన్స్టాగ్రామ్ మోడల్. 2019లో ఆమె తన ఫొటోను అప్లోడ్ చేయగా.. ఆ ఫొటోను మార్ఫ్ చేసి.. నజ్మాను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. Nazma nazeer 😂ಹಿಜಾಬ್ ಹೋರಾಟಗಾರ್ತಿಯ ನಿಜ ರೂಪ ,, ಇದನ್ನು ಎಡಿಟ್ ಎಂದು ಕಾಮೆಂಟ್ ಮಾಡುವವರೇ ಅವಳ Instagram ನಿಂದ ಇದನ್ನು ತೆಗೆಯಲಾಗಿದೆ 🙊🙉🙈🐵, pic.twitter.com/rBuWVI2gik — Gururaja M K (@AmansurajGuru) February 6, 2022 ఇక ఫేస్బుక్లో నజ్మా నజీర్ చిక్కనెరాలె పేరుతో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కొంతమంది తప్పుడు ప్రచారంతో నా క్యారెక్టర్ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కన్నడలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ అంశానికి సంబంధించి.. ఆరుగురు అమ్మాయిల ఫొటోలు, ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్లో దర్శనమివ్వడంపై.. వాళ్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఫేక్ ఫొటోలు, వీడియోలు సైతం వైరల్ అవుతుండడం.. కలవర పెడుతోంది. FactCheck..చివరగా.. నజ్మా నజీర్ తప్పుడు ఉద్దేశంతోనే ‘హిజాబ్’ ఎజెండాను ముందుకు నడిపిస్తోందని, ఈ విషయంలో ఆమె సరిగ్గా లేదన్నది సోషల్ మీడియా పోస్ట్ల సారాంశం. కానీ, వైరల్ పోస్ట్లు వాస్తవానికి మార్ఫింగ్ చేసిన చిత్రాలు. పైగా ఆమె ఒక కాలేజీ స్టూడెంట్, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్న వాదనా అర్థరహితం అని ఆమె వాదిస్తున్నారు. అబద్ధం అబద్ధమే.. ఇస్లాంలో కొందరు అమ్మాయిలు బయటకు రాకపోవడం వల్ల సరిగా మాట్లాడలేకపోతున్నారు. కానీ, మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం, హక్కులు.. వేటి గురించి అయినా మాట్లాడొచ్చు. గట్టిగా బదులు ఇచ్చేందుకు కన్నడ, ఆంగ్లం.. ఎలాంటి భాషైనా ఫర్వాలేదు. అబద్ధం ఎప్పుడూ అబద్ధమే. తనలాంటి వారెవరైనా ఇలాంటి వ్యవహారాలను భరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారామె. నిజం ఎప్పుడూ నిజమే. తన క్యారెక్టర్ను దిగజార్చి తక్కువ చూపించేందుకు కొందరు ప్రయత్నించినా.. బాధ్యతగల మీడియా తన గౌరవాన్ని కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు అని ఫేస్బుక్ ఒక పోస్ట్ చేశారు. -
హిజాబ్ వివాదం: దమ్ముంటే ఆ పని చేయండి.. కంగనా సవాల్
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ వివాదానికి దారి తీసే వ్యాఖ్యలు చేశారు. 'మీకంత దమ్ము, ధైర్యం ఉంటే ఆప్ఘనిస్తాన్లో బురఖా ధరించకుండా చూపించండి 'అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆనంద్ రంగనాథన్ షేర్ చేసిన పోస్ట్ను సైతం పంచుకుంది. కాగా ఇటీవల హేమమాలిని సైతం ఈ వివాదంపై స్పందిస్తూ.. స్కూల్స్ అనేవి విద్యాబోధనకే తప్ప వర్గపాఠాలు నేర్పడానికి కాదని గట్టిగానే బదులిచ్చింది. స్కూల్లో అందరూ యూనిఫామ్స్ మాత్రమే ధరించాలని పేర్కొంది. కావాలనుకుంటే విద్యాలయాలు మినహా మిగతా ఎక్కడైనా మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని సూచించింది. కాగా కర్ణాటక ప్రభుత్వం విద్యార్థినులను హిజాబ్తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హిజాబ్ వివాదాన్ని పెద్దది చేయకండని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. -
హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్ను తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలం?. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు. అసలు ఈ అంశాన్ని జాతీయ స్థాయి.. ఢిల్లీకి తీసుకురావడం సరైందేనా? ఒక్కసారి ఆలోచించండి. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నాం. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం. హిజాబ్ వ్యవహారాన్ని పెద్దది చేయకండి’’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకే నష్టమని, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణకు సుప్రీం నో చెప్పింది. ఇదే పిటిషన్పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు అని తుషార్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను సైతం సుప్రీం తోసిపుచ్చింది. ఆమె తరపున వాదనలు వినిపించిన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మేం పరిశీలిస్తాం’ అంటూ చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. -
దేశ సంస్కృతిలో ‘పరదా’ కూడా భాగమే
అయోధ్య: భారతదేశ సంస్కృతిలో ‘పరదా’ ఒక భాగమేనని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) నేత అరుణ్సింగ్ అభిప్రాయపడ్డారు. హిజాబ్ ధరించే హక్కును ముస్కాన్ ఖాన్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. హిజాబ్ అనేది దేశ సంస్కృతిలో భాగమైన పరదా లాంటిదేనని స్పష్టం చేశారు. అయితే సింగ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఎంఆర్ఎం పేర్కొంది. తామెవరికీ మద్దతు ఇవ్వలేదని, కొందరు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ఎంఆర్ఎం ప్రతినిధి షాహీద్ సయ్యద్ చెప్పారు. విద్యాసంస్థల్లో యూనిఫామ్కు తాము మద్దతిస్తామని ఎంఆర్ఎం వ్యవస్థాపకుడు ఇంద్రేశ్ కుమార్ చెప్పారు. శాంతియుత వాతావరణాన్ని కాపాడండి కర్ణాటక ప్రజలు శాంతి, సామరస్యంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయొద్దని రాజకీయ పార్టీలను కోరారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తర్వాత విద్యార్థులు నిర్దేశిత యూనిఫామ్ ధరించి, తరగతులకు హాజరు కావాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ చెప్పారు. మరోవైపు ముస్లిం విద్యార్థులపై దాడులను 1000కి పైగా సంఘాలు ఖండించాయి. ఈ మేరకు 1,850 మంది ప్రముఖులు ఒక బహిరంగ లేఖ రాశారు. నేను సమర్థ్ధించను హిజాబ్ను తాను సమర్థించనని ప్రముఖ సినీ రచయిత జావెద్ అక్తర్ చెప్పారు. అయితే హిజాబ్ వేసుకునే ముస్లిం విద్యార్థినులను వేధించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజాబ్ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడొద్దని పార్టీలకు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ గురువారం సూచించారు. మహారాష్ట్రలోని పుణేలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు హిజాబ్కు అనుకూలంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆందోళన ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించకుండా నిషేధం విధించడం పట్ల పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్లో భారత్కు చెందిన ‘చార్జ్ ద అఫైర్స్’ను పిలిపించి, హిజాబ్ వ్యవహారం పట్ల తన నిరసనను తెలియజేసింది. -
కర్ణాటక హిజాబ్ వ్యవహారంపై స్పందించిన మలాలా
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలనైన మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలోనూ ‘హిజాబ్’పైనా చర్చ మొదలైంది. మతసామరస్యం పాటించాలని చెబుతూనే శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని, ఒకే తరహా యూనిఫామ్లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని ఓవైపు కర్ణాటక హైకోర్టు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్పా.. చల్లారడం లేదు. ఈ క్రమంలో హిజాబ్ వివాదం ఇప్పుడు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది. యూసఫ్జాయ్ ట్వీట్లో.. ‘చదువు, హిజాబ్లో ఏది ఎంచుకోవాలో కళాశాల మమ్మల్ని బలవంతం చేస్తోంది’ అంటూ విద్యార్థిణిలు ఆవేదనను ట్వీట్ చేసిన ఆమె.. ఆపై భారతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. ‘బాలికలు తమ హిజాబ్లో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయానకంగా ఉందని వ్యాఖ్యానించారామె. ఆడపిల్లలను హిజాబ్లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం. భారత నాయకులు ముస్లిం మహిళలను చిన్నచూపు చూడటం ఆపాలి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. “College is forcing us to choose between studies and the hijab”. Refusing to let girls go to school in their hijabs is horrifying. Objectification of women persists — for wearing less or more. Indian leaders must stop the marginalisation of Muslim women. https://t.co/UGfuLWAR8I — Malala (@Malala) February 8, 2022 ఇదిలా ఉంటే హిజాబ్ ధరించిన ఆడపిల్లలను క్లాస్ రూంల్లోకి రైట్ వింగ్ గ్రూపులు అనుమతించకపోవడంతో మొదలైన వివాదం.. పోటాపోటీగా కాషాయపు కండువాలతో ర్యాలీలు చేపట్టడంతో మరింత ముదిరింది. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం సామరస్యం పాటిస్తూ.. శాంతి భద్రతలు పాటించాలని పిలుపు ఇస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ హిజాబ్ అభ్యంతరం గళం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్.. హిజాబ్ యూనిఫామ్లో భాగం కాదని, క్రమశిక్షణ ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వార్త: హిజాబ్ వ్యవహారం.. మూడు రోజులు అక్కడ విద్యాసంస్థలు బంద్ -
హిజాబ్ వర్సెస్ కండువా.. కర్ణాటక సర్కార్ కీలక ఉత్తర్వులు
కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం.. పార్టీల పరస్పర రాజకీయ విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వివాదం మరింత ముదరకముందే చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. శాంతి భద్రతలను దెబ్బతీసే రీతిలో విద్యాసంస్థల్లో విద్యార్థులు దుస్తుల్ని ధరించడానికి వీల్లేదంటూ తాజా ఉత్తర్వుల్లో నిషేధాజ్క్షలు జారీ చేసింది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి ఉడుపి, చిక్మగళూరులో పరిణామాలు వాడీవేడిగా సాగాయి. హిజాబ్స్ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోగా.. ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ తరుణంలో.. కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించడంతో.. వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లు అయ్యింది. దీంతో శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసేంది కర్ణాటక ప్రభుత్వం. ఎంపిక చేసిన డ్రెస్ కోడ్ కర్ణాటక విద్యా చట్టం-1983లోని సెక్షన్ 133 (2) ప్రకారం.. యూనిఫాం ఒకే తరహా దుస్తులను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తమకు నచ్చిన యూనిఫామ్ను ఎంచుకోవచ్చు అని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. విద్యార్థులు అధికారులు ఎంపిక చేసిన డ్రెస్ కోడ్నే అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే.. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాంను ఎంపిక చేయని సందర్భంలో.. సమానత్వం, సమగ్రత మరియు ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో దుస్తులను ధరించకూడదంటూ ఆ ఉత్తర్వులు పేర్కొనడం గమనార్హం. కొన్ని విద్యాసంస్థల్లో బాలబాలికలు తమ మతం ప్రకారం ప్రవర్తించడంతో సమానత్వం, ఐక్యత దెబ్బతింటున్నట్లు తాము గుర్తించామని ఈ సందర్భంగా విద్యాశాఖ పేర్కొంది. సమీక్షల అనంతరం.. ఉడుపి, చిక్కమగళూరు ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించడంపై అభ్యంతరాలు(తరగతి గదుల్లో మాత్రం వద్దనే) వ్యక్తంగా.. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో ర్యాలీలు నిర్వహించిన వీడియోలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. మరోవైపు హిజాబ్ వ్యవహారం కోర్టు గడప తొక్కగా(హిజాబ్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ.. ఐదుగురు బాలికల తరపున పిటిషన్ దాఖలైంది).. మంగళవారం(ఫిబ్రవరి 8న) పిటిషన్ను విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. విద్యా శాఖతో, న్యాయ శాఖతో సంప్రదింపులు జరిపారు. శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బాలికలు తరగతుల్లో హిజాబ్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ‘తాలిబనైజేషన్’ ప్రోత్సహించినట్లు అవుతుందంటూ బీజేపీ నేతలు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హిజాబ్ విషయంలో బాలికలకు మద్దతుగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఇక ఈ వ్యవహారంపై మాజీ సీఎంల స్పందన మరోలా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.. బీజేపీ, ఆరెస్సెస్లపై మండిపడగా, హెచ్డీ కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు అనుమతించబడిన ప్రదేశాలలో హిజాబ్లను అనుమతించండి, ఈ మధ్య పర్మిషన్ ఇచ్చిన ప్లేసుల్లో మాత్రం నిషేధించండి’ అంటూ కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. We're ready for a change in the colour of the hijab in order to match it with the uniform but we cannot leave it. I wear hijab to the Assembly as well, they can stop me if they can. A memorandum will go to the CM & we'll protest in Udupi later: Congress MLA Kaneez Fatima pic.twitter.com/FwkgR3CbR3 — ANI (@ANI) February 6, 2022 -
కన్నడనాట ‘హిజాబ్’ రగడ
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో హిజాబ్ గొడవ రాజకీయ రంగు పులుముకుంటోంది. విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు పాటించాల్సిందేనని పాలక బీజేపీ అంటుండగా హిజాబ్కు మద్దతుగా విపక్ష కాంగ్రెస్ గొంతు విప్పింది. రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ (స్కార్ఫ్) ధరించిన బాలికలను అనుమతించపోవడంపై కొద్ది రోజులుగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. వారికి పోటీగా కొందరు స్టూడెంట్లు కాషాయ శాలువాతో క్లాసులకు హాజరవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. జనవరిలో ఉడుపిలోని పీయూ కాలేజీలో స్కార్ఫ్తో వచ్చిన ఆరుగురు స్టూడెంట్లను వెనక్కు పంపడంతో మొదలైన ఈ గొడవ తాజాగా కుందాపూర్, బైందూర్తో పాటు బెల్గావీ, హసన్, చిక్మగళూరు, శివమొగ్గ, మైసూరు సహా పలు చోట్లకు విస్తరించింది. హిజాబ్ తమ హక్కు అంటూ ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేశా రు. వాటిలో పలుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హిజాబ్ను అనుమతించాలన్న డిమాండ్కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మద్దతు పలికారు. ఈ గొడవ ద్వారా విద్యార్థినుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. ‘‘చదువుల తల్లి సరస్వతి తన బిడ్డలకు ఎలాంటి తేడా చూప దు. జ్ఞానాన్ని అందరికీ పంచుతుంది’’ అని వసంత పంచమి పర్వదినాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాగ్యుద్ధం కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య హిజాబ్ అనుకూల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. హిజాబ్ ధరించినంత మాత్రాన విద్యా సంస్థల్లోకి రానివ్వకపోవడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాయడమేనన్నారు. ‘‘హిజాబ్ సాకుతో రాష్ట్రమంతటా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన బాలికలను చదువుకు దూరం చేయడమే దీని వెనక సంఘ్ పరివార్ ప్రధాన ఎజెండా’’ అని ఆరోపించారు. ఈ గొడవలకు మూలకారకులను తక్షణం అరెస్టు చేయాలని సీఎం బస్వరాజ్ బొమ్మైని డిమాండ్ చేశారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని నినాదాలిచ్చే ప్రధాని మోదీకి ఈ గొడవలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నళిన్కుమార్ కటీల్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్యే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘ఇక్కడున్నది బీజేపీ ప్రభుత్వం. విద్యా సంస్థలు సరస్వతీ నిలయాలు. హిజాబ్ తదితరాలకు అక్కడ స్థానం లేదు. వాటిల్లో తాలిబన్ తరహా పరిస్థితులను అనుమతించబోం. నియమ నిబంధనలకు అంతా కట్టుబడాల్సిందే’’ అన్నారు. ‘‘ఇప్పుడు హిజాబ్ను అనుమతిస్తే తర్వాత బుర్ఖా అంటారు. స్కూళ్లలో మసీదులు కడతామంటారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ అన్నారు. ఈ వివాదానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ బాధ్యులేనని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. హిజాబ్ను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఉడుపి గవర్నమెంట్ ప్రీ వర్సిటీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
హిజాబ్ ధరించారని క్లాస్లోకి రానివ్వలేదు
మంగళూరు (కర్ణాటక): హిజాబ్(తలపై ధరించే వస్త్రం)ను ధరించారనే కారణంగా కర్ణాటకలోని ఒక ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కాలేజీలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించ లేదు. ఈ ఘటన ఉడుపిలోని గవర్నమెంట్ ఉమన్స్ పీయూ కాలేజీలో జరిగింది. తమను ఉర్దూ, అరబిక్ భాషల్లో మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపాల్ అనుమతించట్లేదని, క్లాస్లోకి రానివ్వలేదని ఆరోపించారు. కాలేజీ ప్రాంగణంలో హిజాబ్ను అనుమతిస్తామని, క్లాస్రూమ్లో కుదరదని ప్రిన్సిపల్ రుద్ర గౌడ స్పష్టం చేశారు. -
ఇది మా విజయధారణ
‘హిజాబ్’ అంటే స్త్రీలు ధరించే శిరోవస్త్రం. కొందరి దృష్టిలో ఇది చాందసానికి ప్రతీక. కొందరి దృష్టిలో ఇది అస్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి ఆలంబన. ‘హిజాబ్’ ధరించే చదువులో, ఉద్యోగంలో, ఉపాధిలో విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు కొందరు స్త్రీలు. ముంబైకి చెందిన సాదియాది కూడా అలాంటి విజయగాథే. హిజాబ్ కేవలం మా వస్త్రధారణ కాదు.. విజయధారణ అంటుంది ఆమె. ‘సీక్రెట్ సూపర్స్టార్’ సినిమా గుర్తుంది కదా. హిందీ సినిమా. అందులో ఒక అమ్మాయి తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా, అతనికి తెలియకుండా, తల్లి సహాయంతో గిటార్ కొనుక్కొని.. హిజాబే కాదు.. బుర్ఖా కూడా వేసుకొని పాటలు పాడుతూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ సీక్రెట్గా సూపర్ స్టార్ అవుతుంది. రియల్ లైఫ్లో కూడా అలాంటి హిజాబ్ స్టార్ ఉంది. జిమ్ ఇన్స్ట్రక్టర్గా సాదియా. (ఇన్సెట్లో) సాదియా ముంబై– జోగేశ్వరి (వెస్ట్)లోని ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ చేయిస్తూ చెమటలు కక్కుతూ తల మీద నుంచి హిజాబ్ (శిరో వస్త్రం) తీయకుండా జిమ్ చేస్తున్న వాళ్లకు సూచనలిస్తూ కనిపించే ఆ అమ్మాయి పేరు సాదియా. ఈమె ఫిట్నెస్ ట్రైనర్ మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తుంది. హిజాబ్తో ఇటువంటి పనుల్లో ఆడపిల్లలు కనిపించడం అరుదు. కాని సాదియా ఇది నాకు మామూలే అన్నట్టు ఉంంది. ‘అవును.. ఈ సంప్రదాయ వస్త్రధారణ నా ప్రోగ్రెస్కు అడ్డుగా అనిపించలేదెప్పుడూ. పైగా నాలో ధైర్యాన్ని నింపింది. అడ్డంకులను ఎదుర్కొంటూ నా లక్ష్యాన్ని చేరుకునే సాహసాన్నిచ్చింది’ అని చెప్తుంది. ‘ఐయామ్ ఏ విన్నర్ విత్ హిజాబ్’ అంటుంది సాదియా. మిగిలిన వివరాలు.. సాదియా వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్. తల్లి స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. నిజానికి ఈ ఫిట్నెస్ ట్రైనింగ్, మార్షల్ఆర్ట్స్ సాదియా వాళ్లక్క సైమా చేసేదట. తల్లిదండ్రులు ‘మనింట్లో ఆడపిల్లలకు ఇవి తగవు’ అని వారించేసరికి సైమా సైలెంట్ అయిపోయింది. కాని అక్క చేసిన విన్యాసాలు చూస్తూ పెరిగిన సాదియా మాత్రం ఆ అభిరుచిని కెరీర్గా మలచుకొని కొనసాగిస్తోంది. ‘వేరే చెప్పక్కర్లేదు కదా.. ఈ రోజు నేనిలా ఉండడానికి స్ఫూర్తి మా అక్కయ్యే అని’ అంటుంది సాదియా. మరి తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదా? ‘చెప్పారు. ఏ సంప్రదాయం రీత్యా వాళ్లు వద్దన్నారో ఆ సంప్రదాయంతోనే కంటిన్యూ చేస్తానని స్థిరంగా చెప్పా. అలా చెప్పే ధైర్యమూ ఇదిగో నా ఈ హిజాబే ఇచ్చింది’ అంటుంది హిజాబ్ను చూపిస్తూ. ఆ సాహసంతోనే అమ్మానాన్నను ఒప్పించుకుంది. అయితే ఫిట్నెస్ పట్ల సాదియాకున్న ప్రీతి, మార్షల్ ఆర్ట్స్ అంటే ఆమెకు ఉన్న మక్కువను చూసిన ఒక మౌల్వి (మత గురువు) ‘అమ్మాయిలు వినమ్రంగా, నాజూగ్గా ఉండాలి కాని ఈ వ్యాయామాలు అవీ చేస్తూ అబ్బాయిలా ఉండకూడదు’ అంటూ నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాడు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికే ఇవి చేస్తున్నాను తప్ప కండలు చూపించుకోవడానిక్కాదు’ అని నిర్మొహమాటంగా జవాబిచ్చింది మౌల్వీకి. సమాజంలో ఉన్న భ్రమలకు వ్యతిరేకంగా పోరాడ్డం సాదియా నైజం. ఇదంతా హిజాబ్ చలవే అంటుంది మళ్లీ నవ్వుతూ. ఆమె ధైర్యానికి, శరీరాన్ని స్ప్రింగ్లా వంచే ఆమె విన్యా సాలకు ఇన్స్టాగ్రామ్లో మూడువేల అయిదువందల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె పరిచయం ఎందుకు? ఫిబ్రవరి ఒకటవ తేదీ– వరల్డ్ హిజాబ్ డే. ఆ సందర్భంగా ముంబైకి చెందిన ‘అల్ హాది’ అనే స్వచ్ఛంద సంస్థ హిజాబ్ విజయగాథల సమావేశం ఒకటి నిర్వహించనుంది. ‘హిజాబ్ సాధికారతకు చిహ్నం కాని అణచివేతకు కాదు’ అనే పేరుతో ముంబైలోనే వైబీ చవాన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేయనుంది. అందులో సాదియాలా హిజాబ్ ధరించి విజయం సాధించిన మరికొందరు స్త్రీలను సత్కరించనుంది. వీరిలో కాలిగ్రఫి ఆర్టిస్ట్ సల్వా రసూల్, కరాటే రెఫ్రీ షహీన్ అఖ్తర్, విద్యావేత్త అస్మా జైదీ, రాజకీయవేత్త ఫాతీమా ముజఫ్ఫర్, నృత్యకారిణి, బ్లాగర్ హలీమా షైఖ్ వంటి హిజాబ్ విన్నర్స్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సాదియా పాల్గొన తన హిజాబ్ విజయ గాథను వినిపించి తనలాంటి యువతకు స్ఫూర్తినివ్వబోతోంది. ‘మనం ఎంచుకున్న జీవితాన్ని మనం దక్కించుకోవడం అవసరం. సంప్రదాయం ఎప్పుడూ ఏ అడ్డంకినీ సృష్టించదు. సంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే దాని ఆసరాతోనే ముందుకు సాగొచ్చు’ అని చెబుతోంది సాదియా. వీరిద్దరూ... చిన్నప్పటి నుంచీ చిత్రకళ పట్ల ఆసక్తి పెంచుకున్న సల్వా రసూల్ తన అభిరుచికి తగ్గట్లే సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చిత్రకళలో పట్టా పుచ్చుకున్నారు. ఈమె అరబిక్ ఆర్ట్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాలిగ్రఫి కళలో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సల్వా ‘ఈ కళలో నాకు స్ఫూర్తి ఈ దేశ వారసత్వ సంపదే’ అంటుంది. ఆమె వేసిన చిత్రాలు సౌత్ ఆఫ్రికా, పశ్చిమాసియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా వంటి దేశాల్లో గొప్ప గొప్ప భవంతులకు రాజసాన్నిస్తున్నాయి. సల్వా రసూల్ ఇక అస్మా జైదీ టీచర్ ట్రైనర్. రచయిత్రి. చదువు మీద పిల్లలకు ఆసక్తి కలిగించేందుకు ఆమె చేపట్టిన ‘చదువుదాం’ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ‘బోధన అనేది నా ఉద్యోగం కాదు.. నా ప్యాషన్. మన దేశ భవిష్యత్తు పిల్లలే. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. దానికే నా జీవితం అంకితం’ అంటుంది అస్మా జైది. అస్మా జైదీ -
తల చుట్టూ దుపట్టాతో కొత్త మేకోవర్!
లాగోస్, (నైజీరియా): అందమైన కుందనాల బొమ్మ.. చూడగానే ముద్దొచ్చే చక్కని బొమ్మ. మోడ్రన్ దుస్తులు ధరించినా.. సంప్రదాయబద్ధమైన వస్త్రాలతో ముస్తాబైన ఆ బొమ్మ మగువకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఆ బొమ్మే పిల్లలకు ఎంతో ఇష్టమైన బార్బీ డాల్. ఈ కుందనాల బొమ్మ ఇప్పుడు సరికొత్త రూపుతో సోషల్ మీడియలో హల్చల్ చేస్తోంది. తలచుట్టూ దుపట్టా కప్పుకొని అచ్చమైన ముస్లిం సంప్రదాయ యువతి రూపులో బార్బీ బొమ్మ తాజాగా హల్చల్ చేస్తోంది. నిజానికి బార్బీ బొమ్మ రూపురేఖల్లో గత నెలకాలంలో ఎంతోమార్పు వచ్చింది. శరీర వర్ణంతోపాటు దుస్తులు, డిజైన్ విషయంలో పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ నైజీరియన్ వైద్య విద్యార్థిని హానీఫా ఆదం బార్బీ బొమ్మకు సంప్రదాయబద్ధమైన ముస్లిం రూపురేఖలు అద్దింది. తలచుట్టూ దుపట్టా కప్పుకొని ముస్లిం యువతిలా సంప్రదాయబద్ధంగా కనిపించే బార్బీ బొమ్మలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తూ వచ్చింది. ఈ ఫొటోలతో సోషల్మీడియలో హల్చల్ చేస్తుండటంతో హనీఫా ఇప్పుడు స్టార్గా మారిపోయింది. బ్రిటన్లో ఫార్మాకాలజీలో మాస్టర్స్ చదువుతున్న నైజీరియన్ విద్యార్థిని హానీఫా బార్బీ బొమ్మ తనకెంతో స్ఫూర్తినిచ్చిందని, అందుకే ఆ కుందనాల బొమ్మకు అచ్చమైన ముస్లిం సంప్రదాయబద్ధమైన రూపు ఇవ్వడం అవసరంగా తాను భావించానని, అందుకే బురఖాతోపాటు వివిధ ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో బార్బీని తీర్చిదిద్ది పోస్టు చేస్తున్నానని ఆమె చెప్తోంది.