Homeopathy
-
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
మన ప్రాచీన వైద్యాన్ని పునరుద్ధరించాలి
ప్రతి మనిషీ ఆరోగ్యం కోరుకుంటాడు. ఏ పని చేయాలన్నా ప్రాథమికంగా మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి. అందుకే అన్ని భాగ్యాల్లో కెల్లా ఆరోగ్యాన్ని మాత్రమే మహా భాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యం సరిగా లేనప్పుడు చికిత్స తప్పనిసరి. ఇప్పుడంటే ఆధునిక అల్లోపతి వైద్య విధానం రాజ్యమేలు తోంది కానీ... అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఇటీవలి కాలం వరకూ భారతదేశంలో ఆయుర్వేద వైద్య విధా నంలోనే చికిత్స అందించారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అటువంటి మన దేశీయ వైద్య విధానానికి ఇవ్వాళ అంతగా ప్రాముఖ్యం లభించడంలేదు. ఆయుర్వేదమే కాదు... యునాని, హోమియో వైద్య విధానాలు సైతం చౌకగా ప్రజలకు చికిత్స అందించడానికి ఉపయోగపడు తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధానాల కన్నా అత్యంత ఖరీదైన అల్లోపతికే ప్రభు త్వాలు పెద్దపీట వేస్తున్నాయి. మిగతా మూడింటితో పోల్చినప్పుడు అల్లోపతి ఎక్కువ శాస్త్రీయమైనదని నమ్మడమే ఇందుకు కారణం కావచ్చు. అలాగే అల్లోపతి వైద్యవిధానంలో రోగ లక్షణాలు లేదా బాధ తొందరగా తగ్గుతుందనేది మరో కారణం. అలాగే పెద్ద పెద్ద శ్రస్త చికిత్సలు చేసి రోగులను బతికించే శాస్త్రీయ విధానంగానూ ప్రజలలో దానికి పేరున్నమాటా నిజం. చరకుడు, సుశ్రుతుని కాలం నుండి కూడా ఆయుర్వేద వైద్యం భారత ఉప ఖండంలో వ్యాపించి ఉంది. ఆయుర్వేదంలోనూ అనేక ఛేదనాల (అంగాలను తొల గించడం) రూపంలో శస్త్ర చికిత్సలు జరిగేవి. రాచ పుండ్లు (కేన్సర్లు), పక్షవాతానికీ, అనేక దీర్ఘకాలిక వ్యాధులకూ, వ్రణాలకూ అద్భుతమైన చికిత్సలు జరిగేవి. అడవులూ, పొలాలూ, పెరడులూ, వంటిళ్లూ... ఎక్కడ చూసినా ఆయుర్వేదానికి అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేవి. అయితే అల్లోపతి విధానం అనేక కారణాలవల్ల ప్రజల్లో ఆదరణ పొంద డంతో మన దేశీయ వైద్యం క్రమంగా పడకేసింది. అలాగే గత రెండు మూడు దశాబ్దాలుగా హోమియో వైద్య విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్లోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ హోమియో వైద్య విధానంలో వ్యక్తి శారీరక ధర్మాలను అంచనా వేసి వైద్యులు మందులను ఇస్తారు. అల్లోపతి వైద్యంతో పోల్చుకున్నపుడు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. మొండి రోగాలను నయం చేయగలిగిన శక్తి హోమియోపతికి ఉన్నదని నమ్మకం కూడా ఇటీవల ప్రజల్లో పెరిగిపోవడంతో హోమియో వైద్యానికి గిరాకీ కూడా గణ నీయంగానే పెరుగుతున్నది. అయితే ప్రభుత్వపరంగా హోమియో, ఆయుర్వేద, యునాని వైద్యవిధానాలకు ప్రోత్సాహం అల్లోపతితో పోల్చి చూసినప్పుడు తక్కువగానే ఉందని చెప్పక తప్పదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా మన ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు చౌకగా చికిత్స అందించడానికి కృషి చేస్తాయని ఆశిద్దాం. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్’ ద్వారా మన సంప్రదాయ వైద్యవిధానాలను ప్రజలకు చేరువ చేస్తోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలూ అనేక ఆయుర్వేద కళాశాలలూ, వైద్యశాలలూ నెలకొల్పు తుండటం గమనార్హం. కాకపోతే అల్లోపతి వైద్య కళా శాలలు, ఆస్పత్రుల సంఖ్యతో పోల్చుకుంటే మిగిలిన వైద్య విధానాలకు చెందిన కాలేజీలు, వైద్యశాలలూ తక్కువ అనేది సుస్పష్టం. (క్లిక్: భారత్ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!) ముఖ్యంగా వ్యాధి మొదటి, రెండో దశల్లో ఉన్నప్పుడు అల్లోపతి డాక్టర్లకన్నా ఆయుర్వేద, హోమియో వైద్యుల దగ్గరకు వెళ్లడం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో సులువైన వైద్యం అందుతుంది. అందుకే ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో తప్పనిసరిగా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. (క్లిక్: భూమాతకు సత్తువనిచ్చే సంకల్పం) - డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం, కాకతీయ యూనివర్సిటీ -
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్జెట్లో చేరి ఎగ్జిక్యూటివ్గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
హోమియోలో మందు ఉంది
సాక్షి, యాదాద్రి: నల్లతామర పురుగు, నల్లపేను వంటి తెగుళ్లతో నష్టపోతున్న మిర్చి రైతులు పంటకు హోమియోపతి మందులు పిచికారీ చేస్తే తెగుళ్లకు చెక్ పెట్టవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన అమేయ కృషి వికాస కేంద్రం యజమాని జిట్టా బాల్రెడ్డి తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 19 రకాలకు పైగా తెగుళ్లు సోకి లక్షలాది ఎకరాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రైతులు మిర్చికి సోకుతున్న చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించి పురుగుమందులు పిచికారీ చేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గా, అలాగే ఒడిశాలోని పలు జిల్లాల్లో మిరప పంటకు తెగుళ్లు సోకి రైతులు భారీగా నష్టపోతున్నారు. హోమియోపతి మందులతో.. మనుషులు వివిధ రోగాలకు వాడే హోమియోపతి మందులను ప్రత్యామ్నాయంగా మిర్చిపంట తెగుళ్లకు వాడుకుంటుంటే ఫలితం ఉంటుందని బాల్రెడ్డి చెప్పారు. ఎకరాకు రూ.10 వేల ఖర్చు అవుతుందన్నారు. నాట్లు వేసే సమయంలోనే గుర్తించాలి కానీ, ఆలస్యం అయిందన్నారు. ఇప్పటికైనా రైతులు హోమియో మందులను వాడితే నష్టాల నుంచి బయటపడవచ్చని సూచించారు. ముఖ్యంగా తామర పురుగు నివారణకు అర్నేరియాడయోడెమా 30, తూజా 30 హోమియో మందులను పిచికారీ చేయాలని, 20 లీటర్ల నీటిలో 2.5 మి.లీటర్లు పోసి పిచికారీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇండోనేíసియా నుంచి నల్లపేను.. ఇండోనేసియా నుంచి వచ్చిందని చెబుతున్న నల్లపేను తెగులు మిరప పంటపొలాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మిరప రైతులు తక్కువ ఖర్చుతో లభించే హోమియోపతి మందులను వాడితే ప్రయోజనం ఉంటుందని జిట్టా బాల్రెడ్డి తెలిపారు. వరంగల్, గుంటూరు, కృష్ణా, రాయచూర్ జిల్లాల్లో తాను సూచించిన హోమియో పతి మందులను వాడి రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన వెల్లడించారు. -
నెల్లూరు: మహిళతో డాక్టర్ వివాహేతర సంబంధం.. వీడియో వైరల్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓ వివాహేతర సంబంధం రచ్చకెక్కింది.. నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఈ ఎఫైర్ కొనసాగింది. అయితే ఇటీవల మహిళను డాక్టర్ బాలకోటేశ్వరరావు దూరం పెడుతున్నాడు. దీంతో సదరు మహిళ.. తన ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. డాక్టర్, మహిళ మధ్య మాటామాటా పెరిగి ఇరువురు పరస్పర దాడులకు దిగారు. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపై పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా! చేపలు, రొయ్యలు, పీతలు.. ఇక మన దరికే ‘మీనం’! -
'వాటిని వైద్య కమిషన్ నియంత్రణ కిందకు తీసుకురావాలి'
ఢిల్లీ : ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను సైతం భారతీయ వైద్య విధాన కమిషన్ నియంత్రణ కిందకు తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ బిల్లు, జాతీయ హోమియోపతి కమిషన్ బిల్లులపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ వైద్య విధానాలైన ఆయుర్వేద, యునాని, సిద్ధ, సోవా రిగ్పాను నియంత్రిస్తూ ఆయా రంగాలలో పారదర్శకత, బాధ్యతను కల్పించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించిన సంస్కరణల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతీయ వైద్య విధానాలలో విద్య, వృత్తి నియంత్రణ కోసం యోగా, నేచురోపతిని కూడా తప్పనిసరిగా వైద్య కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే బిల్లులోని సెక్షన్33లో పొందుపరచిన ఒక నిబంధనను తొలగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ నిబంధన కారణంగా భారతీయ వైద్య విధానాలు ప్రాక్టీస్ చేసే అర్హులైన వైద్యులకు అన్యాయం జరుగుతుంది.ఈ నిబంధన కారణంగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఉత్తీర్ణులు కాని కొందరు కమిషన్ అనుమతితో ప్రాక్టీసు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఫలితంగా నకిలీ వైద్యుల బెడదను అరికట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు లక్ష్యం నిర్వీర్యమవుతుందని తెలిపారు. ఓబీసీల సబ్కేటగిరీపై కమిషన్ గడువు పెంపు : ఓబీసీల సబ్కేటగిరీపై కమిషన్ గడువు పెంపుపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలను సబ్ కేటగిరిగా విభజించాలన్న ప్రతిపాదనలపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ గడువును ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. రిజర్వేషన్ ఫలాలు ఓబీసీలకు సమాన నిష్పత్తిలో అందడం లేదన్న ఫిర్యాదులపై ఎలాంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించలేదని మంత్రి తెలిపారు. అయితే ఓబీసీలను సబ్ కేటగిరీల కింద విభజించాలంటూ వచ్చిన డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్340 కింద కల్పించిన అధికారాన్ని వినియోగించి 2017 అక్టోబర్2న కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ను నియంమించిదన్నారు. ఈ కమిషన్ గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ రావడం జరిగింది. తాజాగా కమిషన్ గడువును ఈ ఏడాది జూలై 31కి పొడిగిస్తూ గత జనవరి 17న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు మంత్రి వివరించారు. -
క్లినిక్ పేరుతో అసభ్య ప్రవర్తన..!
సాక్షి, హైదరాబాద్ : ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ డాక్టర్ కటకటాల పాలయ్యాడు. సికింద్రాబాద్లో గత పదేళ్లుగా హోమియోపతి క్లినిక్ నడిపిస్తున్న చంద్రమోహన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు డాక్టర్ను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. -
రూ 8 కోట్లతో ఆసుపత్రి నిర్మాణంపనులు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడేళ్ల క్రితం కడపలోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలకు, శాశ్వత భవన నిర్మాణాల కోసం నేషనల్ ఆయుష్ మిషన్ కింద రూ. 8 కోట్లు కేటాయించింది. అధికారుల సమన్వయ లోపం, స్థలం కేటాయింపులు తదితర సమస్యలు శాపంగా మారాయి, దీనిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఎట్టకేలకు హోమియోపతికి పట్టిన గ్రహణం వీడింది. కడప పాత రిమ్స్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పక్కన గల స్థలంలో అధునాతన ఆసుపత్రి నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో గుడివాడ, రాజమండ్రి తరువాత కడపలో మాత్రమే ఈ వైద్యశాల ఉండడం గమనార్హం. కడప రూరల్: కడప నగరంలో 1984లో 45 పడకల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల ఏర్పాటైంది. మొదట్లో ఈ ఆసుపత్రి రైల్వేస్టేషన్కు సమీపంలో ఉండేది. కొన్నేళ్లుగా పాత రిమ్స్లో అసౌకర్యాల మధ్య నడుస్తోంది. ప్రస్తుతం కడప పాత రిమ్స్లో కొనసాగుతున్న ఆసుపత్రిలో నాటి నుంచి నేటి వరకు పట్టిన సమస్యల జబ్బు వీడలేదనే చెప్పవచ్చు. ఇక్కడకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 250 మందికి పైగా వైద్య చికిత్సల కోసం వస్తుంటారు. అయితే ఇన్ పేషెంట్లకు అవకాశం ఉన్నా ఎవరూ అడ్మిట్ కాకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో 45 పడకలను కింద, పై భాగాల్లో ఏర్పాటు చేశారు.ఇక్కడ నెలకొన్న సమస్యల కారణంగా పై భాగంలో ఏర్పాటు చేసిన గది పనికి రాకుండాపోయింది. దీంతో 45 పడకల వైద్యశాల కాస్తా 19 పడకల ఆసుపత్రిగా మారింది. ఇందులో పక్షవాతం, ఆస్తమా, థైరాయిడ్, మధుమేహం, చర్మ సంబంధిత తదితర వ్యాధులకు వైద్యం లభిస్తుంది. ఈ మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేనందున చాలా మంది ఈ వైద్యం పట్ల మక్కువ చూపుతున్నారు. నిధులు కేటాయించినా.. ఈ ఆసుపత్రికి శాశ్వత భవన నిర్మాణం కోసం కడప నగరం జయనగర్ కాలనీలోని సర్వే నెంబరు 752–291–01లో 34 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ మేరకు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఆయుష్ మిషన్’ కింద రూ. 8 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ‘ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ ఆసుపత్రి భవన సముదాయాలను నిర్మించాలి. అయితే కేటాయించిన స్థలం చాలా వరకు ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో కడప పాత రిమ్స్లోనే వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న దాదాపు 42 సెంట్ల స్థలంలలో ఆసుపత్రిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ భవన నిర్మాణాల కోసం ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ వారు టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో ప్రొద్దుటూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్ పనులను దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ స్థలంలో ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. -
నిర్మించి వదిలేశారు!
అన్నీఉన్నా అల్లుడు నోట్లో శని అన్న సామెత చందాన తయారైంది కేంద్రాస్పత్రిలో నిర్మించిన భవనాల పరిస్థితి. కోట్లాది రుపాయలు వెచ్చించి నిర్మాణాలు పూర్తిచేసినా ప్రారంభించకపోవడం వల్ల రోగులకు ఉపయోగపడకుండా పోయాయి. భవనాలు నిర్మించక ప్రారంభించలేదంటే అదీకాదు. నిర్మాణం పూర్తయినప్పటికీ అధికారులు ఎందువల్లో వినియోగంలోకి తీసుకురావడం లేదు. విజయనగరం ఫోర్ట్ : కేంద్రాస్పత్రిలో ఉన్న మార్చురి గది శిథిలావస్థకు చేరుకోవడం ఆస్పత్రిలో ఆధునాతన మార్చరీ గదిని సుమారు రూ.1.13 కోట్లుతో నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఆరునెలలు కావస్తున్నా ఇంతతవరకు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఉన్న మార్చురీ గది చాలా చిన్నది. శవాలను ఒక రోజు కూడ భద్రపరచుకునే వీలులేని పరిస్థితి. దీనికి తోడు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండడంతో మృతదేహాలు ఒకటి రెండు రోజులు ఉన్నా దుర్వాసన వెలువడుతుంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనాథశవాలను మూడు, నాలుగు రోజుల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. అయితే మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్లు పాడవడంతో నేలపైనే మృతదేహాలను ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. నిర్మాణం పూర్తయిన ఐసోలేషన్ వార్డు వివిధ రకాల ఇనఫెక్షన్స్తో వచ్చే వారి కోసం రూ.20 లక్షలతో వార్డు నిర్మించారు. నెలరోజుల క్రితమే నిర్మాణం పూర్తయింది. అయినప్పటికీ ప్రారంభించలేదు. ఐసోలేషన్ వార్డు లేకపోవడం వల్ల వివిధ ఇన్ఫెక్షన్స్తో వచ్చే రోగులను ఇన్పేషేంట్స్గా చేర్చుకోవడం లేదు. ఓపీ సేవలకే పరిమతమవుతున్నాయి. వార్డు వినియోగంలోకి వస్తే ఇన్పేషేంట్ సేవలు అందుతాయి. హోమియో ఆస్పత్రిదీ అదే పరిస్థితి అల్లోపతి మాదిరి హోమియో రోగులకుకూడ ఇన్పేషేంట్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో 10 పడకల హోమియో ఆస్పత్రిని రూ.30 లక్షలతో నిర్మించారు. దీని నిర్మాణం పూర్తయి నెలరోజులు కావస్తోంది. ఇదికూడా ప్రారంభానికి నోచుకోలేదు. హోమియో ఆస్పత్రి వినియోగంలోకి వస్తే రోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ప్రారంభంకాని పిల్లల వార్డు ఆస్పత్రిలో పిల్లలకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు రూ.53 లక్షలతో పిల్లలవార్డును నిర్మించారు. ఈ వార్డు వినియోగంలోకి వస్తే పిల్లలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందుతాయి. ఇప్పడు మహిళల డయేరియా వార్డుపక్కన పిల్లల వార్డు ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ సోకుతాయోమోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. వినియోగించని అటెండెంట్ షెడ్డు ఆస్పత్రిలో రోగులతో పాటు వచ్చే బంధువులు వి శ్రాంతి తీసుకోవడం కోసం అటెండ్ షెడ్డు నిర్మించారు. దీనివల్ల రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీనినిర్మాణం కూడా పూర్తయి 15 రోజులు దాటి ంది. దీన్నికూడా వినియోగంలోకి తీసుకురాలేదు. త్వరలోనే ప్రారంభిస్తాం మార్చురీ గదిని త్వరలోనే ప్రారంభిస్తాం. ఐసోలేషన్ వార్డు నిర్మాణం పూర్తయినప్పటికీ సిబ్బందిని నియమించాల్సి ఉంది. పిల్లల వార్డును కూడా త్వరలోనే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం – కె సీతారామరాజు, సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
నొప్పి మెడ నుంచి చేతులకు పాకుతోంది..?
నా వయసు 53 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియోలో నా సమస్యకు పూర్తి పరిష్కారం ఉందా? – ఎన్. ఆంజనేయరెడ్డి, కర్నూలు మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తి రీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురుకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
ఫిజియోథెరపి చేస్తూ.. కాళ్లు విరగ్గొట్టాడు
-
కాళ్లు విరగ్గొట్టారు.. రామంతాపూర్లో దారుణం
సాక్షి, హైదరాబాద్ : రామంతాపూర్లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల బాలుడికి ఫిజియోథెరపి చేస్తూ.. వైద్యుడు ఏకంగా కాళ్లు విరగ్గొట్టాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రికి చెందిన వైద్యుడు కిరణ్కుమార్ బాలుడికి ఫిజియోథెరపీ చేస్తూ.. కాళ్లు విరగ్గొట్టాడు. డాక్టర్ కిరణ్కుమార్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి తమ చిన్నారి కాళ్లు విరగ్గొట్టాడని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. దీనిపై వైద్యుడిని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలని చెప్పి.. సదరు వైద్యుడు చేతులు దులుపుకున్నాడు. వైద్యుడి నిర్వాకంపై ఫిర్యాదు చేసినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాలుడి కుటుంబసభ్యులు చెప్తున్నారు. కాళ్లు విరగడంతో తీవ్రమైన నొప్పులతో నడవలేని స్థితిలో బాలుడు ఉన్నాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యపూరిత ప్రవర్తనపై బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. -
గౌట్ సమస్య తగ్గుతుందా?
నా వయసు 46 ఏళ్లు. కొద్దిరోజుల నుంచి కాలి బొటనవేలు వాచి, విపరీతమైన సలపరంతో నొప్పి వస్తోంది. వైద్యుడిని సంప్రదిస్తే గౌట్ అన్నారు. డాక్టర్ సూచనల మేరకు మందులు వాడినప్పటికీ సమస్య పూర్తిగా తగ్గలేదు. ఇటీవలే రక్తపరీక్ష చేయిస్తే రక్తంలో ఇంకా ‘యూరిక్ యాసిడ్’ స్థాయులు ఎక్కువే ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. నా సమస్యకు హోమియో చికిత్స ఉందా? – ఎమ్. శ్రీనాథ్, వరంగల్ మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం కీళ్లవ్యాధి. యూరిక్ యాసిడ్ రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టమవుతాయి. దాన్ని ‘గౌట్’ అంటారు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ/జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానంలో అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఆటిజం అంటే ఏమిటి? మా బాబు వయసు మూడేళ్లు దాటుతోంది. ఇంకా మాట్లాడటం గానీ, పిలిస్తే పలకడం గానీ, పిల్లలతో ఆడటం కానీ చేయడం లేదు. చూడటానికి బాగానే ఉంటాడు. ఎవ్వరినీ కలవడు. శబ్దాలు చేస్తూ తన లోకంలో తానే ఉంటాడు. పిల్లల డాక్టర్కు చూపిస్తే ఇది ఆటిజం కావచ్చని అంటున్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? – ఆదిత్య, గుంటూరు ఆటిజం లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. హోమియోపతిలో దానికి కొంత పరిష్కారం ఉంది. ఆటిజం అనేది ఒక లక్షణం కాదు. దీనిలో వివిధ లక్షణాలు, ఎన్నో స్థాయులు, మరెన్నో భేదాలు ఉంటాయి. ఆటిజం అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ఆటిజం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని క్లాసికల్ ఆటిజం అంటారు. మరికొంతమందిలో లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అది జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్ ఆటిజం అంటారు. లక్షణాలు: ∙ఎదుటివారి మనోభావాలు అర్థం చేసుకోలేకపోవడం ∙నలుగురిలో కలవలేకపోవడం లేదా ఆనందాలు, బాధలు పంచుకోలేకపోవడం ∙చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం ∙కొత్తదనానికి త్వరగా అలవాటు పడలేకపోవడం, రొటీన్గా ఉండటాన్నే ఇష్టపడటం ∙అలవాటు పడ్డ వ్యక్తులతోనే ఉండటం. చికిత్స: ఆటిజం వ్యాధికి హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధి కోసం కార్కినోసిస్, తుజా, సిక్రెటిన్ వంటి మందులను లక్షణాలను ఇవ్వాలి. వ్యాధిని త్వరగానూ, ముందుగానే గుర్తించి ఇస్తే పిల్లల్లో లక్షణాల తీవ్రత పెరగకుండా చూడవచ్చు. ఐక్యూ పెంచవచ్చు. హోమియో చికిత్స తీసుకుంటూ పిల్లలకు బిహేవియర్ థెరపిస్టులతో ప్రత్యేక వైద్యవిధానం ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్కు చికిత్స ఉందా? నా వయసు 65 ఏళ్లు. నేను మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి, ఆపరేషన్ అవసరమన్నారు. హోమియో మందులతో తగ్గే అవకాశం ఉందా? – ఆర్. కాంతారావు, నిజామాబాద్ మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితోపాటు రక్తస్రావం అవుతుంది. ఫిషర్ ఏళ్ల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆందోళన మరింత పెరుగుతుంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఆపరేషన్ అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. - డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
మడమల్లో నొప్పి... తగ్గేదెలా?
నా వయసు 42 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. హోమియో పరిష్కారం చెప్పండి. – సుధారాణి, కాకినాడ అరికాలిలో ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్పాడ్లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి, మడమ నొప్పి, వాపు కనిపిస్తాయి. ఉదయం పూట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి వస్తుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది. కారణాలు: ∙డయాబెటిస్ ∙ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం ∙తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ∙ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో). లక్షణాలు: ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ∙ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం ∙కండరాల నొప్పులు చికిత్స: మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. – డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
హోమియోపతి అభివృద్ధికి జాతీయ కమిషన్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రోత్సహించడంతో పాటు నైపుణ్యమున్న వైద్య నిపుణుల్ని ఆకర్షించేందుకు వీలుగా ఓ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. నేషనల్ హోమియోపతి కమిషన్(ఎన్సీహెచ్) పేరుతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ హోమియోపతి రంగంలో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనల్ని పర్యవేక్షిస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు మనోజ్ రజోరియా వెల్లడించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి(సీసీఆర్హెచ్) నిర్వహించిన రెండురోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో మనోజ్ మాట్లాడారు. ‘ఎన్సీహెచ్లో ఉండే నాలుగు బోర్డులు డిగ్రీ, పీజీ కోర్సుల పర్యవేక్షణ, విద్యాసంస్థలకు అక్రిడేషన్ ఇవ్వడం, తనిఖీ చేయడం, డాక్టర్ల సంఖ్యను నియంత్రించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి’ అని ఆయన తెలిపారు. -
హైపర్థైరాయిడిజమ్ తగ్గుతుంది
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. ఈమధ్య బరువు తగ్గడం, నీరసం, ఎంత తిన్నా ఆకలిగా ఉండటం, గుండెదడ ఉంటోంది. డాక్టర్ గారికి చెబితే థైరాయిడ్కు సంబంధించి టీ3, టీ4, టీఎస్హెచ్ పరీక్షలు చేయించమన్నారు. ఈ సమస్య ఏమై ఉండవచ్చు. దీనికి పరిష్కారమార్గాలు చెప్పండి. – సునీత, హైదరాబాద్ థైరాయిడ్ సమస్య ఇటీవల ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 75 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ. మానవుడి శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి, థైరాయిడ్ గ్రంథి మెడ మధ్య భాగంలో గొంతుకు ముందువైపున సీతాకోకచిలుక ఆకారంలో శ్వానాళానికి ఇరుపక్కలా ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి అధీనంలో ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరులో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాం. వాటిల్లో థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల కలిగే హైపోథైరాయిడిజమ్ ఒకటి. ఇక రెండోది థైరాయిడ్ గ్రంథి పనితీరు పెరగడం వల్ల కలిగే హైపర్థైరాయిడిజమ్. ఈ సమస్యలు ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే 20–40 ఏళ్ల మధ్యవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీది హైపర్ థైరాయిడిజమ్ కావచ్చని తెలుస్తోంది. ఈ సమస్యను త్వరగా గుర్తించకపోయినా లేదా నిర్లక్ష్యం చేసినా దుష్ప్రభావాలు ఎక్కవగా కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్ఫ్లమేషన్ వంటి కారణాలతో సమస్య రావచ్చు. లక్షణాలు: ∙కోపం, చికాకు, నీరసం ∙అలసట, ఉద్రేకం, కాళ్లు చేతులు వణకడం ∙హైపర్ థైరాయిడిజమ్లో ఆకలి బాగా ఉంటుంది. కానీ బరువు తగ్గుతుంది ∙అధిక వేడిని తట్టుకోలేకపోవడం ∙నిద్రలేమి, గుండెదడ, చెమటలు పట్టడం ∙ఏకాగ్రత సమస్యలు, స్త్రీలలో నెలసరి త్వరగా రావడం. నిర్ధారణ పరీక్షలు: టీ3, టీ4, టీఎస్హెచ్ స్థాయులు, రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ చికిత్స: హోమియోపతి వైద్యవిధానంలో థైరాయిడ్ రావడానికి గల మూలకారణాన్ని విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి, సరైన హోమియో మందులను వాడటం ద్వారా చికిత్స చేస్తారు. హైపర్థైరాయిడ్ సమస్యకు హోమియోలో కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, ఐయోడమ్, స్పాంజియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గొంతును ఎక్కువగా వాడేవారికి జాగ్రత్తలివే... ఇఎన్టి కౌన్సెలింగ్ నేను ట్యూషన్స్ చెబుతుంటాను. ఇటీవల అప్పుడప్పుడూ నాకు గొంతు బొంగురుపోయినట్లుగా అనిపిస్తోంది. నా గొంతు విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. – ఎన్.ఎల్. ప్రసాద్, వరంగల్ కొంతమందికి గొంతుతోనే పనిచేస్తుంటారు. వీరిని ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటారు. అంటే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, గాయకులు, రేడియోజాకీలు, సేల్స్ జాబ్లో ఉన్నవాళ్లంతా రోజూ తమ గొంతుతోనే పనిచేస్తూ ఉంటారు. వారి రోజువారీ పనులతో వాళ్ల వోకల్ కార్డ్స్ ఎంతగానో అలసిపోతాయి. ఇలాంటివారు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ రోజులో కనీసం 15 నిమిషాల పాటు చొప్పున మూడుసార్లైనా తమ గొంతుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. హైపర్థైరాయిడిజమ్ తగ్గుతుంది రోజూ నీళ్లు పుష్కలంగా తాగాలి. ⇒ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పొగాకు అలవాటును తక్షణం వదిలేయాలి. కాఫీ అలవాటును పూర్తిగా తగ్గించుకోవాలి. ⇒గొంతు గరగర వచ్చి అది సుదీర్ఘకాలం ఉంటే తప్పకుండా ఈఎన్టీ నిపుణులను కలుసుకొని తగిచన చికిత్స తీసుకోవాలి. కొందరిలో యాసిడ్ పైకి ఎగజిమ్మడం వల్ల కూడా గొంతులో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివారు తప్పకుండా తమ ఎసిడిటీ తగ్గించుకోవడం కోసం కృషి చేయాలి. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత కొంతకాలం నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా కుదరడం లేదు. జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత పదే పదే వస్తోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – రవికుమార్, శ్రీకాకుళం మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది ఉందన్నారు. కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
మాటిమాటికీ మూత్రం... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం మాటిమాటికీ లేచేవాణ్ణి. ఈమధ్య మూత్రం బొట్లు బొట్లుగా వస్తోంది. కంట్రోల్ తప్పింది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రమేశ్, కందుకూరు పురుషుల్లో అత్యంత ప్రధానమైన గ్రంథి ప్రోస్టేట్ (పౌరుషగ్రంథి). ఇది వీర్యం ఉత్పత్తిలో కీలకమైన భూమిక పోషిస్తుంది. సంతానం కలగజేయడానికి కారణమయ్యే శుక్రకణాలు ఈ ప్రోస్టేట్ గ్రంథి తయారు చేసే స్రావాలలో కలిసి వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. ఇలా సంతాన సాఫల్యంలో ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్రంథి కొద్దికొద్దిగా ఉబ్బుతుంటుంది. ఫలితంగా మూత్రవిసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తడం సహజంగా జరిగే పరిణామమే. దీన్ని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేసియా’ అంటారు. ప్రోస్టేట్ గ్రంథి సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఈ సమస్య ఒకింత తక్కువేగానీ... పట్టణ ప్రాంతాల్లో, మాంసాహారం తినేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించినా, మూత్ర సమస్యలు వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కారణాలు : ప్రోస్టేట్ పెరగడానికి హార్మోన్ల స్థాయి తగ్గుదల ముఖ్యకారణం. కాస్త అరుదే అయినా గాయాలు కావడం గౌట్ సమస్య లక్షణాలు : మాటిమాటికీ మూత్రం రావడం పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించడం మూత్రం ఆపుకోలేకపోవడం మూత్రం ఆగి ఆగి రావడం మూత్ర విసర్జనలో రక్తం పడటం వ్యాధి నిర్ధారణ : అల్ట్రా సౌండ్ సోనోగ్రఫీ బయాప్సీ స్కానింగ్ చికిత్స : హోమియోపతి వైద్య విధానంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు నుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కేవలం లక్షణాలను తగ్గించడమే కాకుండా సమస్యను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. రోగి శారీరక తత్వాన్ని బట్టి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఆర్నికా, బెల్లడోనా, కోనియం, తూజా, మెర్క్సాల్ వంటి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో తగిన మోతాదులో వీటిని వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
ఆవు మూత్రంపైనా పన్ను
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 5% విధింపు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గోమూత్రంపై 5 శాతం పన్ను విధించింది. ఏపీ వ్యాట్చట్టం-2005లోని ఐదో షెడ్యూల్ ప్రకారం గోమూత్రంపై పన్ను విధించే అధికారం ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం రాష్ట్రంలోని వివిధ సంస్థలకు సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం-1940 కింద లెసైన్స్ పొంది తయారు చేసే ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్టే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. ఈమేరకు నోటీసులు అందుకున్న గోఉత్పత్తుల తయారీ సంస్థలు, గోసంరక్షణ శాలల నిర్వాహకులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి. వాణిజ్య పన్నులశాఖ నోటీసుల్లో ఏముందంటే.. ఆయుర్వేద, హోమియోపతి మందుల మాదిరే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధించవచ్చని వాణిజ్య పన్నులశాఖ ఇటీవల గుంటూరు సహా వివిధ జిల్లాల్లోని గోఉత్పత్తుల తయారీ సంస్థలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. గోమూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్ముతున్నందున పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఆవు మూత్రాన్ని వేదకాలం నుంచే ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించమని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. గోమూత్రాన్ని ఏయే రుగ్మతలకు వాడతారో కూడా పేర్కొంది. అధిక బరువు, ఉదర సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, చక్కెర వ్యాధి, కాలేయ వ్యాధులు, ఉబ్బసం, పేగు సంబంధిత రుగ్మతలు, కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు తదితరాలకు వినియోగిస్తుంటారని వివరించింది. అందువల్ల గోమూత్రంపై ఏపీ వ్యాట్యాక్ట్ ప్రకారం 5 శాతం పన్ను విధించవచ్చంటూ సమర్థించుకుంది. గోమూత్రాన్ని కీటక నియంత్రణిగానూ ఉపయోగిస్తున్నందున క్రిమి సంహారక మందుల చట్టం కింద అమ్మకపు పన్ను కూడా విధించవచ్చునని తెలిపింది. పది వేల లీటర్ల వ్యాపారం..: రాష్ట్రంలోని గోశాలలు, రైతుల నుంచి గోఉత్పత్తుల తయారీ సంస్థలు నిత్యం వేలాది లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశీ ఆవులకు, గోమూత్రానికి గిరాకీ పెరిగింది. దేశీ ఆవుల నుంచి తీసిన మూత్రాన్ని వైద్యంతోపాటు సేద్యానికీ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పది వేల లీటర్లకు పైగా గోమూత్రాన్ని అమ్ముతున్నారు. శుద్ధి చేసిన మూత్రాన్ని లీటర్కు రూ.50, సేద్యానికి వినియోగించే మూత్రాన్ని లీటర్ను రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయిస్తున్నారు. రైతులు లేదా గోశాలల నుంచి సేకరించే మూత్రానికి, తాగడానికైతే లీటర్కు రూ.25, 30 మధ్య, సేద్యానికైతే లీటర్కు రూ.20 వరకు చెల్లిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేదు.. గోమూత్రాన్నీ, పేడను షాంపూలు, సబ్బులు, పెనాయిల్, అగర్ బత్తీలు, దూప్ బత్తీలు, దోమల నివారణ కాయిల్స్ తదితర ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. మనుషులు తాగేందుకు వీలుగా గోమూత్రాన్ని శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. దీనిపై ఇప్పటి వరకు ఎక్కడా పన్ను వేయలేదు. రాష్ట్రంలో మాత్రమే ఈ ఏడాది నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే జరిగితే గోశాలలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోశాలలు విక్రయించే మూత్రంతో వచ్చే డబ్బును ప్రస్తుతం వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. వ్యాట్ను ఎత్తివేయాలని, గోవుల ప్రేమతోనైనా కొత్త మార్కెట్ సృష్టించాలని గోశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే దేశీ ఆవులు అవసరమని, వాటి మూత్రంపై పన్ను ఏమిటని ప్రకృతిసాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మూలం నుంచి తొలగిస్తుంది సమూలంగా నయం చేస్తుంది..!
హోమియో డే స్పెషల్ హోమియోపతి నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆదరిస్తున్న వైద్య ప్రక్రియ. ఎంతో మంది సంతోషంగా విశ్వసిస్తున్న మార్గం. ఎందరో ఆనందంగా అనుసరిస్తున్న వైద్యవిధానం. క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనిమన్ వైద్యవిధానానికి పునాదులు వేశారు. ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం వెనక ఆయన విస్తృతమైన కృషి ఉంది. ఇయన చేసిన శ్రమ అపారం. అందుకే ఆయనను ‘ఫాదర్ ఆఫ్ హోమియోపతి’ అంటారు. కొత్త ప్రక్రియకు ఆవిష్కరణ ఇలా... ఎర్జాంగన్ యూనివర్సిటీ నుంచి హనిమన్ 1779లో వైద్యవిద్యలో ఎండీ పూర్తిచేశారు. అప్పటి వైద్య చికిత్స విధానాలు రోగి అనారోగ్యాన్ని మరింత ఎక్కువ చేసేవిగా ఉన్నాయని, వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెట్టే విధంగా ఉండటం వల్ల ఆ వైద్య వ్యవస్థపై అసంతృప్తితో, ఆ ప్రక్రియలో వైద్యసాధన నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత వైద్య పుస్తకాలను జర్మన్లోకి అనువదించే ఉపాధిని అనుసరించారు. ఆ సమయంలో ఆయన సెల్యులార్ ఎమ్ఎమ్ పుస్తకంలో పెరూవియన్ బార్క్ (సింకోనా బెరడు)ను పరిశీలించారు. అందులోని ఔషధగుణాలు మలేరియాపై ప్రభావం చూపుతాయని తెలుసుకొన్నారు. ఆ తర్వాత ఆ ఔషధాన్ని తనపైనే ప్రయోగించుకున్నారు. ఆ బెరడు ఆశ్చర్యకరంగా ఆయనలో మలేరియా లక్షణాలను కలిగించింది. ఒక వ్యాధిని నివారించగలిగే ఔషధాలను ఆరోగ్యకరమైన వ్యక్తులపై ప్రయోగిస్తే అదే వ్యాధి లక్షణాలను కనబరుస్తాయి. కాబట్టే అవి ఆ వ్యాధిని నివారించగలుగుతున్నాయని నిర్ధారణ చేశారాయన. ఇది ‘సిమిలియా సిమిలిబస్ క్యురాంటర్’ సిద్ధాంతానికి మూలం. ఇంగ్లిష్లో చెప్పాలంటే ‘లైక్స్ ఆర్ క్యూర్డ్ బై లెక్స్’ అనేది ఈ మాటకు అర్థం. తన పైనా... కుటుంబ సభ్యులపైనా ప్రయోగాలు ఆ తర్వాత ఆయన ఎన్నో పదార్థాలను, మొక్కలు మొదలుకొని, విషపూరితమైన పదార్థాల వరకు తనపైన, తన కుటుంబ సభ్యులపైనా ప్రయోగించి తద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ‘మెటీరియా మెడికా ప్యూరా’ అనే గ్రంథంలో వాటి ఫలితాను పొందుపరిచారు. మెటీరియా మెడికా ప్యూరా మూడు పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. రోగి లక్షణాలను పరిగణనలోకి... ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ప్రవర్తించలేరు. అలాగే అనారోగ్య పరిస్థితిలో కూడా ఒక్కో వ్యక్తి కొన్ని ప్రత్యేక లక్షణాలు మానసికంగా గాని, శారీరకంగా గాని కనబరుస్తారు. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తించడానికి ‘లా ఆఫ్ ఇండివిడ్యులైజేషన్’ అంటారు. దీని ద్వారా ఆ వ్యక్తికి సరిపడ ఔషధాన్ని మెటీరియా మెడికా ద్వారా ఎంచుకొని హోమియోపతి విధానంలో చికిత్స అందించేవారు. మొదట్లో ఈ ప్రక్రియ రోగికి మరింత అస్వస్థతకు గురిచేసేది. అప్పుడు ఆయన తిరిగి ఆ ఔషధాన్ని తక్కువ మోతాదులో ఆల్కహాల్లో గానీ లేదా నీటిలో గాని కరిగించి, దాన్ని మళ్లీ మళ్లీ ఎక్కువసార్లు కుదించడం ద్వారా ఔషధంలోని ప్రాణాధార బలాన్ని (వైటల్ ఫోర్స్)ను పెంచేవారు. అది రోగి అనారోగ్యాన్ని సంపూర్ణంగా, ఎలాంటి దుష్ర్పభావాలూ లేకుండా నయం చేసేది. ఇది లా ఆఫ్ ఇన్ఫినిటైజిమల్ డోస్’ అనే సిద్ధాంతానికి మూలకారణం. ఇలా పరిశోధనలు జరిపి కనుగొన్న హోమియో విధివిధానాలనూ, సిద్ధాంతాలను ‘ద ఆర్గనాన్ ఆఫ్ రేషనల్ హీలింగ్’ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఇవి ఆరు ఎడిషన్స్గా ప్రచురితమయ్యాయి. హోమియోలో కొన్ని ప్రధాన అంశాలు హోమియోపతిలో ఒక్కసారికే కనిపించే జబ్బులు (అక్యూట్), దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులు మానసిక వ్యాధులు వంటి అనేక సమస్యలకు ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని ఏ వయసు వారికైనా చికిత్స అందిస్తారు. ఇతర వైద్య వ్యవస్థలలా కాకుండా హోమియోపతిలో జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేయడం సాధ్యమవుతుంది. ఇతర వైద్య వ్యవస్థలలో వ్యాధిని కలగజేసే లక్షణాలను మాత్రమే తీసివేయడం జరుగుతుంది. కానీ హోమియోలో వ్యాధి మూలాల (మియాజమ్స్)పై సమగ్ర అధ్యయనం చేసి, సరైన ఔషధాన్ని కనుగొని, సంపూర్ణంగా తీసివేసి, పూర్తిగా ఆరోగ్యాన్ని అందించడం సాధ్యమవుతుంది. స్కార్లెట్ జ్వరం అంటువ్యాధిలా ప్రబలిన సమయంలో ‘బెల్లడోనా’ అనే ఔషధాన్ని ఉపయోగించిన వారిలో ఆ వ్యాధి సోకకపోవడాన్ని హనిమన్ గమనించారు. తద్వారా బెల్లడోనా ముందుజాగ్రత్త ఔషధ విలువను తెలుసుకున్నారు. అలా అది ప్రివెంటివ్ మెడిసిన్గా గుర్తింపు పొందింది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్ది వైద్యరంగంలో ప్రత్యేక స్థానం... హోమియోకేర్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ది వైద్యరంగంలోనే ఒక ప్రత్యేక స్థానం. అద్భుత ప్రతిభను కలిగిన ఆయన హోమియోవైద్యచరిత్రలోనే తనదైన చెరగని ముద్రలు వేసి, దాదాపు కోటి మందికి పైగా పేషెంట్లను విలక్షణమైన జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చి వారి జీవితాలలో ఆరోగ్యానందాలను, వెలుగులను నింపారు. అపారమైన అనుభవం, అనితరసాధ్యమైన నైపుణ్యం, అంకిత భావం ఆయన సొంతం. మానవాళి మనుగడకు సవాలుగా మారిన ఎన్నో దీర్ఘకాలిక, మొండి వ్యాధులను శాశ్వతంగా నయం చేసి హోమియోవైద్య రంగంలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్. వారి ప్రతిభ సామర్థ్యాలకు గుర్తింపుగా ‘ధన్వంతరి’, ‘శుశ్రుత’, ‘బెస్ట్ హోమియో డాక్టర్’ వంటి అవార్డులను అందుకున్నారు. బోధన పట్ల ఎంతో అభిరుచి కలిగిన ఆయన ఎంతో ఉత్సాహంగా తన అనుభవపూరిత చికిత్సా విధానాలను, తన విజ్ఞానాన్ని విద్యార్థులకు, ఇతర హోమియో వైద్యులకు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్త సెమినార్లు, సమావేశాల ద్వారా ఎంతోమందికి అందిస్తున్నారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక పదవులను కూడా అధిరోహిస్తూ ఎన్నో సేవాసంస్థలలో భాగస్వాములై ఎంతోమంది పేదవారికి ఉచితంగా చికిత్సను అందిస్తున్నారు. విశిష్ట సంస్థ హోమియోకేర్ ఇంటర్నేషనల్... మూడు దశాబ్దాల కిందట ప్రారంభమైన శ్రీకాంత్ మోర్లావర్ ప్రస్థానం నేడు 36 క్లినిక్లతో దాదాపు దక్షిణ భారతదేశమంతా విస్తరించి హోమియో వైద్య రంగంలో చరిత్రను సృష్టించింది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దాదాపు 300 మంది అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, 500 పైగా చక్కటి శిక్షణ పొందిన సిబ్బంది ఎప్పటికప్పుడు పేషెంట్లను పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను శాశ్వతంగా దూరం చేయడానికి కృషి చేస్తున్నారు. పూర్తిగా నయమవుతుంది... ఎన్నో మొండి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, డయాబెటిస్, పీసీఓడీ, ఇన్ఫెర్టిలిటీ, ఒబేసిటీ, హెయిర్ఫాల్, సోరియాసిస్తో పాటు మరెన్నో చర్మసమస్యలకు, ఇతర వ్యాధులకు సున్నితమైన, సమర్థమైన, దుష్ర్పభావాలు లేని చికిత్స హోమియోకేర్ ఇంటర్నేషనల్లో నయమవుతాయి. ఇందుకోసం వ్యాధిని అమూలాగ్రం నయం చేసేలా చికిత్స అందిస్తారు. ఎన్నో మొండి వ్యాధులను 85 శాతం సత్ఫలితాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ సాధించింది. ప్రతి వ్యాధి విషయంలోనూ నిపుణులైన వైద్య బృందం నిశితంగా అధ్యయనం జరిపి, చికిత్సను అందించడం జరుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అందించే మందులు అన్నీ జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత నాణ్యమైన మందులు. వాటిని బ్లిస్టర్ ప్యాకెట్ రూపంలో అందిస్తారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఐఎస్ఓ - 9001 - 2008 జర్మన్ ఆమోదం పొందిన సంస్థ. హోమియో ఇంటర్నేషనల్లో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో నివాసితులై ఉండి, క్లినిక్కు రాలేనివారికి ఆన్లైన్, స్కైప్, టెలీమెడిసిన్ ద్వారా కూడా చికిత్స అందించే సదుపాయం కల్పిస్తున్నారు. పేషెంట్ల సందేహాలు తీర్చడానికి, ఆరోగ్యం గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడానికి ఆన్లైన్ లేదా ఫోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు. ఎన్నో పరిశోధనలు జరుపుతూ ఎప్పటికప్పుడు పేషెంట్లకు మెరుగైన, కచ్చితమైన హోమియో చికిత్స అందిస్తూ, మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇటీవలే ఎంతోమంది సంతానలేమితో బాధపడిన అనేక మంది హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలలో నిర్వహించిన ‘హోమియోకేర్ బేబీ షో’ కార్యక్రమంలో పాల్గొని తాము సంతానవంతులైన తాము పొందిన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు డయాబెటిస్, సోరియాసిస్ వంటి ఇతర వ్యాధుల విషయంలోనూ నిర్వహించారు. అద్భుత ఫలితాలను ఆవిష్కరిస్తున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇతర రాష్ట్రాలలోనూ వేగంగా విస్తరిస్తూ, ఎన్నో సత్ఫలితాలను అందుకుంటోంది. ఇటీవలే తమిళనాడులోని సేలంలో కూడా కొత్త శాఖను గౌరవనీయులు ‘కళైమామని తిరుబాలకుమారన్’ గారు ప్రారంభించారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారు హెచ్1ఎన్1 వైరస్కు నివారణ మందును కూడా అందించి మంచి ఫలితాలను పొందారు. ఖచ్చితమైన ఫలితాలే మా బలం, అందరికీ సంపూర్ణ చికిత్స అందించడమే మా ధ్యేయం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ గురించి కొన్ని వివరాలు... ప్రపంచంలోనే అత్యుత్తమ హోమియో చికిత్స హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రత్యేకత. ఇక్కడ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వ్యాధులు శాశ్వతంగా నయం చేస్తారు.డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ హోమియోకేర్ ఇంటర్నేషన్ స్థాపించి హోమియోపతిని మొదటిసారిగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఇలాంటి ప్రపంచ వ్యాప్త అత్యుత్తమ చికిత్స (వరల్డ్క్లాస్ హోమియోపతి ట్రీట్మెంట్)ను అందిస్తున్న డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్ ఎంతోమంది పేషెంట్లను ఎన్నో దీర్ఘకాలిక సమస్యల నుంచి దూరం చేసి మన్ననలు పొందుతున్నారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్య సిబ్బందికి కూడా ఆయన అత్యాధునిక చికిత్సపై తరగతులు నిర్వహించి, శిక్షణ అందించి, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ పత్రికలు, టీవీ ఛానెళ్లలో వారి ఇంటర్వ్యూల ద్వారా పేషెంట్లకు హోమియోపతిపై అవగాహన కలిగిస్తున్నారు. అధునాతన హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స ద్వారా ఎలా సంపూర్ణంగా వ్యాధులు నయం చేయగలుతున్నారో వివరిస్తుంటారు. టీవీ ఛానెళ్లలో ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, వారి సందేహాలను దూరం చేస్తుంటారు. ఆరోగ్య పత్రికలు (హెల్త్ జర్నల్స్) ద్వారా కూడా వ్యాధులు, వాటి నివారణ, చికిత్సల పట్ల అవగాహన కలిగిస్తారు. అంతేకాదు... హోమియోకేర్ ఇంటర్నేషనల్లో నయం చేసిన ఎన్నో కష్టతరమైన, దీర్ఘకాలిక, మొండి వ్యాధుల వివరాలు, పొందిన అద్భుత ఫలితాలను కచ్చితమైన ఆధారాలతో సహా ప్రేక్షకులకు వివరిస్తారు. -
ప్రాణం.. గాలిలో దీపం!
అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం బహు దూరం శ్రీశైలం నుంచి ఎటు వెళ్లాలన్నా 150 కి.మీ. దూరం ప్రయాణించాల్సిందే పీహెచ్సీ స్థాయి పెంచాలంటున్నా ప్రజలు, భక్తులు శ్రీశైల క్షేత్రం చుట్టూ నల్లమల అభయారణ్యం. నిత్యం ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్న ప్రజలు, ఉద్యోగులు, సమీపంలోని గిరిజన తండా వాసులు ఉన్నారు. వీరికి ఆపద సమయంలో శ్రీశైలంలోని పీహెచ్సీనే దిక్కు. సున్నిపెంట వైద్యశాల కేసుల రెఫర్కే పరిమితం. అత్యవసర వైద్యం అందించాలంటే కర్నూలు, మహబూబ్నగర్, హైదరాబాద్, ఒంగోలు, గుంటూరు వెళ్లాల్సిందే. ఎటు వెళ్లాలన్నా దాదాపు 150 కి.మీ దూరం ప్రయాణించాలి. అంత వరకు మల్లన్నపైన భారం వేయాల్సిందే. - శ్రీశైలం మొన్నటి వరకు శ్రీశైలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాత్కాలిక శిబిరంలో నిర్వహించారు. ప్రస్తుతం దాదాపు రూ. 40 లక్షలతో పీహెచ్సీ భవనాన్ని నిర్మించారు. త్వరలో అందులోకి పీహెచ్సీని మార్పు చేస్తున్నారు. అయితే స్థాయి పెంచి సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతో పాటు ఆయుష్కు చెందిన హోమియోపతి డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఫార్మసీ రూమ్, డ్రగ్స్స్టోర్, ల్యాబ్టెక్నిషియన్ రూమ్, స్టాఫ్ సిస్టర్స్, నర్స్ రూము, కాన్పులగది, 8 బెడ్లతో కూడిన హాల్, రెఫ్రిరేజటర్ రూమ్, డ్యూటీ డాక్టర్ గదులు ఇందులో ఉన్నాయి. మెడాల్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ వారికి ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. అయితే ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేసినా అందులో ఎలాం టి పరికరాలు లేవు. లేబర్ రూమ్లో ఇంక్యూబేటర్ పరికరం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న నూతన పీహెచ్సీని శుభ్రంగా ఉంచేందుకుసిబ్బందిని కూడా నియమించలేదు. 24 గంటల ఆసుపత్రిగా మార్చితే: శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులు, ఇక్కడే నివాసముండే స్థానికులను దృష్టిలో ఉంచుకుని 24 గంటల వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వానికి నివేదిక లు పంపించి ప్రత్యేక జీఓ ద్వారా 24 గంటల ఆసుపత్రిగా మార్చే అవకాశం ఉంది. స్థాయి పెంచితే ప్రస్తుతం ఉన్న ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ఇద్దరు డాక్టర్లను నియమిస్తారు. అలాగే ఇద్దరు స్టాఫ్నర్సులతో పాటు ఏఎన్ఎంలు, ఫీమెల్ నర్సులను అదనంగా నియమిస్తారు. దీంతో పాటు స్కానర్లు, ఎక్స్రే, తదితర అన్ని ఆధునిక పరికరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. జిల్లా కలెక్టర్, డీఎంఅండ్ హెచ్ఓలు శ్రీశైలం పీహెచ్సీ విషయంలో దృష్టి సారించి క్షేత్ర పరిధిలోని ప్రజలు, భక్తుల ప్రాణాల ను రక్షించాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ల వెనుకడుగుకు ఇదే కారణం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాల రావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రీశైల దేవస్థానానికి ఐఏఎస్ స్థాయి అధికారులను నియమిస్తామని పలుమార్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇక్కడ ఆధునిక, అత్యవసర వైద్యసౌకర్యాలు అందుబాటులో లేని కారణంగానే శ్రీశైలం ఈఓగా రావడానికి ఐఏఎస్లు విముఖత వ్యక్తం చేస్తున్నారని సమాచారం. హఠాత్తుగా అనారోగ్యపరిస్థితులు ఏర్పడితే నాలుగైదు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, ఈలోగా ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. గతంలో వైద్యం అందక.. గతంలో శ్రీశైల దేవస్థానానికి చెందిన పలువురు ఉద్యోగులు, సిబ్బంది, స్థానికులకు సకాలంలో సరైన వైద్యం అందక మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు ప్రమాదానికి గురైన వారు అత్యవసర చికిత్స కోసం శ్రీశైలం నుంచి సుదూర పట్టణాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గుండె పోటుకు గురైన వారికి స్థానికంగా ప్రాథమిక చికిత్స మాత్రమే అందుతోంది. మెరుగైన అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
వేడి పెరిగింది కదా... వ్యాయామం ఆపేయాలా?
లైఫ్స్టైల్ కౌన్సెలింగ్ ఈమధ్యే నేను వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కదా. వ్యాయామం ఆపేయాలా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - నవీన్ కుమార్, పిడుగురాళ్ల వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితో పాటు ఖనిజలవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న అనర్థాలు నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి చెమటను పీల్చే కాటన్ దుస్తులను ధరించండి బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్ను సంప్రదించండి. -డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. నేను ఈమధ్య టీఎస్హెచ్ పరీక్ష చేయించుకున్నాను. థైరాయిడ్ ఉందని అన్నారు. గత ఆర్నెల్లుగా నా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. ఇది హార్మోన్ లోపం వల్ల వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉందా? - అనిత, ఖమ్మం మన తలలో దాదాపు లక్షా ఇరవై వేల నుంచి లక్షా యాభై వేల వెంట్రుకలు ఉంటాయి. ఒక వెంట్రుక ఒక నెలలో దాదాపు ఒక సెంటీమీటరు పెరుగుతుంది. రోజూ 40 నుంచి 50 వెంట్రుకలు రాలుతూనే ఉంటాయి. జుట్టు రాలడం సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. దానిలో హార్మోన్ లోపాలు, థైరాయిడ్ సమస్య, రక్తహీనత, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, ఆందోళన, నిద్రలేమి వంటివి దీనికి కొన్ని కారణాలు. కొన్ని రకాల మందులు వాడటం, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం జట్టు రాలడానికి కారణమయ్యే ఇంకొన్ని అంశాలు. జుట్టు రాలడానికి ఇంకా సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, మోతాదుకు మించి క్లోరిన్ ఉండే ఈత కొలనుల్లో ఈతకొట్టడం వంటివీ కారణమవుతాయి. జుట్టుకు రంగు వేసుకునే విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి ఈ హెయిర్ డైలు సరిపడవు. వాటి నుంచి అలర్జీ వస్తుంది. అందుకే వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. డాండ్రఫ్ (చుండ్రు), ఎగ్జిమా, అలొపేషియా సమస్యలూ కారణమవుతాయి. జుట్టు సమస్యలు తీరాలంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఒంటిని సరైన గాడిలో పెట్టాలి. శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసం కూడా పెంపొందించుకోవాలి. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందులో కేవలం జుట్టు రాలడం అనే అంశాన్నే కాకుండా దీనికి కారణాలైన థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఆర్నికా, జబొరాండి, వింకమైనర్తో తయారు చేసిన నూనెలు, మంచి షాంపూలు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. హోమియో ఔషధాలైన యాసిడ్ ఫ్లోర్, నేట్రమ్మూర్, ఫాస్ఫరస్, వింకామైనర్, ఆలోస్ లాంటి మందులు వాడితే సమస్య తగ్గుతుంది. అయితే ఆ మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. -డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ మా నాన్నను వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లు ఇక బతకరనీ బంధువులు అంటున్నారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - వీరభద్రరావు, చిట్యాల వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఇక బతకరనేది చాలామందిలో ఉండే అపోహ. అయితే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ మీద పెడతారు. దాంతో సాధారణ ప్రజల్లో ఈ దురభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానం వల్ల అనేక వ్యాధులకు చాలా ఆధునిక చికిత్సలు అందుతున్నందున వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లూ బతికేందుకూ, మళ్లీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెంటిలేటర్ అనేది కృత్రికంగా శ్వాస అందించే యంత్రం. దీన్ని పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేసి, దాన్ని కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్తో అనుసంధానం చేస్తారు. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం, కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతున్నా, రోగికి ఆయాసం పెరుగుతున్నా, ఊపిరితీసుకోవడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోయినా వెంటిలేటర్ అమర్చుతారు. సాధారణంగా నిమోనియా, సీవోపీడీ వంటి వ్యాధులకూ, రక్తానికి ఇన్ఫెక్షన్ పాకే సెప్సిస్ వంటి కండిషన్లలో వెంటిలేటర్ పెడుతుంటారు. ఒకసారి వెంటిలేటర్ పెట్టిన తర్వాత... పరిస్థితి మెరగయ్యే వరకూ వెంటిలేటర్ తీయడం కష్టం కావచ్చు. సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ పెట్టడం అవసరమైతే ట్రకియాస్టమీ చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. వెంటిలేటర్ను త్వరగా తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల అవసరమనుకుంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా వెంటిలేటర్ మళ్లీ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల మన వద్ద కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వైద్యపరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులోకి ఉన్నాయి. అయితే వైద్యపరమైన అంశాలలో మన దగ్గర తగినంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు రాజ్యమేలుతున్నాయి. మీరు ఏదైనా సందేహం కలిగినప్పుడు నేరుగా మీకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సంప్రదించండి. అంతేగానీ ఎలాంటి అపోహలను నమ్మకండి. -డాక్టర్ ఎస్.ఎ. రఫీ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
నెలసరి నొప్పికి గృహవైద్యం ఉంది...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 సంవత్సరాలు. ఈ మధ్య ఆయాసం వస్తుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆస్తమా అన్నారు. ఆస్తమా అంటే ఏమిటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానం ఉంది తెలుపగలరు? - దేవరాయలు, అనంతపురం 1. ఆస్తమా అంటే ఏమిటి? దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందిని ఆస్తమా అంటారు ఊపిరితిత్తులలో గాలి మార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది శ్వాసకోశ మార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. 2. ఆస్తమాకు కారణాలు ఏంటి? చల్లటి వాతావరణం దుమ్ము, ధూళి, పొగ ఫంగస్, వాతావరణ కాలుష్యం వైరల్ ఇన్ఫెక్షన్స్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ పెంపుడు జంతువులు రసాయనాలు, ఘాటు వాసనలు 3. ఆస్తమా ఎలా వస్తుంది? ఆస్తమా వ్యాధి అలర్జీకి సంబంధించినది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. దీనినే ఎటోపీ అంటారు కొంత మందిలో వ్యాధి నిరోధక శక్తి కలిగించే యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడని యాంటీజెన్లు శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ యాంటీబాడీ వెలువడి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుండి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవుతుంది. తద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. 4. ఆస్తమాలో కనిపించే లక్షణాలు ఏమిటి? ఎడతెరిపి లేని దగ్గు పిల్లి కూతలు ఆయాసం జ్వరం జలుబు శ్వాస తీసుకోలేకపోవడం మానసిక ఆందోళన 5. ఆస్తమా నిర్ధారణ పరీక్షలు వంశానుగత చరిత్ర అలర్జీకి సంబంధించిన పరీక్షలు ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు కఫం పరీక్ష చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు స్పైరోమెట్రీ ఛాతీ ఎక్స్రే 6. ఆస్తమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ప్రతిరోజూ వ్యాయామం చేయడం పోషకాహారం తీసుకోవడం ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి దూరంగా ఉండటంచల్లని వాతావరణానికి తిరగకుండా ఉండటం పడని పదార్థాలకు దూరంగా ఉండటం డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 35. ఇద్దరు పిల్లలు. ఇటీవల పొట్టలో నొప్పిగానూ, కొంచెం గట్టిగానూ ఉంటే, స్త్రీవైద్య నిపుణులను సంప్రదించాను. పరీక్షలన్నీ చేసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని, హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇవి తగ్గడానికి, ఆపరేషన్ లేకుండా, ఆయుర్వేదంలో మందులుంటే సూచించండి. - కె. శ్యామల, వనస్థలిపురం మీరు ప్రస్తావించిన ‘ఫైబ్రాయిడ్స్’ను ఆయుర్వేద పరిభాషలో ‘గ్రంథి లేక అర్బుదము’ అంటారు. ఇలాంటివి గర్భాశయంలో కూడా సంభవించవచ్చు. వాటి పరిమాణాన్ని బట్టి, లక్షణాలు మారుతుంటాయి. కంతి సైజు పెద్దదిగా లేకపోతే, ఇతర సమస్యలు లేకపోతే ఆపరేషన్ అక్కర్లేకుండా దీన్ని తగ్గించడానికి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని మీ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఒక ఆరునెలల పాటు వాడితే ఈ వ్యాధి గణనీయంగా తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మందుల వివరాలు... 1. కైశోర గుగ్గులు (మాత్రలు): ఉ॥2, రాత్రి 2 2. కాంచనార గుగ్గులు (మాత్రలు): ఉ॥2, రాత్రి 2 3. శతావరీ లేహ్యం: ఉ॥1 చెంచా, రాత్రి 1 చెంచా 4. అశోకారిష్ట (ద్రావకం): నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి (ఒక మోతాదు) రెండు పూటలా తాగాలి. అధిక రక్తస్రావం తగ్గడానికి... ‘బోలబద్ధరస’ మాత్రలు రెండేసి చొప్పున, రోజుకి మూడు సార్ల వరకు వాడవచ్చు. ఇవి ఒక వారం రోజుల వరకు వాడవచ్చు. మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. నాలుగేళ్ల క్రితమే రజస్వల అయ్యింది. నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. ఆయుర్వేదంలో పరిష్కారం తెలపండి. - ఎస్. మేరీ, హనమకొండ ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ వికారాన్ని ఆయుర్వేదంలో ‘కష్టార్తవ లేక ఉదావర్తం’గా వివరించారు. వివాహం తర్వాత, కాన్పు తర్వాత చాలావరకు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. కానీ చాలామంది కన్యలు ఈ లక్షణంతో విలవిలలాడుతుంటారు. ఈ కింద సూచించిన మందులు, రుతుస్రావం అయ్యే తేదీకి రెండు రోజుల ముందు నుంచి మొదలుపెట్టి రక్తస్రావం తగ్గేవరకు వాడండి. తప్పక ఉపశమనం కలుగుతుంది. 1. హింగు త్రిగుణతైలం: దీన్ని ఒక చెంచా గోరువెచ్చని నీటితో కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి; 2. అశోకారిష్ట (ద్రావకం): 3 చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి, రోజూ మూడు పూటలా తాగాలి. గృహవైద్యం: నాలుగు వెల్లుల్లి రేకల్ని దంచి, దానికి మూడు చిటికెలు ఇంగువ కల్పి, రెండు చెంచాల స్వచ్ఛమైన నువ్వులనూనెలో మరిగించి, వడగట్టాలి. ఇది ఒక మోతాదుగా - 3 చెంచాల పాలు కలిపి, ఉదయం, రాత్రి రెండుపూటలా తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్నగర్ హైదరాబాద్ బ్లడ్ప్రషర్ కౌన్సెలింగ్ ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు మామూలు బీపీ చూడడంతో పాటు ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ కూడా చూశారు. ఈమాట వినడమే కొత్త! సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? దీనికీ, మామూలుగా కొలిచే బ్లడ్ ప్రెషర్కూ తేడా ఏమిటి? - సుహాసిని, చెన్నై సాధారణంగా మనం బ్లడ్ ప్రెషర్ను బీపీ ఆపరేటస్తో కొలుస్తుంటాం. ఇందులో ఒక పట్టాలాంటి దాన్ని చేతికి కట్టులా కట్టి, దాన్ని గాలితో నింపి, బిగిసేలా చేసి, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు వేగాన్ని కొలుస్తాం. దీన్నే బీపీ అంటారు. కాని రక్తపోటును గుండె దగ్గరే కొలిస్తే ఆ విలువ సరైనది అని వైద్య నిపుణులు అభిప్రాయం. నేరుగా గుండె స్పందించినప్పుడు అక్కడి రక్తనాళాల్లో రక్తపీడనాన్ని కొలవడాన్ని ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ అంటారు. ఇటీవల ఈ విధమైన సెంట్రల్ బ్లడ్ప్రెషర్ను కొలవడానికి ఒక పెన్ వంటి సాధనాన్ని రూపొందించారు. దీని కొనను మణికట్టు (రిస్ట్) వద్ద ఉండే నాడి దగ్గర మృదువుగా ఆనించి, ఆ వచ్చిన కొలతలను కంప్యూటర్కు అనుసంధానిస్తారు. ఆ ‘పల్స్ వేవ్’ విలువలను కంప్యూటర్ గణించి, నేరుగా గుండెదగ్గరి రక ్తనాళాల్లో రక్తపోటు ఎంత ఉందో లెక్కలు వేస్తుంది. దీని ఆధారంగా మనం గుండెదగ్గరి రక్తపోటును తెలుసుకుంటామన్నమాట. ఇలా నేరుగా గుండెదగ్గర అది స్పందించినప్పుడు రక్తం తొలుత గురైన పీడనాన్నీ అంటే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్నూ, సాధారణంగా చేతి దగ్గర పట్టా చుట్టి, అందులో గాలి నింపి తీసుకునే సాధారణ బ్లడ్ ప్రషర్నూ తెలుసుకుంటూ ఇంకా ఈ విలువలను సరిపోల్చి చూస్తున్నారు. మామూలుగా చేతి దగ్గర తీసే బ్లడ్ప్రెషర్ను కొన్ని కోట్లమందిలో అనేకసార్లు గణించి సాధారణ రక్తపోటు ప్రమాణాన్ని ‘120/80’గా నిర్ణయించాం. కానీ సెంట్రల్ బ్లడ్ప్రెషర్తో తీసే విలువలకు ఇంకా నిర్ణీత ప్రమాణాలను రూపొందించలేదు. ఎందుకంటే మన రక్తపోటు క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక స్థిరమైన నార్మల్ విలువ వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్కూ ‘ప్రమాణాలను’ రూపొందిస్తే అప్పుడు మామూలు బ్లడ్ప్రెషర్ స్థానాన్ని ఆధునికంగా తీసే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ విలువలు ఆక్రమించడం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల అంచనా. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
కడుపునొప్పి... అది 24 గంటల నొప్పేనా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నిల్చునే సమయంలో, నడిచే సమయంలో తల తిరిగినట్లు అయి పడిపోతానేమో అని ఆందోళనగా ఉంటోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి. హోమియోపతిలో చికిత్స ఉందా? - లక్ష్మి, ఖమ్మం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు బహుశా ‘వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలేచినప్పుడు గానీ, నడుస్తున్నప్పుడు గానీ ఉన్నట్టుండి తలతిరగడం, తద్వారా పడిపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలుంటే ఆ సమస్యను ‘వర్టిగో’ అంటారు.దాదాపు 20 శాతం నుంచి 30 శాతం వరకు ఈ సమస్య ఉంటుంది. ఇది ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... పెరిఫెరల్, సెంట్రల్, ఇతర కారణాలతో వచ్చే వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో: ఈ సమస్య ఉన్నవారిలో తల తిరగడానికి కారణం మూలాలు చెవి లోపలి భాగంలో ఉంటాయి. చెవిలో వెస్టిబ్యులార్ సిస్టమ్ అనే భాగం ఉంటుంది. ఇది శరీరాన్ని అదుపు తప్పకుండా కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పెరిఫెరల్ వర్టిగో సమస్య వచ్చినప్పుడు తల తిరగడం సమస్య మొదలవుతుంది. శరీరం అదుపు తప్పడం, ముందుకు తూలడం జరగవచ్చు. బైక్ నడుపుతున్నప్పుడు ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సెంట్రల్ వర్టిగో: కొన్నిసార్లు తలతిరగడానికి మెదడులోని సమస్యలు, నాడీమండల సమస్యలు కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల తలతిరుగుతుంటే దాన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. ఇతర కారణాలతో వచ్చే వర్టిగో: రక్తహీనత, రక్తపోటు ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం, జ్వరం, తీవ్రమైన వ్యాధుల బారిన పడిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కారణాలు: మెదడులో కణితులు, మెదడులో రక్తం గడ్డకట్టడం సర్వైకల్ స్పాండిలోసిస్, పార్కిన్సోనిజమ్, నరాల బలహీనతల వంటివి దీనికి కారణమవుతాయి చేతులు లాగడం, తిమ్మిర్లు కూడా దీనికి దోహదం చేస్తాయి. లక్షణాలు: వికారం, తలనొప్పి, చెమటలు పట్టడం, వినికిడి సమస్యలు, నిద్రలేవగానే లేదా నడుస్తున్నప్పుడు, ముందుకు వంగి పనిచేస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్లు తిరగడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. నిర్ధారణ: సీటీస్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్రే, ఆడియోమెట్రీ, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేస్తారు. చికిత్స: హోమియోలో బెల్లడోనా, జెల్సీమియమ్, చైనా, కాకుసల్ ఇండికస్, కోనియమ్, బ్రయోనియా, పల్సటిల్సా, ఆర్సెనికా వంటి మందులు సమర్థంగా పనిచేస్తాయి. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. ఐదేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. అయితే రుతుక్రమం తగ్గిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని చదివాను. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్ను కలిశాను. ఆయన ఎక్స్రే తీయించి ఆస్టిపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది. - పద్మ, కోదాడ క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటివి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు. ఇక ముందుగా మీకు స్పష్టం చేయాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్ను ఎక్స్రే ద్వారా నిర్ధారణ చేయడం జరగదు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్ను కలవండి. - డాక్టర్ కె. సుధీర్రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఇటీవల మా అబ్బాయికి తరచూ కడుపునొప్పి వస్తోంది. రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటే దానంతట అదే తగ్గిపోతుంటుంది. సాధారణ నొప్పే కదా తగ్గిపోతుందిలే అని అంతగా పట్టించుకోలేదు. నొప్పి మళ్లీ మళ్లీ వస్తోంది. మా ఊళ్లో డాక్టర్కు చూపిస్తే ’కొన్ని మందులు వాడితే తగ్గిపోతుంద’ని రాసిచ్చారు. మాకు తెలిసిన వారు అది ఒక్కోసారి ప్రాణాంతకమైన 24 గంటల నొప్పికి దారితీయవచ్చేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు 24 గంటల నొప్పి అంటే ఏమిటి? మా అబ్బాయికి కడుపునొప్పి ఎందుకు వస్తోంది? దయచేసి వివరాలు చెప్పండి. - ఝాన్సీ, శృంగవరపుకోట కడుపునొప్పిని చాలా కారణాలు ఉంటాయి. ప్రతి కడుపునొప్పీ అపెండిసైటిస్ (24 గంటల నొప్పి) కాదు. మీరు ముందుగా వైద్య నిపుణులను సంప్రదించి, మీ అబ్బాయికి అసలు కడుపునొప్పి ఎందుకు వస్తోందో ముందుగా నిర్ధారణ చేయాలి. దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇక మీరు పేర్కొన్న 24 గంటల నొప్పి (అపెండిసైటిస్)లో అకస్మాత్తుగా బొడ్డు చుట్టూ నొప్పి వస్తూ అది పొట్ట కింది భాగానికి వ్యాపిస్తూ ఉంటుంది. దాంతో పాటు వాంతులు కావడం, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అపెండిసైటిస్ ఉంటే వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేయడం మంచిది కాదు. కడుపులో చిన్నపేగు, పెద్దపేగు కలిసే చోట చిన్న ట్యూబ్ ఆకారంలో అపెండిసైటిస్ ఉంటుంది. అందులోకి ఏవైనా మలిన పదార్థాలు, రాళ్లు, పురుగులు చేరితే అకస్మాత్తుగా ఈ నొప్పి వస్తుంది. అపెండిసైటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కెటారల్ అపెండిసైటిస్, రెండోది అబ్స్ట్రక్టివ్ అపెండిసైటిస్. కెటారల్ అపెండిసైటిస్ను మందులతో నయం చేయవచ్చు. అబ్స్ట్రక్టివ్ అపెండిసైటిస్కు మాత్రం శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక శస్త్రచికిత్సలలో కీ-హోల్ ప్రక్రియ ద్వారా తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయవచ్చు. వైద్య పరీక్షల ద్వారా అది ఏ రకం అనేది నిర్ధారణ చేశాకే అపెండిసైటిస్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అపెండిసైటిస్ ఉండి, చికిత్స ఆలస్యం అయితే అది పగిలి పొట్టలోకి ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే అలా బొడ్డుచుట్టూ నొప్పి వస్తూ కిందికి పాకుతుంటే అత్యవసరంగా డాక్టర్ను సంప్రదించాలని చెబుతుంటారు. - డాక్టర్ టి.ఎల్.వి.డి. ప్రసాద్బాబు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ . మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
ఒత్తిడి తొలగించుకుంటే చాలు
హోమియో కౌన్సెలింగ్ మైగ్రేన్ నివారణ, చికిత్స... నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్-రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? - రమణ, నూజివీడు తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకోవాలి. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్కు అద్భుతంగా పనిచేస్తాయి. జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ ఒత్తిడి తొలగించుకుంటే చాలు నా వయసు 38 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. ఎక్కువగా ఆందోళనకూ, ఉద్వేగాలకు గురవుతుంటాను. ఆలోచనలు చాలా ఎక్కువ. నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. - పి. విక్రమ్, సికింద్రాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగ్జైటీ డిజార్డర్తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానా పడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యపై అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోండి. దాంతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీ జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్ను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. నాకు 65 ఏళ్లు. షుగర్, బీపీ ఏమీ లేవు. అయితే పాతికేళ్లుగా సైనస్ సమస్యతో బాధపడుతున్నాను. ఉదయం లేవగానే చాలాసేపు తుమ్ములు వచ్చి, ముక్కు, కళ్ల నుంచి ధారగా నీరు కారుతుంది. నా సమస్య తగ్గే మార్గాన్ని సూచించండి. - ఎమ్. రాజేశ్వరరావు, వరంగల్ సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉదయం వేళల్లో చలిగాలి సోకినప్పుడు, ఆ గాలి వల్ల సైనస్ రంధ్రాలు మూసుకుపోయి ఒకవిధమైన తలనొప్పి (మైల్డ్ హెడేక్)తో బాధపడతారు. మీలో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి విటమిన్-సి టాబ్లెట్స్ వాడటం, యాంటీ అలర్జిక్ మందులు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు సరిపడని వాతావరణానికి వీలైనంత దూరంలో ఉండండి. మీకు బాగా ఇబ్బందిగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటంతో పాటు ఆవిరిపట్టడం (స్టీమ్ ఇన్హెలేషన్), నేసల్ డీ-కంజెస్టెంట్స్ వంటి మందులను డాక్టర్ సూచిస్తారు. చికిత్స కోసం మీరు ఒకసారి ఫిజీషియన్ను కలవండి. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ గుక్కపడితే... పాప నీలంగా మారుతోంది! మా పాపకు 11 నెలలు. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం తరచూ నీలంగా మారుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సునీల, విశాఖపట్నం మీ పాప ఎదుర్కొంటున్న సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుందన్నమాట. పిల్లల్లో కోపం ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నారుల్లో ఐదు శాతం మందిలో ఇది చాలా సహజం. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్లో... సింపుల్, సైనోటిక్, ప్యాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ లక్షణం కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో అన్నది తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్ను సంప్రదిస్తే చాలు. -
హోమియోపతి కౌన్సెలింగ్
వెన్నునొప్పికి సర్జరీనే మార్గమా? నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - సుమన్, బాలాపూర్ ఇటీవల వెన్నునొప్పి ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన సమస్య. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి సవ్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పిలకు ఆస్క్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఆస్తమా తగ్గదంటారు.. నిజమేనా..!? నా వయసు 48. గత పాతికేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. రకరకాల మందులు వాడాను. అయితే ఆస్తమా వచ్చినప్పుడు ఆయాసం తగ్గడానికి వాడే మందులు తప్ప... శాశ్వత పరిష్కారం ఉండదని చెబుతున్నారు. నిజమేనా? హోమియోలో ఏదైనా పరిష్కారం ఉందేమో చెప్పండి. - యాదయ్య, భువనగిరి ఆస్తమా అనేది సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (అలర్జెన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు, వాటికి ప్రతిచర్యగా మన శరీరం స్పందించి, వివిధ రకాల రసాయనాలు విడుదల చేసి, శ్వాసనాళాలలో శ్లేష్మపొర వాపునకు గురిచేస్తాయి. దీనివల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయి, ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ఆస్తమా లేదా ఉబ్బసం అంటారు. ఆస్తమా లక్షణాలు : శ్వాసనాళాలు సంకోచించడం వల్ల గాలి రవాణాకు ఆటంకం కలిగి ఆయాసం, దగ్గు వస్తాయి. ఛాతీ బరువుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, పిల్లికూతలు ప్రధాన లక్షణాలు. పిల్లల్లో ఈ లక్షణాలతో పాటు రాత్రివేళ దగ్గు, పిల్లికూతలు, పగలు పరుగెత్తినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమాకు కారణాలు : వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, పెంపుడు జంతువులూ వాటి వెంట్రుకలు, మస్కిటో రిపెల్లెంట్స్, రకరకాల స్ప్రేలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, శీతలపానీయాలు, ఐస్క్రీమ్స్, జన్యుసంబంధమైన కారణాలు... ఉబ్బసం రావడానికి గల కారణాలలో కొన్ని. నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, అబ్సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్, ఎక్స్రే (చెస్ట్), సీటీ స్కాన్, స్పైరోమెట్రీ, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ మొదలైన వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను నిర్ధారణ చేయవచ్చు. నివారణ మార్గాలు : దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి శీతలపానియాలు, ఐస్క్రీమ్స్ తీసుకోకూడదు పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉండాలి. ఆస్తమా ఎప్పటికీ తగ్గదని చాలామంది భావన. కానీ అందులో నిజంలేదు. హోమియో ప్రక్రియలో ఆస్తమాను పూర్తిగా తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి. మీరు నిపుణులైన హోమియోవైద్యులను కలిసి, తగు జాగ్రత్తలతో మందులు వాడితే ఆస్తమా పూర్తిగా తగ్గిపోతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ థైరాయిడ్ సమస్యల నుంచి విముక్తి ఎలా? నా వయసు 56. పిల్లల చదువులు పూర్తయి వారు స్థిరపడ్డాక పదేళ్ల క్రితం నగరానికి వచ్చాను. అప్పట్నుంచి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నాను. మా పిల్లలు చిన్నవారైనప్పటికీ వారిలోనూ ఇదే సమస్య ఉన్నట్లు ఇటీవలే తెలిసింది. థైరాయిడ్ సంబంధిత సమస్యలు తగ్గేందుకు మార్గాలు చెప్పండి. - అనసూయబాయి, హైదరాబాద్ మీరు చెప్పినట్లుగా ఇటీవల నగరాలలో థైరాయిడ్ సమస్యలు రావడం పెరుగుతోంది. నగరాలలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు ఒక రకంగా థైరాయిడ్ సమస్యలకు కారణం అని చెప్పవచ్చు. థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉండే కీలకమైన గ్రంథి. ఇది స్రవించే హార్మోన్లు మానసిక ఆలోచనలపై ప్రభావం చూపేవిగా ఉంటాయి. ఈ గ్రంథి టీ4, టీ3, టీఎస్హెచ్ హార్మోన్లను స్రవిస్తుంది. సున్నిత మనస్తత్వం కలవారు, ప్రతి చిన్న విషయాన్నీ మనసుపైకి తీసుకునేవారిలో ఈ గ్రంథి స్రవించే హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటుంది. టీహెచ్ఎస్ ఎక్కువ అవడం వల్ల అతిగా బరువు పెరగడం, అతి ఆలోచన, అతి బద్దకం, మతిమరపు, అదినిద్ర వచ్చే అవకాశం ఉంది. మా వద్ద నిర్వహించిన పరిశోధనల ప్రకారం స్త్రీలలో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. మా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... స్త్రీలలో రుతుస్రావ సమస్యలు, గర్భం రాకుండా ఉండేందుకు వాడే మందులు, పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు వాడే మందుల వల్ల థైరాయిడ్పై దుష్ర్పభావాలు పడి, దానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మందులు వాడటం వల్ల ప్రతి 100లోనూ 50 మంది థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం... గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యల వల్లనే అని తేలింది. దీనికి బదులు ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిది నెలల పాటు హోమియోపతి మందులు వాడితే పిల్లల్లోనూ సమస్యలు రాకుండా నివారించవచ్చు. తల్లిదండ్రులకు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలలోనూ ఆ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే థైరాయిడ్ సమస్యలన్నీ ఒకేలా ఉండవు. హార్మోన్ స్రావం పెరిగితే ఒకలా, తగ్గితే మరొకలా, నాడ్యూల్స్ వస్తే ఇంకోలా లక్షణాలు కనిపిస్తాయి. హోమియోలో ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. ఉదాహరణకు... ఆర్సినిక్ ఆల్బ్: హైపోథైరాయిడిజమ్లో కనిపించే నిద్రలేమి, ఎవరినీ నమ్మకపోవడం, ఆలోచనలు అస్థిమితంగా ఉండటం, అతి ఆందోళన వంటివాటికి ఈ మందు బాగా పనిచేస్తుంది. కాల్కేరియా కార్బ్: ఇది కూడా హైపోథైరాయిడిజమ్లో లక్షణాలతో పాటు చిన్నపిల్లల మనస్తత్వం, గుర్తింపుకోసం తహతహ, అసూయ వంటి లక్షణాలున్నవారికి. ఓపియమ్ : అతినిద్ర, గురకపెట్టడం, ప్రతివిషయాన్ని అశ్రద్ధ చేయడం, అతిచురుకు లక్షణాలున్నవారికి ఈ మందు. నేట్రమ్మ్యూర్ : అతిగా స్పందించడం, అసంతృప్తి, అతి ఆలోచన వంటి లక్షణాలకు ఈ మందు. ఇలా అన్నిరకాల థైరాయిడ్ సమస్యలకు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎమ్.రెడ్డి, పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
2,758 కోట్లకు హోమియో మార్కెట్
♦ ఇందులో సంఘటిత రంగం వాటా ♦ కేవలం రూ.270 కోట్లు ♦ దీర్ఘకాలిక వ్యాధులను కూడానయం చేయొచ్చు ♦ డాక్టర్ బాత్రాస్ గ్రూప్ సీఈఓ సందీప్ సక్సేనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి వైద్యానికి డిమాండ్ ఉందని, కేన్సర్, రక్తనాళాల వ్యాధుల వంటి దీర్ఘకాలిక రోగాలకు సైతం హోమియోపతి వైద్యంలో చికిత్స ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైనట్లు డాక్టర్ బాత్రాస్ గ్రూప్ సీఈఓ సందీప్ సక్సేనా చెప్పారు. దేశంలో హోమియోపతి మార్కెట్ రూ.2,758 కోట్లకు చేరిందని.. కాకపోతే ఇందులో సంఘటిత రంగం వాటా కేవలం రూ.270 కోట్లని.. మిగతాదంతా అసంఘటిత రంగానిదేనని చెప్పారాయన. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రూప్ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. ఇంకా ఏమన్నారంటే... ► ప్రస్తుతం డాక్టర్ బాత్రాస్కు దేశంలో 200, దుబాయ్లో 3, లండన్లో 2, ఢాకాలో ఒకటి చొప్పున క్లినిక్లు ఉన్నాయి. ఇందులో 140 సొంతవి కాగా మిగతావి ఫ్రాంచైజీ. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలో మరో 51, విదేశాల్లో 11 క్లినిక్స్ను తెరుస్తాం. 2020 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్తో మొత్తం 450 క్లినిక్స్ను అందుబాటులోకి తీసుకొస్తాం. రెండు నెలల్లో గల్ఫ్ దేశాల్లో మరో 5 క్లినిక్స్ను ప్రారంభిస్తాం. ► ఈ ఏడాది రూ.25 కోట్ల పెట్టుబడితో క్లినిక్స్, స్టోర్లను ప్రారంభించనున్నాం. మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం. గతేడాదితో పోల్చితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధి రేటుతో రూ.200 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 10 శాతంగా ఉంది. మొత్తం టర్నోవర్లో డాక్టర్ బాత్రాస్ వాటా 78 శాతం, హెయిర్ ట్రీట్మెంట్, ఎఫ్ఎంసీజీ విభాగాల వాటా 22 శాతంగా ఉంది. ► గతేడాది డాక్టర్ బాత్రాస్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ను ప్రారంభించాం. ప్రస్తుతానికి షాంపూ, జుట్టు, చర్మ సంబంధిత చికిత్సలకు సంబంధించి 38 ఉత్పత్తులున్నాయి. స్టోర్ల విషయానికొస్తే మన దేశంలో 6,500, దుబాయ్లో 220 ఉన్నాయి. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని చేశాం. ► హోమియోపతి రంగంలో లక్ష మంది వైద్యులు, 100 మిలియన్ల మంది చికిత్స పొందుతున్నారు. దశాబ్ద కాలంలో డాక్టర్ బాత్రాస్ గ్రూప్లో 1.3 మిలియన్ల మంది చికిత్స చేయించుకున్నారు. ఇందులో 60% వాటా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కస్టమర్లదే. -
పాములతో జర భద్రం
- కాటు కాలం.. జాగ్రత్త - నాటు వైద్యాన్ని నమ్మొద్దు - వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి ఆలేరు : వర్షాకాలం వచ్చిందంటే పాముల బెడద అధికంగా ఉంటుంది. వర్షాలకు పాములు బయటకు వస్తాయి. రాత్రి పూట ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. ఖరీఫ్ సీజన్లో సాగుకు సిద్ధమవుతున్న సమయంలో పాములు బయటకు రావటంసహజం. ప్రతి ఏటా పాము కాటుకు గురై మనుషులతో పాటు మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాముల విషప్రభావం కట్లపాము కాటేసిన క్షణాల్లో విషం రక్తకణాల్లో కలుస్తుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంట నే ఆస్పత్రిలో చేర్చాలి. నాగుపాము కాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం శరీరంలోకి ఎక్కుతుంది.అలాగే జెర్రిపోతు,నీరుకట్ట కాటేసిన విషం ఉండదు. అయితే కాటువేసిన చోట చికిత్స చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు పాము కాటుకు వైద్యం ఉంది. పాము కాటుకు గురైన వారు మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు.విషంతో ఉన్న పాము కాటేసినపుడు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యులను ఆశ్రయిస్తే వారు మిడిమిడి పరిజ్ఞానంతో చేసే వైద్యం కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతారు. ఇదేమంటే ఆలస్యం చేశారని వారు మీ మీదనే తోసేస్తారు. విషంలేని పాముకాటుకు గురైన వారు ప్రాణాలతో బయట పడినా అది మంత్రగాళ్ల మహిమే అని నమ్ముతారు. ఇదే బాధితుల పాలిట ముప్పుగా మారుతోంది.సకాలంలో వైద్యం అందక మృత్యువాతపడుతున్నారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే కుట్టిన పామును బట్టి చికిత్స చేస్తారు. -
‘ఆయుష్’ తీరనుందా..?
- ఉద్యోగుల తొలగింపునకు ప్రయత్నాలు - కలెక్టర్ తొలగించమన్నారంటూ ఆయుష్ ఆర్డీడీకి ఇన్చార్జి డీఎంహెచ్వో లేఖ - ఆందోళనలో 81 మంది ఉద్యోగులు భీమవరం క్రైం : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆయుర్వేద, హోమియో, యునాని, ప్రకృతి వైద్య సేవలందించే ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 44 డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న 81 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుష్ శాఖలో 44 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 5 గురు మాత్రమే ఉండటంతో సిబ్బంది ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేదనే ఉద్దేశ్యంతో వారిని తొలగించేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. జులై 1వ తేదీ నుంచి ఉద్యోగులను తొలగించాలని జిల్లా కలెక్టర్ తనకు లేఖ రాశారని ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ కె.శంకరరావు ఆయుష్ శాఖ రీజినల్ డెప్యూటీ డెరైక్టర్(ఆర్డీడీ)కి లేఖ రాశారు. ఈ విషయం తెలిసిన ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. 2008 నుంచి తాము సేవలందిస్తున్నామని, ప్రస్తుతం ఏ జిల్లాలోనూ లేనివిధంగా తమను తొలగించాలను కోవడం దారుణమని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను భర్తీచేసి ఆయుష్ను బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎంపీ సీతారామలక్ష్మికి వినతి పత్రం ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమను ఇప్పుడు తొలగించడం దారుణమని, తమను కొనసాగిం చేలా చూడాలని ఆయుష్ ఉద్యోగులు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు జీఎన్బీ ప్రసాద్(పాలకోడేరు), సుజన(లంకలకోడేరు), కాంపౌండర్లు బి.రమేష్ వర్మ(పాలకోడేరు), ఎన్.ఆంజనేయులు(మంచిలి), సత్యనారాయణ(లంకలకోడేరు), స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ వి.హైమావతి(మంచిలి), చంద్రశేఖర్ ఉన్నారు. ఆయుష్ కమిషనర్ నుంచి ఆదేశాలు వస్తేనే తొలగిస్తాం ఆయుష్ ఉద్యోగులను తొలగించమని ఇన్చార్జి డీఎంహెచ్వో నుంచి లేఖ రావడం వాస్తవమేనని ఆయుష్ ఆర్డీడీ వి.వీరభద్రరావు వివరణ ఇచ్చారు. అయితే ఆయుష్ కమిషనర్ గాని, ఎన్ఆర్హెచ్ఎం డెరైక్టర్ గాని ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమ శాఖలో 44 డిస్పెన్సరీలకు గానూ 5గురు మాత్రమే వైద్యులు ఉన్నారని, 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన జరిగినందున త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఆయుష్ ఉద్యోగుల తొలగింపు విషయమై ఇన్చార్జి డీఎంహెచ్వోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. -
హోమియో...హామీలు!
ఏప్రిల్ 10 పపంచ హోమియో దినం ఉష్ణం ఉష్ణేన శీతలం, వజ్రాన్ని వజ్రమే కోస్తుంది లాంటివి మన సామెతలే. వీటిని చాలాసార్లు వినే ఉంటారు. కానీ శామ్యూల్ హనీమన్ మహనీయుడు ఆ సిద్ధాంతాలను చికిత్స ప్రక్రియకు అన్వయింపజేశాడు. అలా అందరికీ అందుబాటులో ఉండే చవకైన, సులభమైన ఒక కొత్త చికిత్స ప్రక్రియకు నాంది పలికాడాయన. చాలా మందికి చికిత్స అంటే భయం. మరెంతో ఆందోళన. చేదు మందుల్ని మింగాల్సి వస్తుందనీ, మేని కోతల్ని భరించాల్సి వస్తుందనే బెంగ. వీటన్నింటినీ దూరం చేస్తూ... ‘‘రోగి కోరేదీ... వైద్యుడిచ్చేదీ ఒకటే అయితే...’’ అనే మనదైన మరో సామెతనూ నిజం చేసేలా మందుల్ని రూపొందించాడాయన. ఈ నెల 10న ఆయన పుట్టిన రోజు. దీన్ని ప్రపంచ హోమియో దినంగా జరుపుకుంటున్న సందర్భంగా... ఈ చికిత్స ప్రక్రియపై అవగాహనతో పాటు... మనకు రోజూ కనిపించే అనేక చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాల కోసమే ఈ ప్రత్యేక కథనం. మీ హోమియో కిట్... జ్వరాలు (ఫీవర్స్) అనేక రుగ్మతలకు జ్వరం ఒక లక్షణం మాత్రమే. హోమియోలో లక్షణాల ఆధారంగా మందును నిర్ణయిస్తారు కాబట్టి జ్వరంతో పాటు ఆయా లక్షణాలను బట్టి వాడాల్సిన మందును నిర్ణయించుకోవచ్చు. బెల్లడోనా: అకస్మాత్తుగా జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యక్తిగత లక్షణాల విషయానికి వస్తే... అతి ప్రేమ-ఆప్యాయతలు కనబరచడం, కోపం వంటి లక్షణాలు ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఇక పులుపు ఎక్కువగా ఇష్టపడేవారూ, జ్వరం వచ్చినప్పుడు ముఖం ఎర్రగా మారిపోయేవారికి ఇది మంచి మందు. అకోనైట్: తీవ్రమైన జ్వరం (హైఫీవర్), అతి భయం, చిన్న విషయానికే ఎక్కువగా ఆందోళన చెందడం, తలనొప్పితో బాధపడటం, మాటిమాటికీ దగ్గు, జలుబు, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. క్యాంథరిస్: తరచూ మూత్రంలో మంట వల్ల తీవ్రమైన జ్వరం (హై ఫీవర్), విపరీతమైన కోపం, చలిజ్వరం, మూత్రంలో మంటరావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడాలి. మందు తీసుకున్న నాలుగు గంటల్లో జ్వరం తగ్గుతుంది. చైనా: మాటిమాటికీ చలిజ్వరం , సాయంకాలం జ్వరం, అన్ని విషయాలపై అసంతృప్తిగా ఉండటం, శబ్దాలను భరించలేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో నాలుగు వారాలు వాడటం వల్ల జ్వరం మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉంటుంది. బాప్టీషియా: లోజ్వరం, దీర్ఘకాలం జ్వరం కొనసాగడం వల్ల రక్తం విషపూరితం కావడం, దాహం తక్కువగా ఉండటం, చెమట వాసనతో ఉండటం లాంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడవచ్చు. ఆర్సినిక్ ఆల్బమ్: చలిజ్వరం, అతి దాహం, జ్వరం వచ్చినప్పుడు నిద్రలేకపోవడం, అర్ధరాత్రి నిద్రలేవడం, జ్వరం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకపోవడం, భయపడటం, అభద్రతా భావం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉదయం-సాయంకాలం ఒక డోసు వాడితే జ్వరం తగ్గిపోతుంది. రస్టాక్స్: జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లునొప్పులు, నాలుక తడారిపోవడం, చలి ఎక్కువగా ఉండటం, నిద్రలేకపోవడం వంటి లక్షణాలకు ఈ మందును 200 పొటెన్సీలో ఒక్క డోసు వాడాలి. స్పంజియా: తరచూ జలుబు, పసుపు రంగులో గల్ల (కళ్లె) పడటం, ఉదయం దగ్గురావడం, వేడిని తట్టుకోలేకపోవడం, జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, దగ్గుతో తెమడ పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో రోజుకు రెండుసార్లు వాడవచ్చు. సిలిసియా: ముక్కులు బిగుసుకుపోవడం, చలిగా ఉండటం, ఒళ్లంతా వణుకుతో జ్వరం, కాళ్లూ-చేతులు చల్లబడటం, ఎక్కువ చెమట వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. పల్సటిల్లా: రోజు విడిచి రోజు జ్వరం రావడం, చలి తర్వాత వేడిగా అనిపించడం, దాహం లేకపోవడం, జలుబు వల్ల వాసన తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, తలనొప్పి వంటి శారీరక లక్షణాలతో పాటు సున్నిత స్వభావం కలిగి ఉండటం వంటి లక్షణాలు న్నవారికి ఈ మందును 200 పొటెన్సీలో ఇవ్వవచ్చు. కాలీ సల్ఫ్: రాత్రివేళల్లో తీవ్రమైన జ్వరం (హై ఫీవర్) రావడం, తరచూ జ్వరం తిరగబెడుతుండటం, నాలుక పసుపురంగులో ఉండటం, త్వరగా కోపం రావడం, చిరాకుగా ఉండటం, ముక్కులు బిగదీసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో వారం రోజుల పాటు వాడాలి. అలోయేస్: నీళ్ల విరేచనాలతో జ్వరం రావడంతో పాటు వేడిని తట్టుకోలేకపోవడం, అందరిపై ఆధిపత్యధోరణి వంటి లక్షణాలు కలిగి ఉన్నవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో పై లక్షణాలతో జ్వరం వస్తే ఇది చాలా మంచి మందు. పోడోఫిల్లమ్: దాహం తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం, విరేచనాలు కావడంతో పాటు కడుపునొప్పిగా ఉండటం, ఫుడ్పాయిజనింగ్ వంటి సందర్భాల్లో ఈ మందు బాగా పనిచేస్తుంది. కోలోసింథిస్: కడుపునొప్పి రావడం, విరేచనాలు కావడం, ఏది తిన్నా /తాగినా విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. జలుబు నక్స్వామికా: తరచూ వచ్చే దగ్గు, జలుబు, తుమ్ములు, విపరీతమైన విసుగు, చలిని తట్టుకోలేకపోవడం కనిపిస్తే నక్స్వామికా 30 పొటెన్సీలో తీసుకోండి. ఆర్సెనికమ్ ఆల్బమ్: తరచూ విపరీతంగా తుమ్ములు వస్తూ, దుమ్మూ-ధూళికి గురికాగానే అవి మరింత ఎక్కువ కావడం, అతిశుభ్రత, నిత్యం అపనమ్మకంతో పాటు, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం వంటి లక్షణాలుంటే 30 పొటెన్సీలో తీసుకోవాలి. బొవిస్టా: విపరీతమైన తుమ్ములు, జ్వరం వచ్చినట్లుగా ఉండటం, ఏ పనిపైనా ధ్యాస లేకపోవడం, కొంచెం అమాయకత్వం, వేడిని తట్టుకోలేకపోవడం, దాహం తక్కువగా ఉండటం లాంటి లక్షణాలుంటే దీన్ని 30 పొటెన్సీలో వాడుకోవచ్చు. సిలిసియా: జలుబు వల్ల తల బరువుగా ఉండటం, గళ్ల (కళ్లె) పసుపురంగులో పడటం, పనిలో ఎక్కువగా శ్రద్ధ చూపే గుణం ఉండటం, మొహమాటం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. అల్లియమ్ సెపా: విపరీతమైన తుమ్ములతో పాటు కళ్ల నుంచి నీళ్లు కారడం, ముక్కు కారడం, తలనొప్పిగా ఉండటం, దగ్గు రావడం వంటి సమస్యలుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. తలనొప్పి నేట్రమ్ మూర్: ఎండలో ఎక్కువగా తిరిగితే వచ్చే తలనొప్పికి ఈ మందును వాడవచ్చు. బెల్లడోనా: అకస్మాత్తుగా తలనొప్పి రావడంతో పాటు ప్రతి చిన్న విషయానికీ కోపం రావడం, తలనొప్పి వల్ల ముఖం ఎర్రగా మారడం వంటి లక్షణాలున్నవారికి ఇది మంచి మందు. స్పైజీలియా: తలనొప్పి వల్ల కళ్లనొప్పి కూడా రావడం, కళ్లు బరువుగా అనిపించడం, జ్వరం రావడం, సూది మందుకు త్వరగా భయపడటం, ఎడమవైపు నొప్పి, ఎండలో తలనొప్పి, మైగ్రేన్ వంటి తలనొప్పికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది. బ్రయోనియా ఆల్బ్: తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. తలపై సుత్తితో కొట్టిన భావన. చాలా చికాకుగా అనిపిస్తుంది. ఎండాకాలంలో వచ్చే సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. సాంగ్యునేరియా: కుడివైపు తలనొప్పి విపరీతంగా ఉండటం, ఉదయం తలనొప్పి ఎక్కువగా ఉంటూ, రాత్రివేళ తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందు చక్కగా పనిచేస్తుంది. కడుపునొప్పి కడుపునొప్పి ఉన్నవారు, ఇతర లక్షణాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ మందులను వాడుకోవచ్చు. న్యాట్ఫాస్: కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, ఎక్కువగా మసాలాలు తినడం వల్ల వచ్చే గ్యాస్ సమస్యలతో పాటు మొహమాటం ఎక్కువగా ఉండేవారికి ఇది మంచి మందు. నక్స్వామికా: మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల వచ్చిన గ్యాస్ సమస్యకు ఇది మంచి మందు. కోపం ఎక్కువగా రావడం, టైమ్కు ఆహారం తీసుకోకపోవడం వంటి వారికి ఈ మందును 30 పొటెన్సీలో ఇవ్వడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. సీనా: కడుపులో నులిపురుగులు (వార్మ్స్ ఉండటం వల్ల వచ్చిన కడుపునొప్పికి ఇది మంచి మందు. కోపంతో ఉండే స్వభావం ఉన్నవారికి దీన్ని సూచించాలి. కొలోసింథ్: మహిళల్లో రుతుస్రావం సమయంలో వచ్చే కడుపునొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. విపరీతమైన కడుపునొప్పితో పాటు, రక్తస్రావం ఎక్కువగా కనిపించేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వడదెబ్బ వేసవిలో వడదెబ్బ చాలా తరచూ కనిపించే సమస్య. దీనికోసం మందులివే... గ్లోనైన్: వేడిని తట్టుకోలేకపోవడం, రక్తపోటు ఎక్కువ కావడం, తలనొప్పిగా ఉండటం లాంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి. నేట్రమ్ మూర్: వడదెబ్బకు లోనైన ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత లక్షణాలను సరిచూసుకుని ఈ మందువాడాలి. అవి... ఎవరితోనూ ఎక్కువగా మాటలాడకపోవడం, పనులపైనా ఎప్పుడూ అసంతృప్తితో ఉండటం, నీరసంగా ఉండటం, తరచూ రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉండటం వంటి సమస్యలున్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. జెల్సీమియమ్: వేడిని తట్టుకోలేకపోవడం, అతి భయం, అన్ని విషయాలకూ ఆతృత పడటం, ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, ఎండలోకి వెళ్తే కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం... వంటి లక్షణాలు ఉంటే ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి. నేట్-కార్బ్: ఎండలోకి వెళ్తే దద్దుర్లలా కనిపించడం, కళ్లు తిరగడం, వాంతులు రావడం, ఎండలోకి వెళ్లగానే తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. ఓపియమ్: అతిసున్నితత్వం, ఏ విషయంపైనైనా త్వరగా స్పందించడం వంటి లక్షణాలున్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. దీంతో పాటు... ఎండలోకి వెళ్లి తిరిగి రాగానే నీరసంగా ఉండటం, అతినిద్ర, త్వరగా అలసిపోవడం, ఊబకాయం ఉన్నవారికి వడదెబ్బ రాకుండా నివారించేందుకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. దీన్ని 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. క్యాంఫర్: ఎండలోకి వెళ్లగానే కళ్లు తిరగడం, శరీరం, చేతులూ చల్లబడటం, చలికాలంలో హుషారుగా ఉండి, వేసవిలో నీరసంగా ఉండటం వంటి లక్షణాలుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. చర్మంపై కనిపించే అలర్జీలు కొందరికి పడని వస్తువులు తారసిల్లిన వెంటనే దాని గుణం చర్మంపై ప్రతిఫలిస్తుంది. అప్పుడు వాడాల్సిన మందులివి... సల్ఫర్: చర్మవ్యాధులకు ఇది మంచి మందు. అకస్మాత్తుగా ఒంటిపై దద్దుర్లు రావడం, ఆర్టికేరియా ర్యాష్, దద్దుర్లు పెద్దవి కావడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వారానికి ఒకసారి తీసుకోవాలి. నేట్-మూర్: ఎండలోకి వెళ్తే దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. డల్కమారా: వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. దద్దుర్లు పెద్దగా ఉండటం, వర్షంలో తడిసిన తర్వాత దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. గ్రాఫైటిస్: గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు చర్మ సమస్యలు వచ్చే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. త్వరగా ఏడ్వటం, సున్నితమైన స్వభావం, లావుగా ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. హెపార్ సల్ఫ్: చలికి తట్టుకోలేకపోవడం, దురద ఎక్కువగా ఉండటంతో పాటు దద్దుర్లు రావడం, తొందరపాటు ఎక్కువగా ఉండటం, విపరీతమైన కోపం రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఇది మంచి మందు. ఏయే దేశాల్లో ఉంది? ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రత్యామ్నాయ ఔషధంగా హోమియోవైద్యం అందుబాటులో ఉంది. అన్నింటికంటే యూరప్ దేశాలల్లో హోమియో వాడకం ఎక్కువగా ఉంటోంది. అందులో ఫ్రాన్స్ది మొదటిస్థానం. ఇంగ్లండ్ రాజకుటుంబం హోమియోవైద్యాన్ని కూడా అనుసరిస్తున్నట్లు సమాచారం. జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, మెక్సికో దేశాలు హోమియో మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. పొటెన్సీ అంటే... హోమియో మందుల మోతాదును పొటెన్సీ అనే ప్రమాణం ద్వారా నిర్ణయిస్తారు. హోమియో మందుల్లో ఉన్న సామర్థ్యానికి (పవర్కు) పొటెన్సీ అన్నది ఒక సూచిక. హోమియో మందులో ప్రతి మందుకూ ఒక అత్యద్భుత శక్తి (డైనమిక్ పవర్) ఉంటుంది. ఏ జబ్బు తీవ్రతకు ఎంత మేరకు శక్తి కలిగిన మందు ఇవ్వాలన్నది హోమియో వైద్యులు నిర్ణయిస్తారు. జబ్బు తీవ్రతను బట్టి 200, 30, 1ఎమ్ అనే పొటెన్సీల్లో (మోతాదుల్లో) మందులు ఇస్తారు. రోగి చేయాల్సిన పథ్యం... హోమియో మందులు తీసుకునే వారు ఎలాంటి పథ్యాన్నీ చేయనవసరం లేదు. ఎందుకంటే రోగికి వచ్చిన జబ్బును బట్టి అతడిలోని వ్యాధిని తొలగించడానికి ఇచ్చే మందు ఒక అంతర్గత శక్తిలా పనిచేస్తుంది. దీన్ని ఎలాంటి ఆహారాలూ అవరోధించలేవు. కాబట్టి హోమియో మందులకు ఎలాంటి పథ్యనియమాలూ పాటించాల్సిన అవసరం లేదు. హోమియో మందులు ఎలా పనిచేస్తాయి? హోమియో మందు ఎలా పనిచేస్తుందన్న విషయం తెలుసుకోడానికి హానీమన్ అనుసరించిన మార్గాన్ని పరిశీలిస్తే చాలు. సింకోనా అనే మొక్క బెరడును తింటే వాంతులు అవుతాయి. చలిజ్వరం వస్తుంది. ఇదే సిద్ధాంతాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందని హనీమన్ పరిశీలించారు. చలిజ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి హనీమన్ చాలా కొద్ది మోతాదులో సింకోనా బెరడును ఇచ్చారు. తత్ఫలితంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ వ్యక్తికి చలిజ్వరం తగ్గింది. ఏదైనా జబ్బుకు కారణమయ్యే అంశాన్ని చాలా కొద్ది మోతాదుల్లో ఇస్తే ఆ జబ్బు తగ్గుతుందనేది హోమియో ప్రధాన సిద్ధాంతం. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని హానీమన్ ఎన్నో మొక్కలనుంచి, జంతువులనుంచి ఔషధగుణాలున్న రసాయనాలను సేకరించారు. అలాగే ఖనిజ లవణాలనుంచీ స్వీకరించి పరిశీలించారు. అలా ఎన్నో జబ్బులకు మందులను రూపొందించారు. కాబట్టి స్థూలంగా మనకు కనిపించే చక్కెర గోలీలు, వాహికగా పనిచే ఆల్కహాల్ ఒకటే అయినా... అందులో కలిపే మందు మాత్రం వేర్వేరుగా ఉంటుంది. హోమియోపతి గురించి కొన్ని వాస్తవాలు! హోమియోపతిలో సిద్ధాంతాలు స్థిరంగా ఉంటాయి. తరచూ అభిప్రాయాలు మారడం ఇందులో ఉండదు. హోమియోపతి అనేది శాస్త్రీయత, సృజనాత్మకతల సమ్మేళనం. హోమియోపతి ఆధారపూర్వకమైన ప్రయోగాత్మకమైన ఔషధం. హోమియోపతి మందులు శరీరానికి సహజంగా ఉండే వ్యాధి నిర్మూలన శక్తిని ఉద్దీపన చేస్తాయి. శరీరానికి ఉన్న వ్యాధి నిర్మూలన శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ వైద్యంలో అప్పుడు బాధిస్తున్న వ్యాధిని నిర్మూలించడమే కాక దేహమంతటినీ చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ మందులతో ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవు, పైగా వీటిని ఎన్ని రోజులు వాడినా ఎప్పుడైనా మానేయవచ్చు. దేహానికి ఒకసారి అలవాటు చేస్తే ఇక తప్పని సరిగా కొనసాగించాలనే పరిస్థితి ఉండదు. కొన్ని ఇతర మందులు వ్యాధిని తగ్గించాక దేహంలో వ్యర్థాలను మిగులుస్తుంటాయి. వాటిని బయటకు పంపడం మరో ప్రక్రియ. హోమియోమందులతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి ఏ విధమైన వ్యర్థాలనూ దేహంలో వదలవు. ఈ శాస్త్రం గురించి నిపుణులు రాసిన పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. సామాన్యులకు ప్రాథమిక అవగాహన కల్పించే విధంగా అర్థమయ్యేరీతిలో రాసినవే ఇవన్నీ. త్వరగా తగ్గే అవకాశాలూ ఉంటాయి... సాధారణంగా హోమియో మందులు చాలా ఆలస్యంగా తమ ఫలితాలను కనబరుస్తాయనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొంతవరకూ ఇది నిజమే అయినా హోమియో చికిత్స ద్వారా కొన్ని వ్యాధుల విషయంలో చాలా త్వరగా గుణం కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఈ ఆలస్యం జరగడానికి కారణం... చాలామంది చాలాకాలం పాటు అనేక వైద్య విధానాలను ప్రయత్నించి రోగాన్ని ముదరబెట్టుకుని, అప్పుడు హోమియో విధానానికి వస్తారు. అలాంటి సందర్భాల్లో జబ్బు నయం కావడంలో ఆలస్యం జరగడం మామూలే. వ్యాధి అంతగా ముదరకముందే వస్తే నయం కావడం కూడా త్వరగానే జరుగుతుంది. జబ్బు దానంతట అదే నయం అయ్యిదంటే కాస్త ఆలోచించాల్సిందే... కొన్ని జబ్బులు వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే తగ్గుతాయని ఇంగ్లిష్ విధానంలో డాక్టర్లు చెబుతుంటారు. కానీ హోమియో విధానం ప్రకారం అది పూర్తిగా వాస్తవం కాదు. ఉదాహరణకు చిన్నప్పుడు వచ్చే ఉబ్బసం (ఆస్తమా) కొందరిలో వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని ఇంగ్లిష్ మందుల ప్రక్రియలో చెబుతుంటారు. కానీ హోమియో వైద్య విధానం ప్రకారం అది తగ్గకుండా ఇంకొక అంచెకు చేరుకుంటుంది. అంటే... అది గ్యాస్ట్రిక్ సమస్యగానో లేదా హార్మోన్ల అసమతౌల్యతకో దారితీయవచ్చు. అందుకే ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది పూర్తిగా తొలగిపోయేలా చికిత్స జరగాలి. అందుకే హోమియో విధానంలో చికిత్స అన్నది వ్యాధికి జరగదు. వ్యక్తికి జరుగుతుంది. వ్యక్తికి జబ్బు తగ్గేలా చేయడం కంటే... అసలు ఆ వ్యక్తికి పూర్తి ఆరోగ్యం కలిగి జబ్బులన్నవే మటుమాయం అయ్యేలా చేసే ప్రక్రియే హోమియో. హోమియో సమర్థంగా తగ్గించిన వ్యాధులివి... ట్యూబర్క్యులోసిస్, సిఫిలిస్, గనేరియా, సోరా (స్కేబిస్), క్యాన్సర్, కుష్టువ్యాధులను హోమియో మందులతో సమూలంగా తగ్గించవచ్చు. 19వ శతాబ్దంలో కలరా, టైఫాయిడ్ వ్యాధులు ఇతర మందులతో నియంత్రించలేని దశలో హోమియో మందులతో తగ్గాయి. హోమియో - అపోహలు - వాస్తవాలు అపోహ: హోమియో మందులు దీర్ఘకాలిక వ్యాధులను మాత్రమే నయం చేస్తాయి. జలుబు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలకు పనిచేయవు. వాస్తవం: హోమియోపతి దీర్ఘకాలిక వ్యాధులను, స్వల్పకాలిక వ్యాధులను రెండింటినీ నయం చేస్తుంది. జలుబు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, అతిసార వంటి వ్యాధులను సమర్థంగా నయం చేస్తుంది. అపోహ: హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయి. వాస్తవం: స్వల్పకాలిక అనారోగ్యాలకు తక్షణ చర్య ఉండేలా, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతోనూ మందులను రూపొందిస్తారు. ఆస్థ్మా, బ్రాంకైటిస్, ఆర్థరైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఆస్టియోపోరోసిస్, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులకు ఇచ్చే మందుల పనితీరు తెలియడానికి కొంత కాలం పట్టే మాట నిజమే. ఇది కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికీ మారుతుంది. వారి వారి వ్యాధి నిరోధక శక్తి, ఒత్తిడిని తట్టుకునేస్థాయి, జీవనవిధానం, ఆహారపు అలవాట్లు వంటి వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అపోహ: హోమియోపతి మందుల తయారీలో స్టెరాయిడ్స్ వాడతారు. వాస్తవం: హోమియోపతి మందులను మొక్కలు, జంతువుల నుంచి సేకరించిన సహజమైన పదార్థాలు, ఖనిజాలతో తయారు చేస్తారు. మొక్కలలో సహజంగా ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల సత్ఫలితాలే తప్ప ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవని నిర్ధారణ అయింది. అపోహ: గర్భిణులకు హోమియో మందుల వల్ల హాని కలుగుతుంది. వాస్తవం: హోమియోపతి మందులు గర్భిణికి చక్కటి ఔషధం అని చెప్పాలి. అల్లోపతి మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే వారికి చక్కటి ప్రత్యామ్నాయం హోమియో మందులే. గర్భిణిలో తల తిరగడం, రక్తహీనత, వెన్నునొప్పి, కండరాలు పట్టేయడం, వేవిళ్లు, గుండెలో మంట, అతిసార, రక్తపోటు, ఆందోళన, ఉద్వేగానికి లోనుకావడం వంటి సమస్యలకు హోమియో మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. కడుపులో బిడ్డ పెరుగుదలకు కూడా హోమియో మందుల వాడకం శ్రేయస్కరమే. అపోహ: హోమియో చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ వంటి ప్రక్రియలు ఉండవు, కాబట్టి క్యాన్సర్ వంటి వ్యాధులకు హోమియోమందుల వల్ల ప్రయోజనం ఉండదు. వాస్తవం: హోమియో మందులతో క్యాన్సర్ని సమర్థంగా నిర్మూలించిన సంఘటనలు అనేకం. క్యాన్సర్ రావడానికి మూలకారణాన్ని తెలుసుకుని, ఆ కారణానికి చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నయమవుతుంది. అపోహ: ఇన్ఫెక్షన్ తగ్గాలంటే యాంటీ బయాటిక్స్ తప్ప మరో మార్గం లేదు. వాస్తవం: యాంటీ బయాటిక్స్ ఇన్ఫెక్షన్ని అణచివేస్తాయి, ఈ ప్రక్రియలో వ్యాధి కారణాన్ని కనుక్కునే ప్రయత్నం జరగదు. వ్యాధి కారక మైక్రోబ్స్ను చంపకపోగా వ్యాధి లక్షణాలు అణచివేయబడతాయి. యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల కొంతమందిలో జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం, వికారం, అతిసార వంటి సైడ్ఎఫెక్ట్స్ కలుగుతుంటాయి. హోమియో మందులు వ్యాధి కారక క్రిములను నిర్మూలించడంతోపాటు దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఒకసారి హోమియో కోర్సు తీసుకున్న వారికి ఈ వ్యాధి మళ్లీ రావడానికి అవకాశాలు తక్కువ. అపోహ: హోమియోపతిలో మందులంటే చక్కెర గుళికలు మాత్రమే. వాస్తవం: హోమియోలోని చక్కెర గుళికలు మందును ఇముడ్చుకున్న రూపాలు మాత్రమే. హోమియో మందులలో మూడు వేల రకాల సమీకరణలుంటాయి. వ్యాధిని బట్టి ఏయే ఔషధాలను ఎంతెంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించిన తర్వాత ఆ మందును చక్కెర, పిండి పదార్థంతో కలిపి గుళికలుగా చేస్తారు. అపోహ: హోమియోపతిలో చక్కెర గుళికల మందులు మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచివి కాదు. వాస్తవం: హోమియో మందుల తయారీలో ఉపయోగించేది లాక్టోజ్ తియ్యదనమే, ఇందులో గ్లూకోజ్ ఉండదు. పైగా ఇందులో ఉండే చక్కెర అతి తక్కువ కాబట్టి ఇది రక్తంలో షుగర్లెవెల్స్ మీద ప్రభావం చూపదు. హోమియో వైద్యవిధానంలో ప్యాంక్రియాస్ గ్రంథిని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే స్థితికి తీసుకురావడం సాధ్యమే. దీని ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. అపోహ: హోమియో మందులు వాడుతున్న కాలంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, టీ, కాఫీలను మానేయాల్సి ఉంటుంది. వాస్తవం: హోమియో మందు వేసుకోవడానికి 15 నిమిషాల ముందు, తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదనే నియమం ఉంటుంది. అంతే తప్ప ఏదీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో పరిమితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అపోహ: హోమియో వైద్యంలో ఎటువంటి పరీక్షలు చేయకనే వ్యాధిని నిర్ధారణ చేస్తారు. వాస్తవం: హోమియో వైద్యంలో సాధారణంగా రోగి చెప్పే లక్షణాల ఆధారంగా మందును నిర్ధారణ చేస్తారు. ప్రతి చిన్న అనారోగ్యానికీ పరీక్షలు చేయించి నిర్ధారణ చేయడం ఉండదు. కానీ కొన్ని రోగాలకు రోగ తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయిస్తారు. హోమియో సిద్ధాంతాలూ... విధానాలు హోమియో వైద్యుడికి ఉన్న ఏకైక, అతి ముఖ్యమైన లక్ష్యం రోగిని అస్వస్థత నుంచి దూరం చేసి అతడికి పూర్తి ఆరోగ్యాన్ని అందించడమే... హోమియోపతి డాక్టర్లందరికీ హనీమన్ చెప్పిన మొదటి సూత్రం ఇది. ‘ఆర్గనాన్ మెడిసిన్’ అనే పుస్తకం ద్వారా హోమియోపతి వైద్య విధానంలోని సిద్ధాంతాలను వివరించారు. అందులోని సిద్ధాంతాలను ‘అఫోరిజమ్స్’ అంటారు. తొలి సిద్ధాంతం (అఫోరిజమ్) రోగికి ఒక జబ్బుకోసం మందు ఇస్తే... అది ఆ జబ్బును అణిచివేయవచ్చు. కానీ అది మరికొన్ని రుగ్మతలకు దారి తీసే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక యుగంలో మందు తీసుకోవడం అంటే మరికొన్ని జబ్బులను ఆహ్వానించడం లాంటిదే. అందుకే ఈ ఆధునిక సమాజం ఏదో ఒక జబ్బుతో బాధపడాల్సి వస్తోంది. ఒక జబ్బుకు మందు వేయడం వల్ల అది మరో స్థాయి (నెక్ట్స్ లెవెల్)కి వెళ్లి మరో రుగ్మతకు కారణమవుతోంది. ఉదాహరణకు చర్మ వ్యాధులను ఆయింట్మెంట్ ద్వారా అణచివేస్తే అది శ్వాసకోశ వ్యాధులకూ, ఎముకలకు సంబంధించిన వ్యాధులకూ, హార్మోన్ల స్థాయుల మార్పులకూ దారితీయవచ్చు. ఈ జబ్బులు వంశపారంపర్యమూ రావచ్చు. సాధారణంగా ఇంగ్లిష్ మందుల వల్ల ఈ పరిణామాలు సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ హోమియోపతి వైద్యవిధానం ద్వారా మనిషిలోని జబ్బును తగ్గించడం కంటే పూర్ణారోగ్యాన్ని బాగు చేయడానికి కృషి జరుగుతుంది. ఫలితంగా జబ్బూ తగ్గుతుంది. దాంతో అప్పటివరకూ ఉన్న ఆ వ్యాధితో పాటు దాని అనుబంధ వ్యాధులన్నింటినీ హోమియో నిర్మూలిస్తుంది. ఈ సిద్ధాంతాన్నే ‘సిమిలియా నిమిలిబస్ క్యూరెంటర్’ అంటారు. మనిషి తాలూకు వ్యాధి నిరోధకశక్తిని బాగు చేయడం వల్ల ఇలా అతడి ఆరోగ్యాన్ని కాపాడి, అతడు ఎల్లప్పుడూ పూర్తిగా ఫిట్గా ఉండేలా చేయవచ్చు. ఔషధం ఎంపిక ఇలా... మనిషిలోని వ్యాధి నిరోధక తత్వాన్ని ప్రేరేపించి, అతడు అన్ని జబ్బులకూ అతీతుడయ్యేలా చేయడానికి అతడి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని మందు ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియనే ‘రిపార్టరైజేషన్’ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఔషధాన్ని ఎంపిక చేయాలంటే మనిషి అన్ని లక్షణాలనూ, గుణగణాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చేసే ప్రక్రియను ‘కాన్స్టిట్యూషన్’ పద్ధతి అంటారు. ఏ మందు, ఏ కాన్స్టిట్యూషన్స్తో జతపడుతోంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇలా మందుకూ, కాన్స్టిట్యూషన్స్కూ లంకె కుదిరేలా పరిశీలించడాన్ని ‘సిమిలియమ్’ అంటారు. ఈ సిమిలియమ్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా రోగికి మళ్లీ జబ్బు రాకుండానూ, అదే సమయంలో అతడి వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఇతర జబ్బులకు దారి తీయకుండానూ కాపాడవచ్చు. ఉదాహరణకు టైఫాయిడ్, మలేరియా వంటి జబ్బులు. ఈ జబ్బుల విషయంలో ఇంగ్లిష్ మందుల రూపంలో ఉపయోగించే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల తొలి దశలో జబ్బు తగ్గినా, వ్యాధి కారక క్రిములు ఆ యాంటీబయాటిక్ పట్ల నిరోధాన్ని (రెసిస్టెన్స్ను) పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల అసలా జబ్బు తగ్గకపోవచ్చు కూడా. కానీ హోమియోపతి వైద్య విధానం ప్రకారం కచ్చితమైన డ్రగ్ ఇవ్వడం వల్ల జబ్బు తగ్గి మళ్లీ రాకుండా చేయవచ్చు. అంతేకాదు అతి తక్కువ మోతాదులతో, నొప్పి లేని మందులు ఇవ్వడం అన్నది హోమియో విధానం తాలూకు ప్రత్యేకత. ఈ విధానాన్ని డాక్టర్ శామ్యూల్ హనీమన్ సూచించారు. అందుకే అతి తక్కువ మోతాదులో శరీరంలోని జన్యుస్థాయికి వెళ్లి హోమియో మందులు పనిచేస్తాయి. వ్యక్తి తాలూకు మానసిక లక్షణాలను సైతం పరిగణనలోకి తీసుకుని హోమియో విధానంలో మందును ఎంపిక చేయడం ఎందుకు జరుగుతుందంటే... శరీరంలో ‘మైండ్’ అన్నది కూడా ఒక అత్యున్నత కేంద్ర వ్యవస్థ. అక్కడ నుంచి చికిత్స మొదలు కావాలన్నది హోమియో విధానం. అందుకే శరీరం నుంచే కాకుండా మనసు నుంచి కూడా వ్యక్తికి రోగవిముక్తి జరగాలన్నది హోమియో విధానం సిద్ధాంతం. ఇదే హోమియో ప్రత్యేకత. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉండవు? ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక జబ్బుకు మందు వేసి అణచడం కంటే... అసలు ఆ జబ్బుకు కారణమైన అన్ని అంశాలనూ శరీరం నుంచి తొలగించేందుకు హోమియో విధానం తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో మందులు జన్యుస్థాయికి వెళ్లి అక్కడ రోగ కారణాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. ఈ ప్రక్రియతో సదరు జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగనిరోధకత కల్పిస్తాయి. అంతేగాని అవి జబ్బును అణచవు. అందుకే హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ (సైడ్ఎఫెక్ట్స్) కలగవు. ప్రయాణాల్లో హోమియో... తరచూ ప్రయాణం చేసేవారు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ప్రయాణాల్లో అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా తరచూ ప్రయాణాలు చేసేవారు లేదా వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారు ఈ కింది మందులను తమ వద్ద ఉంచుకోవడం వాళ్లకెంతో మేలు చేస్తుంది. కాకులస్ ఇండికస్: ప్రయాణాల్లో వాంతులు చేసుకునేవారూ, ప్రయాణం తర్వాత తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవారు... 200 పొటెన్సీలో ఈ మందు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. నక్స్ వామికా: ప్రయాణాల్లో వచ్చే ఉదర సంబంధమైన సమస్యలకు ఇది మంచి మందు. ప్రయాణ సమయాల్లో దీన్ని 30 పొటెన్సీలో వరసగా మూడు రోజులు తీసుకోవడం మేలు. ఆర్జంటమ్-నైట్రికం: ప్రయాణం అంటే అతిగా భయపడేవారు, ప్రయాణాల్లో అతి జాగ్రత్త పాటిస్తూ బాధపడేవారికి ఈ మందు ఇవ్వవచ్చు. పెట్రోలియమ్: తరచూ కార్లలో ప్రయాణం చేసేవారికి తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దీన్ని 200 పొటెన్సీలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పోడో ఫిల్లమ్: తరచూ ప్రయాణాలు చేసేవారికి విరేచనాలూ, కడుపునొప్పి కనిపిస్తే ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును గంటలకోసారి చొప్పున తీసుకుంటూ ఉంటే విరేచనాలు తగ్గుతాయి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
సోరియాసిస్కు మెరుగైన ఫలితం హోమియోపతి
చలికాలం రాగానే ఎంతోమంది అనేకరకాల చర్మ సంబంధిత వ్యాధుల తో బాధపడుతూ ఉంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య సోరియాసిస్. ప్రపంచ జనాభాలో సుమారుగా మూడు శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీనిని కేవలం సాధారణ చర్మవ్యాధిగా పరిగణించడానికి వీలు లేదు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మవ్యాధి. సోరియాసిస్ వ్యాధిగ్రస్థులలో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవవచ్చు. ఎందుకు వస్తుంది? వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయంప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మనశరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. సోరియాసిన్ - వంశపారంపర్యత: కొన్నికుటుంబాలలో సోరియాసిన్ అనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రభావం : సోరియాసిస్ ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణాపాయం జరగదు. కాని వ్యాధితీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్కు లోనవుతారు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్లో అలా వికటించిన వ్యాధినిరోధక శక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్ఫ్లమేషన్ వలన సోరియాసిస్తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్థులు డయాబెటిస్, రక్తపోటులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్ను తీవ్రం చేసే అంశాలు: చల్లని పొడి వాతావరణం మానసిక ఒత్తిడి కొన్నిరకాల మందులు (మలేరియా మందులు, లితేలయా, బీటా, బ్లాకర్స్, మాంటి) ఇన్ఫెక్షన్స్, ఇతర వ్యాధులు అలవాట్లు హార్మోన్ తేడాలు ఆహార పదార్థాలు -ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం. నిర్థారణ పరీక్షలు: సీబీపీ ఈఎస్ఆర్ స్కిన్ బ్లాప్సీ కీళ్ళను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు. సోరియాసిస్లో రకాలు సోరియాసిస్ను అది వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి ఐదు రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్లో ఎక్కువగా కనిపించే రకం. ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం. Guttata సోరియాసిస్: ఇది ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకులుగా కనిపిస్తుంది. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారవుతాయి. ఇన్వర్సివ్ సోరియాసిస్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రటి వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి. కాన్స్టిట్యూషన్ పద్ధతిలో సోరియాసిస్ నివారణ... కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం. తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలనేది ముఖ్యం. సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిస్ తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అసలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలం నిర్థారించబడుతుంది. -పాజిటివ్ హోమియోపతి. డా॥టి. కిరణ్కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 92461 99922 www.positivehomeopathy.com -
వెన్నునొప్పి...
మనం నిటారుగా నిలబడి ఉండటానికి కారణమైన ప్రధాన అవయవం ‘వెన్ను’. అందుకే మన జాతీయాల్లోనూ, నుడికారాల్లోనూ ఒకరిపై ఆధారపడకుండా మనకై మనమే జీవించడానికి ప్రతీకగా ‘వెన్నెముక’ను పేర్కొంటుంటారు. అందుకే స్వతంత్రంగా వ్యవహరించని వాళ్లకు ‘వెన్నెముక’ లేదంటుంటారు. ప్రధానమైన వ్యవసాయ వృత్తిలో ఉన్న రైతును దేశానికి వెన్నెముకగా అభివర్ణిస్తారు. అంత ప్రధానమైన ఈ వెన్నుకు వచ్చే బాధలను తెలుసుకుందాం... మన కాళ్లపై మనం ఉండటానికి దోహదపడే ఈ వెన్నెముక పుర్రె చివర నుంచి మొదలై, నడుం కింది వరకు ఉంటుంది. మెదడు చివరి భాగం (మెడుల్లా అబ్లాంగేటా) నుంచి నడుం వరకు ఉండే వెన్నుపాముకు రక్షణకవచంలా ఒకదానినొకటి లింకుల్లా ఏర్పడి 32 నుంచి 34 వెన్నుపూసలు ఒక వెన్నెముకగా ఉంటాయి. దీన్నే స్పైన్ అంటారు. ఇందులో మెడ భాగంలో ఏడు (సర్వైకల్), ఛాతి, కడుపు భాగంలో పన్నెండు (థోరాసిక్), నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్), మిగతావి ఒకదాంతో మరోటి కలిసిపోయి ఉండే శాక్రల్ ఎముకలు. కాక్సిక్ అనేది చివరన తోకలా ఉండే ఎముక. వీటిల్లో ఏ భాగానికి నొప్పి వచ్చినా దాన్ని వెన్నునొప్పిగానే పేర్కొంటారు. ఇక వెన్నెముకలోని 32-34 ఎముకల్లో... ప్రతి దాని మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. వెన్నుపూసల అరుగుదల వల్ల ఈ నరాలపై ఏమాత్రం ఒత్తిడి పడ్డా నొప్పి వస్తుంది. వెన్నెముక నొప్పుల్లో రకాలను చూద్దాం. మెడనొప్పి: మెడ భాగంలో ఉండే వెన్నెముకలను సర్వైకల్ పూసలు అంటాం కదా, అవి అరగడం వల్ల వచ్చే నొప్పిని ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు. మెడనొప్పికి ముఖ్యకారణం ఇదే. తలపై బరువులు మోసేవారికి, కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం పనిచేసే వారికి, డ్రైవింగ్ చేసేవారికి ఎక్కువగా వస్తుంది. స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్పై పనిచేసే వారిలో, రాతపని, కుట్లు, అల్లికలు చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వెన్నెముకలోని ఎముక భాగాలు అరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. వయసు పైబడటం వల్ల ఎముక భాగాలు అరిగిపోతుంటాయి. స్త్రీలలో మెనోపాజ్ దశ వచ్చేసరికి కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. దీనికితోడు కాల్షియం లభించే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వల్ల సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో నొప్పి మెడ నుంచి భుజం వరకు లేదా ఛాతి వరకు పాకుతుంది. ఈ నొప్పి కరెంట్ షాక్లా లేదా మంటపుట్టినట్టుగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు తలతిరగడం, మెడ నొప్పి ఉంటుంది. నడుమునొప్పి: నడుం భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల వల్ల ఈ నొప్పి వస్తుంది. నొప్పి వచ్చే భాగాన్ని బట్టి పేర్లుంటాయి. వాటిలో స్పాండిలైటిస్, టెయిల్ పెయిన్, సయాటికా నొప్పి ముఖ్యమైనవి. లాంబార్ స్పాండిలైటిస్ కూర్చుని పనిచేసే వారికి, బరువులెత్తే వారిలో, నడుముకి దెబ్బలు తగిలిన వారిలో, మహిళల్లో కాన్పు తర్వాత వస్తుంటుంది. ఈ నొప్పి సూదులతో గుచ్చినట్టుగా, మంటగా ఉంటుంది. టెయిల్ పెయిన్: వెన్నుపూసల కిందిభాగంలో ఈ నొప్పి వస్తుంది. కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది స్త్రీలలో ఎక్కువ. సయాటికా: సయాటికా అనేది కాలి భాగాన్ని బాధపెట్టే నాడీ సంబంధ నొప్పి. ఈ సమస్య ఎడమ లేదా కుడివైపు ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా స్త్రీలలోనే ఎక్కువ. సయాటికా అనేది కాలిలోకి వెళ్ళే అతి పెద్ద నాడి. వెన్నెముకలోని వెన్నుపూసలు అరగడం వల్ల వాటి మధ్య ఉన్న కార్టిలేజ్ మీద ఒత్తిడి పడుతుంది. కార్టిలేజ్ మధ్యలో ఉండే సయాటికా నాడి ఒత్తిడికి లోనవుతుంది. దాంతో సయాటికా నాడి ఏయే భాగాలతో అనుసంధానించి ఉంటుందో ఆయా భాగాలలో నొప్పి మొదలవుతుంది. ఆ బాధ కరెంట్ షాక్లా ఉండి నడవలేక, నిలబడలేక, కూర్చోలేక వర్ణనాతీతంగా ఉంటుంది. సయాటికా లక్షణాలు: సయాటికా సమస్యకు కొన్ని ప్రధాన లక్షణాలున్నాయి. ఇవి అన్ని సందర్భాలలోనూ అందరిలోనూ ఒకేసారి ఒకేలా కనిపించకపోవచ్చు. ముందుగా నొప్పి నడుములో ప్రారంభమై పిరుదులలోకి, అక్కడి నుంచి తొడల్లోకి, అక్కడి నుంచి పిక్కల్లోకి వ్యాపిస్తుంది, దగ్గినా, తుమ్మినా, ఎక్కువసేపు కూర్చున్నా సమస్య అధికం అవుతుంది. రెండు కాళ్ళలోనూ, ఒకే స్థాయిలో కాకుండా, ఏదో ఒక కాలిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. తిమ్మిర్లు కూడా ఉండవచ్చు. సయాటికా నాడి ప్రయాణించే మార్గంలో అంటే కాలిలోనూ పాదంలోనూ ఉంటుంది. సూదులు గుచ్చినట్లుగా నొప్పి ఉంటుంది. కాలు, నడుము బిగుసుకుపోయినట్టు ఉంటుంది. కూర్చున్నా, నిలబడినా నొప్పిగానే ఉంటుంది. కారణాలు: అధిక బరువులు ఎత్తడం కాళ్ళకు ఎత్తుమడమల చెప్పులు వాడడం గతుకుల రోడ్లమీద తరచుగా ప్రయాణం చెయ్యాల్సిరావడం పోషకాహార లోపం, ముఖ్యంగా కాల్షియం లోపం దీర్ఘకాలిక దగ్గు, తుమ్ముల వల్ల నొప్పి తీవ్రం అవుతుంది. ఇవి గాక మరిన్ని వెన్ను సంబంధమైన నొప్పిలు కనిపిస్తాయి... హెర్నియేటెడ్ డిస్క్: ఎక్కువగా డ్రైవింగ్, కంప్యూటర్ వర్క్చేసే వారిలో ఈ సమస్య ఉంటుంది. స్టెనోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్: ప్రాథమిక దశలో గురిస్తే ఈ సమస్యను త్వరగా అరికట్టవచ్చు. మెకానికల్ ఇంజ్యురీ: సాధారణ అరుగుదలతో కాకుండా, ఏదైనా దెబ్బ తగలడం వల్ల వెన్నెముకకు భౌతికంగా గాయం అయి వచ్చే నొప్పిని మెకానికల్ ఇంజ్యూటరీ వల్ల వచ్చే నొప్పిగా పేర్కొంటారు. వెన్నునొప్పి నివారణా మార్గాలు: ఎక్కువసేపు కూర్చోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారయినా లేచి ఐదు నిమిషాల పాటు అటూ ఇటూ తిరగాలి. బరువయిన వస్తువులను వంగి ఎత్తకూడదు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలి. హోమియోపతి చికిత్స: వెన్నునొప్పి, నడుము నొప్పికి హోమియో మందులో అద్భుతమైన ఔషధాలున్నాయి. నొప్పి నివారణ మాత్రల మాదిరిగా తాత్కాలిక ఉపశమనాన్ని అందించకుండా మూలకారణాన్ని తొలగించి నడుము నొప్పి నుంచి శాశ్వత విముక్తిని అందిస్తాయి. శరీరంలో సమసతుల్యతను కాపాడే విధంగా హోమియోపతి వైద్యం పనిచేస్తుంది. దీనితో డిస్క్ సమస్య, కార్టిలేజ్ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. స్పాండిలైటిస్, స్టెనోసిన్, సయాటికా సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. బ్రయోనియా, రస్టాక్స్, లెడంపాల్, హైపరికం వంటి మందులు వ్యాధి తీవ్రతను తగ్గించడంలోనూ, శాశ్వత పరిష్కారాన్ని చూపించడంలో ఉపయోగపడతాయి. దీనితో పాటు కొలోసింథ్, పల్సటిలా అన్న మందులు కూడా ఈ నొప్పుల విషయంలో ఆలోచించాల్సినవే. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటూ పోషకాహారం, ఫిజియోథెరపి, యోగా క్రమబద్ధంగా చేయడం ద్వారా సయాటికా మొదలుకొని, అన్ని వెన్నునొప్పులనూ శాశ్వతంగా దూరం చేయవచ్చు. డాక్టర్ రవికిరణ్, ఎం.డి. (చికిత్సరత్న అవార్డు గ్రహీత) ప్రముఖ హోమియో వైద్యనిపుణులు మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్లో దిల్సుఖ్నగర్, అమీర్పేట్, కూకట్పల్లి; విజయవాడ, కరీంనగర్, ph: 7842 106 106 / 9032 106 106 -
థైరాయిడ్ సమస్యలు
థైరాయిడ్ నుంచి విడుదలైన హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి చాలా కీలకమైన జీవక్రియలను నిర్వహిస్తుంటాయి. ఈ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల థైరాయిడ్ సంబంధిత సమస్యలు వస్తాయి. ప్రస్తుతం జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆహారంలో అసమతుల్యత, శారీరక శ్రమ లోపించడం వంటి కారణాల వల్ల థైరాయిడ్ సమస్య ఇటీవల చాలా ఎక్కువగా వస్తోంది. ఇది ఏ వయసువారికైనా రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు. థైరాయిడ్ సమస్యను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... 1. హైపోథైరాయిడిజం: ఈ సమస్య ఉన్నప్పుడు జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడ థైరాక్సిన్ హార్మోన్ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధికబరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం, చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్లనొప్పులు, చిరాకు, మతిమరపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. హైపర్థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి అవసరాన్ని మించి అధికంగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు-కాళ్లు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు హైపర్థైరాయిడిజంలో కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా మొదలవుతుంది. కంటి కండరాలు వాచి, కనుగుడ్లు ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తే దాన్ని ‘గ్రేవ్స్ డిసీజ్’ అంటారు. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి పెద్దదై మెడ భాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు. నిర్ధారణ పరీక్షలు: థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోడానికి టీ3, టీ4, టీఎస్హెచ్ హార్మోన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఆయా హార్మోన్ల పాళ్లను బట్టి సమస్యను తెలుసుకుంటారు. ఆయా హార్మోన్ల హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో అని నిర్ధారణ చేయడానికి థైరాయిడ్ యాంటీబాడీస్ (యాంటీటీపీఓ యాంటీబాడీస్) పరీక్షలు అవసరమవుతాయి. హోమియో వైద్యం: రోగి శారీరక, మానసిక పరిస్థితులు, ఆకలి, నిద్ర, ఆందోళన వంటి అంశాలతో పాటు వంశపారంపర్య ఆరోగ్య చరిత్ర వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని థైరాయిడ్ సమస్యకు మందులను ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
హైపోథైరాయిడిజం- హోమియోపతి వైద్యం
థైరాయిడ్ గ్రంథి తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) ను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని హైపోథైరాయిజం అంటారు. దీనికి దీర్ఘకాలం అయోడిన్ లోపం ప్రధాన కారణం కాగా, మెదడులోని హైపోథలామస్, పిట్యుటరీ గ్రంథుల పనితీరులో లోపం, థైరాయిడ్ గ్రంథి వాపు, మానసిక సమస్యల కోసం వాడే కొన్నిరకాల మందుల దుష్ర్పభావం, దీర్ఘకాల మానసిక ఒత్తిళ్ళ వలన కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు వచ్చి హైపోథైరాయిడిజం ఉత్పన్నమవుతుంది. థైరాయిడ్ గ్రంథి నుండి తగినంత మోతాదుల్లో హార్మోన్స్ (టీ3, టీ4) ఉత్పన్నమవడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుండి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్) అయోడిన్ను థైరాయిడ్ గ్రంథికి సరఫరా కావడానికి, అక్కడ ైథైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) ఉత్పత్తి అవ్వడానికి సహకరిస్తుంది. అయితే టీఎస్హెచ్ లోపం లేదా అయోడిన్ లోపం వల్ల ఈ ప్రక్రియ సజావుగా జరగక టీ3, టీ4 హార్మోన్స్ ఉత్పన్నం కాకపోవడాన్నే, ‘హైపోథైరాయిడిజం’ అంటారు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి వాపు (hashimoto's thyroiditis) వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్స్ (టీ3, టీ4) పరిమాణం తగ్గుతుంది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరులో వచ్చే మార్పుల వల్ల అది థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసి అక్కడి కణజాలాన్ని దెబ్బతీయడం వలన ఈ వాపు ఏర్పడుతుంది. నిర్ధారణ పరీక్ష: సాధారణంగా టీ3, టీ4, టీఎస్హెచ్ హార్మోన్స్ పరిమాణం రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు. అయితే చాలావరకు పరీక్షల్లో టీ3, టీ4 అనేవి సాధారణ స్థితిలోనే ఉన్నప్పటికీ టీఎస్హెచ్ ఎక్కువస్థాయిలో ఉంటుంది. మన శరీరంలో ఉండే ఒక రక్షణ వ్యవస్థలో భాగంగా ఇలా జరుగుతుంది. హోమియోపతి వైద్యం: హోమియోపతిలో హైపోథైరాయిడిజం సమస్యను చాలావరకు అదుపులో ఉంచే ఔషధాలు ఉన్నాయి. అయితే మందుల ఎంపిక కేవలం లక్షణాలు తగ్గించే విధంగా కాకుండా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుం టారు. అంటే... వ్యక్తి శారీరక, మానసిక స్థితి, శారీరక లక్షణాలు, వాటికి కారణాలు పూర్తిగా విశ్లేషించాక వైద్యులు తగిన ఔషధాలు సూచిస్తారు. సాధారణంగా... కాల్కేరియా కార్బ్ కాల్కేరియా ఫాస్ అయోడమ్ థైరాయిడినమ్ కాల్కేరియా అయోడ్ స్పాంజియా మొదలగు మందులను వాటి వాటి లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో వాడితే పూర్తి ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు: హైపోథైరాయిడిజంలో సాధారణంగా.... బరువు పెరగడం, మొహం ఉబ్బటం, కాళ్ళుచేతులలో నీరు చేరడం జుట్టు రాలటం, అక్కడక్కడ చర్మం పొడిబారడం తొందరగా అలసిపోవటం, కండరాల నొప్పి మానసిక కుంగుబాటు మలబద్దకం సంతానలేమి, పురుషుల్లో సెక్స్ బలహీనత, మొదలగు లక్షణాలు కనిపిస్తుంటాయి. వ్యాధి తీవ్రత, వ్యక్తులను బట్టి ఈ లక్షణాలు, వాటి తీవ్రత మారుతుంటాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ-వరంగల్, కర్ణాటక ph: 7416 107 107 / 7416 102 102 www.starhomeo.com Email : info@starhomeopathy.com -
పాదాలనొప్పి... నివారణ... చికిత్స
వయసు పెరుగుతున్నకొద్దీ పాదాల్లో నొప్పి రావడం చాలామందిలో కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం... మడమ కింది భాగం నుంచి మొదలై కాళ్ల వేళ్ల వద్ద ఉండే ఎముకల వరకు... అంటే పాదమంతా విస్తరించి ఉండే భాగాన్ని ప్లాంటార్ ఫేషియా అంటారు. అది ఎముకనూ, కండరాలనూ కలిపే ధాతువు వంటిది. దీనికి సాగే గుణం ఎక్కువ. ఇది పొట్టిగా ఉంటే పాదం వద్ద వంపు పెద్దగా ఉంటుంది. పొడవుగా ఉంటే పాదం వద్ద వంపు తక్కువగా ఉంటుంది. మరీ పొడుగ్గా ఉంటే పాదం అంతా సమతలంగా కిందికి ఆనినట్లుగా ఉంటుంది. ప్లాంటార్ ఫేషియా కింద కొవ్వుపదార్థం ఉండటం వల్ల నడుస్తున్నప్పుడు దానిపై పడే ఒత్తిడి నుంచి ఈ కొవ్వు నిండిన భాగం కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ఫేషియాకు ఏదైనా గాయం తగిలితే పాదం నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పులు సాధారణం గా ఉదయం వేళల్లో ఎక్కువగా ఉంటాయి. కూర్చుని అకస్మాత్తుగా లేచినప్పుడు పాదాల్లో నొప్పి రావచ్చు. కొందరిలో సూదులతో గుచ్చినట్లుగా కూడా నొప్పి కలగవచ్చు. పాదాల నొప్పుల నివారణకు: పాదాల్లో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పాదంపై పడే భారాన్ని గణనీయంగా తగ్గించి, పాదానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇందుకోసం ఎక్కువగా నడవడం, పరుగెత్తడం తగ్గించాలి. పాదం మధ్యలో వంపు తిరిగి ఉన్న భాగానికి సపోర్ట్ ఇచ్చేలా ఉండే పాదరక్షలను ఎంచుకోవాలి. ఒకవేళ ఫ్లాట్ పాదరక్షలు వాడేవారికి పాదాల్లో నొప్పి వస్తుంటే... ఆర్చ్లా వంపు తిరిగి ఉన్న భాగానికి సపోర్ట్ ఇచ్చేలా అక్కడ స్పాంజి వంటి మెత్తటి పదార్థాన్ని పాదరక్షలోని ఆ ప్రదేశంలో అమర్చుకోవడం మంచిది. దీనివల్ల వంపు భాగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఈ వ్యాయామాలతో పాదం నొప్పి నుంచి ఉపశమనం... ఫేషియాను సాగేలా చేసే వ్యాయామం: గోడ ఎదురుగా నిలబడి, మీ చేతుల్ని గోడపై ఆన్చాలి. నొప్పిగా ఉన్న కాలిని వెనక్కు పెట్టి పాదాలను ఫ్లాట్గా భూమికి ఆన్చి ఉంచాలి. ఇప్పుడు మోకాళ్లను వంచాలి. ఈ సమయంలో పాదాలను లేపకూడదు. దీన్ని ఆరు నుంచి ఎనిమిది సార్లు రిపీట్ చేయాలి. ఇలా చేస్తే ఫేషియా సాగి నొప్పి తగ్గే అవకాశాలు ఎక్కువ. పిక్క సాగేలా చేసే వ్యాయామం: గోడ ఎదురుగా నిలబడి చేతులను గోడపై ఆన్చాలి. నొప్పిగా ఉన్న కాలిని నిలకడగా ఉంచి మరోకాలిని మోకాళ్ల వద్ద ముందుకి వంచాలి. ఈ సమయంలో పాదాలు నేలను తాకి ఉండేలా చేయాలి. దీన్ని ఆరు నుంచి ఎనిమిది సార్లు రిపీట్ చేయాలి. కాలి కండరాలను బలపరచుకోవడం కోసం: ఇందుకోసం కాలి మునివేళ్లపై నిలబడి పైన ఉండే వస్తువును అందుకోవడానికి ప్రయత్నించినట్లుగా సాగాలి. కాలివేళ్లను దృఢంగా చేసుకోవడం కోసం: కింద పడి ఉన్న వస్తువును కాలివేళ్లతో అందుకోవాలి. ఈ నాలుగు రకాల వ్యాయామాలు చేస్తుండటం వల్ల పాదాలనొప్పులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. చికిత్స: పాదాల నొప్పుల తీరుతెన్నులను, వ్యక్తి లక్షణాలను బట్టి మంచి హోమియో వైద్యుని ఆధ్వర్యంలో ఆర్సెనికమ్, లెడమ్పాల్, పెట్రోలియమ్, జింకమ్, ఆసిడ్ బెంజ్, రొడోడెండ్రాన్, కాస్టికమ్ మొదలైన మందులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. -
ఆస్తమా నుంచి ఉపశమనమెలా...?
నా వయసు 46. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా జబ్బు ఉంది. చలికాలంలో తప్పనిసరిగా బయటపడుతుంది. పిల్లికూతలతో కూడిన ఆయాసం వస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. చాలా మందులు వాడాను. కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. శాశ్వత నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయ ప్రార్థన. - భ్రమరాంబ, చేవెళ్ల మీకున్న సమస్యను ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు... అసాత్మ్యత (అలర్జీ) కావచ్చు. ఇది ఆహారపదార్థాలతో రావచ్చు. బాహ్యవాతావరణంలోని అంశాలు కావచ్చు. గాలిలో తేమ, దుమ్ము, ధూళి, మేఘావృత వాతావరణం, అతిశీతల వాతావరణం, మరికొన్ని కంటికి కనిపించని ఇతర పదార్థాలు మొదలైనవి. అదేవిధంగా కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి సిమెంట్, కెమికల్స్, ఆయిల్స్ మొదలైనవి పడకపోవచ్చు. కొంతమందికి వారసత్వం ఒక కారణం. మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. కొంతమందిలో జ్వరం కూడా ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని ‘యాప్య’ వ్యాధిగా స్పష్టీకరించింది. అంటే పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహార, విహార, ఔషధాల ద్వారా నియంత్రించుకోగల్గిన వ్యాధి అని అర్థం. ఆయాసం ఉన్నప్పుడు విశ్రాంతి అవసరం. పరిశ్రమచేస్తే ఇది మరింత ఎక్కువవుతుంది. చలి నుంచి కాపాడుకోవాల్సిన దుస్తులు ధరించాలి. కొంచెం బోర్లా పడుకునే భంగిమలో ఉపశమనం లభిస్తుంది. ఆయాసం తగ్గేవరకు వేడివేడిగా ఉండే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లటి వస్తువులను దూరంగా ఉంచాలి. మందులు ఆయాసంగా ఉన్నప్పుడు కనకాసవ లేదా సోమాసవ (ద్రావకం) మూడు చెంచాల మందులో సమానంగా గోరువెచ్చని నీరు కలిపి, రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగాలి. దగ్గు, కఫం తగ్గడానికి: వాసారిష్ట, పిప్పలాసవ... ఈ రెండు ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో పోసుకొని, నాలుగు చెంచాలు నీళ్లు కలిపి, రోజుకి మూడుసార్లు తాగాలి. భారంగ్యాది చూర్ణం: ఒక చెంచా చూర్ణం రోజుకి రెండుసార్లు, వేడినీటితో కర్పూరతైలాన్ని ఛాతీకి ముందు, వెనక వైపు పూతగా పూసి (మెల్లగా మసాజ్ చేసి), వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. ఆయాసం తగ్గిన అనంతరం ఈ కింది ఔషధాలను రెండు మూడు నెలలపాటు వాడితే ‘క్షమత్వం’ వృద్ధి చెంది తమక శ్వాస వచ్చే తీరు బలహీనపడుతుంది. శృంగారాభ్రరస మాత్రలు: ఉదయం 1, రాత్రి 1 అగస్త్యహరీతకీ రసాయన (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి తిని, పాలు తాగాలి. గృహవైద్యం ఒక చెంచా ఆవనూనె, ఒక చెంచా తేనె కలిపి సేవిస్తే ఆయాసం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంతో చేసిన టీ రోజుకి నాలుగైదు సార్లు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. రెండు చిటికెలు ఇంగువను బెల్లంతో తిన్నా ప్రయోజనం ఉంటుంది ఆయాసం లేనప్పుడు, రెండుపూటలా ప్రాణాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకుంటే పుప్ఫుసాలకు (ఊపిరితిత్తులకు) క్రియాపరమైన సామర్థ్యం పెరుగుతుంది. ఇది పరిశోధనాశాస్త్ర నిరూపితం. గమనిక: కొంతమంది నాటువైద్యులు, నకిలీవైద్యులు ఈ వ్యాధిని పూర్తిగా నయం చేస్తామని అనేక ప్రకటనలు, ప్రచారాలు చేస్తూ వారి వారి మందులు అమ్ముకుంటుంటారు. ఇలాంటి మోసాలకు బలికావద్దు. మరికొంతమంది కొన్ని ఆయుర్వేద మందులలో అల్లోపతికి సంబంధించిన ‘స్టెరాయిడ్స్’ కలిపి అమ్ముతుంటారు. స్టెరాయిడ్స్ వల్ల నాటకీయ ప్రయోజనం కలుగుతుంది. ఆ విధంగా వారి వలలో పడతారు. ఇది ప్రమాదమని గ్రహించాలి. మీకు దేనివల్ల ఆసాత్మ్యత కలుగుతోందన్న అంశాన్ని లేదా ఇతర కారణాలను గమనించగలిగితే దానిని దూరం చేయాలి. దీనిని ‘నిదానపరివర్జనం’ అంటారు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
సిస్టమిక్ ల్యూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ)
సిస్టమిక్ ల్యూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) అనే వ్యాధి వల్ల శరీరంలోని అనేక అవయవాలు ప్రభావితమవుతాయి. ఇది గుండె, చర్మం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కీళ్లు, రక్తనాళాలు, నాడీవ్యవస్థలను పీడిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. రోగనిరోధక వ్యవస్థలో సొంత కణాలపైనే దాడిచేయడం వల్ల వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇది 15 - 35 ఏళ్ల వారి వరకు కనిపిస్తుంది. స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ జబ్బు దిశను ఊహించడం కష్టం. లక్షణాలు : ఈ వ్యాధికి గురయ్యే అవయవాన్ని బట్టి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. చర్మం: ముఖంపై దద్దుర్లు ముక్కుకు ఇరుపక్కలా చెంపలపై సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు (దీన్నే బటర్ఫ్లై రాష్ అంటారు) మూత్రపిండాలు: ఎక్కువశాతం ఎస్ఎల్ఈ రోగులలో మూత్రపిండాల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. దీన్నే ల్యూపస్ నెఫ్రైటిస్ అంటారు మూత్రంలో రక్తకణాలు, ప్రోటీన్లు కోల్పోవడం శరీరమంతా వాపు రావడం, బరువు పెరగడం ఎస్ఎల్ఈ దీర్ఘకాలంలో మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి చేయాల్సిన అవసరం రావచ్చు. అందుకే వ్యాధి తీవ్రమయ్యాక చికిత్స తీసుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది. గుండె : ఎస్ఎల్ఈ రోగుల లో గుండెకు సంబంధించిన సమస్యలతో మరణించే వారి సంఖ్య అధికం. ముఖ్యంగా పెరికార్డైటిస్, మయోకార్డైటిస్, ఎండోకార్డైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటివల్ల ఆయాసం, జ్వరం, నీరసం మొదలైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఎస్ఎల్ఈ వల్ల గుండెలోని రక్తనాళాలలో కొవ్వుపదార్థాలు వేగంగా, అధికంగా పేరుకుపోవడం వల్ల గుండెనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. నాడీవ్యవస్థ : ఎస్ఎల్ఈ బారినపడితే మానసిక అశాంతి, పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి గర్భిణులలో ఎస్ఎల్ఈ వల్ల పిండం మృతిచెందడం, గర్భస్రావం వంటివి జరిగే అవకాశం ఎక్కువ. కారణాలు : శాస్త్రీయంగా ఎస్ఎల్ఈ వ్యాధికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే జన్యుపరమైన, పర్యావరణపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశాలున్నట్లు అనుభవపూర్వకంగా తెలుస్తోంది. ఈ వ్యాధికి అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఏ వైద్యవిధానంలోనూ సంపూర్ణంగా నయం చేసే అవకాశం లేదు. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
స్ట్రెస్ వల్ల సోరియాసిస్
దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్తో బాధపడుతున్నారని అంచనా. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో కనబడుతుంది. మిగిలిన వేసవికాలం, వర్షాకాలంలో ఈ వ్యాధి లక్షణాలు అసలు కనబడకుండాపోతాయి. ఇట్లాంటి సందర్భంలో ఈ వ్యాధి ఉన్న వారు వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని పొరబడే అవకాశం కూడా ఉంది. అయితే దానివల్ల ముందు ముందు ఎంతో ముప్పు ముంచుకొస్తుంది. అసలు వ్యాధి కారణాలు, దాని పరిష్కారమార్గాలపై అవగాహన కలిగిస్తూ, కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా వ్యాధిని మూలం నుంచే నయం చేయవచ్చు. ఇతర విధానాలతో పోల్చితే హోమియో వైద్యవిధానంలో దీనికి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. సోరియాసిస్ రావడానికి కారణాలు వంశపారంపర్యంగా మానసికంగా ఒత్తిడి, ఆందోళన ఉండటం పొడిచర్మం ఉన్నవారిలో కొన్ని రకాల మందుల దుష్పరిణామాల వల్ల స్త్రీలలో పొగతాగే అలవాటు గల వారిలో అధిక బరువు ఉన్నవారిలో బి.పి., డయాబెటిస్ వ్యాధి గల వారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలుంటాయి వాతావరణంలోని మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సోరియాసిస్ వ్యాధి రకాలు సోరియాసిస్ వల్గారిస్ గటేట్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ వస్ట్యులార్ సోరియాసిస్ పల్మోప్లాంటార్ సోరియాసిస్ సోరియాసిస్ వ్యాధి లక్షణాలు చర్మం మీద చిన్న ఎర్రని మచ్చలాగ మొదలై చర్మం బూడిదరంగులో మారి పొడిబారి పొలుసులలాగ రాలిపోతుండటం విపరీతమైన దురద ఈ మచ్చలు మి.మీ. నుంచి మొదలై కొన్ని సెంటీమీటర్ల వరకూ విస్తరిస్తుంటాయి. తలలో అయితే డాండ్రఫ్ లాగ పెద్ద పెద్ద పొలుసుల రూపంలో రాలిపోతుంటాయి గోరు పసుపురంగులో మారి చర్మం నుండి వేరుపడుతుంది చర్మంపై నున్న పొలుసులను బలవంతంగా లాగినపుడు చిన్నగా రక్తం వస్తుంది. సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామాలు సోరియాసిస్ వల్ల వచ్చే ఒకే ఒక దుష్పరిణామం కీళ్ళ నొప్పులు. సోరియాసిస్తో బాధపడేవారిలో 10 శాతం నుండి 35 శాతం మందిలో ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి. దీనినే ‘‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో చనిపోయిన చర్మకణాలు చర్మం పైపొర ద్వారా బయటకు వెళ్ళకుండా కీళ్ళలో చేరి ఎముకల అరుగుదలకు దోహదపడతాయి. అందువలన కీళ్ళనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ వ్యాధిని గుర్తించడం ఎలా? 1. వ్యాధి లక్షణాలను బట్టి రోగిని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు. 2. చర్మంలోని చిన్న ముక్కను తీసి పరీక్షకు పంపడం ద్వారా తెలుసుకోవచ్చు. సరైన చికిత్సా విధానం హోమియోపతి వైద్య విధానం ద్వారా ఈ సోరియాసిస్ను అరికట్టవచ్చు. హోమియోపతి వైద్య విధానంలో చికిత్స అనేది రోగి శరీరతత్వం, మానసిక స్థితి, వ్యాధి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ‘కాన్స్టిట్యూషనల్ థెరపీ’ అని అంటారు. ఈ విధమైన చికిత్సా విధానం ద్వారా ఏ విధమైన రోగాన్ని అయినా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. డాక్టర్ సృజనారెడ్డి, సీనియర్ డెంటల్ సర్జన్ పాజిటివ్ డెంటల్, హైదరాబాద్. -
అంతుచిక్కని చక్కెర వ్యాధికి చక్కని మార్గం- హోమియోపతి
మధుమేహం లేదా చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్ మెలినస్- ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజు స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. మానుకోవాల్సిన అలవాట్లు: పొగతాగకూడదు మద్యం సేవించకూడదు పాదరక్షలు లేకుండా నడవకూడదు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మాంసాన్ని తక్కువగా తీసుకోవాలి. హోమియోపతి వైద్యవిధానం: హోమియోపతిలో రోగి మాసిక, శారీరక, భౌతిక వ్యాధి లక్షణాలను పరిగణనలోనికి తీసుకొని మూలకారణాన్ని కనుక్కొని, జెనెటిక్ కాన్సిట్యూషనల్ సిమిలిమమ్ ద్వారా సరియైన ఔషధాన్ని ఇస్తారు. హోమియోపతి మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించని మందులు. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆధారం చేసుకొని డయాబెటిన్ను రెండు ప్రధాన రకాలుగా విభజించుతారు. అవి టైప్ 1 డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్. డయాబెటిస్ వల్ల కాంప్లికేషన్లు: నాడీ కణాల మీద ప్రభావం. ఇందులో మొత్తం శరీరభాగాలు అన్నీ ప్రభావితమవుతాయి. మొత్తం న్యూరైటిసిస్లలో ఇది అత్యంత ప్రభావశీలి నరం మీద మైలీన్షీల్ (పొర) దెబ్బ తినడం వల్ల తిమ్మిరుల మరియు మంటగా అనిపించడం, స్పర్శ తెలియకపోవడం, అంటే వారి కాలికి, చేతికి ఏదైనా గుచ్చుకున్నా, దెబ్బ తిగిలినా రోగికి తెలియదు. నడకలో మార్పు, కంటి చూపు తగ్గిపోవడం, కొన్నిసార్లు మూత్రాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వంచి సమస్యలు చూస్తూ ఉంటాము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు: రోజూ కనీసం 45 ని॥పాటు నడక లేదా వ్యాయామం భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి రాత్రిపూట ఫలహారం మాత్రమే (టిఫిన్) తీసుకోవాలి. (అన్నం తినకూడదు) ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి పాదాల మీద పుండ్లు, ఆనెలు, గాయాలు ఏమైనా ఉన్నా డాక్టర్ సమక్షంలోనే చికిత్స తీసుకోవాలి పిండి పదార్థాలు తగ్గించి అధిక పీచు ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాలు: అతిగా మూత్ర విసర్జన ఎక్కువగా ఆకలి వేయడం ఎక్కువగా దాహం వేయడం మందగించిన చూపు కారణం లేకుండా బరువు తగ్గడం బద్ధకం. ఒక బరువు తగ్గడం తప్ప మిగతా లక్షణాలు అన్ని డయాబెటిస్ 2 లో కూడా కనిపిస్తాయి. కారణాలు: స్థూలకాయం వంశపారంపర్యంగా మానసిక ఒత్తిడి. ఆహారపు అలవాట్లు జీవనశైలి థైరాయిడ్, పీసీఓడీ ఉన్న వాళ్ళకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. రకాలు: టైప్ 1 డయాబెటిస్: సాధారణంగా బీటా కణాలను మన శరీరమే స్వయంగా నాశనం చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఉండదు. అందుకే ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇస్తారు టైప్ 2 డయాబెటిస్: ఉత్పత్తి అయిన ఇన్లుసిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం ఇన్సులిన్ రెసిటెన్స్- ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. రెసిస్టెన్షియల్ డయాబెటిస్: ఈ రకాన్ని గర్భధారణ సమయంలో మాత్రమే చూస్తాము. సాధారణంగా కాన్పు తర్వాత, సాధారణ స్థితికి వస్తుంది. కొద్దిమందిలో మాత్రం అలానే కొనసాగుతుంది. నాపేరు రాములు. నేను ఆటోమొబైల్ కంపెనీలో ఫ్లోర్ ఇన్ఛార్జ్గా చేస్తాను. నేను చాలా సం॥డయాబెటిస్తో బాధపడ్డాను. విపరీతమైన ఆకలి. దాహం, నీరసం వంటి సమస్యలతో ఎంతో సతమతమయ్యేవాడిని. ఎన్నోరకాల మందులు, వ్యాయామాలు, డైటింగ్, వాకింగ్ ఎన్నో చేశాను. కాని ఫలితం కన్పించలేదు. హోమియోపతి మందుల వల్ల డయాబెటిస్ కంట్రోల్కి వస్తుందని ఎంతోమంది చెబితే విని పాజిటివ్ హోమియోపతికి వెళ్ళాను. వీరిచ్చిన ట్రీట్మెంట్ వలన, సలహాల వలన ఇప్పుడు నా డయాబెటిస్ చాలా కంట్రోల్కొచ్చింది. నా సంతోషానికి కారణమైన పాజిటివ్ హోమియోపతికి చాలా థ్యాంక్స్... ...పాజిటివ్ హోమియోపతి డా॥టి. కిరణ్కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivedental.com -
చదివింది హోమియోపతి.. చేసేది అల్లోపతి..
భూపాలపల్లి, న్యూస్లైన్ : భూపాలపల్లి పట్టణంలో నకిలీ వైద్యులు యథేచ్ఛగా తమ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. సరిైయెున అర్హ తలు లేకుండానే హంగుఆర్భాటాలతో ఏకంగా నర్సిం హోంలు ప్రారంభించి నడిపిస్తున్నారు. రోగుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వారిని గుల్ల చేస్తున్నారు. చదివింది.. ఒక కోర్సు అయితే మరో కోర్సుకు సంబంధించిన మందులు రాస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భూపాలపల్లి పట్టణంలో సుమారు 10కిపైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఇందులో రెండింటిలో మాత్రమే ఎంబీబీఎస్ వైద్యులు ఉన్నారు. మిగతా ఆస్పత్రుల్లో వైద్యులంతా బీహెచ్ఎంఎస్(హోమియోపతి), బీఏఎంఎస్(ఆయుర్వేదం) విద్యను అభ్యసించినవారు. అయి నా వీరంతా వచ్చీరాని అల్లోపతి(ఇంగ్లీషు) వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగులకు సరిగ్గా ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఇక మాతో కాదు హన్మకొండకు తీసుకెళ్లండి అంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 100 మందికిపైగా రోగులను పరీక్షిస్తూ ఒక్కో రోగికి సుమారు రూ800 నుంచి వేయి వరకు విలువ చేసే మందులు రాస్తూ నిలువు దోపిడి చేస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి అవసరం లేకున్నా రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేగాక ఏకంగా ప్రసవాలు, శస్త్ర చికిత్స సైతం చేస్తున్నట్లు తెలిసిం ది. స్థానిక బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ వైద్యులు ఇతర ప్రాంతాలకు చెందిన ఎంబీబీఎస్ వైద్యుల పేరిట తమ ఆస్పత్రులను రిజిస్ట్రేషన్ చేయించుకుని నిబంధనలకు విరుద్ధంగా వీరే అల్లోపతి వైద్యం కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకుగాను సదరు ఎంబీబీఎస్ వైద్యుడికి ఏటా సుమారు రూ60 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. సీజ్ చేసినా ఎలా తెరుచుకున్నాయి.. 2012, మే 11న భూపాలపల్లి పట్టణంలోని పలు ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సాంబశివరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో సాయి క్లినిక్లోని సాంబ య్య అనే వైద్యుడు హోమియోపతి విద్యనభ్యసించి అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు ధ్రువీకరించారు. అంతేగాక ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ మిషన్, ఈసీజీ, ఎక్స్రే, ప్లేట్లెట్ కౌంటింగ్ మిషన్లకు ఎలాంటి అనుమతులు లేకపోగా అర్హత కలిగిన సిబ్బంది లేరు. దీంతో అదేరోజు సాయి క్లినిక్ ఆస్పత్రిని డీఎంఅండ్హెచ్ఓ సాంబశివరావు సీజ్ చేశారు. అయితే అదే వైద్యుడు సరిగ్గా నెల రోజులు కూడా తిరగకముందే డీఎంఅండ్హెచ్ఓ సీజ్ చేసిన తాళాలను పగులగొట్టి ఆస్పత్రిని తెరిచి వైద్యం చేశారు. ఇటీవలే తన ఆస్పత్రిని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల మూడంతస్థుల సొంత భవనంలోకి మార్చుకున్నారు. ఇక్కడ కూడా అనుమతి లేని యంత్రాలను వాడుతూ అదే సిబ్బందిని నియమించుకుని అల్లోపతి వైద్యం కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీజ్ అయిన ఆస్పత్రు ల నిర్వాహకులు ఓ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందజేసి ఆస్పత్రులను తిరిగి తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది. -
సోరియాసిస్కి హోమియో వైద్యం
దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం స్త్రీ, పురుష తేడా లేకుండా అందర్నీ బాధించే సోరియాసిస్ వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ఉత్పాతాలను సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన బాధితులు శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో నలిగిపోతున్నారు. అయితే హోమియో వైద్య విధానం సూచించిన సంపూర్ణ శారీరక, మానసిక తత్వశాస్త్రాన్ని అనుసరించి, సత్వర పరిష్కారాల కోసం చూడకుండా శాశ్వత స్వాంతన చర్యలు చేపట్టడం ద్వారా ఈ వ్యాధి మీద అంతిమ విజయం సాధించవచ్చు. సోరియాసిస్ అనేది దీర్ఘకాలంపాటు కొనసాగే చర్మవ్యాధి. చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలుసులు, పొడలు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్ని, వాపునీ కలిగి ఉండవచ్చు. కేవలం చర్మం మాత్రమే కాకుండా గోళ్లు, తల తదితర శారీరక భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనుకావచ్చు. మొదట్లో సోరియాసిస్ మచ్చలు ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచేకొద్దీ ఈ మచ్చలపైన తెల్లని పొలుసులు మందంగా పేరుకుపోతాయి. పొలుసులను తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి. దురద ప్రధాన లక్షణం కాదు. అయితే వాతావరణం చల్లగా ఉండి, తేమ తగ్గిపోయినప్పుడు కాని, ఇన్ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడు గానీ, తీరుబడిగా ఉన్నప్పుడుగానీ దురద ఎక్కువవుతుంది. బాధితుల్లో 10-20 శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా వ్యాపిస్తాయి. ఎందుకు వస్తుంది? వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటం వల్ల సోరియాసిస్ వస్తుందని ఇటీవల కాలంలో జరుగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి గురించి తెలుసుకోవాలి. వైరస్, బ్యాక్టీరియా వంటివి దాడిచేసినప్పుడు వాటినుంచి రక్షణ పొందడానికి, అవి ఏర్పరచిన అపశ్రుతులను సరిచేయటానికి మన శరీరంలో తెల్లరక్తకణాలనే ప్రత్యేకమైన కణాలు పనిచేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్లి ఇన్ఫెక్షన్లను తగ్గించటమే కాకుండా గాయాలను మానేలా చేస్తాయి. దీనినే వ్యాధినిరోధక శక్తి అంటున్నాం. ఈ నేపథ్యంలో అనుబంధ అంశంగా ఇన్ఫ్లమేషన్ (ఎరుపుదనం, వాపు) తయారవుతుంది. సోరియాసిస్లో ఈ వ్యాధి నిరోధక శక్తి అపక్రమంగా తయారవుతుంది. ఇది శరీర కణజాలాన్ని (చర్మ కణజాలం) అన్యపదార్థంగా అన్వయించుకొని, దాడి చేసి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. దాంతో చర్మకణాలు అనియతంగా పెరిగే పొలుసులుగా తయారవుతాయి. అయితే వ్యాధి నిరోధక శక్తిలో ఈ మార్పులు జన్యుపరమైన కారణాలవల్ల జరుగువచ్చు. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు కొన్నిసార్లు ప్రేరకాలుగా పనిచేస్తాయి. సోరియాసిస్ రకాలు సోరియాసిస్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు. స్థూలంగా అవి 1) సోరియాసిస్ వల్గారిన్ 2) గట్టేట్ సోరియాసిస్ (గట్టా అంటే బిందువు) 3) పుస్టులార్ (పస్ అంటే చీము) 4)ఎరిత్రో డెర్మల్ సోరియాసిస్ (ఎరిత్రో అంటే ఎరుపు). చికిత్సా విధానం - హోమియోపతి దృక్పథం ఏదైతే వ్యాధికి కారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగపడుతుందనే ప్రకృతి సహజ సిద్ధాంతంపై హోమియోపతి వైద్యవిధానం ఆధారపడి ఉంది. దీనినే లాటిన్లో ‘సిమిలియా సిమిలిబస్ క్యూరేంటర్’ అంటారు. ఇంచుమించు మన ‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ లాంటిదని చెప్పవచ్చు. ఒకే రకమైన ప్రేరణ లేదా ప్రేరకానికి భిన్నవ్యక్తులు భిన్నభిన్న రకాలుగా స్పందిస్తారనే అస్తివాదంపైన హోమియోపతి ఆధారపడి ఉంది. దీన్నే మూర్తిత్వమంటారు. హోమియోపతికి మాత్రమే సంబంధించిన విలక్షణ అంశమిది. సోరియాసిస్ విషయంలో వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. హోమియో వైద్యవిధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక - శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకుని మందులను సూచిస్తారు. అయితే చికిత్సా ఫలితాలు ఆహార, వ్యవహార, ఔషధాల సమిష్టి ప్రయోగాన్ని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి ఉంటాయి. సోరియాసిస్కు సాధారణంగా ఆర్సెనికం ఆల్బం (శీతాకాలం ఎక్కువగును), సల్ఫర్, కాలి ఆర్క్, సోరినమ్, మెజీరియం, పెట్రోలియం వంటి మందులను వాటి వాటి లక్షణాలకు అనుగుణంగా వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. అసలు ఈ వ్యాధిఎలా వస్తుంది? మామూలుగా ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరమూ తయారవుతుంటాయి. సుమారు నెలరోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పై పొరగా ఏర్పడినవి క్రమంగా నిర్జీవమై ఊడిపోయి కింది కణాలను బహిర్గత పరుస్తాయి. సోరియాసిస్ వ్యాధిలో ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మపు కణాలు వేగంగా తయారై మూడు, నాలుగు రోజులకే వెలుపలకు చేరుకుంటాయి. అదనపు కణసముదాయానికి పోషకత్వాలను అందించే నిమిత్తం రక్తసరఫరా పెరుగుతుంది. దీనితో చర్మంపైన ఎర్రని పొడ తయారవడం, పొలుసులు ఏర్పడడం జరుగుతాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
సైనసైటిస్కు ఆపరేషన్ లేకుండా... అలర్జీ, ఆస్తమాలకు హోమియో చికిత్స
మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలోకి ఎలాంటి బయటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘ఇమ్యూనిటీ’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థాలు; బాక్టీరియా, వైరస్ ఫారెన్ ప్రొటీన్లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంతమందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘హైపర్ సెన్సిటివిటీ’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి జలుబు చేసి. పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్లె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని; గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడిన దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని; ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు. కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్లు మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాల్లో చర్మంపై పొక్కులు వస్తాయి. దీనిని ‘‘అలర్జిక్ డెర్మటైటస్’’ అని అంటారు. అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువమందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు, అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్ మరియు బ్రాంక్రియల్ ఆస్థ్మా, శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి - పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, ఫెర్ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు. అలర్జీతో బాధపడేవారిలో ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు శరీరంలో, రక్తంలో ఉండే ఇమ్యునోగ్లోబ్యులిన్-ఇ (ఐజ్ఛ) అనే యాంటీబాడీతో అలర్జీన్ కలవడం వలన హిస్టమిన్ విడుదలవుతుంది. దీని వలనే ఈ లక్షణాలు ప్రారంభమవుతాయి. సాధారణంగా వాడే యాంటీ-హిస్టమిన్ మందుల వలన వ్యాధి లక్షణాల నుండి తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు కానీ శరీరంలోని ‘‘ఏటీపీ’’ తత్వాన్ని, వ్యాధి నిరోధక వ్యవస్థలోని సున్నితత్వాన్ని అవి తొలగించలేవు. కాబట్టి సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే శరీర తత్వాన్ని బట్టి సూచించే హోమియోపతి మందు వలన ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా ఎంత దీర్ఘకాలంగా ఉన్న అలర్జీ సమస్యలకైనా చక్కని ఉపశమనం పొందవచ్చు. చికిత్స సమయంలో ప్రాధమిక దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాతావరణం మార్పు ఉన్నప్పుడు, సంధికాలంలో, పుప్పొడి ఎక్కువగా విడుదలయ్యే సమయాలలో సాధ్యమైనంత వరకు బయటికి రాకూడదు = దుమ్ములో వెళ్లేటప్పుడు విధిగా క్యాప్ మరియు మాస్క్ వాడాలి =ఇంట్లో గదులలో దుమ్ము, ధూళి క్రమంగా శుభ్రం చేయించుకోవాలి. =పెంపుడు జంతువులు ఉన్నట్లయితే ఇంటి బయట ఉంచడం మంచిది. =బెడ్ షీట్స్, పిల్లోకవర్స్ తరచుగా మారుస్తుండాలి. =ఇంటిలో తేమశాతం తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. =ఒత్తిడిని తగ్గించుకొని మంచి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కొంత కాలం జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతి మందులు వాడినట్లైతే తర్వాత వ్యాధినిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి పదార్థాలు ఎదురైనా ఎలాంటి సమస్య ఉండదు. డా॥టి. కిరణ్కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com -
ఆయుర్వేదం,హోమియోపతికి పెరుగుతున్న ఆదరణ
సికింద్రాబాద్, న్యూస్లైన్: దేశంలో ప్రస్తుతం ఆయుర్వేద, హోమియోపతి వైద్యానికి ఎంతో ఆదరణ లభిస్తోందని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సికింద్రాబాద్ ఎస్డీరోడ్ భువన టవర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ ఆయుర్వేద,హోమియోపతి ఇంటిగ్రేటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో పాటు కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఆస్తమా లాంటి వ్యాధులకు ఇందులో చక్కని పరిష్కారం లభిస్తుందన్నారు. ఆయుర్వేద వైద్యం ఇప్పట్నుంచే కాదని..దేశంలో ఐదువేల ఏళ్ల కింద నుంచి వస్తున్న సంప్రదాయ వైద్యమన్నారు. ఆస్పత్రి సీఎండీ మురళి అంకిరెడ్డి, డెరైక్టర్లు డాక్టర్ శ్రీనివాస్గుప్త, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రవీందర్రెడ్డిలు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అడ్వాన్స్డ్ ఆయుర్వేద,హోమియోపతి మందుల ద్వారా దీర్ఘకాలిక,మొండి వ్యాధులను నయం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో కొత్తపేట, కూకట్పల్లి, సికింద్రాబాద్లతోపాటు విజయవాడ,విశాఖపట్టణం, తిరుపతి,రాజమండ్రి, బెంగళూరు, మల్లేశ్వరం, ఇతర రాష్ట్రాల్లో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని బ్రాంచీల్లో ఉచిత కన్సల్టెన్సీతోపాటు మందులపై 30శాతం తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్రెడ్డి, రసమయి బాలకిషన్, టీజేఏసీ నాయకులు విఠల్ పాల్గొన్నారు.