human life
-
స్వార్థం- దైవ చింతన
మానవుడు ప్రధానంగా స్వప్రయోజనా దృష్టి గల జీవి. అది అతన్ని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. దీనికి తోడు ఇతర ప్రాణులకు లేని బుద్ధి బలం కూడా మనిషికి ఉంది. మనిషి లోని సహజ లక్షణమైన ఈ స్వార్థ గుణాన్ని గురించి ఉపనిషత్తులు కూడా వివరించాయి. యాజ్ఞ వల్క్య మహర్షి తన భార్య మైత్రేయితో... ‘భార్య భర్తను ప్రేమిస్తున్న దంటే అది తన ఆనందం కోసమే. భర్త భార్యను ప్రేమిస్తున్నాడన్నా అతని ఆనందం కోసమే. ఇంకా పుత్రుల మీద, దేశం మీద, మానవులకున్న ప్రేమ వారి ఆనందం కోసం కాదు తన ఆనందం కోసమే’ అని చెపుతాడు. తన స్వార్థం కోసం ఉపయోగ పడేంతవరకు మానవుడు సమాజంతో సంబంధం పెట్టుకుంటాడు. మనిషిలో సహజంగా ఉండే ఈ స్వార్థాన్ని నియంత్రణ లేకుండా వదిలిపెడితే భూమిపై సుఖ శాంతులు పూర్తిగా కరువైపోతాయి. తన స్వార్థ ప్రయోజనాలకు బలహీనులను పట్టి పీడిస్తాడు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు ప్రవర్తిస్తాడు. కొన్నాళ్ళకు తనూ తన కంటె బలవంతుని చేతిలో బలవుతాడు. లోక నాశనానికి దారి తీసే ఈ స్వార్థ గుణాన్ని అణిచి వేసి, మనిషి మనసులో గొప్ప మార్పు దైవ చింతన తీసుకు రాగలదు. మానవులకు శాంతి మయ జీవితాన్ని ఇవ్వటానికి భగవంతుడు వివిధ రూపాలలో అవత రిస్తుంటాడు.ఇహ లోకంలో ప్రశాంత జీవితం గడపటానికి, పరంలో శాశ్వతా నందాన్ని పొందటానికి తగిన ఉపదేశాన్ని మానవాళికి అందజేసిన గ్రంథ రాజం భగవద్గీత. రోజుకొక శ్లోకం చదివినా, నేర్చుకున్నా ఆలోచనలు భగవంతునిపై నిలుస్తాయంటారు పెద్దలు. ‘భక్తుడు ఏ దేవతా రూపాన్ని శ్రద్ధగా పూజిస్తాడో అతనికి ఆ రూపంపై శ్రద్ధ నిలిచేటట్లు చేస్తాను’ అంటాడు భగవంతుడు. అలా పూజించినందుకు తగిన ఫలాన్ని అందజేస్తాడు. భగవంతుని చింతనలో మనసు పునీతమై, మనిషి నిస్వార్థ జీవిగా మారి, విశాల దృక్పథాన్ని అలవరచుకుంటాడు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
భక్తుని వేదన..
సాధారణంగా కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నిరాశకు గురవుతాడు. తన ప్రార్థనలు, వినతులు దైవం వినిపించుకోడా ఏమిటి అనే సందేహం కలుగుతుంది. భగవంతునికి అనేక మంది భక్తులుంటారు. వాళ్ళు గొప్పగా పూజలు చేస్తుంటారు. అంతమందిలో తానేం గుర్తుంటాడు? ఇలా ఆలోచిస్తూ సాధారణంగా నిస్పృహకు లోనవుతుంటారు మానవులు.సరిగ్గా భక్త హృదయాలను చదివినట్లుగా నరసింహ శతక కవి, ‘ఓ దేవా! నా వంటి సేవకుల సమూహం నీకు కోట్ల కొలది ఉంటారు. వారి సందడిలో, వారి సేవలలో నన్ను అశ్రద్ధతో మర్చిపోవద్దు. వారి పుణ్యాతిశయం చేత చాలా మంది సేవకులు నీవెంట పడేవారుండగా నీకు నేనే మాత్రం! నీవు మెచ్చే పనులు నేను చేయలేను. ఈ భూజనులలో నేను పనికిమాలిన వాణ్ణి. అయినా, నీ శుభమైన చూపు నాపై ప్రసరించు’ అని ప్రార్థిస్తాడు.అలాగే ‘నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకెప్పుడు? నా మనసులో కోర్కె తీరునట్లు నీ రూపం చూపించు. పాపం చేసినవారికి కనిపించనని ప్రమాణం చేసుకున్నావా? కానీ, పాపులను పరిశుద్ధు లను చేసే దేవుడివి నువ్వే అని మహాత్ములంతా నిన్ను స్తుతిస్తారు. పాపులను రక్షించి నందుకే నీకింత కీర్తి. చెడ్డవాడినైననూ నాకు కనిపించవా!’ అని వేడు కుంటాడు.ఇందులో భక్తులందరి వేదనా ఉంది. ఆర్తి ఉంది. తనను మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే సందేహం ఉంది. భగవంతుని కరుణ శీఘ్రంగా తనపై ప్రసరించాలని, ఆ దివ్య రూపాన్ని కళ్లారా దర్శించి తరించాలనే తపన ఉంది. తాను భగవంతుడు మెచ్చే పనులు చేయటం లేదేమో, అందుకే ఆయన దయ తనకు లభించడం లేదేమో, అలా మెప్పించే శక్తి తనకు లేదుకదా అనే నిస్సహాయత ఉంది. భగవంతుని విషయంలో భక్తుల హృదయాలలో సహజంగా కనిపించే వేదన ఇదే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
పొద్దు పోతున్నది...
‘పొద్దు పోయెనే శ్రీరాముని పూని భజింపవే మనసా!’ అని దిగులు పడతారు త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో..‘నిద్దుర చేత కొన్నాళ్ళు,విషయ బుద్ధుల చేత కొన్నాళ్ళు’ అంటూ... జీవితంలో మూడోవంతు కాలం నిద్రలోనూ; ఇంద్రియ విషయాల మీదా, సుఖాల మీదా ఉన్న ఆరాటం తీర్చుకునే ప్రయత్నంలో మరింత కాలం వ్యయమై పోతుండె! అని వాపోయారు."పొద్దున లేచి, త్రితాపములను, నరులపొగడి, పొగడి కొన్నాళ్ళు, వట్టి ఎద్దు రీతి, కన్నతావుల భుజియించి,ఏమి తెలియక కొన్నాళ్ళు, ముద్దుగ తోచు భవసాగరమునమునిగి లేచుచు కొన్నాళ్లు, పద్దుమాలిన పామర జనులతో వెర్రిపలుకులాడుచు కొన్నాళ్ళు, ఓ మనసా!"ఉదయం లేచినప్పట్నుంచి, తాపత్రయ పడుతూ, వాళ్ళకూ వీళ్ళకూ భజన చేస్తూ, కేవలం పశువులా ఎక్కడ ఏది కనిపిస్తే దాన్నంతా భుజిస్తూ, పైపై మెరుగులతో ఆకర్షించే సంసార సాగరంలో మునకలు వేస్తూ ఉండటంలోనూ, సాటి అజ్ఞానులతో సారహీనమైన పోచికోలు చర్చలలోనూ చాలాకాలం నష్టమై పోతుండె!"ముదమున ధన, తనయ, ఆగారముల చూచిమదము చేత కొన్నాళ్ళు, అందు, చెదిరినంత, శోకార్ణవగతుడైజాలి చెందుటయు కొన్నాళ్ళు, ఎదటి పచ్చ చూచి తాళలేక, తానిలను తిరుగుట కొన్నాళ్ళు, ముదిమది తప్పిన ముసలితనమునముందు వెనక తెలియక కొన్నాళ్ళు."కొన్నాళ్ళు ధనమూ, సంతానమూ, ఇల్లూ అనుకుంటూ, వాటిని చూసి మదించటంలో గడిచె. అవి బెడిసికొడితే, మళ్ళీ దుఃఖంలో మునిగి, దైన్యతలో కొన్నాళ్ళు. ఎదుటివాడు పచ్చగా ఉంటే, ఏడుస్తూ కొన్నాళ్ళు. పెద్ద వయసు మీదపడేసరికి, బుద్ధి పనిచేయని స్థితిలో కొన్నాళ్ళు... మొత్తం మీద, బాగుగ నామ కీర్తనములు సేయుటే, భాగ్యమని అనక త్యాగరాజ నుతుడైన శ్రీరాముని తత్త్వము తెలియక కొన్నాళ్ళు. ఎంతో పొద్దు గడిచింది. గమనించుకొని, పొద్దు కొంతయినా మిగిలి ఉండగానే, కోదండ రాముడి మీద మనసు పెట్టి భజించకపోతే, జన్మ వ్యర్థం అని నాదబ్రహ్మ హెచ్చరిక. – ఎం. మారుతి శాస్త్రి -
HOLI 2024: జీవితం వర్ణమయం
మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది. గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం. హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు. అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే... మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం. అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు. హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి. మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆయుర్దాయానికి కోవిడ్ కోత
కరోనా కోరల్లో చిక్కి యావత్ ప్రపంచం విలవిల్లాడిన ఘటన ఇప్పటికీ చాలా మందికి పీడకలే. అధునాతన కోవిడ్వ్యాక్సిన్లతో ఎలాగోలా కోవిడ్పై యుద్ధంలో గెలిచామని సంతోషపడేలోపే కరోనా మహమ్మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గించేసిందన్న చేదు నిజం తాజాగా బయటపడింది. 2019–2021 కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆయుష్షు దాదాపు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కష్టాల నుంచి తెరిపినపడి ఎలాగోలా మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాం కదా అని సంబరపడుతున్న ప్రజానీకానికి ఇది పిడుగుపాటులాంటి వార్తే. లాన్సెట్ అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► 2019 డిసెంబర్లో తొలిసారిగా కోవిడ్ వ్యాధికారక కరోనా వైరస్ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళ్లు అంటే 2020, 2021 సంవత్సరాల్లో జనాభా ఆయుర్దాయం ఎలా ఉంది అనే అంశాలపై తాజా అధ్యయనం సమగ్ర వివరాలను వెల్లడించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 84 శాతం దేశాల్లో ఆయుర్దాయం తగ్గింది. ఈ కాలంలో ప్రజల ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు తగ్గిపోయింది. ► మెక్సికో సిటీ, పెరూ, బొలీవియా వంటి చోట్ల ఆయుఃక్షీణత మరింత ఎక్కువగా నమోదైంది. కరోనా తొలినాళ్లలో టీనేజర్లు మినహాయించి మిగతా అన్ని వయసుల వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడ్డారని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది. ► ప్రపంచవ్యాప్తంగా టీనేజీ, యుక్త వయసు వాళ్లలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగానే ఉందని పేర్కొంది. ► ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గడం విశేషం. 2019తో పోలిస్తే 2021లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 7 శాతం తగ్గాయి. అంటే మరణాలు 5,00,000 తగ్గాయని అధ్యయనం వెల్లడించింది. ► దక్షిణాసియా, ఆఫ్రికా చిన్నారుల పేరిట కోవిడ్ శాపమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు దక్షిణాసియాలోనే చనియారు. ప్రతి నలుగురిలో ఒకరు సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రాణాలు వదిలారు. ► అధ్యయనంలో భాగంగా మొత్తం జనాభాలో 15 ఏళ్లుపైబడిన వారు ఎంత మంది? వారిపై కోవిడ్ ప్రభావం, ఆయుర్దాయం వంటి అంశాలను విశ్లేషించారు. వీరిలో 2019–2021 కాలంలో పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం మరణాల రేటు పెరగడం ఆందోళనకం ► 2020, 2021 సంవత్సరాల్లో మొత్తంగా 13.1 కోట్ల మంది మరణించారు. అందులో కోవిడ్ సంబంధ మరణాలు ఏకంగా 1.6 కోట్ల పైమాటే. ► గతంలో ఎన్నడూ లేని విధంగా జోర్డాన్, నికరాగ్వా వంటి దేశాల్లో కోవిడ్ మరణాలు భారీగా నమోదయ్యాయి. ► దక్షిణాఫ్రికాలోని క్వాజూలూ–నాటల్, లింపోపో వంటి చోట్ల ఆయుర్దాయం దారుణంగా తగ్గిపోయింది ► కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొన్న/ కోవిడ్ బారిన పడి కూడా బార్బడోస్, న్యూజిలాండ్, ఆంటిగ్వా, బార్బుడా వంటి దేశాల్లో తక్కువ మరణాలు నమోదవడం విశేషం. ► కోవిడ్ వల్ల ఆయుర్దాయం కొంత తగ్గినప్పటికీ దశాబ్దాలుగా అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య విధానాల కారణంగా 1950 నుంచి చూస్తే ఆయుర్దాయం మెరుగ్గానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదు
న్యూఢిల్లీ: న్యాయమూర్తిగా రాణించాలంటే చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. మానవ జీవితాన్ని, మనుషుల సమస్యలను అర్థంచేసుకొని, పరిష్కరించే నేర్పు అలవర్చుకోవాలని, వారికి అదే అతిపెద్ద సాధనమని పేర్కొన్నారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేను సత్కరించారు. నూతన న్యాయమూర్తు నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య గరిష్టంగా 34కు చేరిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వారి అనుభవంతో సుప్రీంకోర్టుకు మంచి పేరు వస్తుందని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యమే మనల్ని గొప్ప న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా మారుస్తుందని స్పష్టం చేశారు. -
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
కొంచెం నెమ్మదిస్తేనే... నిలవగలం!
గడచిన శతాబ్దాల్లో మనిషి అనూహ్యమైన ప్రగతి సాధించాడు. బొగ్గు, వంటగ్యాస్, సహజ వాయువుల శక్తిని ఒడిసిపట్టి, ఇంధన విప్లవం సాధించడంతో సమాజం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. ఆర్థిక అభివృద్ధి అనేది సామాజిక ఆకాంక్షలు పెరిగేందుకు దోహదపడింది. అదే సమయంలో మానవజాతి భవిష్యత్తు కూడలికి చేరింది. అభివృద్ధి వెంట పరుగులు పెట్టడాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. మానవజాతి మరిన్ని కాలాలు మనుగడ సాగించాలంటే ఈ ఆలోచన, సమీక్ష అత్యవసరం. అభివృద్ధితో వచ్చిన ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కేన్స్ చెప్పినట్లు, మనిషి జీవన ప్రమాణం కొన్ని వేల ఏళ్లపాటు స్తబ్ధుగానే ఉండింది. శిలాజ ఇంధనాల వాడకం మొదలుకావడం అంటే 18, 19వ శతాబ్దం నుంచే దీంట్లో పెను పురోగతి మొదలైంది. బొగ్గు, వంటగ్యాస్, ముడిచమురు అందుబాటులోకి రావడం మన జీవితాలను సమూలంగా మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దాల్లోనే సగటు ఆయుష్షు రెట్టింపు అయ్యింది. వేల కిలోమీటర్ల దూరాన్ని గంటల్లో దాటేయగలుగుతున్నాం. ప్రపంచం మూలమూల ల్లోని వారితోనూ సమాచార వినిమయం చిటికెలో జరిగిపోతోంది. వృద్ధి చెందుతున్న టెక్నాలజీ, దాని విపరిణామాలూ ప్రపంచ రూపు రేఖలను మార్చేశాయి అనడంలో సందేహం లేదు. కానీ ఈ అనూహ్య వేగానికి మనం మూల్యం కచ్చితంగా చెల్లిస్తున్నాం. మరింత ఎక్కువ ఉత్పత్తి చేయాలి... అది కూడా సమర్థంగా జరగాలన్న ఆదుర్దా మనల్ని మనం సమీక్షించుకునే, విమర్శించు కునే... ప్రకృతితో మనకున్న సంబంధాన్ని మదింపు చేసుకునే సమ యమూ ఇవ్వడంలేదు. పైగా... వలసలు, మనిషి చలనశీలతలకు ముడిపడి ఉన్న రాజకీయ సవాళ్లు కూడా కాలంతోపాటు సంక్లిష్టమ వుతూ పోయాయి. ఇప్పుడు ప్రయాణమూ సులువే, పెద్ద ఎత్తున వలస వెళ్లిపోవడమూ సులభమే. వీటి ప్రభావం వనరులపై పడుతోంది. వలస వెళ్లిన ప్రాంతాల సంస్కృతులతో ఘర్షణలకు కారణ మవుతున్నాయి. సామాజిక సమన్వయమూ దెబ్బతింటోంది. సరి హద్దులు పలుచనైపోయి ప్రపంచం కుంచించుకుపోతున్న కొద్దీ పరిస్థి తులు మరింత ముదురుతున్నాయి. అందుకే ఒక క్షణం ఆగి ఈ సవాళ్లను దీర్ఘాలోచనలతో, సమతుల దృష్టితో పరిష్కరించాల్సి ఉంటుంది. సుస్థిరత–అభివృద్ధి మనిషి శతాబ్దాలుగా ఇంధన వినియోగమనే వ్యసనానికి బానిస. శిలాజ ఇంధనాలు మనల్ని ముందుకు పోయేలా చేసినా ప్రపంచాన్ని వాతావరణ మార్పుల అంచున నిలబెట్టింది కూడా ఇవే. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు పెద్దపీట వేయాల్సిన సమయం ఇదే. అయితే ఈ మార్పు జరగాలంటే గనుల తవ్వకాలు, నిర్మాణాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్నది విమర్శకుల అలోచన. పర్యావరణ అనుకూల టెక్నాలజీల కోసం అవసరమైన రాగి, నికెల్, కోబాల్ట్, ఇతర ఖనిజాలు మన అవసరాలకు తగినన్ని ఉన్నాయా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యల్లో కొంత నిజం లేకపోలేదు. కానీ.. మనిషి తన సృజ నాత్మకతతో వీటిని అధిగమించడం పెద్ద కష్టమూ కాదు. భూమిలో ఈ అత్యవసరమైన లోహాలు తగినన్ని ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. కాకపోతే వీటి శుద్ధీ కరణ పద్ధతులు మాత్రం సమస్యాత్మకమైనవి. వీటిని అధిగమించ డమూ కష్టమేమీ కాదు. డిమాండుకు తగ్గట్టు సరఫరాలను పెంచగలిగే పెట్టుబడిదారీ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే ఈ సవాళ్లను ఎదుర్కోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఈ క్రమంలో పర్యావరణ, సామాజిక సమస్యలను విస్మరించడం సరికాదు. ‘రేర్ ఎర్త్మెటల్స్’ ఉత్పత్తిలో, గ్రీన్ టెక్నాలజీల్లో ముందువరసలో ఉన్న చైనాలో పర్యావరణ పరిస్థితి దిగజారిపోవడం, కాలుష్యం, కొన్ని వర్గాల సామాజిక బహిష్కరణ, ఆరోగ్య అంశాలు మనకు హెచ్చరికలుగా నిలవాలి. ఇంకో కీలకమైన విషయం... పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకోవాలంటే మన ఆలోచనా ధోరణుల్లోనూ మార్పులు రావాలి. సుస్థిరత అనేది అభివృద్ధికి అడ్డంకి కాదనీ, మెరుగైన భవిష్యత్తుకు మార్గమనీ గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధులకు పొంతన కుదరదన్న ద్వైదీభావం సరికాదని తెలుసుకోవాలి. నిజానికి పర్యావరణ అనుకూల విధానాలు ఆర్థిక వృద్ధిని పెంచుతాయనీ, నూతన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందనీ అర్థం చేసుకోవడం ముఖ్యం. పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడి పనిచేసే కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇదో మేలి అవకాశం. జీవన విధానంలో నిదానం పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు కాస్త నెమ్మదైన జీవన విధానమూ తోడైతే శిలాజ ఇంధనాల దుష్పరిణామాలను తగ్గించడం వీలవుతుంది. ప్రపంచంపై, సమాజంపై సరైన అవగాహన కలిగి ఉంటూ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఫలాలను అనుభవించడం అవసరం. అభివృద్ధి సాధించే ప్రయాసలో మన చర్యల పర్యవసానా లను గుర్తించి తదనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం కూడా అవసరం. ఆధునిక జీవితంపై మోజు తాత్కాలికంగా కొన్ని ప్రయో జనాలు కల్పించవచ్చునేమోగానీ... దీర్ఘకాలంలో భూమ్మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదముంది. అభివృద్ధిని సాధించాలన్న వ్యామోహంలో ప్రస్తుతం 800 కోట్లు దాటిన మానవ జనాభాకు ఆహారం అందివ్వడం ఎలా అన్నది మరవకూడదు. మానవ మనుగడ కోసం మన వేగాన్ని తగ్గించు కోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ, అందరికీ ఆహార కల్పన అన్న అంశాల మధ్య సమతౌల్యత సాధించాలి. ప్రస్తుతం ఆహారాన్ని పండించడం అనేది ఒక పరిశ్రమలా సాగు తోంది. అయితే ఇందుకు పర్యావరణం మూల్యం చెల్లిస్తోంది. విచ్చల విడి రసాయన ఎరువుల వాడకం, అడవుల నరికివేతవంటివన్నీ పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యతలు, భూమి సారాల విషయంలో చెడు ప్రభావం చూపాయి. సుస్థిరాభివృద్ధి కావాలంటే ఇదే పద్ధతిని కొనసాగించడం మంచిది కాదు. నిదానమే ప్రధానము అందరికీ ఆహారమన్న సవాలును ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలను వెత కాల్సి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ... వ్యవసాయ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయాలి. వనరులు అందరికీ అందుబాటులో ఉండేలా అవకాశాలను కల్పించాలి. కాక పోతే ఇదో సంక్లిష్టమైన సవాలే. ఎన్నో సౌకర్యాలు కల్పించిన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనూ కొంచెం జాగరూకతతో వ్యవహరించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్లు భవిష్యత్తులో ఉద్యోగాలను తగ్గిస్తాయన్న ఆందోళన కూడా ఒకవైపు ఏర్పడుతోంది. ఈ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. విద్యపై పెట్టే పెట్టుబడులు పెరగాలి. అదే సమయంలో కొత్త టెక్నాలజీల గురించి అందరికీ శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు కావాలి. విధానాల ద్వారా సామాజిక అసమతుల్యతలను రూపుమాపే ప్రయత్నం జరగాలి. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఈ ఉరుకుల జీవితాన్ని కాస్త మందగింపజేస్తే ఆత్మవిమర్శకు అవకాశం ఏర్పడుతుంది. మానసిక, భావోద్వేగ సంక్షేమాలను మన ప్రాథమ్యాలుగా ఉంచుకుని పనిచేసేందుకు పనికొస్తుంది. ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు వీలేర్పడుతుంది. ప్రాపంచిక సౌఖ్యాల వెంబడి పరుగులో సామాజిక బంధాలను దాదాపుగా విస్మ రించాం. బంధుత్వాలు, సహానుభూతి, మానవ సంబంధాలను మరో సారి ఆచరించేందుకు, కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తుంది. డా‘. శ్రీనాథ్ శ్రీధరన్ - వ్యాసకర్త కార్పొరేట్ సలహాదారు, ‘టైమ్ ఫర్ భారత్’ రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
జీవితం విస్తరాకు.. తిన్నాక మరి ఉంచరు! ఏమీ లేకుండానే నిన్ను కూడా!
జీవితం క్షణ భంగురం అని తెలిసి కూడా చేయరాని పనులు చేసి మనిషి ఎన్నో అగచాట్లు పడుతుంటాడు. కొందరు అధికారం, అహం, ఆవేశం, అసూయ అనే 'అ'అక్షరం పట్టుకుని ఆఖరికి.. 'ఆ!'.... అని అర్రుల చాచుతూ ఆక్రందన చేసే పరిస్థితిని కొనితెచ్చుకుంటారు. మరికొందరు కామం, క్రోధం, అనే వాటితో క్షమార్హమైన పనులకు పాల్పడి కష్టాల కడలిలో కొట్టుకుపోతుంటారు. పగ, పిసినారితనం, అనే 'ప' అక్షరాన్ని పట్టుకుని పడరాని పాట్లు పడి పెడబొబ్బలు పెడుతుంటారు మరికొందరు. ఆ తర్వాత ఏదో జబ్బు చేసో లేక అనుకోని ప్రమాదంలోనో తనువు చాలిస్తారు. మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసహ్యం కలగకూడదు. ఏంటిది! జీవితం ఇలా వృథా చేసుకున్నానా? అని తెలుసుకునేలోపే మన కథ ముగిసిపోతుంది. అందుకే అంటారు పెద్దలు బతికి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడే పనులు కనీసం ఒక్కటైన చేసి మనిషి అనిపించుకోమని. కనీసం కౌమర, యవ్వన దశలో తెలిసో తెలియకో ఉడుకురక్తంతో ఉచితానుచితాలు ఆలోచించకుండా చేసి ఉండొచ్చు. కనీసం వృద్ధాప్యంలోనైనా తనకు చేతనైనంతలో ఇతరులకు సేవ చేసి తరించాలి. బహుశా అందుకే కాబోలు పెద్దలు మనిషి జీవితం విస్తరాకులాంటిది అని చెప్పారేమో! ఎందుకిలా అన్నారంటే.. ఇది వరకు ఎక్కువగా పెళ్లిళ్లు, పేరంటాలు, వేడుకల్లో.. భోజనాలు విస్తరాకుల్లోనే వడ్డించేవారు. అందువల్ల దీనితో మనిషి జీవితాన్ని పోల్చి ఉండవచ్చు. ఇక మనిషి జీవితానికి విస్తరాక్కి ఉన్న పోలిక ఏంటో చూస్తే.. భోజనం చేసేటప్పుడు మనం కొద్దిగా నీళ్లు విస్తరిలో జల్లి శుభ్రంగా చేసుకుంటాం. ఆ తర్వాత భోజనం పూర్తయ్యేవరకు దానిని జాగ్రత్తగా చూసుకుంటాం. తిన్న మరుక్షణం, ఆ ఆకుని మడిచి దూరంగా విసిరేస్తాం. మనిషి జీవితం కూడా అంతే! ఊపిరి పోగానే ఒక్క క్షణం కూడా ఉంచం. అయితే ఇక్కడ విస్తరాకు పడేసినప్పుడు అది సంతోషడుతుందట. ఎందుకంటే తాను పోయే ముందు కనీసం ఒక్కరి ఆకలినైనా తీర్చటానికి ఉపయోగపడ్డానులే అని తృప్తి పడుతుందట. కానీ మనిషికి ఆ తృప్తి ఉండదు. పోయే ముందు వరకు ఏదో ఒక వ్యాపకంతో సతమతమవుతూ.. ఎవరో ఒకరితో పోట్లాడుతూనే ఉంటాడు మనిషి. చేద్దాంలే సేవ అనుకునేలోపే జీవితం జగడాలు, పట్టింపులతో ముగిసిపోతుంది. ఏ క్షణం మనల్ని మృత్యువు కౌగిలించుకుంటుందో చెప్పలేం. ఆ తరుణం రాగానే మన ఒంటిపై గుడ్డకూడా ఉంచరు. ఎంత పెద్ద ధనికుడైన శ్మశానానికి చేరుకోవాల్సిందే. ఏ డబ్బు కోసం అందరితో తగవులాడి, శత్రుత్వం తెచ్చుకున్నామో.. ఆ సొత్తులోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకుపోలేం. అందుకే పెద్దలు ఊపిరి ఉన్నప్పుడే నలుగురుకి ఉపయోగపడే పనులు చేసేలా జీవించండిరా! అని హితవు చెప్పేది. లేదంటే విస్తరాకు పాటి విలువ కూడా లేని వృథా జీవితంగా మారుతుందని వారి హెచ్చరిక. (చదవండి: సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!) -
భోజనానికి సగటున 96 నిమిషాలు!
ఆధునిక యుగంలో మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది. పొద్దున నిద్ర నుంచి లేచింది మొదలు రాత్రి మళ్లీ పడకపైకి చేరేదాకా అంతా రొటీన్గా సాగిపోతోంది. పల్లె జీవితానికి, నగర జీవితానికి కొంత వ్యత్యాసం ఉంటోంది. పల్లె అయినా, నగరమైనా తినడం, పని చేయడం, నిద్రపోవడం.. ఇదే చక్రం పునరావృతం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితం ఎలా సాగుతోందన్న దానిపై కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు. ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉంటోంది? ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? అనేది నిశితంగా పరిశీలించారు. ఇందుకోసం 58 దేశాల్లో వివిధ జాతీయ సర్వేల గణాంకాలను క్రోడీకరించారు. ప్రపంచ జనాభాలో 60 శాతం ఈ అధ్యయనం పరిధిలోకి వచ్చారు. అధ్యయనంలో ఏం తేలిందంటే.. ► ఉద్యోగం, ఉపాధి కోసం మనుషులు వారానికి సగటున 41 గంటలు వెచి్చస్తున్నారు. ► ఇంట్లో పరిశుభ్రతకు 2.5 గంటలు, తోట పనులు, ఇతర వ్యక్తిగత పనులకు 3.4 గంటలు వెచి్చస్తున్నారు. ► స్నేహితులతో బయట ఆనందంగా గడపడానికి, టీవీ వీక్షించడానికి, ఆటలు ఆడడానికి సగటున 6.5 గంటలు వెచి్చస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడయ్యిందని పరిశోధకుడు ఎరిక్ గాల్బ్రెయిత్ చెప్పారు. ► గిన్నెలు కడుక్కోవడం, వంట చేసుకోవడం, టేబుళ్లు శుభ్రం చేసుకోవడానికి జనం 55 నిమిషాలు ఖర్చు చేస్తున్నారు. ► భోజనం చేయడానికి 96 నిమిషాలు(1.6 గంటలు) వెచ్చిస్తున్నారు. ► చేపలు పట్టడం, పంటల సాగు, ఇతర వ్యవసాయ సంబంధిత పనులకు 52 నిమిషాల (0.9 గంటలు) సమయం ఖర్చవుతోంది. ► స్నానం, ఆరోగ్య సంరక్షణ వంటి పనుల్లో 2.5 గంటలు గడుపుతున్నారు. ► సర్వేలో చిన్న పిల్లలను కూడా చేర్చడంతో కొన్ని పనులకు పట్టే సమయం అధికంగా ఉన్నట్లు కనిపిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. ► నిద్ర కోసం వెచి్చస్తున్న సమయం 9 గంటలు కాగా, ఇందులో పిల్లల నిద్ర 11 గంటలు, పెద్దల నిద్ర 7.5 గంటలుగా ఉంది. ► కొన్ని విషయాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మతపరమైన ప్రార్థనలు, పూజలకు నిత్యం 12 నిమిషాలు వెచి్చస్తుండగా, కొన్ని దేశాల్లో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటోంది. ► వివిధ దేశాల నడుమ ఆదాయంలో తేడాలు, సాంస్కృతిక వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయా దేశాల్లో వివిధ పనులకు ప్రజలు వెచి్చంచే సమయాల్లోనూ తేడాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ► ఉదాహరణకు సంపన్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో వ్యవసాయం కోసం వెచ్చించే సమయం అధికం. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే సమయం విషయంలో దేశాల మధ్య పెద్దగా తేడాలు లేవని గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జయాపజయాలు
మానవ జీవితం ద్వంద్వాలమయం. కష్టసుఖాలు, కలిమిలేములు, జయాపజయాలు జీవన గమనంలో సహజ పరిణామాలు. జయాపజయాల గురించి మన సమాజంలో పట్టింపు మోతాదు కంటే ఎక్కువే! విజేతలకు వీరపూజలు చేయడం, పరాజితులను విస్మృతిలోకి తోసిపారేయడం సర్వ సాధారణం. అయితే, జయాపజయాలు దైవాధీనాలని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం. ఎవరెన్ని సూక్తులు చెప్పినా, ఎవరూ గెలుపు కోసం ప్రయత్నాలను మానుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు గెలుపు దక్కాలనుకునే పట్టుదలతో పగ్గాలు విడిచిన గుర్రాల్లా దూసుకుపోయేవారు కొందరు ఉంటారు. గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా, ఎంతటి నీచానికి దిగజారడానికైనా తెగబడేవారు ఇంకొందరు ఉంటారు. శక్తికి మించిన విజిగీషతో రగిలిపోయేవారు చరిత్రను రక్తసిక్తం చేస్తారు. అడ్డదారుల్లో పడి అడ్డదిడ్డంగా పరుగులు తీసి, అడ్డు వచ్చినవాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసి అందలాలెక్కుతారు. విజయోన్మత్తతను తలకెక్కించుకుని విర్రవీగుతారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. మార్పు దాని సహజ స్వభావం. కాలం మారి, పరిస్థితులు వికటించినప్పుడు విజేతలమనుకుని అంతవరకు విర్రవీగిన వారు పెనుతుపాను తాకిడికి కుప్పకూలిన తాటిచెట్లలా నేలకూలిపోతారు. మన పురా ణాల్లో దుర్యోధనుడు, మన సమీప చరిత్రలో హిట్లర్ వంటి వారు అలాంటి శాల్తీలే! ‘అజ్ఞానపు టంధయుగంలో/ తెలియని ఏ తీవ్రశక్తులో/ నడిపిస్తే నడిచి మనుష్యులు/ అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమని/ స్థాపించిన సామ్రాజ్యాలూ/ నిర్మించిన కృత్రిమ చట్టాల్/ ఇతరేతర శక్తులు లేస్తే/ పడిపోయెను పేకమేడలై’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అజ్ఞానపుటంధ యుగంలోనే కాదు, వర్తమాన అత్యాధునిక యుగంలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. మొరటు బలం, మూర్ఖత్వం, మోసం, కుట్రలతో సాధించిన అడ్డగోలు విజయాలను తలకెక్కించుకుని, అదంతా తమ ప్రయోజకత్వంగా తలచి విర్రవీగే విజయోన్మత్తులలో దేశాధి నేతల మొదలుకొని చిల్లరమల్లర మనుషుల వరకు నేటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లలోనే దుర్యోధ నుడికి గుడి కట్టి పూజించేవాళ్లు, హిట్లర్ను ఆరాధించే వాళ్లు, లేని సుగుణాలను కీర్తిస్తూ నిరంకు శులకు బాకాలూదే వాళ్లు కనిపిస్తారు. గోబెల్స్కు బాబుల్లాంటి దుష్ప్రచార నిపుణులు నిర్విరామంగా ఊదరగొడుతూ, జీవితానికి గెలుపే పరమార్థమనే భావనకు ఆజ్యం పోస్తున్నారు. వీళ్ల ప్రభావం కారణంగానే ఓటమిని జీర్ణించుకోలేని తరం తయారవుతోంది. మనుషుల స్థితిగతులను గెలుపు ఓటములతోనే అంచనా వేయడం మన సమాజానికి అలవాటైపోయింది. గెలవాలనే ఒత్తిడి ఒకవైపు, ఓటమి భయం మరోవైపు బతుకుల్లో ప్రశాంతతను ఆవిరి చేస్తున్నాయి. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థుల నుంచి ఎన్నికలను ఎదుర్కొనే రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ ఒత్తిడి తప్పడం లేదు. గెలుపు ఒత్తిడి కొందరిని మానసికంగా కుంగదీస్తుంది. ఇంకొందరిని అడ్డదారులు తొక్కిస్తుంది. సమాజంలో ప్రబలుతున్న ఈ ధోరణిని సొమ్ముచేసుకోవడానికి కొందరు మేధావి రచయితలు విజయ సోపానమార్గాలను పుస్తకాలుగా అచ్చోసి జనాల మీదకు వదులుతారు. నానావిధ ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ వికాస ప్రవచనాలతో ఊదరగొడతారు. ‘విజయానికి కావలసినది పదిశాతం ప్రేరణ, తొంభైశాతం కఠోర శ్రమ’ అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తు బల్బును కనుక్కొనే ప్రయత్నంలో ఆయన వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు. ‘విద్యుత్ బల్బును కనుక్కోవడంలో వెయ్యిసార్లు విఫలమై, ఇప్పుడు సాధించారు కదా! ఇప్పుడు మీకేమనిపిస్తోంది?’ అని ఒక పాత్రికేయుడు ఆయనను ప్రశ్నించాడు. ‘వెయ్యిసార్లు నేను విఫలమవలేదు. వెయ్యి అంచెల తర్వాత విద్యుత్ దీపాన్ని కనుక్కోగలిగాను’ అని బదులిచ్చాడాయన. వైఫల్యాలే విజయానికి సోపానాలని గ్రహించడానికి ఎడిసన్ అనుభవమే మంచి ఉదాహరణ. గెలుపు కోసం ప్రయత్నించే వాళ్లు ఓటమికి కూడా మానసిక సంసిద్ధతతో ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు రెట్టించిన పట్టుదలతో పునఃప్రయత్నం చేయడానికి తగిన శక్తి యుక్తులను సమకూర్చుకోవడానికి తగిన ఓరిమితో ఉండాలి. ఈ రెండూ లోపించడం వల్లనే పరీక్షల్లో వైఫల్యం ఎదురైనప్పుడు అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెందరో! స్వేచ్ఛగా జీవితాన్ని జీవించడమే ఒక సాఫల్యం. ఈ ఎరుక లేకనే చాలామంది జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. చిల్లర గెలుపుల కోసం, పదవుల కోసం, పదవులను పదిలపరచుకోవడం కోసం అధికార బలసంపన్నుల ముందు సాగిలబడతారు. ‘వాని జన్మంబు సఫల మెవ్వాడు పీల్చు/ ప్రాణవాయువు స్వాతంత్య్ర భరభరితమొ/ పరుల మోచేతి గంజికై ప్రాకులాడు/ వాని కంటెను మృతుడను వాడెవండు?’ అన్నాడో చాటు కవి. ‘విజయమే అంతిమం కాదు. వైఫల్యమేమీ ప్రాణాంతకం కాదు’ అని తేల్చేశాడు బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్. కాబట్టి వైఫల్యం ఎదురైనంత మాత్రాన ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. విజయం సాధించినంత మాత్రాన అమాంతంగా ఒరిగిపడే ఆకాశమూ ఉండదు. ‘వైఫల్యాల నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే మన అసలు పొరపాటు’ అంటాడు అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్. వైఫల్యాలే మనకు గుణపాఠాలు నేర్పే గురువులు. గురువులను గౌరవించడం మన సంప్రదాయం. వైఫల్యాలను గౌరవించడం, విజయాలను వినయంగా శిరసావహించడమే మన కర్తవ్యం! -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
మంచి మాట: దిద్దుకోవలసిన తప్పులు
మానవ జీవనాన్ని, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాటిల్లో ప్రధానమైనవి తప్పులు. ఆచరణల్లోని తప్పులు మాత్రమే కాదు ఆలోచనల్లోని తప్పులు కూడా మానవాళికీ, ప్రపంచానికీ అనాదిగా హానిచేస్తూనే ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుంటే మనం చేసిన తప్పులవల్ల మనకు ఎంత హాని జరిగిందో, మన తప్పులవల్ల ఇతరులకు ఎంత హాని జరిగిందో మనకే తెలిసిపోతుంది. చరిత్రను అవలోకిస్తే దేశాలకూ, ప్రపంచానికీ తప్పులు ఎంత హాని చేశాయో తెలిసిపోతుంది. హిట్లర్ తప్పులవల్ల ప్రపంచయుద్ధమే జరిగి తత్ఫలితంగా కలిగిన వినాశనం మనకు తెలిసిందే. పెద్దస్థాయిల్లో జరిగిన తప్పులవల్ల సామాన్య ప్రజలు విలవిలాడిపోయిన కథనాన్ని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. కళ, భాష, సాంస్కృతిక రంగాలకూ తప్పులవల్ల హాని జరుగుతూనే ఉంది. కొన్ని దశాబ్దుల క్రితం చోటు చేసుకున్న తప్పులవల్ల తెలుగు సాహిత్యానికే కాదు భాషకు కూడా జరిగిన పెనుహాని ఇవాళ క్షేత్రవాస్తవంగా మనకు తెలుస్తూనే ఉంది. తప్పులవల్ల మనం తప్పులతోనే ప్రయాణం చేస్తున్నాం; తప్పులవైపే ప్రయాణం చేస్తున్నాం; తప్పులతో మనం మమైకమైపోయాం. తప్పులకు ప్రతి మనిషీ గురయ్యాడు; బలయ్యాడు. విద్యలోని తప్పులు, వృత్తిలోని తప్పులు, వ్యవహారాల్లోని తప్పులు, ఆచారాల్లోని తప్పులు, మతపరమైన తప్పులు, విశ్వాసాల్లోని తప్పులు, ప్రవర్తనల్లోని తప్పులు వీటివల్ల మనిషి జీవితం తప్పులమయం అయిపోయింది. ఫలితంగా మనిషి ఒక తప్పుడు జీవి అయిపోయాడు! మనిషి చేస్తున్నట్లుగా, చేస్తున్నంతగా జంతువులు తప్పులు చెయ్యడం లేదు! మనుషులు చేసిన, చేస్తున్న తప్పులవల్ల మానవప్రపంచానికే కాదు జంతుజాలానికి కూడా హాని జరుగుతోంది. చాల తప్పులు చలామణిలోకి వచ్చేశాయి. చాపకింద నీరులా తప్పులు మనలోకి రావడం కాదు కొనసాగుతున్న వానలా తప్పులు మనపై పడ్డాయి, పడుతున్నాయి.. అందువల్ల మనం తడిసిపోతూ ఉండడం కాదు, ఆ తప్పులు చప్పుడు చెయ్యని నిప్పులుగా అయిపోవడం వల్ల మనం మనకు తెలియకుండానే వాటికి కాలిపోతూ ఉన్నాం. చాల కాలంగా తప్పులతో, తప్పులలో, తప్పుల కోసమే బతుకుతున్నామా అన్నట్లుగా మనం బతుకుతున్నాం. దానికి పర్యవసానంగా చాల కాలంగా తప్పులు మనల్ని శిక్షిస్తున్నాయి... బతకుతున్నాం అనడానికి ఋజువుగా నిత్యమూ మనం తప్పులవల్ల శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. అయినా మనకు తప్పుల విషయమై ఉండాల్సిన అవగాహన రావడంలేదు. చరిత్రలోని తప్పులు, తప్పుల చరిత్ర... వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు. అందుకే మనల్ని భయాలు, అందోళనలు, ఆపదలు, గందరగోళం చుట్టుముట్టాయి, చుట్టుముడుతున్నాయి. గతంలోని తప్పులతో మనం పోరాడడం లేదు. వర్తమానంలోని తప్పుల గురించి మనం ఆలోచించడంలేదు. భవిష్యత్తులో తప్పులవల్ల జరగనున్న విపత్తుల్ని గ్రహించడం లేదు. తప్పు జరగడం, తప్పు చెయ్యడం అనేవి మనిషికి సహజమైనవే. కానీ తప్పే జరుగుతూ ఉండడం, తప్పే చేస్తూ ఉండడం సహజం కాకూడదు. మన తప్పుల్ని, మనలోని తప్పుల్ని తెలుసుకోలేకపోతే మనం నేరస్థులం అవుతాం.తప్పులవల్ల వర్తమాన, భవిష్యత్తుల్లో మనం ముప్పుల పాలు కాకూడదు. ప్రతి సంవత్సరమూ ధనుర్మాసంలో మన ముందుకు వస్తూ ఉండే తిరుప్పావై పాసురాలలో ఒక చోట ఆణ్డాళ్ చెప్పింది: ‘దామోదరుణ్ణి నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలైపోతాయి’. జరిగిన, జరగబోయే తప్పులు కాలి భస్మం అయిపోవాలని 1,200 యేళ్ల క్రితమే ఇలా ఇంత గొప్పగా ఆశంసించడం జరిగింది. మన తప్పులు, మన చుట్టూ ఉన్న తప్పులు కాలిపోకపోతే ఆ తప్పులకు మనం కాలిపోతాం. సరైన మనస్తత్వంతో, వివేకంతో మనలోని తప్పుల్ని తొలగించుకోవాలి; మనం ఒప్పుల్ని ఒంటబట్టించుకోవాలి; ఆపై మనం క్షేమంగానూ, మేలైనవాళ్లంగానూ బతకాలి. – రోచిష్మాన్ -
ఏం లైఫ్ రా అయ్యా.. రోగం వస్తే మింగే మందుల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: జబ్బు చేస్తే రాష్ట్ర ప్రజలు మందుల కోసం చేసే ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. తలసరి మందుల ఖర్చు ఏడాదికి రూ.663 ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయమై దేశంలో తెలంగాణ 12వ స్థానంలో నిలిచిందని తెలిపింది. కాగా, రాష్ట్ర జనాభా 3.7 కోట్లు అనుకుంటే ఆ ప్రకారం ఒక్కొక్కరు చేసే ఖర్చు మొత్తం కలిపి రూ. 2,453 కోట్లు అవుతుంది. కేవలం మందుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే, ఇక జబ్బుకు ఇతరత్రా చికిత్సకయ్యే ఖర్చులు సరేసరి. తలసరి ఖర్చు రూ. 663 కాగా, ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనడం ద్వారా అయ్యే ఖర్చు రూ.122 ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ విషయంపై ఇటీవల పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం రూ.7,844 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో 69 శాతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులకే సరిపోతుంది. అంటే ఆపరేషన్లు, వైద్య పరీక్షలకు తదితరాలకు అన్నమాట. మిగిలిన 31 శాతం మందుల కోసం ఖర్చు చేస్తున్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం, కుటుంబ పెద్ద చనిపోతే అనేక కుటుంబాలు పేదరికంలోకి పోతున్నాయి. కరోనా సమయంలో ఈ పరిస్థితి ఎక్కువగా చూశాం. ఫలితంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. చుట్టుముడుతున్న ప్రమాదకర వ్యాధులు ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు, 2040 నాటికి గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీపీ, షుగర్, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల వల్ల అనేక ప్రమాదకర వ్యాధులు మున్ముందు పట్టిపీడిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2016 లెక్కల ప్రకారం దేశంలో గుండె, డయేరియా, రోడ్డు ప్రమాదాలు, నవజాత శిశుమరణాలు, ఎయిడ్స్, టీబీ, లంగ్ క్యాన్సర్, డయాబెటిక్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లు అధికంగా జనాలను పీడిస్తున్నాయి. అట్టడుగున ఉన్న భయంకరమైన వ్యాధులు 2040 నాటికి మొదటిస్థానాల్లోకి వచ్చి చేరే పరిస్థితి నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉదాహరణకు 2016 నాటి లెక్కల ప్రకారం 15వ స్థానంలో ఉన్న డయాబెటిక్ 2040 నాటికి ఏడో స్థానంలోకి వచ్చి చేరనుంది. 16వ స్థానంలో ఉన్న కిడ్నీ వ్యాధి 2040 నాటికి ఐదో స్థానానికి రానుంది. అల్జీమర్స్ 2016లో 18వ స్థానంలో ఉంటే, 2040 నాటికి ఆరో స్థానానికి రానుంది. 20వ స్థానంలో ఉన్న కాలేయ క్యాన్సర్ 13వ స్థానానికి రానుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోట్లు 2040 నాటికి కూడా మొదటిస్థానంలోనే ఉంటాయి. 29వ స్థానంలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ 2040 నాటికి 19వ స్థానానికి రానుంది. ప్రస్తుతం వివిధ వ్యాధులు వస్తున్న 100 మందిలో 30 శాతం మంది మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 60 శాతం మంది షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. 10 శాతం మంది వివిధ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి తన లక్ష్యాలను నిర్దేశించింది. పొగాకు వినియోగాన్ని 30 శాతానికి తగ్గించడం, శారీరక శ్రమ చేసేవారి సంఖ్యను మరో 10 శాతానికి పెంచడం, బీపీ సంఖ్య 25 శాతానికి తగ్గించడం, స్థూలకాయాన్ని సున్నా శాతానికి చేర్చడం, మద్యం అలవాటును 10 శాతానికి, ఉప్పు తీసుకోవడాన్ని 30 శాతానికి తగ్గించడం, 80 శాతం వరకు అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గుండెపోట్లను 50 శాతానికి తగ్గించాలని సూచించింది. ఇది కూడా చదవండి: మీ పిల్లలు ఆరోగ్యంగానే తింటున్నారా? -
మనిషి మరణించగానే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా!
మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది. సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, వెంటనే శరీరం పాడవడాన్ని అరికట్టేందుకు శరీరానికి ఐస్ బాత్ చేయిస్తారు. ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయో ప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు. చదవండి: పార్ట్ 1: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్ ఏం చేప్తోందంటే! ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, ద్రవరూపంలోని నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గిస్తారు. ఒకప్పుడు అనేక జబ్బులకు చికిత్స లేదు. కేన్సర్ వచ్చినా, గుండె పోటు వచ్చినా మరణం తప్ప మార్గాంతరం లేదు. కాని ఇప్పుడు ప్రాణాంతక కేన్సర్ కు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పది నిమిషాల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా కూడా చికిత్సతో తిరిగి బ్రతికిస్తున్నారు. కరోనా వంటి అంటువ్యాధులకు నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ తయారు చేశారు. నానో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు కూడా తేలిగ్గా చేయగలుగుతున్నారు. మొత్తం మీద టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలను ఒకరి నుంచి మరొకరికి విజయవంతంగా మారుస్తున్నారు. ఇవన్నీ గంటల వ్యవధిలో జరిగితేనే ఫలితం ఉంటుంది. ఈ కోవలోనే టెక్నాలజీని అభివృద్ధి చేసి మృత శరీరాన్ని వందేళ్ళ వరకు పాడు కాకుండా భద్రపరచగలిగే స్థాయికి చేరారు. .............ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? నాలుగో భాగంలో చదవండి.. చదవండి: పార్ట్ 2: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే.. -
మంచి మాట.. అంతరంగ జ్ఞానం అంటే..?
ఈ భౌతిక ప్రపంచంలో మనసు ద్వారానే మనం జీవితం కొనసాగిస్తున్నాÆ.. మనసే మనిషికి ఆధారం. మనసు లేకుండా మనిషి జీవితం, జీవన విధానం కూడా లేదు. అలాగని మనస్సుతో కుస్తీ పడవలసిన పని లేదు. మన మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనసు నియంత్రణ చేయలేని విధంగా అంతులేని ఆలోచనలతో నిండి ఉంది. వీటితో మనల్ని మనం గుర్తించు కుంటున్నాం. అయితే అది సరికాదు... మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా... నిర్మలంగా ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. ఇది విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీ మనస్సులో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది. వ్యతిరేకించేది ఏదైనా మనసులో బలపడుతుంది. అది మనస్సుని బలహీనపరుస్తుంది. స్వీకరించేది ఏదైనా శక్తిని పెంచుతుంది. మనస్సు ఈ భౌతిక ప్రపంచంతో పెనవేసుకున్న సమాచారం వస్తుంది. ఈ సమాచారంలో అనుకూలమైనది, ప్రతికూలమైనది రెండూ ఉంటాయి. మనిషి జ్ఞానపరంగా ఎదగనపుడు ప్రతికూలమైన దానికి భయపడతాడు, తనకు అనుకూలమైన దానిని ఆశిస్తాడు. కానీ పరిపూర్ణమైన జ్ఞాని అనుకూలమైన వాటిని, ప్రతికూలమైన వాటి సమాచారాన్ని వదిలేస్తాడు. ప్రతికూలమైన దానిని వ్యతిరేకిస్తే అది మన అంతరంగమందు బలపడుతుంది. అనుకూలమైన దానికి స్పందిస్తే అది అందకపోతే అసంతృప్తి కలుగుతుంది. జ్ఞాని అంతరంగం ఎప్పుడూ స్వచ్ఛంగా నిర్మలం గా ఉండాలి. అనుకూల ప్రతికూల విషయాలు రెండు లేనప్పుడు మనస్సు ఖాళీ (శూన్య) స్థితి ఏర్పడి నిర్మలత ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా అంటే సాధన ద్వారా ఏదైనా సాధ్యమేనంటారు మహానుభావులు, సిద్ధపురుషులు. వారు దానిని తమ సాధన ద్వారా నిరూపించి చూపారు కూడా. మనం ఈ భౌతిక ప్రపంచంలో అందరి మధ్య అందరిలో ఉండాలి కానీ వాస్తవ పరిస్థితిని జ్ఞానంతో నిరంతరం విశ్లేషించాలి. భావోద్వేగాలకు తావులేకుండా సంఘటనలు వాటంతట అవే జరుగుతుంటాయి వెళుతుంటాయి కానీ మనం భావోద్వేగాలకు లోనుకారాదు. బాహ్యంగా కనిపించేది వినిపించేది వాస్తవం కాదు, దాని వెనుక వేరే ఉంటుంది. జ్ఞాని దానిని కనిపెట్టగలగాలి. అదే అజ్ఞాని అయితే ఫలితం వచ్చిన తర్వాత బాధపడతాడు. మన విచక్షణతో ఏది చేయాలో అది చేయాలి, ఏమి చెయ్యకూడదో అది చేయకూడదు. ఈ ప్రకృతిలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎలా ఉండకూడదో అలా ఉండకూడదు అనే విచక్షణ జ్ఞానంతో మెలగాలి. జ్ఞానం వచ్చేవరకూ అన్ని గమనిస్తూ ఫలితం ఆశించకుండా ఏమి జరుగుతుందో గమనిస్తూ ప్రయాణం చేయాలి. ఇది ఏమీ సామాన్యమైన విషయం కాదు. రకరకాల మనుషుల మధ్య జీవిస్తున్నప్పుడు ప్రతి ఎదుటి వ్యక్తి తనలాగే అందరూ జీవించాలి తన మాటే వినాలి అనుకుంటాడు. అది తప్పు. ముందుగా నీ దృష్టిని సరి చేసుకోవాలి. ఇది చదువుతున్నప్పుడు చాలా అనుమానాలు రావాలి వాటికి మీ అంతరంగం నుండే జవాబులూ రావాలి. అలా సంతృప్తికరమైన సమాధానం వచ్చినప్పుడు మనసు తేలిక అవుతుంది. సందేహాలు లోపల ఉంటే మనస్సు భారమవుతుంది. విశ్లేషణతో విచారణ ఎవరు చేస్తారో వారికి అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎవరు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా గుడ్డిగా నమ్మరాదు. అనుభవం పొంది సత్యాన్ని గ్రహించాలి. అనుభవంలోకి వచ్చి సత్యంగా మారిన నాడు అది మార్పు చెందే అవకాశమే లేదు. సిద్ధాంతపరంగా స్పష్టత ఉంటే ఆ అనుభవం సులభమవుతుంది. సమదృష్టితో – సత్యదృష్టితో ప్రపంచాన్ని చూస్తూ ఉండటం తో క్రమంగా మన మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది. నిజంగా ఈ ప్రపంచం ఎంతో ఆకర్షణీయమైనదిగా కనిపిస్తుంది. సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. ఆ నిజం తెలిస్తే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూస్తే మనలో వస్తువులపై గాని, విషయాలపై గాని, భోగాలపై గాని ఏ విధమైన కోరికగానీ, వ్యామోహం గానీ లేకుండా తటస్థంగా ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు మనస్సులో కోరికల వత్తిడి లేకపోవటాన్ని గమనించవచ్చు. ఎటువంటి ఆందోళన లేకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మనం రాగద్వేషాలనే రంగుటద్దాల నుండి చూస్తున్నాం. కొన్నింటిపై రాగం – కొన్నింటిపై ద్వేషం. బుద్ధిలో ఈ రాగద్వేషాలుంటే వస్తువులు ఉన్నవి ఉన్నట్లు కనిపించవు. మనకు ఇష్టమైన వ్యక్తి ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, అందవిహీనంగా ఉన్నా మనకు బాగానే ఉంటాడు. అదే ఇష్టం లేని వ్యక్తి ఎంత బాగా మాట్లాడినా – ఏమి అన్నా వాటిల్లో నుండి తప్పులను వెతుకుతాం. కనుక ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటమే సత్య దర్శనం అంటారు. అటువంటి నిష్ఠలోనే నిరంతరం ఉండాలి. – భువనగిరి కిషన్ యోగి -
మంచి మాట..భయం ఒక భ్రమణం
ఈనాడు సమస్త విశ్వాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య భయం. ఇది ఏదైనా సరే ఒకసారి పట్టుకుందంటే అది వ్యక్తిత్వాన్ని దుర్బలపరుస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆందోళనకు అభద్రతకు గురి చేస్తుంది. ఇదొక మానసిక వేదన. దీనివల్ల మొత్తం మనిషి జీవితం నిర్వీర్యమవుతుంది. ఇది సామాజిక వాతావరణం నుంచి ఉద్భవిస్తుంది తప్ప అంతర్గతంగా ఉండదు. బయట వాతావరణాన్ని బట్టి అంతర్గత లక్షణాలు ప్రకోపిస్తాయి. ఈ లక్షణాలే భయానికి ప్రధాన కారణమవుతున్నాయి. నిత్యజీవితంలో మనిషి రకరకాల భయాలతో కాలం వెళ్ళదీస్తుంటాడు. అవి ప్రాకృతికమైనా, సామాజికమైనా, సాంస్కృతికమైనా వాటిని అధిగమించడం ద్వారానే మనిషి మామూలు మనిషి కావడం సాధ్యపడుతుంది. అయితే ఈ భయాలను అధిగమించాలంటే మనిషనేవాడికి వ్యక్తిగత సాధన, విమర్శనాత్మక పరిశీలన ముఖ్యం. ప్రతిమనిషి నిత్యం ఆలోచనలతో జీవిస్తూ ఉంటాడు. వర్తమానాన్ని విడిచి పెట్టి, భవిష్యత్లో ఏం జరుగుతుందోనని తీవ్రంగా ఆలోచిస్తాడు. ఇలాంటి ఆలోచనలే భయాన్ని ప్రోదిచేస్తాయి. మనస్సంటే ఒక భాగం జ్ఞాపకాలు, మరో భాగం ఊహలతో నిండి ఉంటుంది. నిజానికి ఈ రెండు ఊహలే. మనిషి ఇలా ఊహల్లో మునిగిపోవడం వల్లనే భయం కలుగుతుంది. ఈ భయమే మన చుట్టూ హద్దులను గీస్తుంది. ఆ హద్దుల వల్ల మనకి మనం సురక్షితంగా ఉండొచ్చునేమో కానీ, అది జీవించడాన్నుంచి, జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది. భయం వల్ల మనిషి తనకు తానే పరిమితులు నిర్దేశించుకుని తన ప్రపంచంలో తాను మునిగి తేలుతాడు. ఈ క్రమంలో అటు ఆనందానికి, ఇటు స్వేచ్ఛకు దూరమైపోతాడు. అంతేకాదు హాయిగా నవ్వలేడు.. హృదయంతో ఏడ్వలేడు... అసలు మనస్ఫూర్తిగా, ఇష్టంగా ఏ పనీ చేయలేడు. ఏ మనిషైనా భయపడేది భవిష్యత్ గురించే.. తాను చేస్తున్న పనిలో విజయం సాధించగలనా... తన కుటుంబానికి ఆస్తిపాస్తులివ్వగలనా.. తన పిల్లలు చక్కగా చదువుకోగలరా.. తనకు భవిష్యత్లో ఆరోగ్యం సహకరిస్తుందా.. ఇలా రకరకాలుగా, వాస్తవంలో లేని వాటి గురించి బాధపడుతూ భయాన్ని పెంచుకుంటూ ఉంటారు. భయం జీవితం నుంచి పుట్టింది కాదు. భ్రాంతులతో నిండిపోయిన మనస్సు నుంచి పుట్టింది. అస్తిత్వంలో లేని దాని గురించి బాధ పడడం వల్లనే భయం ఆవరిస్తుంది. నిత్యం భవిష్యత్లో బతకడం వల్లనే భయం కలుగుతోంది. ఈ భయం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎవరికి వారు సాధన చేయాలి.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.. తామెందుకు భయపడుతున్నామని ప్రశ్నించుకోవాలి.. నిజానికి తాము భయపడాల్సిన అవసరం ఉందా అని ఆలోచించుకోవాలి. భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగి పోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. అసలు భయం అంటే ఏమిటి? మనం ఎందుకు భయపడతాం? భయం ఎన్ని రకాలు? భయం లేని మనుషులు వుంటారా? అసలు భయం ఎప్పుడు ఎలా పుట్టింది? ఈ ప్రశ్నలన్నిటినీ నిర్భయంగా చర్చించుకుంటే తప్ప భయం నుంచి విముక్తులు కాలేం. ఈ క్రమంలో కారణాలు తెలిసిన భయాలు కొన్ని.. కారణాలు తెలియని భయాలు కొన్ని. తెలిసిన భయాలకు అర్థవంతమైన వివరణ ఇస్తే పరిష్కారం చూపిస్తే పోతుంది. కాని తెలియని భయాలు అలా కాదు. అవి ఫలానా కారణం వల్ల కలిగాయని ఎవ్వరూ చెప్పరు. అందువల్ల మన భయాలకు మూల కారణాలు తెలుసుకుని, భయాన్ని పోగొట్టుకోవాలి. తన చేతుల్లో లేని ప్రకృతికి దైవత్వం ఆపాదించిన ప్రాచీన మానవుడు దానిపట్ల భయమూ భక్తి పెంచుకున్నాడు. భక్తి పెంచుకోక పోతే నష్టం కలుగుతుందని భయపడ్డాడు. ఫలితంగా మూఢ నమ్మకాలకు లోనయ్యాడు. మూఢత్వం భయానికి మొదటి హేతువు. మూఢనమ్మకాల వల్ల కలిగే భయాలు ఎవరినీ వదలి పెట్టవు. పైగా తమ సంపద పోతుందేమోనన్న భయంతో పోకుండా కాపాడుకోవాలన్నది అదనపు భయంగా తయారవుతుంది. మనుషుల మీద నమ్మకాలు సడలిపోవడం వల్ల ఎవరినీ నమ్మలేని విశ్వాస రాహిత్యం వెన్నాడుతుంది. అలాగే, మంచివారు చెడు చేయరు గనక దుర్మరణం పాలైన వారే ప్రేతాలై హింసిస్తారన్న నమ్మకం ఈ భయం వల్లనే ఏర్పడుతుంది. ఇలా మూఢత్వం అనేక భయాలకు దారి తీసింది. ఇలా అనాదిగా తన పరిధిని పెంచుకున్న భయం నేడు విశ్వ వ్యాప్తమై మనిషిని నిర్జీవంగా తయారు చేస్తోంది. భయానికి సంబంధించి మన పురాణాలలో అనేక ఘట్టాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. పురాణాలలో ఆయా కథలలోని భయాలకు ఓ సముచితమైన కారణం, దిశానిర్దేశం ఉండడం వల్లనే వారంతా మహనీయులయ్యారు. అదే విధంగా మనిషి కూడా తాను నిత్యం వేధించే భయాలతో కృంగి కృశించి పోకుండా, తమ భయాలకు అసలు సిసలైన కారణాలు తెలుసుకుని, వాటి పరిష్కారాలకు ప్రయత్నించినపుడే భయం అనే మహమ్మారి నుంచి విముక్తులవుతారు. భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగిపోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. -
హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు!
The biggest challenge facing humans in space is eating లండన్: ప్రస్తుతం ప్రపంచమంతా అంటువ్యాధులతో మగ్గిపోతోంది. మరోవైపు భవిష్యత్తులో అంతరిక్షంలో స్థిరపడాలని కలలు కంటోంది కూడా. ఐతే అంతరిక్షంలో స్థిరపడాలనే కల అంత తేలికగా నెరవేరదని తాజాగా సైంటిస్టులు అందుకు సంబంధించి విస్తుపోయే విస్తవాలను వెల్లడించారు. ఒక వేళ మనుషులు స్పేస్లో స్థిరపడితే ఆహార కొరత కారణంగా ఒకరినొకరు చంపుకుతింటారని హెచ్చరించారు. అంతరిక్షంలో స్థిరపడితే ఎదుర్కొనవల్సిన సవాళ్లను జనాళ్ల ముందుంచారు. దీంతో అందరూ ఆలోచనలోపడ్డారు. బృహస్పతి, శని గ్రహాలకు చెందిన చందమామలు (మూన్స్) క్యాలిస్టో, టైటాన్లు మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఐతే అంగారక గ్రహం లేదా చంద్రుడిపై ఒక కాలనీని స్థాపించి, అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే భూమి నుంచి ఈ రెండు ప్రదేశాలకు ఆహారాన్ని సప్లై చేయడం కుదురుతుందో లేదో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. వ్యాధులు ప్రభలడం, ఆహార కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్లో భూమి నుంచి సహాయం రావడానికి సంవత్సరాల కాలం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు యూకే నివేదిక ప్రకారం.. ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ ఏం చెబుతున్నారంటే.. భూమి నివాసయోగ్యం కానప్పుడు ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో నవాసాలేర్పరచుకోవాలి. అది సాధ్యపడాలంటే ముందుగా పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో చరిత్ర నుంచి విలువైన పాఠం నేర్చుకోవాలి. 19వ శతాబ్ధం చివరి భాగంలో కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ నార్త్-వెస్ట్ పాసేజ్ను వెతకడానికి బయలుదేరారు. ఆ సమయంలో సాంకేతికత లోపం తలెత్తడంతో దారితప్పారు. వారివద్ద క్యాన్డ్ ఫుడ్ కూడా ఉంది. ఐతే ఆధునిక కాలపు అత్యుత్తమ సాంకేతికత కలిగిఉన్నప్పటికీ అక్కడికి వెళ్లినవారంతా ఒకరినొకరు చంపుకు తిన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏకాకైన మానవ సమాజాలు చాలా త్వరగా నశించిపోతాయని ప్రొఫెసర్ కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఆహార కొరత అక్కడ ఎదుర్కొనే సమస్యలకు సిద్ధపడకుండా కాలిస్టోలోకి మనుషులను పంపితే, పరిణామాలు తప్పవు. తిండి దొరక్క బతకడానికి వేరే మార్గం లేక ఒకరినొకరు తింటారని భవిష్యత్ పరిస్థితిని కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులకు ఆహార సరఫరా ఒక ప్రధాన సవాలని డాక్టర్ కామెరాన్ స్మిత్ కూడా ఆయనతో ఏకీభవించాడు. అంతరిక్షంలో మానవ మనుగడను స్థాపించడానికి ముందుగా వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ గ్రహాంతరవాసుల కోసం వెతుకులాట కొనసాగిస్తోంది. చదవండి: Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత! -
మలి వసంతమూ సంతసమే..
ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు. మానవుడు జన్మించాక తన జీవనకాలంలో విభిన్నమైన పరిణామదశలను ఎదుర్కొంటాడు. ముందుగా బాల్యం, తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వన, ప్రౌఢ దశలను దాటుకుని వృద్ధాప్యంలోనికి అడుగిడడం జరుగుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే జీవన క్రమం. వృద్ధాప్యంలోనికి రాగానే జీవితం అంతా అయిపోయిందని అధిక శాతం వృద్ధులు నైరాశ్యానికి గురి అవుతూ ఉంటారు. అది చాలా తప్పు. ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలుఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశల్లో కూడా మనకు గుర్తుంటాయి.యవ్వనంలో జీవితాన్ని అనుభవించినప్పటి అందమైన రూపం, దఢమైనశరీరం ఇప్పుడు లేకపోయినా, అప్పటి అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో పదిలంగా, మధురంగా మన మనస్సులో గుర్తుంటుంది. వృద్ధాప్యంలో ప్రతివారి మదిలో కలిగే సందేహమూ, వారుప్రకటించే భావమూ ఒకటే.. ‘‘నేను ఇది వరకు ఉన్నట్లుగా ఉండలేకపోతున్నాను’’ అనే మాట. ఇది చాలా పెద్ద తప్పిదం. యవ్వనంలో ఉన్నట్లుగా ప్రౌఢవయసులో మనిషి ఉండలేనట్లే, వృద్ధాప్యంలోనూ ప్రౌఢవయసులో ఉన్న సత్తువ మనిషిలో ఉండదు. ఈ విషయాన్ని గ్రహించకపోవడం, గ్రహించినా, విచారిస్తూ ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. యవ్వనంలో దట్టమైన పటుత్వం, దిట్టమైన బిగువు జీవులందరికీ భగవానుడు ప్రసాదించే సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ బిగువు సడలుతూ ఉంటుంది. దానికి ఆవేదన చెందడం నిరర్ధకం. అది శరీరానికుండే సహజ లక్షణం. వయసు పెరుగుతున్నకొద్దీ మనిషికి పెరిగే సంపద ఆపారమైన వారి అనుభవం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా వారి చెంత పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఎవరికన్నా ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావి తరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృతభాండాలు..అనుభవాలను పంచుకునే సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతివాళ్ళూ ఆచరించాలి. పిల్లలకు మంచి విషయాలను బోధించడంలో తమను తాము నియంత్రించుకోవాలి. ‘‘మా రోజుల్లో ఇటువంటివి లేనేలేవు.. మేము ఆ రోజుల్లో ఈ విధంగానే చేశామా’’ అన్న నిరసనాపూర్వక మాటలను మాట్లాడకూడదు. ఈ తరహా మాటలను నేటి తరం ఏ మాత్రం హర్షించదు. ‘‘నువ్వు వెళ్ళే పద్ధతి బావుంది.. కొంచెం నేను చెప్పేది కూడా నీ విజయానికి గానీ, నీ సమస్య పరిష్కారానికి గానీ పనికి వస్తుందేమో చూడు’’ అని మృదువుగా అంటే చాలు, ఆ మాటలు యువత హృదయానికి మరింత గా చేరువ అవుతాయి. పెద్దవాళ్ళు ఆ విధంగా మాట్లాడితే, తమ తర్వాతి తరం వారిని తప్పు పడుతున్నట్లుగా గాక, సాఫల్యపు బాటలో నడిపిన వాళ్ళవుతారు. దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలంవిశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడి వల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి ఆహారపు అలవాట్లు, అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుంది. యవ్వనంలో, ప్రౌఢవయసులో వచ్చే ఆనందం దొంతర దొంతరలయితే, పెద్ద వయసులో అనుభవంవల్ల అలరించే ఆనందం మన ఊహకందే పిల్ల తెమ్మెరలా హాయిగా మనసును సోకుతూ ఉంటుంది. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసునుకాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! వృద్ధాప్యం శాపం కాదు...ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏ మాత్రం బాధించదు. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
నిలుపుకోవలసిన అలవాట్లు
ఒక పనిని ప్రతి రోజూ ఒకే సమయానికి చేస్తుంటే దానిని అలవాటు అంటాం. దానిని సూర్యోదయం, సూర్యాస్తమయాలంత సహజంగా, క్రమం తప్పకుండా చేస్తుంటాం. అలా ఇది మన జీవితంలో, వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. దీనికి అంతర్గత ప్రేరణ ఉంటుంది. అంటే, కొన్ని ఏళ్లుగా తెల్లవారు ఝామునే లేవడాన్ని అలవరచుకుంటే అలారం అవసరం లేకుండా ఆ సమయానికి అప్రయత్నంగా మెలకువ వచ్చేస్తుంది. ఒకే సమయానికి భోజనం చేయటం, పడుకోవటం కూడ ఇలాంటివే! వీటిని స్థిర అలవాట్లంటాము. సత్పురుషుల సాంగత్యంతో దానగుణం, పరోపకారం, పెద్దవాళ్ళని గౌరవించటం, నిస్సహాయులకు అండగా నిలవటం, చక్కగా సంభాషించటం, సరైన నిర్ణయాధికారం అనే మంచి అలవాట్లను ప్రయత్నపూర్వకంగా అలవరచుకుంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇవి నిలిచిపోతే, వీటి వల్ల వ్యక్తిగత ప్రగతి తద్వారా సమాజ ప్రగతి కలుగుతుంది.. అలవాట్ల మీద నియంత్రణ అవసరం. మంచి అలవాట్లు కూడ ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆహార పానాదులు ఒక నిర్ణీత కాలంలో తీసుకునే మనకు అన్నివేళలా అలా సాధ్యం కాకపోవచ్చు. అందుకనే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రతి మంచి అలవాటు కూడ ఒక చెడ్డ అలవాటే నంటాడు. అలవాట్లను మన అధీనంలో ఉంచుకోవాలి. మన శరీరం మన అధీనం లో ఉండాలి గాని అది చెప్పినట్లు మనం వినకూడదు. దాని వశంలోకి మనం వెళ్ళకూడదు. శరీరానికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటవుతుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నడక, వ్యాయామం చేసే అలవాటున్న వాళ్లకు ఒక్కరోజు చేయకపోయినా ఆ వెలితి తెలుస్తుంది. మంచి అలవాట్లు జీవితానికి ఒక క్రమశిక్షణ నిస్తాయి. బాల్యంలో ఏర్పడిన మంచి అలవాట్ల వల్ల మనం పొందే ప్రయోజనం ఎంతగానో ఉంటుంది. ఇది చాలా కాలం కూడా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల, ఉపాధ్యాయులపాత్ర, బాధ్యత ఎంతో ఉంది. సాధారణంగా చెడుకి ఆకర్షణ ఎక్కువ. దీనివల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మంచి అలవాట్లు సైతం పోతాయి. చెడు అలవాట్లకు గురైన వ్యక్తుల కుటుంబాలు ఛిన్నాభిన్నమైన ఉదాహరణ లెన్నో! దీనివల్ల సమాజంలో మనిషికి గౌరవం ఉండదు. పైగా సమాజం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలవాట్లనేవి మనిషి జీవితంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. మంచి అలవాట్లతో జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించు కోగలరు. చెడు అలవాట్లతో జీవితమే నాశనం అయిపోతుంది. ఒక మంచి అలవాటు మనిషిని ఉన్నత పథానికి తీసుకెళ్తే, చెడ్డది అధః పాతాళానికి తీసుకెళ్లిపోతుంది. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు కావచ్చు. కాని, అతి ధూమపానం, మద్యపానం, పరస్త్రీ వ్యామోహం, జూదం, దుబారా చేసి అనవసరంగా అప్పులు చేయటం వంటివి చెడు అలవాట్లుగా భావించటంలో ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు. కొందరికి ప్రతి చిన్ననొప్పికి మాత్రలు వేసుకోవటం అలవాటుగా ఉంటుంది. అవసరమున్నా, లేకపోయినా డాక్టర్ల దగ్గరికి పరుగెడుతూ ఉంటారు. ప్రతి చిన్న బాధను కొంచెమైనా సహనంతో భరించలేక పోతే, విపరీతమైన మందుల వాడకం తదనంతర జీవితం పై దుష్ప్రభావం చూపుతుంది. మన దృష్టి దాని మీద నుండి మరల్చుకోవాలి. మంచి అలవాట్లు జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తాయి. మంచి ఆరోగ్యానికి పునాది మంచి అలవాట్లే! పూర్వం బైటికి వెళ్లి ఇంటికి వస్తే, వచ్చిన వెంటనే కాళ్ళు, చేతులు కడుక్కుని లోపలికి వెళ్లేవారు. అంత శుభ్రత పాటించేవారు. ఆధునికత, జీవనశైలి అన్న పేరుతో ఇప్పుడు వీటిని వదిలేశాం. పాదరక్షలతోనే లోపలికి వెళ్లిపోతున్నాం. చేతులు కడుక్కోకుండానే భోజనం చేసేస్తున్నాం. వీటివల్ల అనారోగ్యాల పాలవుతున్నాం. ఇప్పుడు, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో భయం కొద్దీ పూర్వపు పద్ధతులను ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నారు. చేతులు పదే పదే కడుక్కోవడం, కూరగాయలు బజారు నుంచి తెచ్చిన వెంటనే శుభ్రంగా కడగటం వంటివి వంద శాతం చేస్తున్నారు. పూర్వపు శుచి శుభ్రతలకు పూర్ణంగా విలువనిచ్చి పాటిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మంచి అలవాటు. ఈ క్లిష్ట పరిస్థితి పోయాక కూడ, ఇది ఒక స్థిరమైన అలవాటుగా ఎప్పటికి కొనసాగిస్తే, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరూ దోహదం చేసిన వారవుతారు. ఇటువంటి మంచి అలవాట్లను యువత అవసరార్థం నేర్చుకున్నా తదనంతరం కొనసాగించటం మంచిది. అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. మనిషి మూడు అలవాట్లను తప్పక చేసుకోవాలని మేధావులు చెపుతారు. మొదటిది – డబ్బు సంపాదించటం. జీవన గమనం కోసం, ఆర్ధిక భద్రత కోసం డబ్బు చాలా అవసరం. రెండవది – ఎప్పుడూ తన ప్రవర్తనను తానే విశ్లేషించుకుంటూ, లోపాలను సరి దిద్దుకుంటూ ఆత్మ విమర్శ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. మూడవది – ఇష్టమైన రంగంలో సృజనాత్మకత పెంపొదించుకోవటం అలవాటు చేసుకోవాలి. రచయితలు, సంగీత, నృత్య కళాకారులు, క్రీడారంగ నిపుణులు నిరంతర సాధన చేస్తూనే ఉంటారు. పోటీలు ప్రదర్శనలు వున్నప్పుడే కాక ప్రతిరోజూ సాధన చేస్తూ ఉండటం వల్ల వారి విద్వత్తు మరింత ప్రకాశిస్తుంది. వృత్తినైపుణ్యాలు మెరుగవుతాయి. ప్రజ్ఞాపాటవాలు మరింతగా పరిఢవిల్లుతాయి. మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏదైనా అలవాటు కావటానికి 21రోజులు అవసరమంటారు. ఆ నిర్ణీత కాలంలో నిష్ఠతో ప్రయత్నించటం వల్ల అది అలవాటవుతుంది. దానిని నిలుపుకోవటానికి ప్రతి రోజు ఆ అలవాటును కొనసాగించవలసి ఉంటుంది. శరీరానికి, మనసుకు కూడ మంచి అలవాట్లను అలవాటు చేయాలి. మనసుకు ఎటువంటి క్లిష్ట, విషాద పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండటం అలవాటు చేయాలి. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ, చెడు, హానికరం అనిపించినవి వదిలేయటానికి ప్రయత్నిస్తూ, మంచి అలవాట్లను వదలకుండా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూండాలి. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యం వైపు నడిపించేవి అలవాట్లు. మంచి అలవాట్లే వ్యక్తిత్వానికి చిరునామా. అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. –డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు!
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయంతో ప్రపంచమంతా గుండెలరచేతిలో పట్టుకుని బతుకు జీవుడా అని కాలం గడుపుతోంటే.. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. మానవుడి జీవిత కాలాన్ని 120 సంవత్సరాల వరకూ పెంచే మార్గం సుగమం కానుందని, ఈ మేరకు తమ పరశోధనలు కొత్త ఊపిరిలూదుతున్నాయని చెబుతున్నారు. వృద్ధాప్య ప్రక్రియలో సాధారణంగా క్షీణించే ఎస్ఐఆర్టీ-6 అనే ప్రోటీన్ సరఫరాను పెంచడం ద్వారా మనిషి దీర్ఘం కాలం మనిషి దీర్ఘకాలం జీవించే మార్గాన్ని గుర్తించామని బార్-ఇలాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. పరిశోధకులు 250 ఎలుకలపై పరిశోధన గావించి వాటి ఆయుర్దాయం పెంచారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించబడిన పీర్-రివ్యూ పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించింది. ఆయుర్దాయంపై పురోగతి ప్రయోగశాల పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న హైమ్ కోహెన్ మాట్లాడుతూ, ఎలుకల ఆయుర్దాయం 23 శాతం పెంచడానికి ఒక మార్గాన్ని కనుగొన్నామన్నారు. ఎలుకలలో తామె చూసిన మార్పులు మానవులకు అనువదించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రయోగం ఆడ, మగ ఎలుకలపై నిర్వహించగా ఆడ ఎలుకలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. మగ ఎలుకల వయస్సు ఎక్కువ పెరిగిందని వివరించారు. మగ ఎలుకల జీవితకాలం 30 శాతం, ఆడవారి జీవితకాలం కేవలం 15 శాతం పెరిగిందని చెప్పారు. అలాగే ఈ ప్రోటీన్ తక్కువ కొలెస్ట్రాల్ను కలిగి ఉంటుందని, క్యాన్సర్ నుండి రక్షించడానికి కూడా పనిచేస్తుందని తెలిపారు. కోహెన్ ప్రకారం, వృద్ధాప్య ఎలుకలలో వయస్సుతో శక్తి సాధారణంగా తగ్గుతుంది. కాని వాటి శరీరంలో ఈ ప్రోటీన్ పెరగడం వల్ల శక్తి పెరిగింది. అయితే జన్యుపరంగా మార్పు చేయడం ద్వారా ఎలుకలలో ఎస్ఐఆర్టీ-6 అనే స్థాయిలను అతను సులభంగా పెంచగలిగినప్పటికీ, మానవులలో ప్రోటీన్ను పెంచడానికి మందులు అవసరం. రెండు మూడు సంవత్సరాలలో మానవులలో ఫలితాలను ప్రతిబింబించగలదని కోహెన్ చెప్పారు. దీని స్థాయిలను పెంచే చిన్న అణువులను అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ప్రోటీన్లను మరింత చురుకుగా చేయనున్నారు. వృద్ధాప్యాన్ని పరిష్కరించడానికి భవిష్యత్తులో వీటిని ఉపయోగించవవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి : కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్ -
మావోల హింస వల్లే అత్యధిక ప్రాణనష్టం
సాక్షి, అమరావతి: దేశంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించేందుకు మావోయిస్టు పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో జరిగిన మొత్తం హింసాత్మక ఘటనల్లో 88 శాతం కంటే ఎక్కువ మరణాలకు మావోయిస్టులే పేర్కొంది. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితిపై (2018–2019 మార్చి వరకు) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో వివిద వామపక్ష తీవ్రవాద సంస్థల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) అత్యంత శకిమంతంగా ఉందని నివేదికలో స్పష్టం చేసింది. తీవ్రవాద ప్రభావిత 10 రాష్ట్రాల్లో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో గడిచిన తొమ్మిదేళ్లలో 3,749 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2010 నుంచి 2018 వరకు మొత్తం 10,660 ఘటనలు చోటుచేసుకోగా, వాటిలో 3,749 మంది మరణించారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేలా ప్రజలతో పోలీసులు మమేకం కావాలని హోం శాఖ నివేదికలో సూచించింది. మావోయిస్టుల ప్రభావం ఉన్నచోట ప్రజల భద్రతతోపాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్) అమలు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పలు పథకాల ద్వారా నిధులు విడుదల చేసి, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు మావోయిస్టులను కట్టడి చేయడానికి పోలీసు బలగాల సంఖ్యను పెంచడంతోపాటు భద్రతా సిబ్బందికి అధునాతన ఆయుధాలు, హెలికాఫ్టర్లు తదితర అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నట్టు పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తక్కువే.. మావోయిస్టుల హింసాత్మక ఘటనలు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే తక్కువ. మావోయిస్టుల హింసాత్మక ఘటనల విషయంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి తగ్గిపోతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2013లో 10 రాష్ట్రాల్లో 76 జిల్లాల్లోని 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టుల ప్రభావం ఉండేది. 2018 నాటికి 8 రాష్ట్రాల్లోని 60 జిల్లాల పరిధిలో 251 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే వీరి ప్రభావం కనిపించింది. ఏపీలో మావోల హింసాత్మక ఘటనలు.. మృతులు ఏడాది ఘటనలు మృతులు 2010 100 24 2011 54 9 2012 67 13 2013 28 7 2014 18 4 2015 35 8 2016 17 6 2017 26 7 2018 12 3 -
కాలం సాక్షిగా చెప్పే సత్యం
మానవ జీవితం చాలా అమూల్యమైనది. అది ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు. అల్లాహ్ దాన్ని రహస్యంగా ఉంచాడు. దాన్ని ఛేదించే శక్తిని ఎవ్వరికీ ప్రసాదించలేదు. కనుక జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం పైనే సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు. డబ్బు, గౌరవం, ఉద్యోగం, అధికారం, హోదా ఏదైనా కావచ్చు, అది సాధ్యమే. కాని కాలాన్ని మాత్రం ఎంత ధనం ధారపోసినా, ఎంతపలుకుబడి ఉపయోగించినా సాధించలేము. గడిచినకాలం – అది రెప్పపాటైనా సరే – కోట్లు కుమ్మరించినా మనకు లభించదు. ఇది కాలం చెప్పే సత్యం. మనం దాని విలువను గుర్తించకపోతే అది మనకోసం ఆగదు. గోడకు అమర్చినగడియారం ముల్లు ‘టిక్ టిక్’ మని శబ్దం చేస్తూ తన పని అది చేస్తూనే ఉంటుంది. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడే అది మనకు ఉపకరిస్తుంది. లేకపోతే అది మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ముందుకు సాగిపోతుంది. అందుకని మనం ఏవిషయంలో అయినా సకాలంలో స్పందించగలగాలి. సమయం మించి పోయిన తరువాత తీరిగ్గా విచారిస్తే ప్రయోజనం ఉండదు. అవకాశాలు ఎప్పుడూ మనకోసం నిరీక్షిస్తూ ఉండవు. అవకాశాలను మనమే సృష్టించుకోవాలి.మనమే వాటిని అందిపుచ్చుకోవాలి. అవి మనవద్దకు రావాలని ఆశించడం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏది అవసరమో దానిపై దృష్టి కేంద్రీకరించాలి. బాధ్యతల నిర్వహణలో అలసత్వాన్ని ఎంతమాత్రం దరిచేరనీయకూడదు.ఎందుకంటే, ఈరోజు చేయవలసిన కార్యాన్ని రేపటికి వాయిదా వేశామంటే కాలం విలువను మనం గుర్తించనట్లే లెక్క. ఈనాటి కొద్దిపాటి అలక్ష్యం రేపటి బాధ్యతను రెట్టింపుచేస్తుంది. ఒకటికి రెండు తోడై, బాధ్యతలు పేరుకు పోతాయి. ఇక ఆతరువాత బాధ్యతల నిర్వహణ తలకుమించినభారంగా పరిణమించి, పలాయనవాదాన్ని ఆశ్రయించే దుస్థితికి తీసుకువస్తుంది. అద్భుతమైన విజయాలను సాధించినవారి జీవితాలను పరిశీలిస్తే, వారు కాలాన్ని(సమయాన్ని) ఎలా తమకు అనుకూలంగా మలచుకొని, సద్వినియోగం చేసుకొని, కొత్త అవకాశాలను సృష్టించుకున్నారో, కొంగ్రొత్త ఆవిష్కరణలకు ఎలా నాంది పలికారో మనకు అర్ధమవుతుంది.ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ తన జీవితకాలంలో వెయ్యికంటే ఎక్కువ నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. వాటిలో గ్రామ్ ఫోన్, విద్యుత్తుబల్బు అతని ఆవిష్కరణలే అని మనందరికీ తెలుసు. ఇది ఎలాసాధ్యమైంది? అతను కాలం నాడిని ఒడిసిపట్టి, దాన్నిసద్వినియోగం చేసుకున్నాడు. కాలక్షేపం కోసం కాలాన్ని దుర్వినియోగంచేయలేదు.సరదాలు, సొల్లుకబుర్లకోసం సమయాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అతను, తనప్రయోగశాలనే వినోదశాలగా మార్చుకున్నాడు. చేస్తున్న పనిలోనే ఆనందాన్ని, వినోదాన్ని అనుభవించాడు. కాలం విలువను గుర్తించబట్టే, విద్యుత్ బల్బును కనుగొనే సమయంలో ఏకధాటిగా పన్నెండు, పదమూడు రోజులు ప్రయోగశాలలోనే నిద్రలేని రాత్రులు గడిపాడు.అందుకని కాలం విలువను, ప్రాధాన్యతను గుర్తించాలి. పవిత్రఖురాన్ కూడా ‘కాలం సాక్షిగా’ మానవాళికి అనేక హితబోధలు చేసింది. కాలగతిలో కలిసిపోయిన వారి గాథల్ని గుణపాఠాలుగా వివరించింది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ హితోపదేశాలకనుగుణంగా నడచుకొని ఇహ పర లోకాల్లో సాఫల్యం పొందాలని ఆశిద్దాం. ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
హెల్త్ టిప్స్
⇔ ఈ కాలంలో తరచుగా గొంతు నొప్పి బాధపెడుతుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. టీలో కూడా వేసుకోవచ్చు. ⇔ గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు కలిపి రోజుకు రెండు– మూడుసార్లు గార్గిలింగ్ చేస్తే (గొంతులో పోసుకుని గరగరలాడించడం) గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ⇔ పొట్ట పనితీరు క్రమం తప్పినట్లనిపిస్తే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతూ మధ్యలో కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్, సూప్ల వంటివి తీసుకోవాలి. వారంలో కనీసం ఒకరోజు ఇలా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శుభ్రపడి పొట్ట యథాస్థితికి వస్తుంది. ⇔ ఫ్లూ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా కొద్ది రోజులు ఒళ్లునొప్పులు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ ముల్లంగి రసంలో అంతే మోతాదు ఆలివ్ ఆయిల్ కలిపి అరగంట సేపు అలాగే ఉంచి శరీరానికి మర్దన చేస్తే ఒంటి నొప్పులు తగ్గుతాయి. -
సంపాదించడం తప్పా?
ఇవాళ దేశంలో ఎవరిని కదిలించినా కరెన్సీ కబుర్లే! ఒకప్పుడు మన జేబులో విలాసంగా ఉన్న విలువైన వెయ్యి నోటు ఇవాళ చిత్తు కాగితంతో సమానమంటే, మరేదో కొత్త నోటు సంపాదిస్తే దాని విలువ రెండు వేలని అంటే - అసలు విలువ దేనిది? ఆ కాగితానిదా? లేక మనం దానికి ఇస్తున్న ప్రాధాన్యానిదా? ఇంతకీ డబ్బు సంపాదన మంచిదా? చెడ్డదా? ఎంత సంపాదిస్తే మంచి? మరెంత సంపాదిస్తే చెడు? డబ్బు సంపాదన తప్పు అని మన ధర్మం ఎక్కడా చెప్పలేదు. మానవ జీవితంలో దానికున్న విలువనూ తోసిపుచ్చలేదు. కాకపోతే, ఎలా సంపాదించాలో స్పష్టంగా చెప్పాయి. మనిషి తన జీవితంలో నాలుగు పురుషార్థాల కోసం శ్రమించాలని శాస్త్రవచనం. ఆ నాలుగూ ఏమిటంటే ధర్మం, అర్థం (డబ్బు), కామం (కోరిక), మోక్షం! ఈ చతుర్విధ పురుషార్థాల్లో - రెండోది ధన సంపాదన. మొట్టమొదటిది - ధర్మం. అంటే, జీవితాన్ని ధర్మంగా గడపాలి. అది మొదటిది. అలా ధర్మంగా జీవిస్తూ, ‘అర్థం’... అంటే డబ్బు సంపాదించాలి. అది రెండోది. అలా ధర్మమార్గాల్లో కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా, ధర్మబద్ధంగా కోరిక తీర్చుకోవాలి. అది మూడోది. ఇలా మూడింటితో, నాలుగో పురుషార్థమూ, అత్యున్నతమైన మోక్షసాధన చేయమన్నారు. అలాగే, ప్రతి గృహస్థూ నిత్యం అయిదు రకాల కర్మలు చేయాలని శాస్త్రమే చెబుతోంది. అవి - ‘బ్రహ్మ యజ్ఞం’ (పరమాత్మను సేవించడం), ‘దేవ యజ్ఞం’ (దేవతల సేవ), ‘పితృ యజ్ఞం’ (పితృదేవతల సేవ), ‘మనుష్య యజ్ఞం’ (తోటి మానవుల్ని సేవించడం), ‘భూత యజ్ఞం’ (ఇతర జీవకోటిని సేవించడం). ఈ అయిదూ నిత్యజీవితంలో ఆచరించాలంటే, ద్రవ్యం కావాలి. అంటే, గృహస్థుగా జీవితం సాగిస్తున్నవారు డబ్బు సంపాదించడం తప్పు కానేకాదు. కాకపోతే, మనిషి ఆ డబ్బును ధర్మంగా సంపాదించకపోతేనే తప్పు. అలా ధర్మంగా సంపాదించిన డబ్బును కూడా తన అవసరాలకు వినియోగించుకోగా మిగిలినది సమాజ హితం కోసం, తోటివారి బాగు కోసం వినియోగించకపోతే మరీ తప్పు. భగవంతుణ్ణీ, తోటివారినీ సేవించకుండా కేవలం తమ కోసం తాము బతికేవారు నరకంలో పడతారని ‘భగవద్గీత’ పేర్కొంది. గృహస్థుగా మన ధర్మం నిర్వహిస్తున్నప్పుడు, నిజజీవిత సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలు వహిస్తున్నప్పుడు అనుకోకుండా - మాటలతోనో, చేతలతోనో, ఆలోచనలతోనో ఇతరులను బాధించే ప్రమాదం ఉంది. అది ఉద్దేశపూర్వకం కాకపోయినా దుష్కర్మే. అందుకే, నిస్వార్థంగా తోటివారికి సేవ చేస్తూ, చేసిన కర్మలన్నిటినీ భగవంతుడికి అర్పించాలి. అప్పుడు ఆ దుష్కర్మ తీరుతుందని పెద్దల మాట. అంటే, డబ్బు సంపాదించేది స్వార్థం కోసం, మన అహంకారాన్ని పెంచుకోవడం కోసం కాదు! మన నిత్యావసరాలు తీర్చుకొంటూనే, తోటి మానవుల్లో ఉన్న మాధవుణ్ణి సేవించడం కోసం! అలాగే, మనది కానిది తీసుకోవడం దొంగతనంతో సమానం. సంపాదించే క్రమంలో మరొకరికి కష్టం, నష్టం కలిగించడం, అవతలివారిని వాడుకొని వదిలేయడం పరమ తప్పు. కానీ, ఇవేవీ మనం గ్రహించడం లేదు. ఎంత సంపాదించినా, ఇంకా ఇంకా కావాలనే దురాశలో పడిపోతున్నాం. ‘నాకు, నా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు...’ అంటూ తరతరాలకూ సరిపడా ఆస్తుల్ని స్వార్థంతో పోగేసుకోవడం మీద దృష్టిపెడుతున్నాం. నిజానికి, పోగు చేసుకోవాల్సింది ధర్మాన్ని ఆచరించడం ద్వారా వచ్చే పుణ్యాన్ని! అంతేతప్ప, పోయినప్పుడు వెంట రాని ఈ ఆస్తుల్ని కాదు!! అది మనం గుర్తించడం లేదు. సౌకర్యంగా జీవించడం తప్పు కాదు. దాని కోసం అక్రమ మార్గాలకు మళ్ళడం తప్పు. అధర్మంగా డబ్బు సంపాదిస్తే, అది తాత్కాలికంగా సుఖం ఇచ్చినట్లు అనిపించవచ్చు కానీ, ఆ పాపం మాత్రం వెంటాడి వేధిస్తుంది. ఎవరైనా, అవసరానికి మించి కూడబెడితే, ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరవైనట్లు...’ అని శతకకారుడు చెప్పినట్లుగా ఆ డబ్బంతా చివరకు ప్రభుత్వాల సొమ్ము, పరుల సొమ్ము అవుతుంది. అసలు సిసలు ‘బ్లాక్ మనీ’ బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నది అందుకే! - రెంటాల -
జీవితకాలం స్వల్పమేమీ కాదు!
(కాలం) ఏ కొంత కూడా ఇతరుల అధీనంలోకి వెళ్లలేదు. కాలాన్ని ఎంత పొదుపుగా సంరక్షించుకోగలిగితే, కాలాన్ని మార్పిడి చేసుకోవడానికి కాలం కన్నా విలువైనదేదీ లేదని గ్రహించగలిగితే - అప్పుడు అతనికి సరిపడా సమయం మిగులుతుంది. మానవుల జీవితకాలం చాలా స్వల్పమని సాధారణంగా అందరూ అంటుంటారు. జీవితకాలం చాలా తక్కువగా ఉన్నందుకు ప్రకృతి దుర్మార్గం గురించి కూడా ఫిర్యాదు చేస్తుంటారు. కాలం చాలా వేగంగా పరుగెత్తుకుని పోవడం దానికి ఒక కారణం. ఒకటి రెండు మినహాయింపులు తప్ప నిజానికి మనలో చాలామందికి జీవించడానికి సంసిద్ధం అవుతున్న తరుణంలోనే అది ముగిసిపోతుంటుంది. కానీ నిజానికి మనకు జీవించడానికి ఉన్నది తక్కువ కాలమేమీ కాదు. అందులో చాలా భాగాన్ని మనం వృథా చేస్తాం. చివరకు ఒకరోజు మృత్యువు సమీపించే సమయం ఆసన్నమవుతుంది. ఒక చేతగాని వ్యక్తికో, చెడ్డ యజమానికో అపారమైన సంపద లభిస్తే కనుమూసి తెరిచేంతలో అది మాయమవుతుంది. అదే ఒక సమర్థుడికి దానిని అప్పచెప్పిన పక్షంలో అది వినియోగించిన కొద్దీ పెరుగుతుంటుంది. అలాగే మన జీవితకాలాన్ని కూడా మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే అది కూడా విస్తృతమవుతూనే వుంటుంది. ‘‘జీవితంలో చాలా కొద్ది భాగం మాత్రమే మనం నిజంగా జీవిస్తుంటాం,’’ అంటాడు ఒక ప్రముఖ కవి. ఆ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. అంటే ఆ మిగిలినదంతా జీవితం కాదు. అది వట్టి కాలం మాత్రమే. మనిషి తన ఎస్టేట్లని ఎవరైనా స్వాధీనం చేసుకోవడానికి చూస్తే సహించడు. సరిహద్దులకి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా రాళ్ల కోసమో, ఆయుధాల కోసమో పరిగెడతాడు. అయితే తమ జీవితాన్ని ఇతరులు ఆక్రమించుకుంటుంటే మాత్రం మనుషులు పట్టించుకోరు. తన డబ్బుని ఇతర్లతో పంచుకోవడానికి ఇష్టపడే ఒక్క వ్యక్తిని కూడా మనం చూడలేం. అయితే అతని జీవితాన్ని మాత్రం మనలో ప్రతి ఒక్కళ్లూ విభజించి పంచుకొంటాం. మనుషులు తమ వ్యక్తిగత ఆస్తిని కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉంటారు. అదే కాలం విషయానికి వస్తే దాన్ని ఎలాంటి పట్టింపు లేకుండా వృథా చేస్తుంటారు. జీవిత చరమాంకంలో ఉన్న ఒక మనిషిని దొరకబుచ్చుకుని నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న అడగాలని అనిపిస్తుంది. ‘‘నీ వయసు వందేళ్లకు సమీపంగానో, ఇంకా ఎక్కువగానో ఉంది. ఇప్పుడు ఇంక నీ జీవితం గురించి దాన్ని ఎలా ఖర్చుపెట్టావనే దానికి సంబంధించి లెక్కలు చూసుకో. వడ్డీ వ్యాపారస్థుల చుట్టూ తిరగడానికి ఎంతకాలం వెచ్చించావు? ప్రియురాలి కోసం ఎంత ఖర్చు పెట్టావు? ఆశ్రీతుల కోసం, పోషణ కోసం ఎంత వెచ్చించావు? భార్యతో పోట్లాడడానికీ, నౌకర్లను శిక్షించడానికీ ఎంత కాలం ఖర్చు చేశావు? వ్యాధుల కోసం, నీ అంతట నువ్వు తెచ్చిపెట్టుకునే వ్యాధుల కోసం ఎంత కాలం ఖర్చు పెట్టావు? అసలు ఏ పనీ చేయకుండా, ఉపయోగించకుండా ఎంత కాలాన్ని వదిలేశావు’’- నువ్వు ఎప్పుడైనా ఒక నిర్దేశిత లక్ష్యం కోసం పనిచేశావా అనేది గుర్తుకు తెచ్చుకో. నువ్వు అనుకున్న ప్రకారం కచ్చితంగా ఎన్ని రోజులు గడప గలిగావు అనేది లెక్కవేసుకో. నీ మొహం ఎన్నిసార్లు సహజమైన భావప్రకటనతో ఉందో గుర్తుకి తెచ్చుకో. నీ మనసు ఆందోళన రహితంగా ఎన్నిసార్లు ఉందో గమనించుకో. నువ్వు ఏం పోగొట్టుకున్నావో నీకు తెలిసేలోగానే ఎంత మంది నీ జీవితాన్ని దొంగిలించుకుని పోయారు? పక్కదారి పట్టించే అర్థంలేని ఆనందాల కోసం, కోరికల కోసం ఎంత జీవితాన్ని పోగొట్టుకున్నావు? అప్పుడు నీకు అర్థం అవుతుంది నువ్వు పూర్తిగా పరిపక్వం కాకుండానే మరణించబోతున్నావని. నీకు భయం కలిగించే విషయాలకు సంబంధించి జీవితం అశాశ్వతం అంటున్నావు. అదే కోరికల విషయానికి వచ్చేసరికి జీవితం శాశ్వతం అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. అయితే ఎలా జీవించాలి అనేది తెలుసుకోవడానికి పూర్తిగా ఒక జీవితకాలం పడుతుంది. ఇంకా ఆశ్చర్యం కలిగించేదేమంటే ఎలా చనిపోవాలి అనేది తెలుసుకోవడానికి కూడా పూర్తిగా ఒక జీవితకాలం పట్టడం! చాలామంది గొప్పవాళ్లు వాళ్లకున్న సంపదల్నీ, సంతోషాల్నీ త్యజించి జీవించడం ఎలా అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా బతికారు. చనిపోబోయే ముందు వాళ్లందరూ చెప్పిన సత్యం ఒకటి ఉంది. జీవించడం ఎలా అనే విషయం అసలు తమకు తెలియనేలేదని, కనీసం ఇతరులకి తెలిసినంత అయినా తెలియలేదని వాళ్లు ఒప్పుకున్నారు. నాకు తెలిసి గొప్ప వ్యక్తుల లక్షణం ఒకటే ఒకటి ఉంది. తన సమయాన్ని వృథాగా ఎగిరిపోకుండా చూసుకోవడం. అప్పుడు అతనికున్న సమయం అంతా అతని కోసమే ఖర్చు పెట్టడానికి అవకాశం కుదురుతుంది. అందులో ఏ కొంత కూడా నిర్లక్ష్యంగా వదిలి వేయబడదు. ఏ కొంత కూడా ఇతరుల అధీనంలోకి వెళ్లలేదు. అతను కాలాన్ని ఎంత పొదుపుగా సంరక్షించుకోగలిగితే, కాలాన్ని మార్పిడి చేసుకోవడానికి కాలం కన్నా విలువైనదేదీ లేదని గ్రహించగలిగితే- అప్పుడు అతనికి సరిపడా సమయం మిగులుతుంది. ఆ గడిచిపోయిన కాలాన్ని నీకు ఎవరూ తెచ్చి ఇవ్వరు. అలాగే నిన్ను నీకు కూడా ఎవరూ తెచ్చి యివ్వలేరు. జీవితం ఎలా మొదలయిందో అలాగే సాగిపోతుంది తప్ప అది వెనక్కి రాదు. రాజాజ్ఞ అనో, ప్రజలకు మంచి జరుగుతుందనో దాన్ని పొడిగించడం సాధ్యం కాదు. ఎక్కడా ఆగదు. పక్కదారి పట్టదు. ఈలోగా మరణ సమయం ఆసన్నమవుతుంది. దానికోసం సంసిద్ధంగా ఉండటానికి నీకు అవకాశం లేకుండా పోతుంది. జీవించడానికి ఉన్న పెద్ద అవరోధం ఏంటంటే, భవిష్యత్తు గురించి ఎదురుచూడటం. అంటే రేపటి కోసం ఎదురుచూస్తూ ఈరోజుని పోగొట్టుకోవడం. జీవితాన్ని గతం, వర్తమానం, భవిష్యత్తు అనే మూడు భాగాలుగా విభజిస్తే అందులో వర్తమానం అనేది చాలా చిన్నది. భవిష్యత్తు సందేహాస్పదం. గతం ఒక్కటే కచ్చితమైనది. గతం మీద అదృష్టానికి ఎలాంటి అధికారం ఉండదు. గతాన్ని ఎవరి అదుపులోకన్నా తీసుకురావడం అసాధ్యం. రకరకాల వ్యవహారాల్లో మునిగిపోయిన వాళ్లు పోగొట్టుకున్నది ఈ గతాన్నే. జిజ్ఞాసకి, తత్వజ్ఞానానికి ఎవరైతే జీవితంలో సమయం కేటాయించగలుగుతారో వాళ్లే నిజంగా జీవిస్తున్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్లు వాళ్ల జీవితగమనాన్ని నిశితంగా గమనించుకోగలగడంతో పాటు గడిచిన కాలాన్ని తమ జీవితాలకి కలుపుకోగలరు. అంటే వాళ్ల గడిచిపోయిన సంవత్సరాలన్నీ ఒకదానికి ఒకటి జమ అవుతాయి తప్ప వ్యర్థం కావు. ఆ రకంగా గొప్ప తత్వవేత్తలందరూ మనకోసమే జన్మించి, జీవించడానికి మనకు ఒక విధానాన్ని తయారు చేసినట్టు అనుకోవచ్చు. అంతేకాదు వాళ్లు ఎలా చనిపోవాలి అనేది కూడా బోధించగలరు. వాళ్లు మీ కాలాన్ని వ్యర్థం చేయరు. పెపైచ్చు వాళ్ల కాలాన్ని మీకున్న కాలానికి కలుపుతారు. వాళ్ల నుంచి నీకు ఎంత జ్ఞానం కావాలనిపిస్తే అంత జ్ఞానాన్ని తీసుకోవచ్చు. నీకు సరిపడినంత వాళ్ల నుంచి నువ్వు తీసుకోలేకపోతే అది వాళ్ల తప్పు కాదు. రోమన్ తత్వవేత్త సెనెకా (క్రీ.పూ. 4 - క్రీ.శ. 65) మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకోలేమనీ, మనం ఎవరికి పుట్టాలనేది విధి నిర్ణయమనీ చాలామంది అంటుంటారు. మనం ఎవరి పిల్లలుగా ఉండాలో నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఉన్నతమైన మేధావులు, తత్వవేత్తలలో మీకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటే వాళ్ల పేరుతో పాటు వాళ్ల జ్ఞాన సంపదకు కూడా మీరు వారసులు అవుతారు. దీన్ని మీరు ఎంతమందితో పంచుకుంటే అంత పెరుగుతూ పోతుంది. శాశ్వతత్వానికి చేరుకోగల పథ నిర్దేశాన్ని తత్వవేత్తలు మాత్రమే చేయగలరు. అశాశ్వతమైన జీవితాన్ని శాశ్వతత్వంలోకి నడిపించడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఎవరైతే గతాన్ని మర్చిపోయి, వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసి, భవిష్యత్తు గురించి భయపడతారో వాళ్లకి జీవితకాలం చాలా స్వల్పంగానే కనిపిస్తుంది. మూలం: సెనెకా ‘ఆన్ ద షార్ట్నెస్ ఆఫ్ లైఫ్’ నుంచి సంక్షిప్తంగా... అనువాదం: జి.లక్ష్మి 9490735322 -
ఆరోగ్యరక్షణలో ప్రధానపాత్ర
ఒక వ్యాధి అంతు చూసేలోపు మరొకటి వచ్చిపడుతోంది. మానవ జీవనం తింటే తంటా తినకపోతే మంట అన్నట్టుంది. కల్తీమయమవుతున్న ఆహారంతో పాటు అవి వండుకునే పాత్రలు సైతం అనారోగ్య కారణాలలో ప్రధాన‘పాత్ర’ పోషిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. సరికొత్త వంటపాత్రలు మార్కెట్లోకి రావడానికి అవే దోహదం చేస్తున్నాయి. - శిరీష చల్లపల్లి సాధారణంగా అల్యూమినియం, మెటల్స్ మిక్స్డ్ స్టీల్, నాన్స్టిక్ వంటి వంటపాత్రలు వండేటప్పుడు పుట్టే ఉష్ణోగ్రత వల్ల ఆ లోహాలను ఆహారపదార్థాల్లోకి పంపిస్తాయి. ఆహారం తీసుకునేటప్పుడు రకరకాల మెటల్స్ కొంచెం కొంచెంగా మన శరీరంలోకి వెళతాయి. దీని పరిణామాలు వివిధ రకాల కొత్త జబ్బులుగా బయటపడుతుంటాయి. అప్పుడు వాటి చికిత్స ఖర్చు లక్షల పైమాటే.. అయితే దీనికి పరిష్కారంగా వచ్చిందే సర్జికల్ గ్రేడ్ స్టీల్. ఏమిటీ స్టీల్... మన శరీరంలో బోన్ సర్జరీ జరిగినప్పుడు, మోకాలి చిప్పను రీప్లేస్ చేసినప్పుడు, కాలి ఎముకలకు జత చేసే సర్జికల్ రాడ్స్ మెటల్తోనే ఈ పాత్రలు కూడా తయారు చేస్తారు. ఈ మెటల్ని సర్జికల్ గ్రేడ్ స్టీల్ అని అంటారు. దీనితో చేసిన బౌల్స్ లేదా కుక్కర్లలో వండితే ఎట్టి పరిస్థితుల్లోనూ మెటల్ కరగడం కానీ, తద్వారా తినే భోజనంలో కల్తీ కానీ జరగవు. పైగా భోజనం చాలా సహజంగా, కలర్ సైతం మారకుండా ఒక కొత్త అనుభూతిని మిగులుస్తుంది. లాభాల బౌల్స్.. ఈ స్టీల్తో తయారు చేసిన బౌల్స్ అండ్ కుక్కర్స్తో చాలా ప్రయోజనాలున్నాయి. ఆయిల్ లేకుండా బిరియానీ, వేపుళ్లు మాత్రమే కాదు దోసెలు, ఆమ్లెట్లు, చపాతీలు, పిజ్జాలు సైతం చేసుకోవచ్చు. అంతేకాదు వాటర్ లేకుండానే కూరగాయల్ని ఉడికించే మ్యాజిక్ కూడా ఇందులో ఉంది. ఇంకొక ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే బియ్యం కుక్కర్లో పెట్టిన ఒక నిమిషం 45 సెకన్లలోనే అన్నం రెడీ అవుతుంది. ఫాస్ట్ అండ్ ఫ్యాట్ ఫ్రీ కుక్కింగ్ కావడంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరికొత్త రుచితో ఆస్వాదించవచ్చు. బౌల్స్ సెట్ ఖరీదు మాత్రం లక్షపై మాటే.. కనీసం 2 కేజీలుండే ఒక్కో బౌల్ ప్రారంభ ధర రూ.15 వేలు. కూరగాయల నుంచి వచ్చే విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషినల్ వాల్యూస్ వంటివన్నీ మనం తినే వంటల్లో చేరి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు తయారీదారులు. వండడం సులువు.. ఈ పాత్రలలో వండటం సులువు. ఒక బౌల్లో ఒకేసారి రెండు మూడు రకాలను వండుకునేసౌకర్యం ఉంది. గ్యాస్తో పాటు టైం కూడా ఆదాకావడం వీటి ప్రత్యేకత. ఇంట్లో వాడుకునే కుక్కర్లతో అనేక రకాల ప్రమాదాలు జరగటం మనందరికీ తెలుసు. కానీ ఈ తరహా సర్జికల్ గ్రేడ్ స్టీల్తో తయారైన కుక్వేర్తో మాత్రం ఎటువంటి బ్లాస్ట్లు జరగవు. స్పెషల్ ప్రాసెస్తో తయారు చేయడంతో ఎటువంటి టెన్షన్ ఉండదు. నగరంలో చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. - సరోజ, మేనేజర్, ఏఎంసీ కుక్ వేర్ యూనిట్ -
జీవితంపై విరక్తి పుట్టి మేకగా మారాడు
పాశ్చాత్య జీవితం పట్ల విరక్తి చెందిన ఓ వ్యక్తి వలస వెళ్లి మరీ మేకలాగా జీవితం గడుపుతున్నాడు. లండన్ లో విలాసవంతమైన జీవితంలో ఏం తక్కువయ్యిందో ఏమో 35 ఏళ్ల థామస్ థ్వైటెస్ తన మిగతా జీవితాన్ని స్విట్జర్లాండ్ లో విభిన్నంగా గడపాలనుకున్నాడు. అందుకు ఒక జీవనశైలిని కూడా ఎంచుకున్నాడు. అదేంటని అనుకుంటున్నారా..! మేకలాగా జీవనం సాగించడం. నాలుగు కాళ్లతో నడుస్తూ.. పర్వతాలపై తిరుగుతూ తమ ఆహారాన్ని వెతుక్కునే ఈ జీవుల్లా బతకాలని నిర్ణయించుకున్నాడు. అంతే తన కాళ్లు, చేతులకు సరిపడే విధంగా(పర్వతాలపై నడవడానికి వీలుగా) నాలుగు కాళ్లను, గడ్డి తినడానికి కృత్రిమ పొట్టను తయారు చేయించుకున్నాడు. అక్కడి మేకలతో పాటు తిరుగుతూ గడ్డి మేస్తూ హాయిగా జీవనం గడుపుతున్నాడు. ఇప్పటికి ఏడాదిగా ఇలా జీవనాన్ని కొనసాగిస్తున్న థామస్ ను గొర్రెల కాపరులు తమ మందలతో పాటు తిప్పి తీసుకువచ్చేందుకు ఒప్పుకున్నారు. ప్రత్యేకంగా మేక సైకాలజీలో గ్రాంట్స్ యూనివర్సిటీలో థామస్ పట్టా కూడా పొందాడు. తనతో పాటు తిరిగి గడ్డిని మేసే మేకలకు అనుమానం రాకుండా ఉండటానికి, తిన్న గడ్డిని కృత్రిమ పొట్టలోకి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఏడాదిగా మేక జీవితం గడుపుతున్న మీరు ఏం తెలుసుకున్నారు? అని థామస్ ను ప్రశ్నించగా మేకలు కష్టమైన జీవితాన్ని గడుపుతాయని, వాటి సంరక్షణ కోసం పోరాడుతాయని తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. మనుషుల కంటే మేకలు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాయని స్విట్జర్లాండ్ వచ్చాక తాను అటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని వివరించాడు. -
పుడమితల్లికి వందనాలు...
నేడు ఎర్త్డే పచ్చటి పొలాలతో పచ్చపచ్చటి చీరను ధరిస్తుంది భూమి... పర్వతాలను శిఖరాయమానంగా అలంకరించుకుంటుంది భూమి... పండ్లు, పూలు, కాయలు, ఆకులకు జన్మనిచ్చే నిత్య గర్భిణి భూమి.. మానవుల దోషాలను భరిస్తూ, గుణాలను స్మరిస్తూ... అందరినీ కడుపులో పెట్టుకుంటుంది భూమి... భూమి... ఎన్నో ప్రాణులకు, జీవరాశులకు ఆవాసం. భూమి లేనిదే మానవ జీవనం లేదు. భూమిని భూమాతగా కొలుస్తాం. క్షమకు మారు పేరు భూమి కావడం వల్లనే ‘క్షమయా ధరిత్రీ’ అంటారు. ఉదయాన్నే నిద్ర లేస్తూనే మన పాదాలను భూమి మీద మోపుతూ, భూదేవికి నమస్కరించి, ‘సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే విష్ణుపత్నీ నమస్తుభ్యమ్ పాదఘాతం క్షమస్వమే ॥అని చదవడం సంప్రదాయంగా వస్తోంది. అంటే ‘అమ్మా! మేం నీ గుండెల మీద నడుస్తున్నాం. మా పాదాలతో నిన్ను బాధిస్తున్నాం. మమ్ము క్షమించు తల్లీ’’ అని అర్థం. -
మానవ జన్మ తత్వజ్ఞానమే... ఈశావాస్యోపనిషత్తు
వేదాలలో భాగాలు, వాటికి అనుబంధాలూ, భారతీయ వైదిక సాహిత్యంలో ప్రధాన విభాగమూ అయిన ఉపనిషత్తుల గురించిన పరిచయాన్ని, వాటిలోని రకాలను, భాగాలను గురించి గతవారం తెలుసుకున్నాం కదా... ఉపనిషత్తులన్నిటిలోకీ తలమానికమైనదీ, మానవ జన్మలోని విశేషాలను విపులీకరించే ఈశావాస్యోపనిషత్తు గురించి ఈ వారం... శుక్లయజుర్వేదం మాధ్యందిన సంహిత నలభైయవ అధ్యాయంలో వాజసనేయ సంహితోపనిషత్తుగా ఉన్న ఈ ఉపనిషత్తులో పద్ధెనిమిది మంత్రాలు మాత్రమే ఉన్నాయి. మొదటి మంత్రంలో మొదటి పదం ‘ఈశావాస్యమిదం’ అని ఉండటం వల్ల దీనికి ‘ఈశావాస్యోపనిషత్తు’ అనే పేరు ప్రసిద్ధమైంది. నాలుగు వేదాల్లో ప్రాచీనాలూ, ప్రసిద్ధాలూ అయిన పది ఉపనిషత్తులలో మొదటి స్థానం ఈ ఉపనిషత్తుకే. ఆదిశంకరులు దీనికి భాష్యం రాశారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసే క్రమంలో ఈ ఉపనిషత్తు ముందుండి దారి చూపుతుంది. మానవజాతికి ఈ జన్మ ఎందుకు ఎత్తామో, ఎలా జీవించాలో ఏం తెలుసుకోవాలో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. భగవంతుడు మానవ జన్మ ఎత్తినా అశాంతి, అస్పష్టత వెన్నాడుతూ ఉంటాయి. ధర్మవిగ్రహుడైన శ్రీరామచంద్రుడు ఒకరోజు అర్ధరాత్రి నిద్రపట్టక అశాంతితో వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్లి తలుపు తట్టాడు. ఆయన ‘ఎవరు?’ అని ప్రశ్నించాడు. ‘నేను ఎవరినో తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాను’అని రాముడు సమాధానం చెప్పాడు. వశిష్టుడు రాముని గొంతు గుర్తుపట్టి తలుపు తీశాడు. జ్ఞానోపదేశం చేశాడు. ఈ కథ నిజంగా ఇలా జరిగినా జరగకపోయినా మానవులందరూ ఈ స్థితిలో ఉన్నారనే సత్యం దీనిలో దాగి ఉంది. ఈశావాస్యోపనిషత్తు పరిమాణంలో చిన్నదే అయినా చాలా స్పష్టంగా జీవన ముఖ్యసూత్రాలను, మనోవికాసాన్ని, ఆలోచనావిధానాన్ని నిర్దేశిస్తుంది. తరువాత వచ్చిన ప్రవక్తలు, ఆచార్యులు, గురువులు, సిద్ధాంతకర్తలు, శాస్త్రవేత్తలు తిలక్, ఠాగూర్, గాంధీజీ వంటి పెద్దలు అందరూ ఈ ఉపనిషత్తును ప్రస్తావించారు. విన్నవారికి ఎవరికైనా వెంటనే జ్ఞానం కలిగించే సూత్రప్రాయమైన మహోపనిషత్తు ఈశావాస్యం. ఈ ఉపనిషత్తులో మొదట సాకారంగా ఏ దేవతారూపమూ చెప్పబడలేదు. ఏ రూపమూ లేని పరబ్రహ్మమే జగత్తు అంతటా వ్యాపించి ఉంది. నీలోనూ నీ చుట్టూ అంతటా అదే ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకో. నీకు లభించిన దానితో తృప్తిపడు. ఇతరుల సొమ్ము దొంగిలించకు. అనే మొదటి మంత్రం ఒక్కటే ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. మానవజాతి ప్రశాంత జీవనానికీ అన్ని మతాల సిద్ధాంతాలకూ, సమస్త వేదాంతానికీ బలమైన పునాది ఈ సూత్రం. ‘కర్మలు చేస్తూనే నూరేళ్లు జీవించాలి. బతికి ఉన్నంతకాలం సత్కర్మాచరణ తప్ప మరోదారిలేదు’ అనే రెండో మంత్రం మానవుణ్ణి కర్తవ్యపరాయణునిగా నూరేళ్లు బతకమని చెబుతోంది. పని చేసేవాడికే బతికే హక్కుంది. అవకాశం ఉంది. సత్కర్మ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం వల్ల ఆయుర్దాయం చేకూరుతుంది. సోమరిపోతులకు సంపూర్ణంగా బతికే హక్కు, అవకాశమూ లేవు. ‘అసురులకు చెందిన లోకాలు కటిక చీకటిలో ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్నవారు (ఆత్మను చంపుకున్నవారు) ఆ లోకాలకు చేరుకుంటారు’ అనే మూడోమంత్రం రాక్షసత్వంతో చీకటిలో మగ్గిపోవద్దని, వెలుగులోకి రమ్మంటోంది. తమను తాము చంపుకున్నవారు ఆత్మజ్ఞాన శూన్యులై ఉంటారు. కనుక వారు చీకటిలోకాల్లోకి పోతారు. ‘ఆత్మ చలించనిది, మనసుకన్నా వేగవంతం. దానికంటే ముందుగా వెళుతోంది. ఆత్మస్థిరంగా ఉంటుంది. అతివేగంగా ప్రయాణిస్తుంది. ఆత్మ వేగాన్ని ఎవరూ అందుకోలేరు. ఆత్మ అన్నిటికీ, అంతటా ప్రాణశక్తిని ఇస్తుంది’అనే నాలుగో మంత్రం అంతటా వ్యాపించి ఉన్న శక్తిని వివరిస్తోంది. ‘ఆత్మ ప్రయాణిస్తుంది. కదలకుండా ఉంటుంది. దూరంగా ఉంటుంది. దగ్గరగానూ ఉంటుంది. లోపలా బయటా ఉంటుంది’ అనే ఐదోమంత్రం చెప్పిన ఆత్మవర్ణనను ఆధునిక శాస్త్రీయ దృష్టితో విశ్వశక్తిగా తెలుసుకోవాలి. విశ్వశక్తినే నిర్గుణ పరబ్రహ్మం అంటాం. ఇది తెలుసుకున్న వారికి ఎదుటివారిపై ద్వేషం ఉండదు. ఎందుకంటే ఎదుటివారు వేరు కాదు కనుక. అందరినీ తనలో చూస్తాడు. తనను అందరిలో చూస్తాడు. ఈ ఆత్మజ్ఞానం కలిగి అంతా ఒకటిగా చూసేవాడికి మోహం, శోకం ఉండవు. మానవుల దుఃఖానికి, రాగద్వేషాలకు, భిన్నాభిప్రాయాలకు అన్నిటికీ కారణం మోహం. వ్యక్తులపైన, వస్తువులపైన, దేహంపైన ఉన్న మోహంలోనే దుఃఖమూ కోపమూ మొదలైన మనోవికారాలు ఏర్పడుతున్నాయి. ఆత్మజ్ఞానం కలిగినవాడు ప్రదర్శన అయిపోయిన సినిమా తెరలాగా అయిపోతాడు. ఆత్మతత్వం ఒకరు సృష్టించింది, కల్పించిందీ కాదు. దానంతటదే ఏర్పడింది. అంతటా వ్యాపించి ఉంది. దానికి శరీరం, కండలు ఉండవు. అది స్వచ్ఛం, పరిపూర్ణం. ఇప్పటివరకు విశ్వజ్ఞానాన్ని పొందడం వల్ల కలిగే లాభాలను చెప్పిన ఉపనిషత్తు ఆ దృష్టి లేకుండా కేవలం పశువులాగా జీవిస్తే అవిద్య వలన కటికచీకట్లో పడిపోతారని హెచ్చరిస్తోంది. ఆత్మజ్ఞానాన్ని కలిగించేది బ్రహ్మవిద్య. ఉపాధికి పనికి వచ్చేది అవిద్య. భౌతికంగా పనికొచ్చేది అవిద్య. సంపూర్ణజ్ఞానాన్ని ఇచ్చేది బ్రహ్మవిద్య. కనుక రెండూ అవసరమే అని చెప్పడం ఈశావాస్యం ప్రత్యేకత. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
గ్రీడ్ ఈజ్ బ్యాడ్
సోల్ / దురాశ ఆశ నిరాశలు మానవ జీవితంలో సహజాతి సహజమే అయినా, ప్రాథమికంగా మనిషి ఆశాజీవి. ఆశాభంగాలు ఎదురైనప్పుడు వాటిల్లో నిరాశ నుంచి త్వరగా తేరుకుని, ఆశాదీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోగలిగే వాళ్లను ఆశావాదులంటారు. నిజానికి ఇలాంటి వాళ్లే కార్యసాధకులు. బతుకు మీద ఆశను అడుగంటించేసుకుని నిరంతరం నిరాశలో మునిగిపోయే వారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఇలాంటి నిరాశావాదులు తమ జబ్బును పక్కవాళ్లకూ అంటించేందుకు ప్రయత్నిస్తారు. నిరాశావాదులు మన పరిసరాల్లో ఉంటే కార్యసాధనలో మనమూ వెనుకబడిపోతాం. కాబట్టి వీళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే! ఆశావాదులు, నిరాశావాదుల సంగతి అలా ఉంచితే, లోకంలో కొందరు దురాశావాదులూ ఉంటారు. అన్నీ తమకే కావాలనుకుంటారు ఇలాంటి వాళ్లు. తాము ఆశించేదానికి తగిన యోగ్యత తమకు ఉందా లేదా అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఇలాంటి వాళ్లే మరీ డేంజరస్ పీపుల్. వీళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం. సంతృప్తికి ఆమడ దూరం సామాన్యులు ఎంతసేపూ ఆశ నిరాశాల్లోనే కొట్టుమిట్టాడుతుంటారు. తమకు గల చిన్ని చిన్ని ఆశలు నెరవేరిపోతే చాలు తృప్తిగా జీవితాన్ని వెళ్లదీసేస్తారు. ఆశించినది దక్కకుంటే కొంతకాలం నిరాశలో మునిగినా, తిరిగి తేరుకుని తమ కర్మ ఇంతేనని సరిపెట్టుకుంటారు. దురాశావాదులు అలా కాదు. ఆశాభంగములను వారెన్నడూ సహించజాలరు. ఆశించినది దక్కేంత వరకు కంటి నిండా నిద్రపట్టదు. షడ్రసోపేతమైన భోజనమూ రుచించదు. తమ ఆశాభంగాలకు కారణమని భావించే వారిపై నిష్కారణంగా పగ పెంచుకుంటారు. అదను చూసి వారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వాళ్లే రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఎదుటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కేసి మరీ పెకైదిగిపోతారు. యోగ్యతా సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా కోరుకున్నవి పొందడానికి వీళ్లు ఎంతకైనా తెగిస్తారు. దురాశాపరులు సంతృప్తికి ఆమడ దూరంలో ఉంటారు. ఎంతటి అయాచిత, అనాయాస లాభాలు సైతం వాళ్లకు సంతృప్తినివ్వలేవు. ఎంత సంపద పోగేసుకున్నా వీళ్ల నోటంట ‘ఇక చాలు’ అనే మాట చచ్చినా రాదు. ఇలాంటి దురాశాపరులకు పొరపాటున అధికారం దొరికిందంటే, ఇక అంతే సంగతులు! జనాలను యథేచ్ఛగా దోచుకుంటూ నియంతలుగా తయారవుతారు. దురాశా పురాణం ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల్లోను, పురాణాల్లోను దురాశ గురించిన ప్రస్తావన ఉంది. మన పురాణాలు దురాశనే ‘లోభం’గా పేర్కొన్నాయి. లోభాన్ని అరిషడ్వర్గాలలో ఒకటిగా పరిగణించాయి. దురాశ మహా పాపం అని కూడా పలు మతాలు ఉద్బోధించాయి. దురాశ వల్ల ఎన్ని సంపదలు సమకూరినా, మనశ్శాంతి మాత్రం ఉండదని హితవు పలికాయి. పోగాలము దాపురించినప్పుడు హితవచనాలేవీ రుచించవని ఆర్యోక్తి. దురాశ మితిమీరితే అది ఆత్మవినాశనాన్ని కూడా కొని తెస్తుంది. అతి లోభం... అంటే, మితిమీరిన దురాశ వల్ల దుర్యోధనుడు నాశనమైన ఉదంతాన్ని పురాణ ప్రవచనాలు చెప్పే వారందరూ ఉద హరిస్తూ ఉంటారు. అయితే, దురాశాపరులకు ఇలాంటివేవీ పట్టవు. పురాణాల్లోనే కాదు, చరిత్రలోనూ దురాశాపరుల గురించి చాలా ఉదాహరణలు దొరుకుతాయి. రోమన్ చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా పేరుమోసిన రోమన్ సేనాని మార్కస్ క్రాసస్, మంగోల్ నాయకుడు చెంగిజ్ ఖాన్, బురిడీ స్కీములతో జనాల నెత్తిన కుచ్చుటోపీ పెట్టి కోట్లు కొల్లగొట్టిన అమెరికన్ కేటుగాడు చార్లెస్ పొంజీ వంటి దురాశాపరులు జనాలను దారుణంగా దోచుకున్నారు. దురాశ వల్ల ఎన్నో అనర్థాలు మానవజాతికి అనుభవానికి వచ్చినా జనాభాలో దురాశాపరుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. యుగ ధర్మమా..? జనాల ఖర్మమా..? కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో కుంటి నడక నడుస్తుందని, అలాంటి ధర్మ‘సంకట’ కాలంలో లోకంలో దురాశాపరులు పెచ్చరిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి. పలువురు కాలజ్ఞానులు కూడా ఇదే విషయాన్ని బలపరచారు కూడా. మనుషుల్లో దురాశ మితిమీరడం యుగ ధర్మం అనుకుని సరిపెట్టుకోవాలో, ఇదంతా మన ఖర్మమని సరిపెట్టుకోవాలో తెలియని అయోమయావస్థ సామాన్యులకు మిగిలింది. ఆధునిక యుగంలో అన్ని రంగాలూ అధునాతనంగా పరిణమించినట్లే, దురాశ కూడా మరింత ఆధునికతను సంతరించుకుంది. ప్రజాస్వామ్యం చలామణీలో ఉన్న చోట్ల అయితే, మరీ సాఫిస్టికేటెడ్గా మారింది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న దేశాల్లో దురాశాపరుల్లో మెజారిటీ జనాలు రాజకీయాల్లో చేరి, యథేచ్ఛగా మూడు స్కీములు, ఆరు స్కాములతో ఆ విధంగా ముందుకు పోతున్నారు. ప్రజాస్వామిక దేశాల్లోనే దురాశాపరుల పురోగతి ఇలా ఉంటే, ఇక నియంతృత్వ రాజ్యాల సంగతి చెప్పేదేముంది? ఆధునిక యుగంలో దురాశాపరులు కూడా తెలివి మీరారు. ఉత్త దురాశతోనే ఉపయోగం లేదని, దురాశలు నెరవేరాలంటే కూసింత తెలివితేటలు ఉండాలని గ్రహించిన వారయ్యారు. మెదడు తలకాయలో లేకున్నా, బొత్తిగా అరికాల్లోకి జారిపోకుండా దానిని కనీసం మోకాల్లో పదిలంగా ఉండేట్లు చూసుకుంటే చాలు, లోకాన్ని ఏలేయవచ్చనే నమ్మకం ప్రబలిన వాళ్లయ్యారు. ఇలాంటి వాళ్లు విజయానికి అడ్డదారులు... జనాలను కొల్లగొట్టడం ఎలా..? వంటి అముద్రిత గ్రంథాలను రహస్యంగా చదువుకుంటూ చావు తెలివితేటలను పెంచుకుంటూ ఉంటారు. తెలివితక్కువ సన్నాసుల్లోనూ దురాశాపరులు లేకపోలేదు. అయితే, వాళ్ల వల్ల జనాలకు పెద్దగా అనర్థాలేమీ జరిగే ప్రమాదమేదీ ఉండదు. వాళ్ల మూర్ఖత్వమే జనాలకు శ్రీరామరక్ష. ‘కన్యాశుల్కం’లో లుబ్ధావధానులు తెలివితక్కువ దురాశాపరుడు. ఆ ముసలాడు తెలివితక్కువ వాడు కావడం వల్లనే, రామప్పంతులు మొదలుకొని కరటకశాస్త్రి శిష్యుడి వరకు అతగాడికి టోకరా ఇస్తారు. ఒకప్పుడు ‘దురాశ దుఃఖమునకు చేటు’ అనే నీతివాక్యం బడిగోడల మీద విరివిగా కనిపించేది. ఆ కాలంలోనూ దురాశాపరులు ఉండేవాళ్లు. ఇప్పుడా నీతివాక్యం అంత విరివిగా కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు దురాశాపరుల సంఖ్య ద్విగుణం బహుగుణంగా వృద్ధి చెందుతోంది. -
మరణానంతరమూ జీవిస్తారు!
- ఇక్కారెడ్డిగూడ గ్రామస్తుల ఆదర్శం అభినందనీయం - చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్ - నేత్రదాన అంగీకార పత్రాలు అందజే సిన 480 మంది చేవెళ్ల రూరల్: సృష్టిలో మానవ జన్మ ఎంతో ఉతృష్టమైంది. అలాంటి జన్మను సార్థకం చేసుకోవడానికి.. మరణించిన తర్వాత కూడా మళ్లీ బతికి ఉండే ఒకే అవకాశం నేత్రదానం ద్వారానే లభిస్తుందని చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్ అన్నారు. మండలంలోని చనువల్లి అనుబంధ గ్రామం ఇక్కారెడ్డి గూడకు చెందిన గ్రామస్తులంతా సుమారు 480 మంది నేత్రదానానికి ముందుకువచ్చారు. ఆదివారం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నికల్ డెరైక్టర్ కిషన్రెడ్డికి గ్రామస్తులు తమ నేత్రదాన అంగీకార ప్రతాలను ఆర్డీఓ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ.. ఇక్కారెడ్డిగూడ గ్రామస్తుల ఆలోచన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మనం మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా మనకళ్లు మరొకరి జీవితంలో వెలుగులు నింపాలనే ఆలోచన ఎంతో గొప్పదని కొనియాడారు. యువత చైతన్యాన్ని ఆయన అభినందించారు. తన రెవెన్యూ డివిజన్ పరిధిలో సంపూర్ణ నేత్రదానానికి ముందుకు వచ్చిన గ్రామాలు దేవునిఎర్రవల్లి, ఇక్కారెడ్డిగూడలు ఉండటం గర్వకారణంగా ఉందని చెప్పారు. తాను ఎక్కడైనా చేవెళ్ల డివిజన్ ఆర్డీఓగా కాకుండా.. సంపూర్ణ నేత్రదానం చేసిన రెండు గ్రామాల డివిజన్లో ఆర్డీఓగా పనిచేస్తున్నానని గౌరవంగా చెబుకొంటానని తెలిపారు. ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నికల్ డెరైక్టర్ కిషన్రెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులను అభినందించారు. కంటి జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎయిడ్స్, బ్లడ్ క్యాన్సర్ లాంటి వ్యాధులున్నవారు తప్ప మిగతావారందరూ నేత్రాలను దానం చేయవచ్చన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నర్సింలు, గ్రామ యువకులు చంద్రశేఖ ర్రెడ్డి, జైపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్చారిలు మాట్లాడుతూ.. అంధుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ నేత్రదానం కార్యక్రమం దేవునిఎర్రవల్లిలో ప్రారంభించి ఐదేళ్లుగా విజయవంతం చేస్తున్నారని, అదే స్ఫూర్తిని తమ గ్రామ యువత తీసుకుందన్నారు. మండలంలోలని మరిన్ని గ్రామాల్లో కూడా నేత్రదానం చేసేందకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు ప్రభాకర్రెడ్డి, పాపిరెడ్డి, పర్యావరణ అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు రామకృష్ణారావు, గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్, జి. రాములు, వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
దారి తప్పని కథకుడు
తన తండ్రి అగుపడని సత్యాల కోసం వెదకి వెదకి, సత్యమిది అని ఊహే గాని నిరూపించుకోలేని పరిస్థితిలో చనిపోయాడు. కనపడని సత్యాల కోసం మానవజన్మలో పొందవలసిన సౌఖ్యాలు వదులుకోవడం తెలివితక్కువ. తెలుగు సాహితీ ప్రపంచంలో ఎన్నో జీవమున్న కథల్నీ, మరచిపోలేని పాత్రల్నీ సృష్టించి కథానికా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు బలివాడ కాంతారావు (మొన్న జూలై 3 ఆయన జయంతి). మనుషుల మనస్తత్వాన్ని ఒడుపుగా పట్టుకునే శక్తి ఉన్న ఈ రచయిత ఎన్నో నిత్యజీవిత విషయాలను జీవితం ప్రతిఫలించేలా చిత్రించారు. బలివాడ కథల్లో ఒక గొప్ప కథ ‘దారి తప్పిన మనిషి’. ఆ కథాపరిచయం క్లుప్తంగా... మూర్తి వ్యాపారరీత్యా కారుమీద నూరుమైళ్ల దూరంలోని పట్నం వెళ్లి, ఉదయం తిరిగి వచ్చేటప్పుడు తన తండ్రి మిత్రుడి ద్వారా అక్కడో దేవాలయంలో తండ్రి శిలావిగ్రహాన్ని చూస్తాడు. వ్యాపారాలలో వచ్చిన లాభాలలో సగం డబ్బు దానాలకే ఇస్తూ నిరాడంబరంగా జీవించిన తండ్రి శిలావిగ్రహం అక్కడున్నట్టు అంతవరకూ మూర్తికి తెలియదు. తండ్రి చనిపోయాక మూర్తి దానాలను పూర్తిగా ఆపివేస్తాడు. అతన్ని దేవాలయానికి తీసుకొచ్చిన వ్యక్తి ఆ శిలావిగ్రహానికి నమస్కరించి ‘దారి తప్పని మహానుభావుడు’ అంటూ తండ్రీ కొడుకుల మధ్య భేదాన్ని ఎత్తి పొడుస్తాడు. మూర్తి ఆలోచనల్లో పడతాడు. తన తండ్రి అగుపడని సత్యాల కోసం వెదకి వెదకి, సత్యమిది అని ఊహే గాని నిరూపించుకోలేని పరిస్థితిలో చనిపోయాడు. కనపడని సత్యాల కోసం మానవజన్మలో పొందవలసిన సౌఖ్యాలు వదులుకోవడం తెలివితక్కువ. డబ్బు, తాగుడు, స్త్రీ ఈ మూడూ తప్పించి ఇంకేమీ సుఖమీయలేవు. నేడు సుఖపడు తున్నవాళ్లే దారి తప్పనివాళ్లు... ఇలా ఆలోచిస్తూ కారు నడుపుతున్న మూర్తి దారి తప్పి అరణ్యమార్గంలోకి వస్తాడు. ఘాట్ పైకి వెళ్లి తిప్పుదామని ఓసారి కారు దిగుతాడు. చుట్టూ ప్రకృతి ఆకాశాన్ని గొడుగుగా వేసుకున్నట్లుంది. గాలికి గులాబీవనంలో రెక్కల వర్షం కురుస్తోంది. కమలాలు రాల్తున్నాయ్. మూర్తి తిరిగి కారు స్టార్టు చేయబోతుండగా అద్దంలో ఒక యువతి కనిపిస్తుంది. ఎర్రరంగు చీర కట్టుకొని ఉప్పొంగిన యవ్వనంలో ఉన్న ఆమె మూర్తివైపోమారు చూసి ముందుకు సాగిపోతుంది. మూర్తి మనసు అదుపు తప్పుతుంది. కారును ఆమె వద్దకు తీసుకెళ్లి, దిగబెడతానని చెప్పి ఎక్కించుకొని వివరాలడుగుతాడు. కొండల వెనకనున్న ఊరామెది. ఘాటీ కింద కన్నవారి ఊళ్లో పొలంలో ఉండగా మొగుడుకి పెద్ద జబ్బు చేసిందన్న కబురు తెలిసి ఎకాయెకిగా బయలుదేరింది. మూర్తి లౌక్యంగా మాటలతో ఆమెను పడగొట్టి, కారును ఓ వటవృక్షం కింద ఆపుతాడు. తియ్యని సోడా అంటూ తాగించి మత్తులో ఉన్న ఆమెను అనుభవిస్తాడు. ఇక్కడ అశ్లీలతకు తావు లేకుండా ‘ఎర్రని చీర గాలికి ప్రక్కనే ఉన్న నీటిలోకి ఎగిరిపడి కొంతమేర తడిసింది. తడిసిన చీర రంగు నీటిలో వెలిసింది. ఆ నీటిలోని ఎరుపు రంగు పొద్దు పీల్చుకుపోయింది’ అంటూ రాసిన రచయితకు జోహార్లు చెప్పకుండా ఉండలేం. స్పృహ వచ్చాక ‘‘దారిన పోయేదాన్ని నన్ను దారి తప్పించేశావ్! నీకిది న్యాయమా? నా మొగుడికి నా ముఖం ఎలా చూపించను?’’ అంటుంది. ‘‘నీకూ నాకూ తప్ప ఇంకెవరికీ తెలీదులే! పద నిన్ను వేగంగా దిగబెడతాను’’ అంటూ కారు స్టార్ట్ చేస్తాడు. కారు లోయ పక్కనే ఉన్న సన్నటి బాటగుండా పోతుండగా, ఆమె అతని భుజాలపై ముద్దు పెట్టుకొని, ‘‘అటు చూడు బాబూ! ఎంత చక్కగా ఉందో?’’ అంటూ తూర్పు వైపు చూపిస్తుంది. ముద్దు పెట్టుకుందన్న సంతోషంతో అతనటుచూసి ‘వహవ్వా’ అంటాడు. ఆమె చప్పున బలమంతా ఉపయోగించి స్టీరింగును గిరగిర తిప్పివేస్తుంది. కారు దారితప్పి కొన్ని వందల అడుగుల లోయలోకి జారిపోతుంది. ఊహకందని ఈ కథ ముగింపు సంభ్రమానికి గురిచేస్తుంది. కంట నీరు పెట్టిస్తుంది. ఆశించే సుఖాలకు ఒక హద్దు ఉండి తీరాలని మనసును తట్టి చెబుతుంది. - చోడిశెట్టి శ్రీనివాసరావు, ఫోన్: 8978614136 -
వ్యథార్తులను వెక్కిరించకండి!
(కొత్త కోణం ) రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనిషికి జీవించే హక్కును- గౌరవంగా జీవించే హక్కును ప్రసాదించింది. మనిషికీ జంతువుకీ జీవించే విషయంలో ఉన్న తేడాను గమనించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను హెచ్చరించింది. ఎటువంటి ఆధారం లేని, ఆదరణ లేని వ్యక్తులకు నీడనివ్వడానికి షెల్టర్లను నిర్మించాలనీ అందులో అన్నిరకాల మౌలిక సౌకర్యాలను కల్పించాలనీ ఆదేశించింది. ఏ వ్యక్తీ కూడా రోడ్ల మీద, దుర్భర స్థితిలో ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆకలి...పేగులు లుంగలు చుట్టుకుపోయే ఆకలి... ఒంటిమీద చింకి పేలికైనా లేని దారిద్య్రం... చిట్టచివరికి శవాన్ని పూడ్చి పెట్టేందుకు సైతం అడుక్కుం టున్న ఇంటి ఇల్లాలు. ‘ఏం ఎందుకు? వాళ్లెందుకు చనిపోతున్నారు? తినడానికి బ్రెడ్ ముక్కలేదా?’ ఫ్రెంచి మహారాణి ప్రశ్నించింది. ‘అవును బ్రెడ్ లేకనే చనిపోతున్నారు’ రాజప్రాసాదంలోని సిబ్బంది నుంచి వచ్చింది సమాధానం. ‘అలా అయితే పేస్ట్రీ (కేక్) తినమని చెప్పండి’ అంటూ ఫ్రెంచి రాణి చేసిన వ్యాఖ్యలో అపహాస్యం, అధికార దురహంకారం ధ్వనించాయి. అవివేకమైన, అహంకార పూరితమైన ఈ వ్యాఖ్యే ఫ్రెంచి విప్లవాగ్నిని రగు ల్కొల్పింది. రాచరిక వ్యవస్థ పునాదులను కూకటివేళ్ళతో పెకిలించింది. తిరు గుబాటుకు ఆజ్యం పోసింది. అది 1770వ సంవత్సరం మధ్య కాలం. ఫ్రాన్స్ ప్రజలు ఆకలితో అల్లాడుతోన్న సందర్భం. వరుస కరువులతో విలవిల్లాడు తున్న జనం ఒక పక్క. విలాసాల్లో తేలియాడుతున్న ఫ్రెంచి రాజకుటుంబం మరోపక్క. అప్పుడే ఆకలిచావులపై జరిగిన చర్చలో మహారాణి వ్యాఖ్యలు ఫ్రెంచి విప్లవానికి నిప్పునందించాయి. ఆనాడు ఫ్రాన్స్లో ఉన్న ఆర్థిక, రాజ కీయ, సామాజిక పరిస్థితులకు ఫ్రెంచి మహారాణి వ్యాఖ్యలు తోడైనాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఫ్రెంచి విప్లవానికి తాత్వికతను అందించిన మహా మేధావి, రాజకీయ తత్వవేత్త, రచయిత, సంగీత విద్వాంసులు జాన్ జాక్ రూసో ఈ విషయాన్ని స్వీయ చరిత్ర ‘కన్ఫెషన్స్’లో ప్రస్తావించాడు. ఈ ఉదంతం ఫ్రెంచి ప్రజలను ఆలోచింపజేసింది. జూలై, 14, 1789న ప్రారం భమైన ఫ్రెంచి విప్లవం 1799 వరకు సాగింది. ఫ్రాన్స్నే కాదు, యూరప్ మొత్తాన్నీ, ప్రపంచాన్నీ ప్రభావితం చేసిన గొప్ప విప్లవం అది. పారిస్ కమ్యూన్లో కమ్యూనిజం తొలకరి జల్లులే ఆ పోరాటాలు. ఆకలినీ, దారిద్య్రాన్నీ పరిహసిస్తారా? ఆకలినీ, దారిద్య్రాన్నీ పరిహసిస్తే ఏం జరిగిందో చరిత్ర స్పష్టంగా చెబుతోంది. అలాంటి పరిహాసం నేటి సినీ ప్రపంచంలో పునరావృతం కావడం ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. కండల వీరుడి కండకావరానికి మద్దతుగానో, లేక లక్షలాది మంది ప్రేక్షకుల అభిమాన హీరో సల్మాన్ఖాన్ నిజ జీవితంలోని నటనకు ప్రతిస్పందించో తెలియదు కానీ, ఆ ముంబై గాయకుడు అభిజిత్ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు ఈ దేశంలో పేదవాడి పట్ల కలవారికున్న నీచ మైన స్వభావాన్ని తేటతెల్లం చేశాయి. ఫుట్పాత్ మీద పడుకున్న వారిపై నుంచి కారు నడిపి ఒకరి మరణానికీ, మరికొంతమంది గాయపడడానికీ కారణమైన బాలీవుడ్ నటుడు సల్మాన్కు న్యాయస్థానం ఐదేళ్లు శిక్ష వేసిన సందర్భంగా అభిజిత్ భట్టాచార్య ఆవేశంతో ఊగిపోయి ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘రోడ్ల మీద కార్లు, కుక్కలు మాత్రమే తిరు గుతాయి. వీళ్ళకేంపని అక్కడ పడుకోవడానికి? అటువంటప్పుడు జరిగే సం ఘటనకు శిక్షపడడం అన్యాయం’’ అన్న అభిజిత్ వ్యాఖ్యలు అనాలోచితమై నవి మాత్రమే కాదు. డబ్బు మత్తులో చిత్తవుతున్న వేనవేల బడాబాబుల మనస్తత్వానికి మచ్చుతునకలు. సల్మాన్ నేరం కంటే ఈ వ్యాఖ్య పదింతలు ఎక్కువ నేరపూరితమైనదని నేను భావిస్తున్నాను. అది ఉద్దేశపూరితంగా చేసిన వ్యాఖ్య కాకపోవచ్చు. కానీ నిష్కారణంగా నిరుపేదల ప్రాణాలను తీయడాన్ని తేలికగా తీసివేయడం, అల్పంగా భావించడం ప్రమాదకరం. ఫ్రెంచి విప్లవానికి ముందు రాజకుటుంబం ప్రజల అవస్థలను సవ్యమైన దృష్టితో పరిశీలించి, పరిష్కారాలను వెదికి ఉంటే పరిస్థితి అంత దూరం వెళ్ళేది కాదు. రాజకుటుంబం ఘోరమైన చావుకి గురయ్యేది కాదు. ఏదైనా ఒక సంఘటన జరిగితే, కారణాలను వెదికి, సమస్య పరిష్కరించడానికి పూనుకోవడం మనవల్ల కాకపోతే, దానికి సహకరించడం, అది కూడా చేత కాకపోతే కనీసం సానుభూతితోనైనా సమస్యను అర్థం చేసుకోవడం విజ్ఙుల పని. అంతేకానీ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆకలి, అవమానం, అన్యాయంతో రగిలిపోయే పేదల పట్ల మూర్ఖంగా ప్రవర్తించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారులు చేసే పని. అభిజిత్ లాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని భావించటం లేదు. ఈ వ్యాఖ్యలకు ఒక స్వభావం ఉన్నది. పేదల పట్ల ద్వేషం, కోపం, అపహాస్యం దాని లక్షణం. ఎప్పుడైనా పేదలు, దిక్కులేని వాళ్ళు, అన్నార్తుల చర్చ వస్తే వీళ్లు నిలువెల్లా రగిలిపోతారు. కానీ ఫుట్పాత్ల మీద, ఇతర పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో తలదాచుకుంటున్న లక్షలాది మంది ఎవరు? ఎవరికారణంగా వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారనే విషయం వీరికి పట్టదు. అయితే మానవత్వం ఉన్న మనుషులుగా, పాలకులుగా ప్రజల స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అందరి బాధ్యత. రోడ్ల మీద బతికేవాళ్లు 20 లక్షలు 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో నిలువ నీడలేకుండా బతుకు లీడుస్తున్న వాళ్లు దాదాపు 20 లక్షలని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు. ఇందులో 9 లక్షల వరకు పట్టణాలు, నగరాల్లో ఉన్నట్టు, 11 లక్షల మందికి పైగా గ్రామాల్లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ప్రణాళికా సంఘం అనుమతి మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హర్షమందర్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగుచూశాయి. నిలువనీడలేని వాళ్లు ఎక్కువ మంది దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలు, రైల్వే, బస్ స్టేషన్లు, రోడ్లు, ఫుట్పాత్లు, పార్క్లు, ఫ్లైఓవర్ల కింద, దుకాణ సముదాయాల అరుగుల మీద, బ్రిడ్జిల కింద జీవనం సాగిస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. వీళ్లలో ఎక్కువ మంది భిక్షాటన, ఇతర దానధర్మాల మీద ఆధారపడి బతుకులీడుస్తున్నారు. రోజువారీ పనులకు వెళ్లే వాళ్లు కూడా ఉంటారు. వీటికి తోడు పోలీసుల వేధింపులు నిత్యకృత్యం. దొంగలుగా, పిక్పాకెటర్లుగా, సెక్స్ వర్కర్లుగా ముద్రవేసి ఎక్కడ ఏదైనా దొంగతనం జరిగితే ఇటువంటి వాళ్లను ఆ కేసుల్లో ఇరికించే సంఘటనలు కోకొల్లలు. అందువల్లనే వీరెవ్వరికీ కూడా ప్రభుత్వం పైన, పోలీసులపైన సదభిప్రాయం ఉండదని ఈ అధ్యయనం వెల్లడించింది. వీధుల్లో నిలువనీడ లేకుండా జీవనం సాగించే వాళ్లు ఎవరు? ఎందుకు అలా గడుపుతున్నారనేది లక్షల డాలర్ల ప్రశ్న. తినడానికి తిండిలేకపోయినా, కనీసం గుడిసెల్లోనైనా బతికే జనం చాలా మంది ఉన్నారు. మరెందుకు ఇన్ని లక్షల మంది రోడ్ల మీద జీవనం సాగిస్తున్నారనేది ప్రశ్న. ఈ అధ్యయనం ఈ ప్రశ్నకి సమాధానం వెదికింది. కొన్ని కారణాలను బయటపెట్టింది. పిల్లలు, మహిళలు ఇంట్లో ఉండే హింస, బాధలు తట్టుకోలేక బయట పడుతుంటారు. సవతితల్లి, రెండో తండ్రి, లేదా తల్లి లేని పిల్లలు తొందరగా ఇల్లు విడిచిపెడు తుంటారు. తాగుడుకు బానిసలై, బాధ్యతలు విస్మరించిన మగవాళ్లు, పైసా సంపాదన లేని వాళ్లు కూడా ఇందులో చేరతారు. మానసిక రుగ్మత, నయం కాని జబ్బులతో బాధపడేవాళ్ళు, దిక్కులేని వృద్ధులు కూడా వీధుల పాలవు తున్నారు. ఉపాధికోల్పోయిన యువకులు, వికలాంగులు, ఏ దిక్కూలేక వీధుల్లోకొస్తున్నారు. అల్లర్లలో, హింసాకాండలో సర్వస్వం కోల్పోయిన వాళ్లు, చెదిరిపోయిన కుటుంబాలవాళ్లు, కుటుంబం, సమాజం, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వీళ్లు కూడు, గూడులేని దీనులుగా మారుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ కూడా ఈ అభాగ్యులను పట్టించుకోక పోవడం శోచనీయం. ఇదే విషయంపై స్పందించిన కొంతమంది సామాజిక కార్యకర్తలు సమ స్య పరిష్కారం కోసం 2001వ సంవత్సరంలో సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. ఇందులో ఢిల్లీ గురించి ప్రత్యేక ప్రస్తావన ఉన్నప్పటికీ మిగతా పట్ట ణాలు, నగరాల పరిస్థితి గురించి సుప్రీంకోర్టు సమాచారాన్ని తెప్పించు కున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనిషికి జీవించే హక్కును- గౌరవంగా జీవించే హక్కుని ప్రసాదించింది. మనిషికీ జంతువుకీ జీవించే విషయంలో ఉన్న తేడాను గమనించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను హెచ్చరించింది. ఎటువంటి ఆధారం లేని, ఆదరణ లేని వ్యక్తులకు నీడనివ్వడానికి షెల్టర్లను నిర్మించాలనీ అందులో అన్నిరకాల మౌలిక సౌకర్యాలను కల్పించాలనీ ఆదేశించింది. ఏ వ్యక్తీ కూడా రోడ్ల మీద, దుర్భరస్థితిలో ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. గాలికి కొట్టుకుపోయిన సుప్రీం ఆదేశాలు ఇందులో సుప్రీంకోర్టు 62 నగరాలను ప్రస్తావించింది. వాటిలో ఇరవైనాలుగు గంటలు పేదలు ఆశ్రయం పొందే విధంగా సౌకర్యాలు కల్పించాలని పేర్కొ న్నారు. మహిళలకు, పిల్లలకు కూడా ప్రత్యేక షెల్టర్లను నిర్మించాలనీ అందులో ప్రభుత్వమే ఉద్యోగులను నియమించాలనీ మహిళల షెల్టర్లలో మహిళలనే సంరక్షకులుగా నియమించాలనీ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు తీర్పును ఏ ప్రభుత్వాలూ చిత్తశుద్ధితో పట్టించుకున్న పాపాన పోలేదు. ఢిల్లీ లాంటిచోట్ల తప్ప మిగతా నగరాల్లో ఈ సమస్యను పట్టించుకోలేదు. 2011 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు ఐదుసార్లు ఆదేశాలు ఇచ్చింది. చివరగా 2011 డిసెంబర్ 12వ తేదీన ఇచ్చిన ఆదేశంలో అన్ని రాష్ట్రాలు శాశ్వతమైన వసతిగృహాలను నిర్మించాలని, ఒకవేళ అది ఆలస్యమైతే కనీసం వర్షం, ఎండా, చలి నుంచి తట్టుకోవడానికి తాత్కాలిక వసతి గృహాలను తక్షణమే నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయినా స్పందన అంతం త మాత్రమే. కారణమేమిటంటే అభిజిత్ భట్టాచార్యకు పేదలపట్ల ఉన్న విద్వేషమే రాజకీయ నాయకులకు, అధికారులకు సమాజంలోని కొన్ని వర్గా లకు ఉన్నది. పేదల పట్ల, అణగారిన వర్గాలపట్ల జాలి, దయ కాదు; బాధ్యత కలిగి ఉండాలి. అది లేకపోతే, ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ఫ్రెంచి విప్లవాల లాంటి తిరుగుబాట్లు రగిలి, ఆగ్రహజ్వాలలో అమానవీయ సమాజాన్ని అంతం చేసి నూతన, మానవీయ వ్యవస్థకు పునాదులు వేస్తాయి. (మల్లేపల్లి లక్ష్మయ్య) (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
నవగ్రహ దోష పరిహారాలపై విలువైన పుస్తకం
సత్ గ్రంథం పుట్టినప్పటి నుంచి, పోయే వరకు మానవ జీవితం నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుందని, ప్రతిగ్రహమూ జాతకుడికి అది ఉండే స్థానాన్ని బట్టి శుభాశుభాలను అనుభవిస్తుంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అయితే నవగ్రహారాధనతో కష్టాన్ని పోగొట్టుకుని, సుఖాన్ని చిక్కించుకోవచ్చునని కూడా శాస్త్రం చెబుతోంది. పాప గ్రహబాధలు తొలగటానికి జ్యోతిష పండితులు దత్తదాసు ఒక పత్రికలో రాసిన వ్యాసాలను ఆయన తదనంతరం ఆయన శిష్యుడు, పాత్రికేయుడు పామర్తి హేమసుందర్, ‘పాపగ్రహాలు- పరిహారాలు’ పుస్తకంగా తీసుకు వచ్చారు. ఇందులో దీర్ఘకాల వ్యాధులు రావడానికి కారణం, వాటిని తొలగించుకోవడానికి పరిహారాలు, ఏయే నక్షత్రాల వారు ఏయే మంత్రాలను జపించాలి, నవరత్నధారణ ఫలితాలు, వాస్తుదోషాల నివారణ, ఎంచుకున్న రంగంలో ఎదగడానికి ఏం చేయాలి.. వంటి విషయాలను చక్కగా వివరించారు. అయితే అక్షరదోషాల విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే మరింత బాగుండేది. - దోర్బల వి.ఆర్. పాపగ్రహాలు- పరిహారాలు రచన: దత్తదాసు, పుటలు: 108, వెల రూ. 60 ప్రతులకు: భవిష్య పబ్లికేషన్స్ డి 52, మధురానగర్, హనుమాన్ ఆలయం దగ్గర, ఎస్.ఆర్.నగర్, హైదరాబాద్- 500 038 -
సయాటిక
ప్రస్తుతం మానవ జీవితం యాంత్రికంగా మారింది. ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్నవిపర్యయం (పగటి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాల్లో మార్పులు రావటం వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలతో వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యమైంది కటిశూల (నడుమునొప్పి). 90 శాతం మంది తమ జీవితకాలంలో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో చరక, సుశ్రుత, బాగ్బటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటిక)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు. సాధారణ కారణాలు పరిశీలిస్తే.. ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చోవటం, స్థూలకా యం, అధిక శ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయడం, అధిక బరువులను మోయటం, ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక, వంశపారంపర్య వ్యాధులు, రోడ్డు ప్రమాదాల వల్ల నడుము నొప్పి సమస్య వస్తుంది. ఈ కారణాల వల్ల శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్దత, నొప్పి కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే సయాటిక (గుద్రసీవాతము) అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువవుతుంది. నడుముకు సంబంధించిన ఎల్4, ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూస మధ్యగల సయాటిక అనే నరంపై ఒత్తిడి పడటంవల్ల నొప్పి వస్తుంది. డిస్క్లో మార్పులు: ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్లో మార్పులొస్తాయి. డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగి పోవటం వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్లో వాపు వస్తే దాన్లో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంటలతో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనదైతే స్పర్శ హాని కూడా కలగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్తో కాలయాపన చేస్తుం టారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. ఆయుర్వేద చికిత్స: ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స, 2. శోధన చికిత్స. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధచికిత్స ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: దీనివల్ల ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగబెట్టవచ్చు. ఆయుర్వేదంలో పంచకర్మ ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. జాగ్రత్తలు: సరైన పోషకాహారం తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు. డాక్టర్ మనోహర్. ఎం.డీ ఆయర్వేద. స్టార్ ఆయుర్వేద ఫోన్.7416102102 www.starayurveda.com -
పల్లె మహిళ పరిస్థితే బాగుంది..!
ఇంతి పని పట్టణాలు అంటే సౌకర్యాలకు నెలవులు. ఇక్కడ లభించే సౌకర్యాలు మనిషి జీవితంలో సుఖప్రదం చేస్తాయి. ప్రత్యేకించి ఆడవాళ్లకు... పట్టణ ఆవాసం చాలా కష్టాన్ని తగ్గిస్తుంది. పల్లెల్లోని ఆడవాళ్లు ఇంటిపని, వంటపని అంటూ కష్టపడాల్సి ఉంటుంది. పుర మహిళలకు మాత్రం అలాంటి కష్టమేదీ ఉండదు... అనేవి మన మధ్యన సహజంగా వినిపించే అభిప్రాయాలు. పట్టణ, పుర ప్రాంతాల్లోని జీవనశైలిని పరిశీలించి... అక్కడా, ఇక్కడ మహిళలు చేయాల్సిన, చేసే పనులను చూసి ఈ అభిప్రాయానికి వస్తుంటారు. అయితే ఈ అభిప్రాయాలు ఒట్టిభ్రమలు మాత్రమే. పల్లెల్లోని మహిళలతో పోలిస్తే చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లోనూ నివసించే మహిళలకే ఈ కష్టం చాలా ఎక్కువ అని అంటున్నారు భారత ప్రభుత్వ అధికారిక గణాంక సంస్థ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఎస్వో) అధ్యయనకర్తలు. ఎన్ఎస్ఎస్వో చేపట్టిన ఈ అధ్యయనం ప్రకారం పట్టణ, నగరాల్లో నివసించే మహిళలకు ఇంటి పని చాలా భారంగా పరిణమించింది. దాదాపు 64 శాతం మంది మహిళలకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకూ ఏదో విధంగా ఇంటిపనులే కలవరపెడుతున్నాయి. వీరిలో ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు. వీళ్లు అయితే అటు ఆఫీస్ పని, ఇటు ఇంటిపని రెండు భారాలనూ మోయాల్సి వస్తోంది. వీళ్లతో పోలిస్తే పల్లెల్లోని మహిళలే చాలా సుఖంగా జీవిస్తున్నట్టు లెక్క! ఇంతే కాదు అనేక రకాలుగా పరిశీలించి చూసినా... పట్టణ మహిళల కన్నా వ్యవసాయపు పనుల్లో భాగస్వామ్యులు అవుతూ ఇంటిని తీర్చిదిద్దుకొనే పల్లె మహిళల పరిస్థితే బాగుందనేది ఎన్ఎస్ఎస్వో విశ్లేషణ. అదెలా అంటే... పల్లెల్లో ఉండే మహిళకు ఇంట్లోని అత్తగారో, అదే ఊర్లో ఉండే బంధువుల తోడు ఉంటుంది. వాళ్లతో అనుబంధాన్ని బట్టి పనిని షేర్ చేసుకొనే అవకాశం ఉంటుంది. అయితే పట్టణంలోని మహిళకు ఆ అవకాశమే లేదు. ఎవరికి వారుగా బతికే చోట పనులను పంచుకోవడం ఏముంటుంది?! అని అధ్యయనకర్తలు పరిస్థితిని తెలియజెప్పుతున్నారు. 15 యేళ్లు దాటగానే అమ్మాయిలకు ఇంటి పని ఒక బాధ్యత అవుతోందని కూడా అధ్యయనకర్తలు గుర్తించారు. పల్లెల్లోని, పట్టణాల్లోని మహిళలను కలుపుకొని చూస్తే 34 శాతం మంది పనిమనిషి ఉంటే బావుంటుందన్న కోరికను వెలిబుచ్చారు. మిగిలిన వారు మాత్రం తమ ఇంటి పనిని తాము చేసుకొంటేనే తమకు సంతృప్తి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. భారతదేశం మొత్తం మీదున్న పరిస్థితిని పరిశీలించి చూసుకొంటే... 92 శాతం మంది మహిళలకు ఇంటిపని చేయడమే పని. ఇవి భారతీయ మహిళ జీవన చిత్రం గురించి నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ చెప్పిన విషయాలు. -
ఒత్తిడిని అధిగమిస్తేనే జీవితం
మానవ జీవితంలో మానసిక ఒత్తిడి అనేది సహజమే అరుునా.. శృతిమించడం వల్లే సమస్యలు అధికమవుతున్నాయి.. ఎల్కేజీ చదివే చిన్నారి నుంచి తల నెరిసిన తాతయ్య వరకు అందరికీ సమస్యలే. చదువు, ఉద్యోగం, కుటుంబరీత్యా, ఒంటరితనం ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో అనేక సమస్యలపై పోరాడుతున్నవారే. ప్రేమించిన యువతి దక్కలేదనే అక్కసుతో ప్రేమోన్మాదిగా మారడం, అనుకున్నది సాధించలేక పోతున్నాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన, భార్యపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేయడం వంటివి సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మానసిక సమస్యలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మానసిక అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - ముంబై కాలంతో పాటు పరుగెడుతున్న సిటీ లైఫ్లో మానసిక ప్రశాంతత లోపించింది. గతంలో ఇళ్ల వద్ద అమ్మమ్మ, బామ్మ, తాతయ్య, బాబాయి ఇలా పెద్దలనే వారు ఉండేవారు. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు ఇలా చిన్నవాళ్లు కలహించుకున్నా, ఏదైనా సమస్య వచ్చినా ఆదిలోనే పరిష్కరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడంతో ఒత్తిడికి గురవుతున్న వారిని ఓదార్చేవారు లేక మానసిక సమస్యలకు గురవుతున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవల ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఏటా మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే వారోత్సవాల్లో మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు అంటే 16 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో మానసిక వైకల్యం (స్కిజోఫ్రీనియా), నివారణోపాయూలపై డబ్ల్యూహెచ్వో అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. నగర ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు * మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో అధికశాతం మంది డిప్రెషన్కు గురవుతుండగా, మరికొంతమంది పర్సనాలటీ డిజార్డర్స్, లైంగిక సమస్యలు, భాగస్వామితో విభేదాలు, స్మోకింగ్, మద్యపానానికి అలవాటుపడుతున్నారు. * పారానాయిడ్ సైకోట్రిక్ అనే సమస్యకు గురయిన వారికి సకాలంలో చికిత్స అందించనట్లయితే సైకోలుగా మారడం, కుటుంబసభ్యులను హింసించడం, హత్యాయత్నం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సంతోషంగా ఉండాలంటే.. * మానసిక ఒత్తిడిని గురవరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకే పనిని నిరంతరం చేస్తుండటం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. * ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి, మంచిగా ప్రవర్తించండి. అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి. * కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి. ఈర్ష, ద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడటంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. * ఇతరులను చిరునవ్వుతో పలకరించండి.. అభినందించంది.. స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి స్నేహితుల కోసం అన్వేషించి స్నేహం చేయండి. * సమస్య ఏర్పడినప్పుడు దానికి కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సమస్యల వలయంలో చిక్కుకుని డిప్రెషన్కు లోనుకావద్దు. * జీవితంలో ఓటమి కూడా సామాన్యమే. ఓటమి పొందినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి. * పిల్లల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు. తెలియచెప్పండి, పొరపాట్లు సరిదిద్దండి. * మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు. తెలివిగా వీటిని అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం నేర్చుకోండి. * భయం వీడితే జయం మీదే అవుతుంది. భయానికి ఒక కారణం ఉంటుంది. దానిని సరిచేసుకుంటే అది మీకు దూరంగా ఉంటుంది. * ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకుంటే మీరు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు. * పిల్లలతో సరదాగా గడపండి.. మాట్లాడండి. యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండండి. -
అంకెల పొంకం
వివరం: మన దగ్గర ముగ్గురు కలిసి వెళ్లకూడదంటారు. అదే స్వీడన్లో మూడు శుభానికి సంకేతం. ‘మంచివన్నీ మూడింటి బృందంగా వస్తాయి’ అని అక్కడి సామెత. ఇంగ్లీషు భాష ఇంతగా ఆదరణ పొందడానికి కారణం, అందులోని 26 అక్షరాలట! 2+6=8. ఎనిమిది పాశ్చాత్యులకు అదృష్టసంఖ్య. ఇంతకీ ఈ ‘ఎనిమిది’ అంటే ఏమిటి? కుక్కల్లాగా, పిల్లుల్లాగా అవి కనబడతాయా? నిజానికి, ఎనిమిదిగా దానికి ఏ విలువా లేదు. కానీ ‘ఎనిమిదింటిని’ చూపడానికి ఒక సంకేతంగా నిలబడుతోంది కాబట్టి, ఒక విలువను సంతరించుకుంది. మనుషులు అంకెలను ఎప్పుడు తమ జీవితంలో భాగంగా చేసుకున్నారో అప్పుడే కొన్నింటి మీద ఇష్టమూ, కొన్నింటి మీద అయిష్టమూ పెంచుకున్నారు. వాటిల్లోని అర్థం, పరమార్థం ‘దేవుడికే’ తెలియాలి. ఎందుకు దేవుడికే తెలియాలి అంటే అంకెల్ని కూడా దేవుడే సృష్టించాడని కూడా ఒక నమ్మకం ఉండటం వల్ల! మనిషిది మొదటినుంచీ, అంకెలతో ప్రేమ-ద్వేష సంబంధమే. అంకెలకు ఉనికిని ఇచ్చినప్పటినుంచీ ఇది కొనసాగుతూనే ఉంది. కొన్నింటిని నమ్ముతాడు. కొన్నింటిని భయంగా చూస్తాడు. ఆ చొక్కా వేసుకుంటే మంచి జరగదని విశ్వసించడానికి, ‘మరింత కాకతాళీయత’ లాంటిదేదో కారణం అయ్యుండాలి. అయినా ‘రిస్కు’ తీసుకోవడం ఎందుకు? అన్న ధోరణిలో వీటిల్లో విశ్వాసాన్ని పెంచుకున్నాడు. అంకెల్లో జీవితం మానవ జీవితం అంకెలతో ముడిపడి ఉంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇంటి చిరునామా, వాహనం నెంబరు, ఫోన్ నెంబరు... అన్నింటా మనకి సంఖ్యలతో సంబంధం ఉంది. ఈ అంకెలు మనిషి మీద చూపగల ప్రభావాన్ని తెలియపరిచేదే న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం). ఇందులో కబాలా, పైథాగరస్, చాల్దియన్ అనే మూడు రకాలున్నాయి. అన్నింట్లోకీ చాల్దియన్ పద్ధతి పురాతనమైంది. అయితే, గ్రీకు శాస్త్రజ్ఞుడు పైథాగరస్ న్యూమరాలజీని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన పేరుమీదున్నదే ఎక్కువగా వాడుతున్నాం. న్యూమరాలజీ భారతదేశంలో కంటే, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి పాశ్చాత్య దేశాలు, ఆసియా దేశాలైన చైనా, మలేషియాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. దైనందిన జీవితంలో వారు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బైబిల్లోనూ పేర్ల మార్పు వర్ణమాలలో (ముఖ్యంగా ఆంగ్ల వర్ణమాల) ఉన్న అక్షరాలకు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య ఇవ్వటం జరిగింది. ఎ=1, బి=2, సి=3, వై=25, జడ్=26. అక్షరాలకు ఉన్న అంకెల వల్ల పేర్లకు కూడా సంఖ్య వస్తుంది. దానినే నామ సంఖ్య అంటారు. మానవ జీవితంపై ప్రధానంగా నామ సంఖ్య, జన దిన సంఖ్యల ప్రభావం ఎక్కువ. జన్మ తేదీకి, నామ సంఖ్యకు సఖ్యత ఉన్నట్లయితే, ఆ వ్యక్తి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. జన్మ తేదీని మార్పు చేసుకోలేం కాబట్టి, దానికి అనుకూలంగా నామ సంఖ్యను మార్పుచేసినట్లయితే, మంచి ఫలితాలు వస్తాయని ఈ శాస్త్రం చెబుతుంది. ఇది పురాతనమైన శాస్త్రం. పవిత్ర గ్రంథమైన బైబిల్లో కూడా పేరు మార్పు వలన కలిగే ప్రయోజనం గురించి తెలియజేయటం జరిగింది. దైవ సందేశానుసారంగా అబ్బరం తన పేరును అబ్రహాంగా, సారా (Sara) తన పేరును సారాః (Sarah)గా, జాకబ్ తన పేరును ఇజ్రాయెల్గా మార్పు చేసుకోవటం లాంటి ఉదంతాలు వివరింపబడ్డాయి. అంకెలు- దేశాలు ప్రాచీన కాలం నుంచీ వివిధ దేశాల్లో అంకెల గురించిన బలమైన విశ్వాసాలున్నాయి. ఒకటి నుంచే ప్రతీ అంకె పుడుతుంది కాబట్టి, ఇది అన్ని అంకెలకీ మూలంగా భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పదిగా పరిగణిస్తారు. 1+1=2, 1+2=3. అందుకే, ఒకటిని దేవుడిగానూ, సృష్టిగానూ చూస్తారు. అదే చైనాలో సున్న పూర్ణ సంఖ్య కాబట్టి, దాన్ని గొప్పదిగా చూస్తారు. డబ్బును సంఖ్యాపరంగా తెలియజేసినప్పుడు అది ప్రధానంగా సున్నాతోనే ముగుస్తుంది. రూ. 10, 20, 50, 100, 500, 1000. చైనీయులు 2ను మంచి సంఖ్యగా భావిస్తారు. ‘మంచి విషయాలు జంటగా వస్తాయి’ అనేది చైనావాళ్ల సామెత. అదే స్వీడన్ వాళ్లకు మంచి విషయాలు మూడింటిగా వస్తాయి. ఇటలీ వాళ్లకు కూడా 3 అదృష్ట సంఖ్య. తక్కువ భుజాలతో త్రిభుజాన్ని, అంటే ఒక పర్ఫెక్ట్ షేప్ని ఏర్పరుస్తుంది కాబట్టి మూడు వాళ్లకు ప్రత్యేకమైన అంకె. చైనా భాషలో 3 ఉచ్ఛారణ ‘పుట్టుక’ అనే శబ్దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్లకూ ఇది మంచి అంకెనే! 4ను చైనీయులు, జపనీయులు, కొరియన్లు చాలా చెడు సంఖ్యగా భావిస్తారు. దీని ఉచ్ఛారణ వారి భాషలో ‘మరణం’ అనే శబ్దానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ సంఖ్యను వారు వాడరు. నోకియా సెల్ఫోన్లు 4 సంఖ్యతో ప్రారంభం కావు. కొన్ని తూర్పు ఆసియా దేశాల్లోని భవనాలలో 4వ అంతస్తు ఉండదు. 14, 24, 34 కూడా ఉండవు. 50 అంతస్తుల భవనం అంటే అందులో నిజంగా 35 అంతస్తులు మాత్రమే ఉంటాయి. విచిత్రంగా, జర్మనీలో 4 లక్కీ నంబర్. దీనికి వాళ్లు చెప్పే ప్రధాన కారణం క్లోవర్కు నాలుగు ఆకులుంటాయి! స్వర్గంలోంచి ఈవ్ వెంట తెచ్చుకున్నది క్లోవర్నే! అయితే, మూడు ఆకుల క్లోవర్లు కూడా ఉంటాయిగానీ వాటిని లెక్కలోకి తీసుకోరు. చాలా దేశాల్లో 2ని స్త్రీగానూ, 3ను పురుషుడిగానూ రెండూ కలిపితే వచ్చే 5ని వివాహానికి ప్రతీకగానూ భావించడం ఉంది. ఇంకో నమ్మకం ప్రకారం 3ని పురుషుడికీ, 4ను స్త్రీకీ ప్రతీకగా చూస్తారు. అన్ని సరిసంఖ్యల్నీ స్త్రీగానూ, అన్ని బేసి సంఖ్యల్నీ పురుషుడిగానూ చూడటమూ ఉంది. ఇందులో మంచిదేది? చెడ్డదేది? రష్యావాళ్లు బేసివన్నీ అదృష్టాన్నీ, సరివన్నీ దురదృష్టాన్నీ తెస్తాయని నమ్ముతారు. చైనీయుల నమ్మకం ప్రకారం, ఐదు పంచభూతాలకు ప్రతీక (భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి). దాన్ని సర్వ నామమైన ‘ఐ (ఐ)’లా ఉచ్ఛరిస్తారు. కాబట్టి మంచి సంఖ్యగా భావిస్తారు. అలాగే, 6 వాళ్లకు సంపదను సూచిస్తుంది. దాని ఉచ్ఛారణ ‘ప్రవాహం’ శబ్దానికి దగ్గరగా ఉంటుంది. అందువలన ఇది వ్యాపారానికి మంచిదిగా భావిస్తారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో 7 అదృష్ట సంఖ్య. దేవుడు ఏడు రోజుల్లో ఈ సృష్టిని చేశాడని దాన్ని శుభసంకేతంగా భావిస్తారు. చైనీయులు కూడా ఈ సంఖ్యను బంధానికి చిహ్నంగా భావిస్తారు. చైనాభాషలో దీని ఉచ్ఛారణ ‘లేచుట’, ‘జీవితం’ అనే శబ్దాలకు దగ్గరగా ఉంటుంది. చైనాలోనూ పాశ్చాత్య దేశాలలోనూ అదృష్ట సంఖ్యగా భావింపబడే ఏకైక సంఖ్య 7. కొరియా, జపాన్, చైనాలో 8 చాలా శుభప్రదమైనది! తిరగేసినా ఈ అంకె రూపు మారదు, అన్ని అంకెలూ కిందికి అంతమవుతే, ఎనిమిది మాత్రం ఊర్ధ్వముఖంగా ముగుస్తుంది. అందుకే, వారికి దీని మీద వారికి ఎక్కువ గురి. అయితే, హిందువులు జ్యోతిష పరంగా 8, 9 (1+8 = 9) సంఖ్యలను శుభ సంఖ్యలుగా పరిగణించరు (మినహాయింపుల్తో). అష్టమి, నవమి దినాలలో ప్రయాణం చేయరు. ఇక్కడ 8 శనికి చిహ్నం. 9 నార్వే వాళ్లకు మంచిది. జపాన్ వాళ్లకు మంచిది కాదు. ఒక మనిషిని తొమ్మిది మంది నిందిస్తున్నారంటే అది సరైన నిందే అయ్యుంటుందట! 12ను దైవ సంబంధమైనదిగా అన్ని మతాలవారు భావిస్తారు. 12 నెలలు, 12 గంటలు (పగలు, రాత్రి వేరుగా), ఒలంపస్లో 12 మంది దేవతలు, ఇజ్రాయెల్లో 12 తెగలు, క్రీస్తు 12 మంది శిష్యులు, మహమ్మద్ ప్రవక్త 12 మంది వారసులు, 12 రాశులు, పుష్కరం (12 సంవత్సరాలు) మొదలైనవి దీనికి కారణం. 13, శుక్రవారం పాశ్చాత్యుల సెంటిమెంటు ప్రకారం, 13 అతి ప్రమాదకరమైనది. గ్రెగెరియన్ క్యాలెండర్లో 13వ రోజు మంచిది కాదు. ఈ నమ్మకం ఏసుక్రీస్తు కాలంలో ప్రారంభం అయ్యిందంటారు. ద లాస్ట్ సప్పర్ జరిగినప్పుడు మొత్తం 13 మంది ఆ విందులో పాల్గొన్నారు. ఇది గుడ్ ఫ్రైడే ముందురోజు రాత్రి జరిగింది. మరుసటిరోజు ఏసుక్రీస్తుని శిలువ వేయటం జరిగింది. అయితే, 19వ శతాబ్దానికి ముందు ఈ నమ్మకం ఉన్నట్టుగా ఎలాంటి ఆధారం లేదని కొందరి వాదన. ఇటాలియన్ సంగీత విద్వాంసుడు గియాచినో రోసినీ, 1868 నవంబర్ 13, శుక్రవారం నాడు చనిపోయిన తరువాత ఈ నమ్మకం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నమ్మకం ప్రబలడానికి కారణం, 13 మంచి సంఖ్య కాదు. శుక్రవారం చెడు దినం (క్రీస్తు చనిపోయిన దినం). అందుకే పాశ్చాత్య దేశాల్లోని కొన్ని భవనాలలో 13వ అంతస్తు ఉండదు. ఫార్ములా వన్ కార్ల రేసుల్లో కూడా కార్లకు 13 లేకుండా జాగ్రత్తపడతారు. అయితే, మన దేశంలో 13 (త్రయోదశి) ను మంచి తిథిగా భావిస్తారు. వైద్య పరిభాషలో 13వ తేదీ శుక్రవారం పట్ల భయాన్ని PARASKAVEDEKATRIAPHOBIA అంటారు. గ్రీకు భాషలో ‘PARASKEVI’ అంటే శుక్రవారం, ‘ఈఉఓఅఖీఖఐఅ’ అంటే 13. స్పానిష్ భాష మాట్లాడే దేశాల్లో 13వ తేదీ మంగళవారం చెడు దినంగా భావిస్తారు. గ్రీకులు కూడా దీన్ని చెడు దినంగా పరిగణిస్తారు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం మంచిరోజు కాదంటారు. ఇటలీ వాళ్లకు 17వ తేదీ శుక్రవారం చెడు దినం. 1993లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన పరిశోధనా పత్రం ప్రకారం, శుక్రవారం 13వ తేదీ నాడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. పాశ్చాత్య దేశాల్లోని కొన్ని భవనాలలో 13వ అంతస్తు ఉండదు. ఫార్ములా వన్ రేసుల్లో కూడా కార్లకు 13 సంఖ్య లేకుండా జాగ్రత్తపడతారు. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది 35వ ఏట. 3+5=8. శ్రీకృష్ణుడు జన్మించింది అష్టమి నాడు. అందువల్ల 8ని అదృష్టసంఖ్యగా భావించేవాళ్లు కొందరుంటే, మరోవైపు 8ని శనికి చిహ్నంగా చూసేవాళ్లూ ఉన్నారు.చైనాలో 2003 లో అన్నీ ‘8’లు ఉన్న ఫోన్ నంబర్ 2,80,000 డాలర్లకు అమ్ముడుపోయింది. 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ 8/8/8 తేదీన ఉదయం 8 గంటల, 8 నిమిషాల, 8 సెకెన్లకి ప్రారంభం అయ్యాయి. అక్కడ హోటళ్లు, షాపుల్లోని ధరల పట్టికలో 8 ఎక్కువగా కనిపిస్తుంది (38, 58, 88). మలేషియాలో ఉన్న పెట్రినాస్ ట్విన్ టవర్స్ 88 అంతస్తులు కలిగి ఉంది.కొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భవనాలలో 4వ అంతస్తు ఉండదు. 14, 24, 34 కూడా ఉండవు. విచిత్రంగా, జర్మనీలో 4 లక్కీ నంబర్. రష్యావాళ్లు అన్ని సరిసంఖ్యల్నీ స్త్రీగానూ, అన్ని బేసి సంఖ్యల్నీ పురుషుడిగానూ విశ్వసిస్తారు. బేసివన్నీ అదృష్టాన్నీ, సరివన్నీ దురదృష్టాన్నీ తెస్తాయంటారు. 7 వర్గం 49 (7ఁ7). ఈ సంఖ్యను చైనా జానపదాల్లోనూ, బౌద్ధుల కర్మకాండలోనూ ఎక్కువగా నమ్ముతారు. వ్యక్తి మరణించినా అతని ఆత్మ 49 రోజులు ఆ పరిసరాల్లోనే ఉంటుందని వీరి విశ్వాసం. అందుకే చైనీయులు వ్యక్తి మరణించిన 49 రోజులకి మరలా కర్మకాండ నిర్వహిస్తారు. ఈజిప్టువాళ్లకు 2, 3, 4, 7 అదృష్టసంఖ్యలు. ఆఖరికి వీటిని కలుపగా, గుణించగా వచ్చినవి కూడా శుభాన్నిచ్చేవే. 19కీ ఖురాన్కీ సంబంధం పవిత్ర ఖురాన్కు, న్యూమరాలజీకి అవినాభావ సంబంధం ఉంది. ఉదాహరణకు పవిత్ర ఖురాన్లో 114 అధ్యాయాలు (19ఁ6) ఉన్నాయి. అందులోని మొదటి పవిత్ర వాక్యం ‘బిస్మిల్లా’లో 19 అక్షరాలు ఉంటాయి (అరబిక్). గ్రంథంలోని మొత్తం పంక్తుల సంఖ్య 6346 (19ఁ334). బిస్మిల్లా అనే పదం 114 సార్లు (19ఁ6) వస్తుంది. మొదటి ప్రకటనలో 19 పదాలు ఉంటాయి. దానిలో 76 అక్షరాలు ఉంటాయి (19ఁ4). అల్లా నామం 2,698 సార్లు వినిపిస్తుంది (19ఁ142). అలాగే, ‘అల్లా హో అక్బర్’ నామ సంఖ్య 289 (2+8+9 = 19). ఈ విధంగా పవిత్ర ఖురాన్కు 19 సంఖ్యకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, ఇస్లాం మతస్థులు 19ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. విశ్వాసమే బలం గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సెంటిమెంటు ఏర్పడుతుంది. భారతదేశంలో కూడా సెంటిమెంట్లు ఉన్నాయి. కానీ అవి న్యూమరాలజీ కన్నా శకున శాస్త్ర పరంగా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కడికైనా బయల్దేరేముందు, ఎవరైనా తుమ్మితే ఆగిపోతాం. నిండు కుండ ఎదురుగా వస్తే శుభ పరిణామమని భావిస్తాం. సంఖ్యల యొక్క ప్రభావం, కేవలం మనుషులపై మాత్రమే కాదు. అన్ని జీవుల మీద, సంస్థల మీద, స్థలాల మీద, రాష్ట్రాల మీద, దేశాల మీద కూడా ఉంటుంది. ఆ దేశం ఆవిష్కరణ దినం, ఆ దేశం పేరు, దాని నామ సంఖ్య ప్రకారం, ప్రభావం మారుతూ ఉంటుంది. 13 సంఖ్య పాశ్చాత్య దేశాల్లో చెడు ప్రభావం చూపినా మనదేశంలో మంచి ప్రభావం చూపుతుంది. ఇలాంటి విశ్వాసాల గురించిన హేతుబద్ధత గురించి చర్చించటంలో ప్రయోజనం లేదు. ఎందుకంటే సెంటిమెంటు అనేది మనసుకీ, వ్యక్తిగత అనుభవాలకీ సంబంధించినది. కంటికి కనపడనిది, భావోద్వేగానికి సంబంధించినది! - మొహమ్మద్ దావూద్ -
మాయాపటం
నిజాలు దేవుడికెరుక: మనిషి జీవితం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అంటుంటారు పెద్దలు. అసలు నమ్మకం అంటే ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నదని అనుకోవడమా? లేనిదాన్ని కూడా ఉన్నదని ఒప్పుకోవడమా? మొదటి ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. కానీ రెండో ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ తెలియలేదు. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో విషయాలు నమ్మదగనట్టుగా, అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. ‘‘మెర్సీ... ఓసారి ఇలారా’’... ఇంట్లోకి వస్తూనే భార్యను పిలిచాడు వివియన్. ‘‘అబ్బా... ఎప్పుడూ ఏదో ఒక విధంగా తొందర పెడుతూనే ఉంటావు నువ్వు’’... ముద్దుగా విసుక్కుంటూ హాల్లోకి వచ్చింది మెర్సీ. ‘‘అంత విసుక్కోకోయ్... ప్రతిదీ నీకు చెప్పకుండా ఉండలేకపోవడం నా బలహీనత. ఏం చెయ్యమంటావ్ చెప్పు!’’ ‘‘ఆ చాలు కాకా పట్టింది. ఏంటి విషయం’’ అంది మెర్సీ నవ్వుతూ. ‘‘ఓసారి దీన్ని చూడు’’ అంటూ తన చేతిలోని ప్యాకెట్ని చూపించాడు. ‘‘ఏంటది’’ అందామె ఆసక్తిగా. తన చేతిలో ఉన్నదానికి చుట్టివున్న రంగు కాగితాన్ని జాగ్రత్తగా విప్పాడు వివియన్. ‘‘ఇప్పుడు చూడు’’ అన్నాడు ఆమెవైపు చూస్తూ. అతడి చేతిలో ఉన్న పెయింటింగ్ని చూస్తూనే... ‘‘వావ్, సూపర్బ్గా ఉంది వివ్’’ అంది సంబరంగా. ‘‘కదా... అందుకే నిన్ను పిలిచాను’’ అంటూ భార్య చేతికి దాన్ని అందించాడు. అపురూపంగా అందుకుందామె. దాన్ని శ్రద్ధగా పరిశీలించింది. ఓ చిన్నపిల్లాడు... లేత నీలం రంగు చొక్కా, ఆలివ్ రంగు నిక్కరు, అదే రంగు బూట్లు వేసుకున్నాడు. మూసివున్న తలుపు ముందు నిలబడివున్న ఆ బుజ్జిగాడి పక్కన ఓ ఆడపిల్ల ఉంది. ‘‘చాలా బాగుంది వివ్... దీన్ని చూసిందంటే రోజీ ఎగిరి గంతులేస్తుంది’’ అని... ‘‘రోజీ’’ అంటూ కేక పెట్టింది. ఆ పిలుపు వింటూనే లోపలి నుంచి పరుగులు దీస్తూ వచ్చింది నాలుగున్నరేళ్ల రోజీ. కూతుర్ని దగ్గరకు తీసుకుని.. ‘‘చూడు డాడీ ఏం తెచ్చారో’’ అంది పెయింటింగ్ని చూపిస్తూ. దాన్ని చూస్తూనే ‘‘బాగుంది మమ్మీ, ఇది నాకేనా’’ అంది ఆనందంగా. ‘‘నీకే డియర్. దీన్ని నీ రూమ్లోనే తగిలిద్దాం పద’’ అన్నాడు వివ్ కూతుర్ని ఎత్తుకుంటూ. ముగ్గురూ కలిసి రోజీ గదిలోకి వెళ్లారు. పాప మంచానికి ఎదురుగా ఉన్న గోడకి ఆ పెయింటింగ్ని తగిలించారు. కానీ ఆ పెయింటింగ్ తమ సంతోషాన్ని త్వరలోనే హరించబోతోందని వారికప్పుడు తెలియదు! మర్నాడు ఉదయం... ‘‘మమ్మీ...’’ కూతురి అరుపు వినగానే చేతిలో ఉన్న గిన్నెను వదిలేసింది మెర్సీ. గాజు గిన్నె నేలమీద పడి భళ్లున బద్దలయ్యింది. గాజు ముక్కలు గుచ్చుకుంటాయేమోనన్న ధ్యాస కూడా లేకుండా రోజీ గదికి పరుగుదీసింది మెర్సీ. రోజీ మంచం మీద కూర్చుని ఉంది. పెద్దగా ఏడుస్తోంది. కంగారుపడిపోయింది మెర్సీ. ‘‘ఏమైంది బేబీ... ఏమైనా కల వచ్చిందా?’’ అంది గుండెలకు హ త్తుకుంటూ.‘‘మమ్మీ... మమ్మీ... ఆ పాప, ఆ బాబుని చంపేస్తోంది’’ అంది కంగారుగా.అర్థం కాలేదు మెర్సీకి. ‘‘పాప బాబుని చంపేస్తోందా? ఏ పాప.. ఏ బాబుని’’ అంది అయోమయంగా. ‘‘అదిగో... ఆ పాపే, బాబుని చంపేస్తోంది’’ అంటూ పెయింటింగ్ వైపు చూపించింది రోజీ. భయంతో వెక్కిళ్లు వచ్చేస్తున్నాయి. కచ్చితంగా కలగని ఉంటుందని అనుకుంది మెర్సీ. ‘‘అవునా... నువ్వేం భయపడకు. అలా చేయొద్దని ఆ పాపకు నేను చెబుతాలే. సరేనా’’ అంది పాప కళ్లు తుడుస్తూ. సరేనన్నట్టు తలూపింది రోజీ. కానీ మర్నాడు ఉదయం కూడా అచ్చు అదే జరిగింది. నిద్రలేచి ఏడుస్తోన్న రోజీ దగ్గరకు వెళ్తే ముందురోజు చెప్పిన కథే చెప్పింది. ఒకే కల వరుసగా ఎందుకొస్తుందో అర్థం కాక కలవరపడింది మెర్సీ. విషయాన్ని వివియన్కు చెప్పింది. ‘‘అది చిన్నపిల్ల... ఏ టీవీలోనో ఏదో చూసి జడుసుకుని ఉంటుంది. ఒక పని చెయ్. నువ్వీ రోజు తనతోనే పడుకో’’ అన్నాడు వివియన్. సరేనంది మెర్సీ. ఆ రాత్రి కూతురి పక్కనే పడుకుంది. పాపని నిద్రపుచ్చేసి తనూ నిద్రలోకి జారుకుంది. మాంచి నిద్రలో ఉండగా పాప ఏడుపు వినిపించినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచింది మెర్సీ. కానీ రోజీ ప్రశాంతంగా నిద్రపోతోంది. ఏడుపు మాత్రం వినిపిస్తూనే ఉంది. పైగా అంతకంతకూ ఎక్కువవుతోంది. ఆమెకి తెలిసి చుట్టుపక్కల ఇళ్లలో కూడా చిన్నపిల్లలు ఎవరూ లేరు. మరి ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తు న్నట్టు?! ఆమె గుండెల్లో దడ. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ గదంతా పరికించి చూసింది. ఆమె కళ్లు ఎదురుగా గోడకు వేళ్లాడుతోన్న పెయింటింగ్ మీద పడ్డాయి. రెండు క్షణాలు దానివైపే తీక్షణంగా చూసింది మెర్సీ. అంతే... ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే... ఎందుకంటే పెయింటింగ్ ఖాళీగా ఉంది. అందులో పిల్లాడు కానీ, వాడి పక్కనే ఉండాల్సిన అమ్మాయి కానీ లేదు! తను చూస్తున్నది నిజమో కాదో ఒక్క క్షణం అర్థం కాలేదు మెర్సీకి. కళ్లు నులుముకుని మళ్లీ చూసింది. తాను చూసింది ముమ్మా టికీ నిజమే. ఏం జరుగుతోందసలు?గబగబా మంచం దిగింది. పాపను తీసుకుని బయటకు పరుగుదీసింది. అప్పటికింకా ఆఫీసు పని చూసుకుంటూనే ఉన్నాడు వివియన్. పాపతో కంగారుగా వచ్చిన మెర్సీని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘ఏమైంది’’ అన్నాడు ఆతృతగా. ‘‘అక్కడ... ఎవరో ఏడుస్తున్నారు. చూస్తే ఎవరూ లేరు. పెయింటింగ్లో పిల్లాడు కానీ, పాప కానీ లేదు. ఖాళీగా ఉంది’’. అయోమయంగా చూశాడు వివియన్. ఆమె చెప్పేదేంటో అస్సలు అర్థం కాలేదు. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు’’ అంటూ పాప గదిలోకి నడిచాడు. అతడికే ఏడుపూ వినిపించడం లేదు. పెయింటింగ్ కూడా మామూలుగానే ఉంది. మెర్సీ భ్రమపడి ఉంటుందేమో అనుకున్నాడు. ధైర్యం చెప్పాడు. కానీ అతడి గుండె జారిపోయే సంఘటన ఒకటి కొన్ని రోజుల తర్వాత జరిగింది. ఆ రోజు రాత్రి మెర్సీ, పాప త్వరగా నిద్రపోయారు. వివియన్ చాలాసేపు టీవీ చూశాడు. కళ్లు మూతలు పడుతుండటంతో టీవీ ఆపి లేచాడు. గదిలోకి వెళ్లబోతుండగా రోజీ గదిలోంచి ఏవో శబ్దాలు వినిపించాయి. దాంతో అటుగా నడిచాడు. లోపలికి అడుగు పెడుతూనే అతడి ఒళ్లు ఝల్లుమంది. కిటికీ దగ్గర ఇద్దరు పిల్లలు నిలబడివున్నారు. అచ్చు... పెయింటింగ్లో మాదిరిగానే. కాళ్లు వణికాయి వివియన్కి. వెంటనే పెయింటింగ్ వైపు చూశాడు. అది ఖాళీగా ఉంది. భయంతో వెన్నులోనుంచి దడ పుట్టింది. మళ్లీ కిటికీ వైపు చూశాడు. ఈసారి పిల్లలు లేరు. ఏమయ్యారా అని చూస్తే పెయింటింగ్లో ఉన్నారు. అది ఎప్పటిలాగే ఉంది. అప్పుడర్థమయ్యింది వివియన్కి... మెర్సీ చెప్పేదంతా నిజమేనని. ఆ పెయింటింగ్లో ఏదో మాయ ఉందని, అది ఇంట్లో ఏదో అలజడి సృష్టిస్తోందని. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఆ పెయింటింగ్లోని పిల్లాడు వివియన్కి అక్కడక్కడా కనిపించాడు. నిజానికి చిత్రంలో బాబు పక్కన ఉన్నది పాప కాదు, పాప బొమ్మ. అయినా కూడా ఇంట్లో ఒక పాప అక్కడక్కడా కనిపించి మాయమవుతూ ఉండేది. పైగా ఒక్కోసారి ఆమె తుపాకీతో బాబుని తరుముతూ ఉండేది. వివియన్కి, మెర్సీకి, రోజీకి... అందరికీ కనిపించారు వాళ్లు. మెర్సీ హడలిపోయేది. పాప జడుసుకుని జ్వరం తెచ్చుకునేది. దాంతో ఆ పెయిం టింగ్ని తమ నుంచి దూరం చేయాలనుకున్నాడు వివియన్. దాన్ని తీసుకెళ్లి బయట పారేశాడు. అక్కడితో వారికి పీడ విరగడయ్యింది. కానీ ఆ పీడ ఆ తర్వాత చాలామందికి అంటుకుంది. ఎందరినో భయభ్రాంతులకు గురి చేసింది. అసలింతకీ ఆ పెయింటింగ్ ఎక్కడిది? ఎందుకిలా అందరినీ భయపెడుతోంది? ఎందరికో నిద్ర లేకుండా చేసిన ఆ చిత్రాన్ని బోస్టన్కు చెందిన బిల్ స్టోన్హామ్ అనే చిత్రకారుడు చిత్రించాడు. 1972లో అతడి మొదటి భార్య రాన్... ‘హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్’ పేరుతో ఓ కవిత రాసింది. వెంటనే ఆ కవిత స్ఫూర్తితో ఈ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నటుడు జాన్ మార్లీ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుక్కున్నాడు. తర్వాత అతడు దాన్ని మరో వ్యక్తికి అమ్మేయడంతో ఆ పెయింటింగ్ చేతులు మారడం మొదలైంది. చివరికి ఎవరి దగ్గరకు చేరిందో తెలియకుండా పోయింది. 2000వ సంవత్సరంలో హఠాత్తుగా ఓ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యింది. ఒక వ్యక్తి ఉన్నట్టుండి ‘ద హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్’ పెయింటింగ్ను అమ్ముతానంటూ బేరం పెట్టాడు. మొదట చాలామంది కొనడానికి ఆసక్తి చూపిం చారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. ఎందుకంటే అతగాడు ఆ పెయింటింగ్ కొనుక్కున్నవారికి ఎలాంటి వింత అనుభవాలు ఎదురవుతాయో ఏకరవు పెట్టాడు. (అతడు చెప్పిన వాటినే కథనంగా అందించాం). అది చదివి అందరి గుండెలూ గుభేల్మన్నాయి. పైగా పెయింటింగ్లోని పిల్లలు బయటకు వచ్చినప్పుడు తీసిన ఫొటోల్ని నెట్లో అప్లోడ్ చేశాడా వ్యక్తి. వాటిని చూశాక ఎవ్వరూ చిత్రాన్ని కొనడానికి ముందుకు రాలేదు. చివరికి మిషిగన్కు చెందిన ఓ గ్యాలరీ యజమాని స్మిత్ దాన్ని కొనుక్కున్నాడు. గ్రాండ్ ర్యాపిడ్స్ నగరంలో ఉన్న అతడి గ్యాలరీలో ఆ పెయింటింగ్ ఇప్పటికీ ఉంది. గ్యాలరీకి వచ్చేవాళ్లంతా ఏవైనా వింతలు జరుగుతుందేమోనని గంటలపాటు ఆ పెయింటింగ్ వైపే చూస్తూంటారు. స్మిత్ కూడా చాలాసార్లు దాన్ని పరిశీలించాడు. కానీ తనకు అలాంటివేమీ కనిపించలేదంటాడు. మరి ఈ పెయింటింగ్ గురించి దాన్ని అమ్మిన వ్యక్తి చెప్పిన మాటల సంగతేంటి? అవన్నీ అబద్ధాలా? మూఢనమ్మకాలా? పుకార్లా? ఆ కథలు ఎలా పుట్టుకొచ్చాయి? ఒకవేళ నిజం కాదనుకుంటే పెయింటింగ్లో మార్పులు జరుగుతున్నప్పుడు తీసిన ఫొటోల సంగతేంటి? అవి కూడా కల్పితాలేనా? ఏమో... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి -
దేహాన్ని, మనసును సేదతీర్చే.. స్పా థెరపిస్ట్
ఆధునిక యుగంలో మనిషి జీవితం ఒత్తిళ్లమయం. క్షణం తీరిక లేని ఉరుకుల పరుగుల కాలంలో జీవనం యాంత్రికంగా మారిపోయింది. శరీరం, మనసు అలసిపోతున్నాయి. ఎప్పటికప్పుడు పునరుత్తేజం పొందితేనే ఆరోగ్యం, ఆనందం చేకూరుతాయి. అలసిన దేహాన్ని, మనసును సేదతీర్చే నిపుణులే.. స్పా థెరపిస్ట్లు. దేశవిదేశాల్లో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. స్పా థెరపీ. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో థెరపిస్ట్లకు చేతినిండా అవకాశాలు లభిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో 6 లక్షల మంది కావాలి స్పా థెరపీ ప్రధాన లక్ష్యం.. మనసు, దేహం, ఆత్మల మధ్య సమతూకం సాధించడం. ఇందులో హోలిస్టిక్ థెరపీ, బ్యూటీ థెరపీ, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ వంటి విభాగాలుంటాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) నివేదిక ప్రకారం.. మనదేశంలో వచ్చే ఐదేళ్లలో అదనంగా 6 లక్షల మంది స్కిల్డ్ స్పా థెరపిస్ట్లు అవసరం. గత పదేళ్లుగా ఈ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నైపుణ్యం గల థెరపిస్ట్ల కొరత వేధిస్తోంది. స్పా థెరపీ కోర్సులు అభ్యసిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు లోటు ఉండదు. తగిన అనుభవం ఉన్నవారికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. నేడు అన్ని నగరాల్లో స్పాలు వెలుస్తున్నాయి. దేశ విదేశాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. వనరులు అందుబాటులో ఉంటే సొంతంగా స్పాను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పా థెరపీలో అనుకూలమైన పనివేళలు ఉంటాయి. సాధారణంగా క్లయింట్లు ఎక్కువగా సాయంత్రం వేళలో వస్తుంటారు. ఇతర రంగాల తరహాలో ఇందులో ఎక్కువ ఒత్తిళ్లు ఉండవు. ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. మెరుగైన పనితీరుతో క్లయింట్లకు సంతృప్తి కలిగిస్తే మంచి ఆదాయం అందుతుంది. కెరీర్లో పేరు తెచ్చుకోవడానికి, వేగంగా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అర్హతలు: మనదేశంలో విద్యాసంస్థలు స్పా థెరపీపై సర్టిఫికెట్, డిప్లొమా, ఫౌండేషన్, స్పా మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి స్వల్పకాలిక కోర్సులే. పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివినవారు వీటిలో చేరొచ్చు. వేతనాలు: క్వాలిఫైడ్ స్పా థెరపిస్ట్లకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం లభిస్తుంది. ఐదేళ్లపాటు పనిచేసి తగిన అనుభవం సంపాదిస్తే నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. మేనేజ్మెంట్ స్థాయికి చేరుకుంటే నెలకు 30 వేల నుంచి రూ.80 వేల దాకా ఆర్జించొచ్చు. స్పా థెరపీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఇస్పా ఇంటర్నేషనల్ స్పా అకాడమీ-కొచ్చిన్ వెబ్సైట్: www.ispaa.com ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ స్పా థెరపీస్ వెబ్సైట్: www.elitebeautyschool.co.nz లెయిర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పా థెరపీ వెబ్సైట్: www.lairdinstitute.com ఆనంద స్పా ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ వెబ్సైట్: www.anandaspainstitute.com ఆరోగ్య థెరపీలో అవకాశాలెన్నో.. ‘‘శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉండగలం. ఒత్తిడి, నొప్పులు వంటివి మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయుర్వేద చికిత్సలో ఉన్న మార్గమే స్పా థెరపీ. ఇది కేవలం శరీరాన్ని మర్దనం చేయడమే కాదు.. రక్తప్రసరణ సజావుగా సాగేందుకు అనువైన శాస్త్రీయ విధానంతో అందించే చికిత్స. ఈ కోర్సులు చదివినవారికి 100 శాతం ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయి. టూరిజం కేంద్రాలు, స్టార్ హోటళ్లు, ఆయుర్వేద ఆసుపత్రుల్లో బోలెడు అవకాశాలున్నాయి. సొంతంగా స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరో పదిమందికి ఉపాధి కల్పించవచ్చు. కోర్సు పూర్తిచేసిన వారికి స్థాయికి తగిన కొలువు గ్యారంటీగా లభిస్తుంది. థెరపిస్టుగా ప్రారంభంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు సంపాదించవచ్చు. థెరపిస్టు సూపర్వైజర్, అసిస్టెంట్ స్పా మేనేజర్, స్పా మేనేజర్, స్పా డెరైక్టర్.. ఇలా కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. రూ.లక్ష వరకూ వేతనం అందుకునే వీలుంది. విదేశాల్లో అయితే మరింత ఎక్కువ ఆదాయం లభిస్తుంది’’ -డాక్టర్ మిలింద్ సాలుంకె, హెడ్ ఆఫ్ ఆనంద్ స్పా ఇనిస్టిట్యూట్ -
నడుమునొప్పి -ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనడం, పగలు నిద్రించడం మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదంలో స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది. డాక్టర్ మనోహర్ ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక. ph: 8977 33 66 88 www.starayurveda.com -
కష్టాలను ఎదిరించి సాగటమే సజ్జనుల నైజం
‘‘క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే’’ అని పెద్దల సూక్తి. మానవ జీవితంలో అనేక లక్ష్యాలుంటాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే వాటిని భారతీయ సంస్కృతి పురుషార్థాలుగా చెప్పింది. అంటే ప్రతి మానవుడు జన్మనెత్తిన తరువాత పైవాటిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అసలు ఏదీ సాధించకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఏ అర్థాన్నీ చెప్పక సాధారణంగా మిగిలిపోయే శబ్దంలాగ లక్ష్యం లేని జీవితం విలువ లేనిది అవుతుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే మానవులకేగాక, జ్ఞానం కలిగిన జంతువులకూ లక్ష్యం ఉండటం గమనిస్తాం. రామాయణంలో పరిశీలిస్తే జటాయువుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అది కేవలం పక్షి మాత్రమే కాక, ఎంతో ధర్మజ్ఞానంతో కూడినది. సీతను రావణుడు అపహరిస్తున్నప్పుడు పక్షి అయినా వీరులకు సైతం సాధ్యం కాని విధంగా పోరాడటం మాత్రమేగాక సీతాపహరణ వార్తను శ్రీరామునికి చెప్పాలని చాలాకాలం ఎదురుచూసింది. చివరకు ఆ వార్తను రామునికి అందించి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంది. అందుకే అది శాశ్వతమైన కీర్తిని పొందింది. ఒక సామాన్యమైన పక్షే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే దానితో సమానంగా మానవులు కూడా లక్ష్యాన్ని నెరవేర్చుకోకపోతే తక్కువ అవుతారు. లక్ష్యం సాధించాలని ఉండాలేకాని, సాధనాలు అన్నీ లేకపోయినా లక్ష్యాన్ని సాధిస్తారు. కష్టాలను ఎదిరించి సాగటమే సజ్జనుల నైజం. రాముడి విషయం చూస్తే, ఎక్కడో సముద్రం అవతల లంక ఉంది. మధ్యలో అగాథమైన సముద్రాన్ని దాటాలి. పోనీ శత్రువు ఏమైనా సామాన్యుడా అంటే, కాదు. పులస్త్యబ్రహ్మ వంశంలో పుట్టిన రావణుడు. పోనీ గొప్పవాళ్ల అండదండలేమైనా ఉన్నాయా అంటే, అదీ లేదు. కేవలం సానుభూతితో చుట్టూ చేరిన కోతులే సహాయకులు. రావణునికి ఉన్నంత గా రథాలు, ఏనుగులు, గుర్రాలు, బంట్లు లేరు. ప్రతిపక్షంలో ఇంద్రజిత్తు ఉన్నాడు. అతడు మహా మాయావి. అలాంటి మాయలు తెలిసినవారు ఎవరూ రాముని వద్ద లేరు. అయినా రాముడు జయించాడంటే దానికి కారణం ఆయనకు గల ధైర్యం, విశ్వాసం, ధర్మదీక్ష. ఇలాగే పరిశీలిస్తే సూర్యుడు కూడా మంచి ఉదాహరణ అవుతాడు. అతని రథానికి ఒకటే చక్రం, పాములతో రథానికి కట్టబడ్డ ఏడుగుర్రాలు. శూన్యమైన ఆకాశమే మార్గం. పైగా సారథి అయిన అనూరునికి కాళ్లు లేవు. అయినా అనంతమైన ఆకాశం చివరి భాగం వరకు ప్రతిరోజూ ప్రయాణిస్తున్నాడు. అదే కార్యదీక్ష, దృఢసంకల్పం, అచంచలమైన ఆత్మవిశ్వాసం. ఈ గుణాలనే భారతీయ సంస్కృతి నేర్పింది. - డా. నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి -
మృత్యువుకే పరీక్ష: మనిషి ఆయుష్షును వెల్లడించే పరికరం
అనాదిగా మనిషిని వెంటాడుతున్న భయం ‘మృత్యువు’! అదెప్పుడు కబళి స్తుందో ఎవరికీ అంతుచిక్కని దేవ రహస్యం. పొంచి ఉన్న చావును తప్పించుకోవటం అసాధ్యం. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మరణానికీ ‘పరీక్ష’ పెట్టి విధిరాతకు సవాల్ విసురుతున్నారు. ఈ భూమిపై మనిషి ఆయువు ఎన్ని రోజులు మిగిలి ఉందో తెలుసుకునేందుకు ప్రపంచంలో తొలిసారిగా తాము ఓ పరీక్షను రూపొందించినట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. చేతి గడియారం లాంటి ఓ పరికరాన్ని శరీరానికి అమర్చి లేజర్ కిరణాలను ప్రసరించటం ద్వారా ఆయుష్షును లెక్కించవచ్చని వీరు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు. రక్తనాళాల్లోని కణాలను విశ్లేషించటం ద్వారా మనిషి దేహం వయసు ప్రభావంతో ఎలా క్షీణిస్తుందో ఇది లెక్కిస్తుంది. కేన్సర్, మనోవైకల్యం లాంటి జబ్బుల ప్రమాదాన్ని పసిగట్టే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. వచ్చే మూడేళ్లలో ఈ విధానం సాధారణ వైద్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ‘పెద్ద ఎత్తున డేటాబేస్ రూపకల్పనకు కృషి చేస్తున్నాం. పరీక్షించిన వారు ఈ వివరాలతో పోల్చుకోవచ్చు. దీనివల్ల కచ్చితమైన సంవత్సరాలను అంచనా వేయటానికి వీలుపడుతుంది’ అని లాన్కాస్టర్ వర్సిటీ అధ్యాపకుడు స్టెఫానోవస్కా చెప్పారు. ఇలాంటి మృత్యు పరీక్ష రూపొందించటం ఇదే మొదటిసారి.