Jhulan Goswami
-
టీమిండియా మాజీ బౌలర్కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక కమిటీలో చోటు
లండన్: ప్రతిష్టాత్మక మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీలో భారత మాజీ పేసర్ జులన్ గోస్వామికి స్థానం లభించింది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, హీతర్ నైట్లను కూడా కమిటీలోకి తీసుకున్నట్లు ఎంసీసీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ వెల్లడించారు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీలో భాగమైన వరల్డ్ క్రికెట్ కమిటీ కొత్తగా వచ్చే సాంకేతిక అంశాలను, వాటిని ఉపయోగించడానికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంసీసీ ప్రధాన కేంద్రం లార్డ్స్ మైదానంలో ఉంది. లార్డ్స్లోనే జరిగిన ఫైనల్ మ్యాచ్లలో 2019 వన్డే వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్లలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్లకు మోర్గాన్, హీతర్ నైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. గత ఏడాది ఇదే లార్డ్స్ మైదానంలో తన ఆఖరి వన్డే ఆడి జులన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. ఓవరాల్గా మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు పడగొట్టిన జులన్కు ఈ ఏడాదే ఎంసీసీ గౌరవ సభ్యత్వం దక్కింది. -
క్రికెటర్లుగా మారిన సినీతారలు.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్!
ఆటకు వేళాయె అంటూ కొందరు స్టార్స్ ప్లేయర్స్గా మారారు. క్రికెటర్లుగా, కోచ్లుగా మౌల్డ్ అయిపోయారు. అయితే ఈ ఆట అంతా సినిమాల కోసమే. ప్రస్తుతం క్రికెట్ బ్యాక్డ్రాప్లో కొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. కొన్ని కాల్పనిక కథలు కాగా, కొన్ని బయోపిక్స్ కూడా ఉన్నాయి. ఇక వెండితెరపై క్రికెటర్లుగా అలరించనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ మీద ఉన్నారు. ‘లాల్ సలామ్’ చిత్రం కోసమే ఇదంతా. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్లో, రజనీకాంత్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తారనీ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా కనిపిస్తారనీ ప్రచారం జరుగుతోంది. మరి.. రజనీ ఏ పాత్రలో కనిపిస్తారో చూడాలి. ‘లాల్ సలామ్’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ► క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉంటున్నారు మాధవన్, సిద్ధార్థ్, నయనతార. ఈ ముగ్గురూ కలిసి సిల్వర్ స్క్రీన్పై ఆడనున్న మ్యాచ్ ‘ది టెస్ట్’. తమిళ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ► శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ టైటిల్తో తెరకెక్కుతోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలో సలీమ్ మాలిక్ పాత్ర చేసిన మధుర్ మిట్టల్ ఈ చిత్రంలో మురళీధరన్ పాత్ర చేస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. ‘‘మురళీధరన్ జీవితంలోని పలు కోణాలను ఈ చిత్రంతో వెండితెరపై ఆవిష్కరించనున్నాం. 800 వికెట్లు తీసిన ఏకైక ఆఫ్ స్పిన్ బౌలర్గా మురళీధరన్ పేరిట రికార్డు ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ► భారత ప్రముఖ మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ మూవీ ‘చక్దా ఎక్స్ప్రెస్’. ఇందులో జులన్ గోస్వామిగా అనుష్కా శర్మ నటించారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. పశ్చిమ బెంగాల్ చక్దా ప్రాంతానికి చెందిన జులన్ గోస్వామి దాదాపు రెండు దశాబ్దాలు మహిళా క్రికెటర్గా, కెప్టెన్గా సక్సెస్ఫుల్ కెరీర్ను లీడ్ చేశారు. ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా జులన్ రికార్డు సాధించారు. ► యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం క్రికెట్ బ్యాట్ పట్టారు. ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్గా నటిస్తున్నారు. రాజ్కుమార్ రావ్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. రియల్ క్రికెటర్స్ దగ్గర శిక్షణ తీసుకుని జాన్వీ కపూర్ ఈ సినిమా చేశారు. వీరితోపాటు మరికొందరు క్రికెటర్ల బయోపిక్లు, క్రికెట్ ఆధారంగా సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
ముంబై జట్టు హెడ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ జట్టు హెడ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ను ఎంపిక చేసింది. . 2017లో క్రికెట్కు వీడ్కోలు పలికిన 43 ఏళ్ల చార్లెట్కు కోచింగ్లో విశేష అనుభవం ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి 309 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన చార్లెట్ 10,273 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో సదరన్ వైపర్స్ జట్టుకు, సదరన్ బ్రేవ్ (హండ్రెడ్ టోర్నీ) జట్టుకు, ఆస్ట్రేలియాలో మహిళల బిగ్బాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ జట్టు హెడ్ కోచ్గా పనిచేసిన చార్లెట్ అమెరికా క్రికెట్ జట్టుకు కూడా కొంతకాలం శిక్షణ అందించారు. మరోవైపు డబ్ల్యూపీఎల్ వేలం కార్యక్రమం ఈనెల 13న ముంబైలో జరుగుతుంది. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మందిని గరిష్టంగా 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు వీలుంది. ఒక్కో జట్టు వేలంలో రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా భారత బౌలింగ్ దిగ్గజం జులన్ గోస్వామిని తమ జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్గా ముంబై నియమించుకుంది. మరోవైపు భారత మాజీ ఆల్రౌండర్ దేవిక పల్షికార్ను బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు అప్పజెప్పారు. చదవండి: టాపార్డరే కీలకం: మిథాలీ -
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జత కట్టనున్న టీమిండియా దిగ్గజం
టీమిండియా దిగ్గజ బౌలర్, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ పేసర్ ఝులన్ గోస్వామి మహిళల ఐపీఎల్ (WPL)లో కాలు మోపనుంది. గతేడాది క్రికెట్లోకి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఝులన్.. WPLలో ముంబై ఫ్రాంచైజీ మెంటార్గా, బౌలింగ్ కోచ్గా నియమితురాలైంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఆదివారం (ఫిబ్రవరి 5) అధికారికంగా ప్రకటించింది. ముంబై యాజమాన్యం ఝులన్తో పాటు మరో ముగ్గురిని కూడా కోచింగ్, ఇతరత్రా సిబ్బందిలో చేర్చుకుంది. చార్లెట్ ఎడ్వర్డ్స్ను హెడ్ కోచ్గా నియమించుకున్న ముంబై ఫ్రాంచైజీ.. భారత మహిళల జట్టు మాజీ ఆల్రౌండర్ దేవిక పల్షికార్ను బ్యాటింగ్ కోచ్గా, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ తృప్తి భట్టాచార్యను టీమ్ మేనేజర్గా అపాయింట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ మహిళల టీమ్ చార్లెట్ నేతృత్వంలో, ఝులన్ మెంటార్షిప్లో, దేవిక బ్యాటింగ్ గైడ్లైన్స్ను ఫాలో అవుతూ ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ లెగసీని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, 43 ఏళ్ల చార్లెట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్గా దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. రిటైర్మెంట్ తర్వాత ఆమె ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పలు జట్లకు కోచ్గా వ్యవహరించారు. 2022లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ఎంపికైన ఎడ్వర్డ్స్ మహిళల బిగ్బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), ద హండ్రెడ్ (ఇంగ్లండ్) లీగ్ల్లో వివిధ జట్లకు కోచ్గా పని చేశారు. ఝులన్ విషయానికొస్తే.. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్ల ఘనత ఈమె పేరిటే ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఆమె ఖాతాలో 350కి పైగా వికెట్లున్నాయి. గతేడాది ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఝులన్ ఆట నుంచి తప్పుకుంది. మరోవైపు, WPLలో అదానీ ఫ్రాంచైజీ గుజరాత్ కూడా కోచింగ్ సిబ్బందిని నియమించుకుంది. ఆ ఫ్రాంచైజీ రేచల్ హేన్స్ను హెడ్ కోచ్గా.. ఇటీవల అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు హెడ్ కోచ్ నూషిన్ అల్ ఖాదిర్ను బౌలింగ్ కోచ్.. తుషార్ అరోథ్ను బ్యాటింగ్ కోచ్గా.. గవన్ ట్వినింగ్ను ఫీల్డింగ్ కోచ్గా ఎంపిక చేసుకుంది. -
చక్దా ఎక్స్ప్రెస్.. క్రికెటర్తో కేక్ కట్ చేసిన అనుష్క శర్మ (ఫొటోలు)
-
చక్దా ఎక్స్ప్రెస్.. స్పెషల్ స్టోరీ ఆన్ ఇండియన్ టైగ్రెస్ ఝులన్ గోస్వామి
కళ్లల్లో లక్ష్యం.. పరుగులో వేగం.. వెరసి స్టేడియంలో మెరుపు.. పిచ్లో స్టంప్ అవుట్స్! ఆ టైగ్రెస్ పేరు ఝులన్ గోస్వామి! ఆమె ఉంటే సొంత జట్టుకి ఉత్సాహం.. ప్రత్యర్థి జట్టుకి ఇరకాటం! విమెన్ క్రికెట్కు ఆమె ఓ సిగ్నేచర్! 2022 సెప్టెంబర్ 24.. లండన్లోని లార్డ్స్ స్టేడియం.. 39 ఏళ్ల లెజండరీ క్రికెటర్ ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ సమయం! టాస్ వేయాల్సిందిగా ఆమెనే పిలిచింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కన్నీళ్లతో. ఆ మ్యాచ్లో ఝులన్ తన కెరీర్లోనే ఆఖరి బాల్ వేస్తున్నప్పుడు టీమ్తో పాటు ప్రేక్షకుల మనసూ బరువెక్కింది. మ్యాచ్ అయిపోయాక ఇంగ్లండ్ టీమ్.. ఇండియా టీమ్ ఆమెకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. క్రికెటే జీవితంగా భావించిన ఝులన్కు అది కోరుకున్న నిష్క్రమణే అయినా.. తన శరీరం నుంచి హృదయాన్ని వేరు చేస్తున్న వేదన.. ఆమె బౌలింగ్ అంత వేగంగా పొట్టలోంచి ఉబికి వస్తున్న దుఃఖం కన్నీళ్లుగా కారకుండా కష్టంగా ఆపుకొంది! తన ఎడబాటుతో ఝులన్ను అంత వేదనకు గురిచేసిన ఆ ఆట ఆమెకు పరిచయమై ఆసక్తి కలిగిన సందర్భం.. 1992.. వరల్డ్ కప్! ఝులన్ వాళ్ల అన్న, కజిన్స్ క్రికెట్కు పెద్ద ఫ్యాన్స్. దాంతో టీవీలో వస్తున్న 1992 వరల్డ్ కప్ మ్యాచెస్ను ఉత్కంఠతో చూస్తున్నారు. వాళ్లతోపాటు పదేళ్ల ఝులన్ కూడా చూడాల్సి వచ్చింది అనివార్యంగా. అప్పటిదాకా ఆమె దృష్టిలో ఆటంటే ఫుట్బాలే. కానీ ఆ వరల్డ్ కప్ ఆమె దృష్టిని మార్చేసింది. క్రికెట్ మీదకు మళ్లించింది. ఆసక్తిని కలిగించింది. నాటినుంచి గల్లీలో అబ్బాయిలతో కలసి ఆడడం స్టార్ట్ చేసింది. బౌలింగ్ అంటే ఇష్టం. కానీ స్లోగా చేసేది. దాంతో అబ్బాయిలంతా ఆమెను గేలి చేసేవాళ్లు. ఆ హేళన ఆమెలో కసిని పెంచింది.. ఎంతలా అంటే బౌలింగ్ వేగం గంటకు 120 కిలోమీటర్లకు చేరి వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్గా ఆమెను నిలబెట్టేంతగా! క్రికెటే లక్ష్యంగా మారిన సమయం.. కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్.. 1997మహిళా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. ఆ స్టేడియంలో ఝులన్ బాల్ గర్ల్. అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే చూడటం అదే తొలిసారి. బెలిండా క్లార్క్ ఆట ఆమెను కట్టిపడేసింది.. క్రికెట్ను ప్రేమించేలా చేసింది. అంతే అప్పటికప్పుడు ఝులన్ నిర్ణయించేసుకుంది ఏది ఏమైనా తాను కూడా భారతదేశం తరపున ఆడాలని! కానీ తనుంటున్న చక్దా పల్లెటూరు. బడి అంటే ఓకే కానీ ఆటలను నేర్పించేంత సౌకర్యాలు తన ఊళ్లో లేవు. శిక్షణ కోసం కోల్కతా వెళ్లాల్సిందే. ఝులన్ నోటి వెంట ఆ మాట వినడమే ఆలస్యం ‘వద్దు’ అని చెప్పేశారు అమ్మా, నాన్న ముక్త కంఠంతో. ఆడపిల్లకు చదువుతో పాటు ఆట, పాట ఉండాలి అంటే ఏకంగా క్రికెట్కే గురి పెడతావా? పెళ్లికావాల్సిన పిల్లవి.. రేప్పొద్దున ఏదన్నా తేడా జరిగితే పెళ్లి అవుతుందా? అంటూ ఆందోళనా వ్యక్తం చేశారు. కాని దేశానికి స్వాతంత్య్రం సిద్ధించకముందు పుట్టిన ఝులన్ నానమ్మకు తెలుసు ఆడపిల్లకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఎంత అవసరమో! అందుకే ‘ఆడపిల్లలు అన్నిట్లో ముందుండాలి. దేనికీ అధైర్యపడొద్దు. నచ్చిన పని చేయాలి’ అంటూ ఝులన్ను ప్రోత్సహించింది. ‘నాకు రెండేళ్లు టైమ్ ఇవ్వండి.. క్రికెట్లో ఝులన్ను స్టార్ను చేస్తా’ అంటూ కోచ్ స్వపన్ సాధు కూడా ఆమె కుటుంబాన్ని ఒప్పించాడు. ‘ఎంతో మంది ఆడ పిల్లలకు శిక్షణ నిచ్చా.. కాని నీలాగా హై ఆర్మ్ బౌలింగ్ చేసేవాళ్లను చూడలేదు. ఇంత టాలెంట్ని వృథా పోనివ్వను. క్రికెట్కే నిన్ను ఓ అసెట్లా తీర్చిదిద్దుతా’ అంటూ కోచ్గానే కాదు గైడ్, ఫిలాసఫర్గా ఆమెకు అండగా నిలిచాడు స్వపన్ సాధు. అలా ఝులన్ తన క్రికెట్ కలను నేరవేర్చుకోవడానికి.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోల్కతా ప్రయాణమైంది. 2007– 08 నుంచి ఆటగాళ్లకి ర్యాంకింగ్ సిస్టమ్ మొదలైంది. బౌలర్లలో ఝులన్ది నంబర్ వన్ ర్యాంక్. ఐసీసీ ఆమెకు గోల్డెన్ ఆర్మ్ బ్యాండ్ను బహుకరించింది. అలా కోచ్ ఊహించినట్టుగానే క్రికెట్ స్టార్ అయింది. ఓ ‘అద్భుతం’గా రికార్డ్ అయింది! ‘ప్రతిరోజూ ఉదయం ఏడున్నర కల్లా గ్రౌండ్లో ఉండాల్సిందే. లేకపోతే ఆరోజు ఆడనిచ్చేవాడు కాదు కోచ్. అందుకే పొద్దున్నే ఐదింటికల్లా సీల్దా నుంచి బాలిగంజ్ ట్రైన్లో బయలుదేరేదాన్ని. అందులో అందరూ స్పోర్ట్స్పర్సన్సే ఉండేవారు. అబ్బాయిలు, అమ్మాయిలం ఒక గ్రూప్గా బోల్డు కబుర్లు చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం. పొరపాటున ట్రైన్ మిస్ అయితే జీవితంలో ఒకరోజు కోల్పోయిన ఫీల్ ఉండేది. ఏమైనా అవి బంగారు రోజులు’ అంటూ తన కోచింగ్ రోజులను గుర్తు చేసుకుంటుంది ఝులన్. ‘మా ఆటకు స్టేడియం ఖాళీగా ఉంటుంది. జనం కొట్టే జేజేలు, కేరింతలు లేకున్నా మా ఉత్సాహం ఏ మాత్రం తగ్గదు. నాకైతే ఎదురుగా బ్యాట్తో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి, స్టంప్స్ మాత్రమే కనిపించేవి. ప్రత్యర్థిని ఎలా ఔట్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో దూసుకుపోయేదాన్ని’ అంటూ తన ఆట తీరును నెమరువేసుకుంటుంది ఝులన్. రిటైర్మెంట్ తర్వాత.. మ్యాచెస్లేని రోజులను ఊహించడం కష్టమే అయినా క్రికెట్ వల్ల వాయిదా పడ్డ పనులెన్నిటినో చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది అని తన మనసుకు నచ్చజెప్పుకుంటోంది ఝులన్. ‘ఇప్పుడిక దేనికీ ఏ రోక్టోక్ (ఆటంకం) లేదు. బిందాస్గా స్ట్రీట్ ఫుడ్ తింటా.. చక్కగా దుర్గా పూజను ఆస్వాదిస్తా’నంటూ తనేం చేయాలను కుందో చెప్పు కొచ్చింది. ‘2009 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అయిపోవాలి అనుకున్నా. ఇప్పటికి ఆ నిర్ణయం తీసుకోగలిగా. ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి వెళ్లడం, బౌలింగ్ చేయడం, నేషనల్ యాంథమ్ పాడటం వంటి అనుభూతులన్నిటినీ మిస్ అవుతాను’ అంటూ రిటైర్మెంట్ మిగిల్చే లోటునూ పంచుకుంది. ‘నా తొలి టెస్ట్ మ్యాచ్, తొలి వన్ డే మ్యాచ్, టీ20 డెబ్యూ కూడా ఇంగ్లండ్తోనే. చిత్రమేంటంటే నా ఆఖరి మ్యాచ్ కూడా ఇంగ్లండ్తోనే. బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించిన చరిత్ర వింటూ పెరిగినందువల్లో ఏమో ఇంగ్లండ్ అంటే నాకు కోపం. ఆ సంగతి మా కెప్టెన్కీ తెలుసు. ఇంగ్లండ్తో మ్యాచ్ అప్పుడు ‘నీ కసికొద్దీ బాల్ని కొట్టిరా’ అంటూ బౌలింగ్కు పంపించేది’ అని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఝులన్. గ్రాఫ్ అండ్ గ్రేస్ 2007–ఐసిసి విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా గౌరవం పొందింది. (2008–2011)–విమెన్స్ క్రికెట్ కెప్టెన్ 204 మ్యాచుల్లో 255 వికెట్లతో అత్యధికంగా వికెట్లు తీసుకున్న ప్లేయర్గా నిలిచింది. 2010–అర్జున, 2012–పద్మశ్రీ అవార్డులను అందుకుంది. అనుష్క శర్మ నటిస్తున్న ఝులన్ బయోపిక్ చక్దా ఎక్స్ప్రెస్ నెట్ఫ్లిక్స్లో రాబోతోంది. ఆటకు అన్యాయం చేస్తానేమో అనే భయంతో పెళ్లి కూడా వద్దనుకుంది. కొన్ని ఫ్యాషన్ షోల్లోనూ పాల్గొంది. ఝులన్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది ప్రభుత్వం. జె.. పాజీ.. బాబుల్ టీమ్లో నేనే వరస్ట్ డాన్సర్నని ఆట పట్టిస్తారంతా. నేను క్రికెటర్ని మరి.. డాన్సర్ని కాదుగా! టీమ్లో అల్లరిపిల్ల అంటే వేద. ఝులన్ దీదీ.. ఝులన్ దీ.. ఝులన్ నుంచి ఇప్పుడు జె అని పిలిచేవరకు వచ్చింది ఆ పిల్ల తీరు. ‘నా పేరుమొత్తం కట్ చేసేశావ్, నన్ను టీమ్ నుంచి బయటకు మాత్రం పంపకు’ అని జోక్ చేసేదాన్ని. హర్మన్ పూర్తిగా పంజాబీ యాక్సెంట్లోనే మాట్లాడుతుంటుంది. నాకొచ్చిన ఒకేఒక్క పంజాబీ పదం పాజీ. నేను తనని పాజీ అనేదాన్ని. అలా తను నాకు పాజీ అని పేరు పెట్టేసింది. చాలామంది బాబుల్ అని కూడా పిలుస్తారు. ఝులన్ గురించి మిథాలి.. ‘నాకు ఝులన్ అండర్ 19లో రాయ్ బరేలీలో ఆడినప్పటి నుంచి తెలుసు. అప్పుడు గ్రౌండ్ వెనుక ఉన్న హాస్టల్లో మాకు బస. నా గది కిటికీ నుంచి ఝులన్ను మొదటిసారి చూశా. బోరింగ్ పంప్ కొట్టి బకెట్లో నీళ్లు నింపి అక్కడే కూర్చుని బ్రష్ చేసుకుంటోంది. తన మొదటి బంతి క్యాచ్ చేయడం కూడా నాకు గుర్తు. చాలా కష్టపడి ఆడే అమ్మాయి. ప్రాక్టీస్ టైమ్లో కూడా తనతో పోటీ పడటం కష్టమే. ఎవరిలో లేని లక్షణం ఒకటి ఆమెలో ఉంది. మేం ఆటలో ఓడుతున్నా, గెలుస్తున్నా ఝులన్ ఏదో ఒక కార్నర్లో ఉండి టీమ్ని ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తుంటుంది.’ గెలిచే వరకు.. పద్దెనిమిదేళ్ల పాటు నేను, మిథాలీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. వరల్డ్ కప్ గెలవలేకపోయాం. మన విమెన్ టీమ్ ప్రపంచ కప్ గెలవాలి. విమెన్ టీం ప్రపంచ కప్ గెలిస్తే చాలు. గెలిచే వరకు ఆ కలను కంటూనే ఉంటాను. -
Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్రౌండర్.. ఇద్దరూ ఒకేసారి!
అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అంటుంటారు. నలుగురికీ భిన్నంగా ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యాలు చేరాలంటే కచ్చితంగా కుటుంబం.. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ ప్రోత్సాహం ఉంటేనే సాధ్యమవుతుంది. భార్యైనా.. భర్తైనా పరస్పరం సహకరించుకుంటేనే ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం బాగుంటుంది. పాకిస్తాన్కు చెందిన తల్లీకూతుళ్లు సలీమా ఇంతియాజ్, కైనత్ ఇంతియాజ్కు ఇలాంటి భాగస్వాములే దొరికారు. భర్త ఖవాజా ఇంతియాజ్ ప్రోత్సాహంతో సలీమా అంపైర్గా ఎదగగా.. క్రికెటర్ కావాలన్న తమ కూతురు కైనత్ తన కలను నిజం చేసుకోవడంతో సహాయపడ్డారు ఈ దంపతులు. ఇక తండ్రిలాగే భర్త వకార్ సైతం తనకు అండగా నిలుస్తూ ఉండటంతో కైనత్ పాకిస్తాన్ ఆల్రౌండర్గా ఎదిగింది. విశేషమేమిటంటే.. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆసియా కప్-2022 వంటి మెగా టోర్నీలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. 41 ఏళ్ల వయసులో కల సాకారం బంగ్లాదేశ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా భారత్- శ్రీలంక మ్యాచ్తో అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్గా అరంగేట్రం చేసింది సలీమా. మరోవైపు సలీమా కూతురు కైనత్ పాకిస్తాన్ మహిళా జట్టులో సభ్యురాలిగా ఉంది. ఇలా ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడంతో ఇంతియాజ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. భర్తతో కైనత్(PC: Kainat Imtiaz Instagram) నాకు గర్వకారణం.. కైనత్ భావోద్వేగం ముఖ్యంగా 41 ఏళ్ల వయసులో తన తల్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసుకుంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది.ఈ మేరకు ఇన్స్టా వేదికగా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ‘‘ఏసీసీ ఆసియా కప్ -2022లో అంపైర్గా మా మామ్! మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. పాకిస్తాన్కు ప్రాతినిథ్యం వహించాలన్న ఆమె కల, ఆమెతో పాటు నా కల కూడా నేడు నెరవేరింది. మేమిద్దరం మా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఆ భగవంతుడి దయ. మా అమ్మ ఈ స్థాయికి చేరుకోవడంలో అడుగడుగునా అండగా నిలబడ్డ మా నాన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నిరాశతో మేము వెనుదిరగకుండా నిరంతరం స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. మా లోపాలు సరిదిద్దే క్రమంలో తనే మొదటి క్రిటిక్. వీళ్లందరూ మా జీవితాల్లో ఉండటం వల్లే ఆయన నా తండ్రి కావడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతురాలిని అనిపిస్తోంది. అలాగే నా సోదరుడు.. మా నాన్నలానే నన్ను ప్రోత్సహించే భర్త.. వీళ్లందరూ నా జీవితంలో ఉండటం.. నా అదృష్టం’’ అంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. సలీమా, కైనత్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అదే విధంగా పాకిస్తాన్ వంటి దేశంలో కట్టుబాట్లను దాటుకుని వారు ఎదిగేలా ప్రోత్సహించిన కైనత్ తండ్రిని ప్రశంసిస్తున్నారు. కాగా కైనత్ తండ్రి ఖవాజా స్పో టీచర్గా పనిచేశాడు. ఇక పాక్ ఆల్రౌండర్గా ఎదిగిన కైనత్.. భారత మహిళా పేసర్ ఝులన్ గోస్వామి తనకు స్ఫూర్తి అంటూ 2017 వరల్డ్కప్ సందర్భంగా తన మనసులోని మాట వెల్లడించింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆడిన పాకిస్తాన్ జట్టులో చోటుదక్కించుకున్న కైనత్.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించుకుంది. చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. View this post on Instagram A post shared by Kainat Waqar (@kainatimtiaz23) -
జులన్... ఐదో ర్యాంక్తో ముగింపు
గతవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్ను ఐదో ర్యాంక్తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్లో నిలిచారు. -
సిరీస్ క్లీన్స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్వాక్
టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే ఓడించి 3-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో తన చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామికి హర్మన్ప్రీత్ సేన సిరీస్ విజయాన్ని కానుకగా అందించింది. ఇక వచ్చే వన్డే వరల్డ్కప్ 2023 వరకు టీమిండియా ఉమెన్స్కు మరో వన్డే సిరీస్ లేదు. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరుగుపయనమైన టీమిండియా మహిళా క్రికెటర్లు ఎయిర్పోర్టులో పీపీఈ కిట్లతో క్యాట్వాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయాన్ని భారత మహిళా క్రికెటర్ జేమిమా రోడ్రిగ్స్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో జెమీమా రోడ్రిగ్స్తో పాటు జులన్ గోస్వామి, హర్లిన్ డియోల్ సహా ఇతర క్రికెటర్లు.. ఫ్యాషన్ మోడల్స్ను అనుకరిస్తూ ఎయిర్పోర్ట్లో క్యాట్వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా జులన్ గోస్వామి, ఆల్రౌండర్ దీప్తి శర్మలకు కోల్కతా ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాగా ఇంగ్లండ్తో మూడో వన్డేలో ఆఖర్లో దీప్తిశర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్ను మన్కడింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీప్తి శర్త తాను చేసింది కరెక్టేనని చెప్పింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది.ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని వివరణ ఇచ్చింది. i've never loved a team more😭 from @JemiRodrigues Instagram post pic.twitter.com/qE5ZsgXFeB — s (@_sectumsempra18) September 26, 2022 చదవండి: ఒక శకం ముగిసింది.. బాల్గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది -
ఈడెన్ గార్డెన్స్ స్టాండ్కు ఝులన్ గోస్వామి పేరు!
భారత సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో తన అఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. కాగా భారత జట్టు ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్కు క్లీన్ స్వీప్ చేసి జూలన్కు ఘనమైన విడ్కోలు ఇచ్చారు. తన అఖరి మ్యాచ్లో గో స్వామి రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో 355 వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా ఝులన్ తన కెరీర్ను ముగించింది. కాగా పశ్చిమబెంగాల్కు చెందిన జులన్ 2002లో ఇంగ్లండ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. ఇప్పడు అదే ఇంగ్లీష్ జట్టుపై తన కెరీర్ను ముగించడం గమానార్హం. ఇక ఇది ఇలా ఉండగా.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఒక స్టాండ్కు ఝులన్ పేరును పెట్టి ఆమెను గౌరవించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ యోచిస్తోంది. "మేము ఈడెన్ గార్డెన్స్లో ఒక స్టాండ్కు ఝులన్ గోస్వామి పేరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఆమె ఒక లెజెండరీ క్రికెటర్. కాబట్టి దిగ్గజ క్రికెటర్లతో పాటుగా ఆమె కూడా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉండాలి అనుకుంటున్నాము. అదే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించాలని భావిస్తున్నాము" అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు. చదవండి: Jhulan Goswami: ఒక శకం ముగిసింది.. బాల్గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా -
ఒక శకం ముగిసింది.. బాల్గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా
భారత మహిళా క్రికెట్లో ఒక శకం ముగిసింది. మిథాలీరాజ్ తర్వాత భారత మహిళా క్రికెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెటర్గా జులన్ గోస్వామి గుర్తింపు పొందింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళల జట్టు పేస్ బౌలింగ్ విభాగాన్ని తన భుజాలపై మోసింది. జనవరి 6, 2002లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జులన్ గోస్వామి.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఇంగ్లండ్పై తన చివరి మ్యాచ్ ఆడడం విశేషం. క్రికెటర్గా ఎన్నో రికార్డులు అందుకున్న ఆమె జీవితం ఇప్పటి యువతరానికి ఒక ఆదర్శం పశ్చిమబెంగాలోని నదియా జిల్లా చక్డా.. జులన్ సొంత గ్రామం. చక్డా నుంచి కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన జులన్కు బెంగాల్ లో అందరి మాదిరే ఫుట్బాల్ అంటే ఇష్టం. కానీ టీవీలలో వచ్చే క్రికెట్ మ్యాచ్లను చూసి ఆమె దృష్టి బంతి మీద పడింది. చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్న జులన్.. చిన్నప్పుడు స్కూల్లో, తన ఉరిలో అబ్బాయిలతోనే క్రికెట్ ఆడేది. అప్పటికీ అమ్మాయిల క్రికెట్కు ఇప్పుడున్నంత ఆదరణ కూడా లేదు. ‘ఆడపిల్లలకు ఆటలెందుకు.. అది కూడా క్రికెట్. అవసరమా..?’ అని అవమానించినప్పటికి క్రికెట్ ఆడాలనే తన పట్టుదలను మాత్రం విడవలేదు. బాల్గర్ల్ నుంచి క్రికెటర్ దాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆమె కోరిక బలంగా నాటుకుపోయింది 1997లో. ఆ ఏడాది కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మహిళల మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో జులన్ గోస్వామి బాల్ గర్ల్గా పనిచేసింది. ఆ మ్యాచ్ చూసిన జులన్.. 'భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలి. ఒక్క వికెట్ అయినా తీయాలి..' అని మనసులో నిశ్చయించుకుంది. అప్పుడు ఆమె వయసు 15 ఏండ్లు. అయితే ఆమె నివసిస్తున్న చక్డాలో, నదియాలో క్రికెట్ అకాడమీలు లేవు. క్రికెట్ కోచింగ్ తీసుకోవాలంటే 80 కిమీ ఆవల ఉన్న కోల్కతాకు వెళ్లాల్సిందే. అందుకోసం రోజూ ఉదయం 5 గంటలకు చక్డాలో ట్రైన్ ఎక్కి సీల్దాలో ప్రాక్టీస్ కోసం వచ్చేది. 19 ఏండ్ల వయసులో జులన్ గోస్వామి 2002 జనవరి 14న చెన్నైలో ఇంగ్లండ్తో తొలి మ్యాచ్ ఆడింది. అప్పటికింకా బీసీసీఐ మహిళా విభాగం లేకపోవడంతో అప్పుడు భారత మహిళల జట్టు ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూసీఎఐ) కింద ఆడారు. అప్పట్లో భారత పురుషుల క్రికెట్ కు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ కు లేదు. ఏదో ఒక జట్టు ఉందా..? అంటే ఉన్నదన్నట్టుగానే ఉమెన్ క్రికెట్ టీమ్ ఉండేది. బీసీసీఐ కూడా మహిళా క్రికెట్ మీద అంత ఆసక్తి చూపలేదు. దీంతో పురుష క్రికెటర్లు అనుభవించిన లగ్జరీలు మహిళా క్రికెటర్లకు దక్కలేదు. భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు జులన్.. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ లలో ప్రయాణించేది. డార్మెటరీలలో అతి సాధారణ వాష్ రూమ్ లు ఉన్నచోట కూడా సర్దుబాటు అయింది. కనీసం మ్యాచ్లలో అమ్మాయిలకు ప్రత్యేక జెర్సీలు కూడా లేని రోజులనూ చూసింది జులన్. లెక్కకు మించి రికార్డులు భారత జట్టు తరఫున ఆడుతూ ఒక్క వికెట్ తీసినా చాలు అని కలలు కన్న జులన్ గోస్వామి.. తన కెరీర్ లో ఇన్ని ఘనతలు సాధిస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ జులన్ పేరిటే ఉంది. తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 353 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ క్రికెట్ (మహిళల) లో మరే బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ముఖ్యంగా వన్డేలలో ఆమె రికార్డులు చేరుకునే బౌలర్ అయితే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. జులన్ తన కెరీర్ లో 12 టెస్టులలో 44 వికెట్లు, 203 వన్డేలలో 253 వికెట్లు, 68 టీ20లలో 56 వికెట్లు తీసింది. జులన్ సాధించిన రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ►వన్డేలలో 200, 250 వికెట్లు తీసుకున్న తొలి మహిళా బౌలర్. ►జులన్ బౌలరే కాదు.. మంచి బ్యాటర్ కూడా. వన్డేలలో ఆమె 1,228 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్ లో వెయ్యికి పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన భారత క్రికెటర్. ►మహిళల ప్రపంచకప్ (34 మ్యాచ్ లు) లో అత్యధిక వికెట్లు : 43 ►ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీ రాజ్ (22 ఏండ్ల 274 రోజులు) తర్వాత అత్యధిక కెరీర్ కలిగిన (20 ఏండ్ల 260 రోజులు) రెండో క్రికెటర్. ►అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం. తన కెరీర్ లో ఆమె 68 క్యాచ్ లు అందుకుంది. న్యూజిలాండ్ కు చెందిన సూజీ బేట్స్ 78 క్యాచ్ లు పట్టింది. ►2006 లో ఇంగ్లాండ్ లో ఆడుతూ ఒక టెస్టులో పది వికెట్ల (78-10) ప్రదర్శన చేసిన ఏకైక భారత బౌలర్. A long list of special performances 📝 Some of Jhulan Goswami's finest moments in international cricket 👇 https://t.co/Mb2eBIYS1N — ICC (@ICC) September 24, 2022 చదవండి: 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి.. జులన్కు క్లీన్స్వీప్ కానుక -
జులన్కు క్లీన్స్వీప్ కానుక
లండన్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కెరీర్ విజయంతో ముగిసింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్ను 3–0తో నెగ్గి కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల జులన్ గోస్వామికి క్లీన్స్వీప్ కానుకగా ఇచ్చింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (50; 5 ఫోర్లు), దీప్తి శర్మ (68 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను స్మృతి, దీప్తి శర్మ ఆదుకున్నారు. ఐదో వికెట్కు వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. స్మృతి అవుటయ్యాక ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు దీప్తి పట్టుదలతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేటీ క్రాస్ (4/26), ఫ్రేయా కెంప్ (2/24), ఎకిల్స్టోన్ (2/27) రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి బ్యాటింగ్లో ‘డకౌట్’కాగా... బౌలింగ్లో 10 ఓవర్లలో మూడు మెయిడెన్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29), స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (2/38) కూడా ఇంగ్లండ్ను దెబ్బ తీశారు. మొత్తం 340 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. 355: జులన్ గోస్వామి మూడు ఫార్మాట్లలో కలిపి తీసిన వికెట్ల సంఖ్య. జులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు... 204 వన్డేల్లో 255 వికెట్లు... 68 టి20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. 7: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం భారత జట్టుకిది ఏడోసారి (బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లపై ఒకసారి... శ్రీలంకపై మూడుసార్లు). ఇంగ్లండ్పై తొలిసారి. -
'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి..
లార్డ్స్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలతో భారత జట్టు తలపడుతోంది. కాగా భారత మహిళా జట్టు వెటరన్ పేసర్ జులాన్ గోస్వామి తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెటర్ల నుంచి జులాన్ గోస్వామి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరిచింది. భారత ఇన్నింగ్స్లో గోస్వామి బ్యాటింగ్ సమయంలో ఇంగ్లండ్ క్రికెటర్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. కాగా ఈ మ్యాచ్లో గోస్వామి తొలి బంతికే డకౌట్గా వెనుదిరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. "20 ఏళ్లుగా ఝులన్ గోస్వామి తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆమె వన్డే క్రికెట్లో దాదాపు 10,000 బంతులు వేసింది. ఎంతో మంది యువ క్రికెటర్లు అత్యుత్తమంగా తాయారు చేయడంలో జులాన్ కీలక పాత్ర పోషించింది. జులాన్ ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శం" అని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. కాగా 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్ 201 వన్డేల్లో 253 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. చదవండి: Womens T20 World Cup 2023: అర్హత సాధించిన ఐర్లాండ్, బంగ్లాదేశ్ -
‘ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్ మూలస్థంభాల్లో ఒకరిగా నిలిచిన దిగ్గజ పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఆటకు ముగింపు పలుకుతోంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే చివరి వన్డేతో రిటైర్ కానున్న జులన్ ఆఖరిసారిగా లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్ను గెలుచుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ జులన్పైనే ఉంది. ఆమెకు విజయంతో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని హర్మన్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ విశేషాల గురించి జులన్ శుక్రవారం మీడియాతో మాట్లాడింది. వన్డే లేదా టి20 ప్రపంచకప్లలో తాము ఒకటి గెలిచి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘2005, 2017 వన్డే వరల్డ్కప్లలో మేం ఫైనల్ చేరాం. వీటిలో ఒకటి గెలిచి ఉండాల్సింది. ప్రతీ క్రికెటర్కి అదే లక్ష్యం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి అక్కడి దాకా వచ్చాక కప్ గెలిస్తే కల నిజమయ్యేది. టి20 ప్రపంచకప్ సహా మేం మూడు ఫైనల్స్ ఆడినా ఒక్కటి గెలవలేకపోయాం. అది చాలా బాధిస్తుంది. నా కెరీర్లో అదే లోటు’ అని జులన్ చెప్పింది. గత రెండేళ్లుగా చాలా సార్లు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ వచ్చానని, చివరకు ఇప్పుడు తప్పుకుంటున్నానని జులన్ భావోద్వేగంతో చెప్పింది. ‘రెండేళ్లుగా ప్రతీ సిరీస్ నాకు చివరి సిరీస్లాగానే అనిపించేది. కోవిడ్ వల్ల మ్యాచ్లు వాయిదాపడుతూ రావడంతో పాటు వరుసగా గాయాలపాలయ్యాను. శ్రీలంక సిరీస్తోనే ముగిద్దామనుకున్నా. అయితే ఫిట్గా లేక ఆ సిరీస్ ఆడలేదు. దాంతో మళ్లీ ఎన్సీఏకు వెళ్లాను. రాబోయే టి20 వరల్డ్కప్కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కాబట్టి ఆటను ముగిస్తున్నా’ అని ఈ బెంగాల్ పేసర్ పేర్కొంది. కోల్కతాలో 1997 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో బాల్బాయ్గా పని చేసిన తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్నేళ్లు కొనసాగగలనని అనుకోలేదన్న జులన్... కెరీర్లో తొలి మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైందని గుర్తు చేసుకుంది. వచ్చే ఏడాది జరి గే తొలి మహిళల ఐపీఎల్లో పాల్గొనడం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని జులన్ స్పష్టం చేసింది. -
చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్గా!
ఇంగ్లండ్ మహిళలలతో వన్డే సిరీస్ను భారత్ విజయంతో ఆరంభించింది. హోవ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా తన కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న భారత భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్లో గోస్వామి తన 10 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టింది. తద్వారా ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లీస్ జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా గోస్వామి రికార్డులకెక్కింది. అంతుకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ కేథరిన్ ఫిట్జ్ప్యాట్రిక్(23 వికెట్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఝులన్(24 వికెట్లు) కేథరిన్ రికార్డురు బ్రేక్ చేసింది. అదే విధంగా భారత్ తరపున వన్డేల్లో ఆడిన అతి పెద్ద వయష్కరాలుగా కూడా గోస్వామి నిలిచింది. 39 ఏళ్ల 297 రోజుల వయస్సులో ఆమె ఈ మ్యాచ్ ఆడింది. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 39 ఏళ్ల 114 రోజుల వయసులో తన చివరి వన్డే మ్యాచ్ ఆడింది. ఇక ఈ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు గోస్వామి గుడ్బై చెప్పనుంది. లార్డ్స్ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది. చదవండి: IND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
IND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును!
హోవ్ వేదికగా ఇంగ్లండ్ మహిళలలతో జరిగిన తొలి వన్డేలో భారత్ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 95 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోసింది. దీంతో మంధాన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే మంధాన మరో సారి తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో తన దక్కిన ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును భారత వెటరన్ ఝులన్ గోస్వామికి అంకితం చేసింది. కాగా గోస్వామి తన కెరీర్లో చివరి అంతర్జాతీయ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది. ఇక పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో మంధాన మాట్లాడూతూ.. "ఈ మ్యాచ్లో నా ఇన్నింగ్స్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. అయితే అఖరి వరకు క్రీజులో నిలిచి ఉండి మ్యాచ్ను ఫినిష్ చేయాలని అనుకున్నాను. ముఖ్యంగా మ్యాచ్ను వీక్షించచడానికి వచ్చిన భారత అభిమానులకు ప్రత్యేక దన్యావాదాలు. అదే విధంగా టీ20 క్రికెట్ కంటే వన్డే క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఇక ఈ మ్యాచ్లో నాకు దక్కిన ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును ఝులన్ గోస్వామికి అంకితం చేయాలనుకుంటున్నాను. అదే విధంగా ఈ సిరీస్ను గెలిచి మేము గోస్వామికి అంకితం ఇస్తాము" అని పేర్కొంది. చదవండి: T20 WC 2022: తుది జట్టులో డీకే లేదంటే పంత్? నేనైతే ఏం చేస్తానంటే: టీమిండియా దిగ్గజం -
జులన్కు ఘనమైన వీడ్కోలే లక్ష్యంగా...
హోవ్: పొట్టి ఫార్మాట్లో నిరాశపరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు వన్డే సిరీస్లో రాణించాలనే పట్టుదలతో ఉంది. టి20ల్లో పేలవమైన ఆటతీరుతో హర్మన్ప్రీత్ జట్టు 1–2తో ఆతిథ్య జట్టుకు సిరీస్ను అప్పగించింది. కానీ ఇప్పుడు దిగ్గజ బౌలర్ జులన్ గోస్వామికి ఇది ఆఖరి సిరీస్ కావడంతో సిరీస్ గెలిచి తమ సహచర క్రీడాకారిణికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని హర్మన్ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్లో అమ్మాయిలంతా బాధ్యత కనబరిస్తే గత వైఫల్యాల్ని అధిగమించవచ్చు. ముందుగా ఆదివారం జరిగే తొలి వన్డేలో శుభారంభం చేస్తే సిరీస్పై పట్టుసాధించవచ్చని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. టాపార్డర్లో స్మృతి, షఫాలీ సహా కెప్టెన్ హర్మన్ప్రీత్ ఇంగ్లండ్ బౌలింగ్కు ఎదురొడ్డితే మిగతా వారికి పని సులువవుతుంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ హీథెర్నైట్ గాయంతో దూరమవడం ఇబ్బందికరం. అయితే ఇంగ్లండ్ మంచి ఆల్రౌండ్ జట్టు. పైగా టి20 సిరీస్ గెలిచిన ఊపు మీదుంది. ఇదే జోరుతో సొంతగడ్డపై వరుసగా మరో సిరీస్పై కన్నేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లే, డానీ వ్యాట్, మూడోస్థానంలో అలైస్ కాప్సీ ఫామ్లో ఉండటం జట్టుకు కలిసివస్తోంది. బౌలింగ్లోనూ సోఫీ ఎకిల్స్టోన్, ఫ్రెయా డెవిస్ భారత బ్యాటర్లపై ప్రభావం చూపగలరు. -
‘లార్డ్స్’లో టీమిండియా సీనియర్కు ఘనంగా వీడ్కోలు
బెంగళూరు: ‘చక్దా ఎక్స్ప్రెస్’ జులన్ గోస్వామి లార్డ్స్ మైదానంలో పరుగు ముగించనుంది. రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్కు మూలస్థంభంలా నిలిచిన పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత రిటైర్ కానుంది. సెప్టెంబర్ 24న జరిగే మూడో వన్డే ఆమె కెరీర్లో చివరిది అవుతుంది. మార్చిలో జరిగిన వన్డే వరల్డ్కప్లో ఆడిన జులన్ పక్కటెముకల గాయంతో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి పోరులో బరిలోకి దిగలేకపోయింది. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతోనే శ్రీలంకతో సిరీస్కు దూరమైంది. అయితే జులన్లాంటి స్టార్కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని భావించిన బీసీసీఐ ఆమెను ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసింది. మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జులన్ ఆటకు తెర పడనుంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్ 201 వన్డేల్లో 252 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. మరో 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 2009లో అంత ర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పుడు ఆమె తొలి కెప్టెన్ జులన్ గోస్వామినే కావడం విశేషం. విజయంతో జులన్కు వీడ్కోలు పలుకుతామని హర్మన్ వ్యాఖ్యానించింది. ‘జులన్ చివరి మ్యాచ్ కు నేను కెప్టెన్ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నేను వచ్చినప్పుడు ఆమెనుంచి ఎంతో నేర్చుకున్నాను. జులన్ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదల అసమానం. ప్రతీ మ్యాచ్లో బాగా ఆడేందుకు ఇప్పటికీ కొత్త ప్లేయర్గా ప్రతీరోజు 2–3 గంటలు బౌలింగ్ చేయడం మామూలు విషయం కాదు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్లోకి వచ్చారు’ అని ఆమె తన గౌరవాన్ని ప్రదర్శించింది. -
టీమిండియా సీనియర్ పేసర్ రీఎంట్రీ.. లార్డ్స్లో ఫేర్వెల్!
ఇంగ్లండ్ గడ్డపై మూడు టి20లు, 3 వన్డేల్లో తలపడే భారత మహిళల జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. గత శ్రీలంక సిరీస్కు దూరంగా ఉండి రిటైర్మెంట్పై అనుమానాలు పెంచిన సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఇప్పుడు జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. అయితే ఇదే సిరీస్లో సెప్టెంబర్ 24న లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే ఆమెకు ఆఖరి మ్యాచ్ కానుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్లాన్లో భాగంగానే ఝులన్ గోస్వామికి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక 39 ఏళ్ల ఝులన్ గోస్వామి 2018లో టి20 క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్లో వన్డే ఫార్మాట్లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్గా ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన ఝులన్ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఏడాది తర్వాత వన్డే టీమ్లో జెమీమా రోడ్రిగ్స్కు చోటు దక్కగా, దేశవాళీ క్రికెట్లో మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటిన నాగాలాండ్ బ్యాటర్ కిరణ్ ప్రభు నవ్గిరేకు తొలిసారి భారత టి20 జట్టులో చోటు లభించింది. రెండేళ్ల తర్వాత హేమలత మళ్లీ వన్డే టీమ్కు ఎంపిక కాగా, లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్కు రెండు టీమ్లలోనూ స్థానం లభించలేదు. ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన వన్డే, టి20 టీమ్లలోనూ అవకాశం దక్కించుకోగలిగింది. Jhulan Goswami's 20-year international career is set to conclude at Lord's, after the third and final ODI of India's tour of England on September 24 — ESPNcricinfo (@ESPNcricinfo) August 20, 2022 చదవండి: అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ Eugenie Bouchard: ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్ స్టార్ -
బెంగాల్ క్రికెట్లో టీమిండియా సీనియర్ పేసర్కు కీలక పదవి
టీమిండియా సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి బెంగాల్ క్రికెట్లో కొత్త పదవి చేపట్టనుంది. బెంగాల్ మహిళల జట్టు ఆటగాళ్లకు మెంటార్ కమ్ ప్లేయర్గా వ్యవహరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) పేర్కొంది. టీమిండియా సీనియర్ పేసర్గా సేవలందిస్తున్న ఝులన్ గోస్వామి బెంగాల్ వుమెన్స్ టీమ్లో అన్ని ఫార్మాట్లకు మెంటార్గా వ్యవహరిస్తుందని క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా పేర్కొన్నారు. గురువారం సాయంత్రంజరిగిన అధ్యక్షత సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.ఇక అండర్-16 కోచ్గా అరిన్దామ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నాడని.. అతనికి అసిస్టెంట్ కోచ్ ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. కాగా అండర్-25 కోచ్గా ఉన్న ప్రణబ్ రాయ్కు పార్థసారథి భట్టాచార్య అసిస్టెంట్గా వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు. ఇక అండర్-19 కోచ్గా ఉన్న దెవాంగ్ గాంధీకి సంజీబ్ సన్యాల్ అసిస్టెంట్గా ఉండనున్నాడు. 39 ఏళ్ల ఝులన్ గోస్వామి 2018లో టి20 క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్లో వన్డే ఫార్మాట్లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్గా ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన ఝులన్ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది. చదవండి: Washington Sundar: సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్ -
గోస్వామి బౌలింగ్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. వీడియో వైరల్!
గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించాల్సిన రాహుల్ ఆఖరి నిమిషంలో దూరమైన విషయం తెలిసిందే. అనంతరం అతడు గత నెలలో స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. కాగా త్వరలో వెస్టిండీస్తో జరగనున్న టీ20 సిరీస్తో భారత జట్టులోకి రాహుల్ పునరాగమనం చేయనున్నాడు. విండీస్తో వన్డే సిరీస్కు కాకుండా టీ20 సిరీస్కు రాహుల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అతడు తన ఫిట్నెస్ నిరూపించుకుంటూనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చెమటోడ్చుతున్నాడు. సన్నాహాల్లో భాగంగా భారత మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బౌలింగ్లో రాహుల్ ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గత కొన్ని నెలలగా గాయం కారణంగా జట్టుకు దూరమైన ఝులన్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. జూలన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ మహిళల వన్డే వరల్డ్కప్లో బంగ్లాదేశ్పై ఆడింది. చదవండి: Lendl Simmons : అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! K L Rahul is batting and Jhulan Goswami is bowling. He is fully fit for West Indies tour 💙🔥 #MenInBlue 📍NCA, Bangalore#KlRahul #IndvsWI #INDvsEND pic.twitter.com/UAfCxhdimc — 𝘛𝘶𝘴𝘩𝘢𝘳 ⚡ (@TUSHARBAGGA1M) July 18, 2022 -
Ind Vs Eng: అరంగేట్రంలోనే అర్ష్దీప్ అదుర్స్.. 16 ఏళ్ల రికార్డు బద్దలు
India Vs England 1st T20- Arshdeep Singh: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ కల నెరవేరింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్తో అతడు అరంగేట్రం చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకుని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇక మొదటి మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు 23 ఏళ్ల అర్ష్దీప్ సింగ్. అరంగేట్ర మ్యాచ్లోనే మెయిడెన్ వేసి 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. భారత మహిళా జట్టు బౌలర్ ఝులన్ గోస్వామి, అజిత్ అగార్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్గా నిలిచాడు. 2006లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఝులన్.. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో అగార్కర్ టీ20 ఫార్మాట్లో ఈ ఫీట్ నమోదు చేశారు. FIRST wicket for @arshdeepsinghh in International cricket 🙌 #ENGvIND pic.twitter.com/irEjeZeHz5 — Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022 రెండు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్తో మొదటి టీ20 మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ 3.3 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రీస్ టోప్లే, మాథ్యూ పార్కిన్సన్లను అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ సింగ్పై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘టీమిండియాకు ఆడగల అన్ని అర్హతలు ఉన్న ఆటగాడివి. నీ ఎంట్రీ అదిరిపోయింది’’ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. WICKET!! Moeen Ali gone for 36 🙌 #ENGvIND pic.twitter.com/7Huolk9wu8 — Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022 కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన అర్ష్దీప్ 14 ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో భారత జట్టు సెలక్టర్ల దృష్టి ఆకర్షించి జట్టులోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్తో మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ 50 పరుగుల తేడాతో బట్లర్ బృందాన్ని మట్టికరిపించింది. చదవండి: Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు! Fantastic first over at the international level by Arshdeep singh. Way to go buddy. — Irfan Pathan (@IrfanPathan) July 7, 2022 -
అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్గా!
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత స్టార్ అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచకప్లో 30 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా ఝులన్ గోస్వామి నిలిచింది. హామిల్టన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టిన గోస్వామి ఈ ఘనత సాధించింది. ఇక వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్పై 110 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 119 పరగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ను దెబ్బతీసింది. అదే విధంగా ఝులన్ గోస్వామి,పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు సాధించి తమ వంతు పాత్ర పోషించారు.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: World Cup 2022: ఎదురులేని ఆసీస్.. కెప్టెన్ 15వ సెంచరీ.. అద్భుత విజయం -
టీమిండియా బౌలర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా!
భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలోనే 200 వన్డేలు ఆడిన తొలి బౌలర్గా గోస్వామి రికార్డులకెక్కింది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో గోస్వామి ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా 200 వన్డే మ్యాచ్లు ఆడిన రెండో క్రికెటర్గా గోస్వామి నిలిచింది. ఇక భారత కెప్టెన్ మిథాలీ రాజ్ 230 వన్డేలు ఆడి తొలి స్ధానంలో ఉంది. ఇక వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గోస్వామి వరుసగా ఐదో వన్డే ప్రపంచకప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె 2005లో తొలి వరల్డ్కప్ భారత తరుపున ఆడింది. అదే విధంగా మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్గా కూడా గోస్వామి రికార్డు సృష్టించింది. చదవండి: Jhulan Goswami: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
Jhulan Goswami: టీమిండియా పేసర్ ప్రపంచ రికార్డు.. అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సాధించింది. వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బీమౌంట్ను అవుట్ చేసి ఈ ఘనత సాధించింది. ఎల్బీడబ్ల్యూగా ఆమెను వెనక్కి పంపి.. తద్వారా 250వ వికెట్ మైలురాయిని చేరుకున్న ఝులన్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కాగా 198 ఇన్నింగ్స్లో ఆమె ఈ ఘనత సాధించింది. ఇక వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఝులన్ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ కాథరిన్ ఫిజ్పాట్రిక్(180 వికెట్లు), వెస్టిండీస్ బౌలర్ అనీసా మహ్మద్(180 వికెట్లు), దక్షిణాఫ్రికా క్రికెటర్ షబ్నమ్ ఇస్మాయిల్(168 వికెట్లు), ఇంగ్లండ్ బౌలర్ కేథరీన్ బ్రంట్(164 వికెట్లు), ఆస్ట్రేలియా బౌలర్ ఎలిస్ పెర్రీ(161 వికెట్లు) ఉన్నారు. ఇక బీమౌంట్ వికెట్ను కూల్చడం ద్వారా ఝులన్ మరో రికార్డు కూడా సాధించింది. వన్డేల్లో 250 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏడో భారత బౌలర్(పురుషులు, మహిళా క్రికెటర్లు కలిపి)గా నిలిచింది. అనిల్ కుంబ్లే(334),జవగళ్ శ్రీనాథ్(315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్దేవ్(253)ల సరసన నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ 2022 టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్కేకు బిగ్షాక్.. ఆరంభ మ్యాచ్లకు స్టార్ ఆటగాడు దూరం! View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కింది. విండీస్ బ్యాటర్ అనిసా మహ్మద్ను ఔట్ చేయడం ద్వారా ఝులన్ ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్స్టన్ (39 వికెట్లు)ను అధిగమించి వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రికెటర్గా అవతరించింది. 🚨 RECORD ALERT 🚨 Wicket No. 4⃣0⃣ in the WODI World Cups for @JhulanG10! 🔝 🙌 What a champion cricketer she has been for #TeamIndia ! 👏 👏 #CWC22 | #WIvIND Follow the match ▶️ https://t.co/ZOIa3L288d pic.twitter.com/VIfnD8CnVR — BCCI Women (@BCCIWomen) March 12, 2022 ఫుల్స్టన్ 20 ప్రపంచకప్ మ్యాచ్ల్లో 39 వికెట్లు పడగొట్టగా, ఝులన్ 31 వన్డేల్లో ఫుల్స్టన్ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్లు ఆడిన 39 ఏళ్ల ఝులన్, వన్డే ఫార్మాట్లో 198 మ్యాచ్ల్లో 249 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, సెడాన్పార్కు వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 155 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(119 బంతుల్లో 123; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్ప్రీత్ కౌర్(107 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన విండీస్.. స్నేహ్ రాణా(3/22), మేఘనా సింగ్ (2/27)ల ధాటికి 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విండీస్ జట్టులో ఓపెనర్ డియాంద్ర డొటిన్(62) టాప్ స్కోరర్గా నిలిచింది. చదవండి: World Cup 2022: శెభాష్ స్మృతి, హర్మన్.. ఇదే అత్యధిక స్కోరు! -
టీమిండియా బౌలర్ అరుదైన ఫీట్.. చరిత్రకు అడుగుదూరంలో
మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. ఆస్ట్రేలియన్ మహిళా బౌలర్ లిన్ ఫుల్స్టన్తో కలిసి గోస్వామి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఉమెన్స్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ 9 ఓవర్లో కేటీ మార్టిన్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ను అందుకుంది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్లు ఆడిన గోస్వామి.. కేటీ మార్టిన్ వికెట్తో కలిపి 39 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియాకు చెందిన లిన్ ఫుల్స్టన్ 39 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. తాజాగా గోస్వామి ఆమె సరసన చేరింది. రాబోయే మ్యాచ్ల్లో గోస్వామి ఒక వికెట్ తీస్తే చాలు.. మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రకెక్కనుంది. ఇక 37 వికెట్లతో ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ కరోల్ హోడ్జెస్ రెండో స్థానంలో.. క్లేరీ టేలర్(ఇంగ్లండ్) 36 వికెట్లతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియాకు చెందిన క్యాథరిన్ ఫిట్జ్ పాట్రిక్ 33 వికెట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అమీ సాథర్వెయిట్ 75, అమిలియా కెర్ 50 పరుగులతో రాణించారు. చదవండి: Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు Inzamam-ul-Haq: 'పనికిమాలిన పిచ్లు తయారు చేయకండి' -
తెర మీదే అయినా... తగ్గేదే లే!
సినిమాలో ఆటా (డ్యాన్స్) పాటా హీరోయిన్లకు కామన్. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోరు. కెమెరా ముందే అయినా... తగ్గేదే లే! అంటూ విజృంభిస్తారు. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్... ఈ ముగ్గురూ వెండితెరపై అసలు సిసలైన క్రికెటర్లు అనిపించుకోవడానికి శిక్షణ తీసుకున్నారు. ఆగేదే లే అంటూ బరిలోకి దిగారు. ఆ ఆట విశేషాలు తెలుసుకుందాం. గ్లామర్కి చిరునామా అనే తరహా పాత్రలు తాప్సీ చాలానే చేశారు. అయితే చాన్స్ వస్తే అందుకు భిన్నమైన పాత్రలు చేయడానికి వెనకాడరు. పింక్, నామ్ షబానా, సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ తదితర హిందీ చిత్రాలతో కెరీర్ ఇన్నింగ్స్ని బ్రహ్మాండంగా తీసుకెళుతున్నారు తాప్సీ. ఇప్పటికే సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నిరూపించుకున్నారు. ఇప్పుడు ‘శభాష్ మిథు’లో క్రికెటర్గా తెరపై దూసుకు రావడానికి రెడీ అయ్యారు. భారతీయ ప్రముఖ మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు తాప్సీ. ‘‘నిర్భయంగా ఆడే ప్రతి క్రీడాకారుల వెనక ఓ నిర్భయమైన కోచ్ ఉంటారు. నాలోని బెస్ట్ని బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నూషిన్’’ అని గత ఏడాది టీచర్స్ డే సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇక అచ్చంగా మిథాలీ రాజ్లా కనబడటం మీద కాదు కానీ ఆమెలా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టామని కూడా తాప్సీ అన్నారు. ‘‘పోస్టర్ షూట్కి ముందు నేను మిథాలీ రాజ్తో మాట్లాడాను. పోస్టర్ చూశాక తనకూ, నాకూ పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించలేదని మిథాలీ అన్నారు. సినిమా చూశాక కూడా ఆమె ఈ మాట అనాలని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు తాప్సీ. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ఈ చిత్రబృందం ప్రకటించింది. ఇక బాలీవుడ్లో ఉన్న మరో గ్లామరస్ హీరోయిన్ అనుష్కా శర్మ. తాప్సీలానే అనుష్క కూడా చాలెంజింగ్ రోల్స్ చేస్తుంటారు. ‘ఎన్హెచ్ 10, పరీ, సూయీ థాగా’ చిత్రాలు అందుకు ఓ ఉదాహరణ. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని, నటనకు చిన్న బ్రేక్ ఇచ్చారు అనుష్కా శర్మ. ఇప్పుడు మళ్లీ నటించాలనుకుంటున్నారు. బ్రేక్ తర్వాత ఓ చాలెంజింగ్ రోల్తో ప్రేక్షకులకు కనిపించనున్నారు. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్లో అనుష్క నటిస్తున్నారు. ‘చక్ద ఎక్స్ప్రెస్’ టైటిల్తో ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా కాన్సెప్ట్ నచ్చి, ‘ఎన్హెచ్ 10’, ‘పరీ’లాంటి చిత్రాలను నిర్మించిన అనుష్కా శర్మ ‘చక్ద ఎక్స్ప్రెస్’ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలామందికి ఓ కనువిప్పు అని అనుష్కా శర్మ చెబుతూ – ‘‘మహిళలు క్రికెట్ ఆడటం అనేది పెద్ద విషయంగా అనుకుంటున్న సమయంలో ఝలన్ క్రికెటర్గా మారి, ప్రపంచ వేదికపై తన దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆమె జీవితం గురించి మాత్రమే కాదు.. మహిళా క్రికెట్ గురించి కూడా చెబుతుంది. క్రికెట్ ఆడటం ద్వారా మహిళలకు ఓ మంచి కెరీర్ ఉండదనే ఆలోచనా ధోరణిని మార్చేందుకు ఝులన్ కృషి చేశారు. భారతదేశంలో మహిళా క్రికెట్లో విప్లవాత్మక మార్పులు చేసినందుకు ఝులన్, ఆమె సహచరులకు సెల్యూట్ చేయాలి’’ అన్నారు. ఇక.. ప్రాక్టీస్ అంటారా? ఇంట్లోనే మంచి క్రికెటర్ ఉన్నారు కాబట్టి.. క్రికెటర్ పాత్ర కోసం భర్త విరాట్ నుంచి అనుష్క టిప్స్ అడిగి తెలుసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు తాప్సీ సినిమాల పరంగా స్కోర్ యాభైకి టచ్ అవుతుంటే అటు అనుష్కా శర్మ స్కోర్ పాతిక చిత్రాల వరకూ ఉంది. అయితే పట్టుమని పది సినిమాల స్కోర్ కూడా లేని జాన్వీ కపూర్ కూడా క్రికెట్ బ్యాట్తో నటిగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకోవడానికి రెడీ అయ్యారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ ‘ధడక్’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్ని జాన్వీ అంగీకరించడం విశేషం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్లో తొలి మహిళా అధికారిగా పాల్గొన్న గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ మెప్పించగలిగారు. ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో ఉన్న సినిమా సైన్ చేశారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్ క్రికెటర్లుగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు జాన్వీ. హెల్మెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను బుధవారం షేర్ చేసి, ‘‘క్రికెట్ క్యాంప్.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’’ అని పేర్కొన్నారు జాన్వీ. శరన్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ‘శభాష్ మిథు’, ‘చక్ద ఎక్స్ప్రెస్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ .. చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్ మంచి ఆర్టిస్టులే కాబట్టి వెండితెర క్రికెటర్లుగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకుంటారని చెప్పొచ్చు. -
రానున్న మరొక క్రికెటర్ బయోపిక్.. లీడ్ రోల్లో అనుష్క ?
Anushka Sharma Not Doing Cricketer Jhulan Goswami Biopic: బాలీవుడ్లో పాపులర్ క్రికెటర్స్పై బయోపిక్ చిత్రాలు చాలా వచ్చాయి. ఎంఎస్ ధోని నుంచి ప్రస్తుతం రాబోతున్న 'శభాష్ మిథూ', '83' వరకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. తాజాగా మరో క్రికెటర్ బయోపిక్ రానుంది. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ 'జులన్ నిషిత్ గోస్వామి'పై సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నటి అనుష్క ప్రొడక్షన్ హౌజ్ 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' నిర్మిస్తుంది. ముందుగా ఈ చిత్రంలో జులన్ గోస్వామిగా అనుష్క శర్మ నటించాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల అనుష్క తప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అనుష్క శర్మ నటించిన 'పరి' చిత్రం డైరెక్టర్ ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గత సంవత్సరం కోల్కతా ఈడెన్ గార్డెన్స్లోని క్రికెట్ గ్రౌండ్లో అనుష్క, జులన్ షూటింగ్కు సంబంధించిన అనేక ఫొటోలు బయటకొచ్చాయి. ఆ ఫొటోలు అనుష్క అభిమానుల సోషల్ మీడియా పేజీలలో తెగ వైరల్ అయ్యాయి. అవి అలా వైరల్ కావడంతో అనుష్క శర్మ జులన్ గోస్వామి బయోపిక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫొటోల్లో దర్శకుడు ప్రోసిత్ రాయ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జులన్ గోస్వామిగా కొత్త నటిని తీసుకోనున్నారని సమాచారం. ఈ జులన్ గోస్వామి బయోపిక్ను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్తో కలిసి నిర్మించనున్నారు. ఈ బయోపిక్లో జులన్ స్వస్థలం పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని చక్దాహ నుంచి లార్డ్స్ వరకు ఆమె ప్రయాణంతోపాటు మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై ఇండియా ఓటమిని చూపించనున్నారు. పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహిత, మహిళల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జులన్ నిషిత్ గోస్వామిపై తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. అలాగే 2007లో ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా జులన్ ఎంపికైంది. జులన్ గోస్వామి 2008-20011 మధ్య భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది. -
టాప్ ర్యాంకు కోల్పోయిన మిథాలీ... అదరగొట్టిన ఝులన్ గోస్వామి
ICC ODI Rankings: భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన టాప్ ర్యాంక్ను కోల్పోయింది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో ఆమె అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్లో మిథాలీ విఫలం కావడం ఆమె ర్యాంక్పై ప్రభావం చూపింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ 738 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా... రెండో స్థానంలో ఉన్న లిజెల్లే లీ (దక్షిణాఫ్రికా) 761 పాయింట్లతో తొలి ర్యాంక్ను అందుకుంది. అదే విధంగా... భారత జట్టు మరో బ్యాటర్ స్మృతి మంధాన 710 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక బౌలర్లలో ఝలన్ గోస్వామి 727 పాయింట్లతో రెండు స్థానాలు పురోగమించి.. ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్లో భాగంగా ఝలన్ గోస్వామి 4 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. బ్యాట్తోనూ సత్తా చాటిన ఆమె... ఆల్రౌండర్ల జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ విభాగంలో గతంలో టాప్-4లో ఉన్న దీప్తి శర్మ.. ప్రస్తుత ర్యాంకింగ్స్లో ఐదో స్థానానికి పడిపోయింది. చదవండి: Unmukt Chand: అమెరికన్ లీగ్లో పరుగుల సునామీ సృష్టించిన మాజీ భారత బ్యాటర్ -
అరుదైన 600 వికెట్ల క్లబ్లో చేరిన టీమిండియా పేసర్
Jhulan Goswami Breaches 600 Wickets Mark: భారత మహిళా జట్టు స్టార్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన నామమాత్రపు ఆఖరి వన్డేలో మెగ్ లానింగ్ను ఔట్ చేయడం ద్వారా అరుదైన 600 వికెట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు 192 వన్డేలు, 11 టెస్ట్లు, 56 టీ20ల్లో 337 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఝులన్.. దేశవాళీ టోర్నీల్లో 264 వికెట్లు పడగొట్టి తన వికెట్ల సంఖ్యను 601కి పెంచుకుంది. ఝులన్ పేరిట ఇప్పటికే వన్డేల్లో అత్యధిక వికెట్ల (240) రికార్డు నమోదై ఉంది. 38 ఏళ్ల ఝులన్ వన్డే ఫార్మాట్లో 200 వికెట్లు పడగొట్టిన ఏకైక మహిళా బౌలర్గా నేటికీ చలామణి అవుతుంది. Milestone Alert🚨: #TeamIndia stalwart @JhulanG10 has now completed 600 career wickets.🥁 #AUSvIND https://t.co/2QvSIEWMAk pic.twitter.com/lJOErMGq0e — BCCI Women (@BCCIWomen) September 26, 2021 ఇక నేటి మ్యాచ్ విషయానికొస్తే 3 వన్డేల సిరీస్ను 0-2తో ఇదివరకే కోల్పోయిన టీమిండియా.. నామమాత్రపు మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసీస్ వరుస విజయాల(26 విజయాలు) పరంపరకు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగా.. మిథాలీ సేన 49.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యస్తిక భాటియా(69 బంతుల్లో 9 ఫోర్లతో 64), షెఫాలీ వర్మ(91 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో చేలరేగగా.. దీప్తి శర్మ(30 బంతుల్లో 3 ఫోర్లతో 31), స్నేహ్ రాణా(27 బంతుల్లో 5 ఫోర్లతో 30) రాణించి ఆసీస్ పర్యటనలో తొలి విజయాన్ని అందించారు. 3/37తో చెలరేగిన ఝులన్ గోస్వామికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: భారత మహిళల రికార్డు ఛేజింగ్.... ఆసీస్ విజయాలకు బ్రేక్ -
మిథాలీ, జులన్ లేకపోవడం లోటే: హర్మన్
సిడ్నీ: భారత టి20 ప్రపంచకప్ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ దిగ్గజాలు మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలు లేకపోవడం లోటేనని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. అయితే ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని 30 ఏళ్ల కెప్టెన్ పెర్కొంది. మిథాలీ, జులన్ ఇద్దరూ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పగా ప్రస్తుత భారత మహిళల జట్టు పూర్తిగా యువ క్రికెటర్లతో ఉంది. ప్రస్తుత జట్టులో అమ్మాయిల సగటు వయసు 22.8 ఏళ్లే! ఇందులో ఒక్క హర్మన్ప్రీతే అందరికంటే సీనియర్. ఆస్ట్రేలియాలో ఈ నెల 21న మొదలయ్యే పొట్టి మెగా ఈవెంట్ కోసం సన్నద్ధమయ్యేందుకు హర్మన్ సేన గత నెలలోనే కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. సన్నాహకంగా ఇంగ్లండ్, ఆసీస్లతో కలిసి ముక్కోణపు టి20 సిరీస్ ఆడింది. ప్రపంచకప్కు ముందు మీడియాతో కెప్టెన్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జట్టు సత్తా, సామర్థ్యంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. చక్కని కూర్పుతో.... ‘ఇప్పటికే మేం ఇద్దరు అనుభవజ్ఞుల సేవల్ని కోల్పోయాం. ఆ లోటు పూడ్చలేనిది. ఇప్పుడు యువ ప్రతిభావంతులపైనే ఆధారపడ్డాం. వీరికి సత్తా చాటే సామర్థ్యం ఉంది. మా సహచరులెవరిలోనూ మేం అంతగా అనుభవం లేని యువ క్రికెటర్లం అనే భావనే లేదు. ఆశించిన స్థాయిలో వారంతా రాణిస్తున్నారు. జట్టు చక్కని కూర్పుతో ఉంది. జట్టుకు అవసరమైన రోజు శక్తికి మించి అదనపు భారం మోసేందుకు, బాధ్యతలు స్వీకరించేందుకు మా అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. రోజురోజుకీ మా జట్టు బాగా పటిష్టమవుతోంది’ అని హర్మన్ వ్యాఖ్యానించింది. అప్పటి నిరాశ ఇప్పుడెందుకు... ‘మూడేళ్ల క్రితం 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన చేదు అనుభవం ఎప్పుడో మరిచిపోయాం. ఇప్పుడు తాజాగా ఈ టోర్నీని ఆరంభిస్తాం. మా శక్తిమేర మేం రాణిస్తాం. ఒకవేళ టి20 కప్ గెలిస్తే అదే పెద్ద బహుమతి అవుతుంది. ఏదేమైనా ఒత్తిడి లేకుండా ఆడేందుకే ప్రయత్నిస్తాం. సహచరుల్లో కొందరికి ఇక్కడ మహిళల బిగ్బాష్ లీగ్ ఆడిన అనుభవం ఉంది. అది ఇప్పుడు అక్కరకొస్తుంది. మేం కప్ కొడితే మాత్రం ఎన్నో మారిపోతాయి. ఒకవేళ మహిళల ఐపీఎల్ అంటూ పెడితే మాకెంతో మేలు జరుగుతుంది’ అని వరుసగా ఏడో టి20 ప్రపంచకప్లో ఆడనున్న హర్మన్ తెలిపింది. -
సూపర్ బ్లేజర్స్
జైపూర్: అమ్మాయిల మెరుపులు మొదలయ్యాయి. అబ్బాయిలకు తీసిపోని విధంగా ఫైనల్ ఓవర్ ఉత్కంఠ పెంచింది. చివరకు ట్రయల్ బ్లేజర్స్ 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. మహిళల టి20 చాలెంజ్లో సోమవారం జరిగిన పోరులో సూపర్ నోవాస్ ఆఖరిదాకా వచ్చి ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (67 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్లు) ఒంటరి పోరాటం చేసింది. రాధా యాదవ్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సూపర్నోవాస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) రాణించింది. ఎకల్స్టోన్ 2 వికెట్లు పడగొట్టింది. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మంధాన ఒక్కతే... ట్రయల్ బ్లేజర్స్ ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్ రెండో బంతి నుంచి ఆఖరి ఓవర్ రెండో బంతి దాకా బ్యాటింగ్ చేసింది. జట్టు స్కోరులో 65 శాతం పరుగులు చేసి మూల స్తంభంలా నిలిచింది. ఆమెతో పాటు బ్యాటింగ్కు దిగిన వారిలో హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 36; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ 2 పరుగులను మించి చేయలేకపోయారు. అసాధారణ పోరాటం, కళ్లు చెదిరే షాట్లతో స్మృతి మంధాన ఒక్కతే బ్లేజర్స్ ఇన్నింగ్స్ను నడిపించింది. హర్లీన్ అండతో ఆఖరి దాకా... కెప్టెన్ మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సుజిబేట్స్ ఒక పరుగే చేసి అనూజా పాటిల్ బౌలింగ్లో వెనుదిరిగింది. తర్వాత వన్డౌన్ బ్యాట్స్మన్ హర్లీన్ జతకలిసింది. ఇద్దరు 17 ఓవర్లపాటు సూపర్నోవాస్ బౌలర్లకు చిక్క కుండా దొరకుండా విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో స్మృతి 47 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. 15వ ఓవర్లో ఫిఫ్టీ చేసుకున్న తర్వాత మంధాన ఒక్కసారిగా శివమెత్తింది. మరో 40 పరుగులు చేసేందుకు ఆమె కేవలం 20 బంతులే ఆడింది. ఆఖరిదాకా అండగా నిలిచిన హర్లీన్ను సోఫీ డివైన్ ఔట్ చేయడంతో 119 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో స్మృతి, దీప్తిశర్మ (0), స్టెఫానీ టేలర్ (2) ఔటయ్యారు. రాణించిన హర్మన్ప్రీత్ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన సూపర్నోవాస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియా పూనియా (2) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. తర్వాత జయంగని (34 బంతుల్లో 26; 2 ఫోర్లు), జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఇన్నింగ్స్ను కాసేపు నడిపించారు. రెండో వికెట్కు 49 పరుగులు జోడించాక జెమిమా రనౌట్ కావడంతో కష్టాలు మొదలయ్యాయి. స్వల్ప వ్యవధిలో జయంగని, సీవర్ (1) నిష్క్రమించడంతో ఒత్తిడి పెరిగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్నా... చేయాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. డివైన్తో కలిసి ఐదో వికెట్కు 48 పరుగులు జోడించింది. ఉత్కంఠ పెంచిన ఆఖరి ఓవర్ చివరి 12 బంతుల్లో సూపర్ నోవాస్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో 19వ ఓవర్ వేసిన ఎకల్స్టోన్ రెండే పరుగులిచ్చి సోఫీ డివైన్ (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు)ను ఔట్ చేసింది. ఇక 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సివుండగా... సీనియర్ బౌలర్ జులన్ ఓవర్లో హర్మన్ప్రీత్ 4 బౌండరీలతో అదరగొట్టింది. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా... లియా తహుహు రనౌట్ కావడంతో బ్లేజర్స్ ఊపిరిపీల్చుకుంది. -
అగ్రస్థానంలోనే మంధాన, జులన్
దుబాయ్: భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జులన్ గోస్వామి తమ టాప్ స్థానాలను నిలుపుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో స్మృతి 797 పాయింట్లతో బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... బౌలర్ల కేటగిరీలో జులన్ గోస్వామి 730 పాయింట్లతో నెం.1గా కొనసాగుతోంది. భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ 713 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. టాప్–10 బ్యాట్స్వుమెన్లో భారత్ నుంచి మిథాలీ, స్మృతి మినహా వేరెవరూ చోటు దక్కించుకోలేకపోయారు. బౌలింగ్ విభాగంలో పేసర్ శిఖా (688 పాయింట్లు), లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్ (656 పాయింట్లు) వరుసగా ఐదు, పదో స్థానాలను దక్కించుకున్నారు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా (22 పాయింట్లు) అగ్రస్థానం, ఇంగ్లండ్ 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ (16 పాయింట్లు), న్యూజిలాండ్ (14), దక్షిణాప్రికా (13) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. దీంతో న్యూజిలాండ్ వేదికగా 2021లో జరుగనున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్నకు టాప్–5లో నిలిచిన ఈ ఐదు దేశాలు అర్హత సాధించాయి. శ్రీలంక క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది. -
రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం
-
భారత మహిళలదే వన్డే సిరీస్
ముంబై: ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత మహిళలు సిరీస్ను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 41.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. తద్వారా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్నారు. భారత బ్యాటర్స్లో స్మృతీ మంధాన(63), మిధాలీ రాజ్(47 నాటౌట్), పూనమ్ రౌత్(32)లు రాణించి జట్టు ఘన విజయానికి తోడ్పడ్డారు. ఇంగ్లండ్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే రోడ్రిగ్స్(0) వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో మంధాన-పూనమ్ రౌత్ల జోడి రెండో వికెట్కు 73 పరుగులు జోడించారు. ఇక మూడో వికెట్కు మంధాన-మిధాలీ రాజ్ జోడి 66 పరుగుల్ని జత చేయడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. . ఇంగ్లండ్ మహిళల్లో నటలీ స్కీవర్(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. జులన్ గోస్వామి, శిఖా పాండేలు చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మూడో వన్డే గురువారం జరుగనుంది. -
చెరో నాలుగు వికెట్లతో చెలరేగిపోయారు..
ముంబై: ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా భారత మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. జులన్ గోస్వామి, శిఖా పాండేల బౌలింగ్ ధాటికి విలవిల్లాడింది. వీరిద్దరూ చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ మహిళల్లో నటలీ స్కీవర్(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓ దశలో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో స్కీవర్ ఆదుకున్నారు. కాగా, భారత మహిళా బౌలర్ల విజృంభణకు మిగతా వారు వరుస పెట్టి క్యూకట్టారు. దాంతో ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకే చాపచుట్టేసింది. ప్రధానంగా జులన్, శిఖాల పదునైన బంతులకు ఇంగ్లండ్ దాసోహమైంది. మరొక బౌలర్ పూనమ్ యాదవ్కు రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదవండి: ఏక్తా మాయాజాలం -
మహిళల జట్టు : టీమిండియా ఘనవిజయం
-
త్వరలో వరల్డ్కప్ : స్టార్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ : మరో మూడు నెలల్లో ట్వంటీ20 ప్రపంచ కప్ ఉందనగా భారత స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ జులన్ గోస్వామి ఈ ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. భారత తొలి టీ20 జట్టులో సభ్యురాలు జులన్ 12 ఏళ్ల కెరీర్ అనంతరం టీ20ల నుంచి వైదొలిగారు. ఆమె నిర్ణయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. టీ20 జట్టులో తనకు చోటు ఇచ్చి, మద్దతు తెలిపిన అందరికీ జులన్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ప్రపంచ కప్లో భారత జట్టు మంచి ఫలితాలు రాబట్టాలని ఆమె ఆకాంక్షించారు. డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్టిండీస్ సొంతగడ్డపై ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరుకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో జులన్ రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ప్రతికూలాంశమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, వన్డే క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్గా అరుదైన ఘనతను గోస్వామి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా టెస్టులు ఆడని జులన్.. పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలకండతో కేవలం వన్డేలకే పరిమితం కానున్నారు. కెరీర్లో 68 టీ20 మ్యాచ్లాడిన జులన్ 56 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాపై 2012లో తీసిన 5/11 ఆమె టీ20 బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన. బ్యాటింగ్లో 46 ఇన్నింగ్స్లాడి 405 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 37 నాటౌట్. టీ20ల్లో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ సైతం జులనే కావడం విశేషం. జులన్ గోస్వామి.. ది గ్రేట్ -
మేము యో-యో టెస్టు పాసయ్యాం..
బెంగళూరు: టీమిండియా క్రికెటర్లకు యో-యో టెస్టు ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. మైదానంలో మెరుగైన ఆట ప్రదర్శించినా, యో యో టెస్టులో విఫలమైతే జట్టులో చోటు దక్కదు. ఇటీవల మహ్మద్ షమీ, అంబటి రాయుడు యో యో టెస్టులో విఫలం కావడంతో జట్టులో స్థానాన్ని కోల్పోయారు. తాజాగా భారత మహిళల జట్టు సభ్యులందరూ యో యో పాసయ్యారట. ఈ విషయాన్ని బౌలర్ జులన్ గోస్వామి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యో యో టెస్టులో జట్టు సభ్యులందరం పాసయ్యాం అని గోస్వామి పేర్కొంది. ఈ క్రమంలోనే జట్టులోని తన సహచర క్రీడాకారిణులను ‘వెల్డన్ గర్ల్స్’ అంటూ అభినందించింది. ప్రస్తుతం కొందరు క్రీడాకారిణీలు ఇతర దేశాల్లో క్రికెట్ లీగ్లు ఆడుతున్నారు. ఈ కారణంగా వీరు యో యో టెస్టుకు హాజరుకాలేదు. త్వరలో వీరు కూడా హాజరవుతారని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. -
సిల్వర్స్క్రిన్పై జులన్ గోస్వామి జీవిత కథ
-
‘ప్రపంచకప్ సాధించడమే మా అంతిమ లక్ష్యం’
సాక్షి, స్పోర్ట్స్ : ప్రపంచకప్ సాధించడమే అంతిమ లక్ష్యమని భారత మహిళా పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు. కాలి మడమ గాయంతో ఆమె దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తిరుగొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మహిళల జట్టు ప్రపంచకప్ గెలువలేదు. గతేడాది అడుగుదూరంలో కప్ను చేజార్చుకున్న భారత అమ్మాయిలకు ఈ ఏడాది నవంబర్లో టీ20 ప్రపంచకప్ రూపంలో మరో అవకాశం రానుంది. ఈ నేపథ్యంలో గోస్వామి మాట్లాడుతూ.. ‘ టీ20 ప్రపంచకప్ కసరత్తు దక్షిణాఫ్రికా పర్యటనతోనే మొదలైంది. ఇంకా సుమారు ఏడాది సమయం ఉండగా కసరత్తు మొదలు పెట్టడం మంచి పరిణామం. ఈ వ్యవధిలో భారత మహిళలు బీజీ షెడ్యూలతో రాటు దేలుతారు. భారత్లో ఆస్ట్రేలియాతో, ఇంగ్లండ్లో ట్రై టీ20 సిరీస్ ప్రపంచకప్ సన్నహాకానికి ఉపయోగపడుతాయి. ఒక వేళ ప్రపంచకప్ గెలిస్తే మా కల నెరవేరినట్లే. నా కెరీర్ ప్రారంభించినప్పుడే ప్రపంచకప్ గెలవాలనే కోరిక నా మెదడులో నాటుకుపోయింది. నాలుగేళ్ల కోసారి వచ్చే ఈ టోర్నీ గెలుపు ఒలింపిక్ బంగారు పతకంతో సమానం. టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీస్కు వెళ్లడమే మా లక్ష్యమైనప్పటికీ, అంతిమ లక్ష్యం మాత్రం ప్రపంచకప్ సాధించడమే.’ అని 16 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న గోస్వామి తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనపై స్పందిస్తూ.. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవడంపై స్పందిస్తూ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిగించిన స్పూర్తే విజయానికి కారణమని గోస్వామి అభిప్రాయపడ్డారు. అక్కడికి వెళ్లే ముందు సచిన్ మహిళా క్రికెటర్లతో మాట్లాడాడని తెలిపారు. అక్కడి పిచ్లపై అనుసరించాల్సిన వ్యూహాలు, పరిస్థితులపై అవగాహన కల్పించారని, జట్టులోని ప్రతి ఒక్కరిలో స్పూర్తిని నింపారని గోస్వామి చెప్పుకొచ్చారు. బీజీ షెడ్యూల్ ఏర్పాటు చేయడంలో బీసీసీఐ కృషి కూడా ఎంతో ఉందని ఆమె తెలిపారు. డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్టిండీస్లో ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరుకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. గోస్వామి 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళ బౌలర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె గాయంతో దక్షిణాఫ్రికా పర్యటన టీ20 సిరీస్ నుంచి దూరమయ్యారు. రెండు మూడు వారాల విశ్రాంతి తర్వాత మార్చిలో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగనున్నారు. -
జులన్ గోస్వామి.. ది గ్రేట్
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనోబలం, శ్రమించే గుణం, సమస్యను సవాల్గా స్వీకరించే తత్వం ప్రధానం. ఇలా కఠోర శ్రమ తర్వాత వరించే విజయం చాలా మధురంగా ఉంటుంది. ఇలా ఇప్పుడు సక్సెస్ను ఆస్వాదిస్తున్న వారిలో జులన్ గోస్వామి ఒకరు. భారత మహిళా క్రికెట్లో బౌలింగ్ ఆల్ రౌండర్గా ప్రత్యేక స్థానం జులన్ సొంతం. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన జులన్ ... ఇప్పుడు ఆమె ప్రపంచ గర్వించే మహిళా బౌలర్ . మహిళా ప్రపంచ క్రికెట్లో ఫాస్టెస్ట్ బౌలరే కాదు.. అత్యధిక వన్డే వికెట్లను సాధించిన బౌలర్గా కూడా గుర్తింపు సాధించారు. 1982లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో జన్మించిన జులన్... తన 13వ ఏట క్రికెట్ను సరదాగా ఆరంభించారు. తొలుత తన ఇంటికి దగ్గరలో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడిన జులన్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పొడగరి అయిన ఆమె ఫాస్ట్ బౌలింగ్ను వేస్తుంటే తోటి బాలురు మాత్రం సునాయాసంగా ఆడేశావారంట. ఎంతలా అంటే జులన్ బౌలింగ్ వేస్తే చాలు సిక్స్లతో విరుచుకుపడేవారు. ఆ క్రమంలోనే నువ్వు ఫాస్ట్ బౌలింగ్కు పనికిరావంటూ కొంతమంది అబ్బాయిల్ని నుంచి కూడా ఆమెకు హేళన కూడా ఎదురైంది. కానీ అవేవీ జులన్ లక్ష్యాన్ని అడ్డుకోలేదు.. ఆమెలో మరింత పట్టుదలను తీసుకొచ్చాయి. తన కెరీర్లో సక్సెస్ రుచిని చూసిన 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు కల్గిన జులన్ గురించి మరికొన్ని విషయాలు.. 1997 మహిళా వరల్డ్ కప్తో.. 1997లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగింది. దాన్ని చూడటానికి స్కూల్ బృందంతో కలిసి వెళ్లిన జులన్ .. ఏదొక రోజు భారత క్రికెట్కు ఆడాలని బలంగా నిర్ణయించుకుందట. ప్రధానంగా మహిళల క్రికెట్లో దిగ్గజ క్రికెటర్లైన బెలిందా క్లార్క్, డెబ్బీ హాకీ, కెథరిన్ ఫిట్జాపాట్రిక్ ఆట చూసిన తర్వాత క్రికెట్నే లక్ష్యంగా ఎంచుకున్నారు జులన్. ఆనాటి గేమ్కు బాల్ గర్ల్ వాలంటరీగా చేసే అవకాశం కూడా జులన్ రావడం మరొక విశేషం. ఇలా పలువురు ఆటను దగ్గర్నుంచి గమనించిన ఆమె.. తన ప్రస్థానాన్ని ఫుట్బాల్ నుంచి క్రికెట్ వైపు మార్చుకున్నారు. తొలుత ఫుట్బాల్ కు జులన్ వీరాభిమాని. అయితే భారత్లో క్రికెట్ మినహా ఏ ఇతర క్రీడా మ్యాచ్లు టీవీల్లో ప్రసారమయ్యేవి కావు. దాంతో ఫుట్బాల్పై ఆశలు వదులుకుని, క్రికెట్ వైపు నడిచిన క్రీడాకారిణే మన జులన్. 'తొలి' టెస్టు సిరీస్ గెలుపులో మార్గదర్శి జులన్ గోస్వామి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను 2002లో ఆరంభించింది. ఇంగ్లండ్తో చెన్నైలో జరిగిన మ్యాచ్ ద్వారా తొలుత వన్డేల్లో ఆరంగేట్రం చేసిన జులన్.. లక్నోలో ఇంగ్లండ్తో మ్యాచ్లో తొలి టెస్టు ఆడింది. ఇదిలా ఉంచితే, 2006లో ఇంగ్లండ్లో పర్యటించిన భారత మహిళల జట్టు..ఇంగ్లండ్పై తొలి టెస్టు సిరీస్ను సాధించింది. ఈ సిరీస్లో జులన్దే కీలక పాత్ర. మిథాలీ నేతృత్వంలోని భారత జట్టు తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో విజయం సాధించింది. తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించడంతో పాటు బ్యాటింగ్లో సైతం రాణించింది. తొలి ఇన్నింగ్స్లో 69 పరుగులతో జులన్ మెరిసింది. ఇక రెండో టెస్టులో జులన్ బౌలింగ్లో చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ను వణికించింది. ఫలితంగా రెండో టెస్టును భారత మహిళల జట్టు గెలిచి ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించింది. ఒకటికంటే ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడిన సిరీస్ల్లో భారత్ విజయం సాధించడం కూడా ఇదే ప్రథమం. ఇలా ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల జట్టు టెస్టు సిరీస్ గెలుపులో జులన్ మార్గదర్శి అయ్యింది.అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ సిరీస్లో మాత్రమే భారత్ గెలిచింది. ధోని చేతుల మీదుగా అవార్డు.. 2007.. జులన్ కెరీర్లో మధుర జ్ఞాపకాన్ని తీసుకొచ్చిన సంవత్సరం. ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ఏడాది. అప్పటికి మహిళలకు అవార్డులు ప్రవేశపెట్టి ఏడాదే కాగా, రెండో సంవత్సరంలోనే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు జులన్ వరించడం విశేషం. అయితే ఆ అవార్డును అప్పటి భారత పురుషుల జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని చేతుల మీదుగా అందుకోవడడం మరో విశేషం. జోహన్నెస్బర్గ్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో జులన్ను ఐసీసీ వుమెన్స్ అవార్డుకు ఎంపిక చేయడంతోనే కొంత ఆశ్చర్యకర పరిస్థితి చోటు చేసుకుంది. అప్పటికే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్గా రాణిస్తున్న జులన్ ఎవ్వరో చాలా మందికి తెలీదు. దాంతో జులన్ ఎవరు అనే దానిపై కాసేపు చర్చసాగింది. అయితే జులన్ అవార్డును స్వీకరించే క్రమంలో ఆమెకు ఘనమైన స్వాగతం లభించింది. కాగా, ఆ ఏడాది ఐసీసీ అవార్డులకు ఏ ఒక్క భారత పురుష క్రికెటర్ ఎంపిక కాకపోవడం గమనార్హం. ఫాస్టెస్ మహిళా బౌలర్.. మహిళలు ఫాస్ట్ బౌలర్ రాణించాలంటే విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. మరి ప్రపంచ ఫాస్టెస్ బౌలర్ అనిపించుకోవాలంటే అది తలకు మించిన భారం. అయితే ఫాస్ట్ బౌలర్గానే కాకుండా వేగవంతమైన బంతుల్ని సంధించడంలో జులన్ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కాథరిన్ ఫిట్జ్పాట్రిక్ తర్వాత జులనే ఫాస్టెస్ట్ వుమెన్ బౌలర్. గంటకు 120 కి.మీ నుంచి 130 కి.మీ మధ్యలో బౌలింగ్ వేయడంలో జులన్ దిట్ట. జులన్ వేసే ఎక్స్ట్రా బౌన్స్ బంతులు ఆమెకు అదనపు బలం. లీడింగ్ వికెట్ టేకర్గా.. గతేడాది వన్డే ఫార్మాట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనతను జులన్ గోస్వామి తన ఖాతాలో వేసుకుంది. నాలుగు దేశాల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కాథరిన్ ఫిట్జ్పాట్రిక్(180)వికెట్ల మార్కును జులన్ అధిగమించింది. అదే ఊపును కొనసాగిస్తూ వన్డేల్లో 200 వికెట్లు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్గా జులన్ ఇటీవల రికార్డు నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో జులన్ రెండొందల వికెట్ల మార్కును చేరింది. మరొకవైపు అన్ని ఫార్మాట్లలో 290 వికెట్లతో భారత్ మహిళా జట్టు తరపున ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచింది. కెప్టెన్గా జులన్ 2008లో తొలిసారి భారత మహిళల జట్టుగా కెప్టెన్గా ఎంపికైన జులన్ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది. మిథాలీ రాజ్ నుంచి కెప్టెన్ పగ్గాలు అందుకున్న జులన్ 25 వన్డేలకు సారథిగా వ్యవహరించారు. అదే ఏడాది వన్డేల్లో 100 వికెట్ల మార్కును జులన్ చేరుకుని ఆ ఘనత సాధించిన నాల్గో మహిళా బౌలర్గా నిలిచారు. ఇక 2010లో అర్జున అవార్డు, 2012లో పద్మశ్రీ అవార్డును జులన్ అందుకున్నారు. కాగా, డయానా ఎడ్డుల్లి తర్వాత పద్మశ్రీ అవార్డు పురస్కారం పొందిన రెండో మహిళా క్రికెటర్గా జులన్ గుర్తింపు సాధించారు. రోజూ 80 కి.మీ ప్రయాణం.. ఈరోజు జులన్ విజయవంతమైన భారత మహిళా క్రికెటర్గా గుర్తింపు పొందిందంటే దానికి ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తన 15 ఏటనే సీరియస్గా క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన జులన్.. రోజూ 80 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. సొంత వూరికి దగ్గరగా ప్రాక్టీస్ సెషన్ లేకపోవడంతో కోల్కతాకు రోజూ రైళ్లో వెళ్లి వచ్చేది. ఉదయాన్నే 4.30 ని.లకు నిద్ర లేవడం, ట్రైన్ పట్టుకుని కోల్కతాకు చేరుకోవడమే ఆమె ప్రధాన విధి. కొన్నిసార్లు రైలు మిస్సయిన సందర్బంలో ప్రాక్టీస్కు దూరం కావాల్సి వచ్చేది. అయినా ఎప్పుడూ నిరాశ పడలేదు. ఈ క్రమంలోనే తల్లి దండ్రులు క్రికెట్ కంటే చదువుపైనే ఆసక్తిని చూపితేనే భవిష్యత్తు ఉంటుందని హితబోధ చేసేవారు. ఆ రెండింటిని ఏనాడు అలక్ష్యం చేయకుండా ముందుకు సాగిన జులన్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఇప్పటికీ తనదైన ముద్రతో దూసుకుపోతున్న జులన్.. ది గ్రేట్.. హ్యాట్సాఫ్ టు జులన్. - బి. నరేష్ బాబు -
సఫారీలతో మ్యాచ్: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!
పోట్చెఫ్స్ట్రూమ్: ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ట్వంటీ సిరీస్ మొదలవ్వక ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత మహిళల క్రికెట్ జట్టులో సీనియర్ క్రికెటర్, స్టార్ పేసర్ జులన్ గోస్వామి ఏకంగా మొత్తం సిరీస్కే దూరమైంది. కాలి గాయం కారణంగా సీనియర్ ప్లేయర్ జులన్ గోస్వామి జట్టు నుంచి తప్పుకున్నారని బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ బౌలర్ జట్టుకు దూరం కావడం మిథాలీరాజ్ సేనకు ప్రతికూలాంశం. వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో టీ20 సిరీస్ను కైవసం చేసుకోవాలని భావించిన టీమిండియాకు జులన్ లేకపోవడంతో బౌలింగ్ దళం కాస్త బలహీనమైనట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలి గాయంతో బాధపడుతోన్న జులన్ కి నిన్న ఎమ్మారై స్కాన్ టెస్ట్ చేశాం. అందులో గాయం తీవ్రమైందని వైద్యులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు జులన్ కు సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చామని బీసీసీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆమె స్థానంలో ఎవరికీ అవకాశం ఇస్తున్నారో మాత్రం మేనేజ్మెంట్ చెప్పలేదు. మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. వరుసగా రెండు వన్డేలు నెగ్గిన మిథాలీ సేన గాయం కారణంగా జులన్ మూడో వన్డేకు దూరమైన వన్డేలో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. మహిళల అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా గోస్వామి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. స్మృతి మంధానతో పాటు, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. శిఖా పాండే, దీప్తి శర్మ, పూజ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగలరు. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టులో డు ప్రీజ్, లారా వోల్వార్డ్ నిలకడగా ఆడారు. సఫారీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ ఫామ్లో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య నేడు జరగనున్న తొలి టీ20లో ఆసక్తికర పోరు జరగనుంది. -
నా తొలి వికెట్ క్యాచ్ మిథాలీ పట్టింది!
కింబర్లే: తాను తీసిన 200 వికెట్లలో ప్రతి వికెటూ ప్రత్యేకమైనదేనని భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు. గత బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు ఓపెనర్ లూరే వికెట్ తీయడంతో వన్డే క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్గా జులన్ గోస్వామి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జులన్ మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు నేను తీసిన ప్రతి వికెట్ నాకు గుర్తుంది. నా తొలి వికెట్ 2002లో ఇంగ్లండ్పై సాధించా. చెన్నైలో జరిగిన మ్యాచ్లో కారోలిన్ అట్కిన్స్ గాల్లోకి లేపిన బంతిని మిథాలీరాజ్ క్యాచ్ పట్టింది. ఇప్పటి వరకు నేను సాధించిన ప్రతి వికెట్ నాకు ప్రత్యేకం. నిజానికి ఈ ఘనత సాధించడానికి నాకెక్కువ సమయం పట్టలేదు. అంతకు ముందు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నమోదు చేయడానికి మూడు వికెట్ల దూరంలో నిలిచి చాలా సమయం తీసుకున్నా.’ అని జులన్ తెలిపారు. రెండో వన్డే విజయంపై.. ఆతిథ్య జట్టుపై వరుసగా రెండో వన్డేలో గెలవడంపై స్పందిస్తూ.. ‘ ఈ విజయం పట్ల గర్వంగా ఉంది. నా సహచర ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్లో మంధన, హర్మన్, వేద అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. నేను 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా కుటుంబసభ్యులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మధ్యమధ్యలో గాయాల బారిన పడతాం. ఆటలో ఇవన్నీ మామూలే. సిరీస్ల మధ్య రెండు మూడు నెలల విరామం ఉండటంతో గాయాల నుంచి కోలుకుని తిరిగి ఫామ్ను అందుకోవడం సులువుగా ఉంటుంది’ అని జులన్ వ్యాఖ్యానించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే శనివారం జరగనుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన భారత మహిళా బౌలర్
కింబేర్లీ : భారత మహిళా బౌలర్ జులన్ గోస్వామి ప్రపంచ రికార్డు నమోదు చేశారు. మహిళల అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా గోస్వామి గుర్తింపు పొందారు. ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గోస్వామి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. తొలి వన్డేలో 4 వికెట్లు పడగొట్టిన గోస్వామి ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో ఐదో ఓవర్ చివరి బంతికి దక్షిణాఫ్రికా ఓపెనర్ లూరాను అవుట్ చేసి ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. 166 వన్డేలాడిన గోస్వామి 3.23 ఎకానమీతో 200 వికెట్లు పడగొట్టారు. ఆమె అద్భుత బౌలింగ్ (6/31 ) ప్రదర్శన న్యూజిలాండ్పై 2011లో నమోదు చేశారు. ఈ సీనియర్ మహిళా క్రికెటర్ 10 టెస్టు మ్యాచ్ల్లో 40 వికెట్లు, 60 టీ20 మ్యాచుల్లో 50 వికెట్లు పడగొట్టారు. -
'నన్ను జట్టు నుంచి తీసేయమన్నా'
న్యూఢిల్లీ:ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో తాను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ఒత్తిడికి గురైన విషయాన్ని భారత పేసర్ జులన్ గోస్వామి వెల్లడించారు. ప్రధానంగా తొలి రెండు మ్యాచ్ ల్లో తనకు వికెట్ లభించకపోవడంతో నిరాశకు లోనయ్యానని, ఆ క్రమంలోనే జట్టు నుంచి తొలగించాలని కోచ్ తుషార్ అర్థోకు విజ్ఞప్తి చేసినట్లు గోస్వామి పేర్కొన్నారు. 'నా ప్రదర్శన బాగా లేదు. దయచేసి నన్ను తొలగించే ఆలోచన చేయండి' అని తుషార్ ను కోరినట్లు గోస్వామి తెలిపారు. అయితే అందుకు అతను అంగీకరించలేదని కచ్చితంగా జట్టులో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారన్నాడుఅదే సమయంలో కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా తనకు అండగా నిలిచిన విషయాన్నిజులన్ గుర్తు చేసుకున్నారు. వీరి సహకారంతోనే తర్వాతి మ్యాచ్ ల్లో సక్సెస్ అయినట్లు పేర్కొన్న జులన్.. ఆ ఫలితం ఆసీస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో కనబడిందన్నారు. ఆసీస్ ప్రధాన క్రికెటర్ లానింగ్ ను డకౌట్ గా పంపి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానన్నారు. ఆపై తమకు అన్ని కలిసి రావడంతో మ్యాచ్ ను సునాయసంగా గెలిచి ఫైనల్ కు చేరినట్లు జులన్ తెలిపారు. -
మేము ఎవరూ ఊహించలేదు:జులన్
లండన్: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఓడి నిరాశపరిచినా మరింత మెరుగ్గా రాణించగల సత్తా భారత జట్టుకు ఉందని పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడింది. ‘టోర్నీ ప్రారంభమైన తొలి రోజున మా జట్టు ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. తొలి మ్యాచ్లోనే ఇంగ్లండ్ను ఓడించిన అనంతరం మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జట్టుగా సమష్టి పోరాటం చేస్తే ఫలితం దక్కుతుందని మేం నమ్మాం. ఈ ప్రయాణాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. ఒక్క ఫైనల్ తప్ప మా ఆటతీరు గర్వించే స్థాయిలోనే ఉంది’ అని గోస్వామి పేర్కొంది. -
జులన్ గోస్వామి విజృంభణ
లండన్: మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఫైనల్లో భారత జట్టు దూకుడును కొనసాగిస్తోంది. ప్రధానంగా పేసర్ జులన్ గోస్వామి తన పదునైన బంతులతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ను హడలెత్తిస్తోంది. ఇంగ్లండ్ జట్టు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వరుసగా సారా టేలర్(45), ఫ్రాన్ విల్సన్(0)లను అవుట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చిన జులన్.. ఆపై కొద్ది సేపటికీ హాఫ్ సెంచరీ చేసిన స్కీవర్(51) ను ఎల్బీగా పెవిలియన్ కు పంపింది. జులన్ గోస్వామి విజృంభణతో ఇంగ్లండ్ 164 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. తన 10 ఓవర్ల బౌలింగ్ ను పూర్తి చేసుకున్న జులన్ మూడు మెయిడిన్లు సాయంతో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించింది. 40.0 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 168/6. -
నేను... నా స్ఫూర్తి!
పాక్ మహిళా క్రికెటర్ కైనత్ ఆనందం డెర్బీ: క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఎంత వైరం ఉన్నా ఒక్కసారి ఆట ముగిశాక వారి మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉంటాయి. పురుషుల క్రికెట్లో ఇది చాలాసార్లు కనిపించింది. మహిళల క్రికెట్లో కూడా ఇదే క్రీడా స్ఫూర్తి ఉందనేదానికి తాజా ఉదాహరణ ఇది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పేసర్ కైనత్ ఇంతియాజ్, భారత ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామిని కలిసింది. ఆమెతో ఫొటో దిగి తన పాత జ్ఞాపకాన్ని పంచుకుంది. జులన్ స్ఫూర్తితోనే తాను పేసర్గా ఎదిగినట్లు ఈ పాక్ క్రీడాకారిణి చెప్పింది. ‘2005లో పాకిస్తాన్లో జరిగిన ఆసియా కప్లో తొలిసారి భారత్ పాల్గొంది. ఆ టోర్నీలో నేను బాల్ గర్ల్గా పని చేశాను. ఆ సమయంలో ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్గా ఉన్న జులన్ గోస్వామిని చూశాను. ఆమె బౌలింగ్ నన్ను ఎంతగా ఆకట్టుకుందంటే క్రికెట్నే కెరీర్గా మార్చుకోవాలని, అదీ ఫాస్ట్ బౌలర్ను కావాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నాకు స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారిణితో కలిసి ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఆడుతున్నాను. ఇది నాకు మరింత స్ఫూర్తినిచ్చే అంశం’ అని కైనత్ వెల్లడించడం విశేషం. ఫుట్బాల్ జట్టుకు కూడా.. వరల్డ్ కప్లో ఆడుతున్న పాక్ జట్టులో మరో పేసర్ దియానా బేగ్ది కూడా ఆసక్తికర నేపథ్యం. మొత్తం టోర్నీలోనే అత్యుత్తమ ఫీల్డర్గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. 21 ఏళ్ల దియానా గత ఏడాది వరకు పాకిస్తాన్ జాతీయ ఫుట్బాల్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది. జట్టు తరఫున డిఫెండర్గా ఆమె బరిలోకి దిగింది. అయితే చివరకు రెండు ఆటల్లో ఒకదానిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె క్రికెట్ వైపు మొగ్గింది. భారత్లో మ్యాచ్లో కీలకమైన స్మృతి మంధన వికెట్ తీసినప్పుడు ఆమె బంతి వేగానికి బిషప్లాంటి కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. పాయింట్ వద్ద దియానా మెరుపు ఫీల్డింగ్కు కారణం ఆమె ఫుట్బాల్ నైపుణ్యమేనని సహచరులు చెబుతారు. జాంటీ రోడ్స్ వీడియోలు ఆమె ఫీల్డింగ్ మెరుగుపడేందుకు స్ఫూర్తిగా నిలిచాయి. ‘నాకైతే అన్ని ఆటలూ ఇష్టమే. వీరంతా అడ్డుకుంటున్నారు గానీ లేదంటే వాలీబాల్, అథ్లెటిక్స్ కూడా ఆడేసేదాన్ని’ అని 21 ఏళ్ల దియానా తన ఆసక్తి గురించి నవ్వుతూ చెబుతోంది. -
భారత క్రికెటర్కు వీరాభిమానిని: పాక్ ప్లేయర్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల క్రికెట్ పోరు అంటే చాలు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దాయాది జట్టులో తమ అభిమాన క్రికెటర్ ఉన్నా.. అయినా ఎందుకొచ్చిన తలనొప్పి అని వారిపై నోరు మెదిపేందుకు ఆలోచిస్తారు. కానీ పాక్ యువ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ మాత్రం భిన్నంగా తన మనసులో మాటను బయటపెట్టింది. ఓవైపు మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా పాక్తో జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా మహిళలు 95 పరుగులతో పాక్పై విజయం సాధించగా.. మరోవైపు తన ఆరాధ్య క్రికెటర్ ఝులన్ గోస్వామి(భారత్)ని కలుసుకున్నానంటూ కైరత్ హర్షం వ్యక్తం చేసింది. దాయాదుల పోరులో ఓడిన జట్టుకు నెగ్గిన జట్టుపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించడం తరచుగా చూస్తుంటాం. కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత వెటరన్ ప్లేయర్ గోస్వామిపై ఆమెకున్న అభిమానాన్ని కైరత్ చాటుకుంది. '2005లో పాకిస్తాన్లో జరిగిన ఆసియాకప్లో తొలిసారిగా ఝులన్ను చూశాను. ఆ సమయంలో ప్రపంచలోనే ఫాస్టెస్ట్ బౌలర్ ఆమె. భారత ఆల్రౌండర్ ఝులన్ను చూసి ప్రభావితురాలినై ఫాస్ట్ బౌలర్గా క్రికెట్ కెరీర్ ఎంచుకున్నాను. పాక్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ద్వారా.. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత నాకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఆరాధ్య క్రికెటర్ ఝులన్తో మ్యాచ్ ఆడాను. నా కల నిజమైందని' పేర్కొంటూ భారత పేసర్ ఝులన్ గోస్వామితో కలిసి దిగిన ఫొటోను పాక్ ప్లేయర్ కైనత్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. -
జులన్ గోస్వామి అరుదైన ఫీట్
పోచెస్ట్రూమ్: భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జులన్ గోస్వామి అరుదైన ఫీట్ ను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ లో భాగంగా వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనతను గోస్వామి తాజాగా తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న క్వాడ్రాంగులర్ సిరీస్ లో భాగంగా మంగళవారం సఫారీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గోస్వామి అత్యధిక వికెట్ల ఘనతను సాధించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లోమూడు వికెట్లు సాధించిన గోస్వామి.. ఓవరాల్ గా వన్డేల్లో 181 వికెట్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మహిళా బౌలర్ కాథరిన్ ఫిట్జ్పాట్రిక్స్ ను రికార్డును అధిగమించింది. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ లో ఆమెకు అభినందనలు తెలియజేసింది. ఇప్పటికే జులన్ ఎన్నో ఘనతల్ని సాధించిందని కొనియాడింది. ఈ మ్యాచ్ లో గోస్వామితో పాటు శిఖా పాండే మూడు వికెట్లతో రాణించడంతో దక్షిణాఫ్రికా 39.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.