k kavitha
-
పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
-
మేం ‘పింక్ బుక్’ రాస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రత్యర్థి పార్టీల నేతలకు, అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మేం పింక్ బుక్ (pink book) రాస్తున్నాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోం’ అని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ (brs) నాయకులు ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా 3 బిల్లులు పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.కాంగ్రెస్ చేపట్టిన కుల గణన సర్వే తప్పుడు తడకగా ఉంది. 2014 కేసీఆర్ (kcr) జరిపిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలింది. నేటి కాంగ్రెస్ సర్వే 46 శాతం బీసీలు ఉన్నట్లు చెబుతోంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారత్ అమెరికాను మించిపోయేది’అని వ్యాఖ్యానించారు.మరోవైపు, నాగర్ కర్నూల్ సొంత జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘సింగోటం ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు. దేవుడికిచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.15 కోట్లను క్యాన్సిల్ చేయడం దారుణం. జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష్య గట్టి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలు హత్య కేసుల్లోని హంతకులకు కొమ్ము కాస్తున్నారు. జూపల్లి నియోజకవర్గానికి రావాలి. టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్ట్లా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గానికి రావడం లేదు. మేం పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు నాయకులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. -
సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
సాక్షి,తెలంగాణ భవన్ : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kkavitha) ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి (cm revanthreddy) లేఖ రాశారు.ఆ లేఖలో ‘మీ వైఖరితో బీసీలకు తీరని అన్యాయం జరగుతోంది. రిజర్వేషన్ల పెంపును విస్మరిస్తే ఊరుకోబోం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాల్సిందేనని’ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధాన హామీ అయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం. “కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్ల పెంపు” అని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా పేర్కొని ఉంది. 6 నెలలు గడిచాయి… ఏడాది గడిచింది.. అయినా కూడా రిజర్వేషన్ల పెంపునకు అతీగతీ లేదు. అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తోంది’ అని అన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కవిత ఫైర్
-
తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
-
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
-
సీఎం రేవంత్ కొత్త జీవో..సోనియాకు కవిత లేఖ
-
రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పటం మానుకో..తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వారికి
-
60 రోజుల్లో కాంగ్రెస్ చేసిందేంటి ?: కవిత
-
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
-
మాస్ స్టెప్పులతో అదరగొట్టిన కేటీఆర్, కవిత
-
గులాబీల జెండాలమ్మ పాటకు ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి డ్యాన్స్
-
ఎమ్మెల్సీ కవితకు ఊరట
-
కవిత పిటిషన్పై విచారణ వాయిదా.. ఈడీ ఆఫీసుకు వెళ్తారా?
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా పడింది. అయితే, లిక్కర్ స్కాం కేసులో భాగంగా మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన అనంతరం.. వాయిదా వేసింది. విచారణకు రావాల్సిందే.. ఇక, విచారణ సందర్బంగా తదుపరి విచారణ వరకు ఈడీ సమన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ వాదనలు వినిపించింది. అంతగా కావాలంటే కవితకు 10 రోజులు సమయం ఇస్తామని ఈడీ పేర్కొంది. నేను రాను.. తేల్చుకుందాం! ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం లేదా శనివారం విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కవిత కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో తాను ఈడీ విచారణను రాలేనని అధికారులకు తెలిపారు. కోర్టులో తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తాజాగా కవిత పిటిషన్పై విచారణను వాయిదా వేయడంతో ఆమె.. రేపు ఈడీ విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కవితకు ఈడీ నోటీసులు.. మంత్రి మల్లారెడ్డి రియాక్షన్ ఇదే.. -
హైదరాబాద్ లో తన ఇంట్లోనే ఎమ్మెల్సీ కవిత
-
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్బంగా రేపే విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో అరుణ్ రామచంద్రపిళ్లై నిన్ననే(బుధవారం) అప్రూవర్గా మారారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది మార్చి 7న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి పలు అంశాలు రాబట్టారు. అరుణ్పిళ్లై ఏం చెప్పారు? ఈ విచారణ సమయంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్గా మారినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. పిళ్లై వాంగ్మూలం ఆధారంగా విచారణకు రావాలంటూ కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారించారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యే సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఆయన మరోసారి అప్రూవర్గా మారినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ట్విస్ట్.. ఇదిలా ఉండగా.. తాజాగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్ స్కాం కేసులో ఇన్ని రోజులు ఎలాంటి విచారణ లేకపోవడంతో ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ తాజాగా కవితను ఈడీ విచారణకు పిలవడం హాట్ టాపిక్గా మారింది. రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ -
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు, దాడులు అరికట్టాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చెప్పాలి. ఢిల్లీ కేంద్రంగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ బుషన్ ఘటన మరువకముందే మరో బ్రిజ్ బుషన్ ఆగడాల వెలుగులోకి వచ్చాయి. తాజాగా తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. అయితే అధికారులు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదని.. లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కోరారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ మంత్రికి ట్యాగ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. @raokavitha అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU — V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023 -
క్షమాపణ చెప్పాల్సిందే, లేకుంటే రాష్ట్రంలో తిరగనివ్వం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న ఉచిత కరెంట్పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా అటు రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు. రైతుకు వ్యవసాయం పండగ కావాలంటే నీళ్ళు, రైతు బంధు ఇస్తున్నామని.. వ్యాపార వేత్తలకు కరెంట్ ఇవ్వొదని రేవంత్ రెడ్డి చెప్పడం సమజసం కాదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఉచిత కరెంట్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పాన లో వ్యవసాయం పండగ అయ్యిందని.. 24 గంటల కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బేశరుతుగా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. కాగా తెలంగాణ రైతాంగానికి మొత్తానికి ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా వేడిని రాజేశాయి. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! -
కవిత ఫోన్లలో ఏముంది?.. ఈడీ ఆఫీసుకు అడ్వకేట్ భరత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవిత ఫోన్లకు సంబంధించి కూడా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఫోన్లను ఓపెన్ చేస్తున్నారు. అయితే, ఫోన్లను తెరుస్తున్న క్రమంలో సాక్షిగా కవిత లేదా ఆమె ప్రతినిధిని ఈడీ ఆఫీసుకు రావాలని అధికారులు కోరారు. దీంతో, కవిత అడ్వకేట్ సోమ భరత్ రెండో రోజు కూడా ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. వరుసగా రెండో రోజు భరత్.. ఈడీ ఆఫీసుకు వెళ్లారు. భరత్ సమక్షంలో కవిత ఫోన్ డేటాను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెల 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీ అధికారులకు కవర్లో అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో, కవిత ఫోన్లలో ఏముంది? అనేది హాట్ టాపిక్గా మారింది. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్కు షాక్.. -
ఢిల్లీ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణపై సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీకి బయలుదేరారు. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈనెల 20వ తేదీన విచారణను రావాలని ఈడీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కవిత ఢిల్లీకి వెళ్లారు. ఇక, కవిత వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ రావు కూడా ఉన్నారు. అయితే, ఎమ్మెల్సీ కవిత.. రేపు ఈడీ ఎదుట హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈడీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కవిత.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్పై ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో కవిత.. న్యాయవాదిని పంపించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కవిత పిటిషన్పై సుప్రీం కోర్టును ఈడీ ఆశ్రయించింది. కవిత పిటిషన్పై కేవీయట్ పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఈడీ.. సుప్రీం కోర్టును కోరింది. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్ -
లిక్కర్ స్కాం కేసులో ఊహించని ట్విస్ట్..
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో మరో ఉహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ శనివారం సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కోర్టు ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయకుండా ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. కాగా, పిటిషన్ ప్రకారం.. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఈడీ.. సుప్రీం కోర్టును కోరింది. దీంతో, లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. అయితే, కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈనెల 24వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, కవితను ఈనెల 20వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఈడీ లేఖ రాసిన సంగతి విధితమే. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాం కేసు.. కవితకు షాకిచ్చిన ఈడీ -
ఈడీ పరిధి మించి ప్రవర్తిస్తోంది: మంత్రి జగదీశ్ రెడ్డి
సాక్షి,సూర్యాపేట: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పరిధి మించి ప్రవర్తిస్తోందని, చట్టప్రకారం విచారణ జరగడం లేదని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్రెడ్డి' మండిపడ్డారు. గురువారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళను రాత్రి వరకు విచారిస్తామంటే అది ముమ్మాటికీ వేధించడమే, రాజకీయ కక్ష సాధింపు చర్యేనని చెప్పారు. బీజేపీ పార్టీ నాయకుల ఆలోచనలు, స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ పనిచేస్తోందని, విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గు చేటని దుయ్యబట్టారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా విచారణ పేరుతో కవితను వేధిస్తున్నారన్నారు. కవిత ఎక్కడికి పారిపోవడం లేదని, విచారణకు సహకరిస్తానని చెప్పినా కూడా రాత్రి సమయం వరకు విచారించడం వేధించడమేనని జగదీశ్రెడ్డి అన్నారు. మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టి దేశాన్ని రక్షిస్తామన్నారు. -
లిక్కర్ స్కాం కేసు: కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత నేడు(గురువారం) రెండోసారి విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. వెళ్లలేదు. దీంతో, ఈడీ కవితకు మళ్లీ నోటీసులు పంపించింది. తాజాగా నోటీసుల్లో ఈనెల 20వ తేదీన కవిత విచారణకు హాజరు కావాలని పేర్కొంది. దీంతో, ఈడీ నోటీసులపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు రామచంద్ర పిళ్లైను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు.. పిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీని పొడగించింది. అయితే, పిళ్లైని ఎమ్మెల్సీ కవితతోపాటు విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. ఈ కేసులో గురువారం కవిత విచారణకు హాజరు కానందున పిళ్లై కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో, ఈడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా లిక్కర్ స్కాం కేసులో కవిత అనుమానునితురాలే అని ఈడీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. తన న్యాయవాది ద్వారా సమాచారం పంపారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని కవిత పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ఈడీకి 6 పేజీల లేఖ రాశారు. 'కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదు. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయండి. మహిళను ఈడీ ఆఫీస్కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే నాకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి నా ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటాను. నా ప్రతినిధి సోమా భరత్ ద్వారా నా బ్యాంక్ స్టేట్మెంట్ సహా మీరు అడిగిన పత్రాలు పంపుతున్నాను.' అని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘కవితను ఇబ్బంది పెడుతున్నారు..ఈడీ రాత్రి వేళ ప్రశ్నించడమేంటి?’ -
బుచ్చిబాబు, పిళ్లై ఏం చెప్పారు?.. కవిత విచారణపై టెన్షన్!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కాంలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో, రెండోసారి కవిత విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఫిబ్రవరి 11న ఈడీ అధికారులు కవితను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. కాగా.. లిక్కర్ స్కాం కేసులో బుచ్చిబాబును బుధవారం ఈడీ ప్రశ్నిస్తోంది. ఈడీ అధికారులు అరుణ్ పిళ్లైతో కలిపి బుచ్చిబాబును ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, సమావేశాలు, ముడుపులతో ఈడీ ఆరా తీస్తోంది. ఇక, కన్ఫ్రాంటేషన్ పద్దతిలో ప్రశ్నించేందుకు పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. రేపు కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు.. ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన విషయంలో ఈడీ చట్ట విరుద్దంగా వ్యవహరించిందన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదన్నారు. కొంత మంది వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తనను ఇరికించినట్టు ఆరోపణలు చేశారు. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందన్నారు. చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్ వంటి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఈనెల 24న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. -
ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత.. లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. అయితే, కవిత తన పిటిషన్లో కీలక వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. అధికార పార్టీ ఆదేశాలతో ఈడీ నన్ను వేధిస్తోంది. నా విషయంలో ఈడీ చట్ట విరుద్దంగా వ్యవహరించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరు ఎక్కడా లేదు. కొంత మంది వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో నన్ను ఇరికించారు. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్లకు విశ్వసనీయత లేదు. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంది. చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనం. అరుణ్ రామచంద్ర పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈడీ అధికారులు నా సెల్ఫోన్ను బలవంతంగా తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా నా ఫోన్ సీజ్ చేశారు. నా ఫోన్ సీజ్ చేసిన సమయంలో నా వివరణ తీసుకోలేదు. నా నివాసంలో లేదా వీడియో కాన్ఫరెన్స్లో విచారణ జరపాలి అని పేర్కొన్నారు. అలాగే, ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్ వంటి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. -
బీజేపీలో ఏం జరుగుతోంది!.. అర్వింద్కు అధిష్టానం నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమలదళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పటికే తప్పు బట్టగా తాజాగా ఆర్వింద్ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీని యర్ నేత పేరాల శేఖర్రావు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం పార్టీ నేతల్లో మరింత కలకలా నికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్రావు వ్యాఖ్యలను సమ ర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్పై శేఖర్రావు మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ నేతల్లో గందరగోళం..! అర్వింద్కు అధిష్టానం నోటీసులు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పార్టీ ఎంపీ అర్వింద్ బహిరంగ విమర్శలు చేయడంపై ఇప్పటికే పంచాయితీ ఢిల్లీ అధిష్టానం వద్దకు చేరింది. ఈ వ్యవహారంపై అర్వింద్కు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అధిష్టానం నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. శేఖర్రావు ఏమన్నారంటే... రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్ వంటి పెద్దలు చేయాల్సిన పనినే అర్వింద్ చేశారని శేఖర్రావు సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. అధ్యక్షుడి పరిణతిలేని అసందర్భ మాటలు, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ప్రస్తుత పరిస్థితి కారణమని దుయ్యబట్టారు. బ్లాక్మెయిల్, అంతర్గత సెటిల్మెంట్లు, కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, వాడుకొని వదిలేసే విధానం బీజేపీ సంస్కృతి కాదని శేఖర్రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇవన్నీ పార్టీలో యథేచ్చగా నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో గ్రానైట్ క్వారీల్లో అక్రమ తవ్వకాలంటూ ప్రచారం చేసి యజమానులతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఓ వార్తా చానల్లో ఓ ప్రముఖుడి మైనింగ్ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఆపై సెటిల్మెంట్లు చేసుకోవడం, ఆ చానల్లో నలుగురు పార్టీ నేతలతో రూ. కోట్లలో పెట్టుబడి పెట్టించి నట్టేట ముంచడం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైస్చైర్మన్ పదవిని ఆర్థిక కారణాలతో కొత్తవారికి కట్టబెట్టడం, హుజురాబాద్లో ఈటల గెలుపు అనంతరం ఏర్పడిన వాతావరణాన్ని ఖతం చేయడం వంటి చర్యలకు బండి సంజయ్ పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. వాటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనప్పుడు సోషల్ మీడియానే ఆధారమవుతోందని శేఖర్రావు తెలిపారు. -
పిళ్లైను మేం బెదిరించలేదు: ఈడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేదీన తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది ఈడీ. కవిత బినామీగా పేర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి బుచ్చిబాబును విచారించాలని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో.. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో సోమవారం ఈడీ ఇవాళ అరుణ్ రామచంద్ర పిళ్లైను హాజరుపర్చి.. కీలక వాదనలు వినిపించింది. తన వాంగ్మూలం ఉపసంహరించుకునేందుకు ఆయన స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ‘‘చాలా కీలక సమయంలో పిళ్ళై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. పిళ్ళై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. విచారణ సమయంలో పిళ్లైను ఒత్తిడి చేయలేదు, బెదిరించలేదు. టార్చర్ కూడా చేయలేదు’’ అని కోర్టును తెలిపింది ఈడీ. పిళ్లై 2022, సెప్టెంబరు 18వ తేదీన పూర్తి స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో కూడా వివరాలు మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్ లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారు?. మార్చి తర్వాతే స్టేట్ మెంట్ మార్చుకున్నారు?. ఆయన స్టేట్ మెంట్ ఎందుకు మార్చుకున్నారో అర్థమవుతోంది. ఒక బలమైన వ్యక్తిని మేము సమ్మన్ చేసినప్పుడు పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారు’’ అని ఈడీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో.. సాయంత్రం 4 గంటలకు తీర్పును వాయిదా వేసింది కోర్టు. అంతేకాదు.. బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని మరోసారి విచారించాలని కోర్టుకు కోరుతూ.. మరో మూడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరుతోంది. ‘‘కస్టడీ మరో మూడు రోజులు పొడిగించండి. ఇతర నిందితులతో కలిపి విచారణ చేయాలి. మరి కొంతమందికి సమన్లు ఇవ్వాల్సి ఉంది. రామచంద్ర పిళ్లై కస్టడీ అవసరం’ అని ఈ సందర్భంగా ఈడీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ అయిన గోరంట్ల బుచ్చిబాబును ఫిబ్రవరి 8వ తేదీన సీబీఐ అరెస్ట్ చేయగా.. మార్చి 6వ తేదీన బెయిల్ మీద బయటకు వచ్చారు. -
16న మళ్లీ రావాలి.. కవిత ఈడీ విచారణలో ఏం జరిగింది?
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం కవితను విచారించింది. ఈ కేసులో సౌత్ గ్రూప్ పాత్రపై కూడా విచారణ జరిగినట్లు తెలిసింది. ఆరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. పీఎంఎల్ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించింది. సౌత్ గ్రూఫ్ నిధులు, మద్యం కుంభకోణం, వీటితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో గతంలో జరిగిన భేటీలు లాంటి అంశాలపై కవితను ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ మధ్యలో సాయంత్రం విరామ సమయం ఇచ్చి.. అనంతరం తిరిగి విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో కవితను దాదాపు 9 గంటలపాటు ఈడీ అధికారులు విచారణ కొనసాగింది. ఈ నెల 16న కవిత మళ్లీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. చదవండి: బంపరాఫర్! ఇంటర్తో సాఫ్ట్వేర్ జాబ్.. తెలంగాణ ప్రభుత్వ చర్యలు -
కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అయితే, కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ప్రతిపక్ష నేతలు కవితను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా కవితపై విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు. ఇదే సమయంలో బండి సంజయ్ మాట్లాడుతూ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. సంజయ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
ఈడీ ఎఫెక్ట్.. బీజేపీ నేతలపై బీఆర్ఎస్ వినూత్న నిరసన
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కాం కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్, ఎమ్మెల్సీ కవితపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం కేంద్రం, దర్యాప్తు సంస్థలను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు. ఇక, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈడీ, సీబీఐ, బీజేపీ బెదిరింపు రాజీకీయాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ సినిమాటిక్ రేంజ్లో కొందరు బీజేపీ నేతలపై పోస్టర్లు వేశారు. అంతకుముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు దర్యాప్తు సంస్థల రైడ్స్ అనంతరం.. కాషాయ రంగు అద్దుకుని బీజేపీలో చేరానని సెటైరికల్గా చెప్పారు. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో వెలిసిన పోస్టర్లు అంటించారు. కానీ, ఎమ్మెల్సీ కవితకు మాత్రం రైడ్కు ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిజమైన రంగులు వెలసిపోవు అంటూ కొటేషన్స్ ఇచ్చారు. ఈ పోస్టర్లకు బై బై మోదీ.. అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. కాగా, ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం..
Updates: ►ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటలపాటు ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నెల 16న కవిత మళ్లీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. కవితను ఐదుగురు అధికారుల బృందం విచారించింది. ఒక జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్ల బృందం విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై విచారణ జరిపినట్లు తెలిసింది. ఆరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ►కాసేపట్లో కవిత ఈడీ విచారణ ముగియనుంది. ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు.. ఈడీ ఆఫీసు ఆవరణ నుంచి బయటకు పంపుతున్నారు. ► ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. గత ఏడు గంటలుగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ► ఢిల్లీ లిక్కర్ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత తరుణ్చుగ్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు కేసీఆర్, సోనియా ఎవరైనా ఒక్కటేనన్నారు. లిక్కర్ స్కాంలో కవిత కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ► ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం అయిదు గంటలుగా ఎమ్మెల్సీను ప్రశ్నిస్తోంది. ►కవిత విచారణకు అయిదు నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. దీంతో విచారణ గది నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్లీ లోపలికి వెళ్లారు. ►ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై విచారణ జరుగుతోంది. ఆరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ► హైదరాబాద్లోని ఈడీ ఆఫీసు వద్ద దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆందోళనలు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ, బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు. భారీగా మోహరించిన పోలీసులు బలగాలు. ► మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా కేంద్రం దాడులు చేస్తోంది. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదు. ఈడీ విచారణలో ఏ తప్పు చేయలేదని తేలుతుంది. మోదీకి జై కొడితే ఎలాంటి నోటీసులు ఉండవు. వ్యతిరేకిస్తే నోటీసులు ఇస్తారు. ► అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేసింది. తెలంగాణలో అభివృద్ధిని తట్టుకోలేకే కేంద్రం ఇలా వ్యవహరిస్తోంది. ► లిక్కర్ స్కాంలో రెండు గంటలుగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ. 100కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తోంది. ► ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారిస్తున్నారు. ► ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ► కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి క్యూ కడుతున్న పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు. ► హైదరాబాద్ ఈడీ కార్యాలయం మెయిన్ గేట్ క్లోజ్. ఢిల్లీలో కవిత ఈడీ విచారణ నేపథ్యంలో హైదరాబాద్ కార్యాలయం వద్ద పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ► ఢిల్లీ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. Delhi | BRS workers and supporters protest against Telangana BJP president Bandi Sanjay for his reported derogatory comments against BRS MLC K Kavitha. The protesters also burnt his effigy. K Kavitha is appearing before ED today in Delhi, in the liquor policy case. pic.twitter.com/dYEmgim1Pc — ANI (@ANI) March 11, 2023 ► ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. ► కవితను ప్రశ్నిస్తున్న ఈడీ ప్రత్యేక బృందం. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ► కవితను ప్రశ్నిస్తున్న ఐదుగురు ఈడీ అధికారులు. రామచంద్ర పిళ్లైతోపాటు కవితను విచారిస్తున్న ఈడీ. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియా, పిళ్లై. ► లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరైన కవిత. #WATCH | Delhi: BRS MLC K Kavitha arrives at the ED office in connection with the Delhi liquor policy case. pic.twitter.com/T9YWhk7mtQ — ANI (@ANI) March 11, 2023 ► కవిత వెంట వచ్చిన తన భర్త అనిల్, అడ్వకేట్లను పోలీసులు బయటే నిలిపివేశారు. ► ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత. ► ఈడీ ఆఫీసుకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత. ఆమె కారుతో పాటు మరో వాహనానికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ సందర్భంగా ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ► కవితతో కేటీఆర్, హరీష్ రావు భేటీ. ► ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ అడిషనల్ ఏజీ. ► కవిత నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. ► ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవితతోపాటుగా జాగృతి కార్యకర్తలు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన మహిళా పోలీసులు. ► ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు కవిత ప్రయత్నాలు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కవిత కారుతో పాటుగా మరో వాహనానికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ► ఈడీ ఆఫీసు చుట్టుపక్కల పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ► లిక్కర్ స్కాంలో భాగంగా కవిత వద్ద స్టేట్మెంట్ తీసుకోనున్న ఈడీ అధికారులు. కాగా, కవితకు సౌత్ గ్రూపులో 33 శాతం వాటా ఉందని ఈడీ పేర్కొంది. ► రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు స్టేట్మెంట్ల ఆధారంగా కవితను విచారించనున్న ఈడీ. ► కవితను మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం వద్దకు తరలి వస్తున్నారు. Delhi | BRS workers and supporters gather outside the residence of Telangana CM and party chief K Chandrashekar Rao. The CM's daughter and party MLC K Kavitha is scheduled to appear before ED today in connection with the Delhi liquor policy case. pic.twitter.com/dJ8XhIBUrD — ANI (@ANI) March 11, 2023 ► ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ► మనీశ్ సిసోడియా, పిళ్లై, కవిత విచారణ నేపథ్యంలో ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ► ఈడీ ఆఫీసు వద్దకు మీడియాను అనుమతించని పోలీసులు. ప్రధాన రోడ్డు వరకే మీడియాను పరిమితం చేశారు. ► ఢిల్లీలోనే కేటీఆర్, హరీశ్ రావు ఉన్నారు. ► నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో న్యాయ నిపుణులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత.. నేడు ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ► శనివారం ఉదయం 11 గంటలకు తన లాయర్తో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ► సౌత్ గ్రూప్ ఫండింగ్పై కవితను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు. ► సీఎం కేసీఆర్.. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారు. విచారణ పేరుతో కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. కేసులకు భయపడేది లేదు.. న్యాయపోరాటం చేస్తాం. -
మోదీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుంది: కవిత
Live Updates.. ► మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నేడు ప్రారంభించిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుందన్నారు. డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు తమ పోరాటం సాగుతుందని తెలిపారు. తాము చేపట్టిన ఆందోళన ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని తెలిపారు. తమ దీక్షలకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుందన్నారు. రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ► మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిందే. ఎమ్మెల్సీ కవితకు దీక్షకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుంది. బిల్లు వస్తే ప్రతీ ఆడపిల్లకు రిజర్వేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ► ఎమ్మెల్సీ కవిత దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మద్దతు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ధర్నాకు సంజయ్ సింగ్ హాజరయ్యారు. ► సీతారాం ఏచూరి.. కవిత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మహిళల కోసం ముందడుగు వేశారు. బిల్లు ఆమోదం పొందే వరకు మా మద్దతు కొనసాగుతుంది. 30 సంవత్సరాల నుంచి ఈ బిల్లు పెండింగ్లో ఉంది. ► మహిళలు రాజకీయంగా, సామజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే మహిళా బిల్లు అవసరం. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. లోక్సభలో పెండింగ్లో ఉంది. ప్రధాని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ► మహిళల భాగస్వామ్యం లేనంతవరకు సమాజం ముందుకు సాగదు. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తొమ్మిది ఏళ్లు అయ్యింది.. ఇప్పటి వరకు బిల్లును ప్రవేశపెట్టలేదు. ► ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. మహిళా బిల్లు ఆమోందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి. ధరణిలో సగం, ఆకాశంలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లో సగ భాగం కావాలి. అప్పటి వరకు అందరం కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ► మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పారు. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని స్పష్టం చేశారు. ► మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉన్నది. అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామని చెప్పారు. ► అంతకుముందు, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసిన మహిళా నేతలను ఈ సందర్బంగా కవిత గుర్తు చేసుకున్నారు. వారిపై ప్రశంసలు కురిపించారు. ► జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభం. కవితతో పాటుగా దీక్షలో పాల్గొన్న సీతారాం ఏచూరి, మంత్రులు, మహిళా ప్రతినిధులు. Bharat Rashtra Samithi MLC and Telangana CM K Chandrashekar Rao's daughter K Kavitha leads one-day hunger strike in the national capital to seek the introduction of the Women's Reservation Bill in the current Budget session of Parliament. pic.twitter.com/M0oUkAxFEx — ANI (@ANI) March 10, 2023 ► జంతర్ మంతర్ దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత. ► సీపీఐఎం సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. ► జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎంపీ కవిత మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లకు ఆరోపణలు చేయడం తప్ప వేరే పనిలేదు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి పార్లమెంట్లో మహిళ బిల్లుకు ఆమోదం తెలపాలి. బీజేపీకి పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉందన్నారు. మహిళ బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అధికారంలోకి రావడానికి అక్కడ బలంగా ఉన్న పార్టీలను బలహీనం చేస్తారు. కానీ, సీఎం కేసీఆర్ను తట్టుకోవడం బీజేపీ వల్ల కాదు అంటూ కామెంట్స్ చేశారు. ► సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. మా బాధ్యత మేరకు మేము ఒత్తిడి తీసుకువస్తున్నాము. సభలో ఫుల మెజార్టీ ఉన్నప్పటికీ ఎందుకు బిల్లుకు ఆమోదం తెలపడంలేదని ప్రశ్నించారు. ► జంతర్ మంతర్ వద్దకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత. సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ►చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్ చేస్తూ దీక్షకు దిగుతున్నారు. ► ఈ దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ► ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ► కవిత దీక్షకు 18 రాజకీయ పా ర్ణీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించగా, వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారు. -
ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటా: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం దేశ రాజకీయాల్లో ప్రకంపలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కాగా, కవిత.. జంతర్ మంతర్లో ధర్నా కారణంగా ఈనెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కానుంది. అయితే, ధర్నాలో భాగంగా కవిత.. బుధవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగాము. మాకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి?. మా ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని రిక్వెట్ చేశాం. కానీ, ఈడీ దీనికి అంగీకరించలేదు. మహిళలను ఇంట్లో విచారించాలని చట్టం చెబుతోంది. ఇది నా ఒక్కరి సమస్య కాదు. ఈడీ ఎందుకింత హడావిడీగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తాం. దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్దతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఉద్యమం చేసి వచ్చాం.. భయపడే వాళ్లం కాదు. ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటాం. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరు అని ప్రశ్నించారు. 200 మంది ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. బీఆర్ఎస్కు సంబంధించిన నేతల ఇళ్లలో కూడా దాడులు జరిగాయి. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి. మేము భయపడే వాళ్లం కాదు. దేశంలో మోదీ-అదానీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. మోదీకి అదానీ బినామీ అని పిల్లోడిని అడిగినా చెబుతాడు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్రానికి అలవాలటైపోయింది. మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే కేంద్రం ఈడీ దాడులు చేస్తోంది. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ వస్తోంది. గాంధీ పుట్టిన దేశంలో అబద్ధం రాజ్యమేలుతోంది. ప్రధాని మోదీ బయటే కాదు పార్లమెంట్లోనూ అబద్ధాలు చెప్తున్నారు. ధర్మం ఎటువైపు ఉంటే వాళ్లదే విజయం. జైలులో పెట్టినంత మాత్రాన కృష్ణుడు జన్మించడం ఆగలేదు. అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు విజయం సాధించాడు. ఈడీ ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతాను. మేము బీజేపీ బీ టీమ్ అయితే.. ఈడీ ఆఫీసుకు ఎందుకు వెళ్తున్నాము. నాతో పాటు ఎవరిని విచారించినా నాకేం ఇబ్బంది లేదు. మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఇంతవరకు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందలేదు. బిల్లుపై ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేకపోయాయి. అందుకే రేపు ఢిల్లీలో ధర్నా చేపడుతున్నాం. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాలో మొత్తం 18 పొలిటికల్ పార్టీలు పాల్గొంటాయి అని స్పష్టం చేశారు. -
తెలంగాణలో రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కారణంగా తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనని ఆమె ఈడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈనెల 15న హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య బుధవారం సాయంత్రం కవిత ఢిల్లీకి పయనమయ్యారు. ఇదిలా ఉండగా కవిత విజ్ఞప్తిని ఈడీ పరిగణలోకి తీసుకుంది. మార్చి 9న కవిత ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నెల 11న కవితను ఈడీ విచారణకు పిలిచే అవకాశముంది. తెలంగాణ కేబినెట్ భేటీ మరో వైపు గురువారం (మార్చి 9) తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారన్నారు. వీటితో పాటుగా ఒక వేళ ఈడీ కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలనే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయంగా ఈడీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో తదుపరి కార్యచరణపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. -
Delhi Liquor Scam: ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకా? లేక..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ బుధవారం నోటీసులు జారీ చేసింది. అయితే, బిజీ షెడ్యూల్ ఉన్నందున రేపటి ఈడీ విచారణను హాజరు కాలేనని ఆమె లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీన ఈడీ విచారణకు హాజరు అవుతానని కవిత లేఖలో పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన జంతర్మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిన కారణంగా హాజరు కాలేనని తెలిపారు. అందుకే సమయం కావాలని కోరారు. ఇదిలాఉండగా.. కవిత విజ్ఞప్తిపై ఇప్పటివరకు ఈడీ నుంచి ఏ స్పందనా రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కవిత బంజారాహిల్స్ నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కవిత ఈడీ ముందుకు హాజరు కానున్నారా? లేదా జంతర్మంతర్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా గతేడాది డిసెంబర్లో సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసి మరీ సీబీఐ కవితను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఎఫ్ఐఆర్కు తోడు ఇప్పుడు పిళ్లై స్టేట్మెంట్ కూడా ఈడీ దర్యాప్తులో కీలకంగా మారినట్లు స్పష్టమవుతోంది. తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లైను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా ఈడీ పేర్కొనడం సంచలనంగా మారింది. ఇక కవిత ప్రయోజనాలు కాపాడేందుకే సౌత్ గ్రూప్లో రామచంద్ర పిళ్లై ఉన్నట్లు ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. -
K Kavitha: సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగానే..!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అందుకు సీబీఐ ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుంది. ఈ మేరకు కిందటి ఏడాది ఆగష్టులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకుని ఈసీఐఆర్(Enforcement Case Information Report) నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఎఫ్ఐఆర్లో ఐపీసీ సెక్షన్లు.. 477A, 120బీ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 ప్రకారం.. కవితకు నోటీసులు జారీ చేసినట్లు ఉంది. గతంలో కవితను.. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసి మరీ సీబీఐ గతేడాది డిసెంబర్లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఎఫ్ఐఆర్కు తోడు ఇప్పుడు పిళ్లై స్టేట్మెంట్ కూడా ఈడీ దర్యాప్తులో కీలకంగా మారినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. లిక్కర్ స్కామ్లో అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలను పేర్కొంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నేరుగానే.. అరుణ్ రామచంద్ర పిళ్లైను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా పేర్కొంది. కవిత ప్రయోజనాలు కాపాడేందుకే సౌత్ గ్రూప్లోలో రామచంద్ర పిళ్లై ఉన్నట్లు పేర్కొంది ఈడీ. ఇంకా రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే.. ‘లిక్కర్ బిజినెస్లో 12 శాతం లాభం ఉండేలా పాలసీని రూపొందించారు. అందులో 6 శాతం ముడుపులు ఆప్ కి ముట్ట చెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండో స్పిర్ట్,బ్రిండ్ కో,మహదేవ్ లిక్కర్స్.. ఏటా రూ. 3వేల 500 కోట్ల బిజినెస్ ఈ మూడు సంస్థల్లో నడుస్తోంది. వీటికి 12శాతం లాభం కింద.. ఏడాదికి 400 కోట్లు లాభం ఆర్జించాయి. అందులో 210 కోట్లు ఆప్ కి వెళ్లాల్సి ఉంది. ఇక.. పిళ్ళై టీమ్ రూ. 296.2 కోట్ల నేరపూరితంగా లాభాలు ఆర్జించారు. వచ్చిన డబ్బులతో ఆస్తులు కొన్నారు. కల్వకుంట్ల కవిత ప్రయోజనాల కోసం ఆయన పని చేశారు’’ అని ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. -
సీబీఐ దాడులకు నేను భయపడను : కవిత
-
లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వస్తే విచారణ జరపొద్దా..? : బండి సంజయ్
-
ఎమ్మెల్సీ కవిత నివాసంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ
-
నేడు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ
-
ఎమ్మెల్సీ కవిత విచారణపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ
-
ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. విచారణకు రాను!: కవిత
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించాను, అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు కవిత. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందని సమాధానమిచ్చారు. దాంతో తాను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తేదీని ఖరారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికిగానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు. ఇదీ చదవండి: సీబీఐ స్పందన తర్వాతే..! -
లిక్కర్ స్కామ్ పై తెలంగాణలో హీట్
-
బీజేపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
-
నిరాధార కేసులతో వేధిస్తే సహించబోం: వేముల
సాక్షి, హైదరాబాద్: సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిరాధార కేసులతో వేధిస్తే సహించేది లేదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. ఆమెపై నిరాధారమైన వార్తలు ప్రచురించేలా చేయడం నీతిమాలిన చర్య అని, కవిత ఇంటిపై బీజేపీ దాడి హేయమైన చర్య అని వేముల సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కేసీఆర్ ఎత్తి చూపుతున్నందునే కవితపై నిరాధారమైన వార్తలు సృష్టిస్తున్నారు. టీఆర్ఎస్ కవితకు అండగా ఉండి బీజేపీ కార్యకర్తలను తరిమి కొడతాం’అని వేముల హెచ్చరించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, భాస్కర్రావు, నోముల భగత్లు టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడు తూ.. కవితపై ఆరోపణలు ఖండించారు. -
కేసీఆర్ కూతుర్ని కాబట్టే నాపై తప్పుడు ఆరోపణలు
-
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ సంచలన ఆరోపణలు
-
స్కాట్స్ అండ్ గైడ్స్ సేవాధృక్పదాన్ని కొనియాడిన గవర్నర్
-
కవిత కోసం నా పదవి త్యాగం చేస్తా: సంజయ్
జగిత్యాల: జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి ఆ స్థానంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను గెలిపించుకుంటామన్నారు. జగిత్యాలలో బుధవారం జరిగిన కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరయ్యారు. కవిత హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తారా? అని పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. కవిత హుజూర్నగర్ నుంచి పోటీ చేయబోరని స్పష్టం చేశారు. -
స్పీడు తగ్గిన కారు
సాక్షి, హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆశించింది. టీఆర్ఎస్ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 11 లోక్సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్కర్నూల్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్కుమార్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆదిలాబాద్ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ జి.నగేశ్పై.. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 58,493 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చేవెళ్ల నుంచి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్పై భారీ 3,16,427 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మంలో చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి ఎంపీగా బరిలో దిగిన నామా నాగేశ్వర్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత.. కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాం నాయక్పై 1,46,663 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 77,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిపై 1,89,748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేష్ నేత.. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్పై 95,180 ఓట్ల తేడాతో గెలిచారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్రావుపై 6,229 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. ఉనికి కాపాడుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో సత్తాచాటారు. భువనగిరి నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్పై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 5,219 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఎ.రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కమల వికాసం! తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసించింది. రాష్ట్రంలోని నాలుగు లోక్సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా స్థానిక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జాయింట్ కిల్లర్గా నిలిచారు. 179 మంది రైతులు బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు, సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ను బీజేపీ నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ ఇక్కడినుంచి విజయం సాధించగా.. ఈసారి బీజేపీ ఎంపీగా పోటీచేసిన పార్టీ సీనియర్నేత కిషన్ రెడ్డి స్పష్టమైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్పై గెలుపొందారు. అయితే.. కరీంనగర్లో బీజేపీ పోటీ ఇస్తుందని భావించినా.. అనూహ్యంగా బండి సంజయ్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ సంపాదించిన సోయం బాపూరావు కూడా స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. -
కవితకు చేదు అనుభవం
-
పసుపుబోర్డు కోసం కొట్లాడింది నేనే
రాయికల్(జగిత్యాల): పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంతో కొట్లాడింది తానే అని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె జగిత్యాల జిల్లా రాయికల్లో నిర్వహించిన బహిరంగసభ, ఆర్యవైశ్యుల సమావేశంలో మాట్లాడారు. పసుపు పంటకు మద్దతు ధర కోసం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు పలువురు ముఖ్యమంత్రులను కలిశామని గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పసుపు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నేడు పసుపు రైతులపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన రాష్ట్ర కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారని తెలిపారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను మనం గెలిపించుకుంటే ఢిల్లీలో సమస్యలపై పోరాటం చేయవచ్చని తెలిపారు. -
చేనేత కార్మికులను ఆదుకుంటాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చేనేత కార్మికుల కోసం ఏ రాష్ట్రంలో లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకించి చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని కేటీఆర్ సూచించారని, అలాగే చేనేత ఉత్పత్తుల స్థాయిని, ప్రజల్లో ఈ దుస్తులకు ఆదరణ పెంచే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకుల ఆదరణ లేకపోవడంతో చేనేత వృత్తి అంతరించి పోయే స్థితికి చేరిందని, మగ్గం మీద బట్టలు నేసే వారు చాలా చోట్ల కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు వృత్తిలో నైపుణ్యాన్ని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. మే నెల నుంచి బీడీ కార్మికుల పింఛన్ మొత్తం రెట్టింపు అవుతుందని, పీఎఫ్ కార్డున్న కార్మికులందరికీ బీడీ భృతి లభిస్తుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన వారందరికి డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ఐదేళ్లలో ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేశానని, మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా తదితరులు పాల్గొన్నారు. గ్రామగ్రామాన టీఆర్ఎస్ సైనికులు.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో ప్రణాళికా బద్ధంగా తమ ఎన్నికల ప్రచారం కొనసాగుతోందని కవిత పేర్కొన్నారు. గ్రామగ్రామాన వందలాది మంది టీఆర్ఎస్ సైనికులు పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళుతున్నారన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, వీలైనన్ని గ్రామాలను చుట్టి వచ్చానని, ఎమ్మెల్యేలు కూడా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం కొనసాగుతోందన్నారు. ఆడబిడ్డలే టీఆర్ఎస్కు ఆయువుపట్టుగా నిలుస్తున్నారని, మహిళలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల దయతో తాను ఈసారి కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, నాయకులు ఆనందర్రెడ్డి, అర్కల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వార్ వన్సైడే..!
సాక్షి, జగిత్యాల: ‘పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో ఒకటికి బదులు 12 ఈవీఎంలతో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.. గెలుపు కూడా ప్రత్యేకంగా ఉండాలి’ అని నిజామాబాద్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత పిలుపునిచ్చారు. ఏ సభ చూసినా వార్ వన్ సైడ్లా కనిపిస్తోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగం గా బుధవారం జగిత్యాలలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. ‘నేను పాతాళంలో ఉన్నా.. వెతికి పట్టుకుని ఓటేస్తారని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని నమ్ముకుని వచ్చా ను. ఎంపీగా నా పనితీరు బాగుందనిపిస్తే నన్ను గెలిపించండి’ అని విజ్ఞప్తి చేశారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే ఢిల్లీలో కొట్లాడుతానని, గల్లీలో సేవ చేస్తానని పేర్కొన్నారు. దేశ చరిత్రను మలుపు తిప్పాలంటే మనపాత్ర ఉండా లని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిం దేమీ లేదని కవిత విమర్శించారు. దేశంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, దేశం కూడా ముందుకు సాగాలంటే కాంగ్రెస్, బీజేపీని పక్కకు పెట్టాలని కోరారు. 29 రాష్ట్రా ల్లో 24 గంటల కరెంట్ ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మనకు వచ్చినట్లు దేశమంతా కరెంట్ రావాలని చెప్పారు. 16 సీట్లొస్తే తెలంగాణకు లాభం తెలంగాణ రాష్ట్ర మోడల్ అభివృద్ధి దేశంలో జరగాలంటే 16 సీట్లు టీఆర్ఎస్కు రావాలని, రేపు ఢిల్లీలో మన మాట చెల్లుబాటు అవుతుందని కవిత చెప్పారు. మట్టి పనికైనా మనోడు ఉండాలని, అలాంటిది తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలంటే గులాబీ జెండానే ఎగరాలన్నా రు. 12 మంది ఎంపీలం గెలిస్తే ప్రతి పనికి అందరం కట్టకట్టుకుని ఢిల్లీకి పోయి పనులను సాధించుకున్నామని చెప్పారు. 60 ఏళ్లలో ఎన్న డూ రానన్ని రైల్వే లైన్లు రాష్ట్రానికి వచ్చాయ న్నారు. బీజేపీకి సీట్లు వస్తే మోదీకే లాభం, కాంగ్రెస్కు సీట్లు వస్తే రాహుల్కు లాభం, టీఆర్ఎస్కు సీట్లు వస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుందన్నారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే కేవలం తెలంగాణలో మాత్రమే వారికి పింఛన్ అందుతుందన్నారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ బీజేపీ చేసింది తక్కువ, అబద్ధాలు ఎక్కువ అని కవిత విమర్శించారు. ప్రధాని మోదీ నుంచి అభ్యర్థి వరకు అందరూ అబద్ధాలే మాట్లాడుతారని చెప్పారు. మోదీ నిజామాబాద్ వచ్చి ఇక్కడ కరెంట్ లేదు అంటే ఏడవాలో నవ్వాలో కూడ అర్థం కాలేదని అన్నారు. బీజేపీకి భారతీయ ఝూటా పార్టీ అని పేరు పెట్టామన్నారు. కాంగ్రెస్కు విజన్ లేదు.. బీజేపీ సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలను ప్రచారం చేస్తోందని కవిత మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి పెన్షన్లలో రూ.800 ప్రధాని మోదీ ఇస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో వారు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటివి మస్తుగా పుట్టించారన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు విజన్ లేదని, బీజేపీలో నిజం చెప్పే నాయకులు లేరని, అందుకే కేసీఆర్కు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. భలే టేస్టీగున్నాయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత జగిత్యాల రోడ్షో నిర్వహించారు. ప్రసంగం మధ్యలో ఓ హోటల్ వద్దకు వెళ్లి.. అటుకులు తిన్నారు. ‘అరే.. అటు కులు భలే టేస్టీగా ఉన్నాయే..’అంటూ తిరిగి వెళ్లి తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని, బీజేపీ అంటే ‘మందిర్’వివాదం గుర్తుకు వస్తుందని నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత విమర్శించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ, డిచ్పల్లి మండలాల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించిన కవిత.. బీజేపీ, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల నుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్.. ప్రాంతీయ పార్టీ అని, 16 మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో ఏం చేస్తారని సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిపికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనా బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని, ఆసరా లబ్ధిదారులకు ఇచ్చే పింఛన్ మొత్తంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.200 మాత్రమేనని, మిగిలిన రూ.800 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. మే నెల నుంచి రూ.2 వేల పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. రెండేళ్లలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని చెప్పారు. ప్రచార కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సుమనారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు గడ్డం ఆనంద్రెడ్డి, బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు. -
కవిత ఆస్తుల విలువ రూ.7.63 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పేరు మీద రూ.7.63 కోట్లు, భర్త రామయగారి దేవనపల్లి అనిల్కుమార్ పేరు మీద రూ.9.7 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. కవిత దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె రూ.5,55,30,620 విలువ గల స్థిరాస్తులు, రూ. 2,08,37,049 విలువైన చరాస్తులను కలిగి ఉండగా, భర్త అనిల్కుమార్ రూ.6,76,64,099 విలువైన చరాస్తులు, రూ.2,97,77,746 విలువైన స్తిరాస్తులను కలిగిఉన్నారు. కవిత రెండు టయోటా ఫార్చునర్ కార్లను కలిగి ఉన్నారు. కవిత తనయులు ఆదిత్య రూ.24.81 లక్షలు, ఆర్య రూ.30.90 లక్షల చరాస్తులను కలిగి ఉన్నారు. కవిత రూ.2.27 కోట్ల అప్పులు, అనిల్ కుమార్ రూ.6.79 కోట్ల అప్పు లు కలిగి ఉన్నారు. ఆమెపై ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆమె వీఎన్ఆర్ వీజేఐఈటీ నుంచి 1999లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు. -
ఎక్కని కొండలేదు.. మొక్కని బండ లేదు
సాక్షి, జగిత్యాల: పసుపు రైతులకు న్యాయం కోసం తాను ఎక్కని కొండలేదని, మొక్కని బం డ లేదని సిట్టింగ్ ఎంపీ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఇరవై ఏళ్లలో వారి కోసం ఎవరూ చేయనంతగా తన శక్తి మేరకు కృషి చేశానని చెప్పారు. జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె రోడ్షో నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు తన మీద పోటీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే తనకూ సంతోషమేనని వ్యాఖ్యానించారు. రైతుల కోసం ఎవరూ చేయనంతగా తన శక్తి మేరకు కొట్లాడానని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో జాతీయ స్థాయి పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తమకు 16 సీట్లు ఇచ్చి గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి పసుపు బోర్డును సాధిస్తామని హామీ ఇచ్చారు. దేశం గతి మా రాలి, దేశంలో మంచి మార్పు రావాలంటే టీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఆశీర్వదించాలని కవిత కోరారు. 16 సీట్లను 116 చేసే సత్తా సీఎం కేసీఆర్కు ఉందన్నారు. ఆయనకు దేశంలో ఆ స్థాయి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. -
నేరం చేయకపోతే ఉలుకెందుకు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం వ్యవహారంపై టీఆర్ఎస్ కార్యనిర్వాహ క అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఏ తప్పు చేయనప్పుడు ఎం దుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణను ఏపీ పోలీసులతో ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. ‘మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొం గతనం బయటపడుతుంది అనే కదా మీ భయం చంద్రబాబు గారూ?’ అని పేర్కొన్నారు. 100 దేశాల్లోటీఆర్ఎస్ శాఖలు: కవిత సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ఏప్రిల్ 27న జరిగే ప్లీనరీ నాటికి వంద దేశాల్లో టీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవహారాల బాధ్యురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ ఎన్నారై సమన్వయకర్తకు సూచించారు. టీఆర్ఎస్ కొత్త ఎన్నారై శాఖల ఏర్పాటు, శాఖల పని తీరు, కార్యకలాపాలపై కవిత మంగళవారం ఇక్కడి బాధ్యులతో చర్చించారు. కెనడాలో ఇటీవల ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ శాఖతో కలిపి మొత్తం 40 దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు ఏర్పాటైనట్లు బాధ్యులు కవితకు వివరించారు. ఈము రైతుల రుణాలను మాఫీ చేయండి: వినోద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఈము పక్షుల రైతులకు సంబంధించిన సుమారు రూ.27 కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేయాల్సిందిగా ఎంపీ వినోద్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్కి ఆయన లేఖ రాశారు. గతంలో స్వయంఉపాధి పథకంలో భాగంగా నాబార్డు సహకారం తో వివిధ బ్యాంకులు 25% రాయితీతో ఈము రైతులకు రుణాలు ఇచ్చాయన్నారు. ఈము పక్షు ల పెంపకం, మార్కెటింగ్లో వచ్చిన ఇబ్బందుల కారణంగా రైతులపై రుణభారం పడిందని, బ్యాంకులు రుణగ్రహీతలపై ఒత్తిడి తేవడంతో ఒకరిద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడార న్నారు. రుణాలను మాఫీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈము రైతులను ఆదుకోవాలని కోరారు. -
ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర
తిరువనంతపురం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషిస్తాయని, ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీలకు అనేక అవకాశాలు దక్కాయని, కానీ ఆయా పార్టీలు తాము ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. ఇక వారికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. శనివారం ప్రెస్క్లబ్ ఆఫ్ తిరువనంతపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దేశంలో ని పలు ప్రాంతీయ పార్టీలతో టీఆర్ఎస్ చర్చలు జరిపింది. కాంగ్రెస్, బీజేపీలతో కలవకూడదన్నదే ప్రాంతీయ పార్టీల కూటమి ప్రాథమిక ఎజెండా. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. ఒకపక్క కీలకపాత్ర పోషిస్తూనే.. మరోపక్క కాంగ్రెస్, బీజేపీలను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఈ ప్రాంతీయ పార్టీలు కృషిచేస్తాయి. కాంగ్రెస్, బీజేపీలను సాగనంపాల్సిన సమయం వచ్చింది. దేశంలో నాన్–కాంగ్రెస్, నాన్–బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. దీనికోసం మేం తీవ్రంగా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. అంతర్గతంగా పనిచేస్తున్నాం.. ఫెడరల్ ఫ్రంట్లో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఫ్రంట్ ఎలాంటి పాత్ర పోషించబోతుందో చూస్తారని అన్నారు. ఫ్రంట్లో భాగంగా ఒకే భావస్వారూప్యత గల పార్టీలతో అంతర్గతంగా పనిచేస్తున్నామని తెలిపారు. దేశ పురోగతి కోసమే ఈ ఫ్రంట్ పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు తప్పక నెరవేర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. -
ఎంపీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని యూనివర్సిటీల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న ’క్యాస్ట్స్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్’అనే అంశంపై జరిగే సదస్సులో ఆమెను ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఈమేరకు కేరళ అసెంబ్లీ స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ కవితకు లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ కాంప్లెక్స్లో ఈ సదస్సు జరగనుంది. కేరళ సీఎంతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సదస్సుకు హాజరవుతారని, దేశవ్యాప్తంగా 2 వేలమంది విద్యార్థులు సదస్సుకు హాజరవుతున్నారని శ్రీరామ కృష్ణన్ లేఖలో పేర్కొన్నారు. -
బాబుకు తగ్గుతున్న ఆదరణ
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రజాదరణ తగ్గుతోందని, అది గమనించి ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బుధవారం నిజామాబాద్లో ‘ఆస్క్ కవిత’ పేరిట ప్రత్యేక రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్విట్టర్తో పాటు, స్థానికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఫెడరల్ ఫ్రంట్తో వైఎస్సార్సీపీ జాతీయ స్థాయిలో కలసి పనిచేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారని పేర్కొన్నారు. ఈ విషయమై చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కేవలం అభద్రతా భావంతోనే అలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎవరిని ఆదరిస్తే ఎన్నికల్లో వారే విజయం సాధిస్తారని అన్నారు. అన్ని పార్టీల్లో వారసులు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలలో వారసులు ఉన్నారని కవిత పేర్కొన్నారు. తాము తెలంగాణ కోసం సుదీర్ఘంగా ఉద్యమం చేశామ ని, దాంతో తమ కుటుంబం మొత్తం రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. పనిచేసే వారికే ఎన్నికల్లో ప్రజలు పట్టం గడుతారని చెప్పారు. గాంధీ, అంబేడ్కర్లలో ఎవరు గొప్పవారని అడిగిన ప్రశ్నకు.. అంబేడ్కర్ అన్నివర్గాల ప్రజల సమానత్వాన్ని కోర గా, గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టారన్నా రు. ఇద్దరూ గొప్పవారని, కానీ మార్గాలు వేరన్నారు. కేటీఆర్ గురించి అభిప్రాయం వ్యక్తం చేయాలని కోరగా తండ్రిగా, రాజకీయవేత్తగా, అన్నగా, భర్తగా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేరుస్తున్నారని కితాబిచ్చారు. తన సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేస్తున్నానని, ఈ విధానా న్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో అమలు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నది చంద్రబాబే
-
గాంధేయ మార్గంలో.. సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా..
-
భవిష్యత్ అవసరాల కోసమే: ఎంపీ కవిత
-
గాంధేయ మార్గంలో.. సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా..
సాక్షి, హైదరాబాద్: ‘గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి –నూతన ఆవిష్కరణ’లే ప్రధాన ఎజెండాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి నోవాటెల్లో అంతర్జాతీయ యువజన సదస్సు ప్రారంభమైంది. 135 దేశాలకు చెందిన 550 మంది ప్రతి నిధులతోపాటు 16 దేశాల నుండి డెబ్బై మందికిపైగా నిపుణులు హాజరయ్యారు. తొలిరోజు సం ప్రదాయ దుస్తుల్లో హాజరైన దేశ, విదేశీ ప్రతినిధులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి తెలంగాణ వంటకాలు వడ్డించారు. ఐక్యరాజ్యసమితి లక్ష్యసాధనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు పేదరిక నిర్మూలన, ఆహార సమృద్ధి, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, జెండర్ ఈక్వాలిటీ వంటి పదిహేడు అంశాలపై లోతైన చర్చలు, విశ్లేషణలు సాగనున్నాయి. అన్నా హజారే తొలివక్తగా... పద్మభూషణ్ అన్నాహజారే శనివారం ఉదయం సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ తాపా ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. సదస్సులో ప్రముఖ జర్నలిస్టు శేఖర్గుప్తా, ఎంపీలు గౌరవ్ గొగోయ్, అసదుద్దీన్ ఒవైసీ, కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొననున్నారు. ఆయా సెషన్లలో వివిధ అంశాలపై మాసిడోనియా మాజీమంత్రి గ్లీగోర్, యూకే ఎంపీ సీమా మల్హోత్రా, న్యూజిలాండ్ ఎంపీ కన్వల్జిత్సింగ్ బక్షీ, శ్రీలంక డిప్యూటీ మినిస్టర్ బుధీక పతిరాన పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం వివిధ అంశాలపై అర్పిత్ చతుర్వేది, పుల్లెల గోపీచంద్, కమల్సింగ్, షబ్నం సిద్ధిఖీ, అండ్రూ ఫ్లెమింగ్, సీమా మల్హోత్రా తదితరులు ప్రసంగిస్తారు. భవిష్యత్ అవసరాల కోసమే: ఎంపీ కవిత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే దిశగా మూడు రోజుల అంతర్జాతీయ యువజన సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల తెలిపారు. -
వంద దేశాల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) కీలకపాత్ర పోషించారని, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం వివిధ దేశాలలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఏర్పాటు చేసి, స్వరాష్ట్ర సాధనకు కృషి చేశారని ఎంపీ కె.కవిత అన్నారు. ప్రస్తుతం 33 దేశాల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఉన్నాయని, రానున్న రోజుల్లో వంద దేశాల్లో శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ లండన్ ఎన్ఆర్ఐ సంఘం ఎనిమిదో వార్షికోత్సవ సమావేశం తెలంగాణ భవన్లో శనివారం జరిగింది. ఈ సభలో కవిత ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో, సూచనలతో తెలంగాణకోసం విదేశాల్లో వివిధ పేర్లతో ఎన్ఆర్ఐలు సంఘా లు పెట్టి పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయం లో ఎన్ఆర్ఐలు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొన్నా రాష్ట్రం సాధిం చాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ బిడ్డల అండతో రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శం గా నిలుస్తోంది. మన పారిశ్రామిక విధానం చూసి అమెరికాలోనూ ఇంతమంచి విధానం లేదని అక్కడి వారు అంటున్నారు. గల్ఫ్లాంటి దేశాల్లో తెలంగాణ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని ప్రకటిస్తారు. మీరందరూ గర్వపడేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఇక్కడ పార్టీకి, అక్కడ మన వారికి వారధిలా ఉండాలి. మనమంతా కలిసి పనిచేస్తే దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తది’ అన్నారు. ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నేతలు కూర్మాచలం అనిల్, దూసరి అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ను కలిసిన కవిత.. కవిత శనివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహ న్ను రాజ్భవన్లో కలిశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువనాయకత్వ సదస్సు ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందజేశారు. -
మహాత్ముని దారిలో మహోన్నత ప్రపంచం
దేశంలోనే మొట్టమొదటిసారి.. అదీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో యు.ఎన్. ఉమన్, యు.ఎన్. గ్లోబల్ కాంపాక్ట్, తెలంగాణ జాగృతి .. ఈ మూడూ కలిసి ‘యూత్ లీడర్షిప్ కాన్ఫరెన్స్’ నిర్వహించబోతున్నాయి. సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితతో సాక్షి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. గాంధీమార్గంలో అభివృద్ధి మహాత్మాగాంధీ 150వ వ జయంతి సంవత్సరం ఇది. ‘ది గాంధీ పాత్ టు సస్టేనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్’ (గాంధీ మార్గం నుంచి అభివృద్ధి నిరంతరత, వినూత్నతల వైపు) పేరుతో జనవరి 19, 20 తేదీల్లో హైదరాబాద్లో జరిగే సదస్సులో పాల్గొనడం కోసం 135 దేశాలలోని గాంధేయ అభివృద్ధి వాదులైన రెండు వేల మందికి పైగా యువతీ యువకులు సదస్సుకు హాజరవుతున్నారు. వివిధ అంశాలలో కృషి చేస్తున్న, ప్రపంచ అభివృద్ధిలో తమ పాత్ర ఉండాలనుకుంటున్న వారే వాళ్లంతా. ఇప్పుడు మన దేశం ఉన్న స్థాయి నుంచి ఇంకా పైకెదిగేలా యువతను భాగస్వాములను చేయడం ఈ సదస్సు ఉద్దేశాలలో ఒకటి కాగా, ఇంకొకటి.. అభివృద్ధిని అడ్డుకునే ధోరణులను నిరోధించడమెలాగో యువతకు అవగాహన కల్పించడం. దాని కోసమే ‘యు.ఎన్. ఉమన్’, ‘యు.ఎన్. గ్లోబల్ కాంపాక్ట్’, ‘తెలంగాణ జాగృతి’ కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. సదస్సు కోసం ఈ మూడు సంస్థల్ని సమన్వయం చేస్తున్న కవిత.. ఆ వివరాలను వెల్లడించారు. యువతులకు ప్రాముఖ్యం యూత్ అన్నప్పుడు యువకులు మాత్రమే కాదు, యువతుల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్లే రేపటి మాతృమూర్తులు. మొత్తం తరానికే మార్గదర్శకులు. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో అభివృద్ధి నిరంతరత లక్ష్యాల కింద ఎంపిక చేసిన పదిహేడు అంశాల్లో ఎందులో సరిగా పని సక్రమంగా జరగకపోయినా ప్రభావం పడేది ముందుగా మహిళలమీదే. అందుకే యువతీయువకులిద్దరూ సమాన స్థాయిలో పనిచేయాలి. వీళ్లంతా హాజరయ్యే ఈ సదస్సులో.. ప్రపంచ దేశాల సమస్యలపై జరుగుతున్న అధ్యయనాలు, ప్రపంచం దృష్టి పెట్టిన దుర్బల పరిస్థితులు, సాగుతున్న పరిశోధనల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. ఇక్కడ అనుభవాలు, పరిష్కారాల మార్పిడి జరుగుతుంది. ప్రయోజనకరమైన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. మన దగ్గర ప్రారంభమై, విజయవంతమైన స్వయం సహాయక బృందాల నమూనాను ఈ రోజు ఎన్నో దేశాలు స్వీకరించి అమల్లో పెట్టాయి. సత్ఫలితాలను ఇస్తున్న ఆలోచనల్ని షేర్ చేసుకోడానికి ఇలాంటి సదస్సులు తోడ్పడతాయి. సదస్సులో సమాలోచనలు ఇలాంటి సదస్సులో జరిగే చర్చలు యవతలో చైతన్యం కలిగిస్తాయి. ప్రపంచ దేశాల సమస్యలు; సాంఘిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, పర్యావరణ పరిస్థితులను పరిచయం చేస్తాయి. అందుకు వీలుగా సదస్సులో సమాంతర సమాలోచనల వేదికల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికి ఏ అంశంలో ఆసక్తి ఉంటే వాళ్లు ఆ అంశంలో పాల్గొనవచ్చు. పర్యావరణం, పరిశ్రమలు, ఆరోగ్యం వంటి రంగాలలో జరుగుతున్న పరిణామాలపై ప్రసంగాలు ఉంటాయి. విదేశాల నుంచి ముప్పై మంది వక్తలు, అయిదు వందల మంది అధికార ప్రతినిధులు కాక మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచీ సదస్సుకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారున్నారు. పదిహేడు అంశాల లక్ష్యం గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్య విలువలతో యువతరం యు.ఎన్. నిర్దేశించిన పదిహేడు అంశాల పట్ల శ్రద్ధ చూపిస్తే 2030 కల్లా లక్ష్యాన్ని సాధించడం తేలిక అవుతుంది అనేది సదస్సు ప్రధానాంశం. ఎట్లా సాధించాలి, సాధనలో నా పాత్ర ఎలా ఉండాలి అని యువతకు మర్గాన్ని నిర్దేశించడానికి ఈ సదస్సు ఉపయోగపడ్తుంది. రెండేళ్లకొకసారి ఇలాంటి సదస్సు నిర్వహించాలనే మౌలిక నియమాన్ని కూడా పెట్టుకున్నాం. ఈసారి తెలంగాణ జాగృతి ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. మన కోసం మన ‘జాగృతి’ సదస్సుతో నిమిత్తం లేకుండా.. మొదటి నుంచీ మేం చేస్తుందంతా యువత కోసమే. నైపుణ్యాల అభివృద్ధి మీద దృష్టిపెట్టాం. అరవై శాతం పైగా అమ్మాయిలు, నలభై శాతం వరకు అబ్బాయిలకు ఉద్యోగావకాశాల లభ్యతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మంది యువతకు శిక్షణ ఇప్పించాం. అందులో దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల మంది యువతకు వరకు ఉద్యోగాలిప్పించాం. వీళ్లలో చాలామంది అమ్మాయిలే. తెలంగాణ అంతటా పదిహేను జాగృతి శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రోజూ శిక్షణా తరగతులు జరుగుతూనే ఉంటాయి. విధానపరమైన నిర్ణయాలను మనం ప్రభావితం చేయాలంటే ఒక రాజకీయపరమైన అధికారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మన రాష్ట్రం కోసం జరిగే అభివృద్ధి విధానాలను నేరుగా రూపొందించగలం. ఆ పాత్రను పోషించగలం. ఒక ఎంపీగా నాది అదొక పాత్ర. రెండోది.. ప్రజాజీవితంలో ప్రత్యక్షంగా యువతపై దృష్టి సారించి వాళ్లకోసం నిరంతరంగా పని చేయాలి. జాగృతి వ్యవస్థాపకురాలిగా అది నా ఇంకో పాత్ర అది. మరో బాధ్యత ‘అక్కా’ ప్రాజెక్ట్ ప్రస్తుతం మన దగ్గర యువతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య రక్త హీనత. దాన్ని తీసుకున్నాం. ఏడవ తరగతి నుంచి పదవ తరగతి చదివే ఆడపిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించాం. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇరవై ఐదువేల పై చిలుకు యువతులకు ఆరోగ్య పరీక్షలు జరిపించాం. దురదృష్టవశాత్తు డెబ్బై శాతం కంటే ఎక్కువ మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది. వీళ్లు ఆరోగ్యవంతులయ్యే వరకు కనిపెట్టుకుని ఉండడం మా లక్ష్యం. అంటే ఆరోగ్యవంతమైన తల్లి అయ్యేదాకా వాళ్ల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతాం. ఈ డెబ్బయ్ శాతం మందికి సంబంధించి వివరాలు సేకరించి ప్రతి యేడూ పరీక్షిస్తుంటాం. ‘అక్కా’ అనే పేరుతో మొదలైన ఏడేళ్ల ప్రాజెక్ట్ ఇది. ‘అక్కా’ అనేది ఒక కాన్సెప్ట్. రక్తహీనత ఉన్న ప్రతి పది మంది అమ్మాయిలకూ ఒక ఆరోగ్యవంతురాలైన అమ్మాయిని ఎంపిక చేసి లీడర్గా ఉంచుతాం. ఆ అమ్మాయి క్రమం తప్పకుండా ఆ పదిమందిని పర్యవేక్షిస్తుంటుంది. వాళ్ల ఆహార అలవాట్లను పరిశీలిస్తూ, అవసరమైన సలహాలిస్తూ ఆరోగ్యవంతులయ్యేలా సహకరిస్తుంటుంది. ఒక ఫ్రెండ్లా, ఆత్మబంధువులా వ్యవహరిస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ను ‘యు.ఎన్. ఉమన్’ సహకారంతో చేస్తున్నాం. ఇలా ఏ సమస్యను చేపట్టినా అర్థం పరమార్థం ఉంటుంది. అయితే యువతతోనే ప్రధానంగానే పనిచేస్తున్నాం’’ అని వివరించారు కవిత. జాగృతి ఫెలోషిప్ అవార్డ్స్ ఈ ఏడాది నుంచి ‘జాగృతి ఫెలోషిప్ అవార్డు’ ఇవ్వబోతున్నాం. ఫెలోషిప్ ప్రొగ్రాం తీసుకున్న వారిలో తొమ్మిది నుంచి పదిమందిని ఎన్నుకుని వారికి జాగృతి చేపట్టిన పద్దెనిమిది ప్రాజెక్టులను వారికి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. వారిలో ఈసారి తొమ్మిదిమందిని సెలెక్ట్ చేశాం. వాళ్లు గత పది రోజులుగా హైదరాబాద్లోనే ఉండి అన్ని ప్రాజెక్టులకు తిరుగుతున్నారు. వాళ్లకు మళ్లీ శిక్షణ ఇచ్చి, ఫెలోషిప్ అవార్డ్కు ఎంపిక చేస్తున్నాం. అలా నెమ్మదిగా జాతీయ, అంతర్జాతీయ యవనికలోకి ప్రవేశిస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్లు జాగృతి ఫెలోషిప్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త గుర్తింపు కావాలనుకునే, అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే ఆసక్తి ఉండే యువతీయువకులు ఈ సదస్సుకి హాజరుకావచ్చు. – కవిత -
జీవన్రెడ్డిపై మండిపడ్డ ఎంపీ కవిత
-
రేవంత్ ఇంట్లో సోదాలు..నేతల మధ్య మంటలు
-
రేవంత్పై దాడులకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదు
-
ఫెడరల్ ఫ్రంటే గేమ్ చేంజర్: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఎంపీ కె. కవిత అన్నారు. ఢిల్లీలోని ఇండియన్ విమెన్స్ ప్రెస్ కార్ప్లో మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఎన్నికలకు ఏడాదే గడువు ఉండటంతో ఇప్పటికైనా రైతులకు మేలు చేస్తుందేమో చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్ విధానాలు రూపొందించడం సరైంది కాదని చెప్పారు. తమది బలమైన పార్టీ కాబట్టే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంటూ అంటూ టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని, విధానాలు నచ్చి తమతో కలసి వచ్చే వారందరినీ స్వాగతిస్తామని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, ఇది రైతులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారు: కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశం టీఆర్ఎస్ నేతలకు లేదని ఆ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కావాలని మోదీని అలా అనలేదని.. మాటల ఫ్లోలో అలా వచ్చిందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లో శుక్రవారం ఇక్కడి మీడియాలో ఎంపీ కవిత మాట్లాడారు. చిన్న పొరపాటును బీజేపీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రైతుల పట్ల ఆవేదనతోనే సీఎం కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని తెలిపారు. విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయాలన్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో 2014 నుంచే తాము మద్ధతిస్తున్నట్లు ఎంపీ కవిత గుర్తుచేశారు. ‘నాన్నగారు (కేసీఆర్) అలా మాట్లాడతారని అనుకోను. ‘స్లిప్ ఆఫ్ ద టంగ్ (పొరపాటున) అయి ఉంటుందంటూ’ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇదివరకే ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వస్తున్నట్లు ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసార్ల నాగేందర్రెడ్డి తెలిపారు. సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్ని, కార్న్బెర్న్ తదితర ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితతో రాష్ట్రం అభివద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్రావు, రాజేశ్, మాదవ్, సత్యం, అర్జున్, అమర్రావు, ప్రకాశ్, అభినయ్, చక్రవర్తి,సాగర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'కేంద్రం తీరుపై సీఎం ఆవేదనతో ఉన్నారు'
హైదరాబాద్ : హైకోర్టు విభజన విషయంల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ ఆవేదనతో ఉన్నారని నిజామాబాద్ ఎంపీ కె.కవిత తెలిపారు. అందుకే ఆయన ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద దీక్ష చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామని కేంద్రప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లో కె.కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైకోర్టు విభజనపై ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ పలుమార్లు చర్చించారని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రక్రియ అంతా కేంద్రంపరిధిలోనే జరగాలన్నారు. క్లాస్ -4 ఎంప్లాయిస్ నుంచి జడ్జిల నియామకం వరకు వివాదం నెలకొని ఉందన్నారు. రేపు జరిగే ఎల్పీ సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. న్యాయాధికారులకు ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కె.కవిత డిమాండ్ చేశారు. ఇద్దరు జడ్జిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. కేంద్రం వెంటనే స్పందించి హైకోర్టును విభజించాలన్నాని తెలిపారు. జడ్జిలకు జరిగిన అన్యాయంపై స్పందించాలని ఆమె అన్ని పార్టీలకు సూచించారు. ఇంత జరుగుతున్న విపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని కె.కవిత ప్రశ్నించారు. -
ఈ ఫలితాలే రిపీట్ అవుతాయి: కవిత
హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ కె. కవిత బుధవారం హైదరాబాద్లో స్పందించారు. టీఆర్ఎస్ విజయం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని ఆమె స్పష్టం చేశారు. ఈ మహా విజయం అందించిన ప్రజలకు కవిత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తామన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులను ప్రజలు విశ్వసిస్తున్నారని కవిత తెలిపారు. అయితే మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఆమె ఆరోపించారు. రాజకీయ అస్థిత్వం కోసమే ఆ పార్టీ నాయకులు ఈ విమర్శలు చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఫలితాలే రిపీట్ అవుతాయని కవిత ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. ఆత్మవిమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆమె హితవు పలికారు. 60 ఏళ్లలో ఆ పార్టీ చేయలేనిది ... ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం వల్ల ఆదిలాబాద్తో సహా మిగతా జిల్లాలకు సాగు, తాగు నీరు అందుతుందన్నారు. తమ పార్టీపై విమర్శలు మానుకోకపోతే... వచ్చే ఎన్నికల్లో 2 లేదా మూడు సీట్లు కూడా రావని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కవిత సూచించారు. -
అత్యాచార బాధితులకు అండ : ఎంపీ కవిత
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లిలో అత్యాచారానికి గురై ఇటీవల మరణించిన మైనార్టీ యువతి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. శనివారం నిజామాబాద్లో స్థానిక మైనార్టీ సంస్థల ప్రతినిధులు ఎంపీ కవితను కలసి సదరు యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కవిత... జిల్లా కలెక్టర్ యోగితారాణాతో మాట్లాడారు. అనంతరం కవిత మాట్లాడుతూ... బాధితురాలి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితోపాటు రెండు ఎకరాల పొలం తమ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. జిల్లాలోని మోర్తాడు మండలం ఏర్గట్ల గ్రామంలో మైనార్టీ వర్గానికి చెందిన మరో మహిళ రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైంది. ఆమెకు ప్రభుత్వం తరఫున కేవలం రూ. 50 వేలు ఇచ్చారని మైనార్టీ నాయకులు గుర్తు చేశారు. దాంతో బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని సదరు మైనార్టీ నాయకులకు కవిత ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు హఫీజ్ మహమ్మద్ లయిక్ ఖాన్, హఫీజ్ ఇంతియాజ్, హఫీజ్ అబ్దుల్ హకీం, మౌలానా అబ్దుల్ హలీం, హఫీజ్ అష్రఫ్ తదితరులు ఎంపీ కవితను కలిసిన వారిలో ఉన్నారు. -
నిజామాబాద్లో టీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశం
నిజామాబాద్ : టీఆర్ఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిజామాబాద్ నగరంలో జరగనుంది. స్థానిక కంఠేశ్వర్ రోడ్డులోని శ్రావ్య గార్డెన్లో ఈ సమావేశంలో నిర్వహించనున్నారు. స్థానిక ఎంపీ కె. కవిత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరనుందని జిల్లా అధ్యక్షుడు ఈ గంగారెడ్డి వెల్లడించారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు జితేందర్రెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్, నగర మేయర్ కూడా హజరుకానున్నారని తెలిపారు. -
అప్పుడు తెలంగాణకు అన్యాయం
- సీఎం కేసీఆర్ చొరవతో ఈసారి ప్రాధాన్యం - పెద్దపల్లి-నిజామాబాద్ రూట్కు భారీ నిధులు - కొత్త లైన్లకు ఆమోదం తెలిపితే బాగుండేది - బడ్జెట్పై ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘‘ఉమ్మడి రాష్ర్టంలో అనేక ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చింది.తెలంగాణ సాధన అనంతరం తొలి రైల్వే బడ్టెట్ ఇది. సహచర ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి చొరవతో ఈసారి జరిగిన కేటాయింపులలో తెలంగాణ వాటా దక్కిందని భావిస్తున్నా. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లై నుకు రూ.141 కోట్లు ఇవ్వ డం సంతోషకరం’’ అని పేర్కొన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ‘‘గత బడ్జెట్లో రూ.35 కోట్లే కేటాయించడంతో పోలిస్తే ఇది హర్షించదగ్గదే. ఐతే ప్రజలు అ డుగుతున్నటువంటి మనోహరాబాద్-నిజామాబాద్ డబుల్ లైన్ పనులు, కొత్తలైన్లకు ఆమోదం తెలిపి కేటాయింపులు చేస్తే బాగుండేది. తె లంగాణకు ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాకు అవసరమైన ప్రాజెక్టుల కోసం నా ప్రయత్నం ఇక ముందు కూడా కొనసాగుతూ ఉంటుంది. తెలంగాణకు 14 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కూడా కేటాయించడం హర్షించదగ్గ విషయం. మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని కాపలా లేని గేట్ల విషయంలో చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి తీసుకోబోతున్న చర్యలు బాగానే ఉన్నాయి. స్టేషన్లలో సౌకర్యాలు, టాయిలెట్ల నిర్వహణ మెరుగుపర్చడం మంచి పరిణామం కాగా, రైల్వేలలో రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టాలనడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రైల్వేలు ఉమ్మడి జాబితాలోని అంశం కాదు. అది కేంద్రం పరిధిలోని అంశం. నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం కేంద్రం మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదన సమంజసం కాదు. దేశానికి రైల్వేలు రక్తనాడుల వంటివి. దేశాభివృద్ధికి, వివిధ ప్రాంతాల సంతులిత అభివృద్ధిలో రైల్వేల పాత్ర కీలకం కాబట్టి ఆ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి. ఇది బడ్జెట్లో కేటాయింపులు మాత్రమేనని, అసవరమైతే ప్రత్యేక పరిస్థితులలో, సప్లిమెంటరి బడ్జెట్లో మరిన్ని కేటాయింపులకు అవకాశం ఉం దని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. అందుకోసం కూడా ఎంపీగా మన ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని వివరించారు.