kphb
-
కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. లేఅవుట్లో 54.29 ఎకరాల స్థలంలో ఉందన్న న్యాయమూర్తి.. అందులో 10 శాతం గ్రీనరీ కోసం వదిలేయాలి కదా అని ప్రశ్నించారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, 10 శాతం ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించామని ఏజీ సమాధానమిచ్చారు.ఆసియాలోనే అతిపెద్ద, పాతదైన లేఅవుట్ కేపీహెచ్బీ కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వేలం పాటలో ప్లాట్లు దక్కించుకున్న వాళ్లకు కేటాయింపులు చేయొద్దన్న హైకోర్టు.. లేఅవుట్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
హైదరాబాద్ కేపీహెచ్బీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారి పై ఉన్న ఫర్నిచర్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాటుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలు సమీపంలో ఉన్న మరో మూడు దుకాణాలకూ వ్యాపించాయి. శ్రీ ఫుట్ వరల్డ్, ఎంఎస్ ఫర్నిచర్, ఫుట్ నీడ్స్, వాచెస్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్లు తగలబడిపోయాయి. -
కేపీహెచ్బీలో ఓయో రూమ్లపై పోలీసుల దాడులు..
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్దార్ పటేల్ నగర్లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్పై ఎస్వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. వెస్ట్ బెంగాల్కి చెందిన 8 మంది మహిళలను పోలీసులు కాపాడి రెస్క్యూ హోమ్కి తరలించారు. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 10 వేలు నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న(సోమవారం) కూడా కేపీహెచ్బీలోని పలు ఓయో రూమ్లపై బాలానగర్ ఎస్వోటి పోలీసులు దాడులు చేశారు. 9 మంది యువతులను రక్షించారు. చదవండి: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి -
హైదరాబాద్ : KPHBలో మహిళ ఆత్మహత్య
-
మూసాపేట నుంచి కేపీహెచ్బీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్
-
కేపీహెచ్బీ టూ ఓఆర్ఆర్.. మెట్రో నియో పట్టాలెక్కేనా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ట్రాఫిక్కు చెక్ పెట్టేందుకు ఐటీ కారిడార్ పరిధిలో మెట్రో నియోగా పిలిచే ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం (బీఆర్టీఎస్) ప్రాజెక్టును చేపట్టేందుకు నిధుల లేమి శాపంగా మారింది. పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.3,100 కోట్ల నిధులు వెచి్చంచేందుకు ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర సర్కారు రెడ్కార్పెట్ పరిచి ఆహ్వానిస్తోంది. మరోవైపు రూ.450కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లాభాలు రాకపోవడంతో.. ఇప్పటికే నగరంలో మూడు మార్గాల్లో 69.2 కి.మీ మార్గంలో అందుబాటులో ఉన్న తొలిదశ మెట్రో ప్రాజెక్టును పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో లాభదాయకం కాలేదు. ఈ నేపథ్యంలో యాన్యుటీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏ ప్రైవేటు సంస్థ ముందుకొస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సర్కారు అంచనాల ప్రకారం.. యాన్యుటీ విధానంలో మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థ ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. తర్వాత అయిదు నుంచి పదేళ్ల అనంతరం వడ్డీతో కలిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు చేసిన వ్యయాన్ని వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు చెల్లిస్తుందన్న మాట. అంతేకాదు సదరు నిర్మాణ సంస్థకు ఈ ప్రాజెక్టు చేపట్టే మార్గంలో విలువైన ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక పద్ధతిన తక్కువ మొత్తానికి లీజుకిచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈవిధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం(ఈబీఆర్టీఎస్) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. - ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు. ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. - ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్ జంజాటం లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్బీ– హైటెక్స్–రాయదుర్గం– కోకాపేట్– ఓఆర్ఆర్ వరకు సుమారు 19 కి.మీ మేర సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. కానీ నిధులు వెచి్చంచే విషయంలో ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడం గ్రేటర్ పిటీ. -
ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్స్పెకర్ట్ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ద్విచక్ర వాహనదారుడిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, మరుసటి రోజు చెల్లిస్తానని కోరాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ .. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’ మరో ఘటనలో మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ఓ వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించాడు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తిపై మియాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే.. విధులకు ఆటకం కలిగిస్తున్నావంటూ మళ్లీ మళ్లీ చెంప చెళ్లుమనిపించారు. -
హైదరాబాద్: కెపిహెచ్బి క్లబ్ మస్తీ పబ్లో అశ్లీల దందా
-
జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల ఘర్షణ
సాక్షి, కేపీహెచ్బీకాలనీ(హైదరాబాద్): జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల నడుమ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణ గురువారం బహిర్గతమైంది. బుధవారం రాత్రి మెటలర్జీ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని ఏబీవీపీ నాయకులు క్యాంటీన్ వద్దకు పిలిచి దాడి చేశారని, గురువారం ఉదయం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో సదరు ర్యాలీలో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు పాల్గొన్నారని, బయటి వ్యక్తులను ఎలా రానిస్తారంటూ ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల నడుమ మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కేపీహెచ్బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు సంఘాల నాయకులు ఘర్షణ పడకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఏబీవీపీ నాయకులు అక్కడి కొన్ని జెండాలను తొలగించి దగ్ధం చేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన మఫ్టీ పోలీసును తోసేశారు. దీంతో అప్పటికే అక్కడే ఉన్న ఇతర పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు. అక్కడి విద్యార్థులను జీపుల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఈ ఘర్షణలో కొందరు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఘర్షణకు కారమైన విద్యార్థి నాయకులు, విద్యార్థులపై కేసులు నమోదు చేస్తామని, మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని సీఐ కిషన్కుమార్ తెలిపారు. దాడిని ఖండిస్తూ ర్యాలీ... బుధవారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ జేఏసీ నాయకులు యూనివర్సిటీలోని అన్ని కళాశాల ముందు నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా వీసీ లేకపోవడంతో రిజిస్ట్రార్కు, ఓఎస్డీకి వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. కాగా విద్యార్థులను నడుమ సఖ్యతను పెంచి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తోడ్పడాల్సిన విద్యార్థి సంఘాల వ్యవహారాలను చూసే అధికారి పేరుతోనే విద్యార్థులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురు విద్యార్ధులు బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం యూనివర్సిటీ ఉన్నతాధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతుండటం గమనార్హం. (క్లిక్: ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్) -
కూకట్ పల్లి పబ్ లో చీకటి గుట్టు రట్టు
-
KPHB: పబ్లో యువతుల అర్ధనగ్న నృత్యాలు
-
కూకట్పల్లి పబ్లో యువతుల అర్ధనగ్న నృత్యాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతోంది. దీంతో పబ్ నిర్వాహకులు ఇష్టారీతిలో రూల్స్ను బ్రేక్ చేస్తూ పబ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ‘సాక్షి’ నిఘాతో కబ్ల్ మస్తీ పబ్ చీకటి గుట్టు బయటలకు వచ్చింది. మరో పబ్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో మంజీరా మెజిస్టిక్ కమర్షియల్లోని క్లబ్ మస్తీ పబ్లో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్లో యువతులతో అర్ధనగ్న నృత్యాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా పబ్ యజమాన్యం పరిమితికి మించి డీజే సౌండ్తో పబ్ నడుపుతోంది. ఈ పోలీసుల దాడుల్లో భాగంగా పబ్లో 9 మంది యువతులు, మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పబ్ యజమాని శివప్రసాద్, మేనేజర్లు, కృష్ణ పరారీలో ఉన్నారు. ఇక, డీజే మిక్సర్, హుక్కా ప్లేయర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎస్ఓటీ పోలీసులు నిందితులను కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. అయితే, కస్టమర్లను ఆకర్షించేందుకే పబ్ యాజమాన్యం అమ్మాయిలతో ఇలా అర్ధనగ్న నృత్యాలు చేపిస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత -
‘మెదక్ కారు డెత్’ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ఆత్మహత్య
-
ఏఎస్సై మృతి: కిస్మత్పూర్లో విషాదం
కూకట్పల్లి (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అతివేగంగా కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ ఏఎస్సై మహిపాల్రెడ్డి మంగళవారం మృతి చెందారు. గత శనివారం నిజాంపేట్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా దూసుకువచ్చిన టాక్సీ కారు మహిపాల్రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్సకోసం ఆయన్ను కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న మహిపాల్రెడ్డి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వివరాలు.. మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీ విధుల్లో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీకొట్టాడు. దీంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకొని వివరాలు సేకరిస్తున్న కేపీహెచ్బీ ఏఎస్ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో కేపీహెచ్బీ లా అండ్ ఆర్డర్, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రంక్ డ్రైవ్ చేపట్టారు. సుమారు 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన సృజన్.. పవన్తో కలిసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్ను పికప్ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్03 ఈజెడ్ 9119 నంబర్ గల క్రెటా వాహనంలో బయలుదేరారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ రాజ్కుమార్ వారి కారు వద్దకు వచ్చి ఆపాలని సూచించాడు. దీంతో సృజన్ కారును వేగంగా రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్తో పాటు తనూజ అనే మహిళను ఢీకొట్టాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న నైట్ రౌండింగ్ ఏఎస్ఐ మహిపాల్రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్రెడ్డి ప్రమాద వివరాలను నోట్ చేసుకుంటుండగానే అర్ధరాత్రి 12.10 గం. సమయంలో టీఎస్08 యూడీ 2984 నంబర్ గల క్యాబ్ను అతి వేగంగా నడుపుతూ అటుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్రెడ్డిని ఢీకొట్టాడు. కిస్మత్పూర్లో అంత్యక్రియలు: ఏఎస్ఐ మహిపాల్రెడ్డి మృతి చెందడంతో ఆయన స్వస్థలం కిస్మత్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మహిపాల్రెడ్డి కిడ్నీలు, లివర్ను అవయవదానం చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం కిస్మత్పూర్తోని ఆయన నివాసం వద్ద అంత్యక్రియలు జరగనున్నట్లు చెప్పారు. అంత్యక్రియల్లో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మహిపాల్రెడ్డి భౌతికకాయానికి అడిషనల్ డీజీపీ సజ్జనార్ నివాళులర్పించారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తామంటూ.. రూ.3 కోట్ల మోసం -
హైదరాబాద్: కేపిహెచ్బీలో అగ్నిప్రమాదం
-
కేపీహెచ్బీలో బ్యూటీషియన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ బ్యూటీషియన్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. అయిదో ఫేజ్లో నివాసం ఉంటున్న సత్య శిరీష గతంలో బ్యూటీపార్లర్ నిర్వహించేవారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో దాన్ని ఆమె మూసివేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే బ్యూటీపార్లర్ బిజినెస్లో నష్టాలు రావడంతో శిరీష మనస్తాపంతో సోమవారం సాయంత్రం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు శిరీష భర్త గోపాలకృష్ణ, బంధువులు చెబుతున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు. -
మెహరీన్ మెరుపు
-
ఇక్కడ మేము క్షేమమే బాబూ..
హైదరాబాద్: ఏపీలో రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కోవడం చేతగాని చంద్రబాబు.. తెలంగాణలో నివశిస్తున్న సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధికి పాకులాడడం సిగ్గుచేటని కూకట్పల్లికి చెందిన సీమాంధ్ర ప్రాంతవాసులు విమర్శించారు. సోమవారం సాయంత్రం కేపీహెచ్బీ కాలనీలోని రమ్య గ్రౌండ్లో సీమాంధ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, సదాశివరెడ్డి, విజయభాస్కర్, రంగమోహన్, నాగకుమార్, గోపీ, రవీంద్రనాధ్ఠాగూర్, ప్రియదర్శిని, పవన్కుమార్ తదితరులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని మూడున్నర కోట్ల మంది ప్రజల సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో తెలంగాణ పోలీసులకు అందిన ఫిర్యాదుతో చిన్నాచితక ఐటీ కంపెనీపై పోలీసులు దాడులు చేస్తే సీమాంధ్రులపై దాడిగా చిత్రీకరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!) గత 25–30 ఏళ్లుగా తాము తెలంగాణ ప్రాంతాంలో క్షేమంగా జీవిస్తున్నామని అన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం సీమాంధ్ర ప్రజలను పావులుగా వాడుకోవద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను.. అక్కడి ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొవడం కోసం తప్పుడు దారులు వెతుక్కోవడం ద్వారా చంద్రబాబు తన వక్రబుద్ధిని చాటుకున్నాడని విమర్శించారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీ, అక్కడి మంత్రివర్గం మొత్తం ఆందోళన చెందడం చూస్తే ఏదో తప్పు జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు) కాగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబునాయుడుపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ప్రాంతీయ విభేదాలు చెలరేగే అవకాశం ఉందని, ఇక్కడి ప్రభుత్వం వెంటనే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కాపురాల్లో ‘కరక్కాయ’
సాక్షి, సిటీబ్యూరో: ‘ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుందంటూ ప్రకటనను చూసి ఆకర్షితురాలైన కేపీహెచ్బీకి చెందిన అరుణ జీవితం నిజంగానే మారిపోయింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చుననే ఆశపడిన ఆమెకు ‘కరక్కాయల పొడి’ రూపంలో డబ్బు పోవడమే కాకుండా ఆమె కుటుంబంలో కలతలు రేపింది. రూ. వెయ్యితో కిలో కరక్కాయలు కొనుగోలు చేసి పొడి చేసి ఇస్తే రూ.1300 వస్తున్నట్లు తెలియడంతో ఈ విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో దాదాపు 12 మంది అరుణ మాటలు విని కరక్కాయల పొడిలో పెట్టుబడి పెట్టారు. చివరకు సదరు కంపెనీ బిచాణా ఎత్తివేయడంతో డబ్బులు పోయిన బెంగలో ఉన్న ఆమెను బంధువుల మాటలు మరింత నొప్పించాయి. నీ కారణంగానే పెట్టుబడులు పెట్టామంటూ వారు గొడవకు దిగడంతో అరుణ, ఆమె భర్త మధ్య ఘర్షణకు దారి తీసింది. అరుణ ఒక్కరే కాదు..కరక్కాయల పొడి కేసులో మోసపోయిన దాదాపు 500 మంది మహిళల్లో 150 మంది మహిళల పరిస్థితి ఇదే. అయినవాళ్లే కదా వారూ లాభపడతారన్న ఉద్దేశంతో వీరు చెప్పిన మాటలు ఇప్పుడూ ఏకంగా వారిని బాధిస్తున్నాయి. ఓ వైపు డబ్బులు పోగా..మరోవైపు బంధువుల మాటలతో ఆవేదనకు లోనైన పలువురు మహిళలు సైబరాబాద్ పోలీసులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేపీహెచ్బీలో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఎంటీ) పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి పలు కంపెనీలు ఆయుర్వేద మందుల్లో కరక్కాయల పొడిని వినియోగిస్తారని ప్రచారం చేశారు. బేగంపేటలో కిలోకు కేవలం రూ.38కి కొనుగోలు చేసిన కరక్కాయలను ఏకంగా రూ.వెయ్యికి అమ్మి పౌడర్గా చేసి తిరిగిస్తే రూ.1300 ఇస్తామంటూ 650 మందిని మోసగించిన నెల్లూరు జిల్లా అంబపురంకు చెందిన ముప్పల మల్లికార్జున ముఠాను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంతో తమ డబ్బులు వస్తాయన్న ఆశతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్కు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ ఘటన నుంచైనా ప్రజలు మారాలని పోలీసులు కోరుతున్నారు. విద్యావంతులు సైతం ఈ మోసంలో చిక్కుకోవడం దారుణమని డబ్బుపై ఉన్న ఆశను వెల్లడిస్తోందని, దీనినే నేరగాళ్లు ఆసరాగా చేసుకొని టోపీ పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. సులువుగా డబ్బులు రావు... డబ్బులు సులభంగా సంపాదించేందుకు షార్ట్కట్ మార్గాలు ఉండవు. ఎవరైనా ఇలాంటి ప్రకటనలు ఇస్తే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారంలో చాలా మంది మహిళలే బాధితులుగా ఉంటున్నారు. బంధువులను కూడా ఆయా స్కీమ్ల్లో చేర్పిస్తున్నందున కుంటుంబాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎంఎల్ఎం కంపెనీలు, పొంజి స్కీమ్లు, చిట్స్, డిపాజిట్ కంపెనీలు నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా వాటిని ఆదిలోనే అరికట్టవచ్చు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
కరక్కాయ స్కాం.. నిందితుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన మల్లిఖార్జున్తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 44 లక్షల రూపాయలతో పాటు కరక్కాయ సంచులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించింది విషయం తెలిసిందే. గతనెల 16న కేపీహెచ్బీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కరక్కయ పొడి చేసి ఇస్తే అధిక మొత్తం చెల్లిస్తామంటూ దగా చేసిన నిందితులు కోట్ల రూపాయలను దండుకున్న విషయం తెలిసిందే. ఈ స్కాంలో 10 కోట్లకు పైగా మోసం జరిగిందని సీపీ వెల్లడించారు. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. -
కత్తి మహేష్పై ఫిర్యాదులు
సాక్షి, అమలాపురం: రామయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ కోరింది. ఓ వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆదివారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావుకు అందజేశారు. న్యూస్ ఛానల్ డిబేట్లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. ‘రామాయణం నాకొక కథ మాత్రమే. రాముడు దగుల్భాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అజాద్ ఫౌండేషన్ అధ్యక్షుడు యల్లమిల్లి నాగసుధా కొండ తెలిపారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్పైన, ఇలాంటి పనికి రాని చర్చలు పెట్టి మతాలు, కులాల, సామాజిక వర్గాలను రెచ్చ గొట్టేలా ప్రసారాలు చేసే ఆ టీవీ ఛానల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించి కత్తి మహేష్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమజానికి ఎంత మాత్రం ప్రయోజనం లేని అలాంటి డిబేట్లను ఇప్పటికైనా నిలిపివేసి సమాజ హితమైన అంశాలను ప్రసారం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు ఆ టీవీ ఛానల్కు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్పై చర్యలు తీసుకునే వరకూ తమ ఫౌండేషన్ ద్వారా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులు బసవా సత్య సంతోష్, మహదేవ నాగేశ్వరరావు, జొన్నాడ దుర్గారావు, ఇవాని శర్మ, కొత్తపల్లి వంశీ, కొండేపూడి ప్రకాష్, బొక్కా నాని తదితరులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. హైదరాబాద్లోనూ ఫిర్యాదు కత్తి మహేష్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయనపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
కేపీహెచ్బీలో రెచ్చిపోయిన చైన్స్నాచర్లు
-
కూకట్పల్లిలో కలకలం.. ఏటీఎం పేల్చివేత
సాక్షి, హైదరాబాద్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి పేలుడు పదార్థాల సహాయంతో ఏటీఎం సెంటర్లో రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్ను పేల్చివేసి ఓ లేఖను వదిలి వెళ్లిన సంఘటన ఆదివారం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ కుషాల్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మొహానికి రుమాలు కట్టుకుని కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ 1లో ఓవర్సీస్ బ్యాంక్ ఏటిఎంలో ప్రవేశించిన ఓ యువకుడు ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో పేలుడు పదార్ధాలు, విద్యుత్ తీగల సహాయంతో ఏటిఎం మిషన్లోని రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్ను పేల్చివేశాడు. అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన లేఖను అక్కడే వదిలివేసి వెళ్లి పోయాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలకు పరిష్కార మార్గాలు సూచించాడు. తన లేఖలోని అంశాలను ప్రచారంలోకి తీసుకురాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. స్వల్పంగా యంత్రం దగ్ధమైనప్పటికి ఎలాంటి నష్టం జరగలేదని, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందు కు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన లేఖను 24 గంటల్లోపు మీడియాలో ప్రచారం చేయాలని లేనిపక్షంలో ఆత్మహత్యకు పాల్పడతానని పేర్కొనడం గమనార్హం. -
కూకట్పల్లిలో దారుణం
భాగ్యనగర్కాలనీ: వివాహేతర సంబంధం కారణంగా మహిళ దారుణ హత్యకు గురైన సంఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న ఆమె ప్రియుడు శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కూకట్పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బి రోడ్డునెంబర్ 2లో అంజిరెడ్డి, ప్రత్యూష రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. అంజిరెడ్డి వ్యాపారం నిమిత్తం గత ఏడాది శ్రీలంక వెళ్లాడు. ఈ సమయంలో ప్రత్యూష తన స్నేహితుడు శ్రీనివాస్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అంజిరెడ్డి.. శ్రీనివాస్ను ఇంటికి రానివ్వకపోవటమే కాకుండా గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయితే శ్రీనివాస్ మూడునెలల క్రితం బాలాజీనగర్లోని ఓ అపార్టుమెంట్లో పెంట్ హౌస్లో అద్దెకు దిగాడు. ఇటీవల అంజి రెడ్డి శ్రీలంక వెళ్లడంతో శ్రీనివాస్, ప్రత్యూషను తన ఇంటికి తీసుకువచ్చి ఇంటి యజమానికి భార్యగా పరిచయం చేశాడు. ఇటీవల ప్రత్యూష పుట్టింటికి వెళ్లి కూతురిని అక్కడే వదిలేసి గత శుక్రవారం బాలాజీనగర్లోని శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. ఇదిలా వుండగా శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన శ్రీనివాస్ తిరిగిరాకపోగా, సోమవారం అతని ఫ్లాట్లోంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన ఇంటి యజమాని కిటికీలు తెరిచి చూడగా ప్రత్యూష చనిపోయి వుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. కూకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరీరమంతా కత్తి పోట్లు ఉండటం, మృతదేహం పక్కనే కత్తి ఉండటంతో శ్రీనివాసే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం గాలింపు చేపట్టారు. -
పేకాటస్థావరంపై దాడి..ఒకరి మృతి
హైదరాబాద్సిటీ: పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఇద్దరు పేకాటరాయుళ్లు భవనంపై నుంచి దూకారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం వేకువజామున చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలు..గురువారం వేకువజామున ఒంటి గంట సమయంలో ఓ ఇంటి రెండో అంతస్తులో శబ్దం రావడంతో పాటు లైట్లు ఆన్ చేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి తలుపుతట్టారు. దీంతో కంగారు పడిపోయిన ఇద్దరు పేకాట రాయుళ్లు తప్పించుకోబోయి వెనకవైపు బాల్కనీలోకి వెళ్లారు. మరో బాల్కనీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ కిందపడిపోయారు. ఇద్దరిని పోలీసులు దగ్గరలోని అనుపమా ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ శ్రీనివాస్(36) అనే వ్యక్తి మృతిచెందారు. ఇద్దరిదీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మామిడిపల్లి గ్రామం. స్థానికంగా ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచార గృహాల ముందు తచ్చాడుతూ..
హైదరాబాద్: వ్యభిచార గృహాల ముందు తచ్చాడుతూ.. అక్కడికి వచ్చిన విటులను బెదిరించి వారి వద్ద నుంచి నగదు తీసుకెళ్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండటం గమనార్హం. నగరంలోని కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో పరిధిలోని వ్యభిచార గృహాల సమీపంలో దోపిడీలకు పాల్పడుతున్న వారిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిలో రంగరాజు అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా పోలీసులు తెలిపారు. -
కేపీహెచ్బీలో చైన్ స్నాచింగ్
కూకట్పల్లి(హైదరాబాద్): కూకట్పల్లి హౌసింగ్బోర్డులో శనివారం చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానిక భువన విజయం గ్రౌండ్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోనుంచి ఐదు తులాల బంగారు గొలుసును బైక్పై వచ్చిన ఓ వ్యక్తి లాక్కెళ్లాడు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. -
కేపీహెచ్బీలో గరికతో వినాయక ప్రతిమ
కేపీహెచ్బీ కాలనీ: గణపతికి గరిక అత్యంత ప్రీతిపాత్రమైనది. వినాయక చవితికి ఆ గడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను పురస్కరించుకుని కేపీహెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్నగర్ సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు గరికతో వినాయక ప్రతిమను రూపొందించి ప్రత్యేకతను చాటుకున్నారు. మట్టి వినాయక ప్రతిమల తయారీలో విద్యార్థులు నిమగ్నమైన నేపథ్యంలో గరిక గడ్డితో వినాయక ప్రతిమను రూపొందించడం విశేషంగా ఆకట్టుకుంది. -
లేడీస్ హాస్టళ్లలో ఫోన్లు చోరీ చేసి...
హైదరాబాద్: లేడీస్ హాస్టళ్లలో సెల్ఫోన్లు కొట్టేస్తూ యువతులను వేధిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్బీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాలివీ.. సంతోష్కుమార్ అనే యువకుడు గత కొంత కాలంగా లేడీస్ హాస్టళ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతేకాదు, చోరీ చేసిన సెల్ఫోన్లతో యువతులను బెదిరిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంతోష్కుమార్ను గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
చూశాడంటే తాళం పగలాల్సిందే..
భాగ్యనగర్ కాలనీ: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్బీ సీఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట కోటిలింగాలకు చెందిన దేశెట్టి ఎల్లేష్(35) కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మినగర్లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. వచ్చే ఆదాయం సరిపోక దొంగతనాల బాటపట్టాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్ల దగ్గర రెక్కీ చేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. శనివారం ఉదయం నిజాంపేట రోడ్డు చౌరస్తాలో తనిఖీ చేపట్టిన పోలీసులకు ఎదురుపడటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించాడు. కేపీహెచ్ బీలో నాలుగు, చందానగర్లో ఒకటి, మియపూర్లో ఒక చోరీ కేసులో నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అతడి నుంచి ఏడు తులాల బంగారం, వెండి వస్తువులు, రెండు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. గతంలో పటాన్చెరువు, కేపీహెచ్బీ, దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం అనుభవించాడు. -
ప్రగతినగర్లో వరుస చోరీలు
భాగ్యనగర్ కాలనీ: కేపీహెచ్బీ ఠాణా పరిధిలోని ప్రగతినగర్లో దొంగలు రెచ్చిపోయారు. శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు వరుసగా ఐదు అపార్టుమెంట్స్లో చొరబడి వీరవిహారం చేశారు. వీటిలో మూడు ఫ్లాట్లలో చోరీ చేసిన దొంగలు, మరో ఐదు ఫ్లాట్లలో చోరీకి విఫలయత్నం చేశారు. ప్రగతి నగర్లోని సాయిపద్మజా ప్యారడైజ్ అపార్టుమెంట్, ప్లాట్ నెం. 101లో నివసిస్తున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రవితేజ తన భార్యను తీసుకొచ్చేందుకు శనివారం తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు ఆయన ఫ్లాట్కు వేసిన తాళాలను ఆక్సా బ్లేడ్లతో కోసి బీరువాలో ఉన్న రూ.9.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మరో అపార్ట్మెంట్లో ఉండే రామకృష్ణ ఈనెల 23న తిరుపతి వెళ్లాడు. ఆయన ఫ్లాట్లో చొరబడిన దొంగలు సుమారు తొమ్మిది తులాల బంగారు నగలు అపహరించారు. ఇదే అపార్ట్మెంట్లో ఉండే పార్థసారథి ఫ్లాట్ తాళాలు పగులగొట్టి ఏడు తులాల బంగారు నగలు అపహరించారు. ఆ తర్వాత వరుసగా మరో రెండు అపార్ట్మెంట్లలోని చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. తాళం కప్పలు గట్టిగా ఉండటంతో అవి పగలకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ప్రగతినగర్ కాలనీలో చోరీలు చేసిన తర్వాత కేపీహెచ్బీ కాలనీ ఏడో ఫేజ్లోని ఎల్ఐజీ 2లో ఇంటి తాళాలు పగులగొట్టి రెండు ల్యాప్టాప్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆయా ఇంటి యజమానులు ఫ్లాట్, ఇళ్లకు తాళాలు వేసి ఉండటం గమనించిన దొంగలు ఇంటితాళాలను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగలను పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ చోరీలు స్థానిక ముఠా పనేనని, ముందుగానే రెక్కీ నిర్వహించి ఆయా ఫ్లాట్, ఇళ్లలో ఎవరూ లేరని తెలుసుకున్నాకే వరుస చోరీలకు పాల్పడ్డారని పోలీసులంటున్నారు. -
మసాజ్ సెంటర్ పై పోలీసుల దాడులు.. ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించించారు. ఇద్దరు యువతులు సహా మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిదిలోని 6వ ఫేజ్లో అనుమతులు లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించింది. పక్కా ప్రణాళికతో గురువారం రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలలో భాగంగా నిర్వాహకుడితో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
గోవిందుడి దగ్గరికి వెళ్లొచ్చేసరికి..!
మలేషియా టౌన్షిప్(కేపీహెచ్ బీ): తిరుపతి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్నదంతా దొంగలు ఊడ్చుకెళ్లిన ఘటన కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఎస్సై రాందాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ తొమ్మిదో ఫేజ్కు చెందిన రవీంద్ర ఈ నెల 6న కుటుంబ సమేతంగా దైవదర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు. సోమవారం ఉదయం పేపర్ బాయ్ పేపర్ వేసే క్రమంలో ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి రవీంద్రకు ఫోన్ద్వారా సమాచారం అందజేశాడు. సోమవారం రాత్రి తిరుపతి నుంచి తన నివాసానికి చేరుకున్న రవీంద్ర ఇంట్లో పరిశీలించగా సుమారు ఏడు తులాల బంగారు నగలు, రూ.11 వేల నగదు కనిపించలేదు. గుర్తు తెలియని దుండగులు సొత్తును అపహరించుకుపోయారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అగ్నిగుండంలా మారిన ఏపీ
- నిప్పుల కుంపటిలా మారిన రాష్ట్రం - కుతకుతలాడుతున్న కోస్తా, రాయలసీమ - సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత - 186 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు నమోదు - రోజురోజుకూ పెరుగుతున్న వడదెబ్బ మరణాలు - పెరుగుతున్న టైఫాయిడ్, జాండీస్, అతిసారం కేసులు - వేసవి వ్యాధిగ్రస్తులతో ఆస్పత్రులు కిటకిట సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు భగభగా మండుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. కణ కణలాడుతున్న ఎండలతో వడగాడ్పులు భయపెడుతున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకే ఎండవేడి చురుక్కుమనిపిస్తోంది. సాయంత్రం అయిదు గంటలకు కూడా వేడి సెగలు తగ్గడంలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను భయపెడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ, వడగాడ్పులకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వారు తగు ఉష్ణతాప నివారణ చర్యలు తీసుకోవాలని ఠసూచిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణతాపాన్ని తట్టుకోలేక ఇరు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇకపై ఎండలు మరింత విజృంభిస్తాయన్న నిపుణుల హెచ్చరికలతో మరింత బెంబేలెత్తుతున్నారు. 47 డిగ్రీల మంట రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 197 మండలాల్లో, మంగళవా రం 186 మండలాల్లోనూ తీవ్రమైన వడగాడ్పులు నమోదయ్యాయి. మంగళవారం వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 31 మండలాల్లో వడగాడ్పులు రికార్డయ్యాయి. ఆటోమేటి క్ వెదర్ స్టేషన్ల రికార్డుల ప్రకారం గత 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో 43 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో 47.3, విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో 46.2, విశాఖపట్నం జిల్లాలోని బొండపల్లిలో 45.9, పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లిలో 45, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా కంభంలో 46, వైఎస్సార్ జిల్లా కొండాపురంలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకూ అధికంగా నమోదవుతుండటం గమనార్హం. తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, పిల్లలే కాకుండా సాధారణ ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు. పెరుగుతున్న వడదెబ్బ మరణాలు తీవ్రమైన ఎండలకు భూతాపం, వడగాడ్పులు తోడు కావడంతో వడదెబ్బ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 20, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 24 మండలాల్లో వడగాడ్పులు నమోదయ్యాయి. అనధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాది దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 2,450 వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారమే గత ఏడాది రాష్ట్రంలో వడదెబ్బవల్ల 1,677 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 333 మంది చనిపోయారు. ఈ సంవత్సరం పెరుగుతున్న ఎండలతో ఈ రికార్డు చెరిగిపోయే ప్రమాదం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పెరుగుతున్న ఎండలు, వడగాడ్పులకు వ్యాధులు కూడా తీవ్రరూపం దాల్చుతున్నాయి. టైఫాయిడ్, జాండీస్ కేసులు పెరుగుతున్నాయి. అతిసార బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. డయేరియా బాధితులు ఈ వేడివల్ల వెంటనే నీరసించిపోతున్నారు. వేసవి వ్యాధిగ్రస్తులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎండల ప్రభావంవల్ల జ్వరాలు కూడా ఎక్కువవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలోనూ భగభగ తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వడగాడ్పులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం మంగళవారం రాత్రి హెచ్చరించింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 44 డిగ్రీలు, నిజామాబాద్లో 43, హైదరాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు 28 మంది మృతి సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వడగాలులు వణికిస్తున్నాయి. మంగళవారం వడదెబ్బకు గురై 28మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు వడదెబ్బల కారణంగా మరణించారు. -
పీఎస్ లో యువతీయువకుల హల్ చల్
హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులు పోలీస్ స్టేషన్లో హల్ చల్ చేశారు. ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తాగి గొడవ చేస్తున్నారనే కారణంగా వారిని కెపిహెచ్బి పోలీస్ స్టేసన్కు తరలించగా.. అక్కడ వారు వీరంగం సృష్టించారు. తమను అకారణంగా తీసుకొచ్చారంటూ పోలీసులపై దాడికి దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఓ ఇంటర్ విద్యార్థి కళాశాల హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలం బీరపల్లికి చెందిన నర్సిరెడ్డి కుమారుడు యశ్వంత్రెడ్డి నిజాంపేటలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తన గదిలోని ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కెమిస్ట్రీ లెక్టరర్ విపరీతంగా కొట్టడంతో మనస్థాపం చెందిన విద్యార్థి క్యాంపస్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. యశ్వంత్ కుటుంబీకులకు కనీస సమాచారం ఇవ్వకుండా హడావుడిగా ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులు రాకముందే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కళాశాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మృతుని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతిచెందాడని వారు ఆరోపిస్తున్నారు. -
కేపీహెచ్బీలో కూరగాయలు అమ్మిన రకుల్
ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ ఫాంలో కనిపిస్తున్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్తో అభిమానులకు షాకిచ్చింది. ''కేపీహెచ్బీలో నేను కూరగాయలు అమ్ముతా, ఉదయం 10 గంటల నుంచి నా దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కోండి'' అంటూ రకుల్ చేసిన ట్వీట్కు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టుగా శనివారం ఉదయం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో మంజీరా మాల్ ఎదురుగా ఉన్న మార్కెట్ లో రకుల్ కూరగాయలు అమ్మింది. అసలు రకుల్కు కూరగాయలు అమ్ముకునేంత అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. సినిమాలతో పాటు టీవీ షోస్తో కూడా సత్తా చాటుతున్న మంచు లక్ష్మి.. 'మేము సైతం' పేరుతో మరో టివి షో ప్రారంభిస్తుంది. సమాజ సేవ నేపథ్యంతో రూపొందించిన ఈ కార్యక్రమం కోసం రకుల్ ప్రీత్సింగ్ ఈ రిస్క్ తీసుకుంటుంది. ఇలా రకుల్ అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం వినియోగించనున్నారు. I will b at KPHB market opp Manjeera mall sellin vegetables 4 lakshmis show #memusaitham.lts change lives come buy vegetables from me.10am — Rakul Preet (@Rakulpreet) February 5, 2016 -
కేపీహెచ్బీలో పోకిరీ హల్చల్
-
పిల్లర్ గుంతలో పడి చిన్నారి మృతి
హైదరాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి బాలిక మృతిచెందిన సంఘటన నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నందిని(10) రెండో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాలకు సెలవులు కావడంతో ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. మధుకాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులం అంటూ వచ్చారు..
మలేషియా టౌన్షిప్: పోలీసులమంటూ నమ్మబలికి ఓ మహిళ నుంచి బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ మూడోఫేజ్ ఎల్ఐజీ కాలనీకి చెందిన వెంకటరమణమ్మ శనివారం ఉదయం దేవాలయంలో పూజలు ముగించుకుని ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి పక్కవీధిలో దొంగతనం జరిగిందని, తాను మఫ్టీలో ఉన్న పోలీసునని నమ్మబలికాడు. మెడలో ఉన్న గొలుసును తీసి ఇస్తే ఎలా భద్రపరుచుకోవాలో చూపిస్తానని చెప్పాడు. దీంతో వెంకటరమణమ్మ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును ఆ అపరిచితుడికి ఇచ్చింది. దాన్ని ఇలా భద్రపర్చాలంటూ గొలుసును కర్చీఫ్లో ఉంచి మడతపెట్టాడు. ఆమె దృష్టి మరల్చి గొలుసు బదులు గులకరాయిని అందులో ఉంచి ఆమెకు ఇచ్చాడు. గొలుసును తన వద్ద ఉంచుకుని, అక్కడే బైక్పై సిద్ధంగా ఉన్న వ్యక్తితో కలసి క్షణాల్లోనే ఉడాయించాడు. కాసేపటి తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు కుటుంబసభ్యులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మద్యం మత్తులో ఆటో డ్రైవర్ వీరంగం
హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ మద్యం తాగి వీరంగం చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో గురువారం జరిగింది. మెకానిక్ లేడని చెప్పిన వ్యక్తిపై దాడి చేశాడు. అనంతరం పోలీసులు కల్పించుకుంటే వారితో కూడా కాసేపు వాగ్వాదానికి దిగాడు. పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు తాగుబోతు ఆటో డ్రైవర్ను మోసుకుంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేపీహెచ్బీలో బాలిక దారుణ హత్య
హైదరాబాద్ : అభం శుభం తెలియని చిన్నారిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన హైదరాబాద్ కేపీహైచ్బీ పరిధిలోని గోపాల్ రెడ్డి లేఅవుట్లో గురువారం సాయంత్రం వెలుగుచూసింది. బాలిక(8) హత్యపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డాక్టర్స్ లేన్...
సినిమాలకు క్రాస్రోడ్స్.. అమ్మాయిల షాపింగ్కు కోటి... ఇలా హైదరాబాద్లో కొన్ని అడ్డాలున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్లోకి కేపీహెచ్బీలోని రోడ్నెంబర్ 4 చేరింది. ఆ గల్లీలో వందలాది క్లినిక్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోంలు, టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్లు... ఇలా మనిషికి అవసరమయ్యే ప్రతి స్పెషాలిటీ క్లినిక్ కనబడుతుంటుంది. 2006కు ముందు ఏ మాత్రం చడిచప్పుడు లేని ఆ కాలనీ... ఇప్పుడు ఎటు చూసినా క్లినిక్ల మయమైంది. కొన్ని క్లినిక్లు ఆస్పత్రులుగా మారాయి. మెడికల్ షాప్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. 1991లో... మొదటిసారి విఘ్నేశ్ క్లినిక్, ఎస్వీఎస్ క్లినిక్ ఏర్పాటయ్యాయా గల్లీలో. అప్పుడు సాయంత్రం ఆరు దాటిందంటే ఎటు చూసినా చీకటే. కేవలం ఈ రెండు క్లినిక్లు కరెంట్ వెలుగులతో కనిపించేవి. ఏ రోగమొచ్చినా, ప్రసవాలైనా, రోడ్డు ప్రమాదంలో గాయాలైనా ఈ క్లినిక్లకు క్యూ కట్టేవారు. బొల్లారం, బాచుపల్లి, చందానగర్, మూసాపేట, లింగంపల్లి, పటాన్ చెరువు, ఆశోక్ నగర్, జీడిమెట్ల, సూరారం కాలనీవాసులకు ఈ క్లినిక్లే దిక్కు. ఆ రెండు తరువాతి రోజుల్లో విఘ్నేశ్ నర్సింగ్ హోమ్గా, ఎస్వీఎస్ చిల్డ్రన్ హాస్పిటల్గా మారిపోయాయి. కార్పొరేట్ హంగులతో రెడిమేడ్ ఆస్పత్రి రావడంతో కేపీహెచ్బీ రోడ్డు నంబర్ 4 దశ తిరిగింది. ఈ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లే పార్ట్టైమ్గా ఈవెనింగ్ క్లినిక్లు ప్రారంభించారు. రోగులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆ లైన్ కాలక్రమేణా డాక్టర్ లేన్గా మారింది. ఇప్పుడు కేపీహెచ్బీ రోడ్డు నంబర్ నాలుగు అనేకంటే డాక్టర్స్ గల్లీ అంటేనే సులభంగా గుర్తు పడతారు. ఎందుకీ డిమాండ్... ఏ కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్లినా కన్సల్టెంట్ ఫీజు... రూ. 500లకు తక్కువ లేదు. కార్పొరేట్ ఆస్పత్రి కన్నా కన్సల్టెంట్ ఫీజు తక్కువ ఉండటం, రీజనబుల్ ధరలకే రూమ్లు దొరకడంతో వీటికి రోగుల తాకిడి పెరిగింది. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా వెలవడంతో అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమీప ప్రాంతాలైన కూకట్పల్లి, మియాపూర్లో నివాసాలు ఏర్పరుచుకోవడం, ఇతర జిల్లాలనుంచి వచ్చిన మధ్య తరగతి కుటుంబాలు కార్పొరేట్ ఖర్చులు పెట్టలేక అందుబాటులో ఉన్న ఈ క్లినిక్లవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రేటులోనే ట్రీట్మెంట్ పూర్తవడం, డాక్టర్ల గురించి ఎక్కువ సేపు వేచివుండాల్సిన అవసరం లేకపోవడం... వంటికారణాలన్నీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి. టెస్టుల కోసం... ఎంతో దూరంనుంచి హాస్పిటల్కు వెళ్తే.. డాక్టర్ టెస్టులు రాస్తాడు. వాటికోసం మళ్లీ ఇంకెక్కడికో పరుగెత్తాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా... అన్ని పరీక్షలకు అవసరమైన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఈ లేన్లో ఉన్నాయి. కార్డియాల జిస్ట్, డెర్మటాల జిస్ట్, గ్యాస్ట్రాంటల జిస్ట్, గైనకాల జిస్ట్, హెమటాల జిస్ట్, నెఫ్రాల జిస్ట్, న్యూరోసర్జన్, అర్థోపెడిస్ట్, సర్జన్, యూరాల జిస్ట్, డెంటిస్ట్, ఐ స్పెషలిస్ట్... ఇలా ఒకటి కాదు... స్పెషలిస్ట్ క్లినిక్లు.. ప్రతి ఒక్కటీ కొలువుదీరాయిక్కడ. - వీఎస్ -
భార్యను చంపి.. పీఎస్ లో లొంగుబాటు
హైదరాబాద్: కట్టుకున్న భార్యను కిరాతంగా భర్త హత్య చేసిన ఘటన నగరంలోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్పీ) పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమతానగర్ ఈ దారుణ ఘటన జరిగింది. సస్పెన్షన్లో ఉన్న భానుప్రకాష్ అనే ఎస్సై తన భార్యను హత్య చేశాడు. తర్వాత పోలీసుస్టేషన్ లో లొంగిపోయాడు. కుటుంబ కలహాల కారణంగానే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చందన బ్రదర్స్లో భారీ చోరీ
-
కేపీహెచ్బీ చందనా బ్రదర్స్లో చోరీ
హైదరాబాద్ : కేపీహెచ్బీ చందనా బ్రదర్స్ షోరూంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు కిలో బంగారు ఆభరణాలతో పాటు, 16 లక్షల నగదును దోచుకు వెళ్లారు. అర్థరాత్రి ఒంటిగంట, రెండు గంటల మధ్యలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దొంగలు షోరూమ్ పక్క భవనం నుంచి లోనికి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా భద్రత సరిగా లేనందువల్లే దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. షోరూమ్లో నమోదు అయిన సీసీ కెమెరా పుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాగా నగరంలో ఓ వైపు చోరీలు జరుగుతున్నా.... నగల దుకాణాల యాజమాన్యాలు మాత్రం సరైన భద్రతా చర్యలు తీసుకోవటం లేదని పోలీసులు చెబుతున్నారు. -
కేపీహెచ్బీలో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: వైస్ ప్రిన్సిపాల్ మందలించాడన్న కారణంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లి హౌలింగ్ బోర్డు(కేపీహెచ్బీ) కాలనీలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు చదువుతున్న విద్యార్థినికి అసభ్య ఎస్ఎమ్ఎస్లు పంపుతున్నాడని అతడిని వైస్ ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో మనస్తాపం చెంది అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తాను తప్పుచేశానని ఫేస్ బుక్ లో చంద్రశేఖర్ మెసేజ్ పోస్ట్ చేసినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధిత విద్యార్థిని కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు చంద్రశేఖర్ ఆత్మహత్యకు కారణమైన వైస్ పిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు చేశారు. -
హైదరాబాద్లో ఎటు చూసినా ర్యాలీలే!
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు జంట నగరాల నుంచి భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలివస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నేతృత్వంలో సమైక్యవాదులు సభకు తండోప తండాలుగా కదలివస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలుగా తరలివస్తున్నారు. దారి పొడుగునా సమైక్య నినాదాలు చేస్తూ సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. * అంబర్పేట కార్పొరేటర్ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో 3వేల మందితో బైక్ ర్యాలీ * కూకట్పల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డేపల్లి నర్సింహరావు నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ * శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ ముక్కారూపానందరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ * సనత్నగర్ ఇంఛార్జ్ వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ * కుత్భుల్లాపూర్ ఇంఛార్జ్ కొలను శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ * కేపీహెచ్పీలో జార్జ్ హెర్బట్ ఆధ్వర్యంలో 100 మీటర్ల వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరణ, ర్యాలీగా బయల్దేరిన నేతలు * రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్ సీపీ నేత ఈసీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో సభకు వేలాదిగా తరలివెళ్లిన కార్యకర్తలు