labours
-
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడినట్లు ఇటలీ పోలీసులు తెలిపారు. శనివారం ఉత్తర వెరోనా ప్రావిన్స్లో 33 మంది భారత కార్మికులను ఇద్దరు వ్యక్తుల నుంచి విడిపించినట్లు చెప్పారు. నిందితుల నుంచి అర మిలియన్ యూరోలు (సుమారు రూ. 45 లక్షలు) స్వాధీనం చేకున్నామని పేర్కొన్నారు.ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈ ముఠా ఇండియా నుంచి సీజనల్ వర్క్ పెర్మిట్తో ఇక్కడి వ్యవసాయ కార్మికులను తీసుకువస్తారు. వారికి మంచి ఉపాధి చూపిస్తాని చెప్పి.. 17000 యూరోలు (సమారు రూ.15లక్షలు) కట్టమని చెబుతారు. వారానికి 7 రోజులు, రోజు 10-12 గంటలు పని. ఒక్క గంటకు నాలుగు యూరోలు ఇస్తామని ఒప్పందం చేయించుకుంటారు. కానీ, అలా చేరిన కార్మికులను బానిసలు పని చేయించుకుంటారు. .. మరికొంత డబ్బు ఇస్తే.. శాశ్వత వర్క్ పర్మిట్ ఇస్తామని నమ్మిస్తారు. కానీ, అది కూడా ఎప్పటికీ జరగదు. బాధిత కార్మికులు ఈ ముఠా సభ్యులు ఇటలీలో భద్రత, ఉపాధి అవకాశాలు, చట్టబద్ధమైన నివాస పత్రాలు అందిస్తామని మోసం చేస్తూ పని బానిసత్వంలోకి దించుతారు’అని పోలీసులు తెలిపారు. ఇతర యూరోపియన్ దేశాలతో పోల్చితే.. ఇటలీలో తీవ్రమైన కార్మికుల కొరత నెలకొంది. దీంతో ఇక్కడికి పని చేయడానికి వచ్చే వారికి కొన్ని ముఠాలు తక్కువ వేతనంతో ఇతర దేశాల వ్యవసాయ కార్మికులను మోసం చేస్తారు. లేబర్ చట్టాల ఉల్లంఘనలను ఇటలీ తీవ్రంగా ఎదుర్కొంటోంది. -
మూడు రోజుల క్రితం మహిళ హత్య! అడ్డా కూలీలపైనే అనుమానాలు..
కరీంనగర్: సిరిసిల్ల ఉలిక్కిపడింది. కార్మికుల అడ్డా హత్యోదంతంతో తెల్లారింది. మద్యంమత్తులో ఓ మహిళను కొందరు అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్లో బిహార్కు చెందిన కొందరు కూలీలు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బీహార్ చెందిన రాంభిక్షు సదా, రుడల్సదా ఉండేవారు. వీరు స్థానిక లేబర్ అడ్డా వద్ద రోజువారీ కూలీలుగా, భవనం నిర్మాణ పనులు చేసుకునే వారు. ఈక్రమంలోనే వేములవాడ అర్బన్ మండలం కొడిముంజకు చెందిన అలకుంట రమ కూలీ పని కోసం నిత్యం సిరిసిల్ల లేబర్ అడ్డాకు వచ్చేది. పనిస్థలంలో బిహార్కు చెందిన కూలీలతో రమకు పరిచయం ఏర్పడింది. మద్యం అలవాటు ఉండడంతో పనులు ముగిసిన తర్వాత పలుమార్లు మద్యం తాగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అందరూ కూలి పనులు చేసుకునే సమయంలో ఏర్పడిన చనువుతో రమ బిహార్ కూలీలు ఉంటున్న గదికొచ్చినట్లు సమాచారం. మద్యం మత్తులో రాత్రి ఆమైపె అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యాస్థలంలో మద్యం బాటిళ్లు, మృతురాలి ఒంటిపై బట్టలు లేకపోవడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తుంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ రఘుపతి హత్యకు పాల్పడింది ఎంత మంది అనే దానిపై స్పష్టత లేదన్నారు. మూడు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని, గది నుంచి దుర్వాసన రావడంతో హత్య విషయం వెలుగుచూసినట్లు వివరించారు. హంతకులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉండగా ఇద్దరి పెళ్లిళ్లు జరిగాయి. చాలా ఏళ్ల క్రితం భర్త చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: విధులకు హాజరై తిరిగి కారులో వెళ్తుండగా.. విషాదం! -
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా
వేములవాడ రూరల్: వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణా మిడ్మానేరు ముంపు గ్రామం కావడంతో ఇక్కడ పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ మహిళా కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో చందుర్తి మండలం మర్రిగడ్డకు వరినాట్ల పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి వద్ద ఆటోకు ఎదురుగా కోతి వచ్చింది. డ్రైవర్ కోతిని తప్పించబోగా ఆటోకింద ఇరుక్కోవడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో జాతరకొండ మల్లవ్వ (51) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ కుర్ర బాలవ్వ (65) కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మిగతా 11 మంది కూలీలు వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేములవాడ రూరల్ ఎస్సై మారుతి కేసు నమోదుచేసి, మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్లోకి రంధ్రం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగం కూలి అప్పుడే ఏడు రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా, అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్ ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం..సొరంగం నిర్మాణ పనులు సాగుతున్న కొండ పైనుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండ పైనుంచి 1,000 నుంచి 11,00 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించాం. రేపు మధ్యాహ్నం కల్లా ఇది సిద్ధమవుతుంది’అని బీఆర్వోకు చెందిన మేజర్ నమన్ నరులా చెప్పారు. ‘ముందుగా 4–6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే మూడడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చు’అని బోర్డర్ రోడ్స్ డీజీ ఆర్ఎస్ రావు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారుల బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. కార్మికులను కాపాడేందుకు నిపుణులు వివిధ రకాలైన అయిదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రధాని మాజీ సలహాదారు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇలా ఉండగా, శిథిలాల నుంచి డ్రిల్లింగ్ను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శనివారం ఇండోర్ నుంచి ఒక యంత్రాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా బిగించి, డ్రిల్లింగ్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ పనులు మళ్లీ మొదలు: శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో అయిదో పైపును లోపలికి పంపేందుకు డ్రిల్లింగ్ పనులు సాగుతుండగా సొరంగంలో ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే పనులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ శబ్ధం సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందిలో వణుకు పుట్టించింది. డ్రిల్లింగ్ను కొనసాగిస్తే టన్నెల్ మరింతగా కూలే ప్రమాదముందని నిపుణుడొకరు చెప్పారు. మొత్తం 60 మీటర్లకు గాను 24 మీటర్లలో శిథిలాల గుండా డ్రిల్లింగ్ పూర్తయిందన్నారు. ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల సంఖ్య 41గా తేలినట్లు అధికారులు వివరించారు. బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా లోపలే ఉండిపోయారని అన్నారు. -
రాళ్ల క్వారీలో కూలిన బతుకులు
ఐజ్వాల్: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో.. కడపటి వార్తలు అందేసరికి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాళ్ల కింద చిక్కుకున్న మరికొందరు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నయ్థియాల్ జిల్లాలోని మౌదర్హ్ అనే గ్రామంలో ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాళ్ల క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు జరుగుతున్నాయి. మృతులంతా బీహారీ కూలీలని అధికారులు ప్రకటించారు. మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయ్యింది. సోమవారమే ఈ రాళ్ల క్వారీ కూలిపోయింది. కార్మికులు మధ్యాహ్న భోజన అనంతరం పనుల్లో మునిగిపోగా.. ఈ ప్రమాదం జరిగింది. కూలీలలో 12 మందితో పాటు హిటాచి డ్రైవర్లు క్వారీ లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వలంటీర్లు తరలివచ్చారు. రాష్ట్ర విపత్తు నివారణ బృందాలతో పాటు సరిహద్దు భద్రతా దళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆపరేషన్ చేపట్టాయి. -
కేటరింగ్ మేనేజర్ పై చేయి చేసుకున్న శివసేన ఎమ్మెల్యే
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీకి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన ఫుడ్ కేటరింగ్ మేనేజర్ పై చేయి చేసుకుని, దుర్భాషలాడుతున్న ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. మహరాష్ట్రలోని హింగోలి జిల్లాలో మధ్యాహ్నా భోజన పథకంలో భాగంగా భాగంగా కూలలీలకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో తానే స్యయంగా పరిశీలించేందుకు వచ్చానని అన్నారు. అంతేకాదు కూలీలకు నాశిరకం భోజనం అందిస్తున్న సదరు మేనేజర్ పై చేయి చేసుకుని, గట్టిగా చివాట్లు పెట్టారు. ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాడానికి కొద్ది నిమిషాల ముందు ఆయన పార్టీలో చేరారు. శివ సేన నాయకత్వం ఆయనను హింగోలి ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించింది. అంతేకాదు గతంలో సంతోష్ బంగర్ ఓ వైరల్ వీడియోలో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అధ్యక్షతన తిరుబాటు చేసిని ఎమ్మెల్యేలను తిరిగి వచ్చేయండి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మిమ్మల్ని క్షమిస్తాడంటూ వార్తల్లో నిలిచారు. (చదవండి: బీహార్లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా..) -
బయోటెక్ ఫ్యాక్టరీలో ప్రమాదం
దేవరపల్లి: ఓ బయోటెక్ ఫ్యాక్టరీలో ఫిల్టర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని పరమేశు బయోటెక్ ఫ్యాక్టరీలో గురువారం జరిగింది. స్థానిక ఎస్సై కె.శ్రీహరి తెలిపిన వివరాలు.. ఒడిశాకు చెందిన డోమా బీరువా(24), కొవ్వూరు మండలం తిరుగుడుమెట్టకు చెందిన గాజుల శ్రీను(25) పరమేశ్ బయోటెక్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలో చాలాకాలంగా వాడుకలో లేని ట్యాంకును శుభ్రం చేసేందుకు డోమా గురువారం లోపలికి దిగాడు. విషవాయువు వల్ల గాలి ఆడకపోవడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. ఇది గమనించిన శ్రీను.. డోమాను రక్షించేందుకు లోపలికి వెళ్లాడు. తను కూడా ఊపిరాడక లోపలే పడిపోయాడు. వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించిన మరో కార్మికుడు అనిల్సింగ్ కూడా స్పృహ కోల్పోయాడు. ఇది గుర్తించిన కార్మికులంతా ట్యాంకు లోపల పడిపోయిన ముగ్గురినీ తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు. యాజమాన్యం ఆదేశాల మేరకు వారిని చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాజుల శ్రీను, డోమా మార్గం మధ్యలోనే మృతి చెందగా అనిల్ను మెరుగైన చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. అనిల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. అధికారులు ఫ్యాక్టరీకి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. ఫ్యాక్టరీలో కార్మికులకు కల్పించిన సదుపాయాలు, రక్షణ పరికరాలను పరిశీలిస్తున్నామన్నారు. మొక్కజొన్న నుంచి పాలు ఫిల్టర్ చేసే ఈ ట్యాంకును చాలా కాలంగా వాడటం లేదని తెలిసింది. -
పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు .. రూ.లక్షల్లో ప్రమాద బీమా
సాక్షి, మన్యం పార్వతీపురం కురుపాం: అసంఘటిత కార్మికులకు కేంద్రం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ–శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు రూ.లక్షల్లో ప్రమాద బీమా వచ్చేలా చర్యలు చేపట్టింది. గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ–పోర్టల్పై అప్పట్లో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేయగా, ఇప్పుడు ఈ పథకంపై తగినంత అవగాహన లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. త్వరగా రిజిస్ట్రేషన్లు చేసుకుని, పథకం లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు. 16 నుంచి 59 వయసు కలిగిన వారంతా ఈ పథకానికి అర్హులు కాగా, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.2 లక్షలు, అంగవైకల్యం బారినపడితే రూ.లక్ష అందజేస్తారు. రాష్ట్రాలు, కార్మిక సంఘాల సమన్వయంతో సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఏకీకృతం చేయడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని, ఈ–పోర్టల్ ప్రారంభించిననట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 12 అంకెల నంబర్ కలిగిన ఈ–శ్రమ్ గుర్తింపు కార్డు ఇస్తారు. అనంతరం వారికి ఏడాది కాలానికి గాను ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన((పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి కర్షక బీమా పథకం కింద ప్రమాద బీమా వర్తింపజేస్తారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం పొందని వారంతా ఈ పథకానికి అర్హులే కాగా, ఈ జాబితాలో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, భూమి లేని రైతులు, మత్స్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, తోపుడు బండ్ల వ్యాపారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, తాపీమేస్త్రీలు, కార్పెంటర్లు, టైలర్లు, రజకులు, కల్లుగీత కార్మికులు, చేనేత, క్షౌ ర వృత్తి వారు, చిరు వ్యాపారులు ఉన్నారు. పోస్టాఫీసుల్లో రిజిస్ట్రేషన్లు.. ప్రస్తుతం కార్మిక శాఖ అధికారులు తపాలా శాఖ సహాయంతో అసంఘటిత కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులు కూడా ఈ–శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్లతో జిల్లాలోని ఏ పోస్టాఫీస్కు వెళ్లినా ఈ–శ్రమ్ పోర్టల్లో కార్మికుల వివరాలు నమోదు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ విపత్తు సమయంలో వలస కూలీలు, అసంఘటిత కార్మికులు పడిన ఇబ్బందులు చూసి, వారికి ఎలాగైనా ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు 2021 జూన్ 29వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ–శ్రమ్ పోర్టల్ని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. 2021 ఆగస్టు 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, అన్నిచోట్ల నుంచి ఇప్పుడిప్పుడే ఈ పథకానికి స్పందన లభిస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో రిజిస్టేషన్లు అంతగా జరగకపోవడం బాధాకరం. ప్రస్తుతం కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాలకొండ, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల్లోని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ నమోదు ప్రక్రియ జరుగుతుండగా, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పథకం సద్వినియోగం చేసుకోవాలి కార్మికులంతా ఈ–శ్రమ్ పథకం లబ్ధి పొందాలి. దగ్గరలోని పోస్టాఫీస్కి గానీ, స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సభ్యుల వద్దకు గానీ వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. సి.హెచ్.సాయికిశోర్, ఈ–శ్రమ్ ప్రాజెక్ట్ జోనల్ ఇన్చార్జ్, కురుపాం -
కల్తీ మద్యానికి 5 గురు బలి.. మరో 22 మంది..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించిన వారిలో 5 గురు చనిపోగా, మరో 22 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. వివరాలు.. అలీఘడ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పోలీసులకు తెలియకుండా మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే, వారు పోలీసుల దాడులకు భయపడి మద్యాన్ని రోహెరా గ్రామంలోని ఒక చెరువులో పారబోశారు. దీన్ని చూసిన కొంత మంది ఇటుక బట్టీ కూలీలు ఈ కల్తీ మద్యాన్ని తాగారు. కాగా, వీరందరు గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన తెలియగానే స్థానిక పోలీసులు బాధితులందరిని జవహర్లాల్ నెహ్రు మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా, కల్తీ మద్యం బాధితులలో ఇప్పటి వరకు 5 గురు చనిపోయారని, మరో 22 మంది బాధితుల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని డాక్టర్ హరిస్ మంజుర్ తెలిపారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఈరోజు ఉదయం వరకు (గురువారం) 27 మంది ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో మొదటి ఆరు గంటలు బాధితులకు ఎంతో విలువైందని డాక్టర్ మంజుర్ పేర్కొన్నారు. వీరిలో చాలా మంది శాశ్వతంగా చూపును కోల్పోయారని, మరో 13 మంది తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్నారని యూపీ మెడికల్ ఆఫీసర్ భానుప్రతాప్ తెలిపారు. మెడికల్ కాలేజ్ కంటి డాక్టర్ జియా సిద్ధిఖీ మాట్లాడుతూ.. వీరిలో ఆరుగురు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండగా, మరో 2 సరిగ్గా చూడలేకపోతున్నారు. మిగతా 4 కోలుకుంటున్నారని తెలిపారు. అయితే, మరికొంత మంది బాధితులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. గత నెల మే 28 న ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు, 35 మంది మరణించారు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల నుంచి చనిపోయిన వారిలో 87 మందిని పరీక్షించగా వారంతా.. కల్తీ మద్యం కారణంగానే చనిపోయానట్లు తెలింది. అప్పటి, కేసులో 34 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. -
గల్ఫ్ జీవితాలపై కరోనా దెబ్బ
కోహెడరూరల్(హుస్నాబాద్): పొట్ట నింపుకోవడానికి పని చేస్తున్నామా.. పని చేయడానికే తింటున్నామా..అని తెలియని గల్ఫ్ బతుకులు ఆందోళనలో పడ్డాయి. తల్లిదండ్రుల గోస తీర్చడానికి కాసుల వేటకు వెళ్లిన జీవితాలు ఆగమయ్యాయి. ఖర్చు పేట్టే ప్రతీ పైసా విలువ తెలిసిన గల్ఫ్ బతుకుల్లో కరోనా మహమ్మరి నీళ్లు చల్లింది. ఉన్న ఊరిని, అయిన వారిని వదిలి పెట్టి ఎడారి దేశాలకు ప్రయాణమైన బిడ్డలకు గల్ఫ్లో తిండి తిప్పలు లేక కంటి మీద కునుకులేకుండా పోయింది. క్షణ క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల నుంచి తినడానికి తిండిలేక పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉన్న ఊరికి వచ్చి కన్నోళ్లను, కట్టుకున్న వారిని చూడాలని కళ్లు కాయలు కాసేలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎడారి దేశంలో ప్రతి రోజు కరోనాతో యుద్ధం చేస్తున్న గల్ఫ్ అన్నలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం.. పేదరికం, ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి కొందరు.. ఇల్లు కట్టి అప్పు అయిందని మరికొందరు.. ఎంత చదివినా సరిపడా వేతనం వచ్చే ఉద్యోగం రాక విద్యార్థులు ఇలా చాలా మంది వివిధ కారణాలతో నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబ కష్టాలు తిరుద్దామని అప్పులు చేసి అరబ్ దేశాలకు వెళ్లిన బతుకుల ఆశలు కరోనా సమాధి చేసింది. అప్పటికే అందరిని వదిలి పరాయి దేశాలకు వెళ్లిన వలస జీవుల బతుకులను కరోనా రూపంలో కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో చిల్లి గవ్వ లేక ఆకలితో అల్లాడుతూ..ఇరుకు గదుల్లో బిక్కుబిక్కుమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులను తప్ప ప్రవాసులను పట్టించుకోకపోవడంతో భయం గుప్పిట్లో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 80 వేల మంది.. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80 వేల మంది వలస కార్మికులు విదేశాల్లో ఉన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడి ప్రాంతం నుంచి ఎక్కువగా సౌది, ఓమన్, కత్తర్, కువైట్, మస్కట్, బెహరన్ దేశాలకు ఉపాధి కోసం ఎంతో మంది వెళ్లారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్తో ఇక్కడి కుటుంబాల్లో ఆందోళన నిండింది. తమ వారు ఎలా ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. మా బతుకుల్లో వెలుగు నింపడానికి వెళ్లిన బతుకులు ఎలా ఉన్నాయో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ వారు అక్కడ ఎలా ఉన్నారో అని ఫోన్లలో వీడియే కాల్ చేసి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తినడానికి డబ్బులు లేకపోతే చెప్పు బిడ్డ అప్పోసప్పో చేసి పంపిస్తా అని ఓతల్లి తన బిడ్డకు చేప్తూ గుండెలు పగిలేలా రోధించింది. ఇక్కడికి నువ్వు మంచిగా వస్తే కూలీనాలి చేసి బతుకుదాం రా బిడ్డ అని కూమారుడికి ధైర్యం చెప్పింది. గల్ఫ్లో పరిస్థితి ఇలా... గల్ఫ్లో ఉన్న వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేయడానికి పని లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. సుమారు 3నెలల నుంచి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో పనులు లేక తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేక తాత్కాలిక వీసాలపై విదేశాలకు వెళ్లినవారు అక్కడ బిల్డింగ్ వర్క్, ప్లంబర్, లేబర్ కూలీ, డ్రైవర్, హోటళ్లు, ఐటీపరిశ్రమ, చమురు, గ్యాస్ స్టేషన్లు తదితర రంగాల్లో పనులు చేస్తున్నారు. కరోనా వైరస్తో అక్కడ అన్ని కంపేనీలు మూసి వేశారు. దీంతో అక్కడ ఉపాధి పొందుతున్న భారతీయులు భారీగా నష్టపోతున్నారు. అలాగే ఇరుకు గదుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఉంచుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశాలకు వద్దామంటే విమానాలు లేవని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించగా ఐన వారు తోడు లేక కుటుంబ సభ్యుల చివరి చూపుకు నోచుకోక గల్ఫ్ కారి్మకుల రక్షణ సమితి సభ్యులు కుటుంబ సభ్యులుగా అండగా నిలబడి అంత్యక్రియలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి 2 సంవత్సరాల క్రితం దూబాయ్ వెళ్లాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నెల రోజుల క్రితం మరణించాడు. కరోనా నేపథ్యంలో విమానాలు లేకపోవడంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపలేక దూబాయ్లో అంత్యక్రియలు నిర్వహించారు. భయం భయంగా బతుకుతున్నాం... ప్రతీ క్షణం భయం భయంగా బతుకుతున్నాం. ఫిబ్రవరి నుంచి ఇక్కడ పనులు లేక కంపెనీలు మూత పడ్డాయి. మేము పని చేసిన చివరి నెల జీతం కూడా కంపెనీ చెల్లించలేదు. ఒక్క గదిలో పరిమితికి మించి ఉంటున్నాం. ఇక్కడ ఉండటానికి ఇంటి నుంచే పైసలు పంపుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కొంచెం ఆదుకుంటున్నాయి. ప్రభుత్వం స్పందించి దేశానికి రప్పించాలి. – నాయిని అనిల్, దుబాయ్లో ఉన్న యువకుడు స్వదేశానికి రప్పించండి... కరోనాతో పని లేక ఇబ్బంది పడుతున్న గల్ఫ్ కార్మికులను స్వదేశానికి రప్పించాలి. గల్ఫ్ కారి్మకులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశం కాని దేశంలో కార్మికులు తిండిలేక పరిగడుపున నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు రప్పించాలి. ఉన్నత కుటుంబాలకు చెందిన వారిని ప్రత్యేక విమానాల ద్వారా రప్పిస్తున్న మోదీ వలస కారి్మకులను పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కార్మికులను రప్పించాలి. – మంద పవన్, సీపీఐ జల్లా కార్యదర్శి, సిద్దిపేట -
వలస కూలీలకు పద్మారావు చేయూత
-
బావిలో పూడిక తీస్తూ ఇద్దరు కూలీలు మృతి
-
రోడ్డున పడ్డ 2500 మంది కార్మికులు
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరం పట్టాభిపురంలోని భజరంగ్ జూట్ మిల్లును లాకౌట్ చేయడం వల్ల 2500 మంది కార్మికులు రోడ్డు పడ్డారని, మిల్లు తిరిగి ప్రారంభించి వారికి జీవనోపాధి కల్పించాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ను వైఎస్సార్ సీపీ నాయకుడు, జూట్ మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. కార్మిక శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మిలతో నాయకులు గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూట్ మిల్లు లాకౌట్ చేసి వేలాది మంది కార్మికుల పొట్టకొట్టిన యాజమాన్యానికి గత ప్రభుత్వం కొమ్ముకాసిందని చెప్పారు. 1994లో బీఐఎఫ్ఆర్ పద్ధతిలో 40 శాతం కార్మికుల వాటా, 60 శాతం యాజమాన్యం వాటా కింద మిల్లును నిర్వహించేలా అప్పటి ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతులు ఇచ్చిందన్నారు. 40 శాతం కార్మికుల వాటను ప్రభుత్వమే సమకూర్చేలా ఒప్పందం జరిగిందన్నారు. 2014 వరకూ మిల్లు సజావుగా సాగిందని, ఉత్తమ మేనేజ్మెంట్ అవార్డును సైతం ప్రభుత్వం నుంచి మిల్లు యాజమాన్యం తీసుకుందన్నారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని గుంటూరు జిల్లాలో ఏర్పడటంతో భూముల విలువ అమాంతం పెరగడంతో మిల్లు భూములను రియల్టర్లకు విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించుకుందన్నారు. ఇందులో భాగంగా 2015 మే 12న మిల్లు భూములను యాజమన్యం విక్రయించగా, అదే సంవత్సరం జూలై 4న యాజమాన్యం మిల్లు లాకౌట్ చేసిందని వివరించారు. బీఐఎఫ్ఆర్ పద్ధతిలో మిల్లు నిర్వహించడానికి యాజమాన్యానికి ప్రభుత్వం అనేక రాయితీలిచ్చిందని వెల్లడించారు. కానీ స్వప్రయోజనాల కోసం యాజమాన్యం మిల్లును లాకౌట్ చేసిందన్నారు. సమగ్ర విచారణ చేయిస్తాం.. మిల్లు లాకౌట్ చేసి యాజమాన్యం కార్మికుల పొట్టకొట్టిన విధానాన్ని నాయకులు వివరించిన అనంతరం మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పందిస్తూ నెల రోజుల్లో అధికారులతో సమగ్ర విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. విచారణ చేయించి నివేదికలు తెప్పించుకుని నాయకులతో మళ్లీ సమావేశం నిర్వíßహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని, జూట్ మిల్లు మూత పడటంతో రోడ్డున పడ్డ కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో కార్మిక నాయకులు పాండు, సాంబ, మోసే, వైఎస్సార్సీపీ నాయకులు షౌకత్, తోట ఆంజనేయులు, పానుగంటి చైతన్య తదితరులు ఉన్నారు. -
ఆపద వస్తే అంతే సంగతి
సాక్షి, మల్కాపురం (విశాఖపట్నం): రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. పొట్టకూటి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే సుమారు ఐదు కిలీమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి వచ్చిన వారు అనేక బాధలు పడుతున్నారు. 48వ వార్డు అచ్చినాయుడులోవ కొండ ప్రాంతంలోని సుమారు 20 ఎకరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 4,600 ఇళ్ల నిర్మాణ పనులను ఏపీ క్విట్కో ప్రాజెక్ట్ విభాగం పర్యవేక్షణలో ఏడు నెలల నుంచి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సుమారు ఐదు వందల మంది కార్మికులు సివిల్ పనులు, రాడ్బెండింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కోసం కాంట్రాక్టర్ (టాటా)బీహార్, జార్ఖండ్ ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువచ్చారు. అయితే నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కార్మికులకు కనీస వసతులు లేవు. వీరికి మరుగుదొడ్లు, సేద తీరేందుకు షెల్టర్గానీ లేవు. ముఖ్యంగా వైద్య సదుపాయం పెద్ద సమస్యగా మారింది. సివిల్ పనులు చేస్తున్న కార్మికులకు ఏదైన ప్రమాదం జరిగిన, మండుటెండలో సొమ్మసిల్లి పడిపోయినా ప్రాథమిక వైద్యం అందించేందుకు కూడా సదుపాయం లేదు. గత నెల తివారీ అనే వ్యక్తి రాడ్బెండిగ్ పనులు చేస్తుండగా ఒక్కసారి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తొటి కార్మికులు సైట్ ఇన్చార్జ్కు సమాచారం అందించారు. ఆ సమయంలో అక్కడ ఎటువంటి వాహనం లేకపోవడంతో తోటి కార్మికులే చేతుల మీద ఐదు కిలో మీటర్ల కొండ దిగువకు తీసుకువచ్చి వైద్యం చెయ్యించారు. కొండ ప్రాంతంలో పనిచేస్తుండడంతో విషసర్పాలు కాటు వేసినా లేక మరేం ప్రమాదం జరిగినా తక్షణ వైద్యం సాయం ఇక్కడ అందుబాటులో లేదు. ఒక్కోసారి క్షణం ఆలస్యం జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. బతుకు దెరువు కోసం ఇక్కడకు వస్తే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ సమస్యపై ఏపీ క్విట్కో ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.ఆర్.కే.రాజును వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. అత్యవసర పరిస్థితి వస్తే అంతే.. తమ కార్మికులకు ప్రాణాపాయం వస్తే పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కనీసం ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ఎవరూ లేరు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఐదు కిలీమీటర్లు రావాలి. సమీపంలో వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. – రామ్జీ, బీహార్ కనీస వసతులు కల్పించాలి బతుకు తెరువు కోసం ఇక్కడకు వచ్చాం. ఇక్కడ పరిస్థితి చూస్తే భయం కలుగుతోంది. కొండ ప్రాంతంలో తమపై ఏదైనా జంతువులు గానీ, విషసర్పాలు గానీ దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటీ. వైద్య సదుపాయాలు ఇక్కడ కల్పించాలి. - ముఖేష్ తమర్, జార్ఖండ్ -
పనులు చేసినా పైసలు లేవు
సాక్షి, కొమరాడ: గ్రామాల్లో వలస నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో కూలీలకు వంద రోజులు పనులు కల్పించడంతో వలసలకు అడ్డుకట్ట వేయొచ్చునని ప్రభుత్వం సంకల్పించింది. అయితే పథకం కూలీలకు చేతి నిండి పనులున్నా కూడా వలసలు ఆగడం లేదు. దీనికి కారణంగా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడమే. కూలీలు ఉన్న చోటికి ఉపాధి కల్పించి వలసలు నివారించాలని ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది మూడు నెలల నుంచి వేతనదారులు కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం చీమ కుట్టినట్లు అనిపించడం లేదని వేతనదారులు మండిపడుతన్నారు. గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండంల్లోని నెలలు తరబడి కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ చేస్తున్న చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు కూలి డబ్బులు కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పనులు చేసినా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడంతో గ్రామీణులు వలస బాట పడుతున్నారు. పనులు ఫుల్.. డబ్బులు నిల్.. ఆరు నెలలుగా సరైన వర్షం లేకపోవడంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో కూలీలు పొట్టకూడి కోసం ఉపాధి పనులవైపు మొగ్గు చూపారు. అయితే పనులకు ఇబ్బంది లేకపోయినా డబ్బులు విషయానికి వచ్చే సరికి వారికి తిప్పలు తప్పడం లేదు. దీంతో పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. నైపుణ్యం లేని కార్మికులకు స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలన్నా ప్రభుత్వం లక్ష్యం మరుగు పడుతోంది. వాస్తవానికి ఉపాధి హామీ వేతనదారులకు 100రోజులు నుంచి 200 రోజులు పనికల్పించి వారం వారం బిల్లులు చెల్లించాలి. కానీ క్షేత్ర స్థాయిలో కనీసం 100రోజులు కూడా పని కల్పించడం లేదు. చేసిన పనులకు బిల్లులు అందడం లేదు. కొమరాడ- సంఘాలు 960 వేతనదారులు 6542 బకాయాలు రూ.1.65కోట్లు కురుపాం.. సంఘాలు 661 వేతనదారులు 4468 బకాయాలు రూ.2కోట్లు జియ్యమ్మవలస: సంఘాలు 788 వేతనదారులు 4991 బకాయాలు రూ.2.08 కోట్లు గరుగుబిల్లి.. సంఘాలు 828 వేతనదారులు 6042 బకాయిలు రూ.2.30 కోట్లు గుమ్మలక్ష్మిపురం.. సంఘాలు 779 వేతనదారులు 6042 బకాయిలు రూ.2కోట్లు మూడు నెలలు డబ్బులు లేవు మూడునెలలు కూలీ డబ్బులు పడలేదు. కార్యాలయాలు, బ్యాంకు చుట్టూ తిరుగుతన్నా డబ్బులు పడడంలేదు. అనేక ఇబ్బందులు పడుతున్నా కుటుంబ పోషణ భారమైంది. నిత్యవసర వస్తువులు కూడా కొనక్కోలేక పోతున్నాం.– ఆకులు జయలక్ష్మి, వేతనదారులు, గుణానపురం ఇబ్బంది పడుతున్నాం నెలల తరబడి ఉపాధి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కొన్ని కుటుంబాలు వలస పోతున్నాయి. అధికారులు దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఫలితం లేదు.– బుగత ఆదినారాయణ, వేతనదారుడు, గుణానపురం అధికారులు స్పందించాలి ఉపాధి వేతనదారులకు కూలి డబ్బులు అందక వలస బాట పడుతున్నారు. పొట్ట కూటి కోసం వారు కష్ట పడినా డబ్బులు రావడం లేదు. కూలి డబ్బులు ఇవ్వకపోతే వారు ఎలా బతికేది. – అధికారి శ్రీనివాసురావు, వైఎస్సార్ సీపీ నాయకులు, శివిని -
‘కూలీ’న బతుకులు
వంద రోజులు పని దినాలు కల్పించాలని ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది. జిల్లాలో ఇప్పటికే కరువుకాటకాలు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో ఉపాధి పనితోనైనా.. నాలుగు మెతుకులు తిందామంటే ఆ పనులు కూడా అందరికీ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. లక్షలాది మంది కూలీలు ఉండగా వేలాదిమంది కూలీలకే పనులు కల్పిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక జిల్లా కూలీలు వలసబాట పడుతున్నారు. మెదక్ : జిల్లాలో వర్షాలు లేవు. భూగర్భ జలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. వెరసి వ్యవసాయం మూలన పడింది. కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసల నివారణకు తోడ్పడాల్సిన ఉపాధిశాఖ అధికారులు పల్లెలో కేవలం నర్సరీల ఏర్పాటుతోనే సరిపెడుతున్నారు. జిలాలో 7,68,271 మంది జనాభా ఉన్నారు. 1,81,342 జాబ్కార్డులు ఉన్నాయి. ఇందులో 4,05,104 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరందరికీ ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించాల్సి ఉండగా 80శాతం గ్రామాల్లో ఉపాధి పనులు జరగడం లేదు. కానీ మెజార్టీ గ్రామ పంచాయతీలు నర్సరీల్లో మొక్కలను పెంచే పనిలో నిమగ్నమయ్యారు. మొక్కలను పెంచేందుకు కేవలం 10 మంది కూలీలకు మించి ఉపాధి దొరకడం లేదు. దీంతో పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. 10 వేల మందికి మాత్రమే.. 320 గ్రామ పంచాయతీల్లో ప్రతీ గ్రామం పరిధిలో వన నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,05,104 మంది కూలీలు ఉండగా సుమారు 10,955 మంది కూలీలకు మాత్రమే ఈ నర్సరీల ఏర్పాటులో పని దొరకుతోంది. ఈ లెక్కన 3,94,149 మందికి పనులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ఉన్న ఊళ్లో పనులు దొరక్క పొట్ట చేతబట్టుకొని వలసలు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు పని చేస్తున్నారు. అదనపు భత్యం మాటే లేదు.. ఉపాధి కూలీలకు వేసవికాలంలో ప్రతి ఏటా ఐదు నెలల పాటు అదనపు భత్యం అందించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 20 నుంచి 30 శాతం అదనంగా కూలీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరిలోనే విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు ఆ ఊసే కానరావడం లేదు. వారం రోజులుగా జిలాల్లో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో పనులు చేసే అతికొద్ది మంది కూలీలకు సైతం ఆ భత్యం అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. పనులు లేక పస్తులుంటున్నాం.. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోర్లు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేక పోవడం, ఎండలు ప్రారంభం కావడంతో ఆ రెండు బోర్లు నీళ్లు పోయడం లేవు. ఉపాధి హామీలో ఇచ్చే కరువు పనులు చేద్దామంటే మా గ్రామంలో ఇప్పటికి ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. సార్లను అడిగినా ఫలితం లేకుండా పోతోంది. ఇక పట్నం బతుకుదెరవు పోయేందుకు సిద్ధమౌతున్నం. –జాల దుర్గయ్య , పాతూర్ జనాభా 7,68,271 జాబ్ కార్డులు 1,81,342 కూలీలు 4,05,104 పని చేస్తున్న కూలీలు 10,955(సుమారు) -
జీడీకే–10 గని మూత!
రామగిరి(పెద్దపల్లి జిల్లా): సింగరేణి సంస్థలో మరో భూగర్భ గని మూతపడనుంది. సంస్థలో మొట్టమొదటి బీజీ(బ్లాస్టింగ్ గ్యాలరీ)ప్యానల్ ఏర్పాటు చేసిన 10వ గనిని మూసివేసేందుకు యాజమాన్యం ముహూర్తం ఖరారు చేసింది. ఈయేడాది డిసెంబర్లో 10వ గని మూసి వేసేం దుకు సంబంధిత అధికారులు సన్నహాలు చేస్తు న్నారు. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు 520 మంది కార్మికులను బదిలీ చేయనున్నారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశా రు. 157 మంది కార్మికులు ఆర్జీ–3 పరిధి ఓసీపీ–1, 2గనులకు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోగా మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. మరో 180 మంది కార్మికులను ఇక్కడే ఉంచనున్నారు. 1976లో ప్రారంభం 1976లో ఏర్పాటు చేసిన జీడీకే–10 ఇంక్లైన్ గని ఎంతో మందికి ఉపాధి కల్పించింది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లోని కింది రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం కోసం 1989లో సింగరేణి మొత్తానికి మొట్టమొదటి సారి ఈగనిలో బీజీ ప్యానల్ ఏర్పా టు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని నిర్దశించిన ఉత్తత్పి సాదించి ఈగనిలో వర్క్స్పాట్(పని స్థలం)దూరం పెరిగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్ వైడింగ్ షాఫ్టును ఎర్పాటు చేశారు. పనిస్థలం దూరం పెరిగిపోవడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రాకపోవడంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో యాజమా న్యం ఈ గనిని మూసి వేసి ఆర్జీ–3 పరిధి ఓపీసీ–1కు అప్పగించాలని నిర్ణయించింది. ఈమేరకు డిసెంబర్లో ఉత్పత్తి నిలిపివేసి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఓసీపీ–1 జీవితకాలం జీడీకే–10వ గనిని మూసి వేసి ఆర్జీ–3 పరిధి లోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్సరాలు పెరుగుతుంది. 2019 డిసెంబర్లో ఓసీపీ–1 ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. మూడేళ్లక్రితం 10ఏ మూసివేత సింగరేణ సంస్థలో మొట్టమొదటిసారి లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని మూడు సంవత్సరాల క్రితం 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే–10ఏ గనిని 1985లో ఏర్పాటు చేశారు. భూగర్భంలో నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పైరెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏగనిలో లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడీకే–10, జీడీకే–10ఏ ఇంక్లైన్ గనుల్లో సుమారు 336 మిలియన్ టన్నుల బొగ్గు ఉండగా, రెండు గనుల ద్వారా 34 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్ టన్నుల బొగ్గును ఓసీపీ–1 ద్వారా వెలికితీయాలని సింగరేణి భావిస్తోంది. 34మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జీడీకే–10వ గనిని డిసెంబర్లో మూసి వేయాలని యాజమాన్యం నిర్ణయించింది. జీడీకే–10, జీడీకే–10ఏ గనుల ద్వారా సుమారు 34 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పతి జరిగింది. మిగిలిన బొగ్గు నిక్షేపాలను ఓసీపీ–1 ద్వారా వెలికితీయనున్నాం. ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏపీఏకు ఎలాంటి ముప్పు వాటిళ్ళకుండా రెండు డ్యాంలను నిర్మిస్తున్నాం. బి.వీరారెడ్డి, ఏపీఏ జీఎం -
మారకుంటే డిస్మిస్సే..
శ్రీరాంపూర్(మంచిర్యాల): ఉద్యోగాల లేక నిరుద్యోగులు పడరాని పాట్లు పడుతుంటే ఉన్న ఉద్యోగాలను లెక్కచేయకుండా కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు కొందరు కార్మికులు. నిర్ణీత మస్టర్లు నింపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొంత మంది కార్మికులు డిస్మిస్ అంచులకు వెళ్లారు. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్. ఇంత పెద్ద ఏరియాలో గైర్హాజరు కార్మికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడు సంవత్సరంలో కనీసం 100 మస్టర్లు నింపాలి. ఇలా మూడేళ్లు వరుసగా 100 మస్టర్లు నిండకుంటే వారిని కంపెనీ డిస్మిస్ చేస్తోంది. గతంలో వేలాది మంది కార్మికులు ఇలాగే డిస్మిస్ అయ్యారు. 2003 వరకు మూడేళ్లు చూసి వెంటనే డిస్మిస్ చేసింది. కాలక్రమేణా వచ్చిన మార్పులతో చాలామంది డ్యూటీల బాటపట్టారు. కానీ ఇంకొందరు గైర్హాజరు అవుతూనే ఉన్నారు. వారి పట్ల యాజమాన్యం సీరియస్గా స్పందించాల్సి ఉన్పప్పటికీ కొత్త రాష్ట్రంలో డిస్మిస్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, కౌన్సెలింగ్ పేరుతో డ్యూటీలు చేయాలని కోరుతూ వచ్చింది. గడిచిన ఐదేళ్లుగా కార్మికులను పలుమార్లు పిలిచి కౌన్సెలింగ్ చేస్తూ రావడంతో ఇందులో కొంత సత్ఫలితాలు వచ్చింది. కాగా, ఏరియాలో గడిచిన 5 ఏళ్లుగా 100 మస్టర్ల కంటే తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారిపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నారు. ఇంక్రిమెంట్లు కూడా కట్ చేసిన వారు మారడం లేదు. దీంతో వారికి చివరిసారిగా ఈ నెల 20న కౌన్సెలింగ్ నిర్వహించారు. తీవ్ర గైర్హాజరు ఉన్న 38 మందిని గుర్తించి అధికారులు పిలిచారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్చేసి వారిని వెంట తీసుకొని కౌన్సెలింగ్కు రమ్మని కోరారు. ఇందులో కేవలం 17 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు రాలేదు. వారికి చివరి సారిగా నోటీసులు ఇచ్చి చర్యలకు సిద్ధమైంది. వీరు డిస్మిస్ అయ్యేఅవకాశం కూడా ఉందని తెలుస్తుంది. నెలకు 22 మస్టర్లు చేస్తే సరి కౌన్సెలింగ్కు హాజరైన వారిలో చాలా మందికి యాజమాన్యం చివరి అవకాశం ఇచ్చింది. దీని ప్రకారం డిసెంబర్, జనవరీ, ఫిబ్రవరిలో ప్రతీ నెల 22 మస్టర్లు తగ్గకుండా పనిచేయాలని జీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇలా 3 నెలలు పనిచేసి గాడిన పడాలని, ఈ 3 నెలల్లో కూడా మార్పు రాకుంటే వారిని డిస్మిస్ కోసం కార్పొరేట్కు సిఫార్సు చేయడానికి యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిసింది. వ్యసనాలతో చాలా మంది ఎగనామం చాలా మంది గైర్హాజరు కార్మికులు వ్యసనాల కారణంగా డ్యూటీలు సక్రమంగా చేయకుండా గైర్హాజరు కార్మికులుగా మారారు. ఇందులో యువ కార్మికులు కూడా ఉండటం అశ్చర్యానికి గురిచేస్తోంది. కుటుంబ బాధ్యత మరిచి జులాయి తిరుగుళ్లు తిరుగూ డ్యూటీలు రావడం లేదని ఇలాంటి వారిని ఇక ఉపేక్షించేది లేదని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా చివరి అవకాశంగా వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. సేవా సమితి ద్వారా మహిళలు కూడా కార్మికుల కుటుంబాల్లోని మహిళలను పిలిచి వారి సమక్షంలో కార్మికునికి కౌన్సెలింగ్ ఇచ్చి డ్యూటీలు సక్రమంగా చేసుకొని కుటుంబానికి పోషించుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి నాటికి వీరు మారకుంటే డిస్మిస్ కావడం ఖాయమని పేర్కొంటున్నారు. ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని రోడ్డుపై పడకుండా ఉద్యోగం నిలుపుకోవాల్సిన బాధ్యత సదరు కార్మికులపై ఉంది. -
రక్షణ సూత్రాలు విధిగా పాటించాలి
సింగరేణి(కొత్తగూడెం): ప్రతి కార్మికుడు, ఉద్యోగి రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని సేఫ్టీ జీఎం రాజీవ్కుమార్ కార్మికులను ఆదేశించారు. మంగళవారం ఏరియాలోని వర్క్ షాప్లో 51వ రక్షణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణిలో ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిందని, అందుకు కారణం ఉద్యోగులు రక్షణ సూత్రాలను పాటించటమేనని అన్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ కమిటీకి డీవైజీఎం ప్రసాద్, ఏజీ ఎం కిషోర్గంగా స్వాగతం పలికారు. అనంతరం తనిఖీ కమిటీ వర్క్షాప్లోని వివిధ యంత్రాలు, పని స్థలాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీ ఎం రాఘవేంద్రరావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేజీ తివారీ, ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీరజాక్, ఏజీఎంలు మోహన్రావు, పి.శ్రీనివాస్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు రవి, కె.బ్రహ్మాచారి, వర్క్షాప్ ఇంజనీర్లు అనిల్, ఉపేందర్, వీరస్వామి, సంపత్, సేఫ్టీ కమిటీ సభ్యులు, పిట్ సెక్రటరీ, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
లైనర్స్ కంపెనీ మూసివేతపై కార్మికుల ఆందోళన
-
‘ఆప్ నేతలు మమ్మల్ని మోసం చేశారు’
హరియాణ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమను మోసం చేశారంటూ హరియాణాలో రోజువారీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ర్యాలీలో పాల్గొంటే డబ్బులతో పాటు భోజనం పెడతామంటూ నమ్మించి...ర్యాలీ అయ్యాక ఉత్తి చేతులు చూపించారని వారు వాపోతున్నారు. హరియాణలోని హిసార్లో ఆదివారం జరిగిన ‘హరియాణా బచావత్’ ర్యాలీలో పాల్గొనాలని కొంత మంది ఆప్ నేతలు తమని తీసుకెళ్లారని, ర్యాలీలో పాల్గొన్నందకు ఒక్కొక్కరికి రూ.350 చొప్పున ఇచ్చి, భోజనం కూడా పెడతామన్నారని కూలీలు తెలిపారు. అయితే ర్యాలీ అయిపోయాక తమను ఎవరు పట్టించుకోలేదని, డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ ఆప్ నేతలపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హరియాణలో ఎన్నికల ర్యాలీలో పాల్గోన్న విషయం తెలిసిందే. -
అక్కడికెళితే... అంతే సంగతులు!
సాక్షి, రాయచోటి: నిత్యం కరవుతో అల్లాడుతున్న వైఎస్సార్ జిల్లా ప్రజలు జీవనోపాధికోసం వలసలు వెళ్లడం సర్వసాధారణం అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళితే మంచి ఉపాధితో పాటు మూడుపూటలా భోజనం వారే ఏర్పాటుచేస్తారని దీంతో మీరు లక్షాధికారులు కావచ్చని ఆశ చూపి, ఇక్కడి మహిళలను విదేశాలకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన మహిళలు అష్ట కష్టాలు పడుతూ కనీసం బతికున్నారా... లేదా అనే సమాచారం కూడా తెలియపర్చలేని దుస్థితిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం గరుగుపల్లికి చెందిన లక్ష్మిదేవమ్మ అనే మహిళ తొమ్మిది నెలల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు ఆమె గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టి లక్ష్మిదేవమ్మను స్వదేశానికి రప్పించారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూలి పనులు చేసుకుంటూ కాపురాన్ని నెట్టుకొస్తున్న లక్ష్మిదేవమ్మ తన ముగ్గురు బిడ్డలకు మంచి భవిష్యత్తు ఏర్పరచాలనే ఉద్ధేశ్యంతో అప్పోసప్పో చేసి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ ఏజెంట్ ను ఆశ్రయించింది. నెలకు 18 వేలు జీతం, మూడు పూటలా భోజనం ఇస్తారని ఒక ఇంట్లో ఇంటి పని చేయాల్సి ఉంటుందని ఏజెంట్ చెప్పడంతో గల్ఫ్ బాట పట్టింది. అక్కడికెళ్ళిన లక్ష్మిదేవమ్మకు ఒక పూట మాత్రమే భోజనం ఇచ్చి, నెలకు 13 వేలు చొప్పున మూడు నెలల పాటు రెండు ఇళ్ళల్లో పనులు చేయించుకున్నారు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడించేందుకు అనుమతికూడా ఇవ్వలేదు. 9 నెలలు పనిచేసిన లక్ష్మిదేవమ్మకు 3 నెలలు మాత్రమే జీతం ఇచ్చారు. అధిక ఒత్తిడిని తట్టుకోలేని లక్ష్మిదేవమ్మ తాను స్వదేశానికి వెళ్ళిపోతానని చెప్పడంతో ఏజెంట్ కు పెట్టిన డబ్బులు చెల్లించి వెళ్ళిపోవచ్చని లక్ష్మిదేవమ్మ యజమానులు డిమాండ్ చేశారు. లక్ష్మిదేవమ్మ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక్కడ స్థానికులు రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి లక్ష్మిదేవమ్మను స్వదేశానికి రప్పించారు. -
కంటైనర్లో ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి
సాక్షి, పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం వద్ద ఉన్న కియా ఫ్యాక్టరీ దగ్గర కంటైనర్లోని జనరేటర్ వద్ద నిద్రించిన ఇద్దరు కూలీలు మృతిచెందారు. నారాయణ, రామాంజినేయులు అనే కూలీలు సోమవారం రాత్రి కంటైనర్లోని జనరేటర్ వద్ద నిద్రపోయారు. అయితే అక్కడ ఊపిరాడకపోవడంతో వారు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
నీడ..నీరు లేదు
► ఉపాధిహామీ కూలీలకు సౌకర్యాల కరువు ► తాగునీరూ వెంట తెచ్చుకోవల్సిందే.. ► పట్టించుకోని అధికారులు ► మొత్తం జాబ్ కార్డులు 1,14,743. కూలీలు 2,50,957 ► పనులు చేస్తున్న కూలీలు 1,31,881 ఉపాధిహామీ కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతున్న కొద్ది పనులు చేయడం ఇబ్బందిగా మారింది. పని ప్రదేశంలో అధికారులు కనీస వసతులైన నీడ, నీటి సౌకర్యం కల్పించడం లేదు. దీంతో కూలీలు ఎర్రని ఎండలో పనిచేయాల్సి వస్తోంది. నీళ్లు కూడా వెంట తెచ్చుకోవల్సిన దుస్థితి నెలకొంది. కౌటాల మండలంలోని యాపలగూడ, తలోడి గ్రామాల్లో మంగళవారం ఈ పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా కూలీలు ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. కౌటాల : ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదు. జిల్లాలో మొత్తం 1,14,743 జాబ్కార్డులు ఉన్నాయి. వీటిలో 69,556 వేల కుటుంబాల్లో 2,50,957 కూలీలు ఉన్నారు. ఇందులో 1,31,881మంది పనిచేస్తున్నారు. వీరిలో గతేడాది 3,664 మంది కూలీలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేశారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగి ఉన్నా ప్రభుత్వం కూలీలకు కనీస వసతులు కల్పించడం లేదు. ఉపాధి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు నీరు లేక..సేద తీరేందుకు నీడ లేక.. ఎండలోనే పనులు చేస్తూ కూలీలు వడదెబ్బకు గురువుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలు ఎండకు తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. గతంలో ఉపాధిహామీ కూలీలకు నీడ సౌక్యర్యం లేక ఎండదెబ్బకు పలువురు కూలీలు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు ఈ సంవత్సరం కూడా కూలీలకు నీడ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో అనేక మంది కూలీలు పనులకు రావడం లేదు. ఇబ్బందుల్లో కూలీలు ఉపాధి పని ప్రదేశాలలో నీడ, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో కూలీలు ఇంటి నుంచే తాగునీరు తెచ్చుకోవల్సి వస్తోంది. ఆ నీళ్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు. బాటిళ్లలోని నీరు ఎండకు వేడి కావడంతో కూలీలు తాగలేకపోతున్నారు. పనులు చేస్తున్న సమయంలో కూలీలు గాయాల పాలైనా..అనారోగ్యానికి గురైన ప్రాథమిక చిక్సిత అందించేందుకు ఎక్కడా మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. టెంట్లు కూడా లేకపోవడంతో నీటి సీసాలను చెట్ల కింద ఉంచాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. ముఖ్యంగా కౌటాల మండలంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో ఏ ఒక్క చోట కూడా ఎండలకు టెంట్లు వేసిన దాఖాలలు కనిపించడం లేదు. వడదెబ్బ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈజీఎస్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి పని చేసే ప్రదేశంలో తాగు నీరు, నీడ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎండా కారణంగా అనేక మంది కూలీలు పని మానేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి, నీడ సౌకర్యాం కల్పించాలి. - బెడ్డల తుర్సబాయి, ఉపాధికూలీ, యాపలగూడ 82 నీళ్లు తెచ్చుకుంటున్నాం ఇంటి నుంచే నీటి సీసాలు వెంట తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లు ఎండకు వేడి అవుతున్నాయి. దీంతో నీటి తిప్పలు తప్పడం లేదు. మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచడం లేదు.- దుర్గం అర్జున్, ఉపాధికూలీ, ధనురుహెట్టి 83 టార్ఫాలిన్లు ఇచ్చాం మండలంలో పని చేస్తున్న కూలీలకు ఈ సంవత్సరం ప్రభుత్వం పంపిణీ చేసిన టార్ఫాలిన్ కవర్లను ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అందించాం. మెడికల్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయలేదు. కూలీలు ఎక్కువగా ఉండడంతో టార్ఫాలిన్ అందరికీ అందించలేకపోయాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.- పూర్ణిమ, ఈజీఎస్ ఏపీవో, కౌటాల 84 -
నేటి నుంచి కార్మిక సంఘాల పాదయాత్ర
– 21న కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష – 24న కలెక్టరేట్ ముట్టడి – కార్మిక చట్టాల అమలే లక్ష్యం అనంతపురం అర్బన్ : జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉపాధి చూపించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల అమలుకు బుధవారం నుంచి పాదయాత్ర చేపడుతున్నామన్నారు. హిందూపురంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈ నెల 20 వరకు ఐదు ప్రాంతాల్లో 100 గ్రామాల ద్వారా 500 కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్క్లబ్లో సీఐటీయూ నగర అధ్యక్షుడు గోపాల్ అధ్యక్షతన జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కార్మికులు అనేక త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను, చట్టాలను కాలరాసే∙దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గపు చర్యన్నారు. బుధవారం హిందూపురంలో ప్రారంభమయ్యే పాదయాత్రకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ హాజరవుతారన్నారు. 16న కదిరి, 17న గుంతకల్లు, 18న తాడిపత్రి , అదే రోజున నగరంలో పాదయాత్ర సాగుతుందన్నారు. 20వ తేదీ నాటికి అన్ని పాదయాత్రలు అనంతపురం చేరుకుంటాయన్నారు. 21న కలెక్టరేట్ ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామన్నారు. 22న అన్ని రాజకీయ పార్టీలతో సంఘీభావ సభ నిర్వహిస్తామని, 24న కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వీరమణ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, ఏఐయూటీయూసీ జిలా కార్యదర్శి సుబ్రమణ్యం, ఐద్వా జిల్లా కార్యదర్శి సావితి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
‘కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : పరిగి మండలం పైడేటీ గ్రామ సమీపంలోని ఎస్ఏ రావతార్ మసాలా ఫ్యాక్టరీలో తొలగించిన 183 కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని కారిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో సీఐటీయు, ఏఐటీయూసీ, వైఎస్సార్టీయూ ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు చేపట్టాల్సిన కార్యచరణ గురించి వారు చర్చించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, కార్యదర్శి వెంకటేష్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లప్ప, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సీఐటీయూ నగర అధ్యక్షుడు గోపాల్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు వెంకటనారాయణ, ఏఐయూటీయూసీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బోథ్ నియోజకవర్గంలో సమ్మె విజయవంతం
కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులు ఇచ్చోడ : మండలం కేంద్రంలో హమాలీలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, తాపిమేస్త్రీ సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలురువు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.18 వేలు నిర్ణయించాలన్నారు. సమ్మె విజయవంతమైందని ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కల్లెపెల్లి గంగాయ్య, కొలిపాక అశోక్, దుబాక సుభాష్, సిరిసిల్ల భూమయ్య, యూసుప్ పాల్గొన్నారు. గుడిహత్నూర్ : సమ్మెలో భాగాంగా మండల కేంద్రంలో పోస్టర్లు, వినతి పత్రాలతో నిరసన తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ఎంఈవో నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మండల నాయకుల పోస్టర్లతో నిరసన తెలిపారు. ఆయా సంఘాల మండల నాయకులు ఉస్మాన్, శేక్ హస్సేన్ మాట్లాడారు. ఎమ్మార్సీ కాంట్రాక్టు ఉద్యోగులు ఎంఐఎస్ కేశవ్ లాందాడే, ఫరీన్, సావేందర్, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ నాయకులు జాకీర్ఖాన్, సురేఖ, సలీమ, మల్యాల శ్రీకర్ పాల్గొన్నారు. బోథ్ మండలంలో.. ఇచ్చోడ(బోథ్) : మండల కేంద్రంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్ కార్యాలయంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు గంగయ్య, సుధీర్, రాజలింగు, గంగయ్య, నజీర్బాబు, ఫయిం, అడెల్లు, భోజన్న పాల్గొన్నారు. బజార్హత్నూర్ : సార్వత్రిక సమ్మె విజయవంతమైందని ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు చందర్ తెలిపారు. మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, తాపీమేస్త్రీలు, పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రహ్లాద్, రాజన్న, గంగామణి, దేవశీల, హెమలత, రాధ, రత్నమాల, కార్మికులు పాల్గొన్నారు. -
మా ఓట్లతో గెలిచి మాపైనే పెత్తనమా?
హిమాయత్నగర్: లక్షల జీతాలు తీసుకుంటున్న ఉన్నతాధికారుల సభలు, సమావేశాల ఖర్చు కార్మికులపై మోపుతున్నారని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శివకుమార్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన కార్మికులపై రుబాబు చేయడమేగాక ఇళ్లలో పాచి పనిని చేయించుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మున్సిపల్ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని, కార్మికులకు కనీస వేతనాలను రూ. 15వేలకు పెంచుతామన్న నేతలు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేటర్ల బర్త్డేలు, ఫంక్షన్లకు కార్మికులు కేకులు తీసుకెళ్లి కట్ చేయాల్సి వస్తుందన్నారు. లేకపోతే వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కార్మికులకు మాస్క్లు, షూలు. గ్లౌవ్స్ ఇవ్వటం లేదన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ , మహబూబ్నగర్ అటవీ ప్రాంతాల వద్ద పనిచేసే కార్మికులు జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో రషీద్, కృష్ణ. ఆనంద్, సుధాకర్ గౌడ్, సాయిదీప్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులను వదిలి కార్మికులపై చర్యలా?
హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు దశరథంగౌడ్ సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు ౖయెటింక్లయిన్కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ–2 డివిజన్ పరిధిలోని జీడీకే–7ఎల్ఈపీ గనిలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన అధికారులను వదిలి యాజమాన్యం కార్మికులపై చర్యలు తీసుకుంటు వేధింపులకు గురిచేస్తోందని హెచ్ఎంఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ విమర్శించారు. స్థానిక ప్రెస్భవన్లో బుధవారం మాట్లాడారు. గతనెలలో విషవాయువుల ప్రభావానికి గురై బదిలీ కార్మికుడి మృతిచెందిన సంఘటనతో సంబందంలేని వారికి చార్జిషీట్లు, సస్పెండ్లు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. గతంలో పనిఏరియాకు సంబంధంలేని మైనింగ్ సర్దార్ కరుణాకర్రెడ్డిని సస్పెండ్ చేశారని, షిప్టుల్లో పనిచేసే హెడ్ఓవర్మెన్ నాగప్రసాద్కు చార్జిషీట్ ఇచ్చారని పేర్కొన్నారు. తాజాగా ఆక్టింగ్ మేషన్ ఎం.తిరుపతికి చార్జిషీట్ జారీ చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అదే అధికారుల విషయంలో ఇప్పటి వరకు సరైన చర్యలు లేవన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనికి గని మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులు తిరగబడితే రోజులు దగ్గరపడుతున్నాయన్నారు. సమావేశంలో హబీబ్బేగ్, గోపాల్రెడ్డి, అఫ్జల్, ఖలీల్, వెంకటేశ్వర్లు, ఓదెలు, శ్రీనివాస్, మధునయ్య, రాజలింగు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి
రామగిరి : ఇళ్లలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మానం మేరకు ఇంటి పనివారిని కార్మికులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సాగర్ల యాదయ్య, బోడ ఇస్తారి, గణేశ్, దండంపల్లి సరోజ, జానకి, డేగల రాములమ్మ, అంజమ్మ, పద్మ, వల్లమ్మ, ఏశమ్మ, ఎల్లమ్మ, జ్యోతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుంది
హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ మహబూబ్నగర్ న్యూటౌన్ : గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని హైకోర్టు న్యాయవాది, తెలంగాణ గ్రామ పంచాయితీ కారోబార్స్, బిల్ కలెక్టర్స్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి నియమించిన కమిటీ బాధ్యతలు విస్మరించిందని అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నేషనల్ గార్డెన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలీచాలని వేతనాలిస్తుందని, అవి కూడా ఆరు నెలలకోసారి ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తుందని అన్నారు. గ్రామ పంచాయితీ ఉద్యోగుల దుస్థితిని చూడలేక తాను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి 12 వారాలు వాదనలు వినిపించిన సందర్భంగా ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.613ను జారీ చేసిందని అన్నారు. తాను ఫిల్లో లేవనెత్తిన 9 చట్టాలను పరిశీలించి జీఓఆర్టీ 613ను అమలు చేసేందుకు కమిటీని నియమించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు జీఓ ఆర్టీ నెం.613ను అమలు చేయకుండా కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పంచాయితీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ట్రం రావాలంటే వెంటనే జీఓ ఆర్టీ 613ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.చక్రధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నర్సిములు, ప్రధానకార్యదర్శి సి.శ్రీనివాసాచారి, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎండీ రంజాన్ అలీ, అంజయ్య, నాయకులు ఆంజనేయులు, మక్బుల్, వెంకటేశ్వర్లు, శ్రీహరి, మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సన్మానం
గోదావరిఖని : సింగరేణి సంస్థ ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లలో పనిచేసి శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను ఘనంగా సన్మానించారు. జీడీకే–1,3 గ్రూప్ గనిలో ఉద్యోగ విరమణ పొందిన డెప్యూటీ సూపరింటెండెంట్ లక్కాకుల శ్రీనివాస్రావు, టెండాల్ ఎల్లందుల ఓదెలు, జనరల్ మజ్దూర్ సుద్దాల రాజయ్యను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. వారికి రావాల్సిన సీఎంపీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్ పత్రాలు అందజేశారు. జీడీకే–11వ గనిలో టింబర్మెన్ కొమ్ముల రాజేశం, కోల్కట్టర్లు పోలగాని పెంటయ్య, బీస కనకయ్య, సపోర్ట్మెన్లు ఎం.సుధాకర్రెడ్డి, వనపర్తి నర్సయ్య, ఎల్హెచ్డీ ఆపరేటర్ సుదగాని రామస్వామి, ట్రామర్ నల్ల ఆగమరెడ్డి, జనరల్ మజ్దూర్లు గట్టం అంజయ్య, మీనుగు నారాయణను సన్మానించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పనిచేసి రిటైర్ అయిన రౌతు మంజు, బాబూరావును వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది సన్మానించారు. ఆర్జీ–2 డివిజన్లో.. ౖయెటింక్లయిన్కాలనీ :ఆర్జీ–2 డివిజన్ పరిధిలోని ఓసీపీ–3 సీహెచ్పీలో పనిచేసి రిటైర్ అయిన శ్రమశక్తి ఆవార్డు గ్రహీత ఆర్.కేÔ¶ వరెడ్డిని శనివారం సన్మానించారు. సీహెచ్పీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాలువాలతో సన్మానించి జ్ఞాపిక బహూకరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి రమేశ్కుమార్, మేనేజర్ వెంకటయ్య, సీహెచ్పీ డీవైఎస్ఈ సదానందం తదితరులు పాల్గొన్నారు. వకీల్పల్లి గనిలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఎనిమిది మంది కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో గని మేనేజర్ ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ ఖాదిర్, సంక్షేమాధికారి ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
కార్మికుల హక్కుల కోసం జైలుకెళ్లాం
హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్అహ్మద్ ౖయెటింక్లయిన్కాలనీ : సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం జైలుకెళ్లిన ఘనత హెచ్ఎంఎస్కే దక్కుతోందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్అహ్మద్ అన్నారు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 సైటాఫీస్లో సోమవారం జరిగిన గేట్మీటింగ్లో మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరిగితే ప్రశ్నించినందుకు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి తనపై పోలీస్స్టేషన్లో రౌడీషీట్ లె రిపించారన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా వెనకాడేది లేదని కార్మికుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. మల్టీడిపార్ట్మెంట్ల పేరుతో కార్మికులపై పనిఒత్తిడి పెంచుతున్నా గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యంతో చేతులు కలిపారన్నారు. సకలజనుల సమ్మె వేతనాలు యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు రాకుండా ఆపించిన ఘనత టీబీజీకేఎస్ నాయకులకు దక్కిందని పేర్కొన్నారు. వేజ్బోర్డులో సభ్యత్వం కోసం లేఖలు రాసి సకాలంలో వేతన కమిటీ ఏర్పాటు కాకుండా అడ్డుకుంది టీబీజీకేఎస్ కాదా అని ప్రశ్నించారు. కార్మికుల హక్కులు కాపాడడంతో విఫలమైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ తీరును కార్మికులు ప్రశ్నించాలన్నారు. తాము ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన డివిజన్లలో అనేక సమస్యలు సాధించామని యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామన్నారు. గేట్ మీటింగ్లో పినకాసి మొగిలి, అజీజుల్లా, కొమ్ము మధునయ్య, బస్విరెడ్డి, మహేందర్రెడ్డి, మల్లారెడ్డి, అశోక్, స్వామి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘చలో కొత్తగూడెం’కు తరలిన కార్మికులు
మందమర్రి : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన పోరుయాత్ర సభకు మందమర్రి ఏరియా ఏఐటీయూసీ నాయకులు ఆదివారం సింగరేణి రైలుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఏరియా బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తున్నామని అన్నారు. పోరుయాత్ర సభకు మందమర్రి ఏరియాలోని 500 మంది కార్మికులు చలో కొత్తగూడెంకు తరలి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి తరలిన నేతల్లో సుదర్శన్, ఆర్ వెంకన్న, అంకతి సాయిలు తదితరులున్నారు. -
పల్లె పొమ్మంది!
పొట్టచేతబట్టుకొని పట్నం బాట పడుతున్న పల్లెవాసులు ► ఉన్న ఊళ్లో పనులు కరువై వలస వెళ్తున్న జనం ► అడ్డాపై కూలీలుగా రైతుల దైన్యం ► రెండేళ్ల నుంచి వర్షాల్లేక చతికిలపడిన వ్యవసాయం ► జిల్లా కేంద్రాలు, హైదరాబాద్, ముంబై నగరాలకు పెరుగుతున్న వలసలు... అక్కడా పనులు దొరక్క అవస్థలు ► అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు పయనమవుతున్న యువత పది మంది కూలీలతో నాలుగెకరాల సొంత భూమిలో పనులు చేయించు కుంటూ ఊళ్లో గౌరవంగా బతికిన ఓ రైతు ఇప్పుడు తానే కూలీగా మారిపో యాడు! ఆత్మాభిమానాన్ని చంపుకొని అడ్డాపై నిలబడి కూలికోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు!! కాలే కడుపుకు ఇన్నాళ్లూ నాలుగు ముద్దలందించిన ఉపాధి పని కరువవడంతో భార్యాపిల్లల్ని వదిలేసి బతుకు బండిని లాగేందుకు బొంబాయి బస్సెక్కాడు ఓ భర్త!! ఉన్న ఊళ్లో పనిలేక పొట్ట చేతబట్టుకొని ఎడారి దేశానికి పయనమైన చెట్టంత కొడుకును చూస్తూ కళ్లలో నీళ్లు నింపుకున్నారు ఓ ముదుసలి తల్లిదండ్రులు!!! సాక్షి నెట్వర్క్ ...తెలంగాణ పల్లె మళ్లీ వలసబాట పట్టింది. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో పల్లెలు అల్లాడుతున్నాయి. ఉపాధి కరువై పొట్ట చేతబట్టుకొని పట్టణాలు, నగరాలకు జనం వలస వెళ్తున్నారు. అక్కడ కూడా పని దొరకకుంటే పక్క రాష్ట్రాలకు పయనమవుతున్నారు. యువకులు, మధ్య వయసువారు వలసలు వెళ్లడంతో చాలా గ్రామాలు, తండాల్లోమహిళలు, పిల్లలు, వృద్ధులే కనిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న వారిలో కొందరు పిల్లల్ని కూడా వెంట తీసుకువెళ్తుండడంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోతోంది. వరుసగా రెండేళ్లపాటు వర్షాల్లేక సాగు చతికిల పడడం, కాస్తోకూస్తో పొట్ట నింపుతున్న ఉపాధి పనులు అరకొరగా సాగుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ వలసలు కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి ఎక్కువగా మహారాష్ట్రలోని నగరాలకు వెళ్తున్నారు. పల్లెల నుంచి జిల్లా కేంద్రాలు, హైదరాబాద్కు వలస వెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ కూడా పనులు అంతంతే దొరకడంతో పస్తులు తప్పడం లేదు. బతుకుదెరువు కోసం పట్నంబాట.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు(యు), జైనూరు, కెరిమెరి మండలాల్లో కుటుంబాలకు కుటుంబాలే ముంబై, హైదరాబాద్ నగరాలకు వలస వెళ్తున్నాయి. అక్కడ నిర్మాణ రంగంలో కూలీ పనులకు వెళ్తూ పొట్టబోసుకుంటున్నారు. ఒకప్పుడు రైతులుగా ఇతరులకు పని కల్పించిన వారే ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. జిల్లాలోని బెజ్జూరు. కౌటాల, దహెగాం, కాగజ్నగర్ మండలాల ప్రజలు మిరప పంట ఏరేందుకు ఖమ్మం జిల్లాకు వలసలు వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల నుంచి ఎక్కువగా గిరిజనులు ముంబై వెళ్తున్నారు. పరిగి నియోజకవర్గం కుల్కచర్ల నుంచి ముంబైకి ప్రతీరోజు ఏకంగా ఒక బస్సు నడుపుతున్నారంటే పరిస్థితిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది నెలలపాటు వారు ముంబైలోనే కూలీలుగా పనిచేస్తూ.. ఇంటికి కొంత మొత్తాన్ని పంపిస్తున్నారు. కరువు దెబ్బకు పాడి కూడా కుదేలైంది. దుర్భిక్ష పరిస్థితుల కారణంగా రైతులు పశువులను కూడా తెగనమ్ముకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో చాలామంది రైతులు అడ్డాకూలీలుగా మారారు. కూలీ కోసం రోజూ కరీంనగర్ జిల్లా కేంద్రానికి వస్తున్నా.. వారిలో అందరికి పని దొరకడం లేదు. పనిలేని రోజు బస్సు చార్జీలు అదనంగా నెత్తినపడుతున్నాయి. కరీంనగర్ నగరంలో గతంలో కూలీల అడ్డాపై 1,500 మంది ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 2,500కి పెరిగిపోయింది. దీనితో కూలీకి కూడా తీవ్ర పోటీ తప్పడం లేదు. 2,500 మంది కూలీల్లో ఐదారు వందల మంది కూలీ దొరక్క నిరాశతో వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పాలమూరులో 20 వేల కుటుంబాలు.. మహబూబ్నగర్ జిల్లాలో కూలీలు వలసబాట పడుతున్నారు. జిల్లాలో దాదాపు 20వేలకు పైగా కుటుంబాలు వలసలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. నారాయణపేట డివిజన్లోని నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లోని కూలీలు ముంబై, పూణె, షోలాపూర్, హైదరాబాద్ తదితర నగరాలకు వలసలు వెళ్తున్నారు. ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటున్నవారు కాలం కలిసిరాక అప్పులపాలవుతున్నారు. మెతుకుసీమలో బతుకు కరువు మెతుకుసీమగా పేరొందిన మెదక్ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, దుబ్బాక, ఆందోల్, సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి కూడా పెద్దసంఖ్యలో వలస వెళ్తున్నారు. కరువుతో సాగుకే కాదు తాగునీటికీ కష్టంగా మారింది. అటు గ్రాసం, ఇటు నీళ్లు దొరక్క పశువులు సైతం విలవిల్లాడుతున్నాయి. అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు.. యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు అందిన కాడికి అప్పులు చేస్తూ.. ఏజెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. గ ల్ఫ్లో పని చే యడానికి అవసరమైన వీసాలు లేకుండా కేవలం విజిటింగ్ వీసాపైనే ఏజెంట్లు వారిని అక్కడకు పంపించి చేతులు దులుపుకొంటున్నారు. ఇలాంటి మోసాలు కోకొల్లలుగా బయటపడుతున్నా... అమాయక ప్రజలు వారినే నమ్ముకొని నిండా మునుగుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల నుంచి గల్ఫ్కు వలసలు పెరిగాయి. ఊళ్లకు ఊళ్లే ఖాళీ.. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో 60 శాతం ఊళ్లు దాదాపు ఖాళీ అయ్యాయి. పోలేపల్లి, దాసర్లపల్లి, ముర్పునూతల, తెల్దేవర్పల్లి, పలుగుతండా వెంకటనాయక్ తండాల్లోని ప్రజలు వలసల బాటపట్టారు. చాలా ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. చందంపేట మండలం నుంచి గుంటూరు జిల్లా గురజాల, కారంపూడి, చిలుకలూరిపేటకు మిర్చి కోసేందుకు వెళ్లారు. మరికొందరు హైదరాబాద్లో ఆటో రిక్షా నడుపుకునేందుకు వెళ్లగా.. ఇంకొందరు ఫ్రూట్ మార్కెట్లో హమాలీలుగా పనుల కోసం వెళ్లారు. దేవరకొండ, ఆలేరు, మిర్యాలగూడ, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో ఎక్కువగా వలసలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, జుక్కల్, మద్నూరు, గాంధారి, తాడ్వాయి మండలాల నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్లకు రైతులు, కూలీలు వలస వెళ్తున్నారు. మహారాష్ట్రకు వెళ్తున్నవారు అక్కడ భూస్వాముల పొలాల వద్ద పంటల కాపలాదారులుగా పని చేస్తున్నారు. గోసగోస అయితంది.. మాకు రెండెకరాల భూమి ఉంది. నీళ్లు లేక బీడు పడింది. ఊళ్లె కైకిలి(కూలీ) పని కూడా దొరుకుత లేదు. ఉపాధి పని కూడా నడుస్తులేదు. గోసగోస అయితంది. పిలగాండ్ల చదువుకు, తిండికి తిప్పలైతంది. కరీంనగర్కు కూలీ పనికి వస్తున్న. నాలాంటోళ్లు చానా మంది వస్తున్నరు. మంది బాగా అయ్యేసరికి ఇక్కడ కూడా పని సరిగా దొరుకుతలేదు. - బానోతు తస్లీ, మల్చేరుతండా, హుస్నాబాద్ మండలం, కరీంనగర్ కూలీగా మారిన రైతు నాకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు చేసేటోన్ని. మూడేండ్ల నుంచి వానలు లేవు. బావిలో నీళ్లు పడలేదు. నాలుగు గజాల బండ కొట్టిచ్చిన. అయినా చుక్క నీళ్లు రాలే. లక్ష రూపాయలు ఖర్చయింది. పంట పండే పరిస్థితి లేదు. భార్యాపిల్లలను ఊళ్లో వదిలి కరీంనగర్లో కూలీ కోసం వచ్చి ఉంటున్న. నెలకు 20 రోజుల పని కూడా దొరుకుతలేదు. - పింకాసి బాలయ్య, వంతడుపుల, ఇల్లంతకుంట మండలం, కరీంనగర్ కొడుకులు పట్నం పోయిండ్రు ఎవసాయం ఎండి పోయింది. బోర్లు వట్టిపోయాయి. ఊర్లో ఉపాధి లేక నా కొడుకు భార్యాపిల్లల్ని వదిలి పట్నం పోరుుండు. ముసలి తనంలో తోడుగా ఉంటాడనుకుంటే కాలం పగబట్టింది. - కొయ్యడ ఆగయ్య, రామచంద్రాపూర్, బచ్చన్నపేట మండలం, వరంగల్ అప్పు తెగేదెప్పుడు..? ఇంటికి వచ్చేదెప్పుడు? ఈ కూలీ దంపతుల పేరు ఎదునూరి దేవయ్య, కనుకవ్వ. ఊరు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్. వీరికి రెండెకరాల భూమి ఉంది. వర్షాల్లేక బావి ఎండిపోయింది. పిల్లలు అనూష, ప్రశాంత్ చదువులు, కుటుంబ పోషణకు రూ.4 లక్షల అప్పు చేయాల్సి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ రెండు నెలలుగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. రోజుకు రూ.120 వస్తోంది. ఇది ఏ మూలకు సరిపోవడం లేదు. కుటుంబం గడిచేందుకు మస్కటే శరణ్యమనుకున్నాడు. రూ.70 వేలు అప్పు చేసి ఏజెంట్ చేతిలో పెట్టాడు. అక్కడ ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీ పనికోసం వీసా వచ్చింది. ఈ నెల 13న మస్కట్కు వెళ్లేందుకు విమానం ఎక్కబోతున్నాడు. అక్కడ రూ.15 వేలు జీతం వస్తుందని, రూ.5 వేలు తిండికి, ఉండడానికి సరిపోయినా.. నెలకు రూ.10 వేలు పంపిస్తే భార్యాపిల్లలు బతుకుతారని దీనంగా చెబుతున్నాడు. రూ.4 లక్షల అప్పు తీర్చడానికి ఎన్నేళ్లు పడుతుందో.. కాలమే సమాధానం చెప్పాలి! ఉపాధి కూలీకి పైసలేవీ? ఉపాధి హామీ పనులు ఆశించిన మేరకు సాగడం లేదు. రెండునెలలుగా పనిచేసినా కూలీలకు వేతనాలు అందడం లేదు. దీంతో చాలామంది కూలీలు పనికి వెళ్లడం మానేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకానికి రూ.500 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర సర్కారు రూ.100 కోట్లే విడుదల చేసింది. మిగతా రూ.400 కోట్లు ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు అందడం లేదు. -
'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి'
-
ఎలుగుబంటి దాడి: ఒకరికి గాయాలు
శ్రీకాకుళం: పరిశ్రమలోకి ప్రవేశించిన ఎలుగుబంటి నానా బీభత్సం సృష్టించి.. కార్మికులపై దాడి చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని కాకరపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామంలోని ఈస్ట్కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ లేబర్ కాలనీలోకి ప్రవేశించిన ఎలుగుబంటి అడ్డొచ్చిన వారిపై దాడికి దిగింది. ఎలుగుబంటి బారిన పడిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా.. అడవిలో కట్టెలు కొడుతున్న కూలీల వద్దకు వెళ్లి దాడి చేసింది. అయితే వారు తిరగబడి ఎలుగు బంటిని గొడ్డలితో నరికి చంపేశారు. అప్పటికే ఇద్దరు కూలీలను ఆ ఎలుగుబంటి గాయ పరచినట్టు సమాచారం. -
పని అక్కడ.. జీతమిక్కడ!
కామారెడ్డిలో కట్టుబానిసత్వం నేతల ఇళ్లల్లో బల్దియా కార్మికులు కొందరు నాయకుల వాహన చోదకులు కూడా వారే ఏటా రూ.15 లక్షల మున్సిపల్ నిధులు దుర్వినియోగం కామారెడ్డి (నిజామాబాద్): మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను తమ ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించుకోవడం నేతలు, ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. అంట్లు తోమడానికి, వా హనాలకు డ్రైవర్లుగా కూడా వారినే వినియోగించుకుంటున్నారు. వారికి వేతనాలు మున్సిపాలిటీ నుంచే అందుతాయి. కామారెడ్డి పట్టణంలో గడచిన పదిహేనేళ్లుగా కొనసాగుతున్న వ్యవహారం ఇది. మున్సిపాలిటీలో 30 మంది రెగ్యులర్ కార్మికులు కాగా, 281 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరిలో 155 మంది పారిశుధ్య విభా గంలో, 118 మంది నీటి సరఫరా, వీధి దీపాల విభాగంలో పనులు చేస్తుంటారు. మరో ఎనిమిది మంది కార్యాలయంలో పని చేస్తారు. పారిశుధ్య కార్మికులుగా, నీటి స రఫరా విభాగంలో పని చేసేవారిగా రికార్డులలో పేరున్న 15 మంది కార్మికులు మాత్రం నేతల ఇళ్లలోనే కనిపిస్తారు. అక్కడ అంట్లు తోమడం, ఇళ్లు ఊడ్చడం నుంచి ఇం టి పనులన్నీ వారే చేస్తారు. కొందరు నేతల వాహన డ్రైవర్లకు కూడా మున్సిపాలిటీయే వేతనం ఇస్తుంది. ఎందుకంటే డ్రైవర్ల పేర్లు కాంట్రాక్టు కార్మికుల జాబితాలో ఉం టాయి కాబట్టి. మున్సిపాలిటీలో నడిచేది నేతల పెత్తనమే కాబట్టి అలా సాధ్యమవుతుంది మరి. ఇది ఏదో అధికార పార్టీ ఒక్కదానికి చెందిన నేతలకు సంబందించిన ఇష్యూ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఎవరూ ప్రశ్నించకుండా అన్ని పార్టీల నేతల ఇళ్లల్లో కార్మికులు పనిచేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలలో గుర్తింపు పొందిన నేతలు, సీనియర్ కౌన్సిలర్లు, ప్రస్తుత ప్రజాప్రతినిదులు, మాజీ ప్రజాప్రతినిధులు.. ఇలా అందరి ఇళ్లల్లో మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు.దీంతో ము న్సిపాలిటీలో ప్రశ్నించేవారు లేకుండాపోయారు. ఏదైనా అందరూ కలిసే పంచుకునే పద్ధతికి అలవాటుపడిన వారు పని వారిని కూడా పంచుకుని ఇంటి పనిమనుషుల ఖర్చును తమ బడ్జెట్ నుంచి తొలగించుకున్నారు. ఏటా రూ. 15 లక్షలు దుర్వినియోగం ఒక్కో కార్మికునికి రూ. 8,200 వేతనంగా లభిస్తుంది. ఈ లెక్కన నేతల ఇళ్లలో పని చేసే 15 మంది కార్మికులకు నెలకు రూ.1.23 లక్షలు, ఏడాదికి రూ. 15 లక్షల వరకు ప్రజాధనం నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. గడచిన పదిహేనేళ్లుగా మున్సిపాలిటీలో ఈ విధానం అమలు అవుతుందంటే రూ.కోటికిపైగా ప్రజాధనం దుర్వినియోగమై ందనే విషయం స్పష్టమవుతోంది. ప్రజాధనాన్ని నేతల సొంతానికి వాడుకుంటుండడం బహిరంగ రహస్యం.ఇంత జరుగుతున్నా ఎవరూ నోరుమెదపరు. కాగా ప్రజలు చెల్లించే పన్నులతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పారిశుద్యం, నీరు, వీధిదీపాల వంటి సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం ప్రజాధనాన్ని నేతల ఇళ్లలో పనిచేసే కార్మికులకు వెచ్చిస్తూ దుర్వినియోగానికి తమవంతు సహకారం అందిస్తున్నారు. నేతల తీరు మారాలి ప్రజలకు సేవ చేయాల్సిన కార్మికులను తమ ఇళ్లల్లో పనిచేయించుకునే నేతల ఆలోచనలలో మార్పు రావలసిన అవసరం ఉంది. ఏళ్ల తరబడిగా కార్మికులను తమ ఇం టి పనిమనుషులుగా, డ్రైవర్లుగా వాడుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలలో నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నేతలు స్వ చ్ఛందంగా ముందుకు కార్మికులను మున్సిపాలిటీకి అప్పగించాలని పలువురు కోరుతున్నారు. -
ఉపాధికి భరోసా!
వలసలు నివారణే లక్ష్యంగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పురుడు పోసుకుంది. కరువు జిల్లా ‘అనంత’లో 7.65 లక్షల మంది కూలీలు ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు అమలు చేయాలని భావిస్తుండడంతో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో కేవలం 17 మండలాల్లో తప్పా మిగిలిన మండలాల్లో పథకాన్ని తొలగిస్తున్నారని కూలీలు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు సాక్షి వీఐపీ రిపోర్టర్ హోదాలో డ్వామా పీడీ ఎ. నాగభూషణం నడుంబిగించారు. ముదిగుబ్బ మండలంలోని సానివారిపల్లి, ఎనుములవారిపల్లి, కొండగుట్టపల్లి తదితర గ్రామాలలో పర్యటి ంచారు. కూలీల సమస్యలు విన్నారు. జనవరి నెలాఖరులోగా బకాయి వేతనాలను చెల్లిస్తామని, పని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే బాధ్యత తనదని ... పనిలేక ఏ ఒక్కరూ పట్టణాలకు వలస పోకూడదని భరోసా కల్పించారు. నాగభూషణం : ఏమ్మా. బాగున్నారా. నీ పేరేంటి.? కూలీ : నా పేరు నారాయణమ్మ సార్. 15 రోజుల నుంచి పనులు పెడుతున్నారు. దీంతో బాగానే ఉన్నాం. నాగభూషణం : ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించకపోతే మీకు ప్రత్యామ్నాయం ఏమిటి? నారాయణమ్మ : మా ఊళ్లో యవసాయ పనులు తక్కువ. ఎండాకాలంలో కరువు పని మాత్రమే మాకు దిక్కు. లేకుంటే కేరళాకు వెలుతాం. ఇప్పటికే మా ఊళ్లో 50 మంది వరకూ పోయారు. పనులు పెట్టారని తెలిస్తే వారు తిరిగొస్తారు. నాగభూషణం : వలస వెళితే ఊరుగాని ఊరు. ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి వారికి కూడా తిరిగి గ్రామానికి రమ్మని చెప్పండి. నాగభూషణం : ఏమయ్యా. పనులు బాగా పెడుతున్నారా.? ఎంత మంది చేస్తున్నారు? రాము : 15 రోజుల నుంచి పనులు పెడుతున్నారు. ఇప్పుడు ఐదు శ్రమశక్తి గ్రూపులలోని కూలీలందరం ఇక్కడ పనిచేస్తున్నాం. ఇట్లాగే పని పెట్టాలని చెప్పండయ్యా. నాగభూషణం : తప్పకుండా అందరికీ పనులు కల్పించాలని మీ అధికారులకు ఆదేశిస్తా. మీ పనిరోజులు పూర్తయినా సరే వాటర్షెడ్ గ్రామాల్లో పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటా. నాగభూషణం : ఏమయ్యా. నీకు సమస్యలేమైనా ఉన్నాయా? గణేష్ : 2006 నుంచి ఉపాధి పనులకు వస్తున్నా. 100 రోజులు మాత్రమే పనిదినాలు అంటున్నారు. ఆ తర్వాత ఉపాధి పనికి రాకూడదని చెబుతున్నారు. దీనివల్ల మాలాంటోళ్లు ఇబ్బందులు పడుతున్నాం. 150 రోజులు చేస్తే బాగుంటుంది. నాగభూషణం : ఏమయ్యా. నీ పేరేమిటి? ఉపాధి పనులు లేనప్పుడు ఏ పనికి వెలతావు? కూలీ : నాపేరు రహంతుల్లా సార్. కరువు పని లేకపోతే వ్యవసాయ పనులకు వెలుతాను. ఆ పనులు లేకపోతే ఇంటి దగ్గర ఉండాల్సిందే. నాగభూషణం : రోజూ నీ కూలీ ఎంతో తెలుసుకున్నావా.? రహంతుల్లా : నాకు తెలియదు సార్. రోజూ పనికి వస్తా. వారంనాపొద్దు అందరం పంచుకుంటాం. ఎంత వస్తే అంత తీసుకుంటా. నాగభూషణం : ఉపాధి కూలీల దినసరి వేతనం ఒకప్పుడు రూ. 149 ఉండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 169 చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనం అమల్లోకి వస్తుంది. జనవరిలోగా గతంలో మీరు చేసిన పనులకు రూ. 20 చొప్పున బకాయి వేతనం చెల్లిస్తాం. నాగభూషణం : ఏమ్మా. ఉపాధి పథకం వలన మీరు ఏ విధంగా లబ్ధిపొందుతున్నారు.? పఠాన్ వన్నూర్బీ : సార్. మాకు పని లేకపోతే వలస పోవాల్సిందే. దీంతో వలస పోకుండా గ్రామాల్లో ఉన్నాం. మా ఊరు నుంచే పతి సంవత్సరం 60,70 కుటుంబాలు పోయేటోళ్ళం. ఈ పథకం వలన గామంలోనే పనులు దొరుకుతున్నాయి. నాగభూషణం : ఏమయ్యా పనుల వద్ద అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారా? వెంకట్రాముడు : రోజూ ఒక్కడికి నూరు మంది వరకూ పనులకు వస్తున్నాం. నీళ్లు తెప్పిస్తున్నారు. ఎండ లేకపోవడంతో పట్ట(షామియానా) తెచ్చుకోలేదు. నాగభూషణం : ఏమ్మా. ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు సరిపోతున్నాయా? డబ్బులన్నీ దేనికి ఖర్చు చేస్తున్నారు.? రత్నమ్మ : మా ఆయన..నేను ఇద్దరం కష్టపడుతున్నాం. ప్రభుత్వం నుంచి వస్తున్న కూలీ డబ్బులు ఇంట్లోకి సరిపోతున్నాయి. పిల్లలను చదివించుకుంటున్నాం. ఇబ్బంది లేకుండా జరిగిపోతోంది. ఏమంటే గతంలో చేసిన పనులకు డబ్బులు ఇప్పటి రాలేదు? నాగభూషణం : ఫినో ఏజెన్సీ తప్పుకోవడంతో పోస్టాఫీసు ద్వారా డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేశాం. దీని వల్ల ఆలస్యమయింది. జనవరి నెలాఖరులోగా బకాయి డబ్బులన్నీ చెల్లిస్తాం. జనవరి నుంచి సక్రమంగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. నాగభూషణం : ఏం పెద్దాయన నువ్వూ పనికొచ్చావా? అందరితో పాటు చేయగలవా? బికారి (వయస్సు 60 సంవత్సరాలు): సార్ పని వరకూ భయం లేదు. అందరితో పాటు చేయగలను. పనిచేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాలాంటి వారి కోసం కొంచెం సులభంగా ఉండే పనులు పెడితే బాగుంటుంది. నాగభూషణం : ఏమ్మా. పనులు గట్టిగా ఉన్నాయి కదా? నీకు ఏమి ఇబ్బంది లేదా? గాయత్రి : కందకాలు తీయాలి కాబట్టి లోపలి నుంచి రాళ్లు వస్తున్నాయి. భూమి గట్టిగా ఉంది. అయినా పర్వాలేదు. మగవారితో సమానంగా కూలీ తీసుకుంటున్నా. నాగభూషణం : ఏమయ్యా. నీకు ఏమైనా సమస్యలున్నాయా? ఓలప్ప : పనుల వద్ద మాకు ఏమి సమస్యలు లేవు. రాను పోనూ చార్జీలు రూ. 30 అవుతోంది. దీంతో ఇబ్బంది అవుతోంది. నాగభూషణం : పని కల్పించే ప్రదేశం ఐదు కిలోమీటర్లు దాటితే ప్రభుత్వం నుంచి అదనంగా కూలీ రేటు పెరుగుతుంది. అంతే తప్పా చార్జీలు ఇవ్వడానికి పథకంలో వెసులుబాటు లేదు. నాగభూషణం : ఉపాధి పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుతున్నావు.? శ్రీనివాసులు(పొలం యజమాని) : ఉపాధిహామీ పథకం నాకు ఎంతో మేలు చేసింది. కొన్నేళ్ల నుంచి బీడుగా ఉన్న భూమిలో మామిడి మొక్కలు నాటాను. ప్రస్తుతం జల సంరక్షణ పనులు కింద పొలం చుట్టూ కందకాలు తవ్విస్తున్నా. ఇది పొలంకు కంచెలా ఉపయోగపడుతుంది. నాగభూషణం : శ్రమశక్తి సంఘాలను అభివృద్ధి చేస్తున్నావా? ఎన్ని రోజుకొకసారి సమావేశం నిర్వహిస్తున్నావ్? అల్లాబకాష్ (మేట్ ) : గ్రామంలో 20 గ్రూపులున్నాయి. ప్రతి రెండు మూడు నెలలకొకసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. నాగభూషణం : అట్లా కుదరదు. ప్రతి వారం శ్రమశక్తి సంఘాల సమావేశం పెట్టుకోవాలి. దీని వలన కూలీల సమస్యలు తెలుసుకోవడానికి సులభతరంగా ఉంటుంది. గ్రామం నుంచి పనిలేక వలస పోయారంటే నీవే బాధ్యత వహించాలి. నాగభూషణం : ఏమయ్యా పండ్ల తోటల పెంపకం ఏ విధంగా ఉంది? మొక్కలన్నీ బతికాయా? రాముడు (రైతు, ఎనుములవారిపల్లి): బీడుగా ఉన్న పొలంలో ఉపాధి పథకం ద్వారా పండ్లతోటల పెంపకం చేపడుతున్నా. పొలంలో తవ్విన ఫారంఫాండ్లో ఇప్పటి నీరు పుష్కలంగా దొరుకుతోంది. దీంతో చెట్లన్నీ కాపాడుతున్నా. ఏ ఒక్కటీ చనిపోలేదు. నాగభూషణం : మూగజీవాలకు ఫారంఫాండ్ ఉపయోగపడుతోందా? కొండప్ప (గొర్రెల కాపరి, కొండగుట్టపల్లి) : సార్. నాకు 70 గొర్రెలు ఉన్నాయి. చుట్టుపక్కల వెతికినా నీరు లేదు. దీనిపై ఆధారపడే జీవాలు సాకుతున్నా. మంచి ఆదాయం పొందుతున్నాం. నాగభూషణం : గొర్రెల సంరక్షణలో ఏవైనా ఇబ్బందులు పడుతున్నారా? జయప్ప(గొర్రెల కాపరి) : ఈ నెలరోజులు పోతే గొర్రెలకు ఎక్కడా తినేందుకు మేత కూడా దొరకదు. ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. గ్రాసం, దాణా, వైద్య సదుపాయం కల్పించాలి. నాగభూషణం : సమగ్ర వాటర్షెడ్ పథకంలో జీవనోపాదుల పెంపు కార్యక్రమం ద్వారా దాణా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటా. పనిదినాలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన ఉపాధి హామీ పథకంలో 100 రోజులు మాత్రమే పని కల్పన నిబంధనతో అనర్హులుగా మిగిలిపోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేయడంలో డ్వామా పీడీ నాగభూషణం స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ద్వారా కరువు జిల్లా అనంతలో ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచాలని కోరుతూ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఐదెకరాలలోపు ఉన్న సన్న,చిన్న కారు రైతులకు పండ్లతోటల పెంపకం, ఇతర సంక్షేమ కార్యక్రమాలలో లబ్ధి పొందేందుకు అవకాశముందని తెలిపారు. అయితే ఇది పదెకరాల వరకూ పెంచాలని జిల్లా పరిషత్ జనరల్బాడీ మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. రోజూ రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉపాధి పథకంపై కూలీలు పెట్టుకున్న అపోహలన్నీ చైతన్య రథం కార్యక్రమం ద్వారా తొలగిస్తామని అన్నారు. జిల్లాలో 63 మండలాల్లోనూ పథకం ఉంటుందన్నారు. సెప్టెంబర్ నుంచి నిలిచిపోయిన బకాయిలు, ఏప్రిల్ నుంచి పెరిగిన రూ. 20 వేతనంతో మొత్తం రూ. 21 కోట్లు చెల్లించాల్సి ఉందని, జనవరి నెలాఖరులోగా ఈ మొత్తం కూలీల చేతికందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 100 రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న వారికి వాటర్షెడ్ గ్రామాల్లో పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా సిబ్బందిని ఆదేశించారు. -
చేయి చేయి కలిపారు...
ప్రొద్దుటూరు: రోడ్డులో కంకర రాళ్లను ఏరివేస్తున్న వీరంతా కూలీలు కాదు.. ప్రొద్దుటూరు మండలం మీనాపురం గ్రామస్తులు.. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ఆదివారం తమ గ్రామానికి చెందిన రోడ్డును బాగు చేసుకున్నారు. ప్రభుత్వం నంగనూరుపల్లె నుంచి ఈ గ్రామం మీదుగా గండ్లూరు కొట్టాలు వరకు రోడ్డు నిర్మించేందుకు గత ఏడాది రూ.30లక్షల నిధులు మంజూరు చేసింది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ రోడ్డు నిర్మాణానికి అధికారులు సిద్ధపడ్డారు. అయితే కాంట్రాక్టర్ ముందుగా మెటల్రోడ్డును నిర్మించి మధ్యలో వదిలేశారు. ఇందుకు గాను రూ.20లక్షల వరకు బిల్లు చేసుకున్నట్లు సమాచారం. తర్వాత ఈ రోడ్డు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల బెడద కారణంగా మెటల్రోడ్డు దెబ్బతిని గులకరాళ్లు లేచాయి. దీంతో నడవలేని పరిస్థితి. సైకిల్ ఎక్కడ పంచర్ అవుతుందోనని విద్యార్థుల ఆందోళన. ఆటోడ్రైవర్లు కూడా గ్రామానికి వచ్చే వారు కాదు. ప్రాధేయపడితే రూ. 200 డిమాండ్ చేసేవారు. గ్రామస్తులు ప్రత్యామ్నాయంగా పక్కనున్న రైతు పొలంలో దారి తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రైతు పొలం సాగు కోసం రోడ్డును పూడ్చివేశాడు. ఇక లాభం లేదనుకుని గ్రామస్తులు ఒక్కసారిగా చేయి చేయి కలిపారు. ఆదివారం అందరూ ఏకమై కిలోమీటరు పొడవునా ఉన్న గులకరాళ్లను ఏరివేసి రోడ్డును బాగు చేసుకున్నారు. -
రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం, ముగ్గురి మృతి
కరీంనగర్ జిల్లా రామగుండం జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లో ప్రమాదం సంభవించింది. ప్లాంట్పై నుంచి పడి ముగ్గురు కార్మికులు మరణించారు. గురువారం కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన కార్మికులను సుదర్శన్, వెంకటరత్నం, మునీర్గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
‘చేనేత’కు కత్తెర
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: జిల్లాలో చేనేత రంగం కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. చేనేత ఉత్పత్తులు తగ్గడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కరువైంది. కష్టకాలంలో ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చేయి చూపాయి. అదీగాక చేనేత సహకార సంఘాలకు అందించే మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీం, చేనేత అమ్మకాలపై అందజేసే పది శాతం రిబేట్ పథకాన్ని ఎత్తివేయాలని నిర్ణయం ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై చేనేత సహకార సంఘాల కార్మికులు, ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సంఘాల పరిస్థితి ఇది.. జోగిపేట, నారాయణఖేడ్, దుద్దెడ, దుబ్బాక, సిద్దిపేటలో చేనేత సహకార సంఘాలు కొంత చురుగ్గా పనిచేస్తున్నాయి. ఆయా సంఘాల్లోని కార్మికులు ఉత్పత్తులను తయారు చేయడంతోపాటు బహిరంగ మార్కెట్లోనూ విక్రయిస్తున్నారు. ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ పథకాన్ని అమలు చేస్తుంది. ఏడాదిలో తయారు చేసిన ఉత్పత్తులు, అమ్మకాలపై పరిగణలోకి తీసుకుని వాటిలో పది శాతం మొత్తాన్ని ఈ పథకం కింద సహకార సంఘాలకు నేరుగా నిధులు అందేవి. గత ఏడాది జోగిపేట, నారాయణఖేడ్, దుద్దెడ, దుబ్బాక, సిద్దిపేటలోని చేనేత సహకార సం ఘాలు బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 1.73 కోట్ల అమ్మకాలు చేశాయి. దీంతో మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీం కింద రూ.5.86 లక్షల ఇన్సెంటివ్(పోత్సాహక నిధు లు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయి. అయితే ప్రస్తుత ఏడాది నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీంను ఎత్తివేసినట్టు సమాచారం. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాల మనుగడపై తీవ్ర ప్రభావం చూపనుందని సహకార సంఘానికి చెందిన అధికారి ఒకరు తెలి పారు. ఇన్సెంటివ్ స్కీం కింద నిధులు నిలిపివేయటంతో సహకార సంఘాల మూల నిధి నిల్వలు తగ్గి తద్వారా చేనేత ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పని తగ్గి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సహకార సంఘాల వారు మండిపడుతున్నారు. వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిబేటుపైనా.. చేనేత ఉత్పుత్తులను ఎక్కువ శాతం ఆప్కో కొనుగోలు చేస్తుంది. మిగితా ఉత్పత్తులను సహకార సంఘాల వారు విక్రయ కేంద్రాలు, ఎగ్జిబిషన్లలో అమ్ముతుంటారు. అమ్మకాలను పెంచేందుకు ప్రభుత్వం ఎగ్జిబిషన్ అమ్మకాలపై పది శాతం రిబేటు ఇచ్చేందుకు సహకార సం ఘాలకు వీలు కల్పించింది. పది శాతం రిబేటు సొమ్మును సహకార సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం తర్వాత జమచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం రిబేటుగా ఇచ్చే నిధులను సైతం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీం, పది శాతం రిబేటు ఎత్తివేతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులకు అందాల్సి ఉందని చేనేత, జౌళి శాఖ ఏడీ రమేశ్ తెలిపారు. -
టాన్స్కో పనుల్లో అక్రమాలపై నివేదిక ఇచ్చిన సీజీఎం
సాక్షి, నిజామాబాద్: విద్యుత్ శాఖలో అక్రమాల డొంక కదులుతోంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధికారులు., కాంట్రాక్టర్లు కలిసి ఈ పనుల్లో నాణ్యతను గాలికొదిలేశారు. నిజామాబాద్ నగరంతో పాటు, కామారెడ్డి, బోధన్ పట్టణాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ పనులను ఇష్టారాజ్యంగా చేసినట్లు విచారణాధికారులు నిర్ధారణకు వచ్చారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, పలుచోట్ల వీటిని ఏర్పాటు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు తేలింది. కొత్త విద్యుత్ లైన్లు చాలా కాలం మన్నాలంటే నైపుణ్యం (స్కిల్డ్ లేబర్) కలిగిన కార్మికులతో పనులు చేయించాలనేది నిబంధన. అయితే కాంట్రాక్టర్లు ఈ నిబంధనను గాలికొదిలేసి అన్ స్కిల్డ్ లేబర్తో పని కానిచ్చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు కూడా కాంట్రాక్టర్లకే వత్తాసు పలికినట్లు తెలిసింది. ట్రాన్స్ఫార్మర్లకు బిగించిన ఏబీ స్విచ్లు కూడా నాణ్యత లేనివి వినియోగించడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరా యం ఏర్పడుతున్నట్లు తెలిసింది. పనుల్లో నాణ్యత లోపించడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని ఏఈలు సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక సమర్పించిన విచారణాధికారులు పట్టణ ప్రాంత వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలనే లక్ష్యంతో జిల్లాలో తొమ్మిది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, లైన్ల పొడువును పెంచడం, లోఓల్టేజీ సమస్యను అరికట్టేందుకు కొత్త ట్రాన్స్ఫార్మార్ల ఏర్పాటు, సబ్స్టేషన్ల నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్ర విచారణకు అదేశించిన విష యం విధితమే. విచారణాధికారిగా డిస్కం సీజీఎం సంధ్యారాణిని నియమించారు. ఆమె వారం రోజుల క్రితం జిల్లాకు వచ్చి విచారణ జరిపారు. పనులు జరిగిన చోట్లకు వెళ్లి పరిశీలించారు. పనుల్లో జరిగిన అక్రమాలన్నీ ఆమె దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంధ్యారాణి ఇటీవల విచారణ నివేదికను కార్తికేయమిశ్రకు సమర్పించినట్లు సమాచారం. అధికారులపై వేటు.? విచారణాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలుండే అవకాశాలున్నాయని విద్యుత్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఒకరిద్దరు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులపై కూడా వేటు పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించామని ట్రాన్స్కో అధికారులు బయటకు చెబుతున్నారు. గ్యారంటీ పీరియడ్లో లోపాలు తలెత్తిన పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్లతో సరిచేయిస్తామని అంటున్నారు.