mala mahanadu
-
వర్గీకరణ రివ్యూ పిటిషన్పై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాల్ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని, తీర్పును రివ్యూ చేయాలంటూ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ ఎంపీ హర్ష కుమార్లు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెడుతూ.. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.‘‘వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.కేసు వివాదం..ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది.దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది. -
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
-
చంద్రబాబు దళితులను మోసం చేశారు: మంగరాజు
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి బిగ్ షాక్
-
మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న మహోన్నత ఆశయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనారాజు పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా విజయవాడలో సోమవారం మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీనగర్లోని ధర్నా చౌక్లో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా ముగిసింది. యోనారాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు దీక్షలు తలపెట్టామని, ఏలూరు జిల్లాలో పూర్తిచేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. -
మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులకు మాల మహానాడు మద్దతు ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మంగరాజు తెలిపారు. ‘‘దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. అమరావతి రైతులు ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి రాజధాని కావాలంటున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని’’ మంగరాజు హెచ్చరించారు. చదవండి: AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం -
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా శ్రీనివాస్
పంజగుట్ట: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్యపరచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కోరారు. బుధవారం మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇటీవల మాల మహానాడు రాష్ట్ర కమిటీ రద్దు చేసిన నేపథ్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునిగా జంగా శ్రీనివాస్ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాల మహేశ్, గ్రేటర్ అధ్యక్షునిగా బైండ్ల శ్రీనివాస్ను నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పీవీ రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయా లని, రాష్ట్రంలో మాలలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ముందుండాలని కోరారు. -
‘బినామీ గద్దలకోసం బాబు ఉద్యమం’
తాడికొండ: చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని పీవీరావు మాలమహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు విమర్శించారు. అధికారం కోసం దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నేడు పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే అడ్డుకునేందుకు తన బినామీలైన పెద్దగద్దల కోసం ఉద్యమం చేయడం సిగ్గుచేటన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షల్లో 33వ రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధాని పేరిట మూడు పంటలు పండే భూములను సేకరించిన చంద్రబాబు అగ్రవర్ణాలకు ఒక ప్యాకేజీ, దళితులకు మరో ప్యాకేజీ ఇచ్చి మోసం చేశారని చెప్పారు. మాదిగ ఆరి్థక చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బేతపూడి సాంబయ్య మాట్లాడుతూ రాజధాని పూలింగ్కు బేతపూడిలో 60 సెంట్లు ఇచి్చన తనకు సామాన్య ప్యాకేజీ ఇచి్చన చంద్రబాబు అగ్రవర్ణాలకు అగ్ర ప్యాకేజీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులరి్పంచారు. -
బాబు పెట్టుబడి ఉద్యమాన్ని తిప్పికొడతాం
సాక్షి, విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని పెంచి పోషించేందుకే అమరావతిలో రాజధాని పెట్టాలనుకొన్నారని దళిత నేతలు వ్యాఖ్యానించారు. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. కుట్రలు మానకపోతే ఐక్య దళిత వేదిక ఏర్పాటు చేసి బాబుకు బుద్ధి చెపుతామన్నారు. మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు తెలిపేందుకు దళిత సంఘాలు ఏకమయ్యాయి. ఈ మేరకు మాదిగ దండోరా, మాల మహానాడు నేతలు విజయవాడ ప్రెస్క్లబ్లో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం దళిత నేతలు మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయమన్నారు. అది పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇక టీడీపీ పాలనలో రాజధాని దళిత రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న పెట్టుబడి ఉద్యమాన్ని తిప్పికొడతామని హెచ్చరించారు. -
ఆంధ్రప్రదేశ్కు మందకృష్ణ బద్ధ శత్రువు
సాక్షి, విజయవాడ: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయం చేసి.. పడ్బం గడుపుకోవాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్కుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు మందకృష్ణ బద్ధ శత్రువు అని ఆయన మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని గుమ్మపు సూర్యప్రసాద్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి.. సీఎంస వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారని, మందకృష్ణ మాటలకు ఎవరు భయపడబోరని ఆయన పేర్కొన్నారు. మందకృష్ణది హేయమైన చర్య.. మందకృష్ణ మాదిగపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంతో చర్చలు జరపకుండా 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం హేయమైన చర్య అని అన్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం కాదని, సీఎం వైఎస్ జగన్ను బ్లాక్మెయిల్ చేసేందుకేనని పేరుపోగు వెంకటేశ్వరరావు మండిపడ్డారు. -
‘సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు’
సాక్షి, అమరావతి : నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాల మహానాడు నాయకులు అశోక్ కుమార్, సూర్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా భారీ సంఖ్యలో దళితులకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టారని గుర్తుచేశారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మాత్రం ఎల్లప్పుడు మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయితే సీఎం జగన్ మాత్రం ఇరు సామాజిక వర్గాలను సమానంగా చూస్తున్నారన్నారు. అటువంటి జననేతపై మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. -
ఏ పార్టీకి మద్దతిచ్చేది 4న నిర్ణయిస్తాం: చెన్నయ్య
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిచ్చేది నవంబర్ 4న నిర్ణయిస్తామని మాల మహా నాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. మాల ల మనోభావాలకు దగ్గరగా ఉండే పార్టీకే మద్దతిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగారాం అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. నవంబర్ 4న మింట్ కాంపౌండ్లో మాల మహా నాడు కమిటీ సమావేశమై మద్దతుపై నిర్ణయం తీసుకుంటుందని చెన్నయ్య చెప్పారు. -
మాల మాదిగలకు సమానంగా టికెట్లివ్వాలి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల మాదిగలకు సమానంగా టికెట్లు ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ..అన్ని పార్టీలు ప్రకటించబోయే మేనిఫెస్టోలో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రూ.5 లక్షల వరకు ఇవ్వాలని, సబ్ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించేలా కమిటీని ఏర్పాటుచేయాలని, అర్హులైన దళితులందరికీ ఇళ్లు నిర్మించాలని, మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంకు రుణాలు రూ.20 లక్షలకు పెంచి ప్రోత్సహించాలనే డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సరసాదేవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్యామ్కుమార్, సాయి, దేవిక, రాజ్కుమార్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రవర్ణాల లబ్ధి కోసమే వర్గీకరణ డ్రామా
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాలు లబ్ధి పొందేందుకే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ డ్రామా ఆడుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. వర్గీకరణ అంశానికి కాలం చెల్లిందని, దళితులు ఈ డిమాండ్ కోరుకోవడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల్లో మాల, మాదిగలు, ఎస్టీల్లో లంబాడ, ఆదివాసీల మధ్య గొడవలు సృష్టించి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని చెన్నయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ పార్టీల వైఖరిని మాలమహానాడు ఖండిస్తోందన్నారు. అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనను రాజకీయ పార్టీలు విరమించుకోవాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దళితులు వ్యతిరేకిస్తున్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు జంగా, భగవాన్ దాస్, బి.సాయి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నుంచి బయటకు వచ్చేయాలి
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): దళితులపై వివక్ష చూపుతున్న టీడీపీ నుంచి ఎస్సీలు బయటకు వచ్చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య పిలుపునిచ్చారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో భారీ నీటిపారుదల, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖలు దళితులకు కేటాయించారని, చంద్రబాబు మంత్రివర్గంలో మాత్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిథ్యం కొరవడిందన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులతో పాటు, రాజ్యసభ సీట్లను అగ్రవర్ణాలకే కేటాయించారని గుర్తు చేశారు. టీడీపీ పోలిట్బ్యూరో నుంచి ఎంపీ శివప్రసాద్ను సైతం తొలగించారన్నారు. కాపుల మెప్పు కోసం పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజన మండలిలో పార్టీ నాయకులను నామినేట్ చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి తీసుకురావడం వల్లే గిరిజన సలహా మండలి నియమించారన్నారు. -
...ప్రాబ్లమ్ నహీ!
గష్మీర్ మహాజని, స్పృహా జోషి జంటగా నటించిన మరాఠీ సినిమా ‘మలా కాహీచ్ ప్రాబ్లమ్ నాహీ!’. సమీర్ విద్వాంశ్ దర్శకత్వంలో రీచా సిన్హా, రవి సింగ్ నిర్మించిన ఈ సిన్మా పాటలను మరాఠీ చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది. పాటలు, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. హృషికేశ్, సౌరభ్, జస్రాజ్లు సంగీతమందించిన పాటల్లో ఎమోషనల్, లవ్, రొమాంటిక్ మెలోడీస్ ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 28న ‘మలా కాహీచ్ ప్రాబ్లమ్ నాహీ!’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెంకయ్యనాయుడు తీరు దారుణం
ఆచంట : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవ చూపడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ధ్వజమెత్తారు. ఆచంట మండలంలోని దళిత ప్రజాప్రతినిధులను స్థానిక రామేశ్వరస్వామి సత్రంలో గురువారం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేష్ మాట్లాడుతూ కనీసం వార్డు సభ్యునిగా కూడా గెలవలేని వెంకయ్యనాయుడుకు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని కోరిన ఆయన ఇప్పుడు మాటమార్చి తన నైజాన్ని బయటపెట్టారన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను మానుకోకపోతే వెంకయ్యనాయుడుకు, తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడతామన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమానికి ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు ప్రధాన కార్యదర్శి కొల్లాపు వేణు, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, కోశాధికారి ఏనుగుపల్లి చంద్రశేఖర్, ఆచంట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిసరెళ్ల శ్రీనివాస్, పోడూరు మండల అధ్యక్షుడు నేలపాటి రాజబాబు, ఆచంట, పెనుగొండ మండలాల అధ్యక్షులు రావి నాగరాజు, బల్లాశ్రీనివాస్, పోడూరు మండల ఉపాధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, ఆచంట యువజన విభాగం అధ్యక్షుడు కట్టా శిరీష, సర్పంచ్ బీర తిరుపతమ్మ, ఎంపీటీసీ కట్టా జాన్మోషే, జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్ పాల్గొన్నారు. -
‘వెంకయ్య పంచెలు ఊడదీసి తరుముతాం’
నెల్లూరు(సెంట్రల్): ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ, మాలల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పంచెలు ఊడదీసి తరుముతామని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల సుదర్శన్ హెచ్చరించారు. నెల్లూరులో ఆదివారం జరిగిన మాల మహానాడు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాల, మాదిగల మధ్య కావాలనే వర్గీకరణ పేరుతో వెంకయ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాలలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తు న్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల మొత్తాన్ని టీడీపీ నాయకులకే ఇస్తున్నారని విమర్శించారు. మాలల ఓట్లతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు, వెంకయ్యలకు బుద్ధి చెబుతామన్నారు. నెల్లూరులో జూలై 25న పెద్ద ఎత్తున మాలల సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వర్ణా వెంకయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్రెడ్డి ఇంటి ముట్టడి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇంటిని మాలమహానాడు నేతలు ముట్టడించారు. బుధవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటానికి నిరసనగా.. గురువారం మాలమహానాడు కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటిని ముట్టడించడానికి యత్నించడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
ఎస్సీలను వర్గీకరించవద్దు
కేంద్ర మంత్రి గెహ్లాట్, ఏచూరిలకు మాల మహానాడు వినతి న్యూఢిల్లీ: ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ వద్దని కోరుతూ కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు వినతిపత్రాలు సమర్పించారు. సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులను గౌరవించి వర్గీకరణకు సహకరించవద్దని వారిని కోరారు. మనువాదులతో కుమ్మకై దళితులను చీల్చే కుట్ర: రామూర్తి ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ మనువాదులతో కుమ్మకై దళితులను చీల్చే కుట్ర పన్నుతున్నారని తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పసుల రామూర్తి విమర్శించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అగ్రవర్ణ నాయకులకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం ద్వారా వచ్చే ఫలాలను వారికి అందేలా చూడాలని కోరారు. -
‘బీజేపీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. బీజేపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. బీజేపీ తీరుకు నిరసనగా శనివారం నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయన్ని ముట్టడించేందుకు యత్నించిన మాలమహానాడు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కేంద్రమంత్రి వెంకయ్య దిష్టిబొమ్మ దహనం
వర్గీకరణ ప్రకటనపై మాలల ఆందోళన ఉప్పలగుప్తం : ఎస్సీ వర్గీకరణ చేస్తామని చేసిన ప్రకటనతో కేంద్రమంత్రులు ఎం.వెంకన్నాయుడు, బండారు దత్తాత్రేయ మాలలను మోసం చేశారని, తమపై చౌకబారు వ్యాఖ్యలు చేసి అవమానపరిచారని ఆరోపిస్తూ మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు ఆందోళన దిగారు. వెంకయ్య దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. గొల్లవిల్లి సెంటరులో మంగళవారం నియోజకవర్గ నలుమూలల నుంచి వందలాది మంది మాలలు సుమారు గంట సేపు రాస్తారోకో చేశారు. సుప్రీంకోర్టు కొట్టివేసినా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ కేంద్రమంత్రులు మాదిగలను రెచ్చగొడుతున్నారని నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, పెయ్యల శ్రీనివాసరావు, గెడ్డం సురేష్బాబు, జంగా బాబూరావు, నందిక శ్రీనివాసరావు ఆరోపించారు. మాదిగలకు అండగా ఉంటామని చెప్పిన వీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని, వీరిని మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగలను విడదీసి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడితే మాలల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. మాలమహానాడు మండల అధ్యక్షుడు కొంకి వెంకట బాబ్జీ, పెయ్యల విష్ణుమూర్తి, పరశురాముడు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, పినిపే జయరాజ్, పరమట సత్యనారాయణ, బడుగు అబ్బులు, యాళ్ళ లక్ష్మినారాయణ, గుత్తాల బోసు, ఉండ్రు బాబ్జీ, మెండు రమేష్ తదితరులు ఈమేరకు తహసీల్దార్ ఎస్.సుబ్బారావు, ఎంపీడీఓ వి.శ్రీనివాస్లకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా.. కాకినాడ సిటీ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దండోరా సభలో ప్రకటించడాన్ని నిరసిస్తూ మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు మాలలు నిరసించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్సుందర్ మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చురేపి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏబీసీడీ వర్గీకరణను అడ్డుకుని తీరుతామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బి.అచ్చారావు, పెయ్యల అరుణ్కుమార్, గంటా వీరబాబు, ఎ¯ŒS.వీరబాబు, బూషణం, అమర్నాధ్, నాని, కిషోర్ తదితరలు పాల్గొన్నారు. -
మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు
హైదరాబాద్ : తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన సంఘం పదో వార్షికోత్సవ సందర్భంగా పూర్తి స్థాయి కమిటీని నియమించారు. రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులుగా ఏశమళ్ళ సృజన్ కుమార్, నల్లవెల్లి సంజీవ , పిల్లి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా భైరి రమేశ్, ధార సత్యం, అధికార ప్రతినిధిగా సైదులు, రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్గా అశోద భాస్కర్, రాష్ట్ర కో-అర్డినేటర్గా కె.సాయి గిరి, యువత అధ్యక్షుడుగా దర్శ సతీష్ లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. -
'ఏపీ ప్రభుత్వానిది దగాకోరు బాట'
⇒ దళితులను మోసగిస్తున్న సీఎం చంద్రబాబు ⇒ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు కల్లూరి చెంగయ్య విజయవాడ (గుణదల): ప్రభుత్వం తలపెట్టిన దళితబాట దగాకోరు బాటగా మారిందని, దళిత ప్రజలను మరోమారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంచిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళిత నిరుద్యోగులను మభ్యపెట్టడానికి, చంద్రబాబు పాలనపై దళితులలో వస్తున్న అసంతృప్తిని అణచివేయటానికి పన్నిన కుట్రే చంద్రన్నబాటని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో దళిత వర్గాలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో చెంగయ్య ధ్వజమెత్తారు. మూడు సెంట్లు భూమి, పరిశ్రమల స్థాపన కోసం బ్యాంకు పూచీకత్తులేకుండా వడ్డీలేని రుణాలు మంజూరు, భూమి కొనుగోలు పథకం అమలు కావటం లేదని, అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వటంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. పరిశ్రమల పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీ దళితుల నుంచి బలవంతంగా తీసుకున్న లక్షా 20 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకు ప్రణాళికలు కూడా రూపొందించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చైర్మన్లను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా కేవలం ఎస్సీ రుణాలు మంజూరు పేరుతో ప్రచారం చేసుకుని సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని కల్లూరి చెంగయ్య ఆరోపించారు. -
మాలల అణచివేతకే జీవో నెం.25
గుంటూరు (నెహ్రూనగర్) : రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్రంలో అమలువుతున్న జీవో నెం 25ను వెంటనే రద్దు చేయాలని మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా శనివారం మహిమ గార్డెన్స్లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ పాల్గొన్నారు. మల్లెల వెంకట్రావు మాట్లాడుతు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని 2004 సంవత్సరంలో సుప్రీం కోర్టు కొట్టివేసినా కోర్టు తీర్పును ధిక్కరించి మాలల అణిచివేత చేసే దిశగా మంత్రి రావెల కిషోర్బాబు జీవో నెం 25ని తీసుకువచ్చి అమలు చేయటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు నవంబర్ 21వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయల వద్ద ధర్నాలు చేయాలని తీర్మానించామని పేర్కొన్నారు. -
ఏపీ బంద్కు మాలమహానాడు సంపూర్ణ మద్ధతు
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ శనివారం ఇచ్చిన బంద్ పిలుపునకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య స్పష్టం చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కంటితుడుపు చర్యలో భాగంగా ప్యాకేజీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మంత్రులు అరుణ్జైట్లి, వెంకయ్యనాయుడు మోసగించారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు, సీట్లురావనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందుతారని అన్నారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకు రాంచందర్, సెక్రటరీ జనరల్ జంగా శ్రీను, గ్రేటర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్, యూత్ వింగ్ అధ్యక్షుడు సుధాకర్, తెలంగాణ అధ్యక్షుడు జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
చల్లారని ‘దివిస్’ సెగ
ఆందోళనల నేపథ్యంలో పలు గ్రామాల్లో 144 సెక్షన్ అమలు బాధిత గ్రామాల్లో పర్యటించిన వామపక్ష నేతల బృందం దళితుడిపై సీఐ దౌర్జన్యం చేశారంటూ కొత్తపాకల గ్రామస్తుల రిలే దీక్షలు ఉద్యమానికి మాలమహానాడు నేతల మద్దతు తీర ప్రాంతానికి నష్టదాయకంగా ఉందంటూ దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ దళితుడిని తుని రూరల్ సీఐ కులం పేరుతో దూషించి, కొట్టారని ఆరోపిస్తూ కొత్తపాకల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, దీనికి మాల మహానాడు నేతలు మద్దతు పలకడంతో పరిస్థితి వేడెక్కుతోంది. ఆయా ఆందోళనల నేపథ్యంలో పలు గ్రామాల్లో పోలీసులు 144 సెక్ష¯Œæను విధించారు. తొండంగి : తీరప్రాంతంలో రైతులు, మత్స్యకారుల మనుగడ ప్రశ్నార్థమయ్యే దివీస్ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి బుగతా బంగార్రాజు డిమాండ్ చేశారు. పంపాదిపేటలో పోలీసులు లాఠీచార్జి, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బాధిత గ్రామాలను సీపీఐ ఏరియా కార్యదర్శి శివకోటి రాజు, సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) నాయకుడు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్ జనశక్తి) నాయకుడు కర్నాకుల వీరంజనేయులు, న్యూడెమోక్రసీ నేత వి.రామన్న, జనశక్తి నాయకుడు బి.రమేష్ తదితరులతో కలిసి కొత్తపాకల, తాటియాకులపాలెంల్లో సందర్శించారు. దళితుడిని కొట్టి, కులంపేరుతో దూషించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్తపాకల గ్రామంలో దళితులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. అనంతరం తాటియాకులపాలెంలో రైతులతో మాట్లాడారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా పోరాడుతామని స్పష్టం చేశారు. పోరాటంలో కేసులు సర్వసాధారణమని, అటువంటి వాటికి భయపడేదిలేదన్నారు. పరిశ్రమ వ్యతిరేకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, కొత్తపాకల గ్రామానికి చెందిన అప్పలరాజును కులంపేరుతో దూషించి కొట్టిన సీఐ చెన్నకేశవరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని దీక్షలు తొండంగి : పంపాదిపేటలో పోలీసులు లాఠీచార్జి సంఘటన సందర్భంగా కొత్తపాకల గ్రామానికి చెందిన దళితుడిని గాయపరిచి, కులంపేరుతో దూషించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుపై చర్యలు తీసుకోవాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం పంపాదిపేటలో జరిగిన సంఘటనలో కొత్తపాలకు చెందిన అప్పలరాజును కులంపేరుతో దూషించి, లాఠీతో కొట్టారని ఆరోపిస్తూ గ్రామస్తులు మంగళవారం నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు రాజు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితునిపై సీఐ దాడి చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై బుధవారం ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసి, దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. -
ఏడో రోజుకు మాలల నిరాహార దీక్ష
ముకరంపుర : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షలు సోమవారంతో ఏడో రోజుకు చేరాయి. దీక్షలను టీఎంఎం జిల్లా అధ్యక్షుడు నక్క రాజయ్య, మేడి అంజయ్య, జైమాల మహార్ సామాజిక ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి ప్రారంభించారు. ఏఎంఎస్ఏ జిల్లా అధ్యక్షుడు వేముల రమేశ్, దూస తిరుపతి మాట్లాడుతూ దళితులు కలిసి ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమన్నారు. వర్గీకరణకు మద్దతిచ్చే అన్ని పార్టీల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీక్షలో వేముల రమేశ్, బూర తిరుపతి, సావుల శ్రీనివాస్, పండుగ శేఖర్, అశోక్. నవీన్, అజయ్, సావుల శ్రీనివాస్, గొల్ల నరేష్, తాళ్ల అరుణ్, ఇ.అభిలాష్, శ్రావణ్, అనూష, రాజు, కె.నారాయణ, శ్రీనివాస్, కాటిక రాజమౌళి, నాయిని ప్రసాద్, జిల్లా రమేశ్ కూర్చున్నారు. తీట్ల ఈశ్వరి, గంటల రేణుక, ఆశా విజయ్, పుష్పలత, అనిత, అనంతరాజ్, భూషన్రావు, బత్తుల లక్ష్మీనారాయణ, కెమసారం తిరుపతి సంఘీభావం తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనకయ్య, రాష్ట్ర నాయకుడు దామెర సత్యం దీక్షను విరమింపజేశారు. -
ఇది మనువాదుల కుట్ర: చెన్నయ్య
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలను వర్గీకరించేందుకు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, మనువాదులు కుట్ర పన్నారని మాల మహానాడు-టీఎస్ జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. దళితులపై బీజేపీ హయాంలోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. బుధవారం ఇక్కడి జంతర్మంతర్లో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. బీజేపీ మనువాద కుట్రలతో, విభజించు-పాలించు అన్న సూత్రంతో లబ్ధిపొందాలని చూస్తోందని ఆరోపించారు. వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఆ దిశగా కేంద్ర మంత్రులు ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆధిపత్య కులాల ఆధీనంలో రాజకీయ అధికారం ఉన్నంత కాలం పీడిత వర్గాలకు న్యాయం జరగదని చరిత్ర నిరూపించిందని ఆందోళన వ్యక్తంచేశారు. గోసంరక్షణ పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశంలో దళితులపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 21వ రోజుకు చేరింది. -
ఢిల్లీలో మాల సంఘం నాయకుల ధర్నా
మందమర్రి : ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాల సంఘం ఆ«ధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పట్టణ మాల సంఘం నాయకులు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల సంఘం పట్టణ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ దళితుల ఐక్యత దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్తో పాటు సుప్రీం కోర్టు సైతం వర్గీకరణ సరైంది కాదని తీర్పు చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీక్షలో కూర్చున్న వారిలో మెయ్య రాంబాబు, పల్లే నర్సింహులు, కొండ రాములు, బావండ్ల వీరస్వామి తదితరులున్నారు. -
ఎస్సీ వర్గీక‘రణం’
నిర్వాహకులు, మాల జేఏసీ నాయకుల బాహాబాహీ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా హైదరాబాద్లోని నిజాం పీజీ న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. భేటీ నిర్వాహకులకు, మాల జేఏసీ, మాల సంక్షేమ సంఘం నాయకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వాగ్వాదాలు, తోపులాటలు, పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ సమక్షంలోనే ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడుల్లో నిజాం లా కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు నిర్వాహకుడు గాలి వినోద్కుమార్, మాలల జేఏసీ నాయకుడు ఆగమయ్యకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట మార్చిన కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ కొందరు మాల నాయకులు కోదండరాం నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది క్రమంగా ఇరు వర్గాల బాహాబాహీకి దారితీసింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఘర్షణ మొదలైందిలా..: నిజాం లా కాలేజీలోని అంబేడ్కర్ సెమినార్ హాల్లో శుక్రవారం ‘ఎస్సీ వర్గీకరణ ప్రజాస్వామిక డిమాండ్’ అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.వర్గీకరణ సంఘీభావ కమిటీ కన్వీనర్, నిజాం లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైనట్లు తెలుసుకున్న మాలల జేఏసీ చైర్మన్ దీపక్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు బత్తుల రాంప్రసాద్, జంగం శ్రీనివాస్, ఆగమయ్యలతోపాటు పలువురు అక్కడికి చేరుకున్నారు. తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. చాలాసేపటి వరకు అవకాశం రాకపోవడంతో తమనెందుకు మాట్లాడనివ్వరంటూ మాలల ప్రతినిధులు నిర్వాహకులను ప్రశ్నిం చారు.అప్పటికే ప్రొఫెసర్ కోదండరాం తన ప్రసంగం ముగించి వెళ్తుండగా మాలల జేఏసీ నాయకులు ఆయన్ను నిలదీశారు. దళిత సీఎం హామీపై మాట తప్పిన కేసీఆర్ దళితులకు ఎంతో అన్యాయం చేశాడని, ఆ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. టీజేఏసీ చైర్మన్గా అన్ని వర్గాలకు అండగా ఉండాలన్నారు. గద్దర్ ప్రసంగాన్ని సైతం అడ్డుకున్నారు. దీంతో నిర్వాహకులు జోక్యం చేసుకోవడంతో ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో కొందరు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దాడుల్లో గాలి వినోద్కుమార్ తలకు గాయాలయ్యాయి. ఆయన తలకు నాలుగు కుట్లు వేశారు. ఆగమయ్యకు కూడా గాయపడడంతో ఇరువురినీ ఆస్పత్రికి తరలించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో గాలి వినోద్కుమార్, ఆగమయ్యతోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామరస్యంగా పరిష్కరించుకోవాలి కోదండరాం, గద్దర్ వర్గీకరణ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజా గాయకుడు గద్దర్ సూచించారు. సభలో ఘర్షణ వాతావారణానికి ముందు వారు మాట్లాడారు. పాలకుల తీరు వల్లే ఎస్సీల మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయని కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరి ఏపీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఎందుకు ఎందుకు తీర్మానం చేయడంలేదన్నారు. త్వరలో వెయ్యి డప్పులు లక్ష గొంతులతో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వర్గీకరణ సంఘీభావ కమిటీ కన్వీనర్గా గద్దర్ను ఎన్నుకున్నారు. ఈ నెల 7న ప్రధానిని కలిసి పార్లమెంట్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నట్లు తీర్మానించారు. సమావేశం అప్రజాస్వామికం వర్గీకరణ ప్రజాస్వామిక డిమాండ్ అన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు కూడా అవకాశం ఇవ్వాల్సింది. సమావేశ మందిరంలోకి వెళ్లగానే గాలి వినోద్ అనుచరులు మాపై దాడులకు పాల్పడ్డారు. నిజాం లా కాలేజీలో ఎలాంటి అనుమతులు లేకుండా సమావేశం ఏర్పాటు చేసిన గాలి వినోద్ను సీఎం సస్పెండ్ చేయాలి. కుటుంబంలోని సమస్య అన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూర్చుని చర్చించుకోవాలి కానీ మేధావుల పేరుతో అగ్రకులాల వారిని పిలిచి ఎలా చర్చిస్తారు? - బత్తుల రాంప్రసాద్, రాష్ట్ర మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాడి అప్రజాస్వామికం ఇది యావత్ ప్రజాస్వామికవాదులపై జరిగిన దాడిగా గుర్తించాలి. దాడికి పాల్పడిన వ్యక్తులు తమ తప్పును తెలుసుకోవాలని కోరుతున్నాను. జనాభా దామాషా ప్రకారం అందరికీ సమన్యాయం జరిగేలా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారనే విషయాన్ని మరవద్దు. నిజమైన అంబే డ్కర్వాదులు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు రావాలి. - ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ వర్గీకరణ వద్దు.. ఐక్యంగా ఉందాం బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం వైపు నడిపించాలి కానీ దళితుల మధ్య చిచ్చుపెట్టడం ఎంతవరకు సమంజసం? వర్గీకరణ అంశంపై ఇరువర్గాల ప్రతినిధులతో బహిరంగ చర్చపెడితే బాగుండేది. కానీ కొంతమంది వ్యక్తులతో సమావేశం ఏర్పాటు చేసి మాలలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని ప్రకటించడం సరికాదు. - మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ -
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం..
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మేసా ఆనంద్ విజయకుమార్ రైలుపేట, గుంటూరు : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నవ్యాంధ్ర మాలమహానాడు పోరాటం చేస్తుందని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మేసా ఆనంద్విజయకుమార్ తెలిపారు. బుధవారం గుంటూరు రాజీవ్గాంధీ నగర్లోని మాలమహానాడు కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేమళ్ళ చినకోటయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలని కోరారు. రానున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మాలలను అధిక సంఖ్యలో కార్పొరేటర్లుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నగర కమిటీపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాకింది జోసఫ్, ప్రచార కార్యదర్శి పెరికల రవిప్రకాష్, దాసరి మల్లికార్జునరావు, థామస్, శ్యామ్ ప్రసాద్, రేమళ్ళ ఏసుమధు, బడుగు నారాయణ, బుద్ధారవికుమార్, బోరుగడ్డ సునిల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘వర్గీకరణ.. ఐక్యతను దెబ్బతీస్తుంది’
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ.. ఎస్సీ, ఎస్టీ ఉపకులాల మధ్య వైషమ్యాలను పెంచి దళితుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మాల మహానాడు చేపట్టిన ఆందోళనలో చెన్నయ్య మాట్లాడుతూ..కొన్ని రాజకీయ పార్టీలు దళి తుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయ న్నారు. వర్గీకరణ బిల్లుకు ప్రభుత్వ ఆమోదం తెలపవద్దని కోరుతూ చెన్నయ్య ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియాను కలసి వినతిపత్రం సమర్పించింది. -
వర్గీకరణ వద్దు కలిసుందాం
మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పాన్గల్ : ఎస్సీ వర్గీకరణ వద్దు కలిసి ఉందామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ జంతర్మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన ఫోన్లో మాట్లాడారు. మాదిగలు ఎస్సీ వర్గీకరణను పదేపదే ముందుకు తీసుకవస్తూ ఎస్సీల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు. వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును అడ్డుకునేందుకే జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టామన్నారు. జిల్లా నుంచి పలువురు మాలమహనాడు నాయకులు ఢిల్లీ ధర్నాకు తరలివచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దు : మాల మహానాడు
కేంద్ర మంత్రి గెహ్లాట్కు మాల మహానాడు వినతి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దని, దేశంలో వర్గీకరణ ఎక్కడా లేదని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్కు మాల మహానాడు ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. మంగళవారం మంత్రిని కలసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య నేతృత్వంలోని బృందం.. వర్గీకరణ వల్ల నష్టాలను వివరించింది. వర్గీకరణకు వ్యతిరేకంగా ఆరో రోజు దీక్షలో చెన్నయ్య మాట్లాడుతూ.. రెండు కళ్ల సిద్ధాంతంతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మనువాద కుట్రలతో ఎస్సీలను వర్గీకరించాలని చూస్తోందని, దీని వెనక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. దళితులను విభజించి పాలించడమే బీజేపీ సిద్ధాంతమని, ఇప్పటికైనా వెంకయ్య ఈ కుట్రలు మానుకోవాలన్నారు. -
ఓటు బ్యాంకు కోసమే వర్గీకరణ
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య సాక్షి, న్యూఢిల్లీ: ఒక వర్గం వారి ఓటు బ్యాంకు కోసం అగ్రవర్ణ పార్టీలు దళితులను విభజించి పాలించాలని చూస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీల్లో వెనుకబడిన ఉపకులాలకు ప్రత్యేక విద్యా సదుపాయాలు కల్పిస్తే వారు మిగతా విద్యార్థులతో సమానంగా పోటీపడి ఉద్యోగాలు పొందుతారని, ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా రిజర్వేషన్లు కల్పించినా నిరుపయోగమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ పని చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం దళితులను విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. దళితులను విభజించవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను కలసి వినతి పత్రం సమర్పించినట్టు చెన్నయ్య తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిచినట్టు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మాల మహానడు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. -
ప్రశ్నల హీరో ఎక్కడ?
ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకం చంద్రబాబు : రత్నాకర్ రాజమహేంద్రవరం : అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తానంటూ ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించకుండా తిరుగుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడ దీక్షకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. దీక్షలో ఉన్న ముద్రగడను పరామర్శించేందుకు ఇద్దరు ఎస్పీలను అనుమతి అడిగినా ఒప్పుకోకపోవడం దారుణమన్నారు. ఆయనను ఓ ఉగ్రవాదిలా చూస్తోందన్నారు. చంద్రబాబు నైజం చూస్తుంటే ఏరు దాటాక తెప్ప తగలపెట్టే రకం గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను, కాపుల రిజర్వేషన్లు పేరుతో కాపులను అణగదొక్కేందుకు చూస్తే చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు. -
చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వం..
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వమంటూ మాల మహానాడు సోమవారం ఆందోళన చేపట్టింది. ట్యాంక్బండ్పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయం చేతకాక పార్టీని అమ్ముకున్న చిరంజీవి ఎస్పీ వర్గీకరణకు సిఫారసు చేయడం చేతగాని తనమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య దుయ్యబట్టారు. -
రాజ్యాధికార సాధనకు సిద్ధం కావాలి
మాల మహానాడు సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ జరిగితే కేవలం విద్య, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు వర్తిస్తాయని, కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనపెట్టి ఎస్సీలంతా ఐక్యంగా రాజ్యాధికార సాధనకు సిద్ధం కావాలని మాల మహానాడు కోరింది. ఎస్సీ వర్గీకరణ వద్దంటూ మాల మహానాడు ఢిల్లీలో రిలే దీక్షలు చేపట్టింది. మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య శుక్రవారం దీక్షలో మాట్లాడుతూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును, జాతీయ ఎస్సీ కమిషన్ చేసిన సిఫారసులను అమలుచేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సులువైన అంశం కాదని, దీనికి దేశంలో సగం రాష్ట్రాల ఆమోదం కావాలని పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పన, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు, రాజ్యాధికార సాధన దిశగా మాల మహానాడుతో కలసి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో జింగి శ్రీను, భాస్కర్, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
ఉప ముఖ్యమంత్రా? కుల సంఘ నేతా?
మాల మహానాడు ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రా లేక కుల సంఘ నేతా? అనిమాల మహానాడు గురువారం ప్రశ్నించింది. ఎస్సీల వర్గీకరణ వద్దంటూ ఇక్కడ జంతర్ మంతర్లో నిర్వహిస్తున్న రెండో రోజు రిలే దీక్షలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీలను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కడియం శ్రీహరి సిఫారసు చేయడం ఎంత మేరకు సబబని ప్రశ్నించారు. ‘కడియం శ్రీహరి ఒక కుల సంఘానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రికి మాలల ఓట్లు అవసరం లేదా? వచ్చే ఎన్నికల్లో ‘మాలల పంతం-కేసీఆర్ అంతం’ అనే నినాదంతో మాలలు ముందుకు సాగుతారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది. తెలంగాణలో మాలల కంటే మాదిగలే మెజారిటీ జిల్లాల్లో లబ్ధి పొందుతున్నారని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక తేల్చిచెప్పింది..’ అని అన్నారు. వర్గీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రెండు రాష్ట్రాల్లో మంత్రులు, ఎంపీలను అడ్డుకుంటామన్నారు. వర్గీకరణ జాతీయ సమస్య అని, అనేక రాష్ట్రాల్లో దళితులు దీనిని వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఈ దీక్షలో చెన్నయ్యతోపాటు జె.శ్రీనివాస్, భాస్కర్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీక్ష అనంతరం ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకమని, అమలు చేయరాదని కోరుతూ ఎస్సీ కమిషన్కు వినతిపత్రం సమర్పించినట్టు చెన్నయ్య తెలిపారు. -
'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే సహించేది లేదు'
-
'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే సహించేది లేదు'
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సోమవారం మాలమహానాడు కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతిస్తే సహించేంది లేదని మాలమహానాడు కార్యకర్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. -
టీఆర్ఎస్ భవన్ ముట్టడికి యత్నం
హైదరాబాద్: మాలమహానాడు కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ భవన్ ముట్టడికి యత్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే, బంజారాహిల్స్ పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో మాలల తడాఖా ఏంటో టీఆర్ఎస్కు రుచి చూపిస్తామన్నారు. మాల, మాదిగల మద్య చిచ్చుపెట్టి గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తే టీఆర్ఎస్కు పుట్టగతులుండవని మండిపడ్డారు. -
'హోదా' విషయంలో ఎన్డీఏ మోసం చేసింది
విశాఖపట్నం (అల్లీపురం): ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాప్రజలను మోసం చేసిందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ విమర్శించారు. విశాఖపట్నంలోని ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హుద్-హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్యాకేజీ అమలు చేయకుండా, ఏపీ లోటు బడ్జెట్ పూరించకుండా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆయన దుయ్యబట్టారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకుని ప్రత్యేక హోదా విషయంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని కారెం శివాజీ ఈ సందర్భంగా కేంద్రాన్నిహెచ్చరించారు. -
బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి
హైదరాబాద్ : బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆ దృశ్యాలను తొలగించకపోతే తెలంగాణలో ఆ చిత్రాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. యూట్యూబ్లో మాలలను కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్స్ను ఇప్పటికే పోలీసులకు అందచేస్తూ ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు బాహుబలి చిత్రం జూలై 10 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. -
యూ ట్యూబ్ దృశ్యాలపై దళితుల నిరసన
- ‘బాహుబలి’లో అంబేద్కర్ను అవమానించిన వారిపై చర్యకు డిమాండ్ హైదరాబాద్: బాహుబలి చిత్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను, దళితులను అవమానిస్తూ దృశ్యాలను చిత్రీకరించారంటూ మాల సంక్షే మ సంఘం మండిపడింది. దర్శకుడు రాజమౌళి తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన బాహుబలి చిత్రంలోని అభ్యంతరకర దృశ్యాలను సినిమా నుంచి తొలగించాలని, యూట్యూబ్లో పెట్టినవారిపై సైబర్ క్రైమ్, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రతి నిధి బృందం నగర సీసీఎస్ డీసీపీ రవివర్మను కలసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. -
కొండమల్లెల నడుమ కొత్త పరిమళం...
కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు మనలోకి మనం ప్రయాణించేలా చేసి కొత్తదారిని కనుక్కునేలా చేస్తాయి. రోడ్డు ప్రమాదానికి గురైన డా.మాలా శ్రీకాంత్...ఆ ప్రమాదాన్ని గుర్తు తెచ్చుకొని బాధ పడ్డారో లేదో తెలియదుగానీ... తనలోకి తాను ప్రయాణించారు. కొత్తదారిలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. పుట్టింది బెంగాల్లో అయినా తండ్రి వృత్తిరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో చదువుకున్నారు. మిలిటరీ అధికారి కుమార్తె అయిన మాల తండ్రి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నారు. తల్లి చెప్పే కథల్లో నుంచి దయాగుణాన్ని అలవర్చుకున్నారు. రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల రకరకాల వ్యక్తులతో, సంస్కృతి, సంప్రదాయాలతో పరిచయం ఏర్పడింది. వైద్యవిద్యను అభ్యసించిన మాల వృత్తిలో భాగంగా ఒమన్ వెళ్లారు. అక్కడి ఎడారి గ్రామాల్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రజలతో మరింతగా కలిసిపోవడానికి అరబిక్ నేర్చుకొని దానిలో పట్టు సాధించారు. ‘ప్రజల డాక్టర్’గా పేరు తెచ్చుకున్నారు. పుష్కరం తర్వాత మన దేశానికి తిరిగివచ్చి ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’లో ప్రాజెక్ట్ డెరైక్టర్గా చేరారు. ఢిల్లీలో ‘క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ ప్రాజెక్ట్ డెరైక్టర్గా పని చేస్తున్న సమయంలో మాల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం వల్ల ఆమె శారీరకంగా, మానసికంగా దెబ్బ తిన్నారు. జ్ఞాపకశక్తి దూరమై పోయింది. మెల్లగా కోలుకోవడం ప్రారంభమైన తరువాత- ‘‘ఇది నాకు రెండో జీవితం’’ అనుకున్నారు. జీవితం అంటే ఏదో ఒక రకంగా జీవించడం కాదని, ఒక మంచి పని కోసం జీవించడమనే తత్వాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఈ సరికొత్త జీవితంలో తన గురించి, పిల్లల గురించి, బంధువుల గురించి ఆలోచించడం కాకుండా పదిమందికి ఉపయోగపడే పనుల గురించి ఆలోచించాలనుకున్నారు. తన ఇంటిని ఢిల్లీ నుంచి ఉత్తరఖండ్ రాష్ట్రం ఆల్మోరా జిల్లాలో ఉన్న రాణిఖేత్ అనే హిల్స్టేషన్కి మార్చారు. ‘‘ఈ వయసులో ఒంటరిగా ముక్కూముఖం తెలియని వారి మధ్య...’’ అని సన్నిహితులు నసిగారు. కానీ ఆ అభ్యంతరాలను మాల పట్టించుకోలేదు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, వారితో కలిసిపోవడం ఆమెకు కొత్త ఏమీ కాదు. అందుకే ధైర్యంగా ముందడుగు వేశారు. రాణిఖేత్ కొండ ప్రాంతంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి రకరకాల అల్లికలు అంటే మాలకు ఎంతో ఇష్టం. ఆ అల్లికలే చాలామంది జీవితాల్లో వెలుగు నింపుతాయని ఆమె ఊహించి ఉండరు. కొండ ప్రాంత మహిళలకు చాలా అల్లికలు వచ్చు. వారి ఉత్పత్తులకు మార్కెట్ కలిపించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా మార్కెట్లో వాటికి ‘‘నాణ్యత లేదు’’ అనే మాట తరచుగా వినిపించేది. ఈ నేపథ్యంలో సరికొత్త అల్లికలను నేర్చుకొని, తాను నేర్చుకున్న వాటిని అక్కడి మహిళలకు చెప్పడం మొదలుపెట్టారు మాల. దీంతో మునపటి కంటే ఎక్కువ ఉత్సాహం, నైపుణ్యంతో రాణిఖేత్ మహిళలు రకరకాల అల్లికలు చేపట్టేవారు. మార్కెట్లో వాటికి డిమాండ్ పెరగడం మొదలైంది. ‘‘ఇక్కడి ప్రజలకు కష్టపడే తత్వం ఉంది. దానికి నైపుణ్యం తోడైతే తిరుగేముంది? అనుకున్నాను. అందుకే అల్లికలలో కొత్తవి, నాణ్యమైనవి నేర్చాను. నేర్పాను’’ అంటారు మాల. ‘‘ఆమె రావడానికి ముందు చాలా విషయాలు తెలిసేవి కావు. ఇప్పుడు చాలా విషయాల మీద అవగాహన పెరిగింది’’ ‘‘డాక్టర్గారు ఇక్కడికి రావడానికి ముందు అల్లిక అనేది అభిరుచిగానే ఉండేది. దాన్ని ఆర్థికంగా ఉపయోగపడేటట్లు చేశారు. స్వయం సహాయక గ్రూపులు స్థాపించారు’’ రాణిఖేత్ మహిళలను కదిలిస్తే మాల గురించి ఇలాంటి ప్రశంసలు ఎన్నో వినిపిస్తాయి. అల్లికలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా ఆమె అందరికీ అర్థమయ్యేలా చెబుతారు. రాణిఖేత్ వాసులలో ఆరోగ్యస్పృహ కలిగించడానికి తన వంతుగా ప్రయత్నిస్తున్నారు మాల. పట్టణాలలో రణగొణ ధ్వనులకు అలవాటు పడిన ఆమె చెవులకు రాణిఖేత్లోని ప్రశాంతత, పచ్చదనం అంటే ఎంతో ఇష్టం.ప్రకృతి అందాలే కాదు స్థానిక ప్రజలతో బాగా కలిసి పోవడం, వారు చెప్పే విషయాలు వినడం అంటే కూడా ఆమెకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం తన మనసులో ఒక నవల రూపుదిద్దుకుంటుంది. అది అక్షరాల్లోకి వస్తే...వైద్యురాలిగా, నలుగురికి దారి చూపే వ్యక్తిగా పరిచయమైన మాల శ్రీకాంత్ రచయిత్రిగా కూడా పరిచయమవుతారు. -
పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం
-
పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం
హైదరాబాద్: అతి పిన్నవయస్సులో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్కుమార్లను సాక్షి మీడియా గ్రూప్ చైర్ పర్సన్ వైఎస్ భారతి సన్మానించారు. ఈ సందర్భంగా సాహసయాత్ర వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ఎవరెస్టు శిఖరంపై భారతపతాకాన్ని ఎగురువేసి యువతీయువకుల్లో అంతులేని విశ్వాసం నింపారని ప్రశంసించారు. మీ విజయం మరెందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు. పూర్ణ, ఆనంద్ లకు ఉజ్వల భవిష్యత్ సొంతం కావాలని వైఎస్ భారతి ఆకాంక్షించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన తెలుగు తేజాలుగా నిలిచారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది. -
కారెం శివాజీ నివాసంలో భారీగా నగదు స్వాధీనం
మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ నివాసంలో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి మండలం మాగంలోని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ నివాసంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా ఆయన నివాసంలో రూ.19.56 లక్షలు పోలీసులు కనుగొన్నారు. ఆ నగదుపై శివాజీ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. అందుకు వారు మీనమేషాలు లెక్కించారు. దాంతో పోలీసులు ఆ నగదు స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్లు డిపోలపై కేసీఆర్ ప్రకటన దారుణం
మాల మహానాడు తెలంగాణ ఇన్చార్జి పాలడుగు విమర్శ ఇప్పటికే కల్తీ కల్లుతో పేదల బతుకులు ఛిద్రమవుతుంటే టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ నగరంలో మూతబడిన కల్లు డిపోలను తెరిపిస్తామని ప్రకటించడం దారుణమని మాల మహానాడు తెలంగాణ జిల్లాల ఇన్చార్జి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు అనిల్కుమార్ విమర్శించారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఒకవైపు మహిళలంతా మద్య నిషేధంపై ఉవ్వెత్తున ఉద్యమాలు నిర్మిస్తుంటే కేసీఆర్ కల్లు దుకాణాలు తెరిపిస్తాననడం ఎంతవరకు సమంజసమన్నారు -
వంచన ‘వరున్ని’ శిక్షించండి
వివాహం పేరుతో యువతిని మోసగించిన కుటుంబంపై పోలీసులు తగిన చర్యలు తీసుకుని బాధితురాలికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కోటే రామచంద్రరావు (చిన్నా) డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మాలమహానాడు ఆధ్వర్యంలో బాధితురాలు తరపున పోరాటాలకు సిద్దపడతామని ఆయన హెచ్చరించారు. వివాహం అనంతరం భర్త చేతిలో మోసపోయిన బాధితురాలితో కలిసి సోమవారం జిల్లా మాలమహానాడు నాయకులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. స్థానిక ఆర్ ఆర్ భవన్లో బాధితురాలితో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. గుంటూరు జిల్లా తెనాలి గ్రామం గంగానమ్మపేటకు చెందిన గడ్డం థామస్ కుమారుడు సాధూథామస్కు పమిడిముక్కల మండలం మామిడికోళ్ళపల్లి గ్రామ శివారు గండ్రవానిగూడెంకు చెందిన జుజ్జువరపు అశోక్ కుమార్తె సునీతతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. కొన్నాళ్లు బాగానే కాపురం చేసిన ఈయన ‘మా కుటుంబానికి నువ్వు సరిపోవు మమ్మల్ని వదిలి వెళ్ళిపో ‘అంటూ బెదిరించటంతోపాటు కొట్టడం, పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకోవడంతో భయపడి అక్కడి నుంచి తప్పించుకొని పమిడిముక్కల పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి ఘంటసాలలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అయినా వదలకుండా హత్యాయత్నాలకు ప్రయత్నించగా ఘంటసాల పోలీస్స్టేషన్లోనూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన కేసు నమోదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సంఘటనపై విచారణ జరిపించి తనకు తగిన న్యాయం చేసి భర్త అతని కుటుంబసభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సునీత కోరారు అభ్యర్థించారు. ఈ సమావేశంలో మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల మోషే, కార్యదర్శి బండి సుబ్బారావు, అరుంధతి బంధు సంక్షేమ సేవా మండలి రాష్ట్ర కార్యదర్శి దిరిశం బాలకోటయ్య, ఘంటసాల మండలం సోషల్ యాక్షన్ కమిటీ నాయకులు పీ పీ ఎం బేగం, కళ్ళేపల్లి కమల, జి సీతామహాలక్ష్మి, ఎ రాధా, బాధితురాలి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
లంచం తీసుకుంటు కలెక్టర్ పీఏ అరెస్ట్
పౌష్టికాహార నిర్వాహకుల నుంచి లంచం ఆశించి కలెక్టర్ వ్యక్తిగత సహాయకురాలు తిరుచ్చి జైలులో కటకటాలు లెక్కిస్తోంది. తిరుచ్చి కేకే నగర్ సమీపంలోని అలమేలుమంగ నగరానికి చెందిన మాల (48). తంజావూరు కలెక్టర్కు వ్యక్తిగత సహాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. కాగా పట్టుకోటై సమీపంలోని తవరంకురిచ్చి ప్రభుత్వ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అన్నైక్కాట్టు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహార పథకం అమలు పరుస్తున్నారు. వీటి నిర్వహణ, ఖర్చుల వ్యవహారాలపై తనిఖీ నిర్వహించిన మాల ఆ పౌష్టికాహార నిర్వాహకులైన జోసప్ మిన్ ఇందిర యువరాణి (45), మారియమ్మన్ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడిని పరిశీలించిన ఫైళ్లకు తంజావూరు కలెక్టర్ కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించింది. దీంతో వారు 21వ తారీఖున తంజావూరు కార్యాలయానికి వెళ్లిన పౌష్టికాహార నిర్వాహకులను తలా వెయ్యి రూపాయలు ఇవ్వవలసిందిగా కలెక్టర్ పీఏ మాల డిమాండ్ చేశారు. వారిలో ప్రైవేటు పాఠశాల పౌష్టికాహార నిర్వాహకుడు మాత్రం 500 ఇచ్చారు. మిగిలిన ఇద్దరు తమ వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఇంటికెళ్లి తీసుకురండి అంటూ మాల తిరిగి పంపించేసింది. జోసప్మీన్, ఇందిర యువరాణి తంజావూరు అవినీతి వ్యతిరేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె పోలీసుల సూచన ప్రకారం రసాయనం పూసిన డబ్బును మంగళవారం కలెక్టర్ వ్యక్తిగత సహాయకురాలు మాలకు ఇచ్చింది. దీన్ని చాటు నుంచి గమనిస్తున్న పోలీసులు మాలను అరెస్టు చేసి తిరుచ్చి విజిలెన్స్ కోర్టులో హాజరు పరిచి ఆ తరువాత జైలుకు తరలించారు. అలాగే తిరుచ్చి కేకే నగర్లో ఉన్న ఆమె ఇంటిని సోదా చేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.