MGBS
-
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
-
పాతబస్తీ మెట్రోకు భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో మార్గంలో భూసేకరణపై హైదరాబాద్ మెట్రో రైల్ కసరత్తు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఉన్న ఓల్డ్సిటీ మెట్రో మార్గాన్ని రెండోదశలో భాగంగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కొత్త అలైన్మెంట్ కోసం భూసేకరణకు హెచ్ఎంఆర్ఎల్ నోటిఫికేషన్ వెల్లడించింది. కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో సేకరించనున్న స్థలాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 60 రోజుల గడువు విధించారు. మరోవైపు అభ్యంతరాలను స్వయంగా తెలియజేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అవకాశం కలి్పంచింది. భూ సేకరణలో భాగంగా ఆస్తులను కోల్పోయే బాధితులు అభ్యంతరాలను, ప్రతిపాదనలను బేగంపేట్లోని మెట్రో భవన్ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్కు స్వయంగా తెలియజేయవచ్చు. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్షంగా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దారుషిఫా నుంచి శాలిబండ వరకు.. మొదటి దశలోని మూడో కారిడార్లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ వరకు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ మార్గాన్ని రెండో దశలో భాగంగా ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కానీ.. ఈ రూట్లో దారుíÙఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషుర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు మరో 6 చిల్లాలు సహా మొత్తం 103 నిర్మాణాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను సైతం 80 అడుగులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రూట్లో ఆస్తులను కోల్పోనున్న వివిధ వర్గాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి నుంచి అభ్యంతరాలు, ఆస్తుల అంచనాలను స్వీకరించనున్నారు. ⇒ 2012లోనే చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు పనులను 2023 వరకు కాలయాపన చేయడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగి ప్రస్తుతం రూ.2500 కోట్లకు చేరింది. కిలోమీటర్కు సుమారు రూ.250 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. 5.5 కిలోమీటర్ల కారిడార్తో పాటు భూములు, ఆస్తులను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరి»ౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఈ అలైన్మెంట్ ఉంటుంది. ⇒ మెట్రో రైల్ మార్గంలో ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్నుమా స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట నుంచి మైలార్దేవ్పల్లి మీదుగా ఎయిర్పోర్టు వరకు మెట్రో రెండో దశ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచి్చన తర్వాత మెట్రో రెండోదశ డీపీఆర్ను వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు -
ఎలాగైనా.. ఊరికి పోవాల్సిందే!
నగర దారులన్నీ పల్లె‘టూరు’ దారి పడుతున్నాయ్. బస్సూ, రైలూ, కారూ, బైకూ.. ఏదైనా సరే ఊరికి పోవడమే లక్ష్యం. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండగ కావడంతో శనివారం పట్నవాసులు పల్లెలకు పయనమయ్యారు. సొంతూరిని ఓసారి మనసారా చూసొద్దామని ఆశగా బయలుదేరారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. – సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్ -
పాతబస్తీ మెట్రో మార్గంపై డ్రోన్ సర్వే
హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులను హైదరాబాద్ మెట్రో రైల్ వేగవంతం చేసింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం ఆదివారం డ్రోన్ సర్వే చేపట్టింది. మెట్రో అలైన్మెంట్లో భాగంగా పలు చోట్ల రోడ్డు విస్తరణ చేపట్టవలసి ఉంటుంది. ఈ క్రమంలో మసీదులు, ఆలయాలు, తదితర కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పిల్లర్స్ నిరి్మంచేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు సాధారణ సర్వేతో పాటు, ఈ డ్రోన్ సర్వేను ప్రారంభించారు. డ్రోన్ నుంచి సేకరించిన హై రెజల్యూషన్ చిత్రాలు, రియల్ టైమ్ డేటా, 3డీ మోడలింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయా కట్టడాల కొలతలను కచి్చతంగా అంచనా వేయనున్నారు. దారుల్ఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు ఉన్న 103 కట్టడాల పరిరక్షణ కోసం ఈ డ్రోన్ సర్వే దోహదం చేయనుందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు నిరి్మంచనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో అలైన్మెంట్ ఇంజనీరింగ్ రిఫైన్మెంట్ పనులు కొనసాగుతున్నాయని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్,ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పులు,తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ సర్వే ద్వారా సేకరించిన డేటా ఉపయోగపడనుంది. మతపరమైన/సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేయనున్నారు.నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. త్వరలో భూసామర్ధ్య పరీక్షలు.... ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో మార్గంలో త్వరలో భూసామర్ధ్య పరీక్షలు ప్రారంభించనున్నట్లు ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఫలక్నుమా నుంచి ఈ పరీక్షలను ప్రారంభించనున్నారు. నిజానికి జేబీఎస్ నుంచి పాతబస్తీలోని ఫలక్నుమా వరకు 2012లోనే మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్ వరకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ ఈ మార్గంలో పనులను ప్రారంభించింది. ఫలక్నుమా వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరవాసులు జేబీఎస్ నుంచి నేరుగా ఫలక్నుమా వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చారి్మనార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు. నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే పాతబస్తీలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఐదు స్టేషన్లు... ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.అక్కడి నుంచి దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి.ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్నుమా స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్ స్టేషన్లకు మధ్య 500 మీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. -
పాతబస్తీ మెట్రోపై కదలిక!
హైదరాబాద్: పాతబస్తీలో ఇక మెట్రో పరుగులు తీయనుంది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సన్నాహాలు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు నిర్మించనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో అలైన్మెంట్ ఇంజనీరింగ్ రిఫైన్మెంట్ పనులు కొనసాగుతున్నాయని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నిజానికి జేబీఎస్ నుంచి పాతబస్తీలోని ఫలక్నుమా వరకు 2012లోనే మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్ వరకు పరిమితం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. ఫలక్నుమా వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరవాసులు జేబీఎస్ నుంచి నేరుగా ఫలక్నుమా వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైలులో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్జంగ్మ్యూజియం, ఫలక్నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ సందర్శించవచ్చు. నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే పాతబస్తీలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఐదు స్టేషన్లు.. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి దారుషిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. ఈ మెట్రో రైలు మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్నుమా స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ స్టేషన్లకు మధ్య 500 మీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆలయాలు, మసీదుల పరిరక్షణ.... ఈ మెట్రో మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా, కేవలం 4 మినహా మిగిలిన అన్ని మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను పరిరక్షించినట్లు ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ల ఆదేశాల మేరకు ఆ నాలుగు ఆదేశాల మేరకు మిగిలిన నాలుగు మతపరమైన నిర్మాణాలను కూడా కాపాడేందుకు మెట్రో అలైన్మెంట్కు ఇంజినీరింగ్ పరిష్కారాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆ మార్గంలో రోడ్డు విస్తరణను 80 అడుగులకే పరిమితం చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. పాతబస్తీ మెట్రో విస్తరణలో నష్టపోయే సుమారు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్ల తయారీ కూడా ప్రారంభమైందని, నెలరోజుల్లో భూ సేకరణకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఎండీ తెలిపారు. -
కనిపించని ‘జీవా’
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్లో కార్పొరేట్ పద్ధతిలో ఆ బ్రాండ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్ కనిపించకపోవటం విశేషం. ♦ కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్ బ్రాండ్ నీళ్లే.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి. ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్నా కానరావడం లేదు.. ♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్ కటింగ్స్ డిజైన్ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. ఎంతో గొప్పగా జీవా బ్రాండ్ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. -
TSRTC: రాత్రివేళల్లోనూ శ్రీశైలం బస్సులు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ నెల 20 వరకు రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో ఘాట్ రోడ్ల వద్ద బస్సులను నిలిపి తిరిగి ఉదయం వేళల్లో ఫారెస్ట్ అధికారులు బస్సులను అనుమతించేవారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రిజినల్ రీజియన్ మేనేజర్ ఎ.శ్రీధర్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్, దోమలపెంట చెక్పోస్టుల వద్ద నిలపకుండా రాత్రివేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ఫారెస్ట్ అధికారి రాకేష్ మోహన్ డోపిడియాల్ ఈ నెల 20 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో బస్సులను అనుమతించిన ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!) -
హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో TSRTC MD సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
-
ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కేంద్రాల్లో నగదు రహిత సేవలు
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ ఆర్టీసీ కల్పించింది. నగదు రహిత, స్పర్శ రహిత లావాదేవీలను రేతిఫైల్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్బీ కేంద్రాల్లో పొందవచ్చని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కేంద్రాలు ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు పని చేస్తాయన్నారు. క్యూఆర్ కోడ్, యూపీఐ యాప్ల ద్వారా స్మార్ట్ ఫోన్లతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకుని బస్పాస్ల మొత్తాలను చెల్లించవచ్చని తెలిపారు. (చదవండి: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు) -
గుడిమల్కాపూర్ మార్కెట్ కు చేరుకుంటుంన్న ప్రజలు, వ్యాపారాలు
-
మాస్కు పెట్టుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న ప్రయాణికులు
-
జేబీఎస్ టు ఎంజీబీఎస్ మెట్రో పరుగులు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ వాసుల కలల మెట్రో రైల్ను జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జేబీఎస్ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. సీఎం ప్రయాణించడంతో ఈ మార్గంలోని చిక్కడపల్లి మినహా ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా రైలును నిలపకుండా నేరుగా ఎంజీబీఎస్ వరకు నడిపారు. దీంతో 13 నిమిషాల్లోనే జర్నీ పూర్తయ్యింది. సాధారణంగా ఈ మార్గంలో మిగతా ప్రతీ స్టేషన్లో మెట్రో రైల్ నిలిపితే ప్రయాణానికి 16 నిమిషాల సమ యం పడుతుంది. ఎంజీబీఎస్ వద్ద మెట్రో దిగిన సీఎం స్టేషన్ లో ప్రయాణికులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎల్అండ్టీ, హెచ్ ఎంఆర్ అధికారులు నగర మెట్రో ప్రాజెక్టు విశేషాలను కేసీఆర్కు వివరించారు. మెట్రో ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి తిలకించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంపీ రేవంత్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ సీఈఓ ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి, నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు. నేడు ఉదయం 6–30 నుంచి అందుబాటులోకి... జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో శనివారం ఉదయం 6–30 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం ఈ మార్గంలో సుమారు 60 వేల నుంచి లక్ష మంది వరకు జర్నీ చేసే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. కాగా, మెట్రో ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ కనిపించింది. జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, నృత్యాలతో సందడి చేశారు. చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద కొన్ని నిమిషాల పాటు రైల్ నిలపడంతో కేసీఆర్ను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరికి సీఎం అభివాదం చేశారు. మెట్రో విస్తరణకు ప్లాన్ సిద్ధం చేయండి... నగరం నలుమూలలా మెట్రో విస్తరణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రోలో ప్రయాణిస్తూ ఆయన.. ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడారు. నగరవాసులకు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం సాగించేందుకు, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మెట్రో ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మూడు మార్గాల్లో మెట్రో పూర్తితో ఆ ఫలాలను నగరవాసులు అందిపుచ్చుకున్నారని సీఎం అన్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు అత్యాధునిక ఎయిర్ పోర్టుల తరహాలో కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ, విజన్పరంగా ఢిల్లీ మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో మరింత అత్యాధునికంగా ఉందన్నారు. మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఆ మార్గంలోని ప్రతి ప్రాంతాల విశిష్టతలను ముఖ్యమంత్రి గుర్తు చేసినట్లు హెచ్ఎమ్ఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభించిన కేసీఆర్
-
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభం
-
వైఎస్సార్ స్వప్నం సాకారమైన వేళ
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగర వాసుల మెట్రో కల సంపూర్ణమైంది. హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన మెట్రో రైలు జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో పరుగులు పెట్టింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో నెరవేరింది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్ పూర్తయ్యింది. 2008 మే 14న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నగర మెట్రోప్రాజెక్ట్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. (హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు) జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో (11 కి.మీ) ముఖ్యమంత్రి కేసీఆర్ చేతలు మీదగా మెట్రో రైళ్లు శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ వద్ద ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మార్గం పూర్తితో గ్రేటర్ నగరంలో 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మెట్రో రైలు మార్గంలో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేందుకు 16 నిమిషాలు పట్టనుంది. కాగా ఎల్బీనగర్– మియాపూర్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో నిత్యం 4 లక్షలమంది రాకపోకలు సాగిస్తున్నారు. (హైదరాబాద్ మెట్రోలో ‘గరుడ వేగ’ సర్వీసులు!) -
వైఎస్సార్ స్వప్నం సాకారమైన వేళ
-
కొత్త రూట్లో మెట్రో కూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు మరో కొత్త రూట్లో పరుగులు తీయడానికి సిద్ధమైంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో ఇది ప్రయాణికులకు అందుబా టులోకి రానుంది. 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ వద్ద జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జెండా ఊపి ఈ మూడవ మెట్రో రైలు కారిడార్ను ప్రారంభిస్తారు. హైదరాబాద్ –సికింద్రాబాద్ జంటనగరాలను అనుసంధానించే ఈ మార్గాన్ని.. మెట్రో అధికారులు వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేశారు. తొలుత సంక్రాం తి నాటికి ప్రారంభించేందుకు ప్రయత్నించినా, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ మార్గం అందుబాటులోకి రానుండటంతో నగరంలో తొలి దశ మెట్రో ప్రాజెక్టు సంపూర్ణమైంది. ప్రస్తుతం ఎల్బీ నగర్–మియాపూర్ రూటులో 29 కి.మీ., నాగోలు– రాయదుర్గం రూటులో 29 కి.మీ. మేర మెట్రో మార్గం అందుబాటులో ఉంది. ఈ రూట్లలో నిత్యం 3.8 లక్షల నుంచి 4 లక్షల మంది రాకపోకలు సాగి స్తున్నారు. 7న ప్రారంభమయ్యే నూతన మార్గం తో కలిపి 3 కారిడార్ల పరిధిలో 69 కి.మీ. మేర నగరంలో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుం ది. ఢిల్లీ తర్వాత అత్యంత నిడివి గల మెట్రో మార్గమున్న నగరంగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన మొదటి, అతి పెద్ద మెట్రో ప్రాజెక్టు మనదే కావడం విశేషం. పాతనగరానికి మరింత ఆలస్యం.. జేబీఎస్–ఎంజీబీఎస్.. ఈ రెండు బస్సుస్టేషన్లకు పొరుగు రాష్ట్రాలు, దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు ప్రయాణించేందుకు ఈ మెట్రో మార్గం వీలు కల్పిస్తుంది. కొత్త మార్గం లో 45 రోజుల పాటు మెట్రో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలు విజయవంతంగా నిర్వహిం చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ ధ్రువీకరణ సైతం లభించింది. కాగా, ఈ మార్గాన్ని పాతనగరంలోని ఫలక్నుమా వరకు పొడిగించాలని తొలుత నిర్ణయించారు. సుల్తాన్బజార్లో ఆస్తుల సేకరణ, అలైన్మెం ట్ చిక్కులతో ప్రాజెక్టు ఆలస్యమైంది. ఆస్తులు కోల్పోయిన బాధితులకు మెరుగైన పరిహారం అందించడంతో పాటు వాణిజ్య కాంప్లెక్స్లో వారి వ్యాపార సముదాయాలకు చోటుకల్పించడంతో ఎట్టకేలకు మార్గం సుగమమైం ది. ఈ కారిడార్ను పాతనగరం వరకు విస్తరించే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ►3వ కారిడార్ స్వరూపం ►11 కి.మీ. జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గం నిడివి ►9 ఈ రూట్లో గల స్టేషన్లు ►18 ని‘‘ప్రయాణ సమయం ►1,00,000 రోజువారీ ప్రయాణికుల సంఖ్య (అంచనా) -
నగర వాసులకు మరో శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి స్థాయిలో నగర వాసులకు అందుబాటులోకి రానుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెబీఎస్ నుంచి ఎమ్జీబీఎస్కు రోడ్డు మార్గం ద్వారా వెల్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణం దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైల్లో అందుబాటులోకి వస్తే.. కేవలం 15నిమిషాల్లోన్నే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య ఇక తీరనుంది. కాగా ఈ మార్గం పూర్తవడంతో నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రోరైల్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎమ్జీబీఎస్ నుంచి ఫలక్నామ నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ఆ 5 కిలోమీటర్ల మినహాయిస్తే హైదరాబాద్లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే చెప్పాలి. -
అందుబాటులోకి రానున్న మెట్రో కారిడార్–2
సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య మెట్రో బంధం వేయనుంది. పాత నగరాన్ని కొత్త నగరంతో అనుసంధానం చేసే మణిహారంగా జేబీఎస్–ఫలక్నుమా కారిడార్ నిలిచిపోనుంది. ఈ మెట్రో–2 కారిడార్లో భాగంగా జేబీఎస్–ఎంజీబీఎస్ వరకు సోమవారం ట్రయల్ రన్ ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నేతృత్వంలో సాంకేతిక బృందం, హెచ్ఎంఆర్ఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.నాయుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏకే సాయిని ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా కారిడార్లో సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ రెండింటి మధ్య 11 కిలోమీటర్ల మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్–పరేడ్గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్బజార్, ఎంజీబీఎస్ వరకు 16 నిమిషాల సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణంగా అయితే ఈ రూట్లో రోడ్డు మార్గంలో 45 నిమిషాల వరకు సమయం పడుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరికొన్ని వారాల పాటు ట్రయల్ రన్ నిర్వహించి.. ఆ తర్వాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతినిస్తారు. ట్రయల్ రన్లో భాగంగా సాంకేతిక సమర్థత, రైళ్ల నిర్వహణ, సమయపాలన, సిగ్నలింగ్ వ్యవస్థ పనితీరు, బ్రేక్ టెస్ట్, ట్రైన్ కంట్రోల్ సిస్టమ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్ తదితర అంశాలను పరిశీలిస్తారు. ప్రయాణికులకు ఊరట... కరీంనగర్, సిద్దిపేట, మెదక్, గజ్వేల్ తదితర ప్రాంతాల నుంచి జేబీఎస్కు వచ్చే ప్రయాణికులు మెట్రో మార్గంలో నేరుగా ఎంజీబీఎస్కు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే రైల్వేస్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా మెట్రో ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి సుల్తాన్బజార్ వరకు వాహనాల రాకపోకలతో ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. మెట్రో రాక వల్ల ప్రయాణికులకు ఈ మార్గంలో ఊరట లభించనుంది. కోఠీకి కొత్త కళ... నిజాం కాలం నుంచి అతిపెద్ద వ్యాపార, వాణిజ్య కేంద్రంగా కొనసాగుతున్న అబిడ్స్, కోఠీ, సుల్తాన్బజార్ ప్రాంతాలు మెట్రోరైలు రాకతో సరికొత్త కళను సంతరించుకోనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మెట్రో రైలులో సుల్తాన్బజార్కు చేరుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ రూట్లో సిటీ బస్సులు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కోఠీ వరకు ప్రతి 30 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే ఈ రూట్లో నడిచే సిటీ బస్సులపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో సిటీ బస్సులు ఆదరణ కోల్పోయాయి. నాగోల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా అమీర్పేట్ వరకు రాకపోకలు సాగించే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గింది. ఈ రెండు ప్రధాన మార్గాల్లో ఆర్టీసీ ఏసీ బస్సులను చాలా వరకు తగ్గించింది. తాజాగా జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఎంజీబీఎస్ వరకు కొత్త లైన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం ఉంది. మరోవైపు హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.05 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను ఈ నెల 29న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగోల్–అమీర్పేట్, ఎల్బీనగర్–మియాపూర్ మార్గాల్లో 3.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికులకు మెట్రో సదుపాయం అందుబాటులోకి వస్తే మరో 2లక్షల మందికి పైగా అదనంగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. -
మానవ హారాలు..మహిళా కార్మికుల నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో మానవ హారాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంజీబీఎస్, సిటీ పరిధిలోని బస్ డిపోల వద్ద మహిళా కండక్టర్లతో నిరసనలు చేపట్టి డిమాండ్లు పరిష్కరించి విధుల్లో చేర్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటంతో పాటు సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించారు. కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6,141 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో ఆర్టీసీ బస్సులు 4,260, అద్దె బస్సులు 1,881 ఉన్నట్లు తెలిపింది. ప్రజారవాణా ఏర్పాట్లలో ప్రయాణికుల సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. 6,058 బస్సుల్లో టిమ్ల ద్వారా టికెట్లు ఇవ్వగా ,63 బస్సుల్లో మాన్యువల్ పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు చెప్పింది. -
ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం...
సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై తెలంగాణ కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఎంజీబీఎస్లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేసీఏ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తమతో ప్రభుత్వం చర్చలు జరిపితేనే సమ్మెపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్మాకు భయపడేది లేదని, ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు కార్మికులు భయపడవద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె కన్నా ఎక్కువగా తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రయివేట్ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు. బతుకు తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్ రెడ్డి, తిరుపతి, వీఎస్రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజేంద్రనగర్ బస్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు -
ఒక్క బస్సు... చుట్టుముట్టేశారు...
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం 57వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2వేల స్పెషల్ బస్సులతో పాటు 10,395 బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు బస్సులు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. అయితే తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా జూబ్లీ బస్టాండ్లోకి ఓ బస్సు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రయాణికులు... బస్సు ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచే బస్సు కోసం వేచి చూస్తున్నామని, వచ్చిన ఒక్క బస్సులో అయినా కాస్త జాగా దొరికితే చాలునుకుంటూ లగేజీ పట్టుకుని పరుగులు పెట్టారు. అలాగే హైదరాబాద్లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. సెట్విన్ బస్సులు మాత్రం యథాతథంగా నడుస్తున్నాయి. మరోవైపు జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దసరా పండుగక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లలో పడిగాపులు పడుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రయివేట్ వాహనదారులు, ఆటోవాలాలు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. పలు జిల్లాల్లో పోలీసుల భద్రత నడుమ ఆర్టీసీ బస్సులను... కాంట్రాక్ట్ సిబ్బందితో నడిపిస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు ...అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఏపీ, కర్ణాటక నుంచి బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. చదవండి: ఆర్టీసీ సమ్మె: మా టికెట్ రిజర్వేషన్ల సంగతేంటి? -
ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు మృతి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంజీబీఎస్ కేంద్రంలో చెత్త తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు ఉద్యోగులు మంగళవారం మృతి చెందారు. జీహెచ్ఎంసీ ప్రభుత్వ ఉద్యోగి హెల్పర్ ఆరీఫ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హాజిఖాన్.. విధుల్లో ఉండగా భారీ వాహనం ఒక్కసారిగా వెనుకకు రావడంతో ఈ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేయర్.. ప్రభుత్వ ఉద్యోగి ఆరీఫ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. అంతేగాక ఇరు కుటుంబాలకు పింఛను సదుపాయం కల్పిస్తామని మేయర్ భరోసానిచ్చారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్: యువతి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. వారం క్రితం కిడ్నాపునకు గురైన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ సురక్షితంగా నగరానికి చేరడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 23న రాత్రి యువతి అపహరణకు గురైనప్పటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన కిడ్నా ప్ కథ మంగళవారం ఉదయం సోనీ నగరానికి వచ్చిందని తెలి యడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా రు. ఇబ్రహీంపట్నం సమీపం లోని బొంగుళూరు గేటు వద్ద టీ స్టాల్ నడిపే ఎలిమినేటి యాదగిరి కూతురు సోనీ(22)కి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి 23న రవిశేఖర్ కారులో ఎక్కించుకుని హయత్నగర్ వరకు తీసుకొచ్చి రాత్రి 8:30 గంటల సమయంలో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పటి నుంచి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితుడు వాడిన కారు నంబర్ నకిలీదని తెలిసి కంగుతిన్నారు. అతని ఆచూకీ కోసం ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఐదు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నా యి. 3 రోజులు గడిచినా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యు ల్లో ఆందోళన పెరిగింది. చివరకు నిందితుడిని రవిశేఖర్గా గుర్తించిన పోలీసులు అతను ఆ కారును బళ్లారి నుంచి దొంగిలించినట్లుగా కనుగొన్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడు చిక్కకపోవడంతో పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం సోనీ నగరానికి చేరుకుంది. మీడియా కంట పడకుండా... ఎంజీబీఎస్లో బస్సు దిగిన వెంటనే సోనీ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వారు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. వారు సోనీ ని సరూర్నగర్ మహిళా పోలీస్టేషన్కు తరలించి, అక్కడి నుంచి ఎల్బీనగర్ సీసీఎస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మంగళవారం మొత్తం సోనీ మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. నిందితుడు రవిశేఖర్ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా అధికారులు ధృవీకరించడంలేదు. ఈ కిడ్నాప్ ఘటనపై రాచకొండ పోలీసులు సోనీని, రవిశేఖర్ను విచారిస్తున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం సోనీని వైద్య పరీక్షల నిమిత్తం పేట్ల బురుజులోని మెటర్నిటీ ఆస్పత్రికి తరలించి నట్లు సమాచారం. నిందితుడు బళ్లారిలో దొంగిలించిన కారుకు ఉన్న జీపీఆర్ఎస్తో పోలీసులు కారు కదలికలను కనుగొన్నారు. కర్నూలు, తిరుపతిలో అతని కదలికలు గుర్తించారు. చివరికి అద్దంకి, ఒంగోలులో పట్టుకున్నట్లు సమాచారం. -
మార్వలెస్.. మెట్రో స్టేషన్
సాక్షి, సిటీబ్యూరో: మహాత్మాగాంధీ బస్స్టేషన్కు సమీపంలో నిర్మించిన మెట్రోస్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద స్టేషన్ కావడం విశేషం. ఈ భారీ స్టేషన్ నగరవాసులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్–మియాపూర్(కారిడార్–1)మార్గంతోపాటు కారిడార్–2(జేబీఎస్–ఫలక్నుమా)మార్గాన్ని సైతం అనుసంధానించేలా నాలుగు అంతస్తుల భారీ స్టేషన్ను ఇక్కడ నిర్మించడం ఇంజినీరింగ్ అద్భుతమని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి ఎల్బీనగర్–అమీర్పేట్రూట్లో మెట్రో రాకపోకలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్కు 58 ప్రధాన పిల్లర్లు, ఆరుగ్రిడ్లతో నిర్మించారు. ఈ స్టేషన్ నిర్మాణానికి అత్యంత ఒత్తిడిని తట్టుకునే స్టీలు, రీయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీటును వినియోగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈస్టేషన్కు ఇరువైపులా ఉన్న ఎంజీబీఎస్, చాదర్ఘాట్ పరిసరాలను సుందరీకరించామన్నారు. కబుల్స్టోన్స్, తాండూర్, షాబాద్ రాళ్లతో పరిసరాలను తీర్చిదిద్దామన్నారు. అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో 5 కి.మీ మెట్రో మార్గంలో చారిత్రక,వారసత్వ కట్టడాలున్నందున వాటి ప్రత్యేకతను చాటేలా పరిసరాలను తీర్చిదిద్దామన్నారు. ఈ మార్గంలో ప్రధానంగా నాంపల్లి, ఎంజేమార్కెట్, జాంభాగ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగమహల్ ప్రాంతాలున్నాయన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగమహల్ ప్రాంతాల్లో అత్యధిక ఎత్తులో ఉన్న పిల్లర్లతో నిర్మిచినట్లు తెలిపారు. ఈ పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆయా స్టేషన్లను వారసత్వ కట్టడాలను తలపించేలా తీర్చిదిద్దుతామని..పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో సుందరీకరిస్తామని తెలిపారు. ఈ మార్గంలో తీరైన స్ట్రీట్ఫర్నీచర్, చూపరులను కట్టిపడేసేలా ఉండే తీరైన ఫుట్పాత్లు,హరిత వాతావరణంతో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. -
ఆగస్టులో అమీర్పేట్–ఎంజీబీఎస్ మెట్రో
సాక్షి,సిటీబ్యూరో : అమీర్పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్రన్కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు మార్గం సుగమమౌతోందని తెలిపారు. ఆగస్టులో ఎల్బీనగర్–అమీర్పేట్ రూట్లో మెట్రో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్పేట్–హైటెక్సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
ఆగస్టులో అమీర్పేట్–ఎంజీబీఎస్ మెట్రో పరుగులు!
సాక్షి,సిటీబ్యూరో : అమీర్పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్రన్కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ఆగస్టులో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్పేట్–హైటెక్సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
ఎంజీబిఎస్ వద్ద బరితెగించిన ఆటో డ్రైవర్
-
ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్లలో మార్పులు
► వోల్వో, గరుడ కార్నర్ మార్పు ► విజయవాడ వైపు వెళ్లే బస్సులు 35వ ప్లాట్ఫామ్కు సాక్షి, సిటీబ్యూరో: మహాత్మాగాంధీ బస్స్టేషన్ ప్లాట్ఫామ్లలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యం, బస్సుల నిర్వహణలో సౌలభ్యం కోసం స్వల్ప మార్పులు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఇప్పటి వరకు 21వ ప్లాట్ ఫామ్ నుంచి 24 వరకు నిలిపే గరుడ, గరుడ ప్లస్, వెన్నెల, అమరావతి, ఐరావత్ బస్సులను తాజాగా ఒకటో ప్లాట్ఫాం నుంచి 5వ ప్లాట్ఫాంకు మార్చారు. అలాగే 6వ నెంబర్ నుంచి 12వ ప్లాట్ఫామ్ వరకు నిలిపే విజయవాడ, తెనాలి, ఏలూరు సెక్టర్ బస్సులను 35వ ప్లాట్ఫామ్ నుంచి 45వ ప్లాట్ఫామ్కు తరలించారు. మిగతావన్నీ యథాతథంగానే ఉంటాయని తెలిపారు. ఆసియాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు లక్షా 50 వేల మందికి పైగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూర్, ముంబయి, చెన్నై, షిరిడీ, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 79 ప్లాట్ఫామ్లు ఉన్న ఎంజీబీఎస్లో ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకొన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, మంచినీరు, పారిశుధ్యం, తదితర సదుపాయాలను ఆధునీకరించారు. ఏ ప్లాట్ఫామ్ పై ఏ బస్సులు.... 1 నుంచి 5 ప్లాట్ఫారం వరకు: గరుడ, గరుడ ప్లస్, వెన్నెల, అమరావతి, ఐరావత్ బస్సులన్నీ నిలపనున్నారు. 6 నుంచి 7 వరకు: బెంగళూరు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులు 8వ ప్లాట్ఫారం: బెంగళూరు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సులు 9వ ప్లాట్ఫారం: అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు 10 నుంచి 11 వరకు: ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు 12వ ప్లాట్ఫారం: సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు 13వ ప్లాట్ఫారం: కుంట, బైలాదిల్లా, జగదల్పూర్ బస్సులు 14 నుంచి 15 వరకు: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు 16 నుంచి 17 వరకు: గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు 18 నుంచి 22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్ 23వ ప్లాట్ఫారం: శ్రీశైలం వెళ్లే బస్సులు 24 నుంచి 25 వరకు: అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు 36వ ప్లాట్ఫారం: రాయ్చూర్ బస్సులు 27 నుంచి 31 వరకు: మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ 32 నుంచి 34 వరకు: నాగర్కర్నూలు, కొల్లాపూర్, షాద్నగర్ 35 నుంచి 36 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్ఆర్టీసీ) బస్సులు 37 నుంచి 38 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్ఆర్టీసీ) బస్సులు 39వ ప్లాట్ఫారం: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్ఆర్టీసీ) బస్సులు 40వ ప్లాట్ఫారం : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్ఆర్టీసీ) బస్సులు 41 నుంచి 42 వరకు: గద్వాల్, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్ఆర్టీసీ) బస్సులు 43 నుంచి 45 వరకు: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్ఆర్టీసీ) బస్సులు 46 నుంచి 47 వరకు: మెదక్, బాన్సువాడ, బోధన్ వెళ్లే బస్సులు 48 నుంచి 52 వరకు: జహీరాబాద్, నారాయణఖేడ్, కరాడ్, షోలాపూర్, పుణె, ముంబయి, (టీఎస్ఆర్టీసీ, ఎంఎస్ఆర్టీసీ) బస్సులు 53 నుంచి 55 వరకు : సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ 56 నుంచి 58 వరకు: నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్, అమరావతి బస్సులు 59 నుంచి 61 వరకు: మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు 62వ ప్లాట్ఫారం: దేవరకొండ 63 నుంచి 65 వరకు: పరిగి, వికారాబాద్, తాండూరు బస్సులు 66 నుంచి 75 వరకు: ఎలైటింగ్ పాయింట్లు 76 నుంచి 79 వరకు: సిటీ సర్వీస్ బస్సులు. -
ప్యాసింజర్ల ప్రాణాలతో డ్రైవర్ల చెలగాటం!
హైదరాబాద్: ఆదాయం కోసం ఆర్టీసీ బస్సుల సిబ్బంది మధ్య పోటీ తీవ్రమైంది. డ్రైవర్లు పరస్పరం పోటీపడుతూ ప్రయాణికుల ప్రాణాలమీదికి తెస్తున్నారు. తాజాగా మహాత్మాగాంధీ బస్స్టేషన్లో జరిగిన ఈ ఘటన వివరాలివీ. శనివారం మధ్యాహ్నం కర్ణాటకకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్కు చేరుకున్నాయి. ఒకే ప్లాట్ఫాం వద్ద ఒకదాని వెనుక మరొకటి ఆగాయి. ముందుగా ఆగిన బస్సులో ప్రయాణికులంతా ఎక్కారు. దీంతో వెనుక ఉన్న బస్సు డ్రైవర్ ముందున్న బస్సులో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు యత్నించాడు. దీంతో రెండు బస్సుల డ్రైవర్ల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో కోపంతో ఉన్న మొదటి బస్సు డ్రైవర్ వేగంగా బస్సును వెనక్కి నడిపారు. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. దీంతో ఆ డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశారు. లేకపోయినట్లయితే వెనుక బస్సును ఢీకొట్టి ప్రమాదం సంభవించి ఉండేది. విషయం తెలుసుకున్న వెంటనే కంట్రోలర్ భూమయ్య అక్కడికి చేరుకొని వారిని సముదాయించి పంపించారు. బస్సుల మధ్య ఆదాయం పోటీ ప్రయాణికుల ప్రాణాల మీదికి వస్తోంది. ఈ విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
హైదరాబాద్-ముంబయి కొత్త బస్సు సర్వీసు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబయికి కొత్త గరుడ ప్లస్ బస్సును ప్రారంభించినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-ముంబయి (1093) బస్సు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 కు ముంబయి సెంట్రల్ బస్స్టేషన్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబయి-హైదరాబాద్ (1094) సర్వీస్ సాయంత్రం 5 గంటలకు ముంబయి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. చార్జీలు ఆదివారం, శుక్రవారం రూ.1500, మిగతా రోజుల్లో రూ. 1200 చొప్పున ఉంటాయని గంగాధర్ వెల్లడించారు. -
నిర్మానుష్యంగా మారిన MGBS
-
గంజాయి స్మగ్లర్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన సీహెచ్ రాజా వెల్డింగ్ వర్కర్. ఆ రకంగా వచ్చే ఆదాయం సరిపోక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఇతడికి తుని ప్రాంతానికి చెందిన అనంత రమేష్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే గంజాయి వ్యాపారంలో ఉన్న రమేష్ తాను అందించే ‘సరుకు’ను చెప్పిన చోటుకు చేర్చితే ఒక్కో ట్రిప్కు రూ.10 వేల చొప్పున చెల్లిస్తానని రాజాకు చెప్పాడు. దీనికి అంగీకరించిన రాజాకు 40 కేజీల గంజాయిని 20 ప్యాకెట్లలో పార్శిల్ చేసి.. వాటిని రెండు ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి బుధవారం అందించాడు. ఈ గంజాయిని హైదరాబాద్ తీసుకెళ్లాలని, అక్కడికి చేరిన తర్వాత ఎవరికి ‘సరుకు’ డెలివరీ చేయాలో చెప్తానని అన్నాడు. దీంతో రాజా శుక్రవారం ఎంజీబీఎస్లో బస్సు దిగాడు. ఈ అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం వలపన్ని నిందితుడిని అరెస్టు చేసింది. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్ ఆధీనంలోని యాంటీ నార్కొటిక్ సెల్కు అప్పగించారు. -
తక్కువ డబ్బే దొరికిందని విచక్షణ కోల్పోయి..
సాక్షి, సిటీబ్యూరో/అంబర్పేట: వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు... దురలవాట్లకు బానిసలు కావడంతో వచ్చే సంపాదన చాలలేదు... దీంతో ముఠా ఏర్పాటు చేసి ఎంజీబీఎస్ కేంద్రంగా తెగబడ్డారు... వారం రోజుల్లో నాలుగు నేరాలు చేసిన ఈ గ్యాంగ్ ఓ వ్యక్తి వద్ద తక్కువ మొత్తం లభించడంతో అతడిని చంపేసింది. ఈ ఘరానా ముఠాకు చెందిన నలుగుర్ని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండల డీసీపీ డాక్టర్ వి.రవీందర్ పూర్తి వివరాలు వెల్లడించారు. బానిసలై ముఠా కట్టిన వైనం... మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటకల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇక్బాల్ ఖాన్ పఠాన్, మహ్మద్ రెహాన్ అన్సారీ, షేక్ జావేద్ బతుకు తెరువు కోసం నగరానికి వలసవచ్చారు. కూలీ పనులు చేస్తూ పొట్టపోసుకునే వీరికి టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఇలియాస్ అలీ ఖాన్తో పరిచయమైంది. దురలవాట్లకు బానిసైన వీరంతా తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం చిన్న చిన్న నేరాలు చేసే వారు. వ్యసనాలు పెరిగిపోవడంతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కోసం దోపిడీలు, భారీ దొంగతనాలు చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 15న సైఫాబాద్ ఠాణా పరిధిలో పంజా విసిరారు. ఓ వ్యక్తి నుంచి ల్యాప్టాప్స్, హార్డ్డిస్క్లు ఉన్న బ్యాగ్ను తస్కరించారు. ఎంజీబీఎస్–బ్రిడ్జ్ దారిలో అడ్డా... ఈ గ్యాంగ్ అఫ్జల్గంజ్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్–శివాజీ బ్రిడ్జ్ మధ్య ఉన్న ‘మూసీ పరీవాహక ప్రాంతాన్ని’ తమ అడ్డాగా ఎంచుకుంది. ఆ మార్గంలో వెళ్లే వారిని మూసీ ఒడ్డుకు లాక్కెళ్లి దోపిడీ చేయడానికి సిద్ధమైంది. ఈ నెల 19 రాత్రి ఆ మార్గంలో వెళ్తున్న షేక్ అబ్దుల్ ఖరీద్ను వెంబడించిన ఈ నలుగురూ అదును చూసుకుని అతడిని మూసీ ఒడ్డుకు లాక్కుపోయారు. అక్కడ ఖరీద్ జేబులు తనిఖీ చేసిన ఈ దుండగులకు పర్సులో కేవలం రూ.230 లభించాయి. దీంతో విచక్షణ కోల్పోయిన నలుగురూ అతడిని హత్య చేశారు. ఇది జరిగిన రెండు రోజులకు ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ ఇవ్వమంటూ ఎక్కిన ముఠా సభ్యుడు శివాజీ బ్రిడ్జ్ సమీపంలోని సబ్-స్టేషన్ వద్దకు తీసుకువచ్చాడు. అక్కడ వాహనం ఆపించగా... మిగిలిన ముగ్గురూ దాడి చేసి బలవంతంగా మూసీ ఒడ్డుకు తీసుకువెళ్ళారు. బాధితుడి నుంచి రెండు సెల్ఫోన్లు, నగదు దోచుకుని పారిపోయారు. వారంలోనే నాలుగో నేరం... ఈ నెల 20న ఎంజీబీఎస్ వద్దే ఈ గ్యాంగ్ మరోసారి పంజా విసిరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో సబ్-స్టేషన్ వద్దకు మూత్ర విసర్జనకు వచ్చిన వ్యక్తిని పట్టుకున్న దుండగులు మూసీ ఒడ్డుకు లాక్కువెళ్ళి దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.2వేల నగదు, రెండు బంగారు బ్రాస్లెట్లు, బంగారు ఉంగరం, సెల్ఫోన్ లాక్కెళ్లారు. గాయపడిన అతను అతి కష్టం మీద అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. మంగళవారం ఎంజీబీఎస్ వద్ద నిఘా వేసి నలుగురినీ అరెస్టు చేసి అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించింది. వీరి నుంచి ఐదు సెల్ఫోన్లు, ఐదు తులాల బంగారు అభరణాలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీయాక్టు ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన టాస్క్ఫోర్స్ ఎస్సైలు సుధాకర్, సైదాబాబుల్ని డీసీపీ అభినందించి రివార్డులు అందించారు. -
ఎంజీబీఎస్లో కిడ్నాప్ గ్యాంగ్ అరెస్టు
హైదరాబాద్: నగరంలోని మహాత్మగాంధీ బస్ స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులను కిడ్నాప్ చేసి, హతమారుస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పదిహేను రోజుల క్రితం బస్టాండ్లో ఉన్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి.. అనంతరం దారుణంగా చంపారు. దీనిపై ఉప్పందుకున్న పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆ ముఠా సభ్యులు.. మరో ఇద్దరిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేశారు. దీనిని పసిగట్టిన పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ సభ్యులు జార్ఖండ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. డబ్బు కోసమే వారు ఈ దుశ్చర్యలకు ఒడిగడుతున్నట్లు సమాచారం. -
సినిమా చూడాలా.. బస్టాండ్కు వెళ్లండి!
మొదట గ్రేటర్ బస్టాండ్లలో అందుబాటులోకి అనంతరం ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని చోట్ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు వినోదభరితమైన కబురు... సరదాగా సినిమాకి వెళ్లాలనుకుంటున్నారా... ఇక మీరు సినిమాల కోసం ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లినా చాలు.. అవును, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలే ఇక మినీ థియేటర్లుగా అవతరించనున్నాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు గ్రేటర్లోని అన్ని ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు రాబోతున్నాయి. హయత్నగర్, ఈసీఐఎల్, కాచిగూడ, కోఠి, కూకట్పల్లి, పటాన్చెరులలోని బస్స్టేషన్లలో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. పటాన్చెరులోని ప్రయాణ ప్రాంగణంలో త్వరలో మినీ థియేటర్ను ప్రారంభించనున్నారు. ఒక్కో థియేటర్లో 125 నుంచి 150 మంది వరకు కూర్చొనేలా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన తరహాలోనే మినీ థియేటర్లను కూడా అద్దెకు ఇస్తారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు టిక్కెట్పైన వచ్చే ఆదాయంపై మాత్రమే ఆధారపడకుండా ఇతర మార్గాలను సైతం అన్వేషించాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ ఈ కార్యాచరణ చేపట్టింది. మొదట నగరంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలోనూ ఏర్పాటు చేస్తారు. -
MGBSలో భారీగా భద్రత మోహరింపు
-
ఎంజీబీఎస్లో 5 జీ వైఫై సేవలు..
అఫ్జల్గంజ్ (హైదరాబాద్) : మహాత్మాగాంధీ బస్స్టేషన్లో 5 జీ వైఫై సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ జేఎండీ రమణారావు వీటిని ప్రారంభించారు. 15 నిముషాలపాటు ఉచితంగా వైఫై సేవలను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. అనంతరం చార్జి చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లా కేంద్రాల్లోని బస్ట్స్టేషన్లలో కూడా త్వరలోనే వైఫై సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. -
మహాత్మాగాంధీ బస్టాండ్లో సీసీటీవీ పుటేజీలు మాయం
హైదరాబాద్ : హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్టాండ్లో సీసీటీవీ పుటేజీల మాయం కలకలం సృష్టించింది. బస్టాండ్లో దొంగలు ఒక బ్యాగ్ను ఎత్తుకెళ్లిన కేసు విషయంలో పోలీసులు గురువారం బస్టాండ్కు వెళ్లారు. ఆ కేసు విచారణ నిమిత్తం సీసీటీవీ పుటేజీలను పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే బస్టాండ్లో ఉన్న సీసీటీవీ పుటేజీల బ్యాక్అప్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు లేకుండా పోవడంతో సుల్తాన్బజార్ ఏసీపీ, ఇతర పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బస్టాండ్లో సుమారు 28 కెమెరాలతో భద్రతా కార్యక్రమాలు చేపట్టినా సీసీటీవీ పుటేజీలు లేకపోవడంతో సంబంధిత సిబ్బందిని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా సీసీటీవీ ఏజెన్సీపైన కేసు నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసును ఆఫ్జల్గంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మూసీ పరిధిలో కబ్జా ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి: సీఎస్
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో పనులు జరిగేందుకు వీలుగా మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి రంగ్మహల్ జంక్షన్ వరకు మూసీపై మూడోవంతెన నిర్మాణానికి వీలుగా నదిగర్భంలో కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను తక్షణం స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ విభాగం అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మంగళవారం మెట్రో ప్రాజెక్టుపై సచివాలయంలో జరిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఆస్తుల స్వాధీనానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎంఆర్ ఎండీలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మూసీపై మూడో వంతెన నిర్మాణానికి ఇరిగేషన్ విభాగం జీహెచ్ఎంసీ,హెచ్ఎంఆర్లకు సహకరించాలని సూచిం చారు. ప్రధాన నగరంలోని రహదారులపై మెట్రో పనులు జరిగేందుకు వీలుగా తాజాగా 27 ఆస్తులను తొలగించామని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. మరో 254 ఆస్తులను తొలగించాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో 193 ప్రైవేటు, మరో 61 మున్సిపల్ ఆస్తులున్నట్లు తెలిపారు. ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్, మధురానగర్, ఖైరతాబాద్,నాంపల్లి ప్రాంతాల్లో మెట్రో పనులకు అడ్డుగా ఉన్న 33 కెవి, 11 కెవి విద్యుత్ లైన్స్ను మార్పుచేయాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. మెట్రో పనుల కోసం రహదారులపై తవ్విన గుంతలను తక్షణం పూడ్చివేయాలని, పనులు పూర్తయిన ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్,హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిట
-
సొంత ఊళ్లకు పయనం
సాక్షి, సిటీబ్యూరో : సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు మూడు రోజులుగా సీమాంధ్రకు తరలివెళ్తున్న ప్రయాణికుల రద్దీ మంగళవారం తారాస్థాయికి చేరుకుంది. బుధవారం ఎన్నికలు కావడంతో నగరవాసులు భారీ సంఖ్యలో బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు కిటకిటలాడాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బస్సులు, రైళ్లలోనే కాకుండా లక్షలాది మంది ప్రజలు సొంత వాహనాలు, ట్యాక్సీల్లో బయలుదేరి వెళ్లారు. మూడు రోజులుగా చార్జీలు రెట్టింపు చేసిన ప్రైవేట్ ఆపరేటర్లు మంగళవారం కూడా దోపిడీ కొనసాగించారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులే ప్రయాణ చార్జీలను భరిస్తుండడంతో ప్రయాణికులు చార్జీలు రెట్టింపయినా లెక్క చేయకుండా బయలుదేరారు. మంగళవారం ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది బయలుదేరినట్లు అంచనా. కిక్కిరిసిన ఎంజీబీఎస్ ... మహాత్మాగాంధీ బస్స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. రోజూ నడిచే 850 దూరప్రాంత బస్సులతో పాటు, మంగళవారం మరో 700 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, కడప, నె ల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ బస్సులు సైతం కిటకిటలాడాయి. కూకట్పల్లిహౌసింగ్బోర్డు, అమీర్పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ బస్సులు బయలుదేరాయి. ప్రయాణికుల ధర్నా.. సికింద్రాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఎక్స్ప్రెస్ల వద్ద గందరగోళం నెలకొంది. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, రిజర్వేషన్ నిర్ధరణకాని వాళ్లు, జనరల్ బోగీ ప్రయాణికుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వారిని స్లీపర్క్లాస్ బోగీల్లోకి అనుమతించారు. దీంతో అప్పటికే స్లీపర్క్లాస్లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ ప్రయాణికులంతా బోగీల్లోకి ఎక్కేయగా రిజర్వేషన్ ప్రయాణికులు ప్లాట్ఫామ్పైనే ఉండిపోవలసి వచ్చింది. విశాఖకు వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్ప్రెస్లో ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. కొంతమంది టీసీలు ప్రయాణికుల వద్ద అదనపు డబ్బులు తీసుకొని ఎస్-6 బోగీలోకి సాధారణ ప్రయాణికులను ఎక్కించడంతో 30 మందికి పైగా రిజర్వేషన్ ప్రయాణికులు స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో మరో రైలులో వారిని విశాఖకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల అభిప్రాయాలు.. ఓటు వేసేందుకు వచ్చా.. నేను మహారాష్ట్ర ఉద్దిర్లో వ్యాపారం చేస్తున్నా. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వ్యాపారాన్ని మానుకుని మా స్వస్థలమైన చిత్తూరు జిల్లా కలకడ మండలం, కోన గ్రామానికి వెళ్తున్నా. - నాగస్వామి నాయక్ బంధువులతో కలిసి.. పదేళ్ల క్రితం రాజమండ్రి నుంచి నగరానికి వచ్చి రంగారెడ్డి జిల్లా యమన్నగర్లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఎన్నికల్లో ఓటు వేసేందుకు మా బంధువులతో కలిసి రాజమండ్రికి వెళ్తున్నా. - ఎండపల్లి వీరవేణి పనిమానేసి వెళ్తున్నా.. కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి శంషాబాద్లో భవన నిర్మాణ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నా. మా స్వస్థలమైన కావలి (నెల్లూరు జిల్లా) లో ఓటు వేసేందుకు పనిమానేసి వెళ్తున్నా. - శ్రీనివాస్, శంషాబాద్ -
మేము సైతం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటుహక్కు వినియోగించుకునేందుకు మంగళవారం నగరం నుంచి వేలాది మంది జిల్లావాసులు పల్లెబాట పట్టారు. తమ తమ వృత్తులు, వ్యాపారాల రీత్యా నగరంలో వీరంతా ఓటు వేసేందుకు తమ సొంత ఊళ్లకు బయలుదేరివెళ్లారు. బుధవారం ఎన్నికలు, గురువారం మే డే రోజున సెలవు కూడా కలిసి రావడంతో స్వగ్రామాలకు బయలుదేరారు. రాజధాని నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే వాహనాలు మంగళవారం సాయంత్రం నుంచి కిటకిటలాడాయి. ఆర్టీసీ చాలా బస్సులను పోలింగ్ సిబ్బంది కోసం కేటాయించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి జిల్లాలోని నలుమూలలకు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైంది. కుటుంబాలతో ఇళ్లకు బయలుదేరిన వారు బస్సుల్లేక ప్రత్యామ్నాయ వాహనాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల కమిషన్ చేసిన విస్త్రృత ప్రచారం కారణంగా ఈసారి ఓటర్లలో చైతన్యం పెరిగింది. దీనికి తోడు రెండు రోజుల వరుస సెలవులు రావడంతో సుదూర ప్రాంత ప్రజలు కూడా స్వస్థలాలకు పయనమయ్యారు. -
MGBSలో ప్రయాణికుల ఆందోళన
-
ఎంజీబీఎస్లో నాలుగు కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్టాప్లో సోమవారం పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నాలుగు కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు ? నాలుగు కిలోల బంగారం ఎక్కడిది ? అని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లా జహీరాబాద్ ముత్తూట్ ఫైనాన్స్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. లాకర్లు తెరుచుకోకపోవడంతో వెనుతిరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంజీబీఎస్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తే... జహీరాబాద్లో చోరీకి ప్రయత్నించింది కూడా ఒకరేనా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక విశాఖ జిల్లా అరకు యండపల్లివలస కెనరాబ్యాంక్లో చోరీకి యత్నం జరిగింది. కాగా ఎంత ప్రయత్నించినా లాకర్లు ఓపెన్ కాకపోవడంతో దొంగలు పరారయ్యారు. -
‘బస్సులో భోజనం’ షురూ
హైదరాబాద్, న్యూస్లైన్: దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఉద్దేశించిన ‘ఆర్టీసీ డిన్నర్ ఆన్ బోర్డు’ (ప్రయాణంలో భోజనం) సదుపాయాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఆపరేషన్స్) జి.వి.రమణారావు శనివారం ఇక్కడ ఎంజీబీఎస్లో లాంఛనంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ పథకాన్ని బెంగళూరు, పుణే, షిర్డీ, చెన్నై, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ బస్సులకు మాత్రమే పరిమితం చేశామని, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందననుబట్టి దశలవారీగా మరిన్ని బస్సులకు విస్తరింపజేస్తామన్నారు. ప్రయాణికులు 4 గంటల ముందుగా 8688931666 నంబర్కు ఫోన్ చేసి రోటీ, బిర్యానీ, మీల్స్, శాండ్విచ్, పుల్లారెడ్డి స్వీట్లు, కరాచీ బేకరీ ఐటమ్స్తోపాటు వారు కోరుకున్న ఐటమ్స్ను ఆర్డర్ చేస్తే ఎంజీబీఎస్లో వారికి ఆయా పదార్థాలను అందిస్తామన్నారు. కాగా, ఈ ఆహార పదార్థాలను సరఫరా చేసే ‘ఎలాంగ్ ది వే’ సంస్థ సీఈవో సురేంద్ర లింగారెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు రుచి, శుచితో కూడిన వేడివేడి ఆహార పదార్థాలను అందించినందుకుగాను మార్కెట్ ధరకన్నా 20 శాతం అధికంగా సర్వీసు చార్జీలను వసూలు చేస్తామన్నారు. అనంతరం విశాఖపట్నం, షిర్డీ, విజయవాడ, బెంగళూరులకు వెళ్లే బస్సుల్లోని ప్రయాణి కులకు ఉచితంగా తొలిరోజు డిన్నర్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ సి.వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.