Nayi Brahmins
-
చరిత్రలో తొలిసారి నాయీ బ్రాహ్మణులకు టీటీడీ బోర్డులో చోటు
కడప కార్పొరేషన్: సీఎం వైఎస్ జగన్కి నాయీ బ్రాహ్మణులు ఆజన్మాంతం రుణపడి ఉంటారని ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు సిద్దవటం యానాదయ్య అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక హెడ్పోస్టాఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యానాదయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా టీటీడీ పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. -
బాబు చీకటికి.. జగన్ వెలుగులకు ప్రతినిధి
సాక్షి, అమరావతి: చంద్రబాబు చీకటికి ప్రతినిధి అయితే సీఎం వైఎస్ జగన్ వెలుగులకు ప్రతినిధి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తొస్తారని.. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు వారిని అవహేళన చేశారని గుర్తుచేశారు. బాబుకు బీసీలంటే చిన్నచూపు అని, వారిని అణిచివేయడమే లక్ష్యంగా పనిచేస్తారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన నాయీబ్రాహ్మణ కృతజ్ఞతా సభలో సజ్జల మాట్లాడారు.. నాయీ బ్రాహ్మణులు కాలర్ ఎగరేసి బతికేలా సీఎం జగన్ చేశారు. అలాంటి నాయకుడికి నాయీ బ్రాహ్మణులు అండగా నిలవాలి. వారికి ఇప్పటికే ఆలయాల పాలక మండళ్లలో అవకాశం కల్పించారు. చట్ట సభల్లో కూడా అవకాశం దక్కుతుంది. త్వరలో ఎమ్మెల్సీ కూడా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీసీలే బాబును భూస్థాపితం చేస్తారు. బీసీలకు ఇప్పటికే అధికభాగం పదవులు ఇవ్వగలిగాం. సమాజంలో బీసీల ఆత్మగౌరవం పెరిగేందుకే ఇదంతా చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు బాబు హయాంలో అంతటా అవినీతి, అక్రమాలే. లోకేశ్కు ఏం పీకుతున్నారనే మాట తప్ప మరేదీ నేర్పలేదేమో? నోరు తెరిస్తే ఆ పీకుడు భాషే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు మీడియా బలం తప్ప మరేమీలేదు. ఇక వచ్చే ఎన్నికలలో వంచనతోనే చంద్రబాబు గెలవాలనుకుంటున్నారు. ఆయన పాలనలో సామాన్యులు బతకలేరు. ఈసారి చంద్రబాబును రాజకీయంగా అంతం చేయాలి. వైఎస్సార్సీపీ 175కి 175 సీట్లు విజయం సాధించడమే లక్ష్యంగా బీసీలు పనిచేయాలి. చెప్పింది చెప్పినట్లుగా.. : యానాదయ్య సభాధ్యక్షుడు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పాదయాత్రలో నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు. జగనన్న చేదోడు ద్వారా రాష్ట్రంలోని వృత్తిదారులైన నాయీబ్రాహ్మణులకు ఇప్పటికీ మూడుసార్లు పదివేల చొప్పున అంటే రూ.30 వేలు వారి ఖాతాల్లో వేశారన్నారు. అలాగే, వృత్తిదారులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాక, వివిధ దేవాలయాలలో పనిచేసే నాయిబ్రాహ్మణులకు రూ.20 వేలు వేతనం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎం జగన్కు ఎప్పటికీ అండగా నిలుస్తామని యానాదయ్య స్పష్టంచేశారు. బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలి.. మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. అసెంబ్లీలో, మండలిలో వారిని అడుగుపెట్టించేలా చేయగల సత్తా సీఎం జగన్కే ఉందన్నారు. ఆయన తన పాదయాత్ర ద్వారా 139 బీసీ కులాల వారితో మాట్లాడి ఆయా కులాల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని.. తన కేబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందిని మంత్రులుగా చేసి సామాజిక న్యాయాన్ని అమలుచేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు. ఆయన తన మాటను ఎలా నెరవేర్చారో నాయీ బ్రాహ్మణులందరూ అదే రీతిలో వచ్చే ఎన్నికల్లో జగన్ని సీఎంని చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్కు అండగా నిలవాల్సిన బాధ్యత బీసీలందరిపై ఉందన్నారు. దివంగత నేత వైఎస్సార్, జ్యోతిరావు ఫూలే, ధన్వంతరీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సభలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు పుత్తా ప్రతాప్రెడ్డి, ఎ. నారాయణమూర్తి, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు, ఆరెపాటి పెంటారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు కోటేశ్వరరావు (ఆంధ్ర), ఎం సుబ్బరాయుడు (రాయలసీమ) వెంపటాపు లోకరాజు (ఉత్తరాంధ్ర), రాష్ట్ర కోశాధికారి ఎస్. ధనవిజయుడు, గౌరవ సలహాదారులు కిందాడ సత్యన్నారాయణ దేవాలయాల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, డైరెక్టర్ తొండమల్లు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి
సాక్షి, హైదరాబాద్: క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బడా పారిశ్రామిక వేత్తలు, ఇతర కులాలు తమ వృత్తిలోకి ప్రవేశించి నాయీబ్రాహ్మణుల జీవనోపాధికి గండికొడుతున్నాయని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు యం. లింగం నాయీ ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్ సహా పలు బడా సంస్థలు మోడ్రన్ సెలూన్స్ పేరుతో తమ పొట్ట కొడుతున్నాయని.. ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మోడ్రన్ సెలూన్స్కు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనకు కేసీఆర్ అండగా నిలబడ్డారని.. ప్రత్యేక రాష్ట్రం రాగానే క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ జీవో ఇస్తానని మాటిచ్చినట్టు గుర్తు చేశారు. ఇతర కులవృత్తులను కాపాడటానికి జీవోలు ఇచ్చినట్టుగానే తమకు కూడా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను అభ్యర్థించారు. నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ద్వారా క్షౌరవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించాలని పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కాగా, రిలయన్స్ సెలూన్స్ వ్యాపారంలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు ఆందోళనలకు దిగుతున్నారు. -
నాడు అవమానం.. నేడు అందలం
తిరుపతి తుడా: గతంలో చంద్రబాబు తీరుతో నాయిబ్రాహ్మణులు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారని నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ సిద్దవటం యానాదయ్య చెప్పారు. అవమానాలన్నీ దిగమింగి జగనన్నను సీఎంగా గెలిపించుకోవడంతో ఇప్పుడు గౌరవ ప్రదమైన స్థానంలో నిలిపారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా సుందరయ్యనగర్లో బుధవారం నాయిబ్రాహ్మణులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని తీర్మానించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ నేత చిమటా రమేష్, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తొండమల్ల పుల్లయ్య, కుల సంఘాల నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యానాదయ్య మాట్లాడుతూ తిరుమలలో పీస్ రేట్పై పనిచేసే 241 క్షురకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారని, జగనన్న తోడు పథకం ద్వారా క్షురకులకు రూ.10 వేల చొప్పున రూ.58 కోట్లు, దేవాలయాల్లో పనిచేసే మంగళ వాయిద్యకారులకు గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచిన విషయాన్ని ప్రస్థావించారు. నాయిబ్రాహ్మణుల రాజకీయ ఎదుగుదలకు ఇప్పుడే అడుగులు పడ్డాయని.. భవిష్యత్తులో నాయిబ్రాహ్మణులకు మరింత ప్రాధాన్యం పెరగాలంటే జగనన్న వెంట నడవాలని యానాదయ్య పిలుపునిచ్చారు. నాయిబ్రాహ్మణులంతా మూకుమ్మడిగా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేస్తున్నట్టు ఈ సందర్భంగా వారు మీడియాతో చెప్పారు. -
3న క్షౌరశాలలు మూసివేత
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాలలో కార్పొరేట్ బ్యూటీ సెలూన్ ఏర్పాటును నిరసిస్తూ క్షౌరవృత్తిదారులు చేపట్టిన నిరసనలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రకటించింది. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటుకానున్న కార్పొరేట్ బ్యూటీ సెలూన్ను వ్యతిరేకిస్తూ జనవరి 21 నుంచి క్షౌరవృత్తిదారులు దుకాణాలు మూసివేసి రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం శోచనీయమని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ అన్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశమైందని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3న (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలలు మూసివేసి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులు తమ పొట్టగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ క్షౌరవృత్తిదారులు నిద్రాహారాలు మాని పది రోజులుగా నిరసనలు చేస్తున్నా పాలక యంత్రాంగం నుంచి కనీస స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఫిబ్రవరి 3న జరగనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్షౌరవృత్తిదారులకు ఆయన పిలుపునిచ్చారు. -
తొలివైద్యుల చరిత్ర
అనేక కులవృత్తులు ఉన్నాయి. వాటన్నింటికీ వాటి వాటి చరిత్రలూ ఉన్నాయి. అణగారిన కొన్ని కులాల వృత్తుల చరిత్రలు చాలావరకు మరుగునపడ్డాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి వాటిని వెలికితీసే ప్రయత్నం అంత తేలికేమీ కాదు. ‘తొలి వైద్యులు’ పుస్తకం ద్వారా అలాంటి ప్రయత్నమే చేశారు రచయిత అన్నవరపు బ్రహ్మయ్య. అంతేకాదు, తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు కూడా. క్షురక వృత్తికి సంబంధించిన ప్రాచీన మూలలను పరిశోధించి, చక్కని పుస్తకాన్ని అందించిన రచయితకు అభినందనలు. భారత భూభాగాన్ని ఏలిన తొలి చక్రవర్తి మహాపద్మనందుడు మంగలి కులస్తుడు. భారతదేశంలోనే కాదు, మిగిలిన ప్రపంచ దేశాల్లోనూ ఎక్కడైనా తొలినాటి వైద్యులు క్షురక వృత్తి చేసేవారే. శరీర శుభ్రతకు దోహదపడేలా వెంట్రుకలు కత్తిరించడమే కాదు, వ్రణాలు, గాయాల వల్ల పాడైపోయిన అవయవాలను తొలగించే తొలి శస్త్రచికిత్సకులు క్షురకులే! మంగళవాద్యాలను వాయించే క్షురకులకు సంగీతంతో గల చిరకాల అనుబంధాన్ని కూడా ఈ పుస్తకంలో చారిత్రక ఆధారాలతో సహా ప్రస్తావించడం విశేషం. క్షురక సామాజిక వర్గం నుంచి ఎదిగి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి సంక్షిప్త పరిచయ వ్యాసాలు ఈ పుస్తకానికి నిండుదనాన్ని ఇచ్చాయి. ఒకనాడు దేశాన్ని ఏలిన కులానికి చెందిన వారు, ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచిన కులానికి చెందినవారు కాలక్రమంలో వెనుకబాటుకు లోనైన క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే! కుల వివక్ష వేళ్లూనుకున్న మన దేశంలో అణగారిన కులాలకు సంబంధించిన చారిత్రక విశేషాలను వెలుగులోకి తెచ్చే ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - దాసు తొలివైద్యులు రచయిత: అన్నవరపు బ్రహ్మయ్య ప్రచురణ: తెలుగు తోరణం ప్రచురణ, విజయవాడ ధర: రూ.180 ప్రతులకు: రచయిత, ఇంటినం: 15–103/3డి, గొల్లపూడి డైమండ్ అపార్ట్మెంట్, గొల్లపూడి, విజయవాడ మొబైల్: 94403 20886, 89198 23256 -
‘లింగం నాయీకి ఎమ్మెల్సీ ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రతినిధులు గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆధ్వర్యంలో కవిత నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. నాయీ బ్రాహ్మణులకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. తమ సామాజిక వర్గం స్థితిగతులపై సంపూర్ణ అవగాహనతో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారని, ఇప్పటివరకు నాయీ బ్రాహ్మణులు రాష్ట్ర చట్టసభలో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. తమకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా లింగం నాయీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక తరపున కవితను ఈ సందర్భంగా అభ్యర్థించారు. మూడు దశాబ్దాల నుంచి నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి లింగం నాయీ పాటుపడుతున్నారని తెలిపారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కూడా ఆయన తన వంతు కృషి చేశారని వెల్లడించారు. కవితను కలిసిన వారిలో ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు గోవింద్భక్ష మహేష్ చంద్ర, కోశాధికారి రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డితో పాటు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్లను వీరు కలిశారు. లింగం నాయీ పేరును సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్సీగా నామినేట్ చేసేలా చూడాలని కోరారు. -
‘సీఎం ఆదేశాలను పక్కదారి పట్టిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను విద్యుత్ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వగా... అవగాహనలేమితో అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇతర కులాలు, మతాల వారు నడుపుతున్న క్షౌరశాలలు, బ్యూటీపార్లర్లను కూడా ఈ పథకం కింద నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు అందలేదని జవాబిచ్చారని తెలిపారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే క్షౌరవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న క్షురకులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే ఉచిత విద్యుత్ పథకంలో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
‘గ్రేటర్’ ఎన్నికల్లో 10 శాతం సీట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పాలకులు తమను పట్టించుకోవడం లేదని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోవడంతో తమ గళం వినిపించే అవకాశం లేకుండాపోయిందని వాపోయారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభ్రదుల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లుగాల్ల గురప్ప ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన నాయీ బ్రాహ్మణులు ఆత్మగౌరవం రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురప్పను గెలిపించుకోవాలని బహుజనులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లాక్డౌన్లో క్షౌరశాలలు మూతపడటంతో వృత్తిదారులు చాలా కష్టాలు పడ్డారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని తెలిపారు. తెలంగాణ సర్కారు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణులకు 10 శాతం సీట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు, ప్రధాన కార్యదర్శ ఎం. సుబ్బారాయుడు, సీఎల్ఎన్ గాంధీ, రామానంద స్వామి, సీనియర్ కార్టూనిస్ట్ నారూ, డాక్టర్ రాపోలు సుదర్శన్, బాలరాజు, ఎం రమేశ్, ఎ. సుధాకర్, ధన్రాజ్, కె. యాదగిరి, కె. ఈశ్వర్, జె. మనోహర్ తదితరులు పాల్గొన్నారు. (జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల) -
గోపి కుటుంబానికి ఆపన్నహస్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సెలూన్ నిర్వాహకుడి కుటుంబానికి నాయీ బ్రాహ్మణులు ఆపన్నహస్తం అందించారు. లాలాపేటకు చెందిన పయ్యావుల గోపి.. సీతాఫల్మండిలో సెలూన్ నిర్వహించేవాడు. కరోనా కారణంగా గిరాకీ లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక, దుకాణం కిరాయి చెల్లించలేక గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబం దిక్కులేనిదయింది. గోపి కుటుంబానికి వరంగల్ సెలూన్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. మంగళవారం లాలాపేటలో పయ్యావుల గోపి కుటుంబ సభ్యులను కలిసి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేశారు. అన్నివేళలా అండగా ఉంటామని వారికి భరోసాయిచ్చారు. గోపి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వరంగల్ సెలూన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవెల్లి సురేశ్, బీజేపీ నాయకుడు సూర్యపల్లి శ్రీనివాస్, సింగారపు శ్యామ్, శ్రీరాములు, మహేష్, జంపాల రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘జగనన్న చేదోడు’కు జావెద్ హబీబ్ బిగ్ థ్యాంక్స్
ముంబై : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ప్రశంసల వర్షం కురిపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించడంపై జావెద్ హబీబ్ స్పందించారు.('పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు') ‘కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చివేసింది. ఫ్రొఫెషన్లను కూడా మార్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకం పేరే జగనన్న చేదోడు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు అండగా నిలవడానికి తీసుకొచ్చిన పథకం ఇది. ఒకేసారి వీరికి రూ.10 వేల సాయం అందనుంది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ బిగ్ థ్యాంక్స్ అంటూ ‘జగనన్న చేదోడు’ పథకంపై జావెద్ హబీబ్ ప్రశంసలు ఝల్లు కురిపించారు. మరోవైపు లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జగనన్న చేదోడు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సెలబ్రిటీ స్టైలీస్ట్ హర్మన్ కౌర్ అన్నారు. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేసి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. (‘జగనన్న చేదోడు’ ప్రారంభం) తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. -
'పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు'
సాక్షి, తాడేపల్లి: రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం 'జగనన్న చేదోడు' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున నగదును జమచేశారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం చూపిన చొరవకు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కోటిపల్లి రామతులసి మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం సీఎం జగన్కు రుణపడి ఉంటుంది. నవరత్నాలు పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షన్లు ఇస్తున్నారు. ఇంక్రిమెంట్ పెరిగినట్టుగా పెన్షన్ పెంచుతున్నారు, అవ్వతాతలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు. నేనున్నానని చెప్పిన విధంగానే మాకు మీకు సాయపడుతున్నారు. కరోనా సమయంలో బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో మీరు అందించిన సాయం ఎంతగానే అక్కరకొచ్చింది. రాబోయే తరంలోనూ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి' అంటూ రామతులశమ్మ ఉద్వేగానికి లోనైంది. చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం చిన్న పిల్లలకు ఓటు హక్కు ఉండదని ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవు. అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లలకు చేయూత ఇచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పేదలకు ఏ పథకం రావాలో వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గురించి ఇంతగా ఆలోచించిన పాలకులు ఎవరూ లేరు. ఐదేళ్లలో చేయాల్సిన పనులను ఏడాదిలోనే చేసి చూపించారు. -ఎం. హేమావతి(రజకురాలు), అనంతపురం నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు వాలంటీర్ నేరుగా మా షాప్కు వచ్చి లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు. 30 ఏళ్లుగా నేను ఇలాంటి స్కీమ్ చూడలేదు. లబ్ధిదారుల్లో నా పేరు ఉండటం సంతోషాన్ని కలిగించింది. నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు. మీ నాన్న దయగారి వల్ల నాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు మీ దయతో నా మేనల్లుడికి స్థలం వచ్చింది. తరతరాలకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. - పైడియ్య (నాయీ బ్రాహ్మణుడు) - శ్రీకాకుళం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు జగనన్న చోదోడుతో కరోనా సమయంలో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మరో 50 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలి. గ్రామ సచివాలయాలు నిర్మించి ఎంతో మంచిపని చేశారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన నాయకుడు వైఎస్ జగన్. మీరు ధన్యులు సార్, మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు. -రామకోటేశ్వరరావు (దర్జీ) - పశ్చిమ గోదావరి -
మరో పథకానికి శ్రీకారం
-
చెప్పిన ప్రతి మాటను నెరవేర్చగలిగాను
-
‘జగనన్న చేదోడు’ ప్రారంభం
సాక్షి, అమరావతి: పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న చేదోడు పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. 3.58 కోట్ల మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ వంటి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చగలిగానని సీఎం జగన్ అన్నారు. (ప్రత్యేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్) -
అర్హులందరికీ రూ.10వేలు సాయం
-
నేడు జగనన్న చేదోడు
సాక్షి, అమరావతి: ‘షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలరింగ్ షాపులున్న దర్జీలకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తాం.. వారికి తోడుగా ఉంటాం’.. ఇది వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని అంశం. ఈ హామీని అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ఈ వర్గాలను ఇంత వరకూ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని తొలిసారి ఆలోచన చేసి, పార్టీ మేనిఫెస్టోలో వారికి స్థానం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ► ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. మన ప్రభుత్వం వచ్చాక మీ కష్టాలు తీరుస్తానని నాడు వారికి భరోసా ఇచ్చారు. ► అధికారంలోకొచ్చి ఏడాది కాగానే వారికి ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ► ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు. ఆయా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. ► రాజకీయాలు, పార్టీలకతీతంగా అర్హులైన నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. మొత్తం 2,47,040 మంది అర్హులగా తేలారు. వీరిలో టైలర్లు 1,25,926 మంది, రజకులు 82,347 మంది, నాయీ బ్రాహ్మణులు 38,767 మంది ఉన్నారు. వీరందరికీ జగనన్న చేదోడు పథకం కింద మొత్తం రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. -
మా అనుమతి లేకుండా సెలూన్ పెడతవా..
శంషాబాద్: తమ అనుమతి లేకుండా సెలూన్ షాపు ఎలా పెడతావని ఓ వ్యక్తిపై నాయీబ్రాహ్మణ సంఘం నేథ దాడి చేశాడు. ఈ సంఘటన శంషాబాద్ పట్టణంలో బుధవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. దూసకంటి జానకీరాం, రమాదేవి దంపతులు పట్టణంలోని వీకర్సెక్షన్ కాలనీలో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. జీవనోపాధి నిమిత్తం జానకీరాం పురపాలక సంఘం అనుమతి తీసుకొని వెళాంగనీ కాలనీ వద్ద సెలూన్ షాప్ పెట్టుకోడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ విషయమై స్థానిక నాయిబ్రాహ్మణ సంఘం నేతలు కొద్దిరోజులుగా అతడిని అడ్డుకుంటున్నారు. జానకీరాం స్థానికుడు కాదని, స్థానికులు మాత్రమే దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా బుధవారం జానకీరాం ఏర్పాటు చేసుకుంటున్న దుకాణం వద్దకు వచ్చిన పట్టణ నాయిబ్రాహ్మణ సంఘం నాయకుడు పాండు అతడిపై దాడికి పాల్పడ్డాడు. అతడి భార్య రమాదేవి వేడుకున్నా వదిలిపెట్టకుండా జానకీరాంపై పిడిగుద్దులు కురిపించాడు. దుకాణం వెంటనే తీసేయాలని హెచ్చరించాడు. ఈ విషయమై బాధిత దంపతులు ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. శంషాబాద్లో పుట్టి పెరిగిన తమను స్థానికులు కాదని దౌర్జన్యానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొన్నిరోజులుగా నాయీబ్రాహ్మణ సంఘం నేతలు బెదిరిస్తున్నారని ఆర్జీఐఏ పోలీసులతో పాటు మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని బాధిత దంపతులు పోలీస్స్టేషన్ వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
నాయీ బ్రాహ్మణులను ఆదుకుంటాం: వినోద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బి.వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్లోని ఆయన నివాసంలో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు వినోద్ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో హెయిర్ సెలూన్లతో పాటు తమ వృత్తికి జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని, విద్యుత్ రాయితీ ఇవ్వడంతో పాటు పనిముట్లను ఉచితంగా అందించాలని కోరారు. నాయీ బ్రాహ్మణుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన వినోద్.. దశల వారీగా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో నాయీ బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మోహన్, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి జితేందర్ తదితరులున్నారు. -
రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మిర్దొడ్డి మండలం ఖాజీపూర్లో ఆత్మహత్యకు పాల్పడిన క్షౌరవృత్తిదారుడు రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అతడి కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం అందించాలని కోరింది. క్షౌరవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రవి లాక్డౌన్తో ఉపాధిలేక, ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని ఐక్యవేదిక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ అన్నారు. అతడి ఇద్దరు కూతుళ్లు కావ్య(13), వైష్ణవి(10)లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. క్షౌరవృత్తిదారులు మనోధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షౌరవృత్తిదారులను ఆదుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి క్షురకునికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూతపడిన సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి అండగా నిలబడాలని జిల్లా నాయీ బ్రాహ్మణ నాయకులను ఆదేశించారు. -
కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయండి..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షురకులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నెలన్నర రోజులుగా క్షౌరశాలలను మూసివేయడంతో వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. క్షౌర వృత్తిదారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు రూ. 5 వేలు చొప్పున సహాయం అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న రెడ్జోన్లలో 35 వేలకు పైగా క్షౌరశాలలు ఇప్పటికీ మూతపడివున్నాయని వెల్లడించారు. వీటిపై ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారుల జీవనం దుర్భరంగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి క్షౌర వృత్తిదారులకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవస్థానాల్లోని కల్యాణ్ కట్టలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కూడా ఇదే విధంగా తోడ్పాటు అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. -
కులవృత్తులపై కరోనా ఎఫెక్ట్
-
బతుకు చిత్రం మారుతోంది!
సాక్షి, అమరావతి: ‘ఇల వృత్తులెన్ని ఉన్నా.. కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా’ అని నమ్మి.. వృత్తులపైనే ఆధారపడిన జీవిస్తున్న వారి బతుకు చిత్రాలను కరోనా వైరస్ మార్చేసింది. వృత్తిదారుల వెతలను వెనుకటి కాలానికి తీసుకెళ్లింది. దాదాపు 30 ఏళ్ల క్రితం నాయీ బ్రాహ్మణులు ప్రజల ఇళ్లకే వెళ్లి వృత్తి నిర్వహించేవారు. ప్రస్తుతం పూట గడుపుకోవటానికి పాత పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ► మూడు దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాలు, చిన్నపాటి పట్టణాల్లో నాయీ బ్రాహ్మణులు పొది (కత్తెరలు, కత్తులు, దువ్వెన, చిన్న గిన్నె వంటివి) తీసుకుని ఇంటింటికీ తిరిగి కేశ సంస్కారం చేసేవారు. ► అప్పట్లో పంటలు వచ్చే సమయంలో ఏడాదికి రెండుసార్లు బస్తాల లెక్కన ధాన్యం, కొంత నగదు, బియ్యం ఇచ్చేవారు. ఈ విధానాన్ని ‘వతను’ అనేవారు. ► రానురాను ఫ్యాషన్ ప్రపంచంతో పోటీపడుతూ పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోనూ అద్దాల క్యాబిన్లు, ఈజీ చైర్లు వంటి సౌకర్యాలతో సెలూన్లు అందుబాటులోకి వచ్చాయి. ► కరోన దెబ్బతో సెలూన్లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిలో పనిచేసే వారు ఉపాధి కోల్పోయారు. పూట గడవని దయనీయ స్థితిలో వారంతా పాత పద్ధతిని అనుసరిస్తూ ఇంటింటికీ వెళ్లి క్షౌ ర వృత్తి చేస్తూ ఉపాధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ► లాక్డౌన్ ఆంక్షలను సడలించే వేళ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య మొహానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి.. శానిటైజర్లు వినియోగిస్తూ కేశ సంస్కారం చేస్తున్నారు. ► ఒకవేళ ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే వినియోగదారులే వారిని అప్రమత్తం చేయడం.. వినియోగదారులు అలక్ష్యంగా ఉంటే వృత్తిదారులు చైతన్యంతో వ్యవహరిస్తున్నారు. ► రాష్ట్రంలో సుమారు 5 లక్షల నాయీ బ్రాహ్మణ కుటుంబాలు కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఒక అంచనా. ప్రస్తుతం వారికి ఉపాధి దొరకడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న సాయంపైనే ఆధారపడి బతుకుల్ని నెట్టుకొస్తున్నారు. వృత్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం కరోనా కారణంగా వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ రోజుల్లోనే నాలుగు డబ్బులు కనిపించేవి. ఇప్పుడు పూట గడవని పరిస్థితుల్లో నాయీ బ్రాహ్మణులు పాత పద్ధతిలోనే ఇంటింటికీ వెళ్లి వృత్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. – పొన్నాడ సూర్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ నంద యువసేన -
కరోనా: నాయీ బ్రాహ్మణుల్ని ఆదుకుంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులకు వైద్యం అం దించే స్వచ్ఛంద సంస్థల వివరాలు అందజేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా దీర్ఘకాలంగా అనారోగ్య స మస్యలతో బాధపడే వారికి చికిత్స చేయించేం దుకు బాధితులతోపాటు వారి సహాయకులు ఆస్పత్రులకు వెళ్లేందుకు పాస్లు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది కె.శివగణేశ్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. బాధితులకు ప్రభుత్వం వలంటీర్లను ఏర్పాటుచేయాలని కోరడం సబబుకాదని, వారికి సేవలందించే స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆసక్తి చూపే వారిని పిటిషనరే గుర్తించి తమకు నివేదించాలని ధర్మాసనం సూచించింది. విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేసింది. కరోనాకు సంబంధించి ఇత ర వ్యాజ్యాల్లో ప్రభుత్వం ఈ నెల 22 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నాయీ బ్రాహ్మణుల్ని ఆదుకుంటున్నారా? లాక్డౌన్తో క్షౌరశాలలు మూతపడటంతో నా యీ బ్రాహ్మణులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటున్నదీ వివరించాలని ప్రభుత్వాన్ని హైకో ర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేసింది. రేషన్ కార్డులు లేని వారిని, ఇతర రాష్ట్రాల వారికి, వలస కార్మికులకు ప్ర భుత్వం మనిషికి 12 కిలోల బియ్యాన్ని ఉచి తంగా పంపిణీ చేసిందని, రూ.1,500 నగదు కూడా ఇచ్చిందని, అలాగే తమకూ ఇచ్చేలా ప్ర భుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ నా యీ బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షుడు బి.ధనరాజ్ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా స్వీకరించి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ 22కి వాయిదా పడింది. -
నాయి బ్రాహ్మణులకు రూ.10వేలు అడ్వాన్స్
సాక్షి, విజయవాడ : దేవాలయాలలో పనిచేసే క్షురకులు(నాయి బ్రాహ్మణులకు) రూ. 10వేలు అడ్వాన్స్గా ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా తీవ్రత దృష్యా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేవాలయాలలో భక్తులకు శిరోముండనం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రముఖ దేవాలయాలలో పని చేస్తున్న 517 మంది, 80 చిన్న దేవాలయాలలో 451 మంది కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 968 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఉపాధి లేని కారణంగా కేశఖండన శాల జేఏసీ ఆర్ధికంగా ఆదుకోవాలని అభ్యర్థన చేశారు. వీరి అభ్యర్థన మేరకు క్షురకుడు ఏ దేవాలయంలో పనిచేస్తాడో ఆ దేవాలయం నుంచి ప్రభుత్వం రూ. 10వేలు అడ్వాన్సుగా చెల్లింస్తుంది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ మొత్తాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో సంబంధిత దేవాలయానికి జమ చేయడం జరుగుతుందన్నారు. దీని వలన రాష్ట్రంలోని 968 మంది క్షురకులు లబ్ధి పొందగలుగుతారని వెల్లంపల్లి తెలిపారు. (లాక్డౌన్.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు) ('పచ్చడి మెతుకులు తిని అయినా బతుకుదాం') -
10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక
సాక్షి, హైదరాబాద్: నాయి బ్రాహ్మణ యువతీ యువకుల వివాహ సంబంధాల కోసం పరిచయ కార్యాక్రమం ఈనెల 10న జరగనుంది. ఆదివారం దిల్షుక్నగర్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్రామ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ చంద్ర నాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిచయ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న నాయి బ్రాహ్మణలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పునర్వివివాహ సంబంధాల కోసం చూస్తున్న వితంతువులు, డైవోర్సిలు కూడా తమకు నచ్చిన భాగస్వామిని ఈ వివాహ పరిచయ కార్యక్రమం ద్వారా వెతుక్కునే అవకాశముందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9849566988, 9391357109 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఐక్యంగా ముందుకు సాగుదాం
సాక్షి, హైదరాబాద్: ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని నాయీ బ్రాహ్మణ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆబిడ్స్లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన దసరా ఆత్మీయ సమ్మేళనంలో నాయీ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో తమకు సరైన అవకాశాలు దక్కడం లేదని, తమ వాటా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేస్తూనే, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకోస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని కోరారు. తమను అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల జాబితాలో చేర్చాలని జస్టిస్ రోహిణి కమిషన్కు వినతులు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నాయీ బ్రాహ్మణులు తమ సంఘీభావం తెలిపారు. 25న ధన్వంతరి జయంతి వేడుకలు వైద్య వృత్తికి ఆదిదేవుడు, నాయీ బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఈ నెల 25న నిర్వహించనున్నామని డాక్టర్ బీర్ఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసి నాయీ బ్రాహ్మణుల ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ధన్వంతరి స్ఫూర్తితో అన్ని రంగాల్లో ముందుడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంఘీయుల మధ్య సృహృద్భావ సంబంధాలు ఏర్పాలడాలన్న ఉద్దేశంతో దసరా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్రచంద్ర, కె. వెంకటేశ్వరరావు, జి. అశోక్, గంగాధర్, సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, మద్దికుంట లింగం, సీనియర్ కార్టూనిస్ట్ నారూ, రాపోలు సుదర్శన్, వెంకట్రాయుడు, సూర్యనారాయణ, బాలరాజు, ధనరాజ్, శ్రీధర్, రాజేశ్, పసుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాయీ బ్రాహ్మణుల అలయ్ బలయ్
సాక్షి, హైదరాబాద్: నాయీ బ్రాహ్మణుల దసరా ఆత్మీయ సదస్సు(అలయ్ బలయ్) ఆదివారం ఆబిడ్స్లోని హోటల్ మందాకిని జయ ఇంటర్నేషనల్లో జరగనుంది. నాయీ జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణులు తరలి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సదస్సు జరుగుతుందని తెలిపారు. నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణుల ఐక్యమత్యానికి, సృహృద్భావ సంబంధాల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి నాయీ బ్రాహ్మణుల పాలాభిషేకం
-
మేళతాళాలతో నాయీ బ్రహ్మణుల ర్యాలీ
-
తలెత్తుకునేలా..!
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ప్రజల ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణుల సెలూన్ షాపునకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రత్యేక కార్పొరేషన్తో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15లక్షల మంది నాయీబ్రాహ్మణులు లబ్ధి పొందనున్నారు. ఏలూరులో ఫిబ్రవరి 17న జరిగిన బీసీ గర్జనలో అశేష జనావలి సాక్షిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్పై నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులకు ఒక భరోసా ఇవ్వడంతో పాటు సమాజంలో తలెత్తుకుని తిరిగేలా హామీ ఇవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీబ్రాహ్మణులు అంతా జగనన్న వెంటే నడుస్తామని గర్వంగా చెబుతున్నారు. దయనీయ స్థితిలో నాయీబ్రాహ్మణులు.. జిల్లాలో సుమారు 18 వేల వరకు సెలూన్ షాపులు ఉన్నాయి. కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వారు సుమారు లక్షమంది వరకు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నాయీబ్రాహ్మణులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. కులవృత్తిని వదులుకోలేక, ప్రత్యామ్నాయం లేక, మరో పని చేతకాక, ప్రభుత్వ ప్రోత్సాహం లేక బతుకు బండిని భారంగా లాగుతున్నారు. కనీసం రోజుకు రూ.200 నుంచి 300లు కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నారు. కడుపు చేతపట్టుకుని పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి అప్పులు చేసి సెలూన్ షాపులు నడుపుతున్నారు. పట్టణాల్లో సైతం ఆశించిన మేరకు సంపాదన లేక కనీసం షాపు విద్యుత్ బిల్లు చెల్లించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నాయీబ్రాహ్మణులను బెదిరించిన బాబు.. తమ న్యాయమైన సమస్యలను విన్నవించేందుకు గత ఏడాది జూన్ 18న అమరావతిలోని సచివాలయం వద్ద నాయీబ్రాహ్మణ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తమ సమస్యలను మొర పెట్టుకోగా వారిని బెదిరిస్తూ మాట్లాడారు. తోక కత్తిరిస్తానంటూ దారుణంగా మాట్లాడడం వారిని కలచివేసింది. దీంతో వారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు భరతం పడతామని హెచ్చరించారు. కనీసవేతనం.. ప్రత్యేక కార్పొరేషన్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయీ బ్రాహ్మణుల కష్టాలను చూసి చలించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నాయీ బ్రాహ్మణుడి కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో వరాలు కురిపించారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు తమ కులాన్ని పట్టించుకు న్న దాఖలాలు లేవని, జగనన్న హామీతో మహర్దశ పడుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతోమంది నాయకులు..ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీనాయీ బ్రాహ్మణుల గురించి పట్టించుకున్నసందర్భాలు మచ్చుకైనా లేవు. గత ఎన్నికల్లోచంద్రబాబు నాయుడు వీరికీ హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని వెళ్లిన నాయీ బ్రాహ్మణులపైనే కన్నెర్రజేశారు. తోక కత్తిరిస్తా అంటూ బెదిరించారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజాసంకల్పయాత్రలో ఉండగానాయీ బ్రాహ్మణులు కలిశారు. వారి సమస్యనుసావధానంగా విన్న ఆయన వారికి ఆర్థిక భరోసా ఇచ్చారు. దీంతో వారంతా వైఎస్సార్సీపీఅధికారంలోకి వస్తే తాము తలెత్తుకుని బతకవచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వాగతిస్తున్నాం.. జిల్లాలో సుమారు 80 వేల మంది నాయిబ్రాహ్మణులు వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు పాలించినా తమను పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాయీబ్రాహ్మణుల కష్టాలను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్, కనీస వేతనం, ప్రతిషాపునకు ఉచితంగా రూ.10 వేలు ప్రకటించడం హర్షణీయం. దయనీయ స్థితిలో ఉన్న మా జీవితాల్లో జగనన్న హామీతో వెలుగు నింపారు.– భజంత్రీ నాగార్జున, నాయీబ్రాహ్మణ నంద యువసేన జిల్లా అధ్యక్షుడు, తిరుపతి చంద్రబాబు నమ్మించిమోసం చేశాడు చంద్రబాబు నాయుడు నాయీబ్రాహ్మణులను నమ్మించి మోసం చేశాడు. ఆలయాల్లో పనిచేసే క్షురకులను ఉద్యోగపరంగా పర్మినెంట్ చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారు. ప్రతిపక్షనేత అధికారంలోకి రాగానే కనీసవేతనం ఇస్తానని హామీ ఇచ్చారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం.– ఎం.నర్సింహులు, క్షవరవృత్తి దారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చారిత్రాత్మక నిర్ణయం.. మా బాధలు చూసిన వైఎస్ జగన్ మమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి షాపునకు రూ.10వేలు ఆర్థికసాయం చేస్తాననడం చారిత్రాత్మక నిర్ణయం. మాకులాన్ని ఇంతవరకు పట్టించుకున్న నాథుడు లేడు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే మా కష్టాలు తీరతాయని విశ్వసిస్తున్నాం.– రమేష్, నాయీబ్రాహ్మణ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు, తిరుపతి అభినందనీయం.. బీసీల పట్ల అభిమానంతో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల వల్ల కులవృత్తులకు మళ్లీ మహర్దశ వస్తుంది. టెక్నాలజీ పేరుతో దాదాపు అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించే దిశగా అడుగులు అభినందనీయం.– సురేంద్రబాబు, ఏర్పేడు ఆర్థిక ఆసరా.. మా కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా కలుగుతుంది. చాలామంది పనులు లేక వేరే పని చేయలేక వలసలు వెళ్తున్నారు. జగన న్న హామీ వల్ల మాకు ఊరట కల్పించినట్లు అవుతుంది. – విజయ్, తిరుపతి -
విజయవాడలో నాయీబ్రాహ్మణుల ధర్నా
-
టీడీపీ నేత దౌర్జన్యం
పశ్చిమగోదావరి, యలమంచిలి: టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పరాకా ష్టకు చేరుతున్నాయి. బలవంతంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రాయడమే కాకుండా సభ్యత్వానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఏనుగువానిలంక గ్రామానికి చెందిన పొన్నపల్లి సుబ్రహ్మణ్యం అనే యువకుడి గూబ వాచిపోయేలా కొట్టిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం గ్రామంలో కులవృత్తి (క్షురక) చేసుకుంటాడు. బ్యాండ్ మేళంలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 10 రోజుల క్రితం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుబ్బల ఏడుకొండలు మరికొందరు నాయకులు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి ఆధార్కార్డులు తీసుకుని టీడీపీ సభ్యత్వం రాశారు. ఇద్దరి సభ్యత్వానికి రూ.200 ఇవ్వాలని అడిగారు. సుబ్రహ్మణ్యం బ్యాండ్ మేళ నిమిత్తం వేరే ఊరు వెళ్లడంతో ఏడుకొండలు కుమారుడు సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చి దుర్గాభవానీని డబ్బులు ఇవ్వాలని రోజూ వచ్చి అడుగుతుండగా ఆమె విసుగుచెంది తమకు ఎలాంటి సభ్యత్వం వద్దని, ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన మేలు జరగలేదని చెప్పారు. దీంతో అతడు తండ్రి ఏడుకొండలకు విషయం చెప్పాడు. గురువారం ఏడుకొండలు అతడి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చి సభ్యత్వం డబ్బులు అడిగితే ఇవ్వనంటారా అంటూ ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం సమాధానం చెబుతుండగానే ఏడుకొండలు కుమారుడు పక్కన ఉన్న ఇటుక తీసుకుని సుబ్రహ్మణ్యం గూబపై కొట్టాడు. దీంతో స్థానికులు వచ్చి సర్ధిచెప్పి వారిని పంపేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సుబ్రహ్మణ్యం పోలీస్స్టేషన్కు వెళ్లినా కేసు నమోదు చేసుకోలేదని అతడు వాపోయాడు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. -
బ్రహ్మణులకు భరోసా
-
బ్రాహ్మణుల్లో సాధికారత అవసరం
-
‘చెట్ల మీద విస్తరాకుల్లాగా వాగ్దానాలు చేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్ సెలూన్లకు డొమెస్టిక్ విద్యుత్ టారిఫ్ ఇచ్చానని కేసీఆర్ అబద్దం చెప్పారంటూ నాయి బ్రాహ్మణులు నిరసన తెలిపారు. గాంధీభవన్ ముందున్న గాంధీ విగ్రహం ముందు షేవింగ్ చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. నాయి బ్రాహ్మణుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయి బ్రాహ్మణులను మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 250 కోట్లతో నాయి బ్రాహ్మణుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్.. నిధి ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి వాగ్దానం చేస్తే రాజముద్రగా ఉండాలి కానీ.. కేసీఆర్ వాగ్దానాలు చెట్ల మీద విస్తరాకుల్లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోడ్రస్ సెలూన్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
భక్తులకు క్షవర భారం
సాక్షి, విజయవాడ: భక్తులపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. ప్రముఖ దేవాలయాల్లో కేశఖండన చార్జీలను పెంచింది. టికెట్ రేటును 25 రూపాయలుగా నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో ఇప్పటికే ఈ చార్జీల వసూళ్లు మొదలయ్యాయి. గతంలో విజయవాడ దుర్గగుడిలో, శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయాల్లో కేశఖండనకు రూ. 20 చార్జీ వసూలు చేసేవారు. ద్వారకా తిరుమలలో రూ.17, అన్నవరం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ గుడి, సింహాచలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో రూ.15 చొప్పున చార్జీలు ఉండేవి. ఇప్పుడు ఈ దేవాలయాల్లో కేశఖండన టిక్కెట్ల ధరను రూ. 25కు పెంచుతూ ఈ మొదటి వారంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా ఆలయాల్లో కొద్ది రోజులుగా కొత్త రేట్లు వసూలు చేస్తున్నారు. భక్తుల నుంచి వసూలు చేసి నాయీ బ్రాహ్మణులకు కమీషన్గా చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయంతో కేశఖండన రేట్లు పెంచినట్లు చెబుతున్నారు. అయితే కేశఖండన బ్లేడ్ చార్జీలను దేవస్థానాలు భరించనున్నాయి. తలనీలాలు విక్రయించడం ద్వారా ప్రధాన ఆలయాలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి గత ఏడాది తలనీలాలు వేలం ద్వారా రూ. 6.09 కోట్లు ఆదాయం సమకూరింది. వాస్తవంగా ఈ ఆదాయం నుంచి కనీసం పది శాతం తీసినా భక్తులపై భారం వేయకుండా నాయీ బ్రాహ్మణులకు కమీషన్ పెంచవచ్చు. ప్రధాన దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులు తమకు ప్రతి నెలా కనీసం రూ.15 వేలు వేతనం ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ డిమాండ్ను విన్నవించారు. ఆ సమయంలో వారిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షురకుల కమీషన్ను రూ. 25 పెంచారు. ప్రభుత్వం అటు నాయీ బ్రాహ్మణులకు సరైన న్యాయం చేయక, ఇటు భక్తులపై భారం మోపడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ చార్జీలను కనీసం రూ. 20కు తగ్గించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
అట్టడుగు వర్గాలపై ఇంత అక్కసా?
సంప్రదాయ వృత్తులు, సేవల ద్వారా ఆర్థిక, సామాజిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వర్గాల వారికి వారు చేసే సేవలకు తగిన పారితోషికం లభించకపోగా ఆ వృత్తులను చంద్రబాబు వంటి సీఎంలు నీచంగా, అపవిత్రంగా హేళనగా చూస్తూ అగౌరవించడం అనాగరికం. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నది. బలహీనవర్గాల దోపిడీ జరుగుతున్నది. పైగా, వారి ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. హేళన చేస్తున్నారు. చిన్నచూపు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు తన ఫ్యూడల్ భావజాలాన్ని వదులుకొని బీసీలకు న్యాయం చేయనట్లయితే.. అందుకు తగిన మూల్యాన్ని రాబోయే ఎన్నికలలో చెల్లించక తప్పదు. సందర్భం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల నాయీ బ్రాహ్మణుల పట్ల ప్రవర్తించిన తీరు, చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏపీ ప్రజలకు షాక్ కలిగించాయి. ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలలో పనిచేసే క్షురకులు తమకు ప్రభుత్వం ఇస్తున్న పారితోషికాన్ని పెంచాలని చాలా కాలంగా కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నాయీ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడంలో తప్పేముంది? కానీ, ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదు. ఈ నేపథ్యంలో నాయీబ్రాహ్మణ ప్రతినిధులు తమ డిమాం డ్లను పరిష్కరించాలంటూ అమరావతి సచివాలయానికి వెళ్లారు. అదే సందర్భంలో కాన్వాయ్లో సచివాలయానికి వస్తున్న బాబుకు నాయీబ్రాహ్మణ ప్రతి నిధులు ఎదురుగా కన్పించారు. తానుండే సచివాలయ బిల్డింగ్కు వారు రావడం సీఎంకు రుచించలేదు. వాహనం దిగిన వెంటనే బాబు ఆగ్రహంతో ఊగిపోతూ నాయీబ్రాహ్మణ ప్రతినిధులవైపు దూసుకువెళ్లారు. తన చూపుడువేలును వారివైపు చూపిస్తూ, వారిని హెచ్చరిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల ఉండాల్సిన సానుభూతి కించిత్తు లేనివిధంగా సీఎం ప్రవర్తించిన తీరుకు సభ్యసమాజం నివ్వెరపోయింది. నాయీ బ్రాహ్మణులు కోరిన కోర్కెలేమీ గొంతెమ్మ కోర్కెలు కావు. వారి హామీలను నెరవేర్చితే రాష్ట్ర ఖజానాపై విపరీత భారమేమీ పడదు. ఒక వేళ వారు చేసిన డిమాండ్లలో సహేతుకత కొంత లేదనే అనుకొందాం.. కానీ సంప్రదింపుల ద్వారా, వాస్తవ పరిస్థితులను తెలియజెప్పి వారిని ఒప్పించగలిగే నేర్పును ప్రభుత్వం చూపాలి. మీడియా కెమెరాలు తన చుట్టూ ఉన్నాయని తెలిసినప్పటికీ నాయీ బ్రాహ్మణులపట్ల అలా దురుసుగా, కర్కశంగా, ఉన్మాదంగా వ్యవహరించారంటే అర్థం.. బలహీనవర్గాల వారెవరూ భవిష్యత్లో తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సచివాలయం వైపు కన్నెత్తి చూడరాదన్న సంకేతాన్ని బలంగా తెలియజెప్పడమే! ద్వంద్వ ప్రమాణాలు ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టినా అధికారపార్టీ ఇచ్చిన హామీలు నెరవేరనప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆయా సామాజికవర్గాల వారు ఆందోళన బాట పట్టడం నేరం అవుతుందా? అదే నిజమైతే.. నాలుగేళ్ళపాటు బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని అధికారాన్ని పంచుకొని ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం ఇప్పుడు ఆందోళనలు చేయడంలో అర్ధమేమిటి? టీడీపీ ఏమి చేసినా అది పవిత్రం, పోరాటం. ఇతర పార్టీలు, కుల సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే.. అది అపవిత్రం, అనైతికం. నిజానికి నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉందన్న స్పృహ సీఎం చంద్రబాబుకు లోపించింది. రాష్ట్రానికి ప్రత్యేక హాదా సాధన కోసం అంటూ తన పార్టీ ఎంపీలతో పార్లమెంట్ ఆవరణలోనే నిరసన ప్రదర్శనలు, విచిత్ర వేష విన్యాసాలు చేయించారు. ప్రజల సొమ్ముతో ధర్మదీక్షలు, నవనిర్మాణ దీక్షలంటూ చేసి కేంద్రాన్ని, ప్రధాని మోదీని, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, కాంగ్రెస్పార్టీ, జనసేనలతో పాటు వామపక్షాలను సైతం తిట్టిపోశారు. ఆ వేదికల నుంచి బాలకృష్ణ వంటివారు సభ్యసమాజం భరించలేని బూతుపురాణాలను వల్లించారు. ఇదంతా బాబుగారు చేసే ప్రజాస్వామ్య పోరాటం! కానీ, నాయీ బ్రాహ్మణులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సచివాలయంలోకి అడుగుపెడితే బాబుగారు సహిం చలేకపోయారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం బాబుకు కొత్తేమీ కాదు. బీసీల పట్ల కపట ప్రేమ ఈ ఘటన కంటే ముందే బాబు అసలు రంగేమిటో, వెనుకబడిన వర్గాల పట్ల ఆయన అనుసరించిన దుర్మార్గపు వైఖరి ఏవిధంగా ఉన్నదో.. వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్కు చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ బయటపెట్టారు. న్యాయవాద వృత్తిలో సీనియర్లుగా ఉండి, అన్ని అర్హతలు కలిగిన వారిని హైకోర్టు జడ్జీలుగా నియామకం చేసే ముందు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం కోరడం ఓ సాంప్రదాయంగా కేంద్రప్రభుత్వం పాటిస్తున్నది. అందులో భాగంగానే ఏపీ, తెలంగాణల నుంచి హైకోర్టు జడ్జీలుగా ఎంపిక చేయడానికి తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం ఏప్రిల్ 30, 2016న అభ్యర్థుల జాబితాను పంపింది. తనకందిన జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమోదం వ్యక్తం చేయగా.. బాబు మాత్రం 11 నెలలపాటు నిర్ణయం చెప్పకుండా జాప్యం చేశారు. చివరకు మార్చి 21, 2017న.. తనకందిన జాబితాలోని ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, మరొక బ్రాహ్మణ కులానికి చెందిన అభ్యర్థులకు నైపుణ్యాలు లేవని, వారికి నిబద్ధత లేదని, జడ్జీలుగా నియమించడానికి తగిన అర్హతలు వారిలో ఏమాత్రం లేవంటూ బాబు కేంద్రానికి లేఖలు రాశారు. అయినప్పటికీ ఆ అభ్యర్థుల అర్హతల ఆధారంగా కేంద్రం వారిని జడ్జీలుగా నియమించింది. సీఎం చంద్రబాబు కేవలం సదరు అభ్యర్థులు హైకోర్టు న్యాయమూర్తులు కాకుండా ఉండేందుకే జాప్యం చేశారని, వారికి వ్యతిరేకంగా లేఖ రాశారని స్పష్టమైంది. ఇదే అంశాన్ని జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టడంతో.. చంద్రబాబుకి బలహీన వర్గాల పట్ల ఉన్న వ్యతిరేకత నగ్నంగా బయటపడింది. చంద్రబాబు వైఖరి చాలా మందికి తీవ్ర ఆవేదన కలిగిం చింది. ఓట్లకోసం బయటకు బీసీ జపం చేస్తూ.. బీసీలను అణగదొక్కే బాబు వైఖరిని చాలా మంది జీర్ణిం చుకోలేక పోయారు. నిజానికి తెలుగు రాష్ట్రాలను కుదిపివేసే ఈ వార్తపై ఏ ఒక్క మీడియా కూడా బహిరంగ చర్చ నిర్వహించలేదు. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బాబుని వెనకేసుకురావడానికి తాపత్రయ పడ్డారు. గతంలో తమ హయాంలో జడ్జీలుగా బీసీలను నియమించామని సమర్థించుకున్నారు. కానీ.. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారని బాబు లేఖ రాసిన విషయాన్ని సమర్ధించుకోలేకపోయారు. బీసీలు మాత్రమే కాదు.. ఎస్సీల పట్ల కూడా బాబు అనుచితంగా మాట్లాడటం గమనార్హం.‘‘కావాలని ఎవరు ఎస్సీల్లో పుడతారు?’’ అంటూ బాబు చేసిన వ్యాఖ్యను ఎవ్వరూ మర్చిపోలేరు. ఫ్యూడల్ మనస్తత్వం ప్రజలందరినీ కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా ఆదరించాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బలహీన వర్గాలను కించపర్చే విధంగా మాట్లాడ్డం, నిర్ణయాలు తీసుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. బలహీనవర్గాల పట్ల, మరికొన్ని వర్గాలపట్ల చంద్రబాబుకు చులకన భావమే కాదు.. వ్యతిరేక భావం కనిపిస్తోంది. ఇది ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. భౌతిక శ్రమ చేస్తూ సంపద సృష్టికి మూల కారకుల్లో అధికశాతం మంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలే! సమాజానికి సర్వ సంపద సృష్టించేవారు, మనిషి నాగరికంగా కన్పించడానికి కారకులైనవారు.. బాబుకు చులకనగా కనిపిస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న మహోన్నత ఆశయంతో భారత రాజ్యాంగాన్ని రాసిన డా‘‘ బీఆర్ అంబేడ్కర్ కూడా ఒక సందర్భంలో ‘‘రాజ్యాంగంలో వెనుకబడిన కులాల పరిరక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయనందుకు నేను చాలా చింతిస్తున్నాను. రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడిన కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వాలే ఆ పనికి పూనుకోవాలని మేం భావిస్తున్నాం’’ అని ప్రకటించారు. పేరుకే బీసీల జపం ఓట్ల రాజకీయం కోసం బాబు వేసుకొన్న అనేక ముసుగుల్లో ‘సామాజకన్యాయం’ ఒకటి. ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశంపార్టీ బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చిన మాట నిజం. కానీ.. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికొచ్చాక.. సామాజిక న్యాయం ఒక నినాదంగానే మిగిలింది. 2007లో ‘వరంగల్ బీసీ సభ’ నిర్వహించిన బాబు.. బీసీలకు 100 సీట్లు ఇస్తానని డిక్లరేషన్ ప్రకటించారు. కానీ, 2009లో ఇచ్చిన మాట తప్పారు. 2014లో ఆ ఊసే లేదు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీసీలకు నామమాత్రపు ప్రాతినిధ్యమే తప్ప.. వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడం లేదు. బీసీలు మెజార్టీగా ఉన్న శ్రీకాకుళం, అనంతపురం మినహా లోక్సభ అభ్యర్థులుగా బీసీలకు టికెట్లివ్వడం లేదు. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట వరకు రెండు కులాలకే లోక్సభ టికెట్లు కేటాయించారు. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు మొండి చేయి చూపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వృత్తిదారులైన బీసీ కులాలు అనేకం ఉన్నాయి. వారందరికీ దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఎంతమంది బీసీలకు టికెట్లిస్తారో బాబు చెప్పగలరా? బాబు అభివృద్ధి ఎజెండాలో బలహీన వర్గాలకు చోటు లేదు. విశాలమైన రోడ్లు, ఐకానిక్ బిల్డింగ్లు మాత్రమే అభివృద్ధికి సంకేతమని బాబు నమ్ముతారు. అందుకే తను చేసిన సైబరాబాద్ నిర్మాణం వల్లనే తెలంగాణలో ఆదాయం పెరిగిందని పదే పదే చెప్పారు. అంతే తప్ప 80%గా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆదాయాలు, జీవనప్రమాణాల మెరుగుదలతోనే అభివృద్ధి సాధ్యమని బాబు గ్రహించకపోవడం దురదృష్టం. నూతనంగా ఏర్పడిన ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నది. బలహీనవర్గాల దోపిడీ జరుగుతున్నది. పైగా, వారి ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. హేళన చేస్తున్నారు. చిన్న చూపు చూస్తున్నారు. బాబు తన ఫ్యూడల్ భావజాలాన్ని వదులుకొని బీసీలకు న్యాయం చేయనట్లయితే.. అందుకు తగిన మూల్యాన్ని రాబోయే ఎన్నికలలో చెల్లించక తప్పదు. వ్యాసకర్త మాజీ ఎంపీ సి. రామచంద్రయ్య ఫోన్ : 81069 15555 -
సీఎంను నిలదీస్తారన్న భయంతో భారీ మార్పులు
-
చంద్రబాబుకు క్షురకుల సత్తా చూపిస్తాం
సాక్షి, అమరావతి : నాయి బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంపై నాయి బ్రాహ్మణుల సంఘ అధ్యక్షుడు యానాదయ్య మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ, యానాంలలో నాయి బ్రహ్మణుల షాపులకు వచ్చిన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు వైఖరిపై ప్రచారం చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు లోన్లు రావు, ఆదరణ పథకంలో పేర్లు తొలగిస్తామని నాయి బ్రాహ్మణ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. నాయి బ్రహ్మణులను అవమానించి, తిరిగి వారిని బెదిరిస్తున్న చంద్రబాబుకు నాయి బ్రహ్మణుల సత్తా చూపిస్తామని యానాదయ్య హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయి బ్రాహ్మణులకు సిగ్గుంటే చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని అన్నారు. లేకపోతే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశంలో వున్న నాయి బ్రాహ్మణులందరూ రాజీనామాలు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. -
చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం దాసరి భవనంలో నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు యానాదయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బీసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ విషయాన్ని మరిచి బీసీల పట్ల అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హోదా వ్యక్తి బీసీ కులాలను కించపరిచేలా వ్యవహరించడం సబబు కాదన్నారు. నాయీ బ్రాహ్మణులపై అనుచితంగా ప్రవర్తించినందుకు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. పార్థసారధి, జంగా కృష్ణమూర్తి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ( వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), దోనెపూడి శంకర్(సీపీఐ), కుమారస్వామి, బాజీ(బీజేపీ), పలువురు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై నాయీ బ్రాహ్మణులు మండిపాటు
-
రెండేళ్లుగా చంద్రబాబులో అసహనం పెరిగిపోయింది
-
‘పేదల రక్తానికి మరిగిన పులి చంద్రబాబు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో నాయీ బ్రాహ్మణుల పట్ల సీఎం వీధిరౌడీలా ప్రవర్తించారని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ త్రీవంగా ఖండిస్తుందని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారని, పేదవాడి రక్తానికి మరిగిన పులి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. విశాఖలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణుల పట్ల సీఎం ప్రవర్తించిన తీరుకు రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. క్షురకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధర్మంగా లక్షల కోట్ల అవినీతి చేస్తూ.. ధర్మ పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. బరితెగించి ఇసుక అమ్ముతున్నారని, దొంగల ప్రభుత్వం ఇదని ఆరోపించారు. మోదీ లేకపోతే చంద్రబాబు జీరో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు జీరో అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం చాలా సాయం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. విధానపరమైన నిర్ణయాల వల్లే కశ్మీర్లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీయే బయటకు వచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలపై మండల స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. -
నాయిబ్రాహ్మణులకు బాబు క్షమాపణలు చెప్పాలి
-
ఏపీలో పెడబొబ్బలు పెట్టి.. ఢిల్లీలో ఎందుకలా?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, అందుకే బడుగు బలహీనవర్గాలపై విరుచుకుపడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొలుసు పార్థసారధి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ చాలా ప్రచారం చేసుకుందని, ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం ఏమని నిలదీశారో టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. నగరంలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు ఢిల్లీలో మీడియాకు ముఖం చాటేశారని గుర్తుచేశారు. ప్రతి తెలుగువాడు తలదించుకునేలా ప్రధాని మోదీకి వంగి వంగి చంద్రబాబు దండాలు పెట్టారంటూ మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన 8 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు తీరు దారుణమన్నారు. హామీల గురించి అడిగితే వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగుతారా.. ? దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు గతంలో మత్స్యకారులపై కూడా ఇలానే ప్రవర్తించారని చెప్పారు. హక్కుల కోసం పోరాడితే తోలు తీస్తాం, తోక కట్ చేస్తాం అనడం సమంజసమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై పుస్తకం వేసి దేశంలోని అన్ని పార్టీలకు, నేతలకు అందజేస్తామని పార్థసారధి తెలిపారు. -
నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు తీరు దారుణం
-
చంద్రబాబు తీరుతో విస్తుపోయా!
సాక్షి, రాజమహేంద్రవరం: కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం ట్విటర్లో స్పందించారు. విస్తుపోయా!... ‘మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరి. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబుగారి హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్లు చూపించాయి. చంద్రబాబుగారికి బీసీలపట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైంది. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అయితే 10-15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తులు రద్దీగా ఉంటేనే అదికూడా సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పటం చట్టానికి వ్యతిరేకం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో... ‘దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే మీ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తాం. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం’ అని నాయీ బ్రాహ్మణ వర్గానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. pic.twitter.com/eM3Ye6dxao — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 June 2018 -
‘తొమ్మిదేళ్లు పాలించా..బెదిరిస్తే తోక కట్ చేస్తా’
-
తోక జాడిస్తే కత్తిరిస్తా : చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘ఇయ్యమయ్యా... కనీస వేతనాలు ఇవ్వమని చెబుతున్నా. ఇవ్వం... మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తోక జాడిస్తే కట్ చేస్తా. బీ కేర్పుల్. ఇంకొకసారి తోక తిప్పండి చెబుతా మీ కథ’.. ‘సచివాలయానికి వచ్చి ఇష్ట్రపకారం చేస్తారా? ఇంకోసారి చేస్తే గుళ్లలోకి కూడా రారు. బీ కేర్పుల్’.. ‘ఆర్గ్యుమెంట్స్ లేవు. కనీస వేతనాలు ఇవ్వం. నో నో.. ఏం చేస్తారో చేయండి. ఇంకోసారి మాట్లాడితే మర్యాద కాదు..’ ‘ఏ వూరు మీది..? మీదే ఊరు..? తెలుసా మీకు.. తొమ్మిదేళ్లు పాలించా.. బెదిరిస్తే తోక కట్ చేస్తా’ ‘పిచ్చాటలాడితే మాత్రం.. చాలా సీరియస్గా ఉంటది’ ‘ఏం తమాషాలాడుతున్నారా...’ ఆలయ కేశఖండనశాలలో పనిచేసే క్షురకులపై సీఎం చంద్రబాబు వీరావేశంతో ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఇవన్నీ. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగానైనా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని కోరిన వారిపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడి వేలు చూపిస్తూ హెచ్చరికలు చేయటంతో నిర్ఘాంతపోయారు. సంఘాలతో సర్కారు చర్చలు విఫలం ఆలయ కేశఖండనశాలల్లో క్షురకుల విధుల బహిష్కరణతో గత నాలుగు రోజులుగా తలనీలాల సమర్పణ నిలిచిపోయిన సంగతి పాఠకులకు విదితమే. విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న క్షురక జేఏసీ ప్రతినిధులు, నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు క్షురక ఉద్యోగ ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనాలైనా చెల్లించాలని ప్రతినిధులు పట్టగా అది కూడా కుదరంటూ కేఈ కృష్ణమూర్తి తేల్చి చెప్పడంతో వారంతా చర్చలను బహిష్కరించారు. ఎంతిచ్చినా జీతంగానే ఇవ్వాలన్న ప్రతినిధులు నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతుండగా అదే సమయంలో సీఎం చంద్రబాబు అక్కడ ఆగారు. ఆలయాల్లో పనిచేసే క్షురకులకు కనీస వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేయటంతో.. భక్తుల ఒక్కొక్క గుండుకు రూ.25 చొప్పున చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు చంద్రబాబు వారితో చెప్పారు. అయితే ఒక్కొక్క గుండుకు రూ.50 చొప్పున ఇచ్చినా కూడా తమకు వద్దని, ఎంత ఇచ్చినా జీతం రూపంలోనే ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. హామీని గుర్తు చేయగానే బాబులో ఆవేశం... ‘ఏం చేసినా కనీస వేతనాలు ఇవ్వడం కుదరదు. ఏం చేసుకుంటారో చేసుకోండని’ చంద్రబాబు ఆవేశంగా వ్యాఖ్యానించారు. ‘‘అయ్యా, మేం ఏ రోజైనా రోడ్డు మీదకొచ్చిన వాళ్లం కాదు. ఎన్నికలప్పుడు మీరే హామీ ఇచ్చారు. మీ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. దేవస్థానాల్లో క్షురక ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏళ్ల తరబడి ఆ పనిచేస్తున్న మాకు కనీస వేతనాలు ఇవ్వమని అడుగుతున్నాం’ అంటూ నాయీ బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు విన్నవించటంతో చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. ‘‘అరుస్తారా.. ఏమన్నా ఫిష్ మార్కెటా ఇది (సచివాలయం)..? ఏం తమాషాలాడుతున్నారా?’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. తాము అరవడం లేదంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వినలేదు. ‘అరవలేదా.. మీరు తమాషాలాడుతున్నారు’ అని చిందులు తొక్కారు. ముందు విధుల్లో చేరండి... తర్వాతే ఏదైనా అనంతరం చంద్రబాబు వారికి హెచ్చరికలు చేస్తూ, వేలు చూపిస్తూ.. ‘ఏయ్, వినయ్యా విను.. నీకు కుటుంబం ఉండొచ్చయ్యా.. ఏమి మాట్లాడతావు (కోపంగా) ఏం తమాషాలు ఆడుతున్నావు నువ్వు?’ అంటూ ఒక ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. దేవాలయంలో పనిచేసే వారు ఇలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. కనీస వేతనాలు ఇవ్వడం కుదరని పలుమార్లు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.. ‘ముందు మీరు విధుల్లో చేరండి. తర్వాత ఏదైనా మాట్లాడదాం’ అంటూ ఆవేశంగా తన కారు వద్దకు వెళ్లిపోయారు. రూ.25 చొప్పున చెల్లించేందుకు ముందుకొచ్చిన సర్కారు పలు దేవాలయాల్లో ప్రస్తుతం రూ.10 – రూ. 20 మధ్య ఉన్న తలనీలాల టిక్కెట్ ధరను అన్ని ఆలయాల్లో రూ.25కు పెంచి ఆ మొత్తాన్ని విధుల్లో పాల్గొనే క్షురకులకు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దేవాలయాల్లోని ప్రతి శిరోముండనానికి ప్రస్తుతం క్షురకులకు చెల్లిస్తున్న 13 రూపాయలను 25 రూపాయలకు పెంచుతామన్నారు. శిరోముండనం కోసం భక్తులు చెల్లించే టిక్కెట్ ధర పెంచే ఆలోచన లేదన్నారు. పెంపు వల్ల పడే అదనపు వ్యయాన్ని సంబంధిత దేవాలయమే భరిస్తుందన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని, ఆందోళనను విరమించాలని కోరారు. బాబుకు తగిన బుద్ధి చెబుతాం నాయీ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీనంద సీఎం స్థానంలో ఉన్న వ్యక్తే రౌడీలాగా మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కించపరిచి, మనోధైర్యాన్ని దెబ్బతీశారని నాయీ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీనంద అన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే సానుకూలంగా స్పందిచకపోగా, తమపైనే ఆయన బెదిరించి, భయపెట్టే ధోరణిలో మాట్లాడారని చెప్పారు. అన్ని బీసీ కులాలతో పాటు నాయీ బ్రాహ్మణులు గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి పనిచేశారని, వచ్చే ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. సాయంత్రం శివాలు....రాత్రి బుజ్జగింపు! ఆలయ కేశఖండనశాలల్లో పనిచేసే క్షురకుల జేఏసీ ప్రతినిధులపై సోమవారం సాయంత్రం సచివాలయంలో తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతరం రాత్రి వారిని మళ్లీ చర్చల కోసం తన ఇంటికి ఆహ్వానించారు. ప్రతి ఆలయంలో పనిచేసే ఇద్దరేసి చొప్పున ప్రతినిధులను చర్చలకు పిలిచారు. ఈనెల 25వ తేదీన ఈ అంశంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని జేఏసీ ప్రతినిధులకు చెప్పారు. దేవదాయశాఖ కమిషనర్ అనురాధ ప్రస్తుతం సెలవులో ఉన్నారని, ఆమె తిరిగి విధుల్లో చేరాక అన్ని విషయాలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు మంగళవారం నుంచి అన్ని ఆలయాల్లోని కేశఖండనశాలల్లో విధులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు క్షురకుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రాందాసు చెప్పారు. -
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న క్షురకుల ఆందోళన
సాక్షి, విజయవాడ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో క్షురకుల ఆందోళన కొసాగుతోంది. క్షురుకులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరింది. విజయవాడ దుర్గగుడిలో క్షురకులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో తలనీలాల సమర్పణ నిలిచిపోయింది. కనీస వేతనం 15వేల రూపాయలు ఇవ్వడంతో పాటు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. అలాగే పదవీ విరమణ చేసిన క్షురకులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణ సంఘాలతో ప్రభుత్వం ఈరోజు సాయంత్రం చర్చలు జరుపనుంది. దేవాదాయశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయంలో ఈ చర్చలు జరుగనున్నాయి. ప్రభుత్వ చర్చల్లో సానుకూల ఫలితం వస్తే సమ్మె విరమిస్తామని .. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని క్షురకులు స్పష్టం చేస్తున్నారు. -
ఐదో రోజుకు చేరిన క్షురకుల ఆందోళన