Nupur Sharma
-
నూపుర్ శర్మ వ్యతిరేక నినాదాల కేసులో నిందితులకు ఊరట
జైపూర్: బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులకు ఊరట లభించింది. మొయినుద్దీన్ చిష్తీ దర్గా(రాజస్థాన్) పెద్దతో పాటు మరో ఆరుగురిని మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది అజ్మీర్ కోర్టు. రెండేళ్ల కిందట.. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే.. మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ ఇస్లాం గ్రూపులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో.. మొయినుద్దీన్ చిష్తీ దర్గా నిర్వాహకుడు ఖాదీమ్ గౌహర్ చిస్తీ, మరో ఆరుగురు కలిసి నూపుర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. దీంతో.. అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాదీమ్ గౌహర్ చిస్తీతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న గౌహర్ చిస్తీని పోలీసులు జూలై 14, 2022న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అందరినీ కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ విడుదలకు ఆదేశాలిచ్చింది. -
రాయ్బరేలీ బీజేపీ అభ్యర్ధిగా నుపుర్ శర్మ?
సాక్షి, లక్నో : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మరోసారి చర్చాంశనీయమయ్యారు. గత కొన్ని దశబ్ధాలుగా కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా నుపుర్ శర్మ బరిలోకి దిగనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో ఓ వర్గాన్ని కించ పరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంగా తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆమెపై సస్పెన్షన్ ఎత్తేసి బరిలోకి దింపాలని బీజేపీ యోచినట్లు సమాచారం. రాయ్బరేలీ బరిలో నుపుర్ శర్మ? రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్ధులను బరిలోకి దించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్ధి దశ నుంచి బీజేపీ అనుబంధ సంఘాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన నుపుర్ శర్మను రాయ్బరేలీ నుంచి బరిలోకి దించేతే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న సోనియా ఇక అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వరుసగా 5 సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్య కారణంగా ఈసారి రాయ్బరేలీ లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దించాలా’ అని హస్తం నేతలు సైతం మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే సోనియా తనయ ప్రియాంక గాంధీ వాద్రా పేరు ఇక్కడ పరిశీలనలో ఉంది. నిశితంగా గమనిస్తున్న బీజేపీ రాయ్బరేలీ.. ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ ఏ పార్టీ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. బీజేపీ సైతం తన అభ్యర్ధి ఎవరనేది తేల్చలేదు. ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్ - సమాజ్ వాదీ పార్టీ కూటమి అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తుందా? అని కమలం నిశితంగా పరిశీలిస్తుంది. మూడోసారి అధికారంలోకి రావాలని లోక్ సభ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కషాయ పార్టీ ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ సీటును నుపుర్ శర్మకు కేటాయిస్తుందా? లేదా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. నుపుర్ శర్మ ఎవరు? న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థి దశ నుండి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించారు. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. వృత్తి రీత్యా న్యాయవాది . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేశారు. 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితేనేం నుపురు దూకుడును మెచ్చి.. అంతపెద్ద వివాదం ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో.. అదీ రాయబరేలీ అభ్యర్ధిగా ఆమెను బీజేపీ పోటీ చేయించబోతుందన్న ఊహాగానం.. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. -
నో ఛేంజ్.. దసరాకి టైగర్ వేట కన్ఫర్మ్
రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్లు దసరాకి అక్టోబర్ 20నే విడుదల చేస్తామనీ చిత్రబృందం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబర్ 20న విడుదల కావడం లేదంటూ కొన్ని శక్తులు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయి. ఆ వదంతులను నమ్మవద్దు. మీకు (ప్రేక్షకులు) అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాం. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మయాంక్ సింఘానియా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్ మది. -
Nupur Sharma: నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ
ఢిల్లీ: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. కిందటి ఏడాది ఓ టీవీ డిబేట్లో ఆమె ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాదు.. యావత్ ప్రపంచంలోనూ మంట పుట్టించాయి. ఆపై ఆమెను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కూడా. అయితే.. తనకు ప్రాణ హాని ఉందని, తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె ఎప్పటి నుంచో పోలీసులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కోరారామె. ఈ నేపథ్యంలోనే ఆమెకు గన్ లైసెన్స్ జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ లైసెన్స్ ఆధారంగా ఆమె ఆత్మ రక్షణ కోసం తుపాకీని వెంట పెట్టుకునే అవకాశం లభిస్తుంది. మరోవైపు.. సుప్రీం కోర్టు సైతం ఆమె భద్రత కారణాల దృష్ట్యా.. దేశంలో ఆమెపై దాఖలైన(దాఖలు అవుతున్న కూడా) ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని ఆదేశించి ఆమెకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు కొన్నినెలల ముందు.. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమె తక్షణ క్షమాపణలు చెప్పాల్సిందని అభిప్రాయపడింది. బాధ్యత గల న్యాయవాది వృత్తిలో అనుభవం ఉండి.. సోయి లేకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలో విద్వేషాలకు దారి తీసిందని, పరిణామాలకు ఆమె ఒక్కతే బాధ్యత వహించాలంటూ కూడా అభిప్రాయపడింది. ఇక నూపుర్కు మద్దతు వ్యాఖ్యలు చేసినందుకే.. రెండు హత్యలు జరగడం దేశాన్ని కుదిపేసింది కూడా. రాజస్థాన్ ఉదయ్పూర్ ఓ టైలర్ను, ఆపై మహారాష్ట్ర అమరావతిలో ఓ ఫార్మసిస్ట్ను దారుణంగా హతమార్చారు. మరోవైపు ఆమెను హతమారుస్తామంటూ కొందరు వీడియోల ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డంతో ఆమె కొన్నాళ్లూ అజ్ఞాతంలోనూ గడిపారు. -
నూపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట
న్యూఢిల్లీ: బీజేపీ సస్పెండెడ్ నేత, న్యాయవాది నూపుర్ శర్మకు మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం కమ్యూనిటీ మనోభావాలను ఆమె దెబ్బ తీశారని, కాబట్టి ఆమెపై కఠిన చర్యల తీసుకోవాల్సిందేనని, అందుకుగానూ సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషనర్.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించే క్రమంలో.. ‘‘ఆదేశాలు జారీ చేసేప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్ను వెనక్కి తీసుకోవడమే మంచిది’’ అని పిటిషనర్కు సూచించారు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్. దీంతో పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు. ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల తర్వాత.. నూపుర్ శర్మ కామెంట్లపై అరబ్ దేశాల నుంచి, భారత్లోని ఇస్లాం కమ్యూనిటీ నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఒకానొక తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం ఆమెపై నిప్పులు చెరిగింది. అయితే తదుపరి పిటిషన్పై విచారణ సందర్భంగా సానుకూలంగా స్పందిస్తూ.. అరెస్ట్ నుంచి ఊరట ఇవ్వడంతో పాటు ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన.. అవుతున్న ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. ఇదీ చదవండి: పక్కా ప్లాన్.. అయినా దుస్థితికి కారణాలేంటి? -
Nupur Sharma: నూపుర్ శర్మకు భారీ ఊరట
ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ప్రాణ హాని ఉందన్న ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఆమె వినతి పిటిషన్కు సానుకూలంగా స్పందించింది. ఆమెపై దాఖలైన అన్ని కేసులన్నింటిని కలిపి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఐఎఫ్ఎస్వో యూనిట్కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను బుధవారం ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని తెలిపింది. అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను సైతం నూపుర్ శర్మకు ఇస్తున్నట్లు తెలిపింది. తనకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయని, అయితే విచారణ నిమిత్తం తాను అక్కడికి వెళ్తే దాడులు జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నూపుర్ శర్మ.. సుప్రీంలో వినతి పిటిషన్ వేసింది. కాబట్టి, తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఈ మేరకు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని బెంచ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కొత్తగా ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు అయినా కూడా ఢిల్లీకే బదిలీ చేయాలని సుప్రీం పేర్కొంది. గతంలో ఇదే బెంచ్.. ‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి. ఆమెవి అహంకారపూరిత వ్యాఖ్యలు’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది కూడా. ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్(ఐఎఫ్ఎస్వో) అనేది ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం. ద్వారకాలో దీని ఆఫీస్ ఉంది. ప్రధానమైన కేసులతో పాటు సున్నితమైన అంశాలను ఇది పరిశీలిస్తుంటుంది. ఇదీ చదవండి: మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి-నూపుర్ -
రాథోడ్ సాబ్.. నీ కొడుక్కి ధైర్యం ఎక్కువే!
భోపాల్: రైలు పట్టాలపై బీటెక్ కుర్రాడి మృతదేహం పడి ఉండడం, ఈ ఘటనకు ఉదయ్పూర్ టైలర్ హత్యోదంతంతో ముడిపడి ఉందన్న కుర్రాడి తండ్రి అనుమానాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ సియోని-మాల్వాకు చెందిన నిషాంక్ రాథోడ్(20).. రాయ్సెన్ ఒబయ్దుల్లాగంజ్ పట్టణంలో హాస్టల్లో ఉంటూ బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు. సోదరిని కలుస్తానని చెప్పి హాస్టల్ నుంచి శనివారం బయలుదేరాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమెను కలిసి.. ఆపై తిరిగి హాస్టల్కు చేరుకోలేదు. అయితే కాసేపటికే అతని తండ్రికి, ఇతర స్నేహితులు, బంధువులకు అతని ఫోన్ నుంచి ఓ బెదిరింపు మెసేజ్ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన నిషాంక్ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే సమీపంలోని ఓ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించాడు నిషాంక్. రైలు మీది నుంచి వెళ్లడంతో అతని శరీరం ఛిద్రమైపోయింది. నిషాంక్ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్లో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ తరుణంలో తొలుత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు. Dead body of Nishank Rathore, an engineering student, found on railway track in Bhopal, Madhya Pradesh. A WhatsApp message of "Sar Tan Se Juda" was sent from his mobile to his father & his friends. A story of "Sar Tan Se Juda" was uploaded from his Instagram account. pic.twitter.com/CZOowSw6dr — Anshul Saxena (@AskAnshul) July 25, 2022 అయితే నిషాంక్ తండ్రి ఉమా శంకర్ రాథోడ్.. తన కొడుకు ఫోన్ నుంచి తన ఫోన్కు వచ్చిన సందేశాల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు వ్యవహారం మొదలైంది. ‘.. తల వేరు చేయబడింది’ అంటూ ఉంది ఆ సందేశంలో. అంతేకాదు.. ‘రాథోడ్ సార్.. మీ అబ్బాయి చాలా ధైర్యశాలి’ అంటూ ఆ సంభాషణ నడిచింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నాడు. Guztakh-e-Nabi ki Ek hi Saja, Sar Tan se Juda అనే మాటల్ని.. ఉదయ్పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య టైంలో హంతకులు ఉపయోగించారు. దీంతో తన కొడుకును చంపేసి ఉంటారని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఒంటరిగా కనిపించాడని, అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. చదవండి: హారన్ కొడితే తప్పుకోలేదని.. చెవిటి వ్యక్తిని చంపేసింది -
Nupur Sharma: బజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి
భోపాల్: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతు చెప్తున్న వాళ్లపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఉదయ్పూర్, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్లో ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్గా నూపుర్ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక. బుధవారం అగర్-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ స్థానిక కన్వీనర్ అయిన ఆయూష్ జడమ్(25).. స్థానిక మీడియాలో బహిరంగంగా నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఉదయం స్థానిక టోల్ బూత్ నుంచి బైక్పై వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేసింది ఓ గ్రూప్. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఉజ్జయిని ఆస్పత్రిని తరలించారు. దాడికి పాల్పడిందంతా స్థానికులేనని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. मप्र के आगर मालवा में एक बजरंग दल कार्यकर्ता पर हमला हो गया,आरोप है कि #नुपुर_शर्मा का समर्थन करने की वजह से ये हमला हुआ है,मामले में 13 लोगों के खिलाफ मामला दर्ज किया गया है जिनमें से दो को गिरफ्तार कर लिया गया है, घटना के बाद शहर में तनाव की स्थिति बन गई है @ndtv @ndtvindia pic.twitter.com/wRD1vT39PH — Anurag Dwary (@Anurag_Dwary) July 20, 2022 ఇదీ చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే- సుప్రీంకోర్టు -
నూపుర్ శర్మను చంపేందుకు దేశ సరిహద్దు దాటిన పాకిస్థానీ
జైపూర్: నూపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయుడ్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో జులై 16న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐబీ సహా ఇతర నిఘా సంస్థల బృందం అతడ్ని విచారిస్తోంది. జులై 16న రాత్రి 11 గంటల సమయంలో హిందుమల్కోట్ సరిహద్దు అవుట్పోస్టు వద్ద అనుమానాస్పద రీతిలో కన్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అతని పేరు రిజ్వాన్ అశ్రఫ్ అని, పాకిస్థాన్లోని ఉత్తర పంజాబ్ మండీ బౌహద్దీన్ నగర వాసినని చెప్పాడని వెల్లడించారు. అతని వద్ద 11 అంగుళాల కత్తితో పాటు బ్యాగులో మతానికి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, ఆహారం, మట్టి ఉన్నట్లు గుర్తించామన్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను చంపేందుకే తాను దేశం దాటి వచ్చినట్లు రిజ్వాన్ ప్రాథమిక విచారణలో చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా.. 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఐబీ, రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడ్ని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు -
నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘ఆమెకు ప్రాణహాని ఉంది నిజమే’
న్యూఢిల్లీ: నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమెపై ఎక్కడా కొత్త కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నూపుర్ శర్మను చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నూపుర్ శర్మకు ప్రాణహాని ఉన్నది నిజమేనని వ్యాఖ్యానించింది. ఆమెకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నూపుర్ శర్మపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసే విషయంపై ఆగస్టు 10లోగా స్పందన తెలపాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, జుమ్ముకశ్మీర్, అస్సాం ప్రభుత్వాలను సుప్రీంకోర్టు అడిగింది. జులై1న నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. టీవీ డిబేట్లో బాధ్యత లేకుండా మాట్లాడటం వల్ల దేశంలో ఆమె అగ్గిరాజేసిందని మండిపడింది. దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని ధ్వజమెత్తింది. ఆ తర్వాతి నుంచే నూపుర్ శర్మను చంపేస్తామనే బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ ఛిస్తీ, యూపీ చెందిన వ్యక్తి.. నూపుర్ శర్మను హతమారుమాస్తామని బెదిరించిన విషయాలను ప్రస్తావించారు. చదవండి: వాట్సాప్ స్టేటస్గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
వాట్సాప్లో నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో పొడిచారు!
పాట్నా: నూపుర్ శర్మకు సంబంధించిన వివాదాస్పద వీడియోను చూశాడని, ఆమెకు మద్దతుగా ఆ వీడియోను తన వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై కత్తులతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు కొందరు!. బీహార్ సీతామర్హిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత పోలీసులు ఈ ఘటనను గ్రూప్ తగాదాగా భావించారు. లోకల్ పొగాకు మత్తులో దాడి జరిగిందని ప్రకటించారు. అయితే.. బాధితుడు మాత్రం ఉద్దేశపూర్వకంగా తనపై దాడి జరిగిందని పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం బాధితుడు అంకిత్ ఝా.. దర్భంగా నర్సింగ్హోమ్లో చికిత్స పొందుతున్నాడు. నూపుర్ శర్మ వీడియోను తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్న తర్వాతే దాడి జరిగిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. నన్పూర్ పీఎస్ పరిధిలో జులై 15వ తేదీ సాయంత్రం ఘటన జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన మరుసటి రోజే నలుగురు దుండగుల్లో ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. తొలుత పాన్ షాప్ దగ్గర సిగరెట్ తాగే విషయంలో గొడవ జరిగిందని భావించాం. అయితే.. నూపుర్ శర్మవీడియో వల్లే దాడి జరిగిందని బాధితుడు చెప్తున్నాడు. అందుకే దర్యాప్తు చేపట్టాం అని సీతామర్హి ఎస్పీ హర్ కిషోర్రాయ్ తెలిపారు. దాడికి సంబంధించినదిగా చెబుతూ.. ఓ వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. A youth was stabbed by a Special Community in #Sitamarhi, Bihar and slogans of 'Allah Hu Akbar' were raised as the youth was watching a video of BJP's former leader #NupurSharma. pic.twitter.com/Do3oBsjsfY — Nikhil Choudhary (@NikhilCh_) July 19, 2022 -
మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి
ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ప్రవక్త కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఊహించని స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాక.. బెదిరింపులు, వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆమె తాజా అభ్యర్థన పిటిషన్ను అదే బెంచ్ ముందు దాఖలు చేశారు. తన అరెస్టును నిలువరించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె మరోసారి కోర్టులో అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఆమె పిటిషన్పై ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టే అవకాశం ఉంది. గతంలో విచారణ సందర్భంగా ఆమె అభ్యర్థనపై స్పందించిన బెంచ్.. సంబంధిత హైకోర్టు(ఢిల్లీ)ను సంప్రదించాలని ఆమె తరపు న్యాయవాదికి సూచించారు. అయినప్పటికీ ఆమె మరోసారి సుప్రీంను ఆశ్రయించడం విశేషం. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జులై 1వ తేదీన నూపుర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు నిరసన సెగ తగిలింది. అంతేకాదు పలువురు మేధావులు, రిటైర్డ్ జడ్జిలు, బ్యూరోక్రట్లు, రాజకీయ నేతలు సైతం తీవ్రంగా తప్పుబడుతూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఒక బహిరంగ లేఖ రాశారు కూడా. అయితే ఆ నాటి నుంచి తనకు అత్యాచార, చావు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయని ఆమె తాజా అభ్యర్థనలో పేర్కొంది. ఎఫ్ఐఆర్లన్నింటిని ఢిల్లీకి బదలాయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరోసారి ఆమె సుప్రీంలో పిటిషన్ వేసింది. ఈ గ్యాప్లో ఆమెపై మరో మూడు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు కావడం గమనార్హం. చదవండి: బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి! -
మోదీ ఇలాకాలో నూపుర్ శర్మ పోస్టు కలకలం.. బెదిరింపు కాల్స్
మహ్మాద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపర్ శర్మ వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. కాగా, తాజాగా నూపుర్ శర్మ విషయంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్స్టాగ్రామ్లో నూపుర్ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. ఇక, అదుపులోకి తీసుకున్న వారిలో మహ్మద్ అయాన్ అటాష్బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళ ఉన్నారు. ఇక, వీరంతా సూరత్ నివాసితులుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అనంతరం.. సదరు వ్యాపారవేత్త వెంటనే సోషల్ మీడియా ఖాతా నుంచి నూపుర్ శర్మ ఫొటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు. #Gujarat: नूपुर शर्मा के समर्थन में इंस्टाग्राम पर पोस्ट डालने वाले सूरत के व्यापारी को मिली थी जान से मारने की धमकी, धमकी देने वाले 6 में से 3 आरोपी गिरफ्तार।#Surat #NupurSharma #NupurSharmaControversy #BJP #InstagramPost pic.twitter.com/7Ty4VDm7m8 — India Voice (@indiavoicenews) July 16, 2022 ఇది కూడా చదవండి: తమిళనాట రాజకీయ చదరంగం: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి -
బీజేపీపై సీఎం గహ్లోత్ సంచలన ఆరోపణలు
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీతో సంబంధాలున్నాయన్నారు. ఈ విషయంపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'ఉదయ్పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు. నిందితుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విషయం ఇటీవలే తెలిసింది. అతను అద్దె కట్టడం లేదని ఆ ఇంటి యజమాని చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మొదలుపెట్టకముందే బీజేపీ కార్యకర్తలు నిందితుడు తమ వాడని పోలీసులకు చెప్పారు. పార్టీ కార్యకర్త అయినందున అతనికి ఎలాంటి ఇబ్బంది కల్గించవద్దన్నారు' అని గహ్లోత్ అన్నారు. హత్య కేసు నిందితుడిపై పోలీసు కేసు నమోదు కాకుండా ఆపేందుకు కూడా బీజేపీ ప్రయత్నించిందని గహ్లోత్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తే అని పోలీసులకు చెప్పి అతనికి సాయం చేయాలని చూసిందని పేర్కొన్నారు. వీటిపై కమలం పార్టీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన రియాజ్ అఖ్తారీ.. బీజేపీ నేతలతో దిగిన ఫోటో వైరల్గా మారింది. ఇందులో రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కమలం పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాగా, జూన్ 28న జరిగిన ఉదయ్పూర్ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మరునాడే కేసు దర్యాప్తును ఎన్ఐఏ తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. చదవండి: Goa: గోవాలో కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీతో టచ్లో 11 మంది ఎమ్మెల్యేలు! -
పిస్తోళ్లు, గునపాలు సిద్ధం చేసుకోండి.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో తుపాకులు, గునపాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గొడవలు జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే.. వారు వచ్చే లోపే దుకాణాలు తగలబడిపోతున్నాయని పేర్కొన్నారు. వారు మాత్రం ఎంతసేపు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. విక్రమ్ సైనీ ముజఫర్పుర్ జిల్లా ఖాతౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాన్సఠ్లోని వాజిద్పుర్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజీవ్ బాలియన్తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రసంగిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 'ఒకట్రెండు రాళ్ల డబ్బాలు, 4-5 గునపాలు, రెండు పిస్తోళ్లు మీ దుకాణాల్లో ఉంచుకోండి ' అని అన్నారు. ఆపేందుకు ప్రయత్నించినా విక్రమ్ సైనీ మాట్లాడే సమయంలో స్టేజీపై ఉన్న మరో నేత ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 'ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది, పేపర్లు, టీవీల్లో రావాలి. నన్ను ఐదేళ్ల పాటు ఎవ్వరూ పదవి నుంచి తప్పించలేరు. ఆ తర్వాత నాకు ఏ ఆశా లేదు' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్గా మారి దుమారం రేపింది. నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన వ్యక్తిని ఉదయ్పూర్లో హత్య చేసిన విషయాన్ని కూడా విక్రమ్ ప్రస్తావించారు. ఆమెకు అనుకున్నది మాట్లాడే హక్కు ఉందని పేర్కొన్నారు. చదవండి: Idris Ali: శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. -
నూపుర్ శర్మ, బ్యాంకు దోపిడీలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్.. విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈడీలు, సీబీఐలు బ్యాంకు దొంగలను ఎందుకు పట్టుకోవు అని ప్రశ్నించారు. ఒక్క బ్యాంకు దోపిడీదారుడినైనా ఎందుకు తీసుకురాలేదు. దేశంలో అమాయకులపైనే మీ ప్రతాపమా.?. దోపిడీదారులకు మాత్రం లక్షలకోట్లు దోచిపెడుతున్నారు. 12 లక్షల కోట్ల ఎన్పీఏల్లో మోదీ వాటా ఎంతో చెప్పాలి. తెలంగాణలో ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తామని మాట్లాడాతారా. ఏకానాథ్ షిండేలను సృష్టాస్తామని బాహాటంగా చెబుతున్నారు ఇలాదే మీ సంస్కారం. బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హంతకులు కారా అని ప్రశ్నించారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని బీజేపీ గుర్తుంచుకోవాలి. పార్టీలను భయపెడతారు.. నాయకులను భయపెడతారు.. ఇదేం ప్రభుత్వం..?. ఏ వ్యవస్థపైనా బీజేపీకి గౌరవం లేదు. బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆ న్యాయమూర్తులకు సెల్యూట్ చేస్తున్నాను. నూపురు శర్మ వ్యాఖ్యలను తప్పుపడితే సుప్రీంకోర్టుపైనా లేఖలు రాయిస్తారా అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరిస్తున్నారు.. ఇది కరెక్టేనా..?. సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయని కండకావరమా బీజేపీ..?. జడ్డీలను కూడా ట్రోలింగ్ చేస్తారా..?. దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కోర్టులు, జర్నలిస్టులు అంటే కేంద్రానికి గౌరవం లేదు. మేకిన్ ఇండియా పథకం అట్టర్ ప్లాప్ అయింది. పెట్టుబడిదారుల కోసం పీఎం సెల్స్మెన్గా మారారు.మన జాతీయ జెండాలు చైనా తయారు చేయడం మేకిన్ ఇండియానా..?. పతంగులు, దారాలు కూడా మనం తయారు చేయాలేమా..?. దేశంలో రైతులకు సబ్సిడీ ఇవ్వరు. బీజేపీ నేతలు ప్రజా హంతకులు కారా..?. బీజేపీ కండువా కప్పుకోగానే కొందరు అవినీతికి పాల్పడిన నేతలకు నోటీసులు ఆగిపోయాయి. వారంతా బీజేపీలోకి వెళ్లగానే వారంతా పవిత్రం అయిపోతారా..?. చివరకు దేశ సైన్యం విషయంలో కూడా ఉన్మాదంతో ప్రవర్తిస్తారా..?. మీ వికృత రాజకీయాల కోసం కశ్మీర్ పండిట్లను బలి తీసుకుంటారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది కూడా చదవండి: మీకు అది కూడా చేతకాదా మోదీ జీ.. కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు -
నూపుర్ శర్మ అరెస్టు పిటిషన్.. అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: నూపుర్ శర్మను అరెస్టు చేయాలని దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఇందార బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన విశ్రాంత ధర్మాసనం.. ఈ పిటిషన్ను మొదట రిజిస్ట్రార్ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. అయితే ఇప్పటికే ఈ పిటిషన్ రిజిస్ట్రార్ ముందు ఉందని, జులై 11న దీనిపై విచారణ జరిగే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది అత్యున్నత ధర్మాసనానికి తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి భాజపా నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మ వల్ల దేశ, విదేశాల్లో అనిశ్చితి, అశాంతి నెలకొందని పిటిషన్ పేర్కొంది. ఆమె వల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఆమెపై ఫిర్యాదులు నమోదైనా.. పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లాడు. నూపుర్ శర్మను తక్షణమే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించాలని అభ్యర్థించాడు. చదవండి: సల్మాన్ ఖాన్ లాయర్కు బెదిరింపు లేఖ.. వదిలిపెట్టేది లేదంటూ.. -
నూపుర్ శర్మను చంపిన వారికి ఆస్తినంతా రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్
జైపూర్: నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నూపుర్ శర్మ తల తెచ్చిన వారికి తన ఇల్లుతో పాటు ఆస్తినంతా రాసిస్తానని సల్మాన్ ఓ వీడియో విడుదల చేశాడు. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన ఆమెను హతమార్చాలని పిలుపునిచ్చాడు. తాను అజ్మేర్ దర్గా నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. వీలుంటే తానే ఆమెను తుపాకీతో కాల్చి చంపేవాడినని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు దేశంలోని ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, అనేక చోట్ల తమపై దాడులు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సల్మాన్ను అరెస్టు చేశారు. సల్మాన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అజ్మీర్ దర్గా ప్రతినిధులు స్పష్టం చేశారు. దర్గా పవిత్ర స్థలం అని, అలాంటి చోట ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సల్మాన్ డ్రగ్స్కు బానిసయ్యాడని, అతనిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా, నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్ ఉదయ్పుర్లో కన్నయ్య లాల్ అనే టైలర్ను ఇద్దరు వ్యక్తులు ఇటీవలే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతడిని హత్య చేసిన అనంతరం వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పోలీసులు ఇద్దరు నిందితులను మూడు గంటల్లోనే అరెస్టు చేశారు. -
నూపుర్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం
ఢిల్లీ: అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. అయితే ఆమెకు మద్దతుగా.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్పైనా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీలంతా కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేయడం, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పదిహేను మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, 25 మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు. నూపుర్ శర్మ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా.. దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై వాదనల సందర్భంగా.. నూపుర్ శర్మ భద్రతకు ముప్పు కాదని.. ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవక్తకు సంబంధించి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని(ఉదయ్పూర్ ఘటనను ఉద్దేశించి) బెంచ్ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్లు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు. నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్టం చేశారని, యావత్ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది. అయితే సుప్రీం కోర్టు బెంచ్లో జస్టిస్ సూర్యకాంత్.. నూపుర్ను ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్, జమ్ము అండ్ లడఖ్ అనే సంస్థ లెటర్ను రిలీజ్ చేసింది. నూపుర్పై తీవ్రవ్యాఖ్యలతో న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు.. తక్షణ దిద్దుబాటు అవసరం అంటూ ఈ మేరకు లేఖను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పంపింది. An open letter has been sent to CJI NV Ramana, signed by 15 retired judges, 77 retd bureaucrats & 25 retd armed forces officers, against the observation made by Justices Surya Kant & JB Pardiwala while hearing Nupur Sharma's case in the Supreme Court. pic.twitter.com/ul5c5PedWU — ANI (@ANI) July 5, 2022 చదవండి: న్యాయవాది అని నూపుర్ చెప్పుకోవడం సిగ్గుచేటు- నూపుర్ -
కామెంట్లపై కలకలం.. ‘అలాంటి అగత్యం దాపురించే ప్రమాదముంది’
సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి అనాలోచిత, అవాంఛిత వ్యాఖ్యలతో దేశంలో చిచ్చు రేపిన నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన మౌఖిక వ్యాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేశాయి. వాటిపై హేతుబద్ధమైన విమర్శలతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు సైతం ట్రెండ్ అయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదలాయించాలని నుపుర్ వేసిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డివాలాలతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించిన సందర్భంలో న్యాయమూర్తులు ఆమెపై కొన్ని మౌఖిక వ్యాఖ్యలు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, మరో 60 మంది రాజకీయ నాయకులు, అధికారులకు సిట్ ఇచ్చిన క్లీన్చిట్ను సుప్రీంకోర్టు సమర్థించడాన్ని వేనోళ్ల పొగిడిన బీజేపీ శ్రేణులు, తాజాగా నుపుర్ కేసులో న్యాయమూర్తులు చేసిన మౌఖిక వ్యాఖ్యలను మాత్రం తూర్పారబట్టాయి. సోషల్ మీడియా వేదికగా వాటిపై విమర్శల వర్షం కురిపించాయి. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఈ విమర్శలు సహజంగానే సుప్రీం న్యాయమూర్తులకు ఇబ్బంది కలిగించాయి. ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జస్టిస్ జేబీ పార్డివాలా మాట్లాడుతూ, ‘‘న్యాయమూర్తులపై సోషల్ మీడియా వ్యక్తిగత దాడులు ఓ ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దీనివల్ల చట్టం ఏం చెబుతుందో పట్టించుకోకుండా మీడియా ఏం వ్యాఖ్యానించనుందోనని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీర్పులు చెప్పాల్సిన అగత్యం దాపురించే ప్రమాదముంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘కోర్టు తీర్పులపై, మౌఖిక వ్యాఖ్యలపై నేను వ్యాఖ్యానించడం సరికాదు. ఒకవేళ నాకు తీవ్ర అభ్యంతరాలున్నప్పటికీ సరైన వేదికపై సరైన సమయంలోనే చర్చిస్తాను’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నిజానికి విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు చాలావరకు తుది తీర్పులో చోటుచేసుకోవు. వ్యాఖ్యలు, పరిశీలనలు వేరు... తీర్పులు వేరు. నుపుర్ పిటిషన్ విషయంలోనూ నిజానికి జరిగిందదే. ఆమె తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు, పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. పిటిషన్ విచారణార్హమైనది కాదని చెబుతూ, ఢిల్లీ హైకోర్టు గడప తొక్కాల్సిందిగా సూచించారు. తీర్పు కాని తీర్పు...! నుపుర్ పిటిషన్ విషయాన్ని పక్కన పెడితే విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, పరిశీలనలే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చక్కర్లు కొట్టాయి. పత్రికల్లోనూ పతాక శీర్షికలయ్యాయి. పిటిషన్ను తోసిపుచ్చడాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా, న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలనే పెద్ద ఎత్తున చర్చించారు. వాటిపై సోషల్ మీడియాలో ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. నుపుర్ కేసులో ఢిల్లీ పోలీసులు ప్రదర్శించిన ఉదాసీనత, ఆమెను కాపాడేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు కూడా విమర్శలకు దారి తీశాయి. బీజేపీ మద్దతుదార్లు మరో అడుగు ముందుకేసి నుపుర్ పిటిషన్పై తీర్పు ఇవ్వకుండానే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల ద్వారా ఆమెను దోషిగా బోనెక్కించిందనే వాదనను బలంగా విన్పించాయి. వ్యాఖ్యలొద్దన్న సుప్రీం తీర్పే శిరోధార్యం ఒకవేళ నుపుర్ శర్మ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ కోర్టయినా రికార్డుల్లో ఉన్న విషయాలనే చూస్తుంది. అంతే తప్ప మౌఖిక వ్యాఖ్యలను, పరిశీలనలను పరిగణనలోకి తీసుకోదు. ఇలాంటి మౌఖిక పరిశీలనలు లీగల్ పరిధిలోకి రావు కూడా. మరైతే న్యాయమూర్తులు ఇలాంటి మౌఖిక వ్యాఖ్యలు ఎందుకు చేస్తారనే అనుమానం రావచ్చు. ‘‘పిటిషన్ విచారణ సమయంలో తమ ముందుకొచ్చే అంశాల తీవ్రతను బట్టి న్యాయమూర్తులు అలాంటి అసంకల్పిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తీర్పు వెలువరించే సమయానికి కేసుపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని తుది నిర్ణయానికి వస్తారు’’ అన్ని ఓ న్యాయ నిపుణుడి విశ్లేషణ. అయితే కోర్టుల మౌఖిక పరిశీలనలు, వ్యాఖ్యలు జనంలోకి వెళ్లి విపరీతమైన ప్రచారం పొందుతాయి. రాజకీయ నాయకులు సహజంగానే వాటినుంచి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అవి ఒకోసారి బెడిసికొడతాయి కూడా. ఉదాహరణకు 2007 గుజరాత్ ఎన్నికల్లో మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ‘మౌత్ కా సౌదాగర్’ వ్యాఖ్య ఆమెకే తిప్పికొట్టింది. ఫలితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. అయితే, మోదీపై సుప్రీంకోర్టు ‘నయా నీరో’ వ్యాఖ్యలు చేసిన తర్వాతే సోనియా ఆ వ్యాఖ్య చేయగలిగారన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం! అందుకే కోర్టు తన దృక్పథాన్ని తీర్పుల ద్వారా, లేదా లిఖితపూర్వక ఆదేశాల ద్వారా చెప్పాలే తప్ప మౌఖికంగా కాదన్నది నిపుణుల అభిప్రాయం. దీనిపై సుప్రీంకోర్టు కూడా గతేడాది స్పష్టతనిచ్చింది. ‘‘న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని తీర్పులు, ఆదేశాల ద్వారానే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. అంతే తప్ప రికార్డుల్లోకెక్కని మౌఖిక వ్యాఖ్యలతో కాదు’’ అని సూటిగా చెప్పింది. నిజానికి ఇదే ఉత్తమం కూడా. కదా! ఇది కొత్తేమీ కాదు... లిఖితపూర్వక తీర్పులో లేని అంశాలను మౌఖికంగా వ్యాఖ్యానించి న్యాయమూర్తులు విమర్శలకు గురికావడం ఇదదేమీ కొత్త కాదు. రాజకీయ పార్టీలు ఆ వ్యాఖ్యలను తమకు తోచిన విధంగా మలచుకుని లబ్ధి పొందాలని చూడటమూ కొత్త కాదు. 2002 గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు 2004లో చేసిన వ్యాఖ్యలను బీజేపీయేతర పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పటికీ వాడుకుంటూ ఉంటుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని నయా నీరోగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఈ వ్యాఖ్యను మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా ప్రతిపక్షాలు సమయం వచ్చినప్పుడల్లా తెరపైకి తెస్తున్నాయి. అయితే అల్లర్ల వెనక ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టేలా ఆ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, అదే కేసులో మోదీకి సిట్ ఇచ్చిన క్లీన్చిట్ మాత్రం సరైందేనంటూ ఇటీవలే తీర్పు ఇవ్వడం తెలిసిందే! విచారణ సందర్భంలో చేసే వ్యాఖ్యలకు చివర్లో ఇచ్చే తీర్పుకు పొంతన ఉండదనే విషయం దీంతో మరోసారి స్పష్టమైంది. విచారణలో భాగంగా సందర్భానుసారం వ్యక్తపరిచే వ్యాఖ్యలను కేవలం వ్యాఖ్యలుగానే చూడాలి. అంతే తప్ప వాటినే తీర్పుగా భావించకూడదు. అవి తుది తీర్పును ప్రభావితం చేయవు కూడా. తీర్పు ఎప్పుడూ సాక్ష్యాలు, చట్టాలకు లోబడే ఉంటుంది. -
రెచ్చిపోయి చితకబాదిన పోలీసులు.. కోర్టు సీరియస్
బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాద్లు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారి వ్యాఖ్యల కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనల్లో భాగంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, ఉత్తర ప్రదేశ్లో కూడా నిరసనల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. షహరాన్పూర్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై యూపీ పోలీసులు లాఠీలు ఝళిపించారు. అల్లర్లలో పాల్గొన్నారని ఎనిమిది మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేసి.. లాకప్లో లాఠీలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో, వారి పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన స్థానిక కోర్టు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసిన 8 మంది అలర్లల్లో పాల్గొన్నారనేందుకు సాక్ష్యాలను పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. వారిని నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేయాలని ఆదేశించింది. ఇక, పోలీసులు దారుణంగా కొట్టడంతో మహ్మద్ అలీ అనే వ్యక్తి చేయి విరిగిపోయింది. ఇదిలా ఉండగా.. షహరాన్పూర్లో పెద్దఎత్తున అల్లర్ల కారణంగా 300 మందికి పైగా వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు లాఠీలతో కొట్టిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే షలభ్ మణి త్రిపాఠి స్పందించారు. ఈ వీడియోకు ''అల్లరిమూకకు రిటర్న్ గిఫ్ట్'' అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. news24official UP : उपद्रवियों की पुलिस ने की पिटाई, BJP नेता Shalabh Mani Tripathi ने शेयर किया वीडियो pic.twitter.com/yxbE18txaU — Zeyad Alam (@ZeyadAlam18) June 12, 2022 ఇది కూడా చదవండి: కర్కశకంగా కోటింగ్.. దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయిన చిన్నారి -
మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య
నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు. సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు. నిందితులంతా కూలీలు.. ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అమరావతికి ఎన్ఐఏ బృందం అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్పూర్లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. -
నూపుర్ వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్.. కాంగ్రెస్ స్పందన.. ‘సిగ్గుతో ఉరేసుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇంతటి అవమానకర పరిస్థితుల్లో కాషాయ పార్టీ సిగ్గుతో ఉరేసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగడానికి నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని సుప్రీం చెప్పడం సరైంది. జరిగిన ఘటనలకు ఆమెదే పూర్తి బాధ్యత అని, జాతి మొత్తానికి క్షమాపణలు చెప్పాలని చెప్పడం ఆహ్వానించదగ్గది. అధికారం ఉందని విర్రవీగేవారికి సుప్రీం వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివి’ అని కాంగ్రెస్ పేర్కొంది. చదవండి👉సోమవారమే ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి బల పరీక్ష ‘ఇందులో రహస్యమేమీ లేదు.. మత విద్వేషాలను రెచ్చగొట్టి కమళం పార్టీ లబ్ది పొందాలనుకుంటోంది. విధ్వంసపు విభజన భావజాలాలపై పోరాడే ప్రతి ఒక్కరికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ఎత్తుగడలు వేసే జాతీ విద్రోహ శక్తులపై పోరాటాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ ఆపదని తేల్చి చెప్పారు. అలాంటివారి వికృత చర్యలను భరత జాతి ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాగా, మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటా బయటా బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్తూ నూపుర్ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, తదనంతరం కూడా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈక్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక వాఖ్యలు చేసింది. చదవండి👉కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్ఠాక్రే స్పందన Our statement on the Supreme Court's observations on the BJP Spokesperson's case pic.twitter.com/kCkxITGHVU — Jairam Ramesh (@Jairam_Ramesh) July 1, 2022 -
దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే
దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు నోటిపై ఆదుపు లేకపోవడం వల్ల దేశం మొత్తం అగ్ని గోళంగా మారే పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు మండిపడింది. దేశంలో జరిగిన పరిణామాలకు ఆమె ఒక్కరే బాధ్యురాలని తేల్చిచెప్పింది. నిరసనలు, హింసాత్మక ఘటనలు, అల్లర్లకు దారితీసేలా మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. చీఫ్ పబ్లిసిటీ, రాజకీయ అజెండా లేదా నీచమైన ఎత్తుగడల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై, హైదరాబాద్, శ్రీనగర్ తదితర నగరాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఒక్కటిగా కలిపేసి, ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి అయినంత మాత్రాన దేశంలో అశాంతికి కారణమయ్యేలా మాట్లాడే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు మతాలను గౌరవించరని, రెచ్చగొట్టేలా ప్రకటనలు మాత్రమే చేస్తారని ఆక్షేపించింది. ‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్య త వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల చర్చను హోస్ట్ చేసిన టీవీ ఛానల్పైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘టీవీ చర్చ దేనికి? కేవలం ఒక అజెండాను ప్రమోట్ చేయడం కోసమేనా? కోర్టు పరిధిలోని అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు?’’అని నిలదీసింది. అధికారం ఉంది కదా! అని ఏదైనా మాట్లాడొచ్చని ఆమె అనుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నలకే నూపుర్ సమాధానం ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది మణీందర్ సింగ్ చెప్పారు. అలాగైతే యాంకర్పై నూపుర్ శర్మ ఫిర్యాదు చేసి ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. టీవీల్లో వివాదాస్పద ప్రకటనలు చేస్తూ దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రగిలించే రాజకీయ ప్రతినిధి స్వేచ్ఛతో జర్నలిస్టు స్వేచ్ఛను పోల్చలేమని వ్యాఖ్యానించింది. ఉదయ్పూర్లో జరిగిన టైలర్ హత్యను ధర్మాసనం ప్రస్తావించింది. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా నూపుర్ శర్మ నోటి దురుసుతో బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టింది. ఆమెలోని అహంకారం పిటిషన్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. క్షమాపణలు చెబుతూ నూపుర్ రాసిన లేఖను న్యాయవాది మణీందర్ సింగ్ ప్రస్తావించారు. ధర్మాసనం స్పందిస్తూ.. టీవీ ఛానల్కు వెళ్లి ఆమె క్షమాపణలు చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో చాలా జాప్యం జరిగిందని, ప్రజల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో షరతులతో వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని సూచించింది. ‘‘నూపుర్ కేసులు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేశారు. కానీ, నూపుర్పై నమోదైన కేసుల్లో ఆమెను అరెస్టు చేయలేదు. అదే ఆమె పలుకుబడిని సూచిస్తోంది’’అని ధర్మాసనం తెలిపింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆరెస్టు చేయకపోవడంతో బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని వెల్లడించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు తన పిటిషన్ను నూపుర్ ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి .. ప్రతిపక్షాల ఆగ్రహం నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు నూపుర్శర్మ ఒక్కరే కాదు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కారణమని దుయ్యబట్టారు. సర్కారు తీరు దేశ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలు విరుద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక సిగ్గుతో ఉరేసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సరైన విధంగా స్పందించిందని చెప్పారు. నూపర్ శర్మపై చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్నుంచి అలాంటి వారు మరికొందరు పుట్టకొచ్చే ప్రమాదం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. నూపర్పై వ్యాఖ్యలను ధర్మాసనం ఉపసంహరించుకోవాలి : సీజేఐకి అజయ్ గౌతమ్ లెటర్ పిటిషన్ బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఒక లెటర్ పిటిషన్ సమర్పించారు. నూపర్ విషయంలో చేసిన వ్యాఖ్యలను వెకేషన్ బెంచ్ ఉపసహరించుకొనేలా తగిన ఆదేశాలుల లేదా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆమెపై పారదర్శకంగా విచారణ జరిగే అవకాశం ఉంటుందని అభ్యర్థించారు. తన లెటర్ పిటిషన్ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని విన్నవించారు. నూపర్పై వెకేషన్ బెంచ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అవాంఛనీయమని అజయ్ గౌతమ్ పేర్కొన్నారు. చదవండి: ఉదయ్పూర్ ఘటనను ఖండించిన దీదీ.. నూపుర్కు పరోక్ష హెచ్చరికలు -
టైలర్ కన్హయ్య హత్య కేసు.. సర్కార్ సంచలన నిర్ణయం
రాజస్థాన్ ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్గా పెట్టుకున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య తర్వాత ఉదయపూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. ఇదిలా ఉండగా.. టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య నేపథ్యంలో ఉదయపూర్ ఇన్స్పెక్టర్ జనరల్, పోలీస్ సూపరింటెండెంట్తో సహా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి చెందిన 32 మంది అధికారులను బదిలీ చేశారు. కాగా, సున్నితమైన ఈ కేసు దర్యాప్తును దేశంలోని అత్యున్నత ఉగ్రవాద నిరోధక సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి కేంద్ర హోంశాఖ అప్పగించింది. ఈ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. కన్హయ్య లాల్ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హత్య కేసుపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని అన్నారు. హంతకులిద్దరికీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ హత్య కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి నేరస్థులను పట్టుకోగలిగామని అన్నారు. ఇదే సమయంలో హంతకులకు ఉగ్రవాద సంస్థలతో ఉన్న లింకులను సైతం కనుగొన్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఉదయ్పూర్ కంటే వారం ముందే మరో ఘటన!.. అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం -
ఉదయ్పూర్ కంటే ముందే మరో ఘటన! దర్యాప్తు ముమ్మరం
ముంబై: రాజస్థాన్ ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో ఉగ్రకోణం వెలుగు చూడడంతో నిఘా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. పాక్ ఉగ్రవాద సంస్థలతో నిందితులకు సంబంధం ఉన్నట్లు తేలడంతో పాటు మరికొన్ని కీలకాంశాలను సైతం రాజస్థాన్ పోలీసులు విచారణ ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే.. ఈ ఘటన కంటే ముందే మహారాష్ట్రలో దాదాపుగా ఇదే తరహాలో జరిగిన ఓ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో దర్యాప్తు ఊపందుకుంది. మహారాష్ట్ర అమరావతిలో మెడికల్ సామాగ్రి వ్యాపారి ఉమేష్ కోల్హే హత్య పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఆయన్ని కూడా కన్హయ్య లాల్ తరహాలోనే దుండగులు గొంతుకోసి హతమార్చారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇతర వివరాలేవీ బయటకు పొక్కనివ్వడం లేదు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం.. ఇది నూపుర్ శర్మ కామెంట్లకు ముడిపడిన ఘటనే అని చెప్తున్నారు. జూన్ 21వ తేదీ రాత్రి దుకాణం నుంచి తిరిగి వస్తున్న టైంలో ఉమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన్ని గొంతుకోసి చంపి పారిపోయినట్లు.. వెనుక మరో బైక్ మీద వస్తున్న ఉమేష్ కొడుకు, ఉమేష్ భార్యలు ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి.. అబ్దుల్ తౌఫిక్, షోయెబ్ ఖాన్, అతీఖ్ రషీద్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవేళ అది దొంగతనంలో భాగమే అయితే.. ఉమేష్ వెంట ఉన్న డబ్బును తీసుకెళ్లేవాళ్లు. కానీ, ఆయన్ని ఎందుకు హత్య చేసి ఉంటారన్నది ఇప్పుడు పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాదు.. కోల్హే తన సోషల్ మీడియాలో నూపుర్ శర్మకు అనుకూలంగా కొన్ని పోస్టులు షేర్ చేశారని, వాటిని వాట్సాప్ గ్రూపుల్లోనూ పంచుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శివరాయ్ కులకర్ణి.. అమరావతి కమిషనర్ ఆర్తి సింగ్ను కలిసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లోపే ఉదయ్పూర్ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించిన పోలీసులు.. దర్యాప్తు చేయిస్తున్నారు. చదవండి: ఉదయ్పూర్ ఘటన.. భయపడినట్టుగానే జరిగింది!! -
ఆమెను వదిలే ప్రసక్తే లేదు.. దీదీ ఆగ్రహం
కోల్కతా: ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్ర వాదం ఎంతైనా ఆమోదయోగ్యం కాదు! ఉదయ్పూర్లో జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని చేసుకుని పోతుంది. కాబట్టి, శాంతిని కాపాడాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారామె. ఇదిలా ఉంటే.. మంగళవారం అసన్సోల్లో జరిగిన పార్టీ సమావేశంలో పేరు ప్రస్తావించకుండానే బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై దీదీ మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీది మొత్తం తప్పుడు, ఫేక్ ప్రచారం నడిపిస్తోందంటూ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘నేను సోషల్ నెట్వర్క్లకు అనుకూలం. నిజాలు మాట్లాడే వారి పక్షాన నేను ఉంటా. కానీ, బీజేపీ సోషల్ నెట్వర్క్ మొత్తం ఫేక్మయం. మోసం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ సోషల్ మీడియా దిట్ట. వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ లోనూ అబద్ధాలాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. మతపరంగా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఓ నేతను(నూపుర్ను ఉద్దేశించి).. కనీసం అరెస్ట్ కూడా చేయనివ్వడం లేదు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోంది. వాళ్లు చంపితే.. ఎవరూ మాట్లాడొద్దు. అదే వేరే ఎవరైనా మాట్లాడితే చాలూ.. హంతకులైపోతారా?. జుబేర్(ఆల్ట్ న్యూస్) ఏం చేశాడు? తీస్తా ఏం చేశారు?.. మీ దగ్గర ఉన్న వ్యక్తుల పేర్లు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ, వాళ్లు మతాన్ని కించపరుస్తున్నా.. గట్టి భద్రత ఇస్తున్నారు. మేం అలా కాదు. ఆమెకు సమన్లు ఇచ్చాం. అసలు వదిలే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుని తీరతాం అంటూ మండిపడ్డారు ఆమె. మొహమ్మద్ ప్రవక్త గురించి వ్యాఖ్యలతో నూపుర్ శర్మ.. విమర్శలు, కేసులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి కూడా. జూన్ 20వ తేదీన ఆమె కోల్కతా పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే దాడులు జరుగుతాయేమోననే భయంతో ఆమె బయటకు రావడం లేదు. ఇప్పటికే ముంబై పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టగా.. కోల్కతా పోలీసుల సమన్లకు మెయిల్ ద్వారా స్పందించారు ఆమె. తనకు ప్రాణ భయం ఉందంటూ నాలుగు వారాల గడువు కోరింది నూపుర్ శర్మ. Violence and extremism are UNACCEPTABLE, no matter what! I STRONGLY CONDEMN what happened in Udaipur. As law takes its own course of action, I urge everyone to maintain peace. — Mamata Banerjee (@MamataOfficial) June 29, 2022 -
ఉదయ్పూర్ హత్య: రాజస్థాన్లో నెలపాటు 144 సెక్షన్
జైపూర్: మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్ అనే వ్యక్తిపై.. అతని దుకాణంలోనే ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ మాల్దాస్లో మంగళవారం జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. మరోవైపు సీఎం అశోక్గెహ్లాట్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కోరుతున్నారు. ఈ ఉదంతంపై నిరసనలు, మతపరమైన ఉద్రిక్తతలతో ఉదయ్పూర్తో పాటు రాజస్తాన్ అంతా అట్టుడికింది. పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్ కాకుండా చూస్తున్నారు. సంయమనం పాటించాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఉదయ్పూర్కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్ఐఏ బృందాన్ని పంపింది. కస్టమర్లలా వచ్చి... మృతుడు కన్హయ్యా లాల్ ఉదయ్పూర్లో టైలర్. హంతకులు రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్ బట్టలు కుట్టించుకునే సాకుతో మంగళవారం మధ్యాహ్నం మాల్దాస్లోని దాన్ మండీలో ఉన్న అతని దుకాణంలోకి ప్రవేశించారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్ కత్తి తీసి కన్హయ్య మెడపై వేట్లు వేశాడు. దీన్నంతా గౌస్ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే ఇద్దరూ అక్కణ్నుంచి పారిపోయారు. ఈ దారుణంపై స్థానిక దుకాణదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా వారంతా దుకాణాలు మూసేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే యూఐటీ ప్రకారం.. కన్హయ్య లాల్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య ఎనిమిదేళ్ల కుమారుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా దాన్ని కన్హయ్య సమర్థించినట్టు చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఆయనను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. కన్హయ్యను చంపుతామంటూ జూన్ 17న తీసిన వీడియోను కూడా హంతకులు మంగళవారమే సోషల్ మీడియాలో పెట్టారు. తమ వర్గం వారు ఇలాంటి దాడులను ఉధృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్తర్ స్థానిక మసీదులో పని చేస్తుండగా.. గౌస్ కిరాణా దుకాణం నడుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్యేనని ఉదయ్పూర్ ఎస్పీ మనోజ్కుమార్ చెప్పారు. రక్షణ కోరినా పట్టించుకోలేదు.. మృతుడు పోలీసు రక్షణ కోరినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ ఆరోపించింది. రాజస్తాన్లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీశ్ పునియా ఆరోపించారు. ‘‘హంతకులు కత్తులు చేతబట్టి నేరుగా ప్రధానినే చంపుతామని బెదిరిస్తూ వీడియోలు పోస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెను సవాలు’’ అని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్కుమార్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మొదలుకుని పలువురు నేతలు హత్యను ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్త: షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే.. -
నూపుర్ శర్మ ఫొటో షేర్ చేసినందుకు షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే
Udaipur Gruesome Murder: జైపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ హత్యకు గురయ్యాడు. టైలర్ తన దుకాణంలో పనిలో ఉండగా లోనికి ప్రవేశించిన ఇద్దరు దుండగులు బుధవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి హతమార్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు. టైలర్ హత్యోదంతంతో ఉదయ్పూర్లోని మల్డాస్ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. ఈఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. టైలర్ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయ్పూర్లో పోలీసులు మోహరించారు. 24 గంటలపాటు నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. నూపుర్ శర్మకు మద్దతుగా టైలర్ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. మరోవైపు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పారిపోతున్న నిందితులను రాజ్సమంద్ జిల్లాలోని భీం ప్రాంతంలో పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. చదవండి👇 వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? ఉపాధ్యాయుడి హత్య: భార్యే హంతకురాలు.. వివాహేతర సంబంధంతో.. -
మోదీ జీ.. మీ దోస్త్ను అడిగి తెలుసుకోండి: ఒవైసీ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ఆయన దోస్త్ అబ్బాస్ గురించి ఒవైసీ ప్రస్తావించడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మోదీ స్నేహితుడిని ప్రస్తావిస్తూ ఒవైసీ.. బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఇటీవలే 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ.. హీరాబెన్ కాళ్లు కడిగి ఆమెకు సపర్యలు చేశారు. హీరాబెన్ పుట్టిన రోజు సందర్భంగా మోదీ.. తన బ్లాగ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తల్లితో గడిచిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న మోదీ.. తన చిన్ననాటి మిత్రుడు అబ్బాస్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రధాని మోదీకి తన చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికి ఓ స్నేహితుడి ఉండేవాడని.. అయితే, ప్రమాదవశాత్తు ఆయన చనిపోయారని తెలిపారు. దీంతో ఆయన కొడుకు అబ్బాస్ను.. మోదీ తండ్రి.. వారి ఇంటికి తీసుకువచ్చారని.. అబ్బాస్ తనతోనే చదువు పూర్తి చేసినట్టు మోదీ చెప్పారు. అలాగే, ఈద్ పండగ వేళ తన తల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంటలు చేసేదని మోదీ గుర్తు చేశారు. కాగా, మోదీ చెప్పిన విషయాలపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ జీ.. ఒకవేళ మీ మిత్రుడు అబ్బాస్ ఉండి ఉంటే.. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవో కావో అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే నిజంగా మోదీకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియదన్నారు. ఒకవేళ అబ్బాస్ ఉండి ఉంటే.. ఇస్లామిక్ మతపెద్దలతో పాటు తాను కూడా మాట్లాడే ప్రసంగాలను విని వాటిపై వివరణ ఇచ్చేలా మోదీ చర్యలు తీసుకోవాలని అసద్ కోరారు. అలాగే, సుపుర్ శర్మ వ్యాఖ్యలను అబ్బాస్ కూడా అంగీకరించడు. తామేమైనా ఏవైనా అబద్దాలు చెబితే.. మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోండి మోదీ జీ అంటూ అసద్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. అబ్బాస్ అడ్రస్ ఇస్తే తామే అతని వద్దకు వెళ్తామని అసద్ స్పష్టం చేశారు. .@narendramodi जी, अपने दोस्त अब्बास को बुलाकर उलेमा-ए-किराम की तक़रीर सुनाइये और फिर उनसे पूछिए कि जो नूपुर शर्मा ने हजरत मोहम्मद ﷺ के बारें में कहा, वो सही है या ग़लत ? - Barrister @asadowaisi pic.twitter.com/6GS51Xt3Le — Farhaz khan AIMIM (@farhazkhanAIMIM) June 20, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతపై దాడి.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక -
నూపుర్ శర్మ కోసం పోలీసుల గాలింపు!
ఢిల్లీ: ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపర్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు. ముంబైతో పాటు ఢిల్లీ, కోల్కతా పోలీసులు సైతం ఆమె ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్ల తర్వాత ఢిల్లీ వాసి అయిన నూపుర్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు గట్టి భద్రత కల్పించారు పోలీసులు. అయితే అదే సమయంలో.. పలు రాష్ట్రాల్లో ఆమెపైనా డజన్ల కొద్దీ కేసులు నమోదు అయ్యాయి. రజా అకాడమీ అనే ఇస్లాం సంస్థ కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సైతం నూపుర్పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను ప్రశ్నించేందుకు ముంబై పోలీసుల టీం ఒకటి.. ఢిల్లీకి వెళ్లింది. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం మాత్రం ఇప్పటిదాకా వాళ్లకు తెలియలేదు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ముంబై పోలీసులు నూపుర్ కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ‘నూపుర్ను అరెస్ట్ చేయడానికి ముంబై పోలీసులకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. కోల్కతా పోలీసులు కూడా నూపుర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీఎంసీ మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ సోహైల్ ఫిర్యాదు మేరకు కోల్కతా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ఆమె స్టేట్మెంట్ను కోల్కతా పోలీసులు నమోదు చేయాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు సైతం ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈలోపే ఆమెకు బెదిరింపులు రావడంతో.. ఆమె కుటుంబానికి భద్రత కల్పించారు. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు సైతం తెలియదట!. ఓ టీవీ డిబేట్లో జ్ఞానవాపి మసీదు అంశంపై మాట్లాడుతున్న కమ్రంలో.. ముహమ్మద్ ప్రవక్త వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారామె. ఆ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలతో పాటు 15 ఇస్లాం దేశాలు ఖండించాయి. గల్ఫ్ దేశాలు సైతం అక్కడున్న భారతీయ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి.. వివరణ, క్షమాపణలు కోరాయి. అయితే వ్యాఖ్యల దుమారం మొదలైన వెంటనే నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆమె వ్యాఖ్యలను సైతం ఖండించింది బీజేపీ. ఇక తన వ్యాఖ్యలపై భేషరతు క్షమాపణలు చెప్పిన నూపుర్ శర్మ.. పదే పదే మహాదేవుడ్ని(శివుడ్ని) అవమానించడం, అగౌరవపర్చడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు కూడా. చదవండి: భారత్ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త! -
భారత్ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న’ నానుడి అక్షరాలా నిజమని నూపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యల ఉదంతం స్పష్టం చేస్తోంది. ఆమె నోటి దురుసు వల్ల ఇవ్వాళ భారతదేశం అనేక ముస్లిం దేశాల నుంచి తీవ్రమైన నిరసనలను ఎదుర్కోవలసివచ్చింది. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం తేవడం, హిందుత్వ వాదులు హిజాబ్ పేరుతో ముస్లిం అమ్మాయిలపైన వివక్షను ప్రదర్శించడం వంటి అనేక కారణాల వల్ల ఆయా దేశాల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి వెళ్లగక్కడానికి ఈ వ్యాఖ్యలు తక్షణ కారణంగా పనిచేశాయి. ఈ ప్రపంచం చాలా చిన్నది. ఏ దేశం కూడా తనంతట తానుగా మనుగడ సాగించలేదు. అందుకే సహజీవనం, శాంతి, సామరస్య విధానాలు తప్పనిసరి. ‘‘ఎవరైనా తన మనసులో పెంచుకున్న ద్వేషం సహజంగా మనిషిలో ఉండే విచ క్షణను దెబ్బతీస్తుంది. తన మాటలు, చేతలు తన శత్రువు కన్నా తనకే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. అవి తన ఉనికికే ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. వ్యక్తుల స్థాయిని బట్టి దాని పరిణామాలు ఉంటాయి.’’ గౌతమబుద్ధుడు కోపం, ద్వేషం గురించి చేసిన చాలా బోధనలలో ఈ విషయాన్ని సుస్పష్టంగా వివరించారు. సుత్తనిపాతంలోని కోకాలిక సుత్తం, అంగత్తర నికాయలోని ద్వేష సుత్తం, సంయుక్త నికాయలోని సుందరిక సుత్తంలో సోదాహరణంగా దీన్ని వివరించారు. మనుషుల్ని ప్రేమ, స్నేహం, కరుణల ద్వారా గెలుచుకోవాలేగానీ, ద్వేషంతో గెలవ లేరని కూడా బుద్ధుడు తన జీవితకాలంలో నిరూపించారు. ఇన్ని శతాబ్దాల తరువాత సరిగ్గా తథాగతుడి ఈ మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమని రుజువవుతున్నది. ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై భారతీయ జనతాపార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అటువంటి పరిస్థితులను సృష్టించాయి. ఉత్తర ప్రదేశ్లోని కాశీనగరంలో జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందన్న విషయంపై జరిగిన టెలివిజన్ చర్చలో నూపుర్ శర్మ ముస్లింల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడటం తీవ్ర వివాదానికి తెరతీసింది. భారత్లోని ముస్లింలకు సంబంధించిన ఏ వివాదంలోనూ తలదూర్చక సహనం వహించిన దేశాలు సైతం ఈ సందర్భంలో తమ అసంతృప్తిని విస్పష్టంగా వ్యక్తం చేశాయి. కొన్ని దేశాల్లో భారతదేశ వస్తువులను కొనరాదని తీర్మానించేలా వివాదం తారా స్థాయికి చేరింది. నిజానికి ఈ నిరసన ఈ సంఘటనతో బయటకు వచ్చినప్పటికీ, భారత దేశంలో మైనారిటీలపై, ప్రత్యేకించి ముస్లింలపై బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి ఇప్పటివరకూ జరిగిన అనేక ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలను తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. అయితే నూపుర్ ఉదంతంతో వాళ్ళ అసంతృప్తి ఒక్కసారిగా బయటకు వచ్చింది. అంతేకానీ ఇది ఈ ఒక్క సంఘటన ఫలితం కాదు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత గోద్రా అల్లర్లు కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఇక్కడ ఒక మతం, మరొక మతంపై ద్వేషాన్ని ప్రకటించడం కాదు. ఇది ఒక రాజకీయ వ్యూహం. మెజారిటీగా ఉన్న హిందువుల ఓట్లను గెలుచు కోవడానికీ, వాళ్ళను తమవైపు తిప్పుకోవడానికీ ముస్లింలపై ద్వేషాన్ని నూరిపోశారు. ఇది ఉత్తర భారతదేశంలో చాలా విస్తృతంగా జరిగింది. ముస్లిం దండ యాత్రల వల్ల పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని ప్రజలు చరిత్రలో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అయితే బీజేపీ అధికారం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన తర్వాత ఆ ‘చరిత్ర’ను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తర ప్రదేశ్లో ఈ ధోరణి అధికంగా కనిపిస్తుంది. అయోధ్య సమస్య ఇందుకు మంచి ఉదాహరణ. మతం మనోభావాలకు సంబంధించిన సమస్య. గుజరాత్లో సైతం అటువంటి ప్రయత్నమే జరిగింది. హిందూ కులాల్లో ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి నిత్యం ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. గోసంరక్షణ, లవ్ జిహాద్ల పేరుతో చాలా చోట్ల భౌతిక దాడులు జరిగాయి. ఆవు మాంసం తిన్నాడనే నెపంతో అనేక దాడులు... చివరకు ప్రాణాలే తీసిన దారుణాలను ఈ దేశమే కాదు ప్రపంచ దేశాలూ ప్రత్యక్షంగా చూశాయి. కశ్మీర్ సమస్య పరిష్కారం పేరుతో 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, హిజాబ్ పేరుతో ముస్లిం అమ్మాయిలపైన వివక్షను ప్రదర్శించడం కూడా ముస్లింలను అభద్రతకు గురిచేసింది. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత దేశంలో ప్రజలకు మత పరమైన స్వేచ్ఛ లేకుండా పోయిందని అనుకునేట్టు చేశాయి. సరిగ్గా ఇదే నేపథ్యం నుంచి మనం ముస్లిం దేశాల, సంస్థల నిరసనను చూడాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ముస్లిం దేశాలు అనుసరించే వైఖరి భారత దేశ ఆర్థిక పురోగతిపై, రాజకీయ సుస్థిరతపై, సామాజిక సామరస్యంపై ప్రభావం చూపనున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలోని 50 దేశాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. దాదాపు 30 దేశాల్లో 90 శాతం ముస్లిం జనాభా ఉంది. 20 దేశాల్లో 50 శాతం పైగానే ముస్లిం జనాభా ఉంది. మధ్య ఆసియా, గల్ఫ్, ఆఫ్రికా లోని చాలా దేశాల్లో ముస్లిం ప్రభుత్వాలు ఉన్నాయి. వీటన్నింటితో భారత దేశానికి మంచి ఆర్థిక సంబంధాలున్నాయి. అంతేకాకుండా కేవలం గల్ఫ్లో 89 లక్షల మంది భారతీయులు ఉపాధి, ఉద్యోగాలు కలిగి ఉన్నారు. వాళ్ళ బతుకు మీద, భద్రత మీద కూడా దీని ప్రభావం ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఒక నెల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బీజేపీ దేశంలోని ముస్లింల పట్ల చూపుతున్న వ్యతిరేకత, ద్వేషం గల్ఫ్ లోని కార్మికులు, ఉద్యోగుల భద్రత మీద వ్యతిరేక ప్రభావం చూపు తుందని హెచ్చరించిన విషయంలో నూరు శాతం వాస్తవం ఉంది. మన ఆర్థిక వ్యవస్థ గల్ఫ్ మీద అధికంగా ఆధారపడి ఉంది. పన్నెండు ముస్లిం దేశాలు భారతదేశం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా లాంటి దేశాలున్నాయి. ముఖ్యంగా గల్ఫ్లోని ఆరు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇండియా ఈ దేశాలకు చేస్తున్న ఎగుమతుల్లో బియ్యం, గేదె మాంసం, మసాలాలు, సముద్రపు ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, చక్కెర లాంటి ఉత్పత్తులు ముఖ్యమైనవి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో భారత దేశానికి వ్యాపార సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, భారతదేశం వినియోగించే పెట్రోల్, డీజిల్, ఉత్ప త్తుల్లో 60 శాతం కేవలం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఈ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. అలాగే బీజేపీ దాని అనుబంధ సంస్థలూ, ఆ పార్టీ అధికారంలో ఉన్న చోట క్రైస్తవులపై కూడా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. గత ఆరేడేళ్ళలో కొన్ని వేల క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి సేవాకార్యక్రమాల కోసం సేకరిస్తున్న నిధులను నిలిపివేశారు. కొన్ని వందల క్రైస్తవ మత బోధకులపై నిర్బంధాలు అమలయ్యాయి. గల్ఫ్ మినహా క్రైస్తవ సమాజం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇతర మతాల పట్ల, అక్కడి ప్రజల పట్ల సామరస్య పూర్వకంగా వ్యవహరించకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమా దంలో పడే అవకాశాలున్నాయి. అంతే కాకుండా, అంతర్గతంగా అశాంతి పెరిగి అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అది రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. నూపుర్ శర్మ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు ఒక హెచ్చరిక లాంటివి. ఈ నేపథ్యంలో... ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ బద్ధంగా, సెక్యులర్ వ్యవస్థ రక్షణకు పూనుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించా లంటే మత సామరస్యం పాటించక తప్పదన్నది నిర్వివాదాంశం. అదే విషయాన్ని నూపుర్ వివాదం స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రపంచం చాలా చిన్నదన్న విషయం కూడా రుజువైంది. ఏ దేశం కూడా తన సొంతంగా, తనంతట తానుగా మనుగడ సాగించలేదు. అందుకే పరస్పర సహకారం, సహజీవనం, శాంతి, సామరస్యం లాంటి విధానాలు అవసరమవుతున్నాయి. ఇటీవల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ముస్లింలు ఈ దేశపు పౌరులే, వారిని ద్వేషించ కూడదని చెప్పిన మాటలు చేతల్లోకి రావాలి. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
ప్రవక్తపై వ్యాఖ్యలు: భారత్లో ఆత్మాహుతి బాంబు దాడుల వార్నింగ్
మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్.. చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్చారలేదు. వారి వ్యాఖ్యల కారణంగా దేశంలో ఇంకా పలు చోట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై నూపుర్ శర్మను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థలు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నూపర్ శర్మ వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఐసీస్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ అంతటా దాడులు చేస్తామంటూ ఐసీస్ ఖొరాసాన్ హెచ్చరించారు. ఇక గత వారం.. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా భారత్లోని వివిధ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరుపుతామంటూ వార్నింగ్ ఇస్తూ అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) ఒక లేఖను జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ నూపుర్ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది. ‘‘నూపుర్ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్లో ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది. Prophet row: After AQIS, Islamic State wing threatens attacks in India over remarks by Nupur Sharma https://t.co/PQgxW7AAoK — Vinu Mahanthesh G (@iam_mahanthesh) June 15, 2022 ఇది కూడా చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసు: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్.. -
ఇంతకీ నూపుర్ శర్మ ఇప్పుడు ఎక్కడ?
ఓ టీవీ షో డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసి తీవ్ర దుమారం రేపారు నూపుర్ శర్మ. దేశంలోనే కాదు.. ఇస్లాం దేశాల నుంచి ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. అవుతోంది కూడా. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగానూ బీజేపీ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. బీజేపీ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు తన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు కూడా తెలియజేసింది. అయినా వివాదం చల్లారడంలేదు. నూపుర్ శర్మ పేరు ప్రతీరోజూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. మరి.. వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ప్రవక్తపై కామెంట్ల తర్వాత.. చంపేస్తామంటూ బెదిరింపులు, వేధింపులు ఆమెకు ఎదురయ్యాయి. దీంతో కుటుంబంతో సహా ఆమె పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కొన్ని ఉగ్రసంస్థలు సైతం ఆమెపై బెదిరింపు ప్రకటనలు చేశాయి. ఈ తరుణంలో.. ఢిల్లీ పోలీసులు ఆమెకు భారీ భద్రతను అందించారు. కుటుంబంతో పాటు నూపుర్ బలమైన సెక్యూరిటీ నడుమ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మే 26వ తేదీన జ్ఞానవాపి మసీద్ వ్యవహారంపై టీవీ చర్చ సందర్భంగా ఆమె.. ప్రవక్త వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఇస్లాం వర్గాల అభ్యంతరాలతో దుమారం చెలరేగింది. అప్పటి నుంచి ఆమె ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం లేదు. బీజేపీ అగ్రశ్రేణి నేతలకు వివరణ ఇచ్చేందుకు యత్నించినా.. సానుకూల స్పందన లభించలేదు. దీంతో ఆమె కొంతమంది నేతలతో ఫోన్ ద్వారా ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆపై మీడియాకు సైతం అంతగా అందుబాటులోకి రాని నూపుర్.. సోషల్ మీడియా ద్వారానూ సదరు వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడడం లేదు. కానీ, సోషల్ మీడియా అకౌంట్లలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ.. పోస్టులు చేస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్నందునా.. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు నూపుర్ కుటుంబ భద్రతను సవాల్గా తీసుకుంటున్నారు. నూపుర్ శర్మ(37) ఢిల్లీలోని పుట్టి, పెరిగారు. సివిల్స్ సర్వెంట్స్ నేపథ్యం ఉన్న కుటుంబం ఆమెది. బీఏ, ఎల్ఎల్బీ, లండన్ యూనివర్సిటీలో మాస్టర్ లా చేశారామె. ఏబీవీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆమె(ప్రెసిడెంట్గానూ 8 ఏళ్లు పని చేశారు).. విద్యార్థి దశలోనే టీవీ డిబేట్ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. చివరకు.. బీజేపీ నేతగా ఉన్న టైంలోనే టీవీ డిబేట్ ద్వారానే ఆమె వివాదంలోనూ చిక్కుకోవడం గమనార్హం. అయితే ఈ కష్టకాలంలో బీజేపీ ఆమెకు అండగా నిలబడడం లేదంటూ.. #ShameOnBJP #IsupportNupurSharma హ్యాష్ట్యాగులూ ఈమధ్యకాలంలో ట్రెండ్ అవుతుండడం విశేషం. మరోవైపు కొన్ని ఇస్లాం సంఘాలు ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలంటూ పిలుపు ఇస్తున్నా.. మరికొన్ని వర్గాలు మాత్రం చల్లారడం లేదు. -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నుపుర్ శర్మకు సమన్ల వెల్లువ
థానె: ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సస్పెండైన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మకు సమన్లు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల పోలీసులు ఆమెకు ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కోల్కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన నర్కెల్దంగా పోలీస్స్టేషన్లో హాజరు కావాలని కోరారు. టీఎంసీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సొహైల్ ఫిర్యాదు మేరకు నోటీసులిచ్చారు. నుపుర్ శర్మ అభ్యర్థన మేరకు ఆమె హాజరు కావాల్సిన గడువును మరికొద్ది రోజులు పొడిగించినట్లు మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి పోలీసులు తెలిపారు. ఈనెల 22వ తేదీన హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నుపుర్ శర్మకు నోటీసులు ఇచ్చినట్లు థానెలోని ముంబ్రా పోలీసులు, 25న హాజరు కావాలంటూ ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. బెంగాల్లో ఇంకా ఉద్రిక్తతే బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైలు మార్గాలపై నుపుర్ దిష్టిబొమ్మలను దహనం చేసి, బైఠాయించడంతో సియల్డా–హష్నాబాద్ మార్గంలో సోమవారం ఉదయం 20 నిమిషాలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఈస్టర్న్ రైల్వే తెలిపింది. ముర్షిదాబాద్, నడియా జిల్లాలతోపాటు హౌరాలోని కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలవుతోంది. యూపీలో 325 మంది అరెస్ట్ శుక్రవారం నాటి అల్లర్లకు సంబంధించి యూపీలోని 8 జిల్లాలకు చెందిన 325 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ల్లర్లకు సూత్రధారి జావెద్ అహ్మద్ అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని అధికారులు కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇది అన్యాయం, అక్రమమని బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఆరోపించారు. -
ప్రవక్తపై వ్యాఖ్యలు.. దేశమంతా నిరసనలు
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల తాలూకు రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాటిని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ నిరసనలు, ఆందోళనలు జరిగాయి. రాంచీ తదితర చోట్ల ఇవి హింసాత్మకంగా మారాయి. వాటిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కూడా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కశ్మీర్లో పలుచోట్ల కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. నిరసనల వ్యాప్తిని అడ్డుకునేందుకు కశ్మీర్తో పాటు పశ్చిమబెంగాల్లోనూ కొన్నిచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. పలు రాష్ట్రాల్లో వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. రాంచీలో రాళ్ల దాడి ఢిల్లీలోని చారిత్రక జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనకారులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ప్రవక్తపై అభ్యంతకరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ అరెస్టుకు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. దాంతో భారీగా బలగాలను మోహరించాల్సి వచ్చింది. ప్రాంగణం బయట నిరసనలకు దిగిందెవరో తెలియదని జామా మసీదు షాహీ ఇమాం సయీద్ అహ్మద్ బుఖారీ అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నుపుర్ను అరెస్టు చేయాలంటూ జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు కూడా క్యాంపస్లో ధర్నాకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. జార్ఖండ్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాంచీలో స్థానిక హనుమాన్ మందిర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ప్రార్థనల అనంతరం భారీ నినాదాలతో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు ఒక దశలో సంయమనం కోల్పోయి రాళ్ల దాడికి పాల్పడటంతో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అయినా లాభం లేకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఉద్రిక్తత నేపథ్యంలో రాంచీలో ఉదయం నుంచీ తీవ్ర ఉద్రిక్త త నెలకోవడంతో దుకాణాలూ తెరుచుకోలేదు. అట్టుడికిన కశ్మీర్ నుపుర్ వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ అట్టుడికింది. రెండు ప్రాంతాల్లోనూ భారీ ఆందోళనలతో పాటు పలుచోట్ల భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు జరిగాయి. ముందుజాగ్రత్తగా శ్రీనగర్తో పాటు భదేర్వా, కిష్త్వార్ తదితర పట్టణాల్లో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఇంటర్నెట్ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపేశారు. లోయలో చాలాచోట్ల దుకాణాలు తదితరాలు తెరుచుకోలేదు. పశ్చిమబెంగాల్లో హౌరా జిల్లాలో పోలీసులతో నిరసనకారులు బాహాబాహీ తలపడ్డారు. అక్కడ పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. నిరసనల వల్ల రాష్ట్రంలో పలుచోట్ల రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఇటు మహారాష్ట్రలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ముంబై శివార్లలోని పన్వేల్లో జరిగిన భారీ నిరసనల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థానే, ఔరంగాబాద్, సోలాపూర్, నందుర్బార్, పర్భనీ, బీడ్, లాతూర్, భండారా, చంద్రపూర్, పుణె జిల్లాల్లో చాలాచోట్ల ఆందోళనలు జరిగాయి. నుపుర్, జిందార్తో పాటు స్వామి యతి నర్సింగానంద్లను అరెస్టు చేయాలంటూ మహారాష్ట్ర, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. దిష్టిబొమ్మకు ఉరి యూపీలోనూ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ప్రయాగ్రాజ్, సహరన్పూర్ సహా నాలుగైదు నగరాల్లో పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రయాగ్రాజ్లో మోటార్సైకిళ్లకు, రిక్షాలకు నిప్పంటించారు. ఓ పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. లక్నోతో పాటు బిజ్నోర్, రాంపూర్ తదితర చోట్లా అల్లర్లు చెలరేగాయి. గుజరాత్లో అహ్మదాబాద్, వదోదర తదితర నగరాల్లో నిరసనలు కొనసాగాయి. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బంద్ పాటించారు. కర్నాటకలోని బెల్గావీలో ఓ మసీదు వద్ద నుపుర్ దిష్టిబొమ్మను ఉరి తీశారు. ‘నుపుర్ను తక్షణం అరెస్టు చేయాలి’ అంటూ హైదరాబాద్లో కూడా భారీ నిరసనలు జరిగాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా ఇదే డిమాండ్తో ఢాకా సహా పలు నగరాలు, పట్టణాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. #WATCH People in large numbers protest at Delhi's Jama Masjid over inflammatory remarks by suspended BJP leader Nupur Sharma & expelled leader Naveen Jindal, earlier today No call for protest given by Masjid, says Shahi Imam of Jama Masjid. pic.twitter.com/Kysiz4SdxH — ANI (@ANI) June 10, 2022 -
Sakshi Cartoon: ఆయనలా నోటికొచ్చినట్లు తిడుతున్నా అలా మౌనంగా..
ఆయనలా నోటికొచ్చినట్లు తిడుతున్నా అలా మౌనంగా ఉంటున్నారేంటి సార్! -
వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్ శర్మ
న్యూఢిల్లీ: ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకీ ఆమెను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు నవీన్ జిందాల్ జర్నలిస్ట్ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సోషల్ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: గుజరాత్లో నూపుర్ శర్మ వ్యతిరేక పోస్టర్లు.. అరెస్ట్కు డిమాండ్ అసలేం జరిగిందంటే కాగా ఓ టీవీ డిబెట్లో పాల్గొన్న నూపుర్ మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బీజేపీ మీడియా ఇంచార్జీ నవీన్ కుమార్ జిందాల్ కూడా మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర ట్వీట్లు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలు రేపాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 1500 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దిద్దుబాటు చర్యగా నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ వెల్లడించింది..అలాగే పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయినా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహా జ్వాలలు చల్లారలేదు. దేశంలోనే కాకుండా అరబ్ దేశాల్లోనూ దుమారం రేపాయి. తమ మత విశ్వాసాలను కించపరిచితే ఊరుకునేది లేదని ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే భారత్ వస్తువులు, సినిమాలు నిషేధించాలంటూ పిలుపునిచ్చే స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు -
గుజరాత్లో నూపుర్ శర్మ వ్యతిరేక పోస్టర్లు
Prophet remarks row: బీజేపీ తాజా మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు వ్యతిరేకంగా గుజరాత్లో పోస్టర్లు వెలిశాయి. ముహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన కామెంట్లపై దుమారం చల్లారడం లేదు. ఈ తరుణంలో గుజరాత్ సూరత్లోని జిలాని బ్రిడ్జి మీద నూపుర్ వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. ఆమెను తక్షణం అరెస్ట్ చేయాలంటూ ఆ పోస్టర్లో ఉంది. ఈ పని ఎవరు చేశారన్నది తెలియకపోవడంతో.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇస్లాం దేశాలు ఒక్కొక్కటిగా తమ వ్యతిరేకతను ప్రకటనల రూపంలో ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ఆమెపై కేసులు సైతం నమోదు అవుతున్నాయి. చదవండి: నూపుర్కు అల్ఖైదా వార్నింగ్ -
కొనసాగుతున్న ప్రకంపనలు.. ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే
దుబాయ్/ఐరాస: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఉదంతం తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని ఖండించిన ముస్లిం దేశాల జాబితాలో ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే కూడా చేరాయి. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చు రేపి ఊహించని పరిణామాలకు దారి తీస్తాయని ఇరాక్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. అవమానకరమైన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లిబియా, మలేసియా పేర్కొన్నాయి. ‘భారత్లో పాలక బీజేపీ అధికార ప్రతినిధి చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలను’ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఈజిప్టులోని అరబ్ పార్లమెంటు కూడా ప్రకటన జారీ చేసింది. ప్రవక్తపై ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలందరినీ అవమానించడమేనని తుర్కియే విమర్శించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి రంగంలోకి దిగింది. సదరు వ్యాఖ్యలు కొందరు వ్యక్తుల బాధ్యతారాహిత్యమే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కాదని పునరుద్ఘాటించింది. ఇరాక్లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి రోజువారీ మీడియా బ్రీఫింగ్ సందర్భంగా మంగళవారం ఓ పాక్ జర్నలిస్టు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ బదులిస్తూ, మతాల మధ్య పరస్పర సహనం, గౌరవం ఉండాలన్నదే ఐరాస వైఖరి అన్నారు. ‘‘ఈ ఉదంతంపై కథనాలను చూశాను. అయితే వాళ్లు ఏం వ్యాఖ్యలు చేసిందీ నాకు తెలియదు’’ అని చెప్పారు. ప్రభావముండదు: గోయల్ గల్ప్ దేశాలతో భారత సంబంధాలపై ఈ వివాదం ప్రభావం చూపలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ముస్లిం దేశాలతో సత్సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో భారత ఉత్పత్తుల బహిష్కరణ తన దృష్టికి రాలేదన్నారు. అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన అనవసరమన్నారు. నుపుర్కు సమన్లు ఓ చానల్లో చర్చ సందర్భంగా ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జూన్ 22న హాజరై వాంగ్మూలమివ్వాలని సస్పెండైన బీజేపీ నేత నుపుర్శర్మకు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి థానేలో ఆమెపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. సదరు వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులు సమరి్పంచాల్సిందిగా సంబంధిత చానల్ను ఆదేశించినట్టు పోలీసులు చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో నుపుర్కు, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు భద్రత కలి్పంచారు. వారికి దిక్కులేని చావే: కాంగ్రెస్ నేత ప్రవక్తపై బీజేపీ తాజా మాజీ నేతల అనుచిత వ్యాఖ్యలను పిచ్చి కుక్కల మొరుగుడుగా కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖురేషీ అభివర్ణించారు. ‘‘అవి చంద్రునిపై ఉమ్మి వేయడంతో సమానం. వారు చివరికి దిక్కులేని చావు చస్తారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లో భారత వస్తువుల బహిష్కరణను కూడా తప్పుబట్టారు. అగ్ర నేతల ప్రకటనే శరణ్యం! 10 రోజుల క్రితం ఓ టీవీ చానల్ చర్చలో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు నానాటికీ పెరిగిపోతుండటం అంతర్జాతీయంగా భారత్కు ఇబ్బందికరంగా మారింది. వాటిని ఖండించిన ముస్లిం దేశాల సంఖ్య 16ను దాటింది. ఈ జాబితాలో యూఏఈ, సౌదీతో పాటు పలు అతి సన్నిహిత మిత్ర దేశాలూ ఉండటంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పైగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గల్ఫ్ పర్యటనలో ఉన్న సమయంలోనే వివాదం రాజుకోవడం మరింత సమస్యగా మారింది. ఈ రగడ వల్ల వెంకయ్య దోహలో తన ప్రెస్మీట్, విందు సమావేశాలను రద్దు చేసుకోవాల్సి వచి్చంది కూడా. ఉద్రిక్తతలను చల్లార్చి పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఓవైపు ఆయా దేశాల విమర్శలను ఖండిస్తూనే, సదరు వ్యాఖ్యలు భారత్ వైఖరిని ప్రతిబింబించేవి కాదంటూ విడమరిచే ప్రయత్నం చేసింది. అయినా ఇప్పటికీ ముస్లిం దేశాలల్లో నుపుర్ వ్యాఖ్యల కలకలం ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలతో కీలక ఆర్థిక తదితర సంబంధాల దృష్ట్యా వివాదానికి వీలైనంత త్వరగా సంతృప్తికరమైన ముగింపునివ్వడం తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘విదేశాంగ శాఖ ఎంతగా వివరణలు ఇస్తున్నా గొడవ సద్దుమణుగుతున్నట్టు కని్పంచనందున ప్రభుత్వం తరఫున అత్యున్నత స్థాయిలో ఉన్న నేతలే ముందుకొచ్చి దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేయాలి. అప్పుడే ముస్లిం దేశాలు శాంతిస్తాయి’’ అని అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు అల్కాయిదా హెచ్చరికలు ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఉగ్ర సంస్థ అల్కాయిదా హెచ్చరించింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ల్లో దాడులకు దిగుతామంటూ ఓ లేఖ విడుదల చేసింది. ‘‘ప్రవక్తను అవమానించిన వారిని హతమారుస్తాం. మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ల్లోని కాషాయ ఉగ్రవాదులూ! చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని హెచ్చరించింది. ఆచితూచి మాట్లాడండి.. నేతలకు బీజేపీ ఆదేశం వివాదం నేపథ్యంలో ఇకపై టీవీ చానళ్ల చర్చల్లో అధిష్టానం ఎంపిక చేసిన అధికార ప్రతినిధులు, ప్యానలిస్టులు మాత్రమే పాల్గొనాలని బీజేపీ ఆదేశించింది. ఎవరెవరు పాల్గొనాలో పార్టీ మీడియా విభాగం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందని చెప్పినట్టు సమాచారం. ‘‘చర్చల్లో ఏ మతాన్నీ, మత చిహ్నాలను, మతాలకు చెందిన వ్యక్తులను విమర్శించొద్దు. గీత దాటొద్దు. భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెచి్చపోయి, భావోద్వేగాలకు లోనై మాట్లాడొద్దు. ఎవరెంతగా రెచ్చగొట్టినా పార్టీ సిద్ధాంతాలను ఉల్లంఘించేలా ప్రవర్తించొద్దు’’ అంటూ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ‘‘మాట్లాడాల్సిన అంశం ఏమిటో ముందే చెక్ చేసుకోండి. దానిపై పార్టీ వైఖరిని అనుగుణంగా బాగా ప్రిపేరయ్యాకే చర్చకు వెళ్లండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అజెండాకు కట్టుబడండి. ఎవరి ఉచ్చులోనూ పడి నోరు జారకండి’’ అంటూ పలు విధి నిషేధాలు విధించినట్టు సమాచారం. -
Nupur Sharma: నూపుర్ శర్మ అంతుచూస్తాం
ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మపై.. విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఉగ్రవాద సంస్థ ముజాహుద్దీన్ గజ్వాతుల్ హింద్ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ: ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ తాజాగా నూపుర్ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది ఆ ఉగ్ర సంస్థ. ‘‘నూపుర్ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్లో ఒక ప్రకటన విడుదల చేసింది ఎంజీహెచ్. నూపుర్ శర్మ తొలుత అవమానించింది. ఆ తర్వాత క్షమాపణలు చెబుతోంది. ఇదంతా బీజేపీ చేస్తున్న మాయాజాలం. చాణక్యనీతిని ప్రయోగిస్తూ ప్రజలను బుట్టలో వేసుకుంటోంది. ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తోంది. బీజేపీ నేతలు క్రమం తప్పకుండా ఇస్లాం వ్యతిరేక ప్రకటనలు ఇస్తున్నారు. ఆరెస్సెస్, రామ్ సేన, భజరంగ్ దళ్, శివ సేనలు.. వరుసగా ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగలు చేస్తున్నాయి అంటూ ఆ టెలిగ్రామ్ ప్రకటనలో ఉంది. కశ్మీర్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది. గట్టి భద్రత ఇదిలా ఉంటేనూపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి గట్టి భద్రత కల్పించారు ఢిల్లీ పోలీసులు. వ్యాఖ్యల తర్వాత ఎదురువుతున్న వేధింపులు, బెదిరింపులపై ఆమెను పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు స్పందించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ ఈ వ్యవహారానికి వీలైనంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. అందుకే నూపుర్ మీద తక్షణ చర్యల కింద పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ వెంటనే ఆమె క్షమాపణలు తెలియజేశారు కూడా. అయితే.. అప్పటికే ఇస్లాం దేశాలు సదరు వ్యాఖ్యలపై తీవ్ర ఖండన మొదలుపెట్టాయి. భారత్లోని కేంద్ర ప్రభుత్వాన్ని, అధికార పక్ష నేతల ఇస్లాం వ్యతిరేక విధానాలపై ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. చదవండి: భారతీయ ఉత్పత్తులు మాకొద్దు! -
మోదీ జీ ఇది కరెక్ట్ కాదు.. తాలిబన్ల సూక్తులు
జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా తాలిబన్ల నేతృత్వంలోని ఆప్ఘనిస్ధాన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తాజాగా ట్విట్టర్ వేదికగా.. ఇస్లాంను అవమానించి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా ఉన్మాద చర్యలను భారత్ అనుమతించరాదని తాము కోరుతున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజహిద్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్తపై అధికార బీజేపీ పార్టీ నేత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. ఈ క్రమంలోనే మతోన్మాదంపై భారత్కు తాలిబన్లు కీలక సూక్తులు వల్లించారు. అంతకుముందు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ప్రవక్తపై వ్యాఖ్యల విషయంలో భారత్పై విరుచుకుపడ్డారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియాలో మతసామరస్యం దెబ్బతింటోందని, ముస్లింలను అణిచివేస్తున్నారని.. దీన్ని ప్రపంచ దేశాలు గమనించాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాక్ వ్యాఖ్యలు, ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. తాము అన్ని మతాలను గౌరవిస్తామని స్పష్టం చేసింది. The Islamic Emirate of Afghanistan strongly condemns the use of derogatory words against the Prophet of Islam (Peace be upon him)by an official of the ruling party in India. 1/2 — Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) June 6, 2022 ఇది కూడా చదవండి: దేశ ప్రతిష్టకే భంగపాటు.. భవిష్యత్తు ఎలా ఉండనుంది..? -
బీజేపీకి సంకటం.. దేశ ప్రతిష్టకు భంగపాటు
జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై, పార్టీ ఢిల్లీ శాఖ మీడియా హెడ్ నవీన్ జిందాల్పై కాషాయ పార్టీ పెద్దలు సస్పెన్షన్ వేటు వేశారు. ఖతార్, కువైట్, ఇరాన్ సహా పలు అరబ్ దేశాల నుంచి సదరు అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో, అధికార బీజేపీ.. వారిపై వేటు వేసింది. మరోపక్క ఆమె వ్యాఖ్యలు.. పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది భారతీయుల ఉద్యోగాలకూ, సూపర్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకూ ఉద్వాసన లాంటి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి కూడా ఈ విషయంపై తాజాగా స్పందించింది. భారత్ను సున్నితంగా హెచ్చరించింది. సహనంగా ఉండాలని సలహా ఇచ్చింది. తాజాగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనంతో వ్యవహరించాలని సూచించారు. మరోవైపు.. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ను స్పందించాలని పాకిస్తాన్ జర్నలిస్టు కోరారు. ఈ సందర్భంగా యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ మాట్లాడుతూ.. "ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథలను చూశాను. ఈ వ్యాఖ్యలను నేను స్వయంగా చూడలేదు, కానీ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనాన్ని మేము బలంగా ప్రోత్సహిస్తున్నామని నేను మీకు చెప్పగలను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఆమె వ్యాఖ్యలు.. గల్ఫ్లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఇబ్బంది తెచ్చాయి. భారత ఉపరాష్ట్రపతి మూడు రోజుల ఖతార్ పర్యటన వేళ మరింత ఇరుకునపెట్టాయి. ఇది కూడా చదవండి: ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు -
ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు
న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. 57 ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే గాక భారత్లో ముస్లిం మైనారిటీల భద్రతపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసకు విజ్ఞప్తి చేసింది! ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇండొనేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, అఫ్గానిస్తాన్ కూడా చేరాయి. దీనిపై తమ తీవ్ర అభ్యంతరాలను జకార్తాలోని భారత రాయబారికి తెలియపరిచినట్టు ఇండొనేసియా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. యూఏఈతో పాటు మక్కా గ్రాండ్ మాస్క్, మదీనా ప్రాఫెట్స్ మాస్క్ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. సౌదీ విదేశాంగ శాఖ ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తూనే, సదరు నేతలపై బీజేపీ చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఖతార్, కువైట్ ఒక అడుగు ముందుకేసి భారత్ క్షమాపణకు కూడా డిమాండ్ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈలతో కూడిన ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక యూనియన్ అయిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జీసీసీ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విద్వేష ప్రచారం భారత ఉత్పత్తులను బహిష్కరిస్తామని ఇస్లామిక్ దేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ప్రకటనలు చేస్తుండటం వివాదాన్ని మరింత జటిలంగా మార్చింది. తమ సూపర్ మార్కెట్లలో టీ పొడి తదితర భారత ఉత్పత్తుల విక్రయాలను ఆపేయాలని యోచిస్తున్నట్టు కువైట్లోని అల్–అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ వంటివి ఇప్పటికే ప్రకటించాయి. పలు ముస్లిం దేశాల్లో ఇప్పటికే భారత ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది! అరబ్ ప్రపంచమంతా వాటిని నిషేధించాలంటూ ట్విట్టర్ తదితర సోషల్ మాధ్యమాల్లో ట్రెండింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన నష్ట నివారణ చర్యలకు దిగింది. అటు ఓఐసీ వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండిస్తూనే, అవి కొందరు వ్యక్తుల అనాలోచిత వ్యాఖ్యలే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కానే కావని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీతో పాటు పలు ముస్లిం దేశాల్లోని భారత రాయబారులు స్థానికంగా కూడా ప్రకటనలు చేశారు. బలమైన ఆర్థిక బంధం అరబ్ ప్రపంచం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను శాంతింపజేసేందుకు భారత్ హుటాహుటిన రంగంలోకి దిగడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పశ్చిమాసియాలోని ఈ ముస్లిం దేశాలతో మనకున్న బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు. సౌదీ, కువైట్, ఖతర్, ఒమన్ తదితర దేశాల్లో భారతీయులు చాలా ఎక్కువగా ఉంటారు. యూఏఈ జనాభాలోనైతే 30 శాతం దాకా భారతీయులే. మొత్తమ్మీద ఈ ముస్లిం దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సంఖ్య ఏకంగా 87 లక్షలని అంచనా. వీరిలో కార్మికులే అత్యధికంగా ఉంటారు. తాజా వివాదం నేపథ్యంలో వారి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తాలు (రెమిటెన్సులు) దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. 2021లో భారత్కు 87 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు అందాయి. అంటే రూ.6.76 లక్షల కోట్ల పై చిలుకే! దేశ జీడీపీలో ఇది ఏకంగా 3.1 శాతం! ఇంతటి కీలకమైన ఈ రెమిటెన్సుల్లో అమెరికా తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. దాంతో రెమిటెన్సుల్లో భారత్ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది. కీలక గల్ఫ్ దేశాలతో కూడిన గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్(జీసీసీ)తో 2020–21లో భారత్ 87 మిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరిపింది. మన వర్తక భాగస్వాముల్లో యూఈఏ మూడో, సౌదీ నాలుగో స్థానంలో ఉన్నాయి. యూఏఈతో ఇటీవలే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమూ కుదిరింది. చదవండి: గూగుల్కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు గల్ఫ్ దేశాలతో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దును స్వాగతించిన తొలి దేశాల్లో యూఏఈ ఉంది. ఇరాక్, సౌదీ, యూఏఈ తదితర గల్ఫ్ దేశాల నుంచి మనం భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతున్నందున గల్ఫ్ దేశాలపై ఆధారపడటం మరింతగా పెరిగేలా కన్పిస్తోంది. మనతో వర్తకం ద్వారా సమకూరే ఆదాయం గల్ఫ్ దేశాలకూ కీలకమే. పైగా వాటి కార్మిక శక్తిలో భారతీయులు కీలకంగా ఉన్నారు. వీటికి తోడు చాలా గల్ఫ్ దేశాల ఆహార అవసరాలను భారతే తీరుస్తోంది. ఈ జాబితాలో బియ్యం, మాంసం, సుగంధద్రవ్యాలు, పళ్లు, కూరగాయలు, చక్కెర వంటివెన్నో ఉన్నాయి. కువైట్ ఏకంగా 90 శాతం ఆహార పదార్థాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది! -
నుపూర్శర్మను జైలుకు పంపాలి: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపూర్ శర్మను జైలుకు పంపాలని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నుపూర్శర్మపై బీజేపీ చాలా ఆలస్యంగా చర్యలు చేపట్టిందని విమర్శించారు. బీజేపీ నేతలు చేసిన తప్పుకు దేశమంతా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భారతీయ ముస్లింలు ప్రశ్నిస్తే క్షమాపణ చెప్పరా.. విదేశీయులు అడిగితేనే చెప్తారా? అని ఒవైసీ ప్రశ్నించారు. కాగా, జూబ్లీహిల్స్ పబ్ గ్యాంగ్రేప్ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. నిందితులు క్షమించరాని నేరం చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
బీజేపీ వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి?
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు అంతర్జాతీయ సమాజానికి దేశం ఎందుకు క్షమాపణ చెప్పా లి?’ అని ప్రధాని నరేంద్రమోదీని మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది బీజేపీనే అని, దేశం కాదని ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్వేషం వెదజల్లుతున్నందుకు బీజేపీ తొలుత దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపూర్శర్మ ఓ టీవీ చర్చా కార్య క్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీ మీడియా ఇన్చార్జి నవీన్కుమార్ జిందాల్ అభ్యంతరకర వ్యాఖ్యలతో ట్వీట్లు చేశారు. వీరి వ్యాఖ్యలకు ముస్లిం దేశాలైన ఇరాన్, ఖతార్, కువైట్, పాకిస్తాన్ తదితర దేశాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో భారత్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నుపూర్ శర్మపై సస్పెన్షన్ వేటు వేయగా.. నవీన్కుమార్ జిందాల్ను పార్టీ నుంచే బహిష్కరించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రధానిని ఉద్దేశించి చేసిన ట్వీట్ను వేలాది మంది రీట్వీట్ చేశారు. -
వాచాలతకు మూల్యం ఎంత?
నోటికి మాట తెగులు... నీటికి పాచి తెగులు అని జన వ్యవహారం. టీవీ చర్చల్లో మాట్లాడమన్నారు కదా అని అదుపు తప్పి మాట్లాడితే, అదే ఎదురు తంతుందని ఇద్దరు బీజేపీ నేతలకు ఆదివారం తెలిసొచ్చింది. జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై, పార్టీ ఢిల్లీ శాఖ మీడియా హెడ్ నవీన్ జిందాల్పై బీజేపీ పెద్దలు సస్పెన్షన్ వేటు వేశారు. ఖతార్, కువైట్, ఇరాన్ సహా పలు అరబ్ దేశాల నుంచి సదరు అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో, అధికార బీజేపీ సొంతపార్టీ వాళ్ళపైనే కొరడా జుళిపించక తప్పని పరిస్థితి వచ్చింది. సదరు అభ్యంతరకర వ్యాఖ్యలు కాన్పూర్ లాంటి చోట్ల శుక్రవారమే హింసాకాండకు దారి తీస్తే, వ్యాఖ్యలు చేసి పదిరోజులవుతున్నా వాటిని ఖండించని అధికారపక్షపు దిలాసా ఆదివారం విదేశాల నిరసనకు కారణమైంది. మరోపక్క పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది భారతీయుల ఉద్యోగాలకూ, సూపర్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకూ ఉద్వాసన లాంటి వార్తలు వస్తున్నాయి. విద్వేషపు వాచాలతకు ఇదీ మూల్యం! గల్ఫ్లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చాయి. భారత ఉపరాష్ట్రపతి మూడు రోజుల ఖతార్ పర్యటన వేళ మరింత ఇరుకునపెట్టాయి. గల్ఫ్లో 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్న సంగతి మర్చి పోతే ఎలా? మనకు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం చేకూర్చే తొలి 7 దేశాల్లో 5 గల్ఫ్ దేశాలేనని విస్మరించగలమా? అందుకే, చివరకు అభ్యంతర వ్యాఖ్యలు చేసినవారు ‘ప్రధాన స్రవంతిలో లేని అనధికారిక అతివాద శక్తులు’ అంటూ ప్రభుత్వం పరువు కాపాడుకొనే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నిజానికి, ప్రధాని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే నూపుర్ కానీ, నవీన్ కానీ బీజేపీలో భాగమే తప్ప వేరొకటి కాదని ప్రపంచానికీ తెలుసు. చివరకు, బీజేపీ ఆత్మరక్షణలో పడి, అన్ని మతాలూ తమకు సమానమేననీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్థించబోమనీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వారిపై వేటు వేయాల్సి వచ్చింది. అయితే, వ్యాఖ్యలు చేసి పది రోజులయ్యాక, అదీ అరబ్ ప్రపంచంతో ముడిపడిన భారత చమురు, వాణిజ్య, దౌత్య ప్రయోజనాల ఒత్తిడితో బీజేపీ ఈపాటి చర్యకు దిగిందన్నది చేదు నిజం. అధికార ప్రతినిధిపై వేటుతో బీజేపీ పిరికిగా వ్యవహరించిందంటూ కాషాయబృందంలో ఓ వర్గం విమర్శ. నిజానికి, ఎన్నికల్లో ఓ పార్టీకి మెజారిటీ ఇచ్చినంత మాత్రాన ప్రతి పనికీ, మాటకూ జనం మద్దతు ఉందనుకోవడం పొరపాటు. కేంద్రంలో వరుసగా రెండు ఎన్నికల్లో బీజేపీ గెలిచాక కాషాయ అజెండాతో స్వామి భక్తులు మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలకూ, చర్యలకూ దిగడం పెరిగింది. తొలి రోజుల్లోనే పరిస్థితిని అదుపులో పెట్టాల్సిన పెద్దలు వ్యూహాత్మక మౌనం పాటించారు. ఇప్పుడు విషయం ప్రపంచ వేదికపైకి ఎక్కేదాకా వచ్చింది. కాలు జారినా తీసుకోవచ్చేమో కానీ, నోరు జారితే తీసుకోలేమని పాలక పక్షీయులకు పదే పదే గుర్తు చేయాల్సి రావడం దురదృష్టకరం. అయితే, ఇదే అదనుగా పాకిస్తాన్, తాలిబన్ల పాలనలోని అఫ్ఘానిస్తాన్ లాంటి దేశాలు భారత్కు సూక్తి ముక్తావళిని వినిపించడానికి ప్రయత్నించడం విడ్డూరం. సామాన్యుల స్వేచ్ఛకే గౌరవమివ్వని దేశాలు భారత్ను వేలెత్తి చూపుతూ, ఉపన్యాసాలిచ్చే పరిస్థితి తెచ్చుకోవడం మన స్వయంకృతాపరాధం. ఒక వర్గం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన, రెండో వర్గం హింసాకాండకు పాల్పడడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. వివాదాస్పద వ్యాఖ్యలే సాకుగా వీవీఐపీల పర్యటన వేళ గత శుక్రవారం కాన్పూర్లో జరిగిన మత ఘర్షణలు దురదృష్టకరం. దీని వెనుక దేశవ్యాప్తంగా నిద్రాణ రహస్య యంత్రాంగం ఉన్న ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ) లాంటి సంస్థలు ఉన్నాయట. ఇది మరింత ఆందోళనకరం. ఇలాంటివి జరగకుండా తక్షణ, కఠిన చర్యలు తీసుకోక పోతే కష్టం. ఆ మాటకొస్తే – ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడం ఎంత తప్పో, శివలింగాల మీద ఎవ రైనా విపరీత వ్యాఖ్యలు చేస్తే, అవీ అంతే తప్పు. తప్పొప్పుల తరాజు ఎటు మొగ్గిందని చూసే కన్నా, ఈ వ్యాఖ్యల వల్ల దేశ సమైక్యతా చట్రానికి ఎదురయ్యే ముప్పును అర్థం చేసుకోవడం ముఖ్యం. కాన్పూర్ హింసాకాండకు ఒక రోజు ముందర జూన్ 2న ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మాట్లాడుతూ, ‘ప్రతి మసీదులో శివలింగాల గురించి వెతికి, తవ్వాల్సిన పని లేదు’ అంటూ స్వయం సేవకులకు హితవు చెప్పారు. దేశంలో ముస్లిమ్ల పట్ల విద్వేషానికీ, హిందూ అతివాద సైద్ధాంతి కతకూ మూలకందమని భావించే ఆరెస్సెస్ నుంచి ఆ సంస్థ అధినేత నోట ఇలాంటి మాటలు ఆహ్వానించదగ్గవే. కానీ, గతంలో ప్రార్థనా స్థలాలపై హిందూ, ముస్లిమ్ వివాదాల్లో ఆరెస్సెస్ పోషిం చిన పాత్ర చూశాం. కాబట్టి, భాగవత్ తాజా మాటలను నమ్మగలమా అన్నది విమర్శకుల ప్రశ్న. విద్వేషపూరిత వ్యాఖ్యలు దేశానికీ, దేశ ప్రయోజనాలకూ భంగం కలిగిస్తాయి. ఆ విషయం గల్ఫ్ మిత్ర దేశాలు, చిచ్చురేపి చలి కాచుకుందామని చూస్తున్న పొరుగు దేశాలు చెబితే కానీ అర్థం కాని స్థితిలో మనం ఉన్నామా? ప్రపంచంలో ముస్లిమ్ జనాభా అధికంగా ఉన్న రెండో దేశం మనదే. ప్రజల మధ్య ప్రేమ పంచితే ప్రేమ వస్తుంది. ద్వేషాన్ని పెంచితే ద్వేషమే మిగులుతుంది. ఇవాళ దేశంలో నెలకొన్న అతి సున్నిత పరిస్థితులకు తామెంత కారణమో పాలకుల మొదలు ప్రతిపక్షీయుల దాకా అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. మతసామరస్యాన్ని చెడగొట్టేవారిపై తక్షణ, కఠినచర్యలు తీసుకోవాలి. ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. -
మతోన్మాదం.. భారత్ పరువును మంటగలుపుతోంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్లో పేర్కొన్నారు. 'ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు... కానీ, భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతోంది. ఇలాంటి సిగ్గుమాలిన మతోన్మాదం మనలను ఏకాకులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువును కూడా మంటగలుపుతోంది' అని బీజేపీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ విమర్శించారు. Divided internally, India becomes weak externally. BJP’s shameful bigotry has not only isolated us, but also damaged India’s standing globally. — Rahul Gandhi (@RahulGandhi) June 6, 2022 ఈ వివాదంపై.. పలు ప్రతిపక్షాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్, బీఎస్పీ నేత మాయావతి సహా పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. PM @narendramodi Ji, Why should India as a country apologise to international community for the hate speeches of BJP bigots? It is BJP that should apologise; not India as a Nation Your party should first apologise to Indians at home for spewing & spreading hatred day in day out — KTR (@KTRTRS) June 6, 2022 1. देश में सभी धर्मों का सम्मान जरूरी। किसी भी धर्म के लिए आपत्तिजनक भाषा का इस्तेमाल उचित नहीं। इस मामले में बीजेपी को भी अपने लोगों पर सख्ती से शिकंजा कसना चाहिए। केवल उनको सस्पेंड व निकालने से काम नहीं चलेगा बल्कि उनको सख्त कानूनों के तहत् जेल भेजना चाहिए। 1/2 — Mayawati (@Mayawati) June 6, 2022 -
ముదురుతున్న వివాదం.. ‘భారత ఉత్పత్తులు మాకొద్దు!’
Kuwaiti supermarket pulled: మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అక్కడికి సదరు ప్రతినిధిపై బీజేపీ వేటు వేసింది కూడా. తన వ్యాఖ్యల పట్ల నూపుర్ క్షమాపణలు చెప్పింది కూడా. అయినప్పటికీ గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కువైట్లోని అల్ అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్ భారతీయ ఉత్పత్తులను పక్కనపెట్టింది. నూపుర్ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ ఉత్పత్తులను వాడేది లేదంటూ ఒక ట్రాలిలో ప్యాక్ చేసి పక్కనే పెట్టేశారు. సదరు స్టోర్ సీఈవో ‘ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించం అందుకే భారతీయ ఉత్పత్తులను తొలగిస్తున్నాం’ అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ బీజేపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా తీవ్రంగా మండిపడుతోంది. భారత విదేశీ కార్మికులకు గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయి. భారత్ నుంచి విదేశాల్లో పని చేస్తున్న మొత్తం 13.5 మిలియన్ల మందిలో.. 8.7 మిలియన్ల మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్క. ఇక భారత్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కువైట్ సుమారు 95 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అదీగాక భారత్ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా గోధుమల ఎగుమతులను నిషేధించిన సమయంలో కూడా కువైట్ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వమని కోరడం గమనార్హం. (చదవండి: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ) -
విమర్శలు-సమన్లు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు త్రీవస్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు ఆయా దేశాలు తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేస్తుండగా.. ఐవోసీ ఘాటు వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జెడ్డా వేదికగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (IOC) ‘‘భారతదేశంలో ఇస్లాం పట్ల ద్వేషం, విమర్శలు, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాలు తేటతెల్లం అయ్యాయి’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దరిమిలా భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా స్పందించారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, సంకుచిత భావంతో కూడుకుని ఉన్నాయంటూ వ్యాఖ్యానించారాయన. అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగానే చూస్తుందని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. ఐవోసీలో ఇస్లాం ఆధిపత్య దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయన్నది తెలిసిందే. తమది ఇస్లాం ప్రపంచ సంయుక్త గొంతుక అని ప్రకటించుకుంటుంది ఆ వేదిక. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఐవోసీ జోక్యం చేసుకోవడం, ఆ జోక్యాన్ని భారత్ ఖండిస్తూ వస్తుండడం జరుగుతోంది. తాజాగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఐవోసీకి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. దూషణపూరితమైన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసినవని, అది భారత ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు బాగ్చీ. వ్యాఖ్యలు చేసిన శర్మ, జిందాల్లపై తొలగింపు వేటు కూడా పడిందన్న విషయాన్ని బాగ్చీ గుర్తు చేస్తున్నారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. టీవీ డిబెట్లో బీజేపీ మాజీ ప్రతినిధులు మహమద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూపుర్ శర్మ కామెంట్లు అవమానకరరీతిలో ఉన్నాయని, అన్ని మతాలను.. విశ్వాసాలను గౌరవించాలని అంటున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాగం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది. మరోవైపు దోహాలోని భారత దౌత్యవేత్తకు అక్కడి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తక్షణ ఖండన, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఖతర్. ఇక కువైట్ కూడా ఖతర్లాగే భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంకోవైపు ఇరాక్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది. దేశంలో వరుసగా జరుగుతున్న మత విద్వేష ఘర్షణలు, జ్ఞానవాపి మసీదు చర్చ సందర్భంగా ఓ టీవీ డిబేట్లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. మహమద్ ప్రవక్తను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్ సైతం ప్రవక్త మీద ఓ ట్వీట్ చేసి.. అది విమర్శలకు దారి తీయడంతో వెంటనే డిలీట్ చేసేశారు. ఈ పరిణామాల తర్వాత కాన్పూర్(యూపీ) శుక్రవారం ప్రార్థనల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి పలువురు గాయపడ్డారు. నుపూర్, నవీన్ చేష్టల వల్లే ఇదంతా జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తగా.. బీజేపీ సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. సౌదీ అరేబియా, బహ్రైన్తో పాటు మరికొన్ని దేశాలు సైతం భారత ఉత్పత్తులను సూపర్మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. చదవండి: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ -
నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. ఆమె తన వైఖరిని వివరిస్తూ ‘గత చాలా రోజులుగా మా మహాదేవ్ శివుడిని అవమానిస్తూ, అగౌరవపరుస్తుండటంతో నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. జ్ఞానవాపి మసీదు వద్ద ఉంది లభించింది శివలింగం కాదు.. ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబుతున్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా వెక్కిరిస్తున్నారు. మా శివుడిని ఇలా నిరంతరంగా అగౌరవపరచడాన్ని నేను సహించలేకపోయాను. దీనిపై ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను* అని నూపుర్ శర్మ చెప్పారు. సంబంధిత వార్త: Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ కాగా హమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ ఆదివారం సస్పెండ్ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలిగిస్తున్నట్లు వెల్లడించింది. సస్పెన్షన్ లెటర్లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావును మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని’ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. నూపుర్ శర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆదివారం వెల్లడించింది. నవీన్ కుమార్ జిందాల్ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్గా ఉన్నారు. సస్పెన్షన్ లెటర్లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామం’ అని బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది. కాగా, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పరేడ్ మార్కెట్లోని దుకాణాలను మూసివేయాలని ముస్లిం వర్గం పిలుపునిచ్చింది. యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొవడలు చెలరేగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు. చదవండి: డబ్బులు వృధా చేసుకోవద్దు. మా వద్ద లేనిది ఈడీ మాత్రమే: సంజయ్ రౌత్ ఇదిలా ఉండగా.. వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాలలోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు నూపుర్ శర్మపై హైదరాబాద్, పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. అన్ని మతాలను గౌరవిస్తాం అయితే నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటుకు కొద్దిసేపటి ముందే బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని అన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందనని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీస్తే, మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. -
Rajasthan: రౌడీయిజం కనిపించడం లేదా..!
జైపూర్: రాజస్థాన్లో పెరుగుతున్న నేరాలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కనిపించడం లేదా అని శనివారం బీజేపీ ప్రశ్నించింది. అశోక్ గెహ్లాత్ డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్నారంటూ తీవ్ర విమర్షలు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రతినిధులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, నూపూర్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అత్యారాలు, ఇతర నేరాలు జరగడం ‘‘కాంగ్రెస్ సంస్కృతి’’ పర్యాపదాలుగా మారాయని దుయ్యబట్టారు. దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బందుల పడుతుంటే.. రాజస్థాన్లో మహిళలు గుండాలకు భయపడాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందంటూ విమర్షలు గుప్పించారు. -
అరవింద్ను ఓటమిపాలు చేస్తా
న్యూఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఈ ఎన్నికల్లో ఓటమిపాలు చేస్తానంటూ న్యూఢిల్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నుపుర్శర్మ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆమె ప్రసంగించారు. కేజ్రీవాల్తో ైసైద్ధాంతిక పోరాటం చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో నగరవాసులు కేజ్రీవాల్కు మద్దతు ఇవ్వబోవడం లేదన్నారు. ఇందుకు కారణం ఆయనకు స్థిరత్వం లేకపోవడమేనన్నారు. లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ‘తొలుత ఆయనకు స్థిరత్వం అవసరం. అది వచ్చాకే ఓటర్ల వద్దకు వెళ్లాలి. ఒకసారి ఇక్కడ... ఒకసారి అక్కడ మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కేజ్రీవాల్ అబద్ధాలను అర్థం చేసుకున్నారు. ఈసారి ఆయన...సీఎం కావడమనేది కలే’ అని అన్నారు. ఈ నియోజకవర్గంలో సునాయాస విజయం కోసమే మిమ్మల్ని బీజేపీ బరిలోకి దించిందా అని అడగ్గా... దిగ ్గజాలను పరాజయం పాలుచేసిన నియోజకవర్గమిదని జవాబిచ్చారు. ‘అసలు కేజ్రీవాల్ ఎవరు. ఆయన ఓ మీడియా సృష్టి. ఎమ్మెల్యే కోటా కింద ఇచ్చే నిధులను సైతం ఆయన వినియోగించడం లేదు. నగరవాసులకోసం ఆయన ఏమిచేశారని నేనడుగుతున్నా. వారాణాసి ఎన్నికలు ముగిశాక ఐదు నెలలపాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే కోటా కింద వచ్చే నిధులతో ఆయన ఏమి చేశారు.’ అని ఆరోపించారు. ఎన్డీఎంసీ పరిధిలోనే ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో ఒక్క కౌన్సిలర్ కూడా లేరని, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో చేయాల్సి ఉంటుందని అన్నారు. కాగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో పీజీ చేసిన శర్మ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. 2008లో జరిగిన ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వర్తించారు. పార్టీకోసమే ఉద్యోగం వదిలేశా లోక్సభ ఎన్నికల సారధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అధిష్టానం బాధ్యతలను అప్పగించినపుడు పార్టీ కోసం ఏదైనా చేయాల్సిన తరుణమిదేనని భావించానని శర్మ తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో సహరాన్పూర్, అమృత్సర్, వారణాసి నియోజకవర్గాల్లో పర్యటించానని తెలిపారు. దీనిని గుర్తించిన అధిష్టానం ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందని అన్నారు.