Padmaja
-
K Padmaja: సవాళ్లే పట్టాలెక్కించేది
దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్) గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి కె.పద్మజ హైదరాబాద్ రైల్ నిలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఆర్టిఎస్ బ్యాచ్కు చెందిన పద్మజ ఎస్సిఆర్లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ‘ఇప్పుడంటే మహిళా అధికారులను అందరూ అంగీకరిస్తున్నారు కానీ, 30 ఏళ్ల క్రితం పురుష ఉద్యోగులు నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు..’ అంటూ నాటి విషయాలను చెబుతూనే, ఉద్యోగ జీవనంలో సవాళ్లను ఎదుర్కొన్న తీరు తెన్నులను ‘సాక్షి’తో పంచుకున్నారు.‘‘సౌత్ సెంట్రల్ రైల్వేలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్గా ఈ పోస్ట్లోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడంటే వర్క్ఫోర్స్లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, నేను జాయిన్ అయినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొత్తగా వర్క్లో చేరినప్పుడు ఒక తరహా స్ట్రెస్ ఉండేది. నన్ను నేను చాలా సమాధానపరుచుకునేదాన్ని. ‘ఒక్కదాన్నే ఉన్నాను అని ఎందుకు అనుకోవాలి.. ఎవరో ఒకరు రూట్ వేస్తేనే ఆ తర్వాత వచ్చే మహిళలకు మార్గం సులువు అవుతుంది కదా’ అనుకునేదాన్ని.ఎదుర్కొన్న సవాళ్లుమొదట్లో డివిజనల్ ఆఫీస్ మేనేజర్గా జాయిన్ అయినప్పుడు ఒక మహిళను అధికారిగా అంగీకరించడానికి సహోద్యోగులకే కష్టంగా ఉండేది. నేను మొదటిసారి ఇన్స్పెక్షన్కి వెళ్లినప్పుడు స్టేషన్ మాస్టర్కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మొదట వాళ్లు నమ్మలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి ‘ఇక్కడెవరో లేడీ వచ్చారు. ఆవిడేమో నేను డివిజనల్ ఆఫీస్ మేనేజర్ని అంటోంది, ఏమిటిది?’ అని అడిగారు. మా కొలీగ్ ‘ఆవిడ కూడా నాలాగే ఆఫీసర్’ అంటే అప్పుడు వాళ్లు అంగీకరించక తప్పలేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడకు రావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. మొదట్లో గుర్తించిన మరో విషయం ఏంటంటే తోటి ఉద్యోగులు చాలామంది నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు. దీంతో ‘నేను ఎక్స్పర్ట్ అయితేనే ఈ అసమానతను తొలగించగలను’ అనుకున్నాను. అందుకు, నా పనిని ఎప్పుడూ ముందు చేసినదానికన్నా బెటర్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. పనిచేసే చోట రూల్స్ పరంగా అన్నీ క్లియర్గా ఉంటాయి. అయితే, మనతో ఉండే కొలీగ్స్, సీనియర్స్ విషయంలో వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ‘ఇంత సమర్థంగా చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే చూస్తున్నారే..’ అని అనిపించేది. ఇంటì నుంచి బయటకు వచ్చినప్పుడు వీటన్నింటినీ ఎదుర్కోకతప్పదు అన్నట్టుగా ఉండేవి ఆ రోజులు. ఇప్పటి తరంలో ఈ ఆలోచన పూర్తిగా మారిపోయింది. అయితే, ఏదీ అంత సులువైనది కాదు, కష్టమైన జర్నీయే. కానీ, నిన్నటి కన్నా ఈ రోజు బెటర్గా మార్చుకుంటూ రావడమే నన్ను ఇలా ఒక ఉన్నత స్థానంలో మీ ముందుంచ గలిగింది. ముఖ్యమైనవి వదులుకోవద్దుపిల్లల చిన్నప్పుడు మాత్రం తీరిక దొరికేది కాదు. ఉద్యోగం, ఇల్లు, వేడుకలు.. వీటన్నింటిలో కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. వాటిని మనం అంగీకరించాల్సిందే. అయితే, ముఖ్యమైన వాటిని వదిలేదాన్ని కాదు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు వర్కింగ్ ఉమెన్. డ్యూటీ చూసుకుంటూనే పిల్లల పేరెంట్ టీచర్ మీట్, స్పోర్ట్స్ మీట్, స్కూల్ ఈవెంట్స్.. తప్పనిసరి అనుకున్నవి ఏవీ మిస్ అయ్యేదాన్ని కాదు. ఆఫీస్ పని వల్ల ఇంట్లో ముఖ్యమైన వాటిని వదులుకున్నాను ... అనుకునే సందర్భాలు రాకూడదు అనుకునేదాన్ని. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊపిరి సలుపుకోనివ్వనంత గా పనులు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. అయితే, వర్క్ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినతర్వాత అన్నీ సులువుగా బ్యాలన్స్ చేసుకో గలిగాను. మా నాన్నగారు ఐఎఎస్ ఆఫీసర్ కావడంతో తరచు బదిలీలు ఉండేవి. మా అమ్మానాన్నలు ఎంతో బిజీగా ఉండి కూడా మాతో ఎలా ఉండేవారో తెలుసు కాబట్టి, నేనే సరైన టైమ్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏదైనా పనికి గంట సమయం కుదరకపోతే అరగంటలోనైనా పూర్తి చేయాలి. ప్లానింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పటికీ రోజూ కొంతసమయం బుక్స్కి కేటాయిస్తాను. అలాగే, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. పాజిటివ్ ఆలోచనలు మేలు..ముందుగా మహిళ ఇతరుల మెదళ్ల నుంచి ఆలోచించడం మానేయాలి. వాళ్లేం అనుకుంటారో, వీళ్లేం అంటారో... అనే ఆలోచన మన జీవితాన్ని నరక మయం చేస్తుంది. కెరియర్ మొదట్లోనే మన కల పట్ల స్పష్టత ఉండాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా మనకంటూ ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవాలి. సగం జీవితం అయిపోయాకనో, పిల్లలు పెద్దయ్యాక చూద్దాంలే అనో అనుకోవద్దు. ముందుగా అన్ని రకాలుగా స్థిరత్వం ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉండేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి అనుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడం సులువు అవుతుంది’’ అంటూ సొంతంగా వేసుకున్న దారుల గురించి వివరించారు ఈ ఆఫీసర్. కుటుంబ మద్దతుట్రెయిన్స్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రమాదాలు.. వంటి సమయాల్లో నైట్ డ్యూటీస్ కూడా తప్పనిసరి. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి. మా పని ఈ కొద్ది గంటలు మాత్రమే అన్నట్టు ఏమీ ఉండదు. 24/7 ఏ సమయంలోనైనా డ్యూటీలో ఉండాల్సిందే. మా పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ నా బాధ్యతలను, పని ఒత్తిడిని అర్థం చేసుకొని, పూర్తి మద్దతుని, సహకారాన్ని ఇవ్వడం వల్ల నేను నిశ్చింతగా నా పనులు చేçసుకోగలిగాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: నోముల రాజేష్రెడ్డి -
జగన్లాంటి అన్న మీ దేశాల్లో ఉన్నారా!
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అసలైన అండదండ అని, సీఎం జగన్ వంటి అన్నలు మీ దేశాల్లోను, సమాజాల్లోను ఉన్నారా అని వివిధ దేశాల నుంచి హాజరైన మహిళలను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ, స్త్రీ శిశు సంక్షేమ సలహాదారు నారమల్లి పద్మజ అడిగారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్రం నుంచి వారిద్దరూ హాజరయ్యారు. గురువారం జరిగిన సదస్సులో ఏపీలో అమలవుతున్న మహిళాభివృద్ధి కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, భద్రత అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను 6 నిమిషాల వీడియో ద్వారా ప్రతినిధులకు వివరించారు. ‘మహిళల కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు ద్వారానే ప్రగతిలో వేగం సాధ్యం’ అనే అంశంపై వారు మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. యాక్సిలరేట్ ప్రోగ్రెస్’ అన్నది 2024లో ఐక్యరాజ్య సమితి నినాదమని, ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లుగా ఆచరణలోకి తెచ్చారని వివరించారు. ఏపీలో అయిదేళ్ళుగా జెండర్ సమానత్వం పరంగా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. జగనన్న అమ్మ ఒడి లాంటి స్కీమ్లు మీ దేశాల్లో, మీ సమాజాల్లో కూడా తల్లులు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి మీ సమాజాల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఏపీలో అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల వల్ల మహిళల ఆర్థిక స్తోమతతోపాటు వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. -
టీడీపీకి కుర్చీలు మడతపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది: నారమల్లి పద్మజ
-
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు ఏమాత్రం సహించదగినవి కావు
-
సీఎం వైఎస్ జగన్కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
సాక్షి, అమరావతి: రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మకుమారీస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు జయ, పద్మజ, రాధ రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం మౌంట్ అబూలో సెపె్టంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సీఎం జగన్ను వారు ఆహ్వనించారు. సీఎం జగన్కు రాఖీలు కట్టిన హౌస్ కీపింగ్ సిబ్బంది రాఖీ పండుగ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం జగన్ చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది తమ అభిమానాన్నిచాటుకున్నారు. -
రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఐసీసీవోఏ) సంస్థ 2023కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జైవిక్ ఇండియా అవార్డును ప్రకటించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా.. ఇందులో రాష్ట్రానికి 3 అవార్డులు దక్కడం విశేషం. పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన అత్తలూరుపాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్పీవో)తో పాటు బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ కూడా జైవిక్ ఇండియా అవార్డులకు ఎంపికయ్యారు. వీటిని సెప్టెంబర్ 7న ఢిల్లీలో జరిగే ‘బయోఫాక్ ఇండియా నేచురల్స్ ఎక్స్ పో’లో ప్రదానం చేయనున్నారు. ప్రకృతి సాగులో ఏపీ బహు బాగు.. కాగా రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా సాగుతోంది. 700 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం పుష్కలంగా లభిస్తోంది. దీంతో ప్రకృతి సాగు ప్రస్తుతం 3,730 పంచాయతీల పరిధిలో విస్తరించింది. 9.40 లక్షల ఎకరాల్లో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవుతున్నారు. ప్రకృతి, సేంద్రియ సాగులను ప్రోత్సహించేందుకు ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రస్తుత సీజన్ నుంచే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ) సర్టిఫికేషన్ జారీ చేయనుంది. అత్యుత్తమ ఎఫ్పీవోగా.. అత్తలూరుపాలెం రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీవో) కేటగిరీలో పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన ‘అత్తలూరుపాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్పీవో)’కు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించిన ఈ ఎఫ్పీవో పరిధిలో 400 మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ గ్రామాల పరిధిలో ఇతర రైతులకు అవసరమయ్యే జీవ ఎరువులను అందజేస్తున్నారు. అంతేకాకుండా వారు పండించిన కూరగాయలు, అపరాలు, చిరు ధాన్యాలు, బియ్యం, వంట నూనెలు, పొడులు, పచ్చళ్లను మార్కెటింగ్ చేస్తున్నారు. అలాగే 70 దేశీ ఆవులతో ప్రత్యేకంగా ఆవుల పెంపకం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆవు పాలు, నెయ్యి, మజ్జిగలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. రైతులు మార్కెట్ ధర కంటే అధిక ఆదాయం పొందేలా ఎఫ్పీవో కృషి చేస్తోంది. అంతేకాకుండా ప్రకృతి సాగు చేసే రైతులకు అవసరమయ్యే శిక్షణ కూడా అందిస్తోంది. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో గుంటూరు విద్యానగర్లో హోటల్ను సైతం నడుపుతోంది. గుంటూరు, విజయవాడల్లో ప్రత్యేక స్టోర్ల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. మహిళా రైతుకు జాతీయ అవార్డు.. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ మహిళా కేటగిరీలో బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ జైవిక్ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నాలుగేళ్లుగా సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తోంది. పద్మజ సేవలను గుర్తించి ఇటీవల రైతు సాధికార సంస్థ ఆమెను మోడల్ మేకర్గా ఎంపిక చేసింది. ఆమె తనకున్న ఎకరంలో ఏటా రూ.లక్షన్నర ఆదాయం ఆర్జిస్తోంది. అలాగే పశువుల పెంపకం ద్వారా రూ.60 వేలు, కషాయాల విక్రయాల ద్వారా మరో రూ.5 వేలు సంపాదిస్తోంది. ఆదర్శంగా తీసుకున్న పలు రాష్ట్రాలు.. ఏపీలో ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి సాగును కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు రైతు బజార్లలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీక్లీ మార్కెట్ల ద్వారా కూడా ప్రోత్సాహం అందజేస్తోంది. ఈ క్రమంలో ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ముందుకొచ్చిన అమూల్ ఆర్గానిక్స్తో త్వరలో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోనుంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాల కోటాలో ఏపీ ఉత్తమ ప్రభుత్వంగా నిలిచి జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైంది. -
అతివల తెగువకు తలవంచిన కిలిమంజారో!
కాకినాడ: భారతీయ పర్వతారోహకుల్లో కాకినాడ మహిళలు మరో మైలురాయిని అధిగవిుంచారు. 19,341 అడుగుల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని ఏడు రోజుల్లో అధిరోహించి.. పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న కాకినాడకు చెందిన సత్తి లక్ష్మితో పాటు కోనేరు అనిత, వాడకట్టు పద్మజ, స్రవంతి చేకూరి, శ్రీశ్యామలలు.. ఏడు రోజుల్లో వీరు లక్ష్యాన్ని చేరుకోవడంతో వీరి తెగువకు, సంకల్పానికి, కఠోర దీక్షకు అందరూ ఫిదా అవుతున్నారు. వారం రోజులు శ్రమించి సరిగ్గా ఆగస్టు 15న కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వీరిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి అభినందించారు. -
‘రాజ కుటుంబాలు ఆకాశం దిగి నేలకు రావు’.. అదేమీ కాదు!
రాజస్థాన్లోని ఉదయ్పూర్ మొదలైన ప్రాంతాల్లో రాజులకు సంబంధించి ఎన్నో విషయాలు వినిపిస్తుంటాయి. ఆ ముచ్చట్లు ‘రాజ కుటుంబాలు ఆకాశం దిగి నేలకు రావు’ అన్నట్లుగా ఉండేవి. అదేమీ కాదని నిరూపించింది ఉదయ్పూర్ రాకుమారి పద్మజ కుమారి మేవార్. ఆమెకు పల్లె గుండె తెలుసు. పక్షులను, పచ్చదనాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు... రాజస్థాన్లోని ఉదయ్పూర్ రాజకుటుంబంలో పుట్టింది పద్మజ కుమారి మేవార్. అమ్మ, నాన్నమ్మల నుంచి ఎన్నో జానపదకథలు విన్నది. ఆ కథల్లో ఎన్నో అందమైన అడవులు, అపురూపమైన జంతుజాలం ఉండేవి. కాల్పనిక ప్రపంచం దాటి బయటికి వస్తే పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అడవులు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాల గురించి నాన్న మాటల్లో ఎన్నోసార్లు విన్నది. హైస్కూల్ చదువు నుంచి డిగ్రీ వరకు అమెరికాలో చదువుకున్న పద్మజ కుమారి మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చేసింది. చదువు పూర్తయిందో లేదో ఆమె ‘భగీర’ క్యాంపులోకి అడుగుపెట్టింది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం తల్లిదండ్రులు రాణి దుర్గేష్ నందిని, మహారాజా రాజేంద్రసింగ్ ఈ క్యాంపుకు శ్రీకారం చుట్టారు. ఈ క్యాంప్లోని గదులను స్థానికులే, స్థానికంగా దొరికే వనరులతో నిర్మించారు. గోద్వారీ ప్రాంతంలో ఉన్న ఈ క్యాంపు కేంద్రంగా వనసంరక్షణ, స్త్రీ సాధికారత, ఆరోగ్యం, జలసంరక్షణ... మొదలైన కార్యక్రమాలు చేపట్టారు. పద్మజ కుమారి ఈ క్యాంప్లోకి అడుగు పెట్టిన తరువాత క్యాంపుకు కొత్త శక్తి వచ్చి చేరింది. ఆమెకు ఆ ప్రాంతంలో ప్రతి ఊరూ కొట్టిన పిండే. గోద్వారీ ప్రాంతం 235 రకాల పక్షులకు, 35 రకాల ఔషధ మొక్కలకు నిలయం. ‘మన దగ్గర అపూర్వమైన సంపద ఉంది. వాటిని పరిరక్షించుకోవాలి’ అంటూ ఊరువాడా తిరిగింది. గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్ మొదలుపెట్డడం ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకువచ్చింది. సామాజిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలే కాదు స్థానికులకు ఉపాధి కల్పించే పనులకు శ్రీకారం చుట్టింది. ‘ఈ క్యాంపులోకి అడుగు పెడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఎంతో ధైర్యం వస్తుంది’ అంటారు స్థానికులు. ఇప్పుడు వారికి రకరకాల పక్షుల పేర్లు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, ఔషధ మొక్కల పేర్లు, వాటి ఉపయోగాలు తెలియడం మాత్రమే కాదు వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా బాగా తెలుసు. ‘పెద్ద చదువులు చదువుకున్నావు. ఇక్కడికి ఎందుకు తల్లీ’అని తల్లిదండ్రులు అనలేదు. అదే తనకు మహాబలం అయింది. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగిన పద్మజ కుమారికి, సామాజికసేవలో కొత్త ప్రపంచం కనిపించింది. ఎన్నో లక్ష్యాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి వైల్డ్లైఫ్ టూరిజం కేంద్రంగా గోద్వారీ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని. స్థానికుల స్పందన, చైతన్యం పద్మజ కుమారి సంకల్పబలం చూస్తుంటే అదేమీ కష్టం కాదు అనిపిస్తుంది. -
సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కూతురే పద్మజా రాజు. ఆమె సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. పద్మజా రాజు భర్త జి.వి.జి.రాజు, పవన్ కళ్యాణ్ హీరోగా ‘‘గోకులంలో సీత, తొలిప్రేమ’’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాలనటుడు’ పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర, దివంగత నటులు సూపర్స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మజా రాజు ఇటీవల ఓ టీవీ చానల్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారనీ ఆమె తెలిపారు. వచ్చే ఏడాది తన కుమారుడిని నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. జీవీజీ రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని పలువురు సినీ ప్రముఖులు అభిలషించారు. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్? -
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా పద్మజ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఓ జీవోను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో సలహాదారుగా ఆమె నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఓ జీవో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏఆర్ అనురాధ పేరిట ఆ జీవో విడుదల అయ్యింది. -
నా కూతురేంటో నాకు తెలుసు, అలాంటివి పట్టించుకోను: నిహారిక తల్లి
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పబ్ ఇన్సిడెంట్ తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన నిహారిక ఇటీవలె ఇన్స్టాగ్రామ్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా మారిన నిహారిక తాజాగా తల్లి పద్మజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఇటీవలి కాలంలో నిహారికపై వచ్చిన వార్తలపై నాగబాబు భార్య, నిహారిక తల్లి పద్మజ స్పందించింది. 'మొదట్లో ఇలాంటి వార్తలు రావడం ఇబ్బందిగా అనిపించేది కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిహారిక ఎక్కడికైనా వెళ్లినా నాకేం అనిపించదు. నా కూతురేంటో నాకు తెలుసు. నాకు మా బావగారున్నారు.ఆయన ఉన్నంతవరకు మాకేం పర్వాలేదు' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. -
శభాష్.. నిర్మలా సీతారామన్!.. నెటిజన్ల మెచ్చుకోలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ అధికారి పట్ల ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హోదా, ప్రోటోకాల్ వంటి అంశాలను పక్కన పెట్టి మనసున్న మనిషిగా వ్యవహరించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2022 మే 8 ఆదివారం న్యూఢిల్లీలో మార్కెట్ కా ఏకలవ్య పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరు పద్మజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మజా చుండూరు ప్రసంగించడం ప్రారంభించారు. అయితే మార్కెట్కు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తున్న క్రమంలో ఆమెకు ఇబ్బంది కలగడంతో మధ్యలో ప్రసంగం ఆపి, మంచి నీళ్ల బాటిల్ ఇవ్వాలంటూ అక్కడున్న హోటల్ సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగిస్తున్నారు. పద్మజా చుండూడుకు ఎదురైన ఇబ్బందిని గమనించిన మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తన దగ్గరున్న బాటిల్లో నీటిని ఓ గ్లాసులో పోసి తన కుర్చీ నుంచి లేచి.. పద్మజా దగ్గకు వెళ్లింది. గ్లాసులో నీళ్లు అందించి తాగాలంటూ సూచించింది. ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగిన ఘటనతో పద్మజతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నిర్మలా సీతారామన్ చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values. A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8 — Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గంటల తరబడి గుక్కతిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం దిట్ట. అందరికీ అది అంత సులువైన విషయం కాదు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్డడంతో పాటు ఆర్మ నిర్భర్ ప్యాకేజీని సైతం ఆమె గంటల తరబడి సునిశితంగా వివరించారు. అందువల్లే మాట్లాడేప్పుడు వచ్చే ఇబ్బందిని గమనించి.. వెంటనే అక్కడ చాలా సేపుగా మాట్లాడుతున్న మహిలా ఉద్యోగి తాగేందుకు నీళ్ల బాటిల్ అందించారు. చదవండి: ఒకప్పుడు స్టార్టప్ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్ల రాజ్యం -
చంద్రబాబు చెంచాలు మద్యం తాగి మాట్లాడుతున్నారు: పద్మజ
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని.. టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని వైఎస్సార్సీపీ మహిళా నేత నారమల్లి పద్మజ సవాల్ చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోచేసిన అభివృద్ధి శూన్యం. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే చంద్రబాబు పరిమితం. చంద్రబాబు తన పాలనలో ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా?. చంద్రబాబు నైజం చూసే ప్రజలు ఏపీ నుంచి తరిమికొట్టారు. ప్రజా తీర్పును చూసి కూడా చంద్రబాబుకు బుద్దిరాలేదు. స్థాయిలేని వ్యక్తులతో సీఎం జగన్ను చంద్రబాబు తిట్టిస్తున్నారు. కొందరు చంద్రబాబు చెంచాలు మాత్రం మద్యం తాగి మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకురాలు అనిత తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలి. ఆమె తాగే బ్రాండ్ దొరకటం లేదని తెగ బాధ పడుతోంది. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారో జనానికి ఇంకా గుర్తుంది. మాకు సంస్కారం ఉంది. ఆ సంస్కారంతోనే మాట్లాడతాము. ఓటమితో పారిపోయి చంద్రబాబు హైదరాబాద్లో దాక్కున్నాడు . టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారింది. కానీ మేము మద్యం తగ్గించాం. టీడీపీ చేసే ఉద్యమాల వెనుక ఎన్నో కుయుక్తులు ఉన్నాయి. పసుపు కుంకుమ పేరుతో మహిళలకి డబ్బులు ఇచ్చి గెలవాలనుకున్నాడు. కానీ రాష్ట్ర మహిళలకు ఎవరు ఎలాంటి వారో తెలుసు' అంటూ నారమల్లి పద్మజ చంద్రబాబుపై మండిపడ్డారు. చదవండి: (వైఎస్సార్సీపీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుంది: విజయసాయిరెడ్డి) -
‘ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు హద్దు లేకుండా పోతోంది’
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు హద్దు లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నారమిల్లి పద్మజ ధ్వజమెత్తారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దిశ చట్టం గురించి కూడా చంద్రబాబు తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత ఎవరూ ఇవ్వలేదన్నారు. చదవండి: డైనమిక్ సీఎం వైఎస్ జగన్.. కేంద్రమంత్రి గడ్కరీ ప్రశంసలు ‘‘టీడీపీ మహిళా నేత అనిత నోరు అదుపులో పెట్టుకోవాలి. దళితులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వనజాక్షి మీద దౌర్జన్యంపై అనిత ఎందుకు మాట్లాడలేదు. కుప్పంలో బీసీ మహిళపై దౌర్జనం మీకు కనిపించలేదా?’’ అంటూ పద్మజ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబుకి ఎలాంటి సెంటిమెంట్లు ఉండవు. పట్టాభితో బోసిడీకే అని తిట్టించారు. దళిత మహిళతో సీఎం జగన్ కుటుంబాన్ని తిట్టిస్తున్నారు. వివేకా హత్య విషయంలో చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ డ్వాక్రా మహిళలకు న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు రాష్టానికి శాపంలా మారారు. దేశంలో సీఎం జగన్ చేసే కార్యక్రమాల్ని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని’’ నారమిల్లి పద్మజ అన్నారు. -
మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్నకోడలికి ‘పద్మశ్రీ’
సాక్షి, నిజామాబాద్: జక్రాన్పల్లి మండలం కేశ్పల్లికి చెందిన డాక్టర్ పద్మజారెడ్డికి దేశంలోనే నాలుగో అత్యున్నతమైన ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. కూచిపూడి విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి భార్య అయిన పద్మజారెడ్డి ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. పామర్రు గ్రామం కూచిపూడి కళకు పుట్టినిల్లయిన కూచిపూడి సమీపంలో ఉంటుంది. దీంతో కూచిపూడి సిద్ధేంద్రయోగి స్ఫూర్తితో డాక్టర్ శోభానాయుడు శిష్యరికంలో పద్మజారెడ్డి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టి, ఇందూరు కోడలిగా జిల్లాకు వచ్చిన పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిపై మక్కువ పెంచుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన రుద్రమదేవిని ఎక్కువగా ఇష్టపడే పద్మజారెడ్డి సత్యభామ, రుద్రమదేవి పాత్రల ద్వారా కూచిపూడిలో గుర్తింపు పొందారు. ఇందులో భాగంగా డాక్టర్ పద్మజారెడ్డి కూచిపూడిలో ‘కాకతీయం’ అనే తెలంగాణ క్లాసికల్ ఆర్ట్ ఫాంను రూపొందించి ప్రపంచానికి పరిచయం చేశారు. నృత్య రత్నావళిలోని భ్రమరి, పేరిణి, కందుక నృత్యం, లాస్యంగం వంటి ప్రధాన అంశాలతో నృత్య బ్యాలెట్ రూపొందించారు. అదేవిధంగా సామాజిక అంశాలపైనా నృత్యరూపకాలు రూపొందించి సమాజంలో అవగాహన కల్పించే విషయంలో తనవంతుగా కీలక పాత్ర పోషించారు. భ్రూణహత్యలు, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే నృత్య ప్రదర్శనలు చేశారు. చదవండి: పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం డాక్టర్ పద్మజారెడ్డి సాధించిన అవార్డుల్లో కొన్ని.. ► భారత ప్రభుత్వం నుంచి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ► 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా కళారత్న (హంస) అవార్డు ► శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 2005లో డాక్టరేట్ పట్టా ► 1994లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ నాట్యవిశారద అవార్డు అందజేశారు. ► 1990లో కల్కి కళాకార్ అవార్టు ► 2001లో డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా సంస్కృతి రత్న, అభినయ సత్యభామ అవార్డు అందుకున్నారు. ► అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్ఆర్ గోల్డ్మెడల్ అందుకున్నారు. ► అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2014లో అవార్డు పొందారు. ► యూరోపియన్ తెలుగు అసోసియేషన్ నుంచి అవార్డు ► తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి ది డ్యాన్సింగ్ క్వీన్ అవార్డు ► అమెరికన్ తెలుగు అసోసియేషన్ లైఫ్టైమ్ ఆచీవ్మెంట్తో అవార్డుతో సత్కరించింది. ► 1979లో సర్ శ్రీనగర్ సంసద్ నృత్యవిహార్ అవార్డు అందజేశారు. ► 2007లో త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ విద్వాన్ మంత్తో సన్మానించింది. ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్(ఢిల్లీ) జనరల్ అసెంబ్లీ మెంబర్గా 2017 వరకు ఉన్నారు. ► 2012లో నేషనల్ టూరిజం అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్గా వ్యవహరించారు. -
అమ్మ చీరలో పెళ్లి కూతురు
ప్రస్తుతం పెళ్లి సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు నిహారిక. ఈ వేడుకల్లో భాగంగా కట్టుకున్న ఓ చీరను చూసుకుని మురిసిపోతున్నారు. కారణం ఆ చీరకున్న స్పెషాలిటీయే. నిహారిక తల్లి పద్మజ నిశ్చితార్థంలో కట్టుకున్న చీరను ఇప్పుడు తన పెళ్లి సంబరాల్లో కట్టుకున్నారు నిహా. అప్పటి తన తల్లి ఫోటోను, అమ్మ చీరను కట్టుకుని ఇప్పుడు తాను దిగిన ఫొటోను పక్కపక్కనే పెట్టి, ఓ ఫొటోగా షేర్ చేశారు. ‘‘మా అమ్మ నిశ్చితార్థం అప్పటి చీర ఇది. 32 ఏళ్ల నాటి చీర’’ అని క్యాప్షన్ చేశారు నిహారిక. ‘‘మా ఆవిడ అందంగా ఉంది. కానీ నా కూతురు మాత్రం యువరాణిలా ఉంది’’ అని నాగబాబు కామెంట్ చేశారు. వెంకట చైతన్యతో ఈ నెల 9న నిహారిక వివాహం జరగనుంది. -
సరికొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు
-
ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ బాధ్యతలు
ప్రభుత్వ రంగ బ్యాంక్– ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పద్మజ చంద్రూ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్లోబల్ మార్కెట్స్ విభాగానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఆమె... తాజాగా ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారని గురువారం బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎండీ, సీఈఓలను నియమించగా... ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ ఉన్న విషయం తెలిసిందే. -
కీచకులను ప్రోత్సహిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: దాచేపల్లి ఘటనలో బాధిత బాలికకు న్యాయం చేయాలని పోరాడిన తమ పార్టీ నేత ఆర్కే రోజాపై తెలుగుదేశం నాయకులు సంస్కార హీనంగా మాట్లాడటం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు తన అనుయాయులతో ఇలా మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. కీచకులను ప్రోత్సహిస్తూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేని దమ్ము, ధైర్యం లేకపోవడం వల్లే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బండారు సత్యనారాయణ, పంచమర్తి అనురాధ చేసిన వ్యాఖ్యలను పద్మజ తీవ్రంగా ఖండించారు. కాల్మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయిస్తున్నారని సీఎంపై మండిపడ్డారు. ఐఏఎస్ అధికారిపై దాడికి పాల్పడిన వారిపైనా, దళిత మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. గడచిన ఐదేళ్ళుగా 12 ఏళ్ల చిన్నారులపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం శోచనీయమన్నారు. ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో మిస్టరీలుగా మారుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ఏ సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. -
బాబుది అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం: పద్మజ
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో మహిళలపై గంటకో అత్యాచారం జరుగుతోందని.., చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్నది అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వమనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె బుధవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. దివ్యాంగులను సైతం టీడీపీ నేతలు విడివకుండా కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో మంగళవారం జరిగిన దారుణ ఘటన సీఎం దృష్టికి రాకపోవడం విచారకరమన్నారు. గుంటూరు జిల్లాలో ఒంటరి మహిళపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడని మండిపడ్డారు. -
ఏపీలో టీడిపీ నేతల దాష్టీకాలకు అంతులేదు
-
‘టీడీపీ నేతలే ఆ లైంగిక దాడులు చేశారు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో గంటకో అత్యాచారం జరుగుతోందని, దివ్యాంగులను సైతం టీడీపీ నేతలు విడిచి పెట్టడం లేదంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎన్.పద్మజ మండిపడ్డారు. కశ్మీర్లో జరిగిన ఘటనపై స్పందిస్తారు.. కానీ మంగళవారం రాజధానిలో జరిగిన దారుణం సీఎం చంద్రబాబు దృష్టికి రాకపోవడం దురదృష్టకరం అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన దారుణాలపై స్పందించే చంద్రబాబు.. సొంత రాష్ట్రం ఏపీలో జరిగిన ఏ ఘటనపై కూడా స్పందించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. గుంటూరులో నిన్న ఒంటరిమహిళపై దారుణానికి ఒడిగడితే మీ దృష్టికి రాలేదా ? బెల్లంకొండలో 7 ఏళ్ల మూగ బాలికపై జరిగిన సంఘటన, పెసరలంకలో 7 ఏళ్ల బాలికపై, చిలకలూరిపేటలో మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేసింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. టీడీపీ నేతలు చింతమనేనిపై 27, దేవినేనిపై 13 కేసులు ఉన్నాయి. కొల్లు రవీంద్ర, కేఈ కృష్ణమూర్తి, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, నక్క ఆనందరావు, కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమ, వేద వ్యాస్ లపై వివిద జీవోల ద్వారా కేసులు ఎత్తివేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఎం.. జైలుకు వెళ్తానన్న భయంతో తనను రక్షించాలని ప్రజలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిలో ప్రపంచంలోనే చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని ఆరోపించారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో, దళితులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉన్నది నిజం కాదా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. మహిళలకు కనీస భద్రత కల్పించలేని దద్దమ్మ పాలన అవసరమా అని మహిళలు దీనిపై ఆలోచన చేయాలంటూ వైఎస్సార్సీపీ మహిళా నేత పద్మజ పిలుపునిచ్చారు -
ధీశాలి 'బహుముఖ ప్రజ్ఞాశాలి'
అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ క్రీడంటే మక్కువ చూపి శిక్షణ పొందడం మొదలుపెట్టారు. క్రమంగా మెళకువలు నేర్చుకుంటూ జిల్లాలో మొట్టమొదటి ఉమన్ బ్లాక్బెల్ట్ ఫస్ట్ డాన్గా నిలిచారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకాలు కైవసం చేసుకున్నారు. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యను ఇతరులకు కూడా పంచాలనుకుని ఇప్పటి వరకు కొన్ని వందల మంది బాల బాలికలకు, షీ టీంలకు ఆత్మరక్షణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. కరాటే శిక్షకురాలిగానే కాదు..ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా, చిత్రకారిణిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ చాటుతున్న పద్మజపై ‘సాక్షి’ కథనం. ఒంగోలు వన్టౌన్: మేదరమెట్ల నుంచి వచ్చి ఉద్యోగరీత్యా ఒంగోలులో స్థిరపడిన చిలకమర్తి గోపాలకషమూర్తి, రమాదేవి దంపతులకు ఒక్కగానొక్క కూతురు పద్మజ. తండ్రి విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కావడంతో పద్మజ తన అన్న చంద్రశేఖర్ (మ్యాథ్స్ లెక్చరర్, హైదరాబాద్) తమ్ముడు కష్ణమోహన్ (ఫార్మాసూట్ సైంటిస్ట్, న్యూయార్క్)తో సమానంగా పెరిగింది. ఒంగోలు శర్మా కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన పద్మజ 1993లో బీఎస్సీ, బీఈడీ పట్టా తీసుకున్నారు. 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్గా కొత్తపట్నం మండలం బజ్జిరెడ్డి గమళ్లపాలెం పాఠశాలలో ఉద్యోగినిగా చేరారు. 2009లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ రావడంతో ఇంగ్లిష్ టీచర్గా మద్దిపాడు మండలం బసవన్నపాలెం ఉన్నతపాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం చిన్నగంజాం హైస్కూల్ నందు ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. కరాటే పద్మజ 1980 దశకంలో కరాటే శిక్షణ యువతీయువకులను విపరీతంగా ఆకర్షించింది. పద్మజ డిగ్రీ చదివే రోజుల్లో ఒంగోలు మహిళా మండలి వద్ద ప్రతిరోజూ ప్రముఖ కరాటే మాస్టర్ వలిశెట్టి రవి యువకులకు కరాటే శిక్షణ ఇవ్వడం గమనించి, కరాటే నేర్చుకోవాలన్న ఆసక్తిని నేరుగా రవి మాస్టర్కి తెలిపింది. అలా యుద్ధ నైపుణ్య విద్యలో తొలి అడుగులు వేసిన పద్మజ 1995లో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్గా, 2017 జనవరి 8న ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫోర్త్ డాన్గా నిలిచింది. 2015లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం (హైదరాబాదు)లో జరిగిన నేషనల్ బూడోకాన్ ఈవెంట్లో ‘కట’ విభాగంలో గోల్డ్మెడల్ సాధించింది. ఉద్యోగరీత్యా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పటికీ స్వార్డ్, స్టిక్, నాన్చక్ ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా ... ♦ తను పని చేస్తున్న చోట పలువురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా నవోదయ, గురుకుల పాఠశాలలకు అర్హత సాధించడంలో చేయూతనిచ్చారు. ♦ 2009 నుంచి జిల్లా రీసోర్స్ పర్సన్గా కొనసాగుతూ విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణా శిబిరాల్లో ఆంగ్ల బాషా శిక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు. ♦ 2016లో బెంగళూర్లో రీజినల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లిష్ సౌత్ ఇండియా (ఆర్ఐఇఓస్ఐ) ఆధ్వర్యంలో జరిగిన క్యాంప్లో జిల్లా విద్యాశాఖ సహకారంతో సీఈఎల్టీ ట్రైనింగ్ తీసుకున్నారు. ♦ 2017 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున స్పాట్ వాల్యుయేషన్కి వచ్చిన సుమారు 100 మంది సహచర ఇంగ్లిష్ ఉపాధ్యాయులతో ‘ఇంగ్లిష్–ప్రకాశం’ గ్రూప్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్లో 300 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు ఇంగ్లిష్ బోధనలో వచ్చే సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సమన్వయపరచడం. ♦ 2017లో ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బ్రిటీష్ కౌన్సిల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇంగ్లిష్ ట్రైనింగ్ క్యాంపులో మాస్టర్ ట్రైనర్గా శిక్షణ పొందారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశంపై రాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్ (ఆర్ఎంఎస్ఏ) వారు నిర్వహించిన క్యాంపులో మాస్టర్ ట్రైనర్గా శిక్షణ పొందారు. ప్రేమ వివాహం కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదవడం, పద్మజ తండ్రి వత్తి రీత్యా బయటి ప్రపంచంతో మమేకం కావడంతో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ ప్రతి విషయాన్ని అందరూ కలిసి మాట్లాడుకోవటం, కలిసి నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా మారిన నేపధ్యంలోనే పద్మజ తన సహవిద్యార్థి వై.ఎస్.దిగ్విజయ్ను మతాంతర వివాహం చేసేకున్నారు. పెళ్లి జరిగిన తొలి రోజుల్లో ఇద్దరి కుటుంబాల భావ సంఘర్షణ వల్ల ఏర్పడిన అరమరికలు అనతికాలంలోనే సమసిపోయి ఇద్దరి కుటుంబాలు ఆదర్శంగా నిలిచాయి. 80 దశకంలో విప్లవ భావాలు యువతలో మెండుగా ఉన్న రోజులు. ప్రేమంటే భావావేశంతో కలిగేదనిపిస్తున్న నేటి ప్రేమ కథలకు భిన్నంగా, భావసారూప్యతతో జీవిత భాగస్వాములైన పద్మజ, దిగ్విజయ్లను చూసి నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబం గురించి ఒంగోలు జక్రయ్య ఆస్పత్రి వీధిలో నివసిస్తోంది పద్మజ కుటుంబం. భర్త వై.ఎస్.దిగ్విజయ్ ఒంగోలు నగరంలోని పేస్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలు బయాలజీ సైన్స్ టీచర్గా సేవలందించిన దిగ్విజయ్ ఒక లోకల్ ఛానెల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వివేక్ (21) శ్రీకాకుళం డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జన్ (బీడీఎస్) చదువుతున్నాడు. విక్రాంత్ (18) విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు. తల్లి వద్ద కరాటే శిక్షణ పొందిన ఈ ఇద్దరు పిల్లలు గ్రీన్ బెల్ట్ పొందారు. ‘సమాజం కోసం నా వంతుగా ... ప్రభుత్వంగానీ, వలంటరీ ఆర్గనైజేషన్స్గానీ నగరంలో ఏదైనా వేదిక ఏర్పటు చేయగలిగితే ఉదయం ఆత్మరక్షణ యుద్ధ నైపుణ్యం శిక్షణ, సాయంత్రం ఇంగ్లిష్ మాట్లాడటం, బోధనా నైపుణ్యం, బాషా సమస్యలపై ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అంటున్న పద్మజ ఆశ నెరవేరాలని ఆశిద్దాం. ఉపాధ్యాయినిగా.. ఆత్మరక్షణ నైపుణ్య శిక్షకురాలిగా ♦ 1995–96 లో ఖాశీం మెమోరియల్ బాలికలపాఠశాల (దర్శి) విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చారు. ♦ 2006లో ప్రకాశం జిల్లా సర్వశిక్ష అభియాన్ పీడీరఘుకుమార్ ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో ఇన్స్ట్రక్టర్గా వ్యవహరించారు. ♦ 2012 నిర్భయ ఘటన తరువాత ఒంగోలు వాకర్స్క్లబ్ లో మాస్టర్ ఎ.రవిశంకర్తోపాటు పలువురికిప్రాక్టీస్లో సేవలందిచారు. ♦ 2014 నుంచి స్థానిక జక్రయ్య ఆసుపత్రి ఆవరణలో డా.జాకబ్ జక్రయ్య, డా.సారా జార్జి ల సహకారంతో స్థానికులకు కరాటే శిక్షకురాలిగా నిలిచారు. డా.సారా జార్జి కూడా పద్మజ వద్ద శిక్షణ పొందుతున్నారు. ♦ 2016లో ఒంగోలులో జరిగిన ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలలో మద్దులూరు (సంతనూతలపాడు) హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఆత్మరక్షణ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు. ♦ 2016లో తన గురువు వలిశెట్టి రవి స్థాపించిన రుద్రమదేవి డిఫెన్స్ అకాడమీ (హైదరాబాదు) సహకారంతో తెలంగాణలో షీ టీం ఆధ్వర్యంలో అనేక మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్కి శిక్షణ ఇచ్చారు. ♦ 2017 నుంచి చిన్నగంజాం ఏడో తరగతి బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. చిత్రకారిణిగా ఏకకాలంలో ఉపాధ్యాయినిగా, యుద్ధనైపుణ్య శిక్షకురాలిగా , చిత్రాకారిణిగా ,భార్యగా, అమ్మగా, విభిన్న పాత్రలను పోషిస్తున్న «ఈ ధీశాలి తన భావాలకు రూపాలనిస్తూ అనేక చిత్రాలకు జీవం పోశారు. ఆమెను కలవడానికి వచ్చే మిత్రులు, సందర్శకులను ఇంటిలో గోడలను అలంకరించిన ఆమె పెయింటింగ్స్ కచ్చితంగా ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. 2005లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థాన్ నిర్వహించిన ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కోర్సును ఫూర్తి చేశారు. 2009 మార్చిలో ఫెవీక్రిల్ సంస్థ ఇచ్చిన ఎక్స్పర్ట్ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశారు. -
శైలజకు వైఎస్సార్ సీపీ మహిళా నేత పరామర్శ
చిత్తూరు ,తిరుపతి మంగళం : పెళ్లయిన మొదటి రోజే భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన నవ వధువు శైలజను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ఆదివారం పరామర్శించారు. పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తామనీ, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఆమె మాట్లాడుతూ శైలజ భర్త రాజేశ్ను ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి పరంగా అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామనీ, శైలజ అంగీకరిస్తే హైదరాబాద్లోని మాక్సివిజన్లో కళ్లకు అవసరమైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శైలజకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
జైల్లో ఉండటానికి మాత్రమే చంద్రబాబు అర్హుడు
సాక్షి, హైదరాబాద్: రోజుకో అబద్ధం, నిమిషానికో పేదవాడికి అన్యాయం చేస్తూ ప్రజాధనాన్ని దిగమింగుతూ సీఎం చంద్రబాబునాయుడు మోసపూరిత పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాంధీ జయంతి రోజున చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ తూ.చ. తప్పకుండా పాటిస్తుంటే ఆరోజున కూడా అబద్ధాల్లో అంతులేకుండా మాట్లాడి చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుకెక్కుతున్నారని ఎద్దేవా చేశారు. నోటికి వచ్చిన మాటల్ని చంద్రబాబు మాట్లాడటంపై ఆమె అశ్చర్యం వ్యక్తంచేశారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలని చంద్రబాబు చెప్పడాన్ని దుయ్యబట్టారు. తన సొంత ఐదారు నివాసాలకు, గెస్ట్ హౌస్లకు మరమ్మతుల పేరుతో వందలకోట్ల ప్రభుత్వ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప బాబు పేదవాడికి ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ఇంటికి ప్రజాధనంతో వందల కోట్లు ఖర్చుపెట్టి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని.. మీడియాను కూడా ఆ ఇంట్లోకి అనుమతించలేదన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించారని.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోనే 27 లక్షల వరకు నిర్మించారని పద్మజ గుర్తుచేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని లక్షల ఇళ్లు కట్టించలేదన్నారు. ఏడాదికి 10వేల ఇళ్లు కూడా కట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న చంద్రబాబు.. రాబోయే ఏడాదిలో 17లక్షల ఇళ్లు కడతానని చెప్పడం పచ్చి మోసం, దగాయేనని చెప్పారు. ఎన్నికల కోసం బాబు మళ్లీ అబద్ధాలు మొదలుపెట్టాడన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఎందుకు పదే పదే అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 3సెంట్ల భూమిలో లక్షన్నర ఇళ్లు కట్టిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా దాని ఊసేలేకపోగా.. నిర్మాణంలో ఉన్న వాటిని కూడా అపేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. నాలుగు బడ్జెట్లలో ఇళ్ల నిర్మాణానికి ఏ మాత్రం కేటాయింపులు జరపుకుండా, 2014వరకు జరిగిన ఇళ్ల నిర్మాణాలు కూడా నిలిపేయాలని ఆదేశాలిచ్చిన సీఎం ఒక్క చంద్రబాబు మాత్రమేనని ఆమె మండిపడ్డారు. ఏడాదిలోగా ఎప్పుడైనా ఎన్నికలొచ్చే అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వమే భూములిచ్చి లక్షన్నరతో ఇళ్లు కట్టిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చెప్పి నాలుగేళ్లు అవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. మరోవైపు నిర్మాణదశలో ఉన్న ఇళ్లను కూడా ఆపేసిన చంద్రబాబు.. గాంధీ జయంతి రోజున అబద్ధాలు వల్లె వేయటంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్ష గృహప్రవేశాలు చేశాను, మరో 17లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కుమారుడు లోకేశ్కి మంత్రి పదవి ఇవ్వటంలో చూపిన శ్రద్ధ బాబుకు పేదలపై లేదని పద్మజ విమర్శించారు. సొంత ఆస్తుల మరమ్మతులకు వందల కోట్లు ఖర్చుచేసి.. ఆ ఇంట్లో కుటుంబాన్ని ఉంచకుండా ఫైవ్ స్టార్ హోటల్స్లో ప్రభుత్వ ధనంతో అద్దెలు కడుతూ దుర్వినియోగం చేస్తున్నారని పద్మజ నిప్పులు చెరిగారు. పేదల పట్ల చంద్రబాబుకు మొదటి నుంచి చిత్తశుద్దే లేదన్నారు. ఏడాదికి 5లక్షల పైచిలుకు పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ పాలనకు, కేవలం 10వేల ఇళ్లు కూడా చేపట్టని బాబు పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. గ్రాఫిక్స్లో రాజధానిని చూపించినట్టే, రాబోయే ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు బాబు మళ్లీ పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు విజయవాడలో కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణంలో నివాసముంటూ నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లాంఘించారని పేర్కొన్నారు. కోర్టు నోటీసులు అందుకున్నాక సమాధానం దాటవేశారన్నారు. బాబు ఇళ్లపై, ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేపడితే ఆయన బండారం బయటపడుతుందన్నారు. ఏ ఇంట్లో ఉండేందుకు చంద్రబాబు అర్హుడు కాదని, జైలులే ఉండేందుకే ఆయన అర్హుడని పద్మజ విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని పద్మజ స్పష్టం చేశారు. -
‘నేనే వస్తా నాన్న అంది.. నా కూతురుని చంపేశాడు’
హైదరాబాద్: తమ కూతురుది ముమ్మాటికి హత్యే అని పద్మజ తండ్రి నాగేశ్వరరావు అన్నారు. ఇంటికి వస్తుందనుకున్న తమ కూతురు ఆస్పత్రిలో చేర్పించామనే అనూహ్య వార్త వినాల్సి వచ్చిందని, అక్కడి వెళ్లి చూస్తే చనిపోయిన తమ కూతురుని చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. నిత్యం గొడవపడే తన అల్లుడు పద్మజను హత్య చేశాడని అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్న వివాహిత పద్మజ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేసన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక సుదర్శన్ నగర్లో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గిరీష్ నర్సింహకు పద్మజకు ఏడాది క్రితం వివాహమైంది. పద్మజ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పని చేస్తూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రస్తుతం ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె తండ్రిని సాక్షి వివరాలు కోరగా ‘ప్రతి ఆదివారం మా కూతురు ఇంటికి వచ్చేది. ఎప్పటిలాగే ఫోన్ చేశాం. తీసుకెళ్లడానికి రమ్మంటావా అని అడిగితే బట్టలు ఆరేశాను.. వాటిని తీసేసి వస్తాను అని చెప్పింది. సాయంత్రం 4అయినా రాలేదు. మేం తను వస్తుందని అలాగే ఎదురుచూస్తూ కూర్చున్నాం. ఈలోగా పద్మజ భర్త ఫోన్ చేసి తనకు ముక్కులు, చెవుల నుంచి రక్తం వస్తుందని ఆస్పత్రికి తీసుకెళుతున్నానని చెప్పాడు. మేం వెళ్లేసరికే కారులో వెళ్లిపోయారు. ఆస్పత్రికి వెళ్లేసరికి ఐసీయూలో ఉంచారు. వైద్యులు ముందు ఏమీ చెప్పలేదు.. ఆవెంటనే తను చనిపోయిందని చెప్పారు. తన ముఖంపై, శరీరంపై గాయాలు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు నా బిడ్డను కొట్టేవాడు. నా కూతురుని అల్లుడు హత్య చేశాడు’ అని పద్మజ తండ్రి నాగేశ్వరరావు కన్నీరుమున్నీరవుతూ చెప్పాడు. -
గచ్చిబౌలిలో విషాదం.. చంపాడా.. చనిపోయిందా?
హైదరాబాద్: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేసన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక సుదర్శన్ నగర్లో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గిరీష్ నర్సింహకు ఏడాది క్రితం పద్మజ అనే మహిళతో వివాహమైంది. పద్మజ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పని చేస్తోంది. అయితే, అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతోపాటు ఆమె నుదుటిపై బలమైన గాయాలు ఉండటంతో భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, వారి మధ్య కొంత కాలంగా సఖ్యత లోపించి తరచు గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త నర్సింహను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి
-
ప్రవాస స్త్రీశక్తి అవార్డుకు ఎన్ఆర్ఐ పద్మజ
కిర్లంపూడి : ప్రవాస స్త్రీశక్తి 2016 అవార్డుకు కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మహిళ ఉసిరికళ్ల పద్మజ ఎంపికైంది. ఈ అవార్డును ప్రవాసీ బతుకమ్మ పండుగ సందర్భంగా అక్టోబర్ రెండోతేదీన ఆమె అందుకోనుంది. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, ప్రవాసిమిత్ర పత్రిక కలిపి అక్టోబర్ 2న హైదరాబాద్లో ప్రవాస బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. ఉసిరికళ్ల తాతాజీ, పద్మజ దంపతులు17 ఏళ్లుగా దోహఖత్తర్లో ఉంటున్నారు. అక్కడ సాంఘిక సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషికి గాను పద్మజకు ఈ అవార్డును అందజేస్తున్నారు. -
వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా పద్మజ
జగిత్యాల అగ్రికల్చర్: పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా డాక్టర్ పద్మజ నియమిస్తూ ప్రొపెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇప్పటివరకు హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. ఇక్కడ ఇన్ఛార్జి అసోసియేట్ డీన్గా వ్యవహరించిన జయశ్రీ మహబూబ్నగర్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాలకు బదిలీ అయ్యారు. కళాశాల అభివృద్ధికి శాయశక్తులా కృషి కృషిచేస్తానని పద్మజ అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ.. అందరి భాగస్వామ్యంతో కళాశాలను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. -
92 మిశ్రమ, సుస్థిర వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు
పోతవరం (పి.గన్నవరం) : జిల్లాలో 92 మిశ్రమ, సుస్థిర వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతున్నట్టు ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.పద్మజ వెల్లడించారు. ఇప్పటికే 66 క్షేత్రాలు ప్రారంభం కాగా, మరో 26 యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వరి చేనులో చేపల పెంపకానికి సంబంధించిన మిశ్రమ వ్యవసాయ క్షేత్రాన్ని పోతవరంలో శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ప్రతి అంగుళం భూమినీ రైతులు సద్వినియోగం చేసుకుంటూ మిశ్రమ పంటలతో అదనపు ఆదాయం పొందాలని సూచించారు. ఇందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని వివరించారు. మిశ్రమ వ్యవసాయ విధానంలో.. ఎకరం చేను చుట్టూ మూడడుగుల లోతున కందకం తవ్వి, దానిలో చేపలు పెంచడం, చేను మధ్యలో వరి, గట్లపై కూరగాయలు పండిస్తారని చెప్పారు. ఇందుకుగానూ ఒక్కో క్షేత్రానికి రూ.25 వేల రాయితీ ఇస్తున్నారన్నారు. సుస్థిర వ్యవసాయ క్షేత్రంలో.. వరి చేనులో ఒకవైపు చిన్న చెరువు తవ్వడం, గట్లపై కూరగాయలు, అపరాలు పండించడం, పశువులను, కోళ్లను పెంచడం చేపట్టాలని పద్మజ వివరించారు. ఈవిధమైన వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకునే రైతులకు రూ.20 వేల రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 46 మిశ్రమ వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభం కాగా మరో 18 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అలాగే, 20 సుస్థిర వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభం కాగా, మరో 8 మంది రైతులకు వీటిని మంజూరు చేస్తామని చెప్పారు. తక్కువ నీటితో పంటలు పండించాలన్న లక్ష్యంతో రైతులకు అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద జిల్లాకు రూ.25 లక్షలు మంజూరైనట్టు ఆమె చెప్పారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పంటలు పండించడంపై అధ్యయనం చేసేందుకు జిల్లాలో రెండు విడతలుగా మొత్తం 70 మంది రైతులను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పంపుతున్నట్టు పద్మజ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ జె.ఎలియాజర్, ఏఓ సీహెచ్డీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిని సందర్శించిన డీసీహెచ్ఎస్
రామన్నపేట : మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని మంగళవారం జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్) పద్మజ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులను, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్లు, సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సమయపాలన పాటించాలని, ఆస్పత్రిలోని వార్డులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్క నాటి నీళ్లు పోశారు. ఆమె వెంట ఆస్పత్రి సూపరిండెంట్ సిద్ధార్థ, వైద్యులు విజయలక్ష్మి, చిన్నూనాయక్, సిబ్బంది రావీటి సతీష్, ఉమ, సువర్ణ తదితరులు ఉన్నారు. -
గాయం చెక్కిన ధ్యేయం
ఫస్ట్ పర్సన్ ఆ శ్రమా, ఈ శ్రమా చేసి బతకడం... లేదా... నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం! ఇది తప్ప... సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనా, అవకాశం రెండూ... సగటు మనిషికి సాధారణంగా ఉండవు. ఏ శ్రమ చేసినా... మనిషి ఆశ్రమంలా ఉండాలని పద్మజ అంటున్నారు. చిన్నప్పుడు అయిన పెద్ద గాయం పద్మజ సేవ ముందు చిన్నబోయింది. మనిషికి అలంకారం... ఆ సంస్కారమే అని... ధ్యేయం గొప్పదైతే గాయం గాంధేయం అవుతుందని పద్మజ చాటి చెబుతున్నారు. మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్విలో 1971 ఏప్రిల్ 9న పద్మజ జన్మించారు. తల్లి వెనిగళ్ల లలిత, తండ్రి భీమేశ్వర్రావు. ప్రాథమిక విద్యను హైదరాబాదులో చిన్నాన్న దగ్గరుండి అభ్యసించారు. హైస్కూల్ చదువు ప్రకాశం జిల్లాలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర సాగింది. బీఎస్సీ ధార్వాడ్ కర్ణాటక యూనివర్శిటీలో పూర్తి చేశారు. చదువయ్యాక నాలుగేళ్లపాటు మానసిక వికలాంగుల కోసం పనిచేసే ‘లార్ష్ ఇంటర్నేషనల్’ సంస్థలో వలంటీర్గా ఉన్నారు. అదొక జీవిత అధ్యయనం ఆమెకు. అయితే ప్రస్తుతం పద్మజ చేస్తున్న సేవకు ప్రేరణ మాత్రం.. ఆమె బాల్యంలో జరిగిన ఒక సంఘటన నుంచి కలిగిందే. ఆమె గురించి పూర్తి వివరాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. చేదు బాల్యం అమ్మమ్మ, తాతయ్యల దగ్గరుండి చదువుకున్నానని చెప్పాను కదా. అమ్మమ్మ, తాతయ్యలతో పాటు మేనమామా ఇంట్లో ఉండేవాడు.అతను నన్ను బాగా చూసుకుంటున్నట్టుగా బయటకు ప్రవర్తిస్తూ నా దగ్గర వెకిలి, వికృత చేష్టలకు పాల్పడేవాడు. అతని ప్రవర్తన నాకు అర్థమయ్యేది కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది. ఏడుపొచ్చేది. ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. భరించలేక ఎవరికైనా చెప్పాలనిపించేది. కానీ వెంటనే మామయ్య గురించి అలా చెప్తే నమ్ముతారో లేదో అని భయమేసేది. ఆ నరకం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలనిపించేది. అందుకే .. ‘నన్ను ఇక్కడెందుకు ఉంచుతున్నారు? మీ దగ్గరే పెట్టుకొని చదవించొచ్చు కదా.. నేను ఇక్కడ ఉండను .. వచ్చేస్తాను’ అంటూ నాన్న దగ్గర మారాం చేసేదాన్ని. బెంగతో అలా అంటుందని అమ్మానాన్న అనుకున్నారే కాని నా భయాన్ని వాళ్లు గుర్తించలేకపోయారు. ఆ హింస గురించి వాళ్లకు చెప్పే ధైర్యం నేనూ చేయలేకపోయాను. కాని అవకాశం దొరికితే మాత్రం బయటపడాలనే ఆలోచనతోనే పెరిగాను. అందుకే ఇంటర్ అవగానే కర్ణాటకకు వెళ్లిపోయాను. ఏదో సాధించాలని కసి బాగా చదివి ఏదో సాధించాలన్న కసితో చదువుల్లో, ఆటల్లో ముందుండేదాన్ని. డిగ్రీ అయ్యాక, స్వచ్ఛంద సేవాసంస్థలో పనిచేస్తూనే కర్ణాటక రాష్ట్ర గ్రూప్ 1 పరీక్ష రాశాను. సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పరీక్షకూ హాజరయ్యాను. 6వ ర్యాంక్ వచ్చింది. జిల్లా ఉపాధి అధికారిగా ఉద్యోగంలో చేరాను. అందరి పిల్లల గురించి తల్లిదండ్రులు కలలు కన్నట్టే నా గురించీ అమ్మానాన్న కలలు కన్నారు. బాగా చదువుకొని, మంచి ఉద్యోగంలో చేరి.. పెళ్లి, పిల్లలతో హాయిగా జీవితంలో స్థిరపడాలని. చదివి, మంచి ఉద్యోగం సంపాదించి కొంత వరకు అమ్మానాన్న కలల్ని నిజం చేశాను. అమ్మానాన్న మాటలకు ఏ రోజూ ఎదురు చెప్పని నేను పెళ్లికి విషయంలో మాత్రం చెప్పాను . అయితే మా పెద్దమ్మ పెళ్లి చేసుకోవలసిందేనని (భారతి) ఒత్తిడి తెచ్చింది. తప్పించుకున్నా. చెల్లి పెళ్లి అయిపోయాక నా మీద ఆ ఒత్తిడీ తగ్గింది. కాని తర్వాత చాలా రోజులకు అప్పుడప్పుడు అనిపించేది... భర్త, పిల్లలు ఉండే బాగుండు అని. మళ్లీ వెంటనే నా చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూశాక భర్త కంటే కూడా పిల్లలుంటే చాలు అన్న ఆలోచన వచ్చేది. అయితే అది క్షణం వరకే. ‘కంటేనే అమ్మా.. కనకపోతే అమ్మ కాలేమా?’ అనిపించేది. ఓ వైపు ఆ తలపులు.. ఇంకోవైపు ఏదో సాధించాలనే తపనతో చేస్తున్న ఉద్యోగంలో ఆనందాన్ని, సంతృప్తినీ పొందలేకపోయా. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని నా అనేవాళ్లను సంపాదించుకోవడం కన్నా నా అన్నవాళ్లు లేనివారికి అంకితం చేయడం మిన్న అనుకున్నాను. ఓప్రా విన్ఫ్రే ప్రభావం ఆ సమయంలోనే ఓప్రావిన్ఫ్రే జీవితం, ఆమె షో నా మీద చాలా ప్రభావం చూపించింది. మారుతండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైన విన్ఫ్రే తనలాంటి ఎంతోమంది బాధితులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన తీరు.. పిరికిదాన్నయినా నాకు స్ఫూర్తినిచ్చింది. ఆ ప్రేరణ, అప్పటికే వాలంటరీ వర్క్లో ఉన్న అనుభవం, రామమకృష్ణా మిషన్తో ఉన్న అనుబంధం, చదివిన పుస్తకాలూ నా గమ్యాన్ని మార్చాయి. చిన్నప్పుడు నాకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఇంకే ఆడపిల్లకు ఎదురు కాకుండా, ఇంకే ఆడపిల్లా బలికాకుండా ఇటు పిల్లలను, అటు తల్లిదండ్రులను జాగృతం చేయాలనుకున్నాను. ‘జట్టు’లో ఒకరిగా ఆ సమయంలో నేను ఉద్యోగరీత్యా ప్రకాశం జిల్లాలో ఉన్నాను. అప్పటి జిల్లా కలెక్టర్ కరికల్ వలెవన్.. ‘జట్టు ’ అనే ఆశ్రమ వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడును పరిచయం చేశారు. జట్టు కోసం ఆతను టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని చేసిన త్యాగాన్ని వివరించారు. ఇక నేను రెండో ఆలోచన చేయలేదు. నా నిర్ణయాన్ని ఆపలేదు. ఉద్యోగం వదిలేశాను. ‘జట్టు’లో చేరాను. ఈ పిల్లలతో బాగానే జట్టు కుదిరింది. అమ్మా...నాన్న... ఎటువంటి ఆధారం లేని ఈ పిల్లల ‘అమ్మా’ అన్న పిలుపు, వాళ్ల మమకారం నన్ను ఇక్కడ కట్టిపడేశాయి. అంతర్జాతీయ స్థాయిలో.. ఈ పిల్లల్లో ఉన్న ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ఆశ్రమంలో శ్రీ రజనీరాజ అంతర్జాతీయ శాస్త్రీయ నృత్య కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ పిల్లలతోపాటు చుట్టుపక్కల పిల్లలకూ శాస్త్రీయ నృత్యంతోపాటు, సంగీతం, పలు జానపద కళలు, కత్తిసాము, కర్రసాము, హాకీలాంటి ఆటలను నేర్పుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పిల్లలు బహుమతులు, అవార్డులు, రివార్డులు సాధిస్తున్నారు. ఈ విషయంలో జట్టు పారినాయుడు మాస్టారు, నృత్య శిక్షకులు రజనీ, శ్రీనివాస్లు, జట్టు ట్రస్ట్ ప్రోత్సాహం గొప్పది. ఆశ్రమంలో పిల్లలతో పాటు వృద్ధులకు కూడా ఆసరా ఇస్తున్నాం. సుబ్బాయమ్మలాంటి వారు పెద్ద దిక్కుగా ఉన్నారు. జట్టులోని పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలకు అంగరంగవైభవంగా పెళ్లి చేశాం. వారు ఇప్పుడు అమ్మా...నాన్నలున్నా...ఇంత చక్కగా చూసుకోరేమోనన్న సంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నారు. లైంగిక దాడుల బాధితుల కోసం బాల్యంలో, యవ్వనంలో లైంగిక దాడులకు గురవుతున్న ఆడపిల్లలను చైతన్య పరచాలి. ఎదిరించే గుణాలను అలవాటు చేయాలి. అన్యాయాలకు గురైన పిల్లలు మానసిక వత్తిడికి గురి కాకుండా చూడాలి. లేదంటే ఆ వత్తిడితో వివాహమయ్యాక వారు ప్రశాంతంగా ఉండలేక, కట్టుకున్న వారిని ఉంచలేక మథన పడ్తుంటారు. అలాగే దాడులకు పాల్పడుతున్న మగవాళ్లనూ కౌన్సిలింగ్ ద్వారా మార్చాలి. మెప్పుకోసం.. గొప్ప కోసం కాదు ఎదుటివారు నా గురించి ఏమి అనుకుంటారో అన్న చింతను అధిగమించాను. మెప్పు కోసమో, గొప్ప కోసమో పనులు చేయడం అలవాటు చేసుకోలేదు. మనస్సులో కోర్కెలు అణచుకొని నేనేదో గొప్ప త్యాగం చేశానని అనుకోవడం కంటే వాటిని జయించడం ఉత్తమమని తెలుసుకున్నాను. ఆచరిస్తున్నాను. తద్వారా ఆత్మానందం, అనంత శ క్తిని పొందుతున్నాను. ఎంతో మంది చేసిన దాన, త్యాగ ఫలితమే నేను. అందరి నుంచి పొందిన లబ్ధికి, అంతకంటే ఎక్కువగా జోడించి తిరిగి సమాజానికి చెల్లించడమే నా పని. అదే నా భవిష్యత్. చిన్నప్పుడు అనుకునేదాన్ని కష్టపడి డబ్బు సంపాదించాక సేవ చెయ్యడం మొదలుపెట్లాలని. సంపాదనకే సమయం సరిపోతే సేవ ఎప్పుడు ప్రారంభించాలన్న ప్రశ్న కూడా వేధించింది. మంచికి సమాజంలో ఆదరణ ఉన్నప్పుడు చేయడానికి భయమెందుకు అని పనిలోకి దిగాను. ఇక్కడ ఆశ్రమంలో ఈ బిడ్డల ప్రేమను, కష్ట సుఖాలను పంచుకొనే అదృష్టం దక్కింది . వీళ్లు సన్మార్గంలో నడవడానికి తగిన వాతావరణం ఏర్పాటు చెయ్యటమే నా కర్తవ్యం. గతంలో బతకలేను... గతాన్ని మార్చలేను. కనుక నిస్వార్థ సేవే లక్ష్యంగా... ఉన్నంత కాలం ఏ ఆధారం లేని ఈ పిల్లలకు తల్లిగా ఉండిపోదామనే ఆశతో సాగుతున్నాను. సంభాషణ: వంగల దాలినాయుడు, సాక్షి, పార్వతీపురం -
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నెలలు నిండిన గర్భిణి బస్సు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఫలక్నుమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్కు చెందిన పద్మజ(35) బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకోట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మెగాభినేత్రి
పుట్టినప్పుడు మూడున్నర కిలోలట! వెరీ హెల్దీ బేబీ. మెగాస్టార్... చేతుల్లోకి ఎత్తుకుంటే తదేకంగా చిరంజీవినే చూస్తూ ఉండిపోయిందట... పసి నీహారిక. ఇప్పుడు చిరంజీవి తదేకంగా చూసే సందర్భం వచ్చేసింది! మెగా కుటుంబంలో మొట్టమొదటి హీరోయిన్గా నీహారిక సినిమా రాబోతోంది. నీహారిక అంటే గెలాక్సీ. అంటే పాలపుంత. పద్మజకు నీహారిక ఎప్పుడూ స్టారే. మరి నీహారికకు? మమ్మీ ఈజ్ హర్ గెలాక్సీ. మదర్స్డే స్పెషల్ నీహారిక: నిన్ను ఇంటర్వ్యూ చేస్తానమ్మా.. నిజాలే చెప్పాలి. పద్మజ: ఏమడుగుతావో అడుగు. అన్నీ నిజాలే చెబుతా. నీహా: ఓకే.. రెడీయా.. ముందుగా నేను పుట్టినప్పుడు నీకెలా అనిపించిందో కొంచెం షేర్ చేసుకోవా? పద్మజ: ఫస్ట్ అబ్బాయి (వరుణ్ తేజ్) పుట్టాడు కాబట్టి, రెండోసారి పాపే పుట్టాలని నేనూ, మీ నాన్న అనుకున్నాం. అదే జరిగింది. నువ్వు పుట్టినప్పుడు మొదలైన ఆనందం మీ నాన్నకి ఇంకా తీరలేదు. పుట్టినప్పుడు నీ వెయిట్ మూడున్నర కేజీలు. ముద్దుగా ఉండేదానివి. ‘ఈ రోజు నలుగురు పుట్టారు. అందరికన్నా మీ పాపే క్యూట్గా ఉంది’ అని నర్సులు అన్నారు. ఆ రోజు నువ్వెలా ఉన్నావో అలా నా మనసులో ప్రింట్ అయిపోయింది. ఇంకో విషయం చెప్పనా? ఏడో రోజు నిన్ను ఉయ్యాలలో వేసినప్పుడు మీ పెదనాన్న (చిరంజీవి) ఎత్తుకుంటే, చాలాసేపు ఆయన్నే చూస్తూ ఉండిపోయావు. మా బావగారిని నువ్వెందుకలా చూశావో అర్థం కాలేదు. నీహా: చిన్నప్పుడు వరుణ్ అన్నయ్య, నేనూ చేసిన అల్లరి గురించి... అన్నయ్యే ఎక్కువ అల్లరి చేసేవాడు కదూ..? పద్మజ: ఏం కాదు... నువ్వే. చిన్నప్పుడు ఇద్దరూ బాగా కొట్టుకునేవాళ్లు. పెద్దయ్యాక ప్రేమగా ఉంటున్నారు. పైగా నీ గొంతేమో పెద్దది. నీహా: నన్నంటున్నావ్.. నీ గొంతు కూడా అంతే కదమ్మా. ఆ మాటకొస్తే మనింట్లో మన నలుగరిదీ పెద్ద గొంతే. కాకపోతే.. అన్నయ్య, నాన్న ఎక్కడ వాడాలో అక్కడ వాడతారు. మనిద్దరం మాత్రం ఏదైనా గట్టిగా మాట్లాడేస్తాం. అందుకే కదమ్మా ఇంట్లో మనిద్దరం రహస్యాలు మాట్లాడుకోవాలంటే తలుపులేసేసుకుంటాం. అవునూ.. మీ మమ్మీకీ, నా మమ్మీకి పిల్లల్ని పెంచే విషయంలో తేడా ఏంటి? పద్మజ: మీ అమ్మమ్మ మన దగ్గరే ఉండేది. తనే నన్ను పెంచింది. నేనూ నీలానే బాగానే అల్లరి చేసేదాన్నట. అందుకే నీ అల్లరికి తట్టుకోలేక ఎప్పుడైనా తిడితే, ‘ఊరుకో. నువ్వింతకంటే ఎక్కువే అల్లరి చేశావ్’ అని మా అమ్మ అనేది. మా అప్పుడు స్కూల్స్లో టూర్స్, బోల్డంత మంది ఫ్రెండ్స్, కంప్యూటర్లు.. ఇలా ఏవీ ఉండేవి కాదు. స్కూలు, ఇల్లు అంతే. ఇప్పుడేమో అంతా ఫాస్ట్. టూర్స్కి వెళతారు. ఫ్రెండ్స్తో సినిమాలకెళతారు. ఎక్కడికీ వెళ్లనివ్వకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టుకోవడం నాకిష్టం ఉండదు. బయటకు పంపించినా, మీరిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేదాకా టెన్షన్. ఆ తేడా తప్ప పెంపకం విషయంలో మా అమ్మకీ, మీ అమ్మకీ వేరే ఏ తేడా లేదు. నీహా: నన్నూ, అన్నయ్యని పెంచడానికి ఇబ్బంది పడ్డావా? పద్మజ: నేనేం ఇబ్బందిలా ఫీలవ్వలేదు. మీ ఇద్దరు తప్ప నాకు వేరే ఆలోచన ఉండేది కాదు. మీరు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను మీ కళ్ల ముందు ఉండాల్సిందే. ఎప్పుడైనా లేకపోతే వరుణ్ ఫోన్ చేసి, ‘నేను వస్తానని తెలుసు కదా.. ఇంట్లో ఎందుకు లేవు’ అని అరిచేసేవాడు. నీహా: మా చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎవరికీ ఇచ్చేదానివి కాదట.. నువ్వే పెంచావట... అందుకే అమ్మా.. ‘ఐ కాంట్ గెట్ ఎ బెటర్ మమ్మీ. లవ్ యు లాట్’. పద్మజ: మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు. మీ ఇద్దరూ ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు, నాకు ముద్దు పెట్టి, బై చెప్పి వెళ్లేవాళ్లు. చిన్నప్పుడు మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ ఉండటం నాకు హ్యాపీగా ఉంది నీహా. నీహా: నన్ను ఫస్ట్ డే స్కూల్కి పంపించినప్పుడు ఏడ్చానా? పద్మజ: ప్రీ కేజీలో ఆ రోజు నీతో పాటు చేరిన పిల్లలం దరూ దాదాపు ఏడ్చారు. నువ్వు కూడా ఏడుస్తావేమోనని భయపడుతూ, నీవైపు చూశా. అప్పుడు నువ్వు నన్ను చూసి, ‘అమ్మా.. నువ్వెల్లిపో.. వెల్లిపో’ అని ముద్దు ముద్దుగా అన్నావు (మురిపెంగా చూస్తూ). నీహా: నేనలా మాట్లాడిన వాటిలో నీకు బాగా గుర్తున్నవి ? పద్మజ: చిన్నప్పుడు నువ్వేదైనా చెప్పాలంటే.. ‘చూడు.. చూడు.. అమ్మా.. చూడు.. చూడు’ అనేదానివి. ముందు ఆ మాటలు అని, ఆ తర్వాతే విషయం చెప్పేదానివి. ఇప్పటికీ నీకా అలవాటు పోలేదు. నీహా: ఓహో.. అందుకేనా ఇప్పుడు కూడా ఏదైనా చెప్పే ముందు ‘అమ్మా.. చూడు.. చూడు’ అని నేనంటే చిన్నప్పటిది గుర్తుకొచ్చి నవ్వుతుంటావ్? అది సరే... అమ్మా నాలో నీకు నచ్చని విషయాలు, నచ్చినవి? పద్మజ: నీకు కోపం ముక్కు మీద ఉంటుంది. ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోతుంది కాబట్టి, నేను సీరియస్గా తీసుకోను. ఆ కోపం అంటే నాకు నచ్చదు. నచ్చే విషయాలంటే.. నేనేదైనా విషయానికి బాధపడితే.. చాలా మెచ్యుర్డ్గా మాట్లాడతావ్. అప్పటివరకూ బాధపడిన నేను ‘ఇంత చిన్న విషయానికి బాధపడ్డామా’ అనుకుంటాను. నీహా.. నువ్వంత మెచ్యుర్డ్గా మాట్లాడటం, బోల్డ్గా ఉండటం నాకు నచ్చుతుంది. నీహా: నీకో కాంప్లిమెంట్ అమ్మా... నువ్వు యంగ్గా కనిపిస్తావ్... చాలా ప్రౌడ్గా ఉంది.. పద్మజ: అందుకేనా.. నాకన్నా నువ్వే బాగున్నావని ఏడిపిస్తుంటావ్? మీ అన్నయ్య కాలేజ్కి నేను వెళ్లినప్పుడు, తనేమన్నాడో నీకు గుర్తుండే ఉంటుంది. కాలేజీలో ‘మీ సిస్టరా?’ అని అడిగారట. అందుకని వరుణ్ ఇంటికొచ్చి ‘అమ్మా.. నువ్వు కాలేజీకి వస్తే రా కానీ, చుడీదార్లు వేసుకోకు.. చీరలు కట్టుకుని రా’ అన్నాడు (నవ్వుతూ). ⇒మా అమ్మచెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. నాకెలాంటి అబ్బాయి సూట్ అవుతాడో మా అమ్మకు బాగా తెలుసు. అందుకే డెసిషన్ తనదే. ⇒మా ఇద్దరి రిలేషన్షిప్ మదర్, డాటర్లా ఉండదు. కోపం వచ్చినప్పుడు బాగా గొడవపడతాం. ఆ కోపం కాసేపే. ఆ తర్వాత నేను ‘సారీ అమ్మా’ అనేస్తాను. మేమిద్దరం అటు ఫ్రెండ్స్ కాదు.. ఇటు ఎనిమీస్ కాదు. మేం ‘ఫ్రెనిమీస్’ అంటాను. నీహా: నీకింకో కాంప్లిమెంట్ కూడా.. నువ్వు సింపుల్గా ఉన్నా చాలా బాగుంటావమ్మా. ఒక మామూలు హౌస్వైఫ్ ఎలా ఉంటుందో అలానే ఉంటావ్. పద్మజ: నాక్కూడా ఇలా ఉండటమే ఇష్టం నీహా. మీ నాన్నగారికి కూడా నేనిలా ఉండటమే ఇష్టం కదా. నీహా: అవును. అన్నయ్యకు కూడా నువ్విలానే ఉండటం ఇష్టం. నిన్ను చుడీదార్లు వేసుకోవద్దంటాడు. చీరలే కట్టుకోమంటాడు. బొట్టు పెట్టుకోమంటాడు. ఎప్పుడైనా నువ్వు పోనీటైల్ వేసుకున్నా, ఊరుకోడు. జడేసుకోమంటాడు. పద్మజ: అవును. వరుణ్ మరీ పర్టిక్యులర్గా ఉంటాడు. నేను కూడా ఇలా ఉండటానికే ఇష్టపడతాను. నీహా: నేను హీరోయిన్ అవుతానని ఊహించావా? పద్మజ: వరుణ్ హీరో అవుతాడని అనుకున్నాను. నాకూ ఇంట్రస్టే. కానీ, నీ గురించి ఏమీ అనుకోలేదు. నువ్వు డాక్టర్ అవ్వాలనుకునేదానివి. కానీ, నాకు తెలుసు నువ్వు కావని. ఒకేచోట కుదురుగా ఉండటం నీవల్ల కాని పని. నువ్వు డాక్టర్ అయితే.. నాలుగు గంటలు ఆపరేషన్ చేయాలంటే రెండు గంటలు చేసి, మిగతా సగం వదిలేస్తావనుకుంటుంటాను (నవ్వుతూ). మీ నాన్నగారి అమ్మమ్మ నిన్ను ఐఏఎస్గా చూడాలనుకునేది. కానీ, నీకు బీఏ మాస్ కమ్యూనికేషన్ చేయాలని ఉండేది. నీ ఇష్టాన్ని కాదనలే దు. అందుకే హీరోయిన్ అవుతానంటే ఓకే చెప్పాం. ఓకే చెప్పే ముందు నేనూ, నాన్న చాలా డిస్కస్ చేసుకున్నాం. నీహా: మీ ఇద్దరూ ఏం డిస్కస్ చేసుకున్నారో చెప్పవా ప్లీజ్.. పద్మజ: (నవ్వుతూ). మేమిద్దరం ఒకటే అనుకున్నాం. ‘భవిష్యత్తులో మన అమ్మాయి ఏ విషయంలోనూ ఫీల్ కాకూడదు. ఇప్పుడు కనుక తన ఇష్టాన్ని కాదంటే.. రేపు తను ఫీలవుతుంది. పెళ్లయ్యాక హీరోయిన్గా ఎలాగూ చేయలేదు. టీవీ షోస్ అయితే ఎప్పుడైనా చేయొచ్చు. అందుకే ఇప్పుడు చేయనిద్దాం’ అనుకున్నాం. నీహా: అవునమ్మా.. పెళ్లయ్యాక నేను సినిమాలు చేయను. నువ్వు నీ పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకున్నావో నేనూ అలానే చూసుకుంటాను. నేనే పని చేసినా ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తా. అందుకే మ్యారీడ్ లైఫ్ని నీలానే లీడ్ చేస్తాను. నీహా: ఇంతకీ అన్నయ్య ఫస్ట్ సినిమా అప్పుడా.. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన నా ఫస్ట్ సినిమా (ఒక్క మనసు) రిలీజ్ అవుతుంటే ఎగ్జయిట్ అవుతున్నావా? పద్మజ: అన్నయ్య సినిమా అప్పుడు ఎగ్జయిట్మెంట్, టెన్షన్ ఉండేది. నీ సినిమాకి ఇంకా ఎక్కువ ఉంది. దానికి కారణం మన మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్వి నువ్వే. ఏదైనా జరిగితే నిన్ను అనరు.. నన్ను అనరు. ఫ్యామిలీని అంటారు. అందుకే, మంచి యాక్ట్రెస్ అనిపించుకుంటావా? లేదా? అని టెన్షన్. నీహా: అవును. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచించాను. ‘కొణిదెల మెగా ఫ్యామిలీ’ అనే పేరు మా డాడీ చిరంజీవిగారిది. నేను మంచి సినిమా చేసినా, చెడ్డ సినిమా చేసినా అది ఫ్యామిలీకే వస్తుంది. అందుకే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని, నిర్ణయాలు తీసుకుంటా . పద్మజ: నువ్వు టాలెంటెడ్ నీహా. అందుకే ఎంకరేజ్ చేశాం. బయట ఫ్యాన్స్ సినిమాలు చేయొద్దన్నా.. వేరేవాళ్లు వద్దన్నా.. నీ కోరిక తీరలేదంటే... భవిష్యత్తులో నువ్వు ఎవర్నీ అడగవ్. ‘నా కోరికను ఎందుకు కాదన్నారు’ అని నన్నూ, నాన్ననే అడుగుతావ్. అందుకే ఒప్పుకున్నాం. నీహా: బిహైండ్ మై సక్సెస్ ఎవరో కాదు.. నువ్వే అమ్మా. పద్మజ: ఏం చేసినా నువ్వు కమిటెడ్గా చేయడం నాకూ ఆనందంగా ఉంది. టీవీ షోస్ చేసేటప్పుడు గంటల తరబడి నిలబడి, ఆ తర్వాత కాళ్ల నొప్పులతో బాధపడతావ్ కదా.. అప్పుడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. నీహా: అన్నయ్య, నా విషయంలో నీకేదైనా బాధ? పద్మజ: ఏ బాధా లేదు. మీ ఇద్దరూ చాలా బాగా పెరిగారు. మీకు బయటి ఫుడ్ పెట్టకూడదని మీ చిన్నప్పుడు చైనీస్ వంటకాలు కూడా నేర్చుకున్నాను. నేను చేసే బిర్యాని, నాన్వెజ్ కర్రీస్ అంటే నీకిష్టం. ఇప్పుడేమో ఇద్దరూ డైటింగ్ అంటూ తినడం మానేశారు. నువ్వేమో నాన్వెజ్ మానేశావ్. చిన్నప్పుడు మీ ఇద్దరూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ‘ఏం తింటారు’ అని అడిగేదాన్ని. ఇప్పుడు బయట నుంచి రాగానే, మీ అన్నయ్యను అలా అడిగితే.. ‘తింటావా అని మాత్రం అడక్కు’ అంటాడు. మీ ఇద్దరూ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కొంచెం బాధగా ఉంది. నీహా: కరెక్టే అమ్మా.. చిన్నప్పుడు ఏ టైమ్లో పడితే ఆ టైమ్లో ఏది పడితే అది తినడానికి అడిగేదాన్ని కదా.. పద్మజ: చిన్నప్పుడు మ్యాంగో సీజన్ కానప్పుడు మ్యాంగో జ్యూస్ అడిగేదానివి. ఒకసారి రాత్రి 12 గంటలకు మైసూ ర్పాక్ కావాలని మారాం చేసావ్. అప్పటికప్పుడంటే ఎలా? నాకు చేయడం రాదు. చిన్నప్పుడు ఎవరో చేస్తుంటే చూసా. అది గుర్తు తెచ్చుకుని చేసిస్తే, తిన్నావ్. నీహా: పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) పెద్ద హీరోలయ్యారు కదా.. మరి.. నాన్న... పెద్ద హీరో కానందుకు బాధపడ్డావా? పద్మజ: నాకే బాధా లేదు. మరి.. నీ సంగతేంటి నీహా? నీహా: డాడీ (పెదనాన్న చిరంజీవిని నీహా అలానే పిలుస్తారు), బాబాయ్ పెద్ద హీరోలయ్యారు. నాన్నగారి నటన డిఫరెంట్గా ఉంటుంది. నాన్న మెయిన్ ఫోకన్ యాక్టింగ్పైన కాదు. ఆయనలో మంచి రైటర్ ఉన్నాడు. నేను యూ ట్యూబ్లో చేసిన వెబ్ సిరీస్కి రైటింగ్ విషయంలో నాన్న హెల్ప్ తీసుకున్నాను. నాన్న ‘సీతామాలక్ష్మి’ సీరియల్ కథ రాస్తున్నారు. రైటింగ్ విషయంలో నాన్న హెల్ప్ తీసుకుంటా కాబట్టి, ఆయన ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ కాకపోవడం ఆనందంగా ఉంది. స్వార్థం అనుకోవద్దమ్మా ప్లీజ్. నీహా: ఫైనల్గా ఒక్క మాట చెప్పమ్మా.. నాలాంటి కూతురు ఉన్నందుకు నీకెలా అనిపిస్తోంది? పద్మజ: చాలా ప్రౌడ్గా ఉంది. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటావ్. అలాగే, ‘ఇది తప్పమ్మా.. చేయొద్దు’ అంటే చేయవు. అది ఇంకా ఇంకా ఇష్టం. నీహా: నేనూ, అన్నయ్యా మా ప్రేమను నీకెంత ఇచ్చామో తెలియదు కానీ, నువ్వు మాత్రం హండ్రెడ్ పర్సంట్కన్నా ఎక్కువే ఇచ్చావమ్మా. ఎప్పటికీ నువ్వే మా అమ్మ కావాలి. - డి.జి. భవాని -
చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి
శ్రీకాళహస్తి : వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమనాడు క్రాస్ వద్ద గురువారం చోటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన శ్రీరాములు కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులో జరుగుతున్న తమ బంధువుల శుభకార్యానికి హజరై తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో కారు తొండమనాడు క్రాస్ వద్దకు రాగానే లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పద్మజ, సంపూర్ణ మృతి చెందగా.. శ్రీరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
ఎంతపని చేశావు తల్లీ!
ఇద్దరు బిడ్డలు సహా తల్లి ఆత్మహత్య తిరుపతిలో విషాదం నవమాసాలు మోశావు.. ఇద్దరి బిడ్డలకు ప్రాణం పోశావు. కుటుంబ కలహాలతో ఆ బిడ్డల్నే ఉరితాడుకు వేలాడదీశావు.. పిల్లలతో పాటూ నీవూ దూరమై అయినవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చావు.. ఎంతపనిచేశావు తల్లీ..! ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో..! జీవితంపై విరక్తి చెందింది. ఈ లోకం నుంచి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. తానొక్కటే చనిపోతే పేగుతెంచుకుని పుట్టిన బిడ్డల బతుకు ఏమవుతుందోనని ఆలోచనలో పడింది. తనతోపాటు పిల్లలిద్దర్నీ తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. మనసు చంపుకుని ముక్కుపచ్చలారని మగబిడ్డల్ని ఉరితాడుకు వేలాడదీసింది. తనూ తనువు చాలించి కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన మంగళవారం తిరుపతిలో విషాదాన్ని నింపింది. తిరుపతి క్రైం : నగరంలోని పల్లెవీధికి చెందిన శశికుమార్, పద్మజ(25)కు 2009లో వివాహమైంది. శశికుమార్ తల్లి సరస్వతి కూడా వీరితోనే ఉండేది. వీరికి జ్యోతికిరణ్ (6), లక్ష్మీప్రసాద్(5) పిల్లలు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య స్వల్ప మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. గతంలో పోలీసులను ఆశ్రయించగా ఇరువురికీ వెస్ట్ పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పద్మజ మంగళవారం మరోసారి మనస్తాపానికి గురైంది. మధ్యాహ్నం స్కూల్ నుంచి పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చి, ఆపై వారితోనే ఇంట్లో ఉండిపోయింది. సాయంత్రం 6 గంటలవుతున్నా ఇంట్లో లైటు వేయలేదు. గమనించిన అత్త లైటు వేసేందుకు ఇంటికి వచ్చి, తలుపుతట్టింది. తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. పద్మజ, ఇద్దరు పిల్లలతో ఉరేసుకుని ఉండడంతో కుమారుడు శశికుమార్కు తెలిపింది. అతను వెస్ట్ పోలీసులకు సమాచారం అందించాడు. డీఎస్పీ కనకరాజు, వెస్ట్ సీఐ అంజూయాదవ్, యూనివర్సిటీ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ జయశ్యామ్ చేరుకున్నారు. తలుపులు తీసి మృతదేహాలను కిందికి దించి పోస్ట్మార్టం నిమిత్తం రుయాకు తరలించారు. అత్త సరస్వతి, భర్త శశికుమార్ మాట్లాడుతూ పద్మజను తాము ఎప్పుడూ ఏమీ అనలేదని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యో.. ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడం..అందులో ఇద్దరు పిల్లలు.. తల్లి ఉండడంతో వారిని చూసేం దుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చిన్నారుల మృతదేహాలను తరలిస్తుండగా పల్లెవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విగతజీవులుగా ఉన్న చిన్నారులను చూసి స్థానికు లు కంటతడి పెట్టుకున్నారు. -
సుమో బోల్తా : ఇద్దరి మృతి
కలసపాడు : వైఎస్సార్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కలసపాడు మండలం పిడుగుపల్లి సమీపంలో ఓ సుమో ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో శశికుమార్(17), పద్మజ(16) అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. -
సంతానం కలిగిస్తామని..మోసం చేశారు
కరీంనగర్: కరీంనగర్లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రం వివాదాల్లోకెక్కింది. సంతానం కలిగిస్తామంటూ తమవద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన డాక్టర్ పద్మజ ఫలితం చూపకపోగా, ఇదేమిటని ప్రశ్నించినందుకు తుపాకీ ఉందని బెదిరించారని వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన బలిజ శశికళ దంపతులు ఆరోపించారు. తమను సెక్యూరిటీ సిబ్బందితో ఆసుపత్రి నుంచి బయటకు గెంటి వేయించారని పేర్కొంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలను డాక్టర్ పద్మజ కొట్టిపారేశారు. శశికళ దంపతులకు మూడుసార్లు పరీక్షలు చేయాల్సి ఉండగా, ఒకేసారి పరీక్షలు చేయించుకుని వెళ్లారని తెలిపారు. మరోసారి వస్తే గర్భం వచ్చే అవకాశాలున్నాయని చెప్పినా వినకుండా డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై ఇటీవల తాము న్యాయస్థానం ద్వారా పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారంపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు స్పందించారు. శశికళ దంపతులను స్టేషన్కు పిలిపించి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అదే సమయంలో ఆసుపత్రి నిర్వాహకుల నుంచి శశికళ దంపతులకు నిర్వహించిన పరీక్షల రిపోర్టులను తెప్పించుకుని నిజనిర్దారణ కోసం నిపుణుల కమిటీకి పంపించారు. కమిటీ వెల్లడించే నివేదిక మేరకు తగిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు. శశికళ దంపతులు, పోలీసులు, డాక్టర్ పద్మజ తెలిపిన మేరకు వివరాలు.. ఆస్తి అమ్మి డబ్బులు చెల్లించాం బలిజ శశికళ, శ్రీనివాస్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ ‘మాది వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామం. 13 ఏళ్లుగా సంతానం కలగడం లేదు. డాక్టర్ పద్మజ సంతాన సాఫల్యం ప్రకటనలు చూసి గత జూన్లో అక్కడికి వెళ్లాం. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పద్మజ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానం పొందడానికి దంపతులిద్దరికీ అవకాశాలున్నాయని చెప్పింది. అందుకు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. గర్భం దాల్చే ప్రక్రియ విజయవంతం కాకపోతే మూడుసార్లు ఉచితంగా చేస్తామని, తప్పకుండా గర్భం వస్తుందని హామీ ఇవ్వడంతో మూడున్నర లక్షలు చెల్లించాం. వైద్యసేవలు అందిస్తున్న సమయంలో అదనంగా మరో లక్షన్నర విలువైన మందులు రాశారు. మొదటి సారి గర్భం దాల్చే ప్రక్రియ విజయవంతం కాలేదు. రెండవసారి చేయడానికి అండాలు చెడిపోయాయని, వాటికి మరో యాభైవేలు చెల్లించాలని తెలిపారు. పిల్లల కోసం ఉన్న ఆస్తితోపాటు పుస్తెల తాడు కూడా తాకట్టు పెట్టామని, ఇక డబ్బులివ్వలేమని చెప్పినా వినిపించుకోలేదు. సమయానికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇవ్వలేదు. దీంతో నా పూర్తిగా ఆరోగ్యం పాడైంది. గిట్లయిందేందని అడిగితే డాక్టరమ్మ ‘నువ్వెక్కువగా మాట్లాడుతున్నవని తిట్టింది. మీలాంటి వారికోసమే తుపాకీ లెసైన్స్ తీసుకున్నాం.. మా ఆయన వద్ద ఆ తుపాకీ ఉంది’ అంటూ బెదిరించింది. ‘ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరూ ఏమీ చేయలేరు. మాకు మంత్రులు, ఎస్పీ వంటి వారు తెలుసు’ అంటూ సెక్యూరిటీతో బయటకు గెంటేయించింది. ఏం చేయాలో తెలియక మేం డీఎంహెచ్వో కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినం. వినియోగదారుల మండలిని కూడా ఆశ్రయించినం. మీరైనా మాకు న్యాయం జరిగేలా చేయండి* అంటూ వేడుకున్నారు. వాళ్లే మమ్నుల్ని బెదిరించారు.. - డాక్టర్ పద్మజ వివరణ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ పద్మజ సాక్షితో మాట్లాడుతూ ‘శశికళ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా ఇప్పటికీ గర్భం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం గరిష్టంగా మూడుసార్లు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పాం. కానీ వాళ్లు ఒక్కసారి మాత్రమే పరీక్షలు నిర్వహించుకున్నారు. రెండోసారి పరీక్షలు నిర్వహిస్తుండగా మధ్యలోనే మానేశారు. పైగా పరీక్షల కోసం ఖర్చయిన డబ్బు మొత్తం ఇవ్వాలని లేనిపక్షంలో, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఇతరుల ద్వారా ఫోన్లు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయిస్తామని వేధించారు. దీంతో మేమే ఈ విషయంపై న్యాయస్థానం ద్వారా పోలీస్స్టే షన్ను ఆశ్రయించాం’ అని వివరించారు. వాస్తవానికి సంతానం కోసం తమ వద్దకు వచ్చేవాళ్లలో ఎనభై శాతం మంది ఫలితం పొందుతున్నారని, మొత్తం రూ.1.5 లక్షల నుంచి రూ.1.70 లక్షలు మాత్రమే ఇందుకు ఖర్చవుతోందని వెల్లడించారు. లెసైన్స్డ్ తుపాకీ అంశాన్ని ప్రస్తావించగా ‘మావద్ద లెసైన్స్డ్ గన్ ఉన్న మాట వాస్తవమే. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎవరినీ బెదిరించలేదు’ అని పేర్కొన్నారు. కేసును విచారిస్తున్నాం శశికళ దంపతులు తమను బెదిరిస్తున్నారని డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు న్యాయస్థానం ద్వారా ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా శశికళ దంపతులను పిలిచి వారి స్టేట్మెంట్ తీసుకున్నాం. అదే సమయంలో ఆ దంపతులకు నిర్వహించిన వైద్యపరీక్షల పత్రాలను సంబంధిత ఆసుపత్రి నుంచి సేకరించాం. నిజనిర్దారణ కోసం వైద్యనిపుణుల కమిటీకి పంపించాం. కమిటీ వెల్లడించే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం... - కరీంనగర్ టూటౌన్ సీఐ హరిప్రసాద్ మేం చేసేదేమీ లేదు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందడం రోగి, డాక్టర్ మధ్య ఒప్పందం ప్రకారం జరుగుతుంటుంది. ఇందులో డీఎంహెచ్ఓ చేసేదేమీ లేదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్, అర్హులైన డాక్టర్, ఆస్పత్రిలో వైద్యసేవలు, సౌకర్యాలు వంటివి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఉన్నాయా లేదా అనేది మేం పరిశీలిస్తాం. రోగికి డాక్టర్ అందించిన సేవలపై అనుమానం ఉంటే చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ప్రభుత్వ పరంగా ఫీజు, వైద్యసేవల ఖర్చులు వంటి వివరాలు అడిగే హక్కు మాకు లేదు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ చట్టం 2002 ప్రకారం నిబంధనలు అమలయ్యేలా మాత్రమే చూడడం మా పని. -డీఎంహెచ్ఓ అలీమ్ నోటీసు పంపిస్తున్నాం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పద్మజ సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ పద్మజకు నోటీసు పంపిస్తున్నాం. నోటీసులో బాధితురాలు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, వైద్యం వల్ల కలిగిన అనారోగ్యానికి కొంత సొమ్ము చెల్లించాలని కోరాం. ఆస్పత్రి నుంచి ఇచ్చిన బిల్లులు కూడా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. బిల్లు కింద అడ్రస్ మాత్రమే ఉంది. -ఎన్.శ్రీనివాస్, వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మార్చిలోనూ ఇదే తరహా ఫిర్యాదు పద్మజ సంతాన సాఫల్య కేంద్రంపై గత మార్చిలోనూ ఇదే తరహా ఫిర్యాదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)కు అందింది. ఈ ఏడాది మార్చి 2న ఆదిలాబాద్ జిల్లా జైపూర్కు చెందిన చీనూరి రాజబాబు, రమ దంపతులు పద్మజ సంతాన సాఫల్య కేంద్రంపై ఫిర్యాదు చేశారు. సంతానం కలిగిస్తామంటూ తమవద్ద రూ.2లక్షలు వసూలు చేసిన డాక్టర్ మిగిలిన రూ.1.75 లక్షలు సకాలంలో ఇవ్వలేదనే కారణంతో తమను దుర్భాషలాడటమే కాకుండా, మీలాంటి వాళ్లను తుపాకీతో కాల్చిపారేయాలని, రూంలో పడేసి తన్నాలంటూ బెదిరింపులకు గురిచేస్తూ ఆసుపత్రి నుంచి గెంటేయించారని రాజబాబు దంపతులు ఐఎంఏకు ఫిర్యాదు చేశారు. -
స్త్రీ వివక్ష తగదు
కిరణ్, పద్మజ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘వధుకట్నం’. గొట్టిముక్కల భార్గవ దర్శకుడు. షేక్ బాబూసాహెబ్ నిర్మాత. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘‘స్త్రీ వివక్ష నేపథ్యంలో సాగే కథాంశమిది. సమాజంలో మహిళల సంఖ్య తక్కువైతే ఎలా ఉంటుంది? అనే అంశానికి కామెడీని మిక్స్ చేసి ఈ కథ తయారు చేశాం’’ అని దర్శకుడు తెలిపారు. జనవరిలో పాటల రికార్డింగ్, ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. -
పింఛన్లు పీకేశారు
ఒంగోలు టౌన్ : వారంతా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. నెలనెలా వచ్చే పింఛనే ఆధారం. అలాంటి పింఛన్ను సర్వే పేరుతో పీకేశారు. అప్పటివరకూ అందుకున్న పింఛన్లకు వారిని అనర్హులను చేశారు. జాబితాల్లో ఉన్న పేర్లను ఏకపక్షంగా తొలగించారు. తమకు జరిగిన అన్యాయం గురించి వారంతా మండల అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఏకంగా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ విజయకుమార్ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఆ వివరాల ప్రకారం... చీమకుర్తి మండలం పీ నాయుడుపాలెం గ్రామంలో ఆ గ్రామ కమిటీ పింఛన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ గ్రామ సర్పంచ్, కార్యదర్శులు ఏకపక్షంగా వ్యవహరించి 75 మంది అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పేర్లను తొలగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికామన్న కారణంతోనే పింఛన్ల జాబితా నుంచి తమపేర్లు తొలగించారంటూ బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంతమంది పింఛన్లు తొలగించారా:కలెక్టర్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ను కలిసి తమ పింఛన్లు తొలగించారని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇంతమంది పింఛన్లు తొలగించారా అని అవాక్కయ్యారు. సర్వే నిర్వహించి తమ పేర్లను తొలగించారంటున్న బాధితుల్లో కొంతమంది 90 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు చూపించడంతో వారి పింఛన్ల తొలగింపునకు కారణాలు తెలియజేయాలని డీఆర్డీఏ పీడీ పద్మజను ఆదేశించారు. ప్రతిఒక్కరినీ విచారించి నివేదికలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
వ్యక్తిగత బ్యాంకు ఖాతా తప్పనిసరి
ఒంగోలు సెంట్రల్ : ప్రతి కుటుంబానికి వ్యక్తి గత ఖాతా తప్పనిసరని, అదే విధంగా జిల్లాలో ఎన్ని కుటుంబాలకు ఇప్పటి వరకూ వ్యక్తిగత ఖాతాలు ఉన్నాయో సర్వే నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఎ.పద్మజ ఆదేశించారు. గురువారం స్థానిక టీటీడీ కార్యాలయంలో ఐకేపీకి సంబంధించిన ఏసీలు, ఏపీఎంలతో ఆమె సమావేశమయ్యారు. జన్ధన్ పథకం కింద వ్యక్తిగత ఖాతాను ప్రారంభించిన వారికి రూపే డెబిట్ కార్డు అందిస్తారని, అదేవిధంగా లక్ష రూపాయల వరకు సంవత్సరం పాటు వ్యక్తిగత బీమా కల్పిస్తారని చెప్పారు. అగస్టు నెలలో రూ.223 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ రూ.76 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఆరు నెలల ముగింపు సందర్భంగా అర్హత కలిగిన ప్రతి గ్రూపునకు రుణం అందజేయాలన్నారు. తీసుకున్న రుణాలను రీపేమెంట్కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. ఉలవపాడు, సంతమాగులూరు, చినగంజాం మండలాల్లో రీపేమెంట్లు తక్కువగా ఉన్నాయన్నారు. మండలాల్లో బ్యాంక్ లింకేజిలో సమస్యలు ఉంటే బ్యాంక్ లింకేజి డీపీఎంకు తెలియజేయాలని సూచించారు. స్త్రీనిధి రికవరీలో బాగా వెనుకబడి ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో 56 మండలాలు ఉంటే వీటిలో 50 మండలాల్లో 70 శాతం కుడా రికవరీ కావడం లేదన్నారు. స్త్రీనిధి సంమృద్ధి పథకంలో భాగంగా రూ. 9 కోట్ల లక్ష్యం నిర్దేశిస్తే కేవలం 12 శాతం అంటే కోటి 12 లక్షలు మాత్రమే డిపాజిట్లు సేకరణ జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జన్ధన్ పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఎకౌంట్లు తెరిపించాలన్నారు. గ్రామాల్లో బ్యాంకింక్ సేవలను ప్రజల ముంగిట తెచ్చేందుకు విలేజ్ లెవల్ ఎంట్రిప్రూనర్స్ను నియమించిన్నట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్కు 24 మందిని, ఆంధ్రాబ్యాంక్కు 10 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి కావాల్సిన నెట్వర్క్ కార్డు, ల్యాప్టాప్, ప్రింటర్, వెబ్కామెరా, తదితర సామగ్రిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మండల అధ్యక్షులు సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రెండు జీరో బ్యాలెన్స్ ఎకౌంట్లను తెరిపించాలన్నారు. గ్రూపులు ఆడిట్ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. ఆడిట్ పూర్తి అయిన గ్రూపులకే గ్రేడింగ్లు ఉంటాయని, వడ్డీలేని రుణం వర్తిస్తుందన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ కింద 2,200 మందికి 7 కోట్ల విలువైన యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్దేశించగా 19 మండలాలు మాత్రమే పూర్తి చేసాయన్నారు. మిగిలిన 28 మండలాల్లో కుడా యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని పీడీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్డీఎం ఎల్.నరసింహారావు, డీపీఎంలు నరసింహారావు, విశాలాక్షి, ఎం.సుబ్బారావు, నారాయణ,తదితరులు పాల్గొన్నారు. -
రసం పీల్చే పురుగులతో అప్రమత్తంగా ఉండండి
పెనుమూరు: బొప్పాయి, బెండ, టమాట పంట లకు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయని, వీటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం పట్టు పరిశ్రమ శాఖ శాస్త్రవేత్త పద్మజ తెలిపారు. బుధవారం పెనుమూరు మండలంలోని సోమనందాపురం, కావూరివారిపల్లె తదితర గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. పద్మజ మాట్లాడుతూ రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోపిడ్ 0.5 మిల్లీలు లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్పారు. బొప్పాయి తోటల్లో పిండినల్లి ఆశిస్తోంద ని, రోగార్ 2 మిల్లీలు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పంట సాగుకు ముందే విత్తనశుద్ధి చేపడితే తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టవచ్చని వివరించా రు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త సుధాకర్ మాట్లాడుతూ మండలంలో సాగవుతున్న మల్బరీ తోట ల ద్వారా పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, ఎకరా పొలంలో మల్బరీ తోట సాగుకు సుమారు రూ.15 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖ ద్వారా మల్బరీ సాగు చేసిన రైతులను ప్రోత్సహించడానికి ఎకరాకు రూ.6,700 నగదు సబ్సిడీని చెక్కు రూపంలో అందిస్తోందని తెలిపా రు. తోట సాగుకు వేపపిండిని 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తోం దన్నారు. ఎకరా పొలంలో మల్బరీ తోట సాగు చేస్తే సుమారు 250 పట్టు గుడ్లును పెంచుకోవచ్చని చెప్పారు. రెండు నెలలకు ఓసారి 150 నుంచి 180 కిలోల పట్టు గూళ్లు ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మాణానికి పట్టు పరిశ్ర మ శాఖ రూ.లక్ష నగదు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. స్టాండ్లను రూ.16,500 సబ్సిడీపై ఇస్తున్నట్లు వెల్లడించా రు. పట్టు పురుగులు గూళ్లు కట్టే 250 నేత్రికలు రైతులకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. కిలో పట్టుగూళ్లు ఉ త్పత్తిచేస్తే రూ.50 సబ్సిడీ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ సాంకేతిక అధికారి వసంతరాయులు, మండల వ్యవసాయాధికారి సుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు జయంతి, నీలిమ పాల్గొన్నారు. -
ఆ.. బాలగోపాలం!
బృందావనమాలి.. ఈ బృందానికి నిత్య అతిథి. వేణుగానలోలుడు వీరి తెర వేలుపు. పౌరాణిక నాటకాలకు పుట్టినిల్లుగా శోభిల్లుతున్న సురభి కళా వేదికకు నల్లనయ్యు సుపరిచితుడు. ఆ ఉవ్ముడి కుటుంబానికి కన్నయ్యు ఉవ్ముడి ఆస్తి. ఈ నాటకవుండలిలోని పొత్తిళ్లలోని బిడ్డ కూడా రంగస్థలమెక్కేది.. వెన్నదొంగ వేషంతోనే. దేవకి పంటగా పుట్టినప్పటి నుంచి.. గోకులంలో చూపిన వూయులు.. బృందావనంలో చేసిన రాసలీలలు.. ద్వారక పాలకుడిగా.. బావ బండి తోలిపెట్టిన సారథిగా.. ఆ నందగోపాలుడి ఆనందలీలలు.. సురభి కళాకారులు వేస్తే చూడాల్సిందే.. వారు చెప్పే ఆ లీలలు వినాల్సిందే. కావ్యేశు నాటకం రమ్యం అని మహాకవి కాళిదాసు అంటే.. అందులో సురభి నాటకం రసరవ్యుం అంటారు కళాభివూనులు. రావుుడు, శివుడు, విష్ణువు ఇలా సురభికళాకారులు అభినరుుంచని పాత్రలు లేవు. ఇలా ఎన్ని అవతారాలెత్తినా.. జగన్నాటక సూత్రధారి పాత్రంటే వారికి ప్రాణం. ఆ గోపాల బాలుడు సురభి ఒళ్లో ఆడుకునే పసివాడు. ఏటా సువూరు 150కి పైగా కృష్ణావతారాలు ఉంటారుు వారి నాటకాల్లో. అందులో ఓ యూైభె సార్లు కృష్ణలీలలు, ఇంకో వందసార్లు వూయూబజార్ నాటకం కోసం ఆ కళాకారులు నల్లనయ్యును ఆవాహన చేసుకుంటారు. అద్భుతనటనా విన్యాసంతో సాక్షాత్త్తూ ఆ పరవూత్ముని కళ్ల ముందుంచుతారు. సురభి ముంగిట ముత్యం బారసాల పూర్తరుున వెంటనే సురభి పిల్లలు జీవించేది నాటకంలోనే. అదీ.. కంసుడి చెరసాలలో పుట్టిన పాలబుగ్గల బాలకృష్ణుడి రూపంలో! అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నెలు దొంగిలిస్తూ సురభి బాలల చూపే అభినయుం.. ఆ యుశోదవ్ముకు బాలకృష్ణుడిని జ్ఞప్తికి తెస్తుంది. కాళీయు పడగలపై నాట్యవూడే సన్నివేశం చూస్తే ఆబాలగోపాలం ఆ బాల గోపాలుడిని తన్మయుత్వంతో చూస్తూ ఉండిపోవాల్సిందే. గోవర్ధన గిరినెతే ్త సన్నివేశానికి గోకులవుంతా దాసోహం కాకతప్పదు. కురుక్షేత్రంలో వీళ్ల విశ్వరూపానికి అసలు కృష్ణుడు సైతం చేతులు జోడిస్తాడేమో.. అదీ సురభి ప్రత్యేకత. కృష్ణుడు వాళ్లకు ఓ పురాణ పురుషుడు కాదు.. వాళ్లింటి బిడ్డ. అందుకే సురభివుూర్తులు శ్రీకృష్ణపాత్రలో అంతలా లీనవువుతారు. తాడుచ్చుకుని కొట్టింది.. ఈ నటనసూత్రధారి పాత్రను అంతలా పండిస్తున్న ప్రస్తుత సురభి కళాకారులు.. పద్మశ్రీ సురభి నాగేశ్వర్రావు (సురభి బాబ్జి), ఆర్.పద్మజ. ‘మేం నేర్చుకున్న తొలి పద్యం కృష్ణపాత్రదే. నాకు నాలుగేళ్లున్నప్పుడు ‘కృష్ణలీలలు’లో చిన్నికృష్ణుడిగా నటించా. యుశోదగా వూ అవ్ము సుభద్రవ్ము, పూతనగా వూ వదిన నటించారు. పూతన కోసం రాక్షసి రూపంలో ఓ వూస్క్ తయూరు చేశారు. పూతన ఒళ్లో ఉండి పాలు తాగేటప్పుడు ఒక్కసారిగా లైట్లు ఆరిపోతారుు. వుళ్లీ లైట్లు వె లిగే సరికి వూ వదిన రాక్షసి వూస్క్లో దర్శనమిచ్చింది. అంతే స్టేజ్మీదే పరిగెత్తా. జనాలు అదీ నాటకంలో భాగమే అనుకున్నారు. తెరదించాక.. వూ అవ్ము తాడిచ్చుకుని కొట్టింది’అని గతం గుర్తు చేసుకున్నారు సురభి నాగేశ్వర్రావు. నారీనారీ.. మెరిసె మురారి సురభిలో కృష్ణుడి వేషాలకు సాధారణంగా మహిళలే ప్రసిద్ధి. కాస్త గాంభీర్యం.. ఇంకాస్త నయుగారం.. అంతకుమించి ఒయ్యూరం.. ఇవన్నీ ఆడవాళ్లు అవలీలగా ఒలికించగలరు. అలాంటి కీర్తి సాధించిన ఈ తరం కళాకారిణి ఆర్.పద్మజ. ‘నా చిన్నతనంలో వూ అవ్మువ్ము వేసిన కృష్ణపాత్ర చూసి ఎలాగైనా నేనూ ఆ పాత్ర చేయూలని కలలు కనేదాన్ని. తర్వాత చాలా కాలం ఆ పాత్ర వూ పెద్దనాన్న పోషించారు. అనారోగ్యం కారణంగా ఆయున ఆ పాత్ర వేయులేని పరిస్థితి వచ్చింది. అప్పుడు కృష్ణుడి వేషం వేస్తానని నేను వుుందుకొచ్చాను. విగ్గు.. బరువైన కిరీటం.. ఒంటికి పూసుకున్న నీలిరంగుతో విపరీతమైన వేడి.. ఇవేవీ తెలియునీయుకుండా అభినరుుంచాలి. 1995 నుంచి ఇప్పటి వరకు కృష్ణుడి వేషం నాదే’ అని తన జ్ఞాపకాలు పంచుకున్నారు పద్మజ. ఒక్క కృష్ణపాత్రే కాదు.. పురాణపాత్రలన్నీ సురభి కుటుంబంలో సభ్యులే. వాళ్ల కష్టసుఖాల్లో భాగస్వావుులే. కళను గుర్తించకపోరుునా.. కనీసం తవు కుటుంబం సాగిస్తున్న సవుష్టి జీవన విధానాన్ని అరుునా గుర్తించాలని కోరుతున్నారు సురభి కళాకారులు. -సరస్వతి రమ -
మహిళలు రాణించాలి
సంచార చిత్ర ప్రదర్శనను తిలకించిన మహిళలు: సత్యవేద మహిళా మండలి ఆధ్వర్యంలో బ్రూణహత్యలు నివారిం చండి.. ఆడపిల్లలను కాపాడండి.. అనే నినాదంతో సంచార చిత్ర ప్రదర్శన చేపట్టింది. కార్యక్రమాన్ని జడ్జి పద్మజ ప్రారంభించారు. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: మహిళలు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణించాలని స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి పద్మజ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం మహిళా చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తూ పలువురు ప్రసంగించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 6, 7 తేదీల్లో మహిళా ఉద్యోగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలిచినవారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి పద్మ మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించేందుకు, మహిళా హక్కులను కాపాడేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. పధాన వక్త, అభ్యుదయవాది, రిటైర్డ్ తెలుగు లెక్చరర్ డాక్టర్ ఎన్.శాంతమ్మ మాట్లాడుతూ మహిళలు ఇంకా వివక్షతకు, వేధింపులకు గురువుతున్నారని ఆవేదన చెందారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ ముత్యాలమ్మ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయకుమారి, సరస్వతి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సహకారంతో ఏటా మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవీ శ్యామల, మహిళా ఉద్యోగుల సంఘం నేతలు అనంతలక్ష్మి, ఉషావర్దిని, జ్ఞానేశ్వరమ్మ, ఆశాలత, మీనాక్షి దేవి, సరళమ్మ, అరుణ తదితరులు ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ఈ వికలాంగుడు చనిపోయాడట!
ఎమ్మిగనూరురూరల్, న్యూస్లైన్: రోడ్డుపై ఓ వికలాంగులు అష్టకష్టాలు పడుతూ నడుచుకుంటూ వస్తున్నాడు కదూ.. మనందరికీ కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని అధికారులు మాత్రం చూడలేకపోతున్నారు.. మండల పరిధిలోని మసీదపురానికి చెందిన వికలాంగులు నరసింహులు 2012 జూన్లోనే చనిపోయాడంటూ అధికారులు పింఛన్ను రద్దు చేశారు. తాను బతికే ఉన్నానని.. పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని కోరుతున్నా వారికి పట్టడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం మళ్లీ ఎంపీడీఓ పద్మజను ఆమె కార్యాలయంలో కలిసి ఫించన్ మంజూరు చేయాలని కోరాడు. అధికారులు మాట్లాడుతూ ‘డీఆర్డీఏ అధికారులకు వివరాలు పంపాం.. వస్తే ఇస్తాం’ అంటు సమాధానమిచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కంప్యూటర్లో తన పింఛన్ ఐడీ నం. 503447 కొడితే చనిపోయినట్లు వస్తుందని వాపోయాడు. మూడు చక్రాల వాహనం కూడా లేదని, జిల్లా అధికారులు స్పందించి తనకు పింఛన్, ట్రైసైకిల్ ఇవ్వాలని కోరాడు.