Parliamentary Standing Committee
-
పంచాయతీ ఎన్నికల జాప్యం.. సంక్షేమానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల జాప్యం కారణంగా ప్రజాభివృద్ధికి విఘాత కలుగుతోందని పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అభివృద్ధి నిధులు నిలిచిపోయాయని గుర్తుచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తమ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (2025–26) నివేదికను బుధవారం పార్లమెంట్కు సమర్పించింది. ఇందులో పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ‘73వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఈ(3) ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఆ గ్రామపంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదంటే రద్దయ్యాక ఆరు నెలల వ్యవధిలోపు పూర్తి చేయాలి. ఒక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాల్సిన రాజ్యాంగపరమైన నిబంధన’ అని కమిటీ పేర్కొంది. ‘‘ పుదుచ్చేరి (2011), కర్ణాటక (2021), మహారాష్ట్ర (2022), మణిపూర్ (2022), లక్షద్వీప్ (2022), అస్సాం(2023), జమ్మూకశ్మీర్ (2023), లద్దాఖ్ (2023)లలో వివిధ కారణాల వల్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్లలో 2024 ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంకా నిర్వహించలేదు’’ అని కమిటీ తెలిపింది. ఈ విషయంలో సంబంధిత రాష్ట్ర హైకోర్టు, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయని తెలిపింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం వల్ల గ్రామ అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలకు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆగిపోయాయని పేర్కొంది. ‘‘ఈ గ్రాంట్లు, నిధులు మంజూరు పంచాయతీలకు సకాలంలో సాకారం అయి ఉంటే ఆయా గ్రామాల ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ఫలాలను అందుకుని ఉండేవారు’’ అని కమిటీ వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగా నిధుల లభ్యత లేకపోవడంతో గ్రామాల్లో ప్రజల పరిస్థితి మెరుగ్గా లేదని రాష్ట్రాల పర్యటనల్లో తేలినట్లు కమిటీ పార్లమెంట్ దృష్టికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేలా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సత్వరం అత్యున్నత స్థాయి చర్యలు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.‘ఉపాధి’కి నిధులు పెంచాలిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి నిధులు పెంచాలని, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ‘ గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ గ్రామీణ ఉపాధి పథకానికీ కేటాయింపులు తగ్గాయి. ఇప్పుడు కేవలం రూ.86,000 కోట్ల కేటాయింపులు చేశారు. గ్రామాల్లో తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న గ్రామీణులకు ఉపాధిహామీ పథకం ఇన్నాళ్లూ కీలకమైన రక్షణచట్రంగా నిలిచింది. కరోనా కాలంలో కోట్లాది మంది పేదలను ఈ పథకం ఆదుకుంది. అణగారిన వర్గాలకు ఉపాధిని కల్పించే ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయడం చాలా అవసరం. అందుకే ఈ పథకానికి కేటాయింపులు సమధికంగా పెంచాలి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖపై గ్రామీణాభివృద్ధి శాఖ ఒత్తిడి తీసుకురావాలి’’ అని కమిటీ సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయం, గ్రామీణ కార్మికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రోజువారీ వేతన రేట్లు తగిన విధంగా సవరించాలని సూచించింది. -
దేశంలో కొత్తగా 10 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా పది అణువిద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీలో ఈ వివరాలను సభ్యులకు అందజేసింది. 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో గుజరాత్, రాజస్తాన్, హరియాణాల్లో వీటిని నెలకొల్పారు. గుజరాత్లోని కాక్రపార్లో రెండు అణు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి మొదలైందని కేంద్రం పేర్కొంది. అయితే వీటి నిర్మాణం చాలా ఆలస్యమవుతోందని కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘2007లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి కావస్తుండటం గ్రేట్. ‘సుప్రీం నేత’ కనుసన్నల్లో అభివృద్ధి వేగానికిది నిదర్శనం’’ అని ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. కాక్రపార్–3, కాక్రపార్–4 రియాక్టర్లు కాంగ్రెస్ హయాంలోనే ఆమోదం పొందాయన్నారు. -
పార్లమెంటరీ కమిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీలకు చోటు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు నియమితులయ్యారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి.. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డిలకు చోటు దక్కింది.పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గొల్ల బాబురావు, కెమికల్ ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మేడ రఘునాథ్ రెడ్డి.. గృహ పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గుమ్మ తనుజారాణి, పెట్రోలియం నాచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గురుమూర్తి, కమ్యూనికేషన్స్ ఐటి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నిరంజన్ రెడ్డి నియమితులయ్యారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు -
స్టాండింగ్ కమిటీల ఏర్పాటు కొలిక్కి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్సభకు సంబంధించి వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల కూర్పు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. లోక్సభ పరిధిలోని 16, రాజ్యసభ పరిధిలోని 8 విభాగాల స్టాండింగ్ కమిటీల్లో తమకు కనీసంగా 5 కమిటీలకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచి్చంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్లు కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, జైరాం రమేశ్ తదితరులతో చర్చించారు. 5 కమిటీలతో పాటు, కమిటీల్లో అత్యంత కీలకమైన హోంశాఖను కాంగ్రెస్ కోరింది. అయితే హోంశాఖను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో మూడింటికి ఓకే చెబుతూనే.. విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృధ్ధి– పంచాయతీరాజ్, వ్యవసాయం వంటి కీలక విభాగాల స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ ఎంపీలను ఛైర్మన్లుగా నియమించేందుకు అంగీకరించింది. ఇక రాజ్యసభ కమిటీల్లో విద్యా శాఖను అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం దీన్ని ధృవీకరించాయి. -
GST Council meet: ఎరువులపై జీఎస్టీ తగ్గించేనా?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి భేటీ అవుతోంది. ఎరువులపై సబ్సిడీ రేటు తగ్గించాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనతోపాటు, ఆన్లైన్ గేమింగ్పై పన్ను అంశాలు శనివారం నాటి సమావేశంలో చర్చకు రానున్నాయి. 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీకి కేంద్ర ఆరి్థక మంత్రి అధ్యక్షత వహిస్తుండగా, రాష్ట్రాల ఆరి్థక మంత్రులు సైతం పాల్గొననున్నారు. జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల రేట్లను కుదించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా, దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇప్పటి వరకు సాధించిన పురోగతి సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎరువులపై జీఎస్టీలో 5 శాతం రేటు అమలవుతోంది. ఎరువుల తయారీలోకి వినియోగించే సల్ఫూరిక్ యాసిడ్, అమ్మోనియాపై 18 శాతం రేటు అమల్లో ఉంది. ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి సరుకులతోపాటు పంట పోషక ఉత్పత్తులపైనా రేటు తగ్గించాలని ఈ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎరువులపై రేట్ల తగ్గింపు ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ 45వ, 47వ సమావేశాల అజెండాల్లో చోటు కలి్పంచినప్పటికీ.. ఈ దిశగా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరిగా జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం గతేడాది అక్టోబర్ 7న జరగడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, పందేల మొత్తంపై 28 శాతం జీఎస్టీ రేటు 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష చేపడతామని అప్పట్లోనే మండలి ప్రకటించింది. దీంతో ఇది చర్చకు వస్తుందని భావిస్తున్నారు. -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం(స్టాండింగ్ కమిటీ) సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ మరో ఎంపీ అమర్సింగ్ కూడా ఇదే కమిటీకి నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్సభ ఒక బులెటిన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ ఎంపీ ఫైజల్ పి.పి.మొహమ్మద్ లోక్సభ సభ్యతాన్ని కూడా పునరుద్ధరించారు. ఆయనను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు. -
యూసీసీ బిల్లు.. కేంద్రం వడివడి అడుగులు
ఢిల్లీ: ఒకే దేశం.. ఒకే చట్టం నినాదంతో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) బిల్లును వీలైనంత త్వరగా చట్ట రూపంలోకి తేవాలని తేవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు యూసీసీ(Uniform Civil Code) బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది. జులై 17వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే అభిప్రాయసేకరణలో భాగంగా లా కమిషన్ ఒక నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసి.. అభిప్రాయసేకరణ ద్వారా వీలైనంత త్వరగా బిల్లు ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ► బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన 31 సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. అఖిలపక్ష అభిప్రాయం కోసం జులై 3వ తేదీన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల UCC గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ► ఉమ్మడి పౌర స్మృతి అంశంపై భోపాల్లో తాజాగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూనే.. ఇంతా నెలరోజుల గడువులోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. యూసీసీ బిల్లు కోసం కేంద్రం వేగం పెంచింది. మరోవైపు జూన్ 14వ తేదీనే లా కమిషన్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మత సంస్థల అభిప్రాయ సేకరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా సమగ్ర పద్ధతిలో తాము ముందుకెళ్తున్నట్లు కమిషన్ దేశానికి చాటి చెబుతోంది. అదే సమయంలో.. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించి, అనంతరం దానిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించే అవకాశం ఉందని, వివిధ వర్గాల వాదనలను ఆ కమిటీ స్వీకరిస్తుందని తెలుస్తోంది. ► బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్తోంది. అయితే.. ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్కు ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపగా, కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింసాకాండ వంటి సమస్యలు ఉన్నాయని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారని దుయ్యబడుతున్నాయి. ఒకే రకమైన చట్టం ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి.. దేశం మొత్తం పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. మత చట్టాలు పక్కనపడిపోతాయి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. అయితే యూసీసీపై పలు అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం.. ఆ కేసుతోనే మలుపు! -
సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో అందించే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం చొప్పున అన్ని రైళ్లలోని అన్ని తరగతుల్లోనూ రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దీన్ని రద్దు చేశారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ డిమాండ్ ఫర్ గ్రాంట్లపై సోమవారం పార్లమెంట్కు సమర్పించిన 14వ నివేదికలో దీన్ని ప్రస్తావించింది. ఈ రాయితీని పునరుద్ధరించాలని కోరింది. కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీకైనా వర్తింపజేయాలని సూచించింది. అయితే అలాంటి యోచనేదీ లేదని రైల్వే శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇప్పటికే టికెట్ ధరపై 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. వందేభారత్ రైళ్ల ఉత్పత్తిపై ఆందోళన వందేభారత్ రైళ్ల తయారీ మందగమనంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘2022–23లో 35 రైళ్లు తయారవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 8 రైళ్లే సిద్ధమయ్యాయి. లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, రైలు ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరాలన్నా వందేభారత్ రైలు ఇంజన్లు, బోగీల తయారీ వేగాన్ని ముమ్మరం చేయాలి. ఇందుకోసం పలు ప్రాంతాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేశాఖ సాంకేతిక తోడ్పాటు అందించాలి’’ అని సూచించింది. -
అనుసంధానికి ఆ ఐదు అంశాలే ఆటంకం!
సాక్షి, అమరావతి: రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం వల్లే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్గంగా–పింజాల్, పర్–తాపి–నర్మద సహా దేశంలో ప్రాధాన్య నదుల అనుసంధానం ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. కేవలం ఐదు అంశాలు మాత్రమే దీనికి ప్రధాన కారణమని తేల్చింది. సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించి.. నదులను అనుసంధానం చేయడం ద్వారా సముద్రంలో కలుస్తున్న జలాలను మళ్లించి దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందిస్తూ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశామని.. కెన్–బెట్వా తరహాలోనే మిగతా ప్రాధాన్యత నదుల అనుసంధానం ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఎంపీ పర్భాత్భాయ్ సవాభాయ్ పటేల్ అధ్యక్షతన జల వనరుల విభాగంపై 31 మంది లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బడ్జెట్ కేటాయింపులు, వినియోగం, పనుల ప్రగతిని సమీక్షించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇటీవల నివేదిక ఇచ్చింది. కెన్–బెట్వా తరహాలోనే చేస్తాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై కేంద్ర జల్శక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయంతోనే కెన్–బెట్వా నదుల అనుసంధానం చేపట్టామని పేర్కొంది. ఆ నదుల అనుసంధానం తొలి దశ పనులకు 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లు వ్యయం అవుతుందని, ఇందులో 90 శాతం అంటే రూ.39,317 కోట్లు కేంద్రం సమకూర్చుతోందని వెల్లడించింది. మిగతా 10శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సమకూర్చుతాయంది. ఇదే రీతిలో ప్రాధాన్యత నదుల అనుసంధానం పనులను చేపడతామని హామీ ఇచ్చింది. నివేదికలోని ప్రధానాంశాలివీ.. ► కేంద్రం ప్రాధాన్యతగా ప్రకటించిన గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్గంగా–పింజాల్, పర్–తాపి–నర్మదా నదుల అనుసంధానానికి ప్రధానంగా ఐదు అంశాలు అడ్డంకిగా మారాయి. ► రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించకపోవడం, ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం, నిధుల కొరత, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ–నిర్వాసితులకు పునరావాసం కల్పన అంశాలు నదుల అనుసంధానం ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణాలు. ► ప్రయోజనం పొందే రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించి ఏకాభిప్రాయ సాధనపై కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తే నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుంది. ► నిధుల్లో సింహభాగం వాటాను కేంద్రం ఇవ్వడం, పన్ను రాయితీలను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను నదుల అనుసంధానానికి ఒప్పించవచ్చు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానంపై పీఠముడి ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) నదుల్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదించింది. ఆవిరి నష్టాలు పోనూ మూడు రాష్ట్రాలకు 80 టీఎంసీల చొప్పున ఇచ్చేలా ప్రతిపాదనలో పేర్కొంది. ఈ పనులకు రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రతిపాదనపై ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు నీటిని ఎలా తరలిస్తారని ఎన్డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో ఇచ్చంపల్లి నుంచి ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు 40 టీఎంసీల చొప్పున, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఎన్డబ్ల్యూడీఏ చేసింది. ఈ పనులకు రూ.45 వేల కోట్ల వ్యయం అవుతుందని లెక్కకట్టింది. దీన్ని కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. గోదావరిలో నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని కేంద్రానికి తేల్చి చెప్పాయి. -
రసాయనాలు, ఎరువుల శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా థరూర్
న్యూఢిల్లీ: రసాయనాలు, ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ నేత శశి థరూర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. థరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ సూచించిందని సమాచారం. పార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలో మలికార్జున ఖర్గేపై శశిథరూర్ పోటీకి దిగిన సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం థరూర్ పేరును ప్రతిపాదించడం గమనార్హం. థరూర్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి సారథ్యం వహించారు. ఈ కమిటీలో కాంగ్రెస్కు చెందిన ఎంకే విష్ణు ప్రసాద్కు చోటు కల్పిస్తూ లోక్సభ సెక్రటేరియట్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో రసాయనాలు, ఎరువులతోపాటు వాణిజ్యం, పర్యావరణ స్టాండింగ్ కమిటీలకు మాత్రమే కాంగ్రెస్ నేతృత్వం వహించనుంది. -
సీఎం జగన్కు రుణపడి ఉంటా: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వైఎస్సార్పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. తన నియామకం పట్ల విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్ఖడ్కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఈ స్థాయికి చేరడానికి కారకులైన సీఎం జగన్కు రుణపడి ఉంటానన్నారు. తనపై అపార విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (గుడ్న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’) -
పార్లమెంటరీ స్థాయీ సంఘాల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునర్వ్యస్థీకరించింది. చైర్మన్ పదవులు అధికార బీజేపీ, మిత్రపక్షాలకే దక్కాయి. ప్రతిపక్షాలకు మొండిచెయ్యి ఎదురయ్యింది. ఇన్నాళ్లూ వివిధ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్గా పనిచేసిన ప్రతిపక్ష ఎంపీలను తొలగించారు. హోంశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింఘ్వీని తొలగించి, బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ను నియమించారు. ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను తొలగించారు. షిండే వర్గం శివసేన ఎంపీ ప్రతాప్రావు జాదవ్ను నియమించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్గోపాల్ యాదవ్ను పక్కనపెట్టారు. పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నుంచి డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీ, రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క చైర్మన్ పదవి లభించలేదు. -
సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంకక్షోభ సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్ల రైల్వే రాయితీ పొందే తరుణం రానుంది. ఈ మేరకు వారికి రాయితీ ఛార్జీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున, వివిధవర్గాలకు చెందిన ప్రయాణికులకు గతంలో అందించిన రాయితీలను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని కమిటీ కోరింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీ ఛార్జీల రాయితీ పునరుద్ధరణపై ఆలోచించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. వారికి స్లీపర్ క్లాస్, ఏసీ-3 కేటగిరీల్లో మొత్తం ఛార్జీలో 40 శాతం నుండి 50 శాతం వరకు రాయితీని అందించాలని సిఫార్సు చేసింది. గతవారం ఆగస్టు 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఈ మేరకు పేర్కొంది. అయితే రాయితీ పునరుద్ధరణపై రైల్వే శాఖ అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సీనియర్ సిటిజన్లు,జర్నలిస్టులకు అందించే రైల్వే ఛార్జీల రాయితీలు 2020 మార్చి 20నుంచి రద్దైన సంగతి తెలిసిందే. బీజేపీ లోక్సభ ఎంపీ రాధామోహన్ సింగ్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. -
స్టాండింగ్ కమిటీకి ‘విద్యుత్’ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే వివాదాస్పద విద్యుత్ సవరణ బిల్లు–2022ను విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. రైతు వ్యతిరేక బిల్లు అన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూనే బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ లోక్సభలో ప్రకటించారు. సోమవారం ముందుగా లోక్సభలో విపక్ష పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ బిల్లును సింగ్ ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధం: అధిర్ రంజన్ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. బిల్లుతో కేంద్ర పెత్తనం పెరిగి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతోంది. తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, పంజాబ్తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో మాట తప్పి బిల్లును ప్రవేశపెట్టారు’ అని అ«ధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి సింగ్ ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇకపైనా కొనసాగుతుంది. ఈ బిల్లు రైతు సంక్షేమ, ప్రజాహిత బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని విద్యుత్ మంత్రి సింగ్ అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఓటింగ్కు డిమాండ్ చేశాయి. అయితే స్పీకర్ ఓం బిర్లా సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చుంటే ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పలువురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వెంటనే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరగా, స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్ర మంత్రి అనుమతి కోరగా, స్పీకర్ అనుమతి ఇచ్చారు. దీనికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. విద్యుత్రంగ ఉద్యోగుల నిరసన బాట విద్యుత్రంగ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం లక్షలాది మంది విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు సోమవారం నిరసన గళం వినిపించారు. దేశంలోని అన్ని విద్యుదుత్పాదక సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్లుసహా మొత్తం దాదాపు 27 లక్షల మంది సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలకు చరమగీతం పాడే, రైతులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారిన బిల్లులోని అంశాలను వెంటనే తొలగించాలని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమాండ్చేశారు. ‘బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నెట్వర్క్ను వాడుకుంటూ కొత్త ప్రైవేట్ సంస్థ లాభాలు తెచ్చే వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకే విద్యుత్ అందించే ప్రమాదముంది. మొండి బకాయిలుగా మారే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ఇవ్వాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం అందరికీ సరఫరా చేయాల్సిందే. దీంతో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాలపాలవుతాయి’ అని దూబే అన్నారు. -
‘బేటీ బచావో బేటీ పడావో’ నిధులు ప్రచారానికేనా?
న్యూఢిల్లీ: 2016 నుంచి 2019 వరకూ ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకానికి విడుదల చేసిన రూ.446.72 కోట్లలో 78 శాతానికి పైగా నిధులను కేవలం మీడియాలో ప్రచారానికే ఖర్చు చేయడం పట్ల పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలికల విద్య కోసం వ్యయం చేయాల్సిన సొమ్మును ప్రకటనలపై వెచ్చించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. మహిళా సాధికారతపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తాజాగా తన నివేదికను లోక్సభకు సమర్పించింది. ఈ పథకం అమలు తీరుపై జిల్లా స్థాయిలో ఏదైనా సామాజిక సంస్థ లేదా థర్డ్ పార్టీ/నిపుణులతో సోషల్ ఆడిట్ కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. -
బొర్రా అందాలు అమోఘం
అనంతగిరి/అరకులోయ రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహల అందాలు అమోఘంగా ఉన్నాయని కమిటీ ఆఫ్ స్టడీ ఆన్ పబ్లిక్ సెక్టార్పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్ గన్వర్ చెప్పారు. ఆదివారం ఆయన, కమిటీ సభ్యులు జనార్దన్మిశ్రా, ఓంప్రకాష్ మాతుర్, పార్లమెంట్ సెషన్స్ సెక్రటరీ త్రిపాఠి బొర్రా గుహలు, అరకులోయను సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. గైడ్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అరకులో గిరిజన సంప్రదాయ థింసా నృత్యాల నడుమ కమిటీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం తిలకించారు. పర్యాటకశాఖ నుంచి బొర్రా పంచాయతీకి రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిటీకి బొర్రా సర్పంచ్ అప్పారావు వినతిపత్రం అందజేశారు. బొర్రా నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వేట్రాక్ వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ పర్యటన సందర్భంగా అరకులోయ సీఐ దేముడుబాబు నేతృత్వంలో అనంతగిరి, అరకులోయ ఎస్ఐలు రాము, నజీర్ బందోబస్తు నిర్వహించారు. తహసీల్దారులు వెంకటవరప్రసాద్, వేణుగోపాల్, ఎంపీడీవోలు నగేష్, రాంబాబు, ఏరియా సూపరింటెండెంట్ హరి, అనంతగిరి పీహెచ్సీ వైద్యాధికారి అనూషారావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేదెన్నడు?
న్యూఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదని వ్యవసాయం, పశుసంవర్థక, ఆహార శుద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తేల్చిచెప్పింది. 2015–16 నుంచి 2018–19 మధ్యకాలంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో రైతుల ఆదాయం పడిపోయిందని వెల్లడించింది. ఈ మేరకు స్థాయీ సంఘం తన నివేదికను గురువారం పార్లమెంట్కు అందజేసింది. ఇందుకు గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖకు సూచించింది. చాలా రాష్ట్రాల్లో రైతాంగం ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ చోద్యం చూస్తుండడం శోచనీయమని తప్పుపట్టింది. బడ్జెట్లో కేటాయించిన నిధులను వ్యవసాయ శాఖ పూర్తిగా ఖర్చు చేయలేకపోతోందని ఆక్షేపించింది. దేశంలో ఆరు ‘ఎయిమ్స్’ల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవడం పట్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. భోపాల్, భువనేశ్వర్, జో«ద్పూర్, పట్నా, రాయ్పూర్, రిషికేశ్ ఎయిమ్స్ల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని వెల్లడించింది. -
చట్టబద్ధమైన అధికారాలతో మీడియా కౌన్సిల్
న్యూఢిల్లీ: దేశంలో మీడియా తన విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అవకతవకలు, అక్రమాలను అరికట్టడానికి చట్టబద్ధమైన అధికారాలతో కూడిన మీడియా కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని బుధవారం ప్రతిపాదించింది. మీడియాలో నకిలీ వార్తల బెడద పెరిగిపోతుండడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సును త్వరగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘వార్తల ప్రచురణ/కవరేజీలో నైతిక విలువలు’ పేరిట ఒక నివేదికను పార్లమెంట్లో సమర్పించింది. -
శ్రీనివాస్ గౌడ్ వర్సస్ టీజీ వెంకటేశ్
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఆస్తులు హైదరాబాద్లో ఉంటాయి.. కానీ, హైదరాబాద్, తెలంగాణ గురించి మాట్లాడితే వినే ఓపిక లేదా’ ‘మీటింగ్కు–మీరు మాట్లాడే విషయానికి ఏమైనా సంబం ధం ఉందా? ఎజెండా ఏంటో దానిపైనే మాట్లాడాలి.. అనవసర విషయాల ప్రస్తావనెందుకు’ తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ – ఆంధ్రప్రదేశ్ ఎంపీ టీజీ వెంకటేశ్ మధ్య జరిగిన వాదన ఇది. ఓ కీలక సమావేశంలో పలువురు ఎంపీలు, అధి కారుల సమక్షంలో ఇద్దరి మధ్య మాటామాట చోటుచేసుకుంది. ఓ దశలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న దాకా వెళ్లింది. చివరకు తెలంగాణ ఉద్యమ సమయ ప్రస్తావన కూడా చోటు చేసుకుంది. ఇతర ఎంపీల జోక్యం చేసుకోవటంతో వివా దం సద్దుమణిగినా.. ఆ సమావేశంలో మరి కొంత సేపు ఉండాల్సి ఉన్నప్పటికీ అర్ధాంతరంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ నిష్క్రమించారు. ఇదీ విషయం...: రవాణా, సాంస్కృతిక–పర్యాటక శాఖల పార్లమెం టరీ స్థాయీ సంఘం బుధవారం హైదరాబాద్కు వచ్చింది. ఆ కమిటీ పరిధిలోని శాఖల పనితీరును పరిశీలిస్తూ, కేంద్రం నుంచి ఉండాల్సిన సహకారం, ప్రాజెక్టులకు బ్యాం కుల రుణాలు.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది. మాదాపూర్లోని ఓ స్టార్ హోటల్లో ఈ కమిటీ చైర్మన్, ఎంపీ టీజీ వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. సమావేశం దాదాపు గంటన్నర ఆలస్యంగా మొదలైంది. తొలుత పర్యాటక, సాంస్కృతిక శాఖపై చర్చ ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, పనుల గురించి మాట్లాడారు. సమావేశం బాగా ఆలస్యమైనందున ఎక్కువ సమయం తీసుకోవద్దని టీజీ వెంకటేశ్ రెండు పర్యాయాలు మం త్రికి సూచించారు. దీనికి మంత్రి శ్రీనివాస్గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. సమావేశంలో అలా గట్టిగా మాట్లాడటం కరెక్టు కాదని చెప్పి ఎం పీలు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఆ వెంటనే శ్రీనివాస్గౌడ్ సభ నుంచి నిష్క్రమించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 27 మంది ఎంపీలు, స్థానిక అధికారుల సమక్షంలో ఇది జరగడం గమనార్హం. -
దేశంలో వీపీఎన్ సర్విస్ బ్యాన్ కానుందా..?
సైబర్ బెదిరింపులు & ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉన్న వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవల(వీపీఎన్)ను మన దేశంలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిషేధించాలని చూస్తున్నట్లు సమాచారం. మీడియానామా మొదట నివేదించినట్లుగా వీపీఎన్ యాప్స్, సాధనాలు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉన్నాయని, దీంతో నేరస్థులు ఆన్లైన్లో అనామకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే దాని వాడకాన్ని నిషేదించాలని కోరుతున్నట్లు కమిటీ హైలైట్ చేసింది. భారతదేశంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో దేశంలో వీపీఎన్ సేవలను శాశ్వతంగా నిషేదించాలని కమిటీ సీఫారసు చేస్తుందని నివేదిక వెల్లడించింది. వీపీఎన్లను గుర్తించడానికి, శాశ్వతంగా నిరోధించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని కమిటీ హోం మంత్రిత్వ శాఖను కోరింది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది. వీపీఎన్ అంటే ఏమిటి? వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ అని కూడా అంటారు. సాధారణంగా మనం ఇంటర్నెట్ లో ఏ పనిచేసిన.. ఫేస్బుక్ చూసిన, యూట్యూబ్ చూసిన, వెబ్సైట్లను సందర్శించినా.. ఇతర ఏవైనా పనులు చేసినా హ్యాకర్లు మన డేటాను తస్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన డేటా సురక్షితంగా ఉండేందుకు వీపీఎన్ పనికొస్తుంది. అంటే, మనకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య సురక్షితమైన కనెక్షన్ సృష్టిస్తుంది. మీ ట్రాఫిక్ ఎన్ క్రిప్ట్ చేయబడ్డ ఛానల్ ద్వారా రూట్ చేస్తుంది. ఇది మీ ఐపీ చిరునామాను దాచిపెడుతుంది.(చదవండి: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్తో జాగ్రత్త!) ముఖ్యంగా, వీపీఎన్ యాప్స్ వినియోగదారులు తమ గుర్తింపును దాచేటప్పుడు తమ నెట్ వర్క్ వేరే భౌగోళిక ప్రదేశంలో ఉన్నట్లు చూపిస్తుంది. వాస్తవానికి మనం ఇక్కడ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఉన్నట్లు చూపిస్తుంది. వీపీఎన్ వల్ల మన ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నదీ ఇతరులకు తెలియదు. దీని వల్ల మన డేటా ఎన్క్రిప్ట్ అయి సురక్షితంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు హ్యాకర్ల నుంచి కాపాడుకోవడం కోసం తమ కార్యకలాపాలకు గాను వీపీఎన్లను ఉపయోగిస్తుంటాయి. ఉద్యోగులు ఆఫీస్ వర్క్ కోసం ఇంటి పనిచేసినప్పుడు లాక్ డౌన్ సమయంలో ఇవి చాలా భాగ ఉపయోగపడాయి. -
స్కూళ్లు త్వరగా తెరవండి.. లేదంటే ఈ సమస్యలు తప్పవు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో గత ఏడాదిన్నర కాలంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. బడికి వెళ్లి విద్యాబద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లే నేస్తాలయ్యాయి. ఆన్లైన్లోనే పాఠాలు వింటున్నారు. అయితే, ఇలాంటి పరిణామం ఎంతమాత్రం వాంఛనీయం కాదని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. విద్యార్థులను నాలుగు గోడలకే పరిమితం చేయొద్దని, వీలైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలని, వారిలో మేధోవికాసానికి బాటలు వేయాలని ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్ పి.సహస్రబుద్ధే నేతృత్వంలో విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తన నివేదికను శుక్రవారం పార్లమెంట్కు సమర్పించింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. స్కూళ్ల మూసివేత వల్ల తలెత్తే విపరిణామాలు విస్మరించలేనంత తీవ్రమైనవని తేల్చిచెప్పింది. కుటుంబాల సామాజిక జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇంటి పనుల్లో పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంది. వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించింది. చిన్నారులు ఇళ్లకే పరిమితమై ఉంటే తల్లిదండ్రులు, వారి మధ్య ఉన్న సంబంధాలు సైతం ప్రభావితమవుతాయని వెల్లడించింది. రెండు షిఫ్టుల్లో క్లాసులు పాఠశాలలు ఏడాదికిపైగా మూతపడడం వల్ల చదువులు ఆగిపోవడమే కాదు, దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేసి, పాఠశాలలు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్షన్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది. స్కూళ్లలో తరచుగా తనిఖీలు విద్యార్థుల నుంచి హాజరు తీసుకొనేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్తోపాటు తరచుగా ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహించాలని స్థాయీ సంఘం కోరింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. స్కూళ్లలో కోవిడ్–19 ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం హెల్త్ ఇన్స్పెక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తరచుగా తనిఖీలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాఠశాలలను పునఃప్రారంభించారని, అక్కడ పాటిస్తున్న ఉత్తమమైన విధానాలను మన దేశంలోనూ అమలు చేయవచ్చని తెలియజేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020 మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్లో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను తెరిచినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. -
‘పెగాసస్ ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారంపై కదలిక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కదలిక వచ్చింది. పార్లమెంట్లో పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు చేరింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న శశిథరూర్ ఈ వ్యవహారంపై చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈనెల 28వ తేదీన స్టాండింగ్ కమిటీ పౌరుల భద్రత, గోప్యతపై చర్చించనుంది. ఈ మేరకు ఐటీ, సమాచార, హోంశాఖకు కమిటీ సమన్లు జారీ చేయనుంది. వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ పెగాసస్ ద్వారా భారతదేశానికి చెందిన 40 మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయని ఓ విదేశీ మీడియా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నానా రభస మొదలైంది. దేశంలో పౌరుల భద్రత, గోప్యతకు భంగం కలిగించేలా కేంద్రం చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్ ఈ వ్యవహారంపై విచారణ చేయనున్నారు. -
ఫేస్బుక్, ట్విటర్కు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధానంగా ఉన్న ఫేస్బుక్, ట్విటర్కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దుర్వినియోగంపై సమన్లు జారీ చేసి ఈనెల 21వ తేదీన తమ ముందుకు హాజరుకావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు పంపించింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు ఆ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన అంశంపై మాట్లాడనున్నారు. డిజిటల్ రంగంలో పౌరుల హక్కుల రక్షణ, సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రధానంగా మహిళల భద్రత విషయమై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక పార్టీకి.. కొందరు నాయకులకు మద్దతుగా సోషల్ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు.దీనిపై కొన్ని నెలల కిందట పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్కు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల ప్రతినిధులతో 21వ తేదీన సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదా కొత్తగా నిబంధనలు విధించి వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాట్సాప్ వ్యక్తిగత వివరాల అప్డేట్పై రేగిన వివాదం నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: నిన్న ట్రంప్.. నేడు గ్రేసీ) -
వైఎస్ జగన్ పథకాలు దేశానికే ఆదర్శం
కల్లూరు/పులిచెర్ల/తిరుమల (చిత్తూరు జిల్లా): దేశంలోనే ఎక్కడా లేని అద్భుతమైన పథకాలను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, జమ్మూ–కశ్మీర్ ఎంపీ నజీర్ అహమ్మద్ కొనియాడారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కల్లూరులో ఎస్హెచ్జీ గ్రూపులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నజీర్ అహమ్మద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం హర్షణీయమన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్రెడ్డి సాధ్యం చేశారని ప్రశంసించారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ గొప్పగా ఉందని ప్రశంసించారు. పర్యటనలో భాగంగా దిగువపోకల వారిపల్లెలో వాటర్షెడ్లో చేపట్టిన చెక్ డ్యాంను కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ చైర్మన్ ప్రతాప్రావ్ జాదవ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిధున్రెడ్డి, రెడ్డెప్ప, నజీర్ అహమ్మద్, తలారి రంగయ్య, రాష్ట్ర ఈజీఎస్ డైరెక్టరు చిన్నతాతయ్య, జాయింట్ కలెక్టరు మార్కండేయులు, డ్వామా పీడీ చంద్రశేఖర్, ఎన్ఆర్జీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కల్లూరులో పర్యటనకు ముందు తిరుమల శ్రీవారిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. -
వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయని, దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం సరుకులలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వ్యవసాయ, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరిపీచు, పసుపు ఉత్పాదనల ఎగుమతులపై స్థాయీ సంఘం జరిపిన అధ్యయనం, సిఫార్సులకు సంబంధించిన 154వ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి బుధవారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్య ఉత్పాదనల ఎగుమతుల ప్రోత్సాహానికి నివేదికలో స్థాయీ సంఘం ప్రభుత్వానికి చేసిన కొన్ని ప్రధానమైన సిఫార్సులను వివరించారు. ‘వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య శాఖ తక్షణమే నడుం బిగించాలి. వ్యవసాయోత్పత్తుల సప్లై చైన్ సామర్థ్యాన్ని పటిష్టం చేయాలి. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి. వ్యవసాయోత్పత్తులకు అత్యధిక విలువ చేకూరేలా చర్యలు తీసుకోవాలి..’అని కమిటీ సిఫార్సు చేసినట్లు చైర్మన్ తెలిపారు. శాస్త్రీయ పద్దతుల ద్వారా రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదనలు సాధించేందుకు ప్రభుత్వం వారికి తగిన మద్ధతు, ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను గణనీయంగా వృద్ధి చేయవచ్చునని కమిటీ సిఫార్సు చేసింది. ఈజిప్టు, మెక్సికో, మలేíసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతుల కోసం మార్కెట్లను అన్వేషించాలని కోరింది. మత్స్య ఉత్పాదనల ఎగుమతులపై దృష్టి సారించాలి... 2010–11 నుంచి 2014–15 వరకు మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో కనిపించిన వృద్ధి 2015–16 నుంచి క్షీణించడం మొదలైంది. ఈ పరిస్థితిని అధిగమించి తిరిగి మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో వృద్ధి సాధించడానికి కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ‘చేపలు, రొయ్యల సాగులో మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగాన్ని ఆరికట్టేందుకు శాఖాపరమైన నియంత్రణ, అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులు యాంటీబయాటిక్స్ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్టెన్షన్ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో అందుబాటులోకి తీసుకురావాలి..’అని కమిటీ సిఫార్సు చేసింది. ‘మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాలి. ట్యూనా చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో ట్యూనా చేపల వాటా పెంచడానికి చర్యలు తీసుకోవాలి’అని వాణిజ్య శాఖకు కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీతో సంప్రదించి పథకాన్ని రూపొందించాలని కమిటీ సూచించింది. పొగాకు సాగులో ఎఫ్డీఐని అనుమతించాలి దేశంలో ఏటా 800 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018–19 గణాంకాల ప్రకారం) సుమారు రూ. 6 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. పొగాకు పరిశోధనకు అరకొర నిధుల కేటాయింపు కారణంగా ప్రపంచ మార్కెట్లలో దేశీయ పొగాకు ఉత్పాదనలు పోటీకి నిలవలేకపోతున్నాయి. ప్రపంచ ప్రమాణాలకు దీటుగా పొగాకు పండించడానికి పర్యావరణ ప్రతికూలతలను తట్టుకోగల అత్యత్తుమ నాణ్యత, అధిక దిగుబడి సాధించగల వెరైటీలను సాగు చేయడానికి పొగాకు పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది. అందుకు పొగాకు పరిశోధనకు అవసరమైన నిధుల కేటాయింపు జరగాలి. 2017లో ప్రకటించిన ఎఫ్డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. దీని వల్ల మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని చెప్పారు. -
ఫేస్బుక్కు పిలుపు
న్యూఢిల్లీ: కొందరు బీజేపీ నాయకుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్బుక్ చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... సెప్టెంబర్ 2న తమముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్కు సమన్లు జారీచేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫేస్బుక్ ప్రతినిధులతో చర్చించనుంది. పౌరుల హక్కులకు రక్షణ కల్పించడం, అంతర్జాలంలో మహిళల భద్రత అంశాలపై కూడా చర్చించే ఈ సమావేశానికి ఫేస్బుక్ ప్రతినిధులతో పాటు ఐటీ మంత్రిత్వశాఖ అధికారులను కూడా పిలిచింది. అలాగే ఇంటర్నెట్ నిలిపివేతలపై సెప్టెంబర్ ఒకటో తేదీన స్టాండింగ్ కమిటీ సమాచార ప్రసారశాఖ అధికారులు, హోంశాఖ అధికారులతో భేటీ కానుంది. బిహార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. వచ్చేనెల ఒకటి, రెండో తేదీల్లో జరిగే ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశాల ఎజెండాను లోక్సభ సచివాలయం గురువారం ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. థరూర్ను తొలగించాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ను, ఆ పదవి నుంచి తప్పించాలని, అదే కమిటీకి చెందిన సభ్యుడు, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకి రాసిన లేఖలో కోరారు. లోక్సభ నియమాలను అనుసరించి, ఆయన స్థానంలో మరో సభ్యుడిని చైర్మన్గా నియమించాలని కోరారు. శశిథరూర్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ అయినప్పటినుంచీ, కమిటీ వ్యవహారాలను పద్ధతి ప్రకారం నిర్వహించడంలేదని, తన వ్యక్తిగత ఎజెండాని ముందుకు తీసుకెళుతూ, పుకార్లు వ్యాప్తిచేస్తూ, తమ పార్టీపై బురదచల్లుతున్నారని దూబే ఆ లేఖలో పేర్కొన్నారు. ఫేస్బుక్ ప్రతినిధులను స్టాండింగ్ కమిటీ ముందుకు పిలిచే విషయాన్ని కమిటీ సభ్యులకు చెప్పకుండా శశిథరూర్ మొదట మీడియాకు వెల్లడించారని, ఇది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని దూబే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినప్పటికీ, ఫేస్బుక్ అధికారులు చర్యలు చేపట్టలేదని శశిథరూర్ ఆరోపించారు. -
అమెరికా, ఈయూపై అతిగా ఆధారపడొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎగుమతుల కోసం అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలపై అతిగా ఆధారపడటం మంచిది కాదని వాణిజ్య, పరిశ్రమల శాఖ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను బుధవారం పార్లమెంటుకు సమర్పించింది. మొత్తం 23 సిఫార్సులు చేసింది. కమిటీ చేసిన సిఫార్సులు ఇవే.. - తోటల పెంపకానికి కూడా పంటల బీమా పథకాన్ని వర్తింపజేయడం - జీఎస్టీని పకడ్బందీగా అమలు చేయడం - మధ్య, చిన్నతరహా పరిశ్రమల నుంచి సానుకూల ఎగుమతులను ప్రోత్సహించడం - పారిశ్రామిక రంగం నుంచి ఎగుమతులను ప్రోత్సహించడం. జాప్యం పట్ల అసంతృప్తి అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన ఈ కమిటీ దేశంలో పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడంలో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. వాణిజ్య, పారిశ్రామిక రంగ ప్రోత్సాహానికి కేంద్రం తగినన్ని నిధులను కేటాయించనందున ఆ శాఖకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు గండిపడుతోందని అభిప్రాయపడింది. ఎగుమతుల్లో ఒక క్రమ పద్ధతిని అనుసరించడం, నిర్దిష్ట ఆలోచనలతో ప్రయత్నించడం, ఎగుమతులను వివిధ రంగాలకు విస్తరింపజేయడం, ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడం, విధానాలను సరళీకృతం చేయడం వంటి చర్యల ద్వారా 2024–25 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల మేరకు ఎగుమతుల లక్ష్య సాధనలో ముందడుగు వేయొచ్చని కమిటీ సూచించింది. వాణిజ్యం, పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహం శాఖకు రూ.9,238.51 కోట్లు కేటాయించాల్సి ఉండగా 2020–21 బడ్జెట్లో రూ 6,219.32 ట్లే కేటాయించడాన్ని కమిటీ ప్రస్తావించింది. -
గిట్టుబాటు ధరలతో రైతులకు భద్రత
-
గిట్టుబాటు ధరలతో రైతులకు భద్రత
సాక్షి, విజయవాడ: కనీస గిట్టుబాటు ధరతో రైతులకు భద్రత కలుగుతుందని ఏపీ వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. సోమవారం విజయవాడ గేట్ వే హోటల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వరరావు, కేశినేని నాని తో పాటు మొత్తం 11 మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతులు పండించే పంటలకు కనీస గిట్టుబాటు ధర, ఎగుమతులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వాణిజ్య పంటల్లో పత్తికి మాత్రమే గిట్టుబాటు ధర ఉందని.. మిర్చి, పసుపు పంటకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఏపీలో పామాయిల్ పంట ఎక్కువగా సాగు అవుతోందని..దీనికి కూడా ఎన్ఎస్పీ రాలేదన్నారు. రాగులు సజ్జలు కు తప్ప మైనర్, మేజర్ మిల్లెట్లకు ఎన్ఎస్పీ, గిట్టుబాటు ధర లేవని, వాటికి కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఏపీ నుంచి ఎగుమతి అయ్యే పసుపు, మిర్చి, వరికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కోరామని వెల్లడించారు. ఏపీ రైతుల ఉద్దేశాలను కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించామని చెప్పారు. మిర్చి, పసుపు బోర్డు ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. రొయ్యలు, చేపల సాగుకు మౌలిక వసతులు కల్పించాలని.. దీని కోసం కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ ఆక్వాకల్చర్ ఇన్ ఏపీ కింద స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరామన్నారు. ఏపీలో ఆక్వా రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరినట్లు నాగిరెడ్డి తెలిపారు. -
వాణిజ్యశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమితులయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి వివిధ శాఖలకు ఛైర్మన్లను నియమించారు. ఈ మేరకు లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. శాఖల వివరాలు.. వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయిరెడ్డి హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ శర్మ ఆర్థిక స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయంత్ సిన్హా మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ జతీయ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కే కేశవరావు శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయరామ్ రమేష్ రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ టీజీ వెంకటేష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ రామ్ గోపాల్ యాదవ్ సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా భూపేంద్ర యాదవ్ వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జి. గౌడర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జువల్ ఓరం విద్యుత్ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ రంజన్ సింగ్ పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్ రైల్వేశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధామోహన్ సింగ్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ బి దూరి కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ భర్తృహరి మెహతాబ్ విదేశాంగశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పీపీ. చౌదరి ఆహార వినియోగ దారుల వ్యవహారాలశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సుదీప్ బందోపాధ్యాయ జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సంజయ్ జైస్వాల్ కెమికల్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కనిమొళి గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ జాదవ్ బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాకేష్ సింగ్ సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీఛైర్మన్ రమాదేవి -
ఓబీసీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బండి సంజయ్
న్యూఢిల్లీ : బలహీన వర్గాల సంక్షేమ స్థాయి సంఘం సభ్యుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు.. లోక్సభ స్పీకర్ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తానని సంజయ్ తెలిపారు. దీంతోపాటు ఓబీసీ స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఎక్కువ చోట్ల పోటీపై ‘సుప్రీం’ విచారణ
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకుండా నివారించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నివారించేలా చట్టం తేవాలంటూ 2004లో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా చేసిన ప్రతిపాదనలతో ఎన్నికల సంఘం(ఈసీ) మరోసారి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ప్రతిపాదనలను అన్ని పార్టీలు ఆమోదించినప్పటికీ, 1998లో అప్పటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తోసిపుచ్చిందని తెలిపింది. ఒక వ్యక్తి పోటీ చేసిన రెండు చోట్లా ఎన్నికల్లో గెలిస్తే..రాజీనామా చేసిన స్థానంలో ఎన్నికల నిర్వహణ ఖర్చును ఆ అభ్యర్థి నుంచి శాసనసభకైతే రూ.5 లక్షలు, లోక్సభకైతే రూ.10 లక్షలు రాబట్టాలనే ప్రతిపాదన ఉందని పేర్కొంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నివారించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. -
విభజన చట్టం అమలుపై కమిటీ భేటీ
-
విభజన చట్టం అమలుపై చిదంబరం అధ్యక్షతన కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునరవ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల అమలు స్థితిగతులపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ హోంశాఖ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజన, ఆర్టీసీ ఆస్తుల పంపకం, రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాల గురించి కమిటీ చర్చించనుంది. ఈ సందర్బంగా విభజన చట్టం అమలు నివేదికను ఏపీ ప్రభుత్వం కమిటీకి అందించింది. విభజన అనంతరం కేంద్రం ఇచ్చిన నిధులకు సంబధించిన మరో నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో ఏర్పడిన రెవెన్యూ లోటుకు కేంద్రం 3,979 కోట్ల నిధులు ఇచ్చినట్లు వీటికి సంబంధించిన వినియోగ పత్రాలు(యూసీలు) ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కమిటీతో పేర్కొంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిన 6,727 కోట్లకు యూసీలు అవసరం లేదని కమిటీకి సూచించింది. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన 1,632 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. విజయవాడ- గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్దికి కేంద్రం మంజూరు చేసిన వెయ్యి కోట్లకు గాను 229 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన 1,050 కోట్లకు గాను 946 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు ఏపీ ప్రభుత్వం కమిటీకి తెలిపింది. -
సైన్యంలో పని చేయాల్సిందే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైనా చేరాలంటే సైన్యంలో ఐదేళ్లు పనిచేయాలనే నిబంధన విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫాస్సు చేసిన నేపథ్యంలో నిర్బంధ సైనిక శిక్షణ, సేవపై దేశంలో చర్చ ఆరంభమైంది. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో మొత్తం59, 531 అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్రివిధ బలగాల్లో సిపాయి వంటి పునాది స్థాయి ఉద్యోగాల్లో సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారు. ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అవసరమైన ఆఫీసర్ ఉద్యోగాల్లోనే సైనికోద్యోగుల కొరత ఎక్కువ ఉందని ఇండియా డిఫెన్స్ రివ్యూ అనే పత్రికలో రాసిన వ్యాసంలో బ్రిగేడియన్ అమత్ కపూర్ వెల్లడించారు. అధికారుల ఉద్యోగాలతోపాటు ఆఫీసర్ కింది ర్యాంకు ఉద్యోగాలు(పీబీఓఆర్) కూడా పూర్తిగా భర్తీకావడం లేదు. ఆధునిక నైపుణ్యం సంపాదించిన ఉన్నత విద్యావంతులకు మార్కెట్లో మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉండడంతో సైనిక దళాల్లో అధికారుల ఉద్యోగాల్లో చేరడానికి వారు ముందుకు రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ పట్టభద్రులను సైన్యంలోకి ఆకర్షించడానికి దినపత్రికల్లో ‘మీలో ఈ సత్తా ఉందా?’ అంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయినా సాంకేతిక విద్య అభ్యసించిన యువతీయువకులు తగినంత మంది సైనికదళాల్లో చేరడం లేదు. ఈ సమస్యను పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం దీని పరిష్కారానికి ఎవరూ ఊహించని రీతిలో పై సిఫార్సు చేసింది. ఫ్రెంచి విప్లవం నాటి నుంచే నిర్బంధ సైనిక సేవ! దాదాపు ఈడొచ్చిన యువకులందరికీ నిర్బంధ సైనిక శిక్షణ–సేవ అనే విధానం 1790ల్లో ఫ్రెంచి విప్లవం కాలంలోనే మొదటిసారి అమల్లోకి వచ్చింది. తర్వాత అనేక ఐరోపా దేశాలు ఈ విధానం అనుసరించాయి. అర్హతలున్న యువకులందరూ ఒకటి నుంచి మూడేళ్లు సైన్యంలో శిక్షణ తీసుకుని పనిచేశాక వారిని రిజర్వ్ దళానికి పంపించడం ఆనవాయితీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఎక్కువగా జరిగిన 19, 20వ శతాబ్దాల్లో సైన్యంలో పనిచేయడం తప్పనిసరి చేసిన దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడూ కాకున్నా యుద్ధాల సమయంలో నిర్బంధ సైనిక సేవ ఉండేది. 21వ శతాబ్దంలో అత్యధిక దేశాలు నిర్బంధ సైనిక శిక్షణ–సేవ పద్ధతికి స్వస్తి పలికాయి. అమెరికాలో కూడా ఈ విధానం ఎన్నో ఏళ్లు అమల్లో ఉంది. అమెరికాలో 1973లో నిర్బంధ సైనిక సేవను రద్దుచేశారు. స్వచ్ఛంద సైనిక శిక్షణ అమల్లోకి వచ్చింది. 32 దేశాల్లో అమలు! ప్రపంచంలోని అనేక దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానం 21 దశాబ్దంలో చాలా వరకు రద్దయింది. ఇంకా 32 దేశాల్లో 18 ఏళ్లు నిండిన యువకులు సైనిక దళాల్లో చేరడానికి పేర్లు నమోదు చేయించుకుని, శిక్షణ పొందే పద్ధతి అమల్లో ఉంది. అయితే, ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఈ విధానం అనుసరిస్తున్నారు. కొన్ని దేశాల్లో యువతీయువకులందరూ తప్పని సరిగా సైన్యంలో చేరాలనే నిబంధన ఉంది. మరి కొన్ని దేశాల్లో మహిళలను దీని నుంచి మినహాయించారు. కొన్ని దేశాల్లో యుద్ధ సమయాల్లో మాత్రమే యువకులందరూ సైన్యంలో చేరాలనే నియమం పాటిస్తున్నారు. అమెరికా, కొలంబియా, కువాయిట్, సింగపూర్లో నిర్బంధ, స్వచ్ఛంద విధానాలు రెండూ అమల్లో ఉన్నాయి. కాని, ఎక్కడా ముందు సైన్యంలో ఇన్నేళ్లు పనిచేస్తేనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరొచ్చనే నిబంధన అమల్లో లేదు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భూటాన్ భారత్కు హ్యాండిస్తే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం సంక్షోభం సమసిసోయిందని సరిహద్దులో చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం లేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా-భూటాన్లు సంధి చేసుకుంటే.. మధ్యలో భారత్ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. గురువారం విదేశాంగ శాఖ ప్రతినిధులతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... డోక్లాం ప్రస్తావన తీసుకొచ్చారు. ‘సరిహద్దులో సమస్య సమసిపోయినట్లేనని చెబుతున్నారు. అలాంటప్పుడు చైనా-భూటాన్లు ఓ ఏకాభిప్రాయానికి వస్తే భారత్ పరిస్థితి ఏంటి? సమస్యసాత్మక ప్రాంతంలో ఆ రెండు పొరుగు దేశాలు భూ ఒప్పందం చేసుకునే అవకాశాలు లేకపోలేదు కదా!. ఆ దిశగా మీకు ఏమైనా సమాచారం ఉందా?’ అని విదేశాంగ కార్యదర్శిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కార్యదర్శి విజయ్ గోఖలే.. అలాంటి అవకాశం ఉందని చెబుతూనే... పరిస్థితులు మాత్రం అందుకు సానుకూలంగా లేవని చెప్పటం కొసమెరుపు. అయితే ఈ విషయంలో భారత్ వెంటే తాము ఉంటామన్న సంకేతాలను భూటాన్ అందించిందని ఆయన వివరించారు. ఇక రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్రా స్పందిస్తూ... పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. జూలై 2017 తర్వాత ఎలాంటి మోహరింపులు చోటు చేసుకోలేదని చెప్పారు. గత నెలలో శాటిలైట్ ఇమేజ్లు అనుమానాస్పద కట్టడాన్ని సూచించినప్పటికీ.. అది తమ సరిహద్దులోనే చేపడుతున్నట్లు చైనా వివరణ ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఈ ప్యానెల్.. సరిహద్దు సమస్యలు, రక్షణ చర్యలపై అధికారులతో భేటీలో సుదీర్ఘంగా చర్చించింది. -
విమాన సేవలు దారుణం
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో చెక్–ఇన్ కౌంటర్ల వద్ద పరిస్థితి అధ్వానంగా ఉందనీ, సిబ్బంది తక్కువ ఉండడంతో బోర్డింగ్ పాస్ జారీ బాగా ఆలస్యమవుతోందని, దీంతో ప్రయాణికులు చాలా సార్లు విమానం మిస్అవుతున్నారని పార్లమెంటరీ స్థాయీ సంఘం (స్టాండింగ్ కమిటీ) నివేదించింది. ఈ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇండిగో వంటి చౌకధరల విమానయాన సంస్థల చెక్–ఇన్ కౌంటర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందని రవాణా, పర్యాటకం, సంస్కృతి విభాగాల స్థాయీ సంఘం తెలిపింది. కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ప్రయాణికులను చెక్–ఇన్ క్యూలో అధిక సమయం నిల్చోబెట్టి, వారు టికెట్ బుక్ చేసుకున్న విమానమెక్కే అవకాశం లేకుండా చేసి, ఆ తర్వాతి విమానంలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించేలా అక్రమాలకు పాల్పడుతున్నాయని నివేదించింది. విమానాశ్రయాల్లో ఆయా సంస్థలకు తగినన్ని చెక్–ఇన్ కౌంటర్లు ఉండేలా ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలనీ, రద్దీ సమయాల్లో చెక్–ఇన్ కౌంటర్లలో సిబ్బందిని పెంచాలని సూచించింది. బోర్డింగ్ పాస్ పొందడానికి ప్రయాణికులు 10 నిమిషాలకు మించి ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదంది. ఇటీవల ఇండిగో సిబ్బంది ఓ ప్రయాణికుడిని కిందపడేసి కొట్టడాన్ని కమిటీ ఆక్షేపించింది. ఇది సంస్థాగతమైన సమస్య అనీ, ప్రయాణికుల పట్ల ఆ సంస్థ ఉద్యోగులు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించింది. కొన్నిసార్లు విమానసంస్థలు టికెట్ రేట్లను 10 రెట్లు పెంచేసి అడ్డగోలు దోపిడీకి దిగుతున్నాయనీ, ఈ విషయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. టికెట్ రద్దు చార్జీలు కూడా బేస్ ఫేర్లో 50 శాతానికి మించకుండా నియంత్రణ విధించాలని కమిటీ సూచించింది. -
భన్సాలీపై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ‘పద్మావతి’ సినిమా వివాదంపై వివరణ ఇచ్చేందుకు ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. సమాచార సాంకేతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా భన్సాలీపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపిం చింది. ‘సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కి నవంబర్ 11న దరఖాస్తు చేసుకుని.. డిసెంబర్ 1న సినిమా విడుదల చేస్తామని ఎలా అనుకుంటారు. సినిమా టోగ్రఫీ చట్టం ప్రకారం.. ఓ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సీబీఎఫ్సీ 68 రోజుల సమయం తీసుకుంటుందని తెలియదా? ఎంపిక చేసిన కొన్ని మీడియాలకే సినిమా చూపించడం న్యాయమా?’ అంటూ ప్రశ్నించింది. మరోవైపు పార్లమెంటరీ కమిటీ ముందు సీబీఎఫ్సీ చీఫ్ ప్రసూన్ జోషి కూడా హాజరయ్యారు. నిపుణులను సంప్రదించిన తర్వాతే సినిమా సర్టిఫికెట్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన
-
నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న చైర్మన్, సభ్యులు సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(జలవనరుల విభాగం) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. హుకుంసింగ్ నేతృత్వంలో 31 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు పోలవరానికి బయల్దేరనుంది. పోలవరం హెడ్ వర్క్స్(స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎడమ కాలువ.. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో కుడి కాలువ పనుల్ని పరిశీలించి రాత్రికి విజయవాడకు చేరుకుంటుంది. శనివారం ఉదయం పది గంటలకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టులతోపాటు పోలవరం ప్రాజెక్టు పనులపై జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది. అనంతరం మధ్యాహ్నం 12.55 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి బయల్దేరి వెళ్తుంది. అక్కడ తోటపల్లి ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్ర పరిధిలో వ్యాప్కోస్(వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) కార్యకలాపాల్ని సమీక్షించి.. శనివారం రాత్రికి విశాఖపట్నంలోనే బస చేస్తుంది. ఆదివారం ఉదయం 7.50 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తుంది. కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు మాగంటి మురళీమోహన్, ఎస్పీవై రెడ్డి, తెలంగాణ నుంచి బి.వినోద్కుమార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఆరా
విశాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన వివిధ సంస్థల సందర్శన బృందంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాక్షి, విశాఖపట్నం : కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండ్రోజుల పర్యటనకు విశాఖకు వచ్చింది. ఎంపీ ప్రహ్లాద్జోషి నేతృత్వంలోని ఈ కమిటీలో రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, తెలంగాణకు చెందిన వి.లక్ష్మికాంతారావుతోపాటు మరో 16 మంది ఎంపీలు ఉన్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న కమిటీ మధ్యాహ్నం హెచ్పీసీఎల్ను సందర్శించింది. ఆయిల్ రిఫైనరీల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై కమిటీ హెచ్పీసీఎల్ అధికారులతో చర్చించింది. అనంతరం ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వు లిమిటెడ్ను కూడా సందర్శి భద్రత, వ్యూహాత్మక నిల్వల ప్రాధాన్యంపై అధికారులతో కమిటీ చర్చించింది. ఆర్థిక నిర్వహణ, ప్రైవేటు చమురు సంస్థలతో సంయుక్త భాగస్వామ్యాలపై పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖాధికారులతో సమీక్షించింది. హెచ్పీసీఎల్కు వచ్చిన కమిటీ సభ్యులు తొలుత సంస్థ పరిపాలన భవనం వద్దకు వెళ్లి అక్కడ డైరెక్టర్లు, చీఫ్ మేనేజర్, తదితర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న సంస్థ విస్తరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంస్థ ఆవరణలో పలు విభాగాలు సందర్శించారు. సింధియా సమీపంలో గల ఐఎస్సీఆర్సీ (భూగర్భంలో గ్యాస్ నిలువ ఉంచే ప్రదేశం)ని కూడా కమిటీ సందర్శించింది. ఇక్కడ గ్యాస్, చమురు నిక్షేపాలను ఏ పరిమాణం వరకు నిల్వ చేసే అవకాశం ఉంది... తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తల చర్యలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ కమిటీ రాకను దృష్టిలో పెట్టుకుని మల్కాపురం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి కార్యక్రమాలు కమిటీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ ప్లానింగ్, డెవలప్మెంట్, నియంత్రణలపై చమురు మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో కమిటీ భేటీ కానుంది. అనంతరం కేజీ బేసిన్లోని ఓఎన్జీసీ చమురు క్షేత్రాలను సందర్శించనుంది. -
అసవరమైతే మళ్లీ సర్జికల్ దాడులు చేస్తాం: ఆర్మీ
''నియంత్రణ రేఖను మన సైన్యం దాటింది.. అవతలకు వెళ్లి మరీ సర్జికల్ దాడులు నిర్వహించింది.. అవసరమైతే మరోసారి ఇలాంటి దాడులు చేస్తుంది''... అని రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి భారత సైన్యం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సర్జికల్ దాడులకు సాక్ష్యాలు చూపించాలంటూ కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆర్మీ తొలిసారిగా కొందరు ఎంపీలకు ఈ మొత్తం విషయమై వివరాలు తెలియజేసింది. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత డీజీఎంఓ రణ్బీర్ సింగ్ మీడియాతో మాట్లాడిన తర్వాత తొలిసారిగా ఈ అంశంపై ఆర్మీ స్పందించడం విశేషం. భారత సైన్యం వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా వచ్చి.. కమాండో ఆపరేషన్ వివరాలు చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, జమ్ము కశ్మీర్లో కొన్ని లక్ష్యాలపై దాడులు చేయనున్నారని స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాతే మన సైన్యం దాడులకు దిగిందన్నారు. సర్జికల్ దాడులు ఒక్కసారే చేస్తున్న చర్య అని, అయితే భవిష్యత్తులో కూడా అవసరమైతే మరోసారి దాడులు చేయాల్సి ఉంటుందని భారతీయ డీజీఎంఓ పాకిస్థానీ డీజీఎంఓకు చెప్పారని కూడా లెఫ్టినెంట్ జనరల్ రావత్ వివరించారు. వాస్తవానికి ఈ భేటీ జరుగుతుందని ఒకసారి.. మళ్లీ వాయిదా పడిందని ఇంకోసారి చెప్పడంతపో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దాంతో లెఫ్టినెంట్ జనరల్ రావత్ స్వయంగా వచ్చి.. ఎంపీలను కలిసి మొత్తం వివరాలు వాళ్లకు తెలిపారు. ఆపరేషన్ ఎలా సాగిందో వివరించి, ఉగ్రవాద శిబిరాలకు ఎంత నష్టం వాటిల్లిందో కూడా చెప్పారు. ఆపరేషన్లో పాల్గొన్న భారతీయ సైనికులంతా సురక్షితంగా తిరిగి వచ్చారని కూడా తెలిపారు. ఆత్మరక్షణ చర్యలలో భాగంగానే ఈ ఆపరేషన్ నిర్వహించామని అన్నారు. పఠాన్కోట్ ఎయిర్బేస్ మీద ఉగ్రవాద దాడితో పాటు ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారనే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా చర్చించి.. ఆ తర్వాతే ఈ ఆపరేషన్కు ప్లానింగ్ మొత్తం చేశామన్నారు. అయితే సునిశిత వివరాలను మాత్రం ఎంపీలకు తెలియజేయలేదు. లెఫ్టినెంట్ జనరల్ రావత్ చెప్పిన విషయాలతో స్థాయీసంఘంలోని చాలా మంది సభ్యులు సంతృప్తి చెందడంతో.. ఇక ఎవరూ ప్రశ్నలు మాత్రం వేయలేదని సంఘం చైర్మన్ బీసీ ఖండూరీ తెలిపారు. -
ఎంబీబీఎస్ సిలబస్ మార్చాలి
* వైద్య విద్యపై పలు సూచనలు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ * ఆధునిక వైద్య పద్ధతులతో కూడిన సిలబస్ను రూపొందించాలి * తక్షణమే యూజీ వైద్యవిద్యను పునర్నిర్మించాలి సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్ వైద్యవిద్య) ఆశాజనకంగా లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. తాజాగా ఇచ్చిన నివేదికలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి పలు సూచనలు చేసింది. ‘‘ప్రాథమిక వైద్యంలో ఎంబీబీఎస్లది కీలక పాత్ర. కానీ వస్తున్న జబ్బులకు, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ల పనితీరుకూ పొంతనే లేదు. అండర్ గ్రాడ్యుయేషన్ వైద్యవిద్య నాణ్యత లేని విద్యగా మారింది. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఆధునిక వైద్య పద్ధతులు అవలంబిస్తేగానీ ఈ కొత్త జబ్బులకు పరిష్కారం లభించదు. కానీ మనకున్న సిలబస్ ఎప్పుడో పద్నాలుగేళ్ల క్రితం రూపొందించినది. ఇలాంటి సిలబస్నే ఇప్పటికీ బోధిస్తున్నామంటే ఆశ్చర్యపరిచే అంశం. ప్రస్తుతం మారిన పరిస్థితులు, వస్తున్న జబ్బుల రీత్యా తక్షణమే ఎంబీబీఎస్ సిలబస్ను మార్చాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ మెడిసిన్, గేరియాట్రిక్, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్, ఎమర్జెన్సీ కేర్ వంటి సబ్జెక్టులతో కూడిన బోధన జరగాలి. అప్పుడే ఎక్కువ మంది రోగులకు ఉపయోగం ఉంటుంది’’ అని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది. మిగతా కోర్సుల్లాగా వైద్య విద్య ఉండకూడదని, పరిస్థితులకు అనుగుణంగా మారాలని, స్కిల్ ట్రైనింగ్ అనేది ఎంబీబీఎస్ డాక్టర్కు చాలా ముఖ్యమని కమిటీ చెప్పింది. ప్రీవెంటివ్, క్యూరేటివ్, రిహాబిలిటేటివ్ కోణంలో వైద్యం అందించే ప్రక్రియ ప్రస్తుత పరిస్థితుల్లో లేదని అభిప్రాయపడింది. ఎంబీబీఎస్ విద్యలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని ఎంసీఐకి స్టాండింగ్ కమిటీ సూచించింది. ఇప్పటికే సిలబస్ రూపకల్పన, బోధనాపద్ధతుల్లో మార్పులు వంటి విషయాలు అమల్లోకి తీసుకురావడంలో తీవ్రంగా జాప్యం జరిగిందని చెప్పింది. కమిటీ చెప్పిన పలు అంశాలు... * ఐదేళ్లకోసారి ఆధునిక వైద్య పద్ధతులననుసరించి సిలబస్లో మార్పులు చేర్పులు చేయాలి. * ప్రస్తుత విధానం జనరల్ ప్రాక్టీషనర్కు గౌరవప్రదంగా లేదన్నది స్పష్టమైంది. * ప్రస్తుత ఎంబీబీఎస్ డాక్టర్కు సాధారణ ప్రసవం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది. * ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లోకి వచ్చిన 90 శాతం మందికి పీజీ సీటు ఎలా సంపాదించాలనే ధ్యాస ఉంది గానీ వైద్యం మీద అవగాహన ఏ మాత్రం లేదు. * ప్రస్తుతం ఉన్న బోధనాపద్ధతులు సైతం కొత్త పుంతలు తొక్కేలా లేవు. * ప్రైమరీ, సెకండరీ హెల్త్కేర్లో రోగికి వైద్యం చేస్తామన్న నమ్మకం ఎంబీబీఎస్ డాక్టర్లో లేదు * దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న వైద్య విద్య కేంద్రీకృతమై ఉంది. ఇది తక్షణమే వికేం ద్రీకరణ జరగాలి. * క్లినికల్ విభాగంతో పాటు పబ్లిక్ హెల్త్లో వైద్యులకు కచ్చితమైన ఓరియంటేషన్ (అవగాహన) అవసరం ఉంది * దేశంలో కావాల్సిన వైద్య అవసరాలు, ఆ అవసరాలకు తగ్గట్టు డాక్టర్లను తయారు చేయడంలో ఎంసీఐ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా గ్రామీణ వైద్యంపై కనీసం దృష్టి సారించలేకపోవడం ఆశ్చర్యకరం. * ఎంబీబీఎస్ డాక్టర్ కేవలం క్లాస్రూమ్ పాఠాలకే పరిమితమవుతున్నారు. వారికి నైతిక విలువలు, రోగి క్షేమం, రోగి సంరక్షణ, సామాజిక కోణం, మానవతా దృక్పథం వంటివేవీ తెలియడం లేదు. * దేశంలో 55 వేల ఎంబీబీఎస్ సీట్లుంటే.. పీజీ సీట్లు కేవలం 25 వేలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పీజీ వైద్యులు కాలేని ఎంబీబీఎస్ కోర్సుతోనే ఉన్నతమైన వైద్యసేవలు అందించే పరిస్థితులు కల్పించాలి. * ఈ పరిస్థితులున్నప్పుడు ప్రైమరీ, సెకండరీ హెల్త్కేర్లో ఎంబీబీఎస్లకు గుర్తింపు వస్తుంది * దేశవ్యాప్తంగా యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) వైద్యవిద్యను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది -
ఎస్ఈసీ ఇండస్ట్రీస్కు పార్లమెంటరీ కమిటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగంపై వేసిన అత్యున్నత స్థాయి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పీఎస్సీ) జూన్ 3న హైదరాబాద్లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ను సందర్శించనుంది. దేశంలో ఒక ప్రైవేటు కంపెనీని పీఎస్సీ సందర్శించడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీ... ఇక్కడ ఎస్ఈసీ ఇండస్ట్రీస్తో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న రక్షణ రంగ సంస్థలను కూడా సందర్శించనుంది. ఆరు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రక్షణ, వైమానిక రంగానికి అవసరమైన అత్యంత కీలక పరికరాలను తయారు చేస్తోంది. ఇది కంపెనీ విశిష్ట సేవలకు దక్కిన గుర్తింపు అని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘కంపెనీ సాధించిన విజయాలను కమిటీకి వివరిస్తాం. ఎదుర్కొన్న కష్టాలనూ తెలియజేస్తాం. మేం లేవనెత్తే అంశాలను కమిటీ అధ్యయనం చేసి తగు పరిష్కారాలు సూచిస్తుందని భావిస్తున్నాం. తద్వారా పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు. -
ఇలాగేనా ఆదుకోవడం
నష్టానికి తగ్గ సాయం అందలేదు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ర్టం విఫలం మరింత సాయం కోసం నివేదిస్తాం రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ అవసరం విపత్తు సాయం పెంచేలా పాలసీ మార్పు కోసం సిఫార్సు చేస్తాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సాక్షి, విశాఖపట్నం: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండురోజుల పర్యటన ముగిసింది. హుద్హుద్ తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి..అందిన సాయానికి పొంతన లేదని తమ పర్యటనలో గుర్తించినట్టు పేర్కొన్న కమిటీ సభ్యులు సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నామన్నారు. విపత్తు వచ్చి మూడు నెలలైనా బాధితులు నేటికీ తేరుకోలేక పోతున్నా రని..నిబంధనలనుపక్కనపెట్టి వారిని ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీవ్రంగా నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రం నుంచి మరింత మెరుగైన సాయం అందే విధంగా తాము నివేదిక సమర్పిస్తామని ప్రకటించారు. సీనియర్ పార్లమెంటేరియన్ పి.భట్టాచార్య నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండురోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆటోనగర్లోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ కారిడార్ను పరిశీలించి పరిశ్రమలకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుంది. అనంతరం నేరుగా అనకాపల్లి మండలం సుబ్రహ్మణ్యకాలనీ, రాంబిల్లి మండలం గొరపూడి గ్రామాల్లో పర్యటించిన కమిటీ సభ్యులు దెబ్బతిన్న ఇళ్లు, నేలకూలిన చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని కమిటీ సభ్యుల ఎదుట బాధితులు గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా గోరపూడిలో కొబ్బరి రైతులు మాట్లాడుతూ చెట్టుకు రూ.1000 చొప్పున ఇచ్చారని, ఈ మొత్తం కనీసం చెట్టును నరికి..తరలించేందుకు కూడా సరిపోలేదని, ప్లాంటేషన్కు ఎలాంటి సాయం లేదని వాపోయారు. కేంద్రానికి నివేదించి తగిన రీతిలో సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నేరుగా కలెక్టరేట్కు చేరుకుని ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. చట్టంలో మార్పునకు సిఫారసు చేస్తాం విపత్తుల్లో దెబ్బతిన్న ప్రాంతాలకు జాతీయ ప్రకృతి విపత్తుల నిధి నుంచి మరింత సాయం అందేలా చట్టంలో నిబంధనలు మార్చేలా సిఫారసు చేస్తామని కమిటీ చైర్మన్ భట్టాచార్య అన్నారు. తరచూ ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనే ఆంధ్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు కూడా ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వ పథకాలకు విడుదల చేసే నిధుల్లో 10 శాతం నిధులను ఇలాంటి విపత్తుల సమయంలో వినియోగించుకోవచ్చునని సూచించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచే కాకుండా రాష్ర్ట ప్రభుత్వ రంగసంస్థలు, ప్రైవేటు రంగ పరిశ్రమల నుంచి కూడా విపత్తులకు సీఆర్ఎస్ నిధులు వినియోగించవచ్చునన్నారు. మరపడవలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం వాటిల్లినప్పుడు సాయానికి ప్రస్తుత చట్టంలోని నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయన్నారు. తుఫాన్ అనంతరం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు తుఫాన్కు దెబ్బతిన్న గ్రామాలను దత్తత తీసుకుని జిల్లా అధికారుల సహకారంతో ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావాలని కమిటీ చైర్మన్ భట్టాచార్య సూచించారు. విశాఖ పోర్టు ట్రస్టుకు జరిగిన నష్టంపై ట్రస్ట్ సీఎండీ కృష్ణబాబు, సహాయ పునరావాస చర్యలపై విపత్తుల నిర్వహణ కమిషనర్ ఎఆర్ సుకుమార్, జిల్లాలో చేపట్టిన సహాయ చర్యలపై కలెక్టర్ ఎన్.యువరాజ్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చారు. అనంతరం ప్రత్యేక విమానంలో కమిటీ సభ్యులు ఢిల్లీకి పయనమయ్యారు. కమిటీ సభ్యులు సీతారాం ఏచూరి, వైష్ణభ్పరీడా, సెల్వకుమార్, చిన్నయన్చ, కింజరపు రామ్మోహననాయుడు, హరీష్ మీనా, నాగరాజన్, డాక్టర్ సత్యపాల్ సింగ్, బిష్ణుపాదర్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జి కలెక్టర్లు బి.రామారావు, వివేక్ యాదవ్,వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్, వుడా వీసీ బాబూరావునాయుడు, ఏపీఈపీడీసీఎస్ సీఎండీ శేషగిరిబాబు, డీఆర్వో నాగేశ్వరరావ పాల్గొన్నారు. కేంద్రం నిధులు ఏమైనట్టు? హుద్హుద్ తుఫాన్కు దెబ్బతిన్న ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకునేందుకు కేంద్రం, దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలందరూ కలిసి ప్రకటించిన ఆర్ధిక సాయం ఏమైందో అంతుచిక్కడం లేదని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చిస్తామని పార్లమెంటరీ స్టాండింగ్ కమీటీ చైర్మన్ పి.భట్టాచార్య అన్నారు. కమిటీ చైర్మన్ పి.భట్టాచార్య, సభ్యులు సీతారాం ఏచూరి తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ లెక్కలకు అందని నష్టం జరిగిందని, కానీ కేంద్ర సాయం కోసం సమగ్రమైన నివేదికలందించడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రకటించిన రూ. వెయ్యి కోట్లలో కేవలం రూ.435 కోట్లు మాత్రమే విడుద లైందని, మిగిలిన మొత్తాన్ని ఎందుకు విడుదల చేయలేదో తాము పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు. జరిగిన నష్టం అపారంగా ఉంటే ప్రకటించిన సాయాన్ని రూ.680కోట్లకు కుదించడం సమంజం కాదని చెప్పారు. తుఫాన్ సంభవించిన వెంటనే ఎంపీ లాడ్స్ నుంచి ఒక్కొక్కరు రూ.50 లక్షల చొప్పున దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలంతా ఏకగ్రీవంగా మంజూరు చేశారని, అలా సమకూరిన రూ.400 కోట్లకు పైగా నిధులు ఏం చేసారో లెక్కాపత్రం లేదని తప్పుపట్టారు. ఈ అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తు తామన్నారు. -
ఐటీ మినహాయింపు పరిమితి పెంచలేం
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను కనీస మినహాయింపును(బేసిక్ లిమిట్) రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. వ్యక్తిగత పన్ను శ్లాబులను సవరిస్తే సుమారు రూ.60,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోవాల్సి వస్తుందని, దీంతో ఈ ప్రతిపాదనలను ఆమోదించడం లేదని ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా అమల్లోకి రానున్న డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ)లో పన్ను శ్లాబులను సవరిస్తూ యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది. బేసిక్ లిమిట్ను ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడమే కాకుండా, రూ.3-10 లక్షల ఆదాయంపై10%, 10-20 లక్షల ఆదాయంపై 20%, ఆపైన ఆదాయం ఉన్న వారిపై 30% పన్ను విధించాలని సిఫార్సు చేసింది. ఈ సూచనలు పాటిస్తే భారీగా పన్ను ఆదాయం తగ్గుతుందని 2013 డీటీసీ ప్రతిపాదనల విడుదల సందర్భంగా ఆర్థిక శాఖ వ్యాఖ్యానించింది. ప్రస్తుత స్లాబుల ప్రకారం వార్షిక ఆదాయం రూ. 2 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2-5 లక్షల వరకూ 10%, రూ. 5-10 లక్షలకు 20%, రూ. 10 లక్షలు దాటితే 30% పన్ను అమలవుతోంది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి పన్ను మినహాయింపుల వర్తింపు వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే సూపర్ రిచ్ ట్యాక్స్ పేరుతో కొత్త ట్యాక్స్ శ్లాబ్ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే 35 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమా కంపెనీలపై విధిస్తున్న 30% పన్ను పరిమితిని 15%కు కుదించాలన్న సలహాలను కూడా ఆర్థిక శాఖ పక్కనపెట్టింది. ఇదే విధంగా రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఆధారంగా పన్ను విధించాలన్న సూచననూ తిరస్కరించింది.