Pattabhi
-
టీడీపీ పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై కారుమూరి ఫైర్..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్రెడ్డి. రాజకీయాల కోసం టీడీపీ నేతలు దిగజారిపోయారి ఎద్దేవా చేశారు. తన పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పమంటున్నామని ప్రశ్నించారు. కాగా, కారుమూరి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు నోరు తెరిస్తే బూతులు తప్ప ఏం మాట్లాడటం లేదు. ఇలాంటి నీచ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు?. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో చెప్పాలి. మా ప్రభుత్వ పాలనలో మేం చేశామో మేం చెబుతాం. మీ నైతిక పొత్తుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేదు. పట్టాభి, అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టించడం చంద్రబాబు అలవాటే. నోరు అదుపులో పెట్టుకొండి.. మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను. ఒళ్లు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొండి. మీ మాదిరిగా మేము మాట్లాడితే, ఒక్కరోజు కూడా మీరుండ లేరు. మాకు సంస్కారం ఉంది. అదే మాకు మా నాయకుడు నేర్పారు. మేము రాజకీయాల్లో ఫెయిర్గా ఉన్నాం. ఓడినా వెనక్కు తగ్గలేదు. ప్రజల్లో ఉన్నాం. అఖండ మెజారిటీతో గెల్చాం. మళ్లీ 2024లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కచ్చితంగా మళ్లీ ఘన విజయం సాధిస్తాం. ప్రజలే బుద్ధి చెబుతారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విలువలు, విశ్వసనీయత, ప్రజలను నమ్ముకున్నారు. మీ మాదిరిగా పొత్తులు, అనైతిక రాజకీయాలు చేయబోం. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఏం చేసినా, ఎన్ని బూతులు తిట్టించినా మీ సంస్కారానికి వదిలేస్తున్నాం. మళ్లీ మా విజయాన్ని ఆపలేరు. అంతేకానీ, ఈ తరహాలో విమర్శలు, మీ అనుకూల పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటే, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. పాలిటిక్స్లో క్లియర్గా ఉండండి. ఓపెన్గా రండి అంటూ సవాల్ విసిరారు. -
పట్టాభి ఎందుకు రెచ్చిపోయారు?.. టీడీపీలో ఏం జరిగింది.. ఏం జరుగుతోంది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘బీసీలు అంటే వెన్నెముక. వెనుకబడిన వర్గాల వారు కాదు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఆ వర్గాలను అదే స్థాయిలో చూస్తున్నారు. పదవుల అంశంలో అంతే ప్రాధాన్యమిస్తున్నారు. బీసీలకు మంచి చేయడంలో వైఎస్సార్ సీపీ అధినేతకు యావత్ భారతదేశంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆదరణ లభిస్తోంది. ‘మరి మన పార్టీలో ఏం జరిగింది. ఇప్పుడేం జరుగుతోంది. బీసీలు అన్నింటినీ బేరీజు వేసుకుంటున్నారు. మాటలతో మనం ఇంకెంత కాలం మభ్యపెట్టగలం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఆ పార్టీకి చెందిన సీనియర్లు వాపోయారు. గన్నవరంలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో బీసీ వర్గాల ముఖ్యనేతల అంతర్గత చర్చల్లో వచ్చిన అంశాలు అధినేత చెవికి చేరాయి. దీనిపై తీవ్రంగా కలత చెందిన చంద్రబాబు తక్షణ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. ‘గన్నవరం నియోజకవర్గ ఇంచార్జి బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తగుదునమ్మా అంటూ నేను వస్తున్నా. నేనే పోటీచేస్తా అంటూ పట్టాభిరాం అక్కడకు ఎలా వెళతారు. అర్జునుడు బీసీ వర్గానికి చెందినందునే అంత ధీమాగా, బహిరంగంగా ఆయన చాలెంజ్ చేయగలిగారు. అదే పార్టీలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు అక్కడ ఇంచార్జిగా ఉన్నట్లయితే ఆ మాట అనగలిగే వారా? సామాజికవర్గం అండ చూసుకునే రెచ్చిపోయారు. మీ దన్ను అంతలా ఉండబట్టే పట్టాభి ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారనేది పార్టీలో మెజార్టీ అభిప్రాయం’ అని టీడీపీ సీనియర్లు అనడంతో చంద్రబాబు కంగుతిన్నారనేది సమాచారం. ‘క్యాడర్, క్యారక్టర్ ఏవీ పట్టించుకోకుండా ఇష్టానుసారం బూతులు మాట్లాడిన వారికి పదవులు ఇచ్చేస్తారనేది ముఖ్య శ్రేణులు భావిస్తున్నాయి. మంగళగిరి, గన్నవరం పార్టీ ఆఫీసులపై దాడులు ఎవరివల్ల జరిగాయి? ఎందువల్ల జరిగాయో మీరే విశ్లేషించుకోండి’ అని పార్టీ నాయకులు అనడంతో బాబు ఆలోచనల్లో పడ్డారని తెలిసింది. అయినా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితర బీసీ వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. గన్నవరంలో పార్టీకి ఏదైనా సమస్య ఉందని భావిస్తే అర్జునుడు తీవ్ర అస్వస్థతో ఉన్నందున కొనకళ్ల, కొల్లు, లేదా బచ్చుల కుమారుడు, మరెవరినైనా సీనియర్లను అక్కడకు పంపి ఉండవచ్చు. కానీ పట్టాభిని పంపి రెచ్చగొట్టించడాన్ని బట్టి బీసీలంటే మీకు చిన్నచూపు ఉందనే భావన ప్రజల్లోకి, పార్టీ క్యాడర్లోకి బాగా వెళ్లిపోయిందని వివరించడంతో బాబు కంగుతిన్నారని సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. బీసీల గురించి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఎంతమేరకు ఉందనేది బేరీజు వేసుకుంటున్నారని కూడా అన్నారనేది సమాచారం. మాటలు చెపితే సరిపోదు... ‘ఎమ్మెల్సీల్లో బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతపై మా వెనుకబడిన వర్గాల్లో బాగా చర్చ జరుగుతోంది. అంతకుముందు కూడా వివిధ పదవుల్లో దక్కిన ప్రాధాన్యతను ఇప్పటికే గుర్తించారు. ఇక నుంచి మీకు మేమంత చేశాం.. ఇంత చేసేశాం.. అని టీడీపీ చెపితే వినే దశలో బీసీ వర్గాలు లేవు. అన్నీ విశ్లేషించుకుంటున్నాయి. గణాంకాలతో సహా ముఖ్యులకే పాఠాలు అప్పజెపుతాయి’ అని విజయవాడకు చెందిన బీసీ ముఖ్య నాయకుడు ఒకరు కుండబద్దలు కొట్టారు. గన్నవర్గానికి కో– ఆర్డినేటర్ కమిటీ చంద్రబాబు ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం కమిటీని నియమించారు. కమిటీ కో–ఆర్డినేటర్గా కొనకళ్ల నారాయణ, సభ్యులుగా బచ్చుల అర్జునుడు కుమారుడు బచ్చుల సుబ్రహ్మణ్యంతోపాటు మరో నలుగురికి చోటు కల్పించారు. సీఐ కనకారావుపై చేసిన దాడిని పోలీసువర్గాలు తీవ్రంగా భావిస్తున్నాయని. టీడీపీ అల్లరిమూకలు ఇంతలా బరితెగిస్తాయని అనుకోలేదని వారంటున్నారని చంద్రబాబు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. సంఘటన జరిగినప్పుడు గాయం తీవ్రత బాగా తెలిసిందని, ఏడు కుట్లు పడ్డాయని వివరించారు. చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా? -
Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ
సాక్షి, అమరావతి: తనకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేరని, అతన్ని ఆ పీఠంపై తిరిగి కూర్చోబెట్టడానికి అనుకూల వాతావరణం సృష్టించేందుకు ‘ఈనాడు’ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రగతిని పణంగా పెడుతూ నీచ రాజకీయాలకు తెరలేపింది. ఒక్కో రోజు ఒక్కో కట్టు కథతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొన్నటికి మొన్న టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకపోయినా.. కొట్టారంటూ పాత ఫొటోలతో తప్పుడు ప్రచారం చేసింది. ప్రజలు గుర్తించి సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోయడంతో తప్పు ఒప్పుకుంటూనే.. తిరిగి అవే తప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. ‘పారిశ్రామిక రాయితీ జాడేది?’ అంటూ తాజాగా మరో కథనాన్ని వండివార్చింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోవాలని, పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేయాలనే దుర్బుద్ధి కనిపిస్తోంది. గత ప్రభుత్వం పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వకుండా బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అంధకారంలోకి నెట్టిన విషయాన్ని ఏ రోజూ మాట మాత్రంగానైనా రామోజీ ప్రశ్నించ లేదు. ఈ ప్రభుత్వం వరుసగా రాయితీలు విడుదల చేస్తున్నా, తప్పుడు రాతలతో విషం కక్కడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే. కోవిడ్ సమయంలో పరిశ్రమలు భారీగా ఆదాయం నష్టపోయినా, రీస్టార్ట్ ప్యాకేజీతో ఈ ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుందన్న పచ్చి నిజాన్ని దాచడం దుర్మార్గం కాదా? భారీ సంక్షోభాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు పారిశ్రామిక వేత్తలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం న్యాయమా? ఆరోపణ: రాయితీలు ఇవ్వలేదు వాస్తవం: గత ప్రభుత్వం రూ.3,409 కోట్ల రాయితీలను పరిశ్రమలకు బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక వాతావరణాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి సకాలంలో రాయితీలను విడుదల చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.46 కోట్లు, 2020–21లో రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ.993.30 కోట్ల రాయితీలను విడుదల చేయడం ద్వారా కోవిడ్ సంక్షోభంలో 8,000 ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా అండగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంలో 2021–22లో రూ.666.86 కోట్ల రాయితీలను విడుదల చేశారు. 2022–23కు సంబంధించి ఆగస్టులో పారిశ్రామిక రాయితీలను విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ను విశాఖలో నిర్వహిస్తున్న తరుణంలో దానికి ఒక నెల ముందు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతలో ఎంఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాయితీల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అయిపోగానే పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వాస్తవాలను ఏమాత్రం ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ముందు రాష్ట్రం పరువు తీయాలని ఈనాడు లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది. ఆరోపణ: విద్యుత్ డిమాండ్ చార్జీల సంగతీ అంతే.. వాస్తవం: గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఏటా క్రమం తప్పకుండా రాయితీలను విడుదల చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా చేదోడుగా నిలబడటంతో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. పూర్తిగా 100 శాతం రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రకటిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడటం అంటే రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మూడు నెలల కాలానికి విద్యుత్ రంగానికి చెందిన ఫిక్స్డ్ డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు భారీ పరిశ్రమలకు ఎటువంటి పెనాల్టీలు లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్ బడుగు వికాసం కింద 9,631 యూనిట్లకు రూ.661.58 కోట్ల రాయితీలు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 2,207 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు రూ.111.08 కోట్లు, 424 ఎస్టీ పారిశ్రామికవేత్తలు రూ.24.31 కోట్ల రాయితీలు అందుకున్నారు. వైఎస్సార్ నవోదయం కింద 1.08 లక్షల ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలకు చెందిన రూ.3,236 కోట్ల రుణాలను ప్రభుత్వం రీ–షెడ్యూల్ చేసింది. -
‘ఈనాడు’పై ఆగని నిరసన జ్వాల
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ‘వంశీ సంగతి నేనే స్వయంగా తేలుస్తా.. ఏమనుకుంటున్నాడో నేనంటే ఏమిటో చూపిస్తా’ అని మరీ సవాలు చేసి.. గన్నవరం వెళ్లి రచ్చ చేసి.. ఎమ్మెల్యే వంశీ వర్గీయులను రెచ్చగొట్టింది టీడీపీ నేత పట్టాభి. ఇది పద్ధతి కాదని చెప్పబోయిన వంశీ అనుచరులపై బరితెగించి దాడులకు పాల్పడిందే కాక.. గొడవ నివారించడానికి వచ్చిన పోలీసులపైకీ రాళ్లు రువ్విందీ పట్టాభి అండ్ కో. ఆ దాడిలో సీఐ కనకారావు గాయపడ్డాక.. పట్టాభి, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతి నుంచి ఎల్లో మీడియా విష ప్రచారం శ్రుతిమించి సాగింది. పట్టాభిని పోలీసులు ఇష్టానుసారం కొట్టారంటూ దుష్ప్రచారం చేశారు.‘ఈనాడు’ మరో అడుగు ముందుకు వేసి.. పట్టాభినీ కొట్టారంటూ పాత ఫొటోలతో ఓ తప్పుడు కథనాన్ని పతాక శీర్షికన ప్రచురించింది. అవి 2021లోని ఫొటోలని జనం సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. దీంతో తేలు కుట్టిన దొంగలా ఎక్కడో లోపలి పేజీలో ‘సవరణ’ వేయడం ద్వారా ఈనాడు తన తప్పు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అవి పాత ఫొటోలేనని, సాంకేతిక కారణాల వల్ల అవి పొరపాటున ప్రచురిత మయ్యాయని లెంపలేసుకుంది. ఈనాడు రెండు నాల్కల ధోరణిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారిలో చర్చ మొదలైంది. ‘రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు మరీ ఇంత దిగజారిందా.. చంద్రబాబు కోసం తన పరువు తీసుకోవడానికి సైతం సిద్ధపడటం ఏ పాత్రికేయ ప్రమాణాలకు నిదర్శనం..’ అని జోరుగా చర్చించుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇంత జరిగాక కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన తీరు మార్చుకోలేదు. తగుదునమ్మా అంటూ శుక్రవారం గన్నవరం వెళ్లారు. పట్టాభిని కొడతారా.. అంటూ నిలదీశారు. పట్టాభిని పోలీసులు కొట్టలేదని తెలిసినా.. అబద్ధాన్ని నిజం చేయాలని పదే పదే ప్రస్తావిస్తూ పరితపించిపోయారు. ఇప్పుడు రండి చూసుకుందాం.. అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై కూడా నోరు పారేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎల్లో ఈనాడు, మిగతా మీడియా మరోసారి పెద్ద ఎత్తున అవాస్తవాలకు పెద్దపీట వేస్తూ ప్రచారం చేస్తోంది. నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్న తీరును ప్రజలు గమనిస్తూ నిప్పుడు చెరుగుతున్నారు. ఈ క్రమంలో ‘ఈనాడు’ పత్రిక ప్రతుల దహనం కార్యక్రమం శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. పాత్రికేయ వృత్తికే అవమానం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘ఈనాడు’ పత్రిక అసత్య కథనాలు వండి వారుస్తోందని, వారికి అనుకూలమైన చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతో పాత్రికేయ వృత్తికే అవమానం కలిగేలా దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా నిరసన ఎగసిపడింది. అది చంద్రబాబు కరపత్రిక అని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు నినదించారు. అనంతపురంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ఎదుట ఈనాడు ప్రతులను దహనం చేశారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసి సమాజంలో జర్నలిజం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన పత్రిక ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. గోరంట్ల, రాప్తాడు, పెనుకొండలో కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు జిల్లా సదుం, శ్రీరంగరాజపురం, ప్రకాశం జిల్లా దర్శి, గిద్దలూరు, నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరులో ‘ఈనాడు’ ప్రతులను దహనం చేశారు. గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన విద్యార్థి నేతలు అనంతరం అక్కడి నుంచి శంకర్విలాస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మాచర్ల, చిలుకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండలో ఈనాడు ప్రతులు, రామోజీ చిత్రపటాలను దహనం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, మైలవరంలో రామోజీ దిష్టి బొమ్మను దహనం చేశారు. గుంటూరు నగరంలోని లాడ్జిసెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం నేతలు అసత్య కథనాలు రాస్తే సహించేది లేదు ఉన్నతాశయంతో పని చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఏలూరులో ప్రజలు మండిపడ్డారు. ఏలూరు, గాలాయగూడెం, నూజివీడు, భీమడోలు, భీమవరంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. కాకినాడలో రామోజీ దిష్టిబొమ్మను ఊరేగించారు. కిర్లంపూడి మండలం జగపతినగరంలో ప్రధాన రహదారిపై కాకినాడ ఎంపీ వంగా గీత, తదితర నేతల ఆధ్వర్యాన ఈనాడు ప్రతులను దహనం చేశారు. రామోజీరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిఠాపురంలో పలువురు డిమాండ్ చేశారు. తుని, కోటనందూరు, ఒంటిమామిడి జంక్షన్, పెద్దాపురం, సామర్లకోటలో నిరసన తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అయినవిల్లి మండలం పోతుకుర్రులో ఈనాడు ప్రతులను దహనం చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, హిరమండలం, నరసన్నపేట, పలాస తదితర ప్రాంతాల్లోఈనాడుపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బొబ్బిలి, కురుపాం, విశాఖ నగరంలో పలుచోట్ల ఈనాడు పత్రిక ప్రతులను తగులబెట్టారు. -
కట్టుకథలు రాస్తున్న ఈనాడుపై జనాగ్రహం.. ఉవ్వెత్తున ఎగసిన నిరసనలు
సాక్షి, అమరావతి: ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘ఈనాడు’ పత్రిక అసత్య కథనాలు వండి వారుస్తోందని, వారికి అనుకూలమైన చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతో దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఎగసిపడింది. తప్పుడు వార్తలు రాసి.. ప్రజలను మోసం చేస్తున్న ఈనాడు పత్రిక ప్రతులను గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో దహనం చేశారు. రామోజీరావు ఇంతగా దిగజారిపోవడం దారుణం అని ఛీకొట్టారు. పట్టాభినీ కొట్టారంటూ పాత ఫొటోలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఈనాడు చేసిన కుట్ర మరోసారి బట్టబయలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. వైఎస్సార్, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్న సెంటర్లలో ఈనాడు రామోజీ రావు విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అవి 2021లోని ఫొటోలని సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఎవరికీ కనిపించని రీతిలో రెండో పేజీలో సింగిల్ కాలంలో ‘సవరణ’ వేసి చేతులు దులుపుకుందని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈనాడు పత్రిక పుట్టిందే అసత్య వార్తలు రాయడానికి అని పెద్ద ఎత్తున నినదించారు. చంద్రబాబును సీఎం చేయాలనే కుట్రతోనే ఈనాడు పత్రిక దిగజారుడు వార్తలు, కథనాలు రాస్తోందని మంత్రులు ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయాలని, సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే దురుద్ధేశం.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి, చంద్రబాబుకు ప్రజలను చేరువ చేయాలని రాజగురువు రామోజీ కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు దుయ్యబట్టారు. ఈనాడు దినపత్రిక కాదు.. చంద్రబాబు కరపత్రిక అని పలు ప్రాంతాల్లో నినదించారు. ఇవి సోషల్ మీడియా రోజులు పట్టాభి అనే వ్యక్తి జాతీయ నేతలా ఎల్లో మీడియా జాకీలు వేసి లేపుతోందని, ఇవి ఎల్లో మీడియా రోజులు కావని.. సోషల్ మీడియా రోజులు అని ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎల్లో మీడియా అని ముద్దుగా పిలుచుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అనుబంధ సంస్థలు ప్రచురిస్తున్న, చూపుతున్న వార్తలు, కథనాలు చూస్తుంటే ఇంకా దిగజారిపోవడానికి వారికి మెట్లు ఏమీ లేవు అని నిరూపించుకున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు మాత్రమే బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతం.. రామోజీరావుకు వయసు పెరిగి.. బుద్ధి మందగించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తూర్పారబ్టారు. కుట్రల రామోజీని బట్టలూడదీసి ప్రజల ముందు నిలబెడతామని మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) హెచ్చరించారు. దుష్ప్రచారం చేసేటప్పుడు బ్యానర్ ఐటమ్స్.. సవరణకు మాత్రం సింగిల్ కాలమా? అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. రామోజీ ఆరాటమే తప్ప.. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సంబంధం లేని ఫొటోలను ప్రచురించి ప్రజలను మోసం చేయాలని ఈనాడు యాజమాన్యం కుట్ర చేసిందని, సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిందని వైఎస్సార్సీపీ సీనియర్ శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు చంద్రబాబు మాత్రం బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతమని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ‘ఈనాడు’ ప్రతులను తగలబెడుతున్న స్థానికులు పెల్లుబికిన ఆగ్రహం అసత్యాలను ప్రచారం చేస్తున్న ఈనాడు పత్రికను బహిష్కరించాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఎక్కడికక్కడ ఈనాడు ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్ జిల్లాలోని కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, తదితర పట్టణాల్లో ఈనాడు ప్రతులు కాల్చివేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీ–5లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తన క్యాంపు కార్యాలయం ఎదుట ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యంలో ఈనాడు దినపత్రిక పత్రులను దహనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఎమ్మెల్యేలతో కలిసి ఈనాడు పత్రిక ప్రతులను తగులబెట్టారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రామోజీరావు దిష్టి బొమ్మ దహనం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని రీతిలో ఆంధ్రప్రదేశ్లో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న జగన్మోహన్రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపై ఈనాడు విషం చిమ్ముతుండటాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని విజయవాడలో పలువురు నేతలు మండిపడ్డారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ మంటల్లో ఈనాడు ప్రతులను తగులబెట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ‘పచ్చ’రాతలపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. విషపు రాతలు రాస్తున్న ‘ఈనాడు’ పత్రికను వైఎస్సార్సీపీ శ్రేణులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి. నిరసన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా దద్దరిల్లింది. ఇకనైనా నీచపు రాతలు మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.. రామోజీకి హితవు పలికారు. ప్రభుత్వంపై కక్ష కట్టి ఈనాడు రాస్తున్న అబద్ధపు రాతలను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేతలు ఖండిస్తూ నిరసన తెలిపారు. -
చిల్లర నేత చిందులాట.. రామోజీకి తన సినిమా డైలాగ్ గుర్తుందో లేదో?
కుట్రలు, కుతంత్రాలు ఏదో ఒక రోజు బటయపడతాయని అంటారు. అబద్దాలు ఆడేవారు ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారన్నది నానుడి. సరిగ్గా ఈనాడు మీడియా పరిస్థితి అలాగే ఉందని చెప్పాలి. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా విషం కక్కుతున్న వైనం ఇప్పుడు మరింత ఓపెన్గా బహిర్గతమైంది. తెలుగుదేశం పార్టీ చోటా నాయకుడిని మహానాయకుడిగా చూపించడానికి, అతగాడు చేసే విన్యాసాలను మహా పోరాటంగా చిత్రించడానికి ఈనాడు పడ్డ పాట్లు ఇట్టే తెలిసిపోయాయి. రామోజీ ఈ డైలాగ్ గుర్తుందా? ఈనాడు బ్యానర్ చూడగానే ప్రఖ్యాత స్వాతంత్రయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఏమైనా బతికి వచ్చారా? ఆయనకు ఏమైనా జరిగిందా? అన్న సందేహం వచ్చింది. తీరా మొత్తం కథనం చదివితే ఇదంతా ఒక చిల్లర నేత చేసిన ఆరోపణ అని అర్ధం అవుతుంది. ఈనాడు ఈ రకంగా తన స్థాయిని ఇంతగా దిగజార్చుకుంటుందని గతంలో ఊహించలేకపోయాం. తన క్షుద్ర రాజకీయం కోసం ఈనాడు ఎంతకైనా పతనం అవుతుందని ఈ ఘటన తెలియచెబుతుంది. సుమారు 35 ఏళ్ల క్రితం ఈనాడు అధినేత రామోజీరావు ఒక సినిమా తీశారు. దాని పేరు ప్రతిఘటన. అందులో కొన్ని పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయి. ఒక రౌడీకి ఖద్దరు చొక్కా తొడిగి రాజకీయ నాయకుడిని చేశారని అందులో ఒక స్వాతంత్ర యోధుడు అంటారు. సరిగ్గా ఇప్పుడు ఈనాడు అదే పనిలో ఉన్నట్లు అనిపిస్తుంది. బురద చల్లడమే ఈనాడు కర్తవ్యం.. తెలుగుదేశంలో ఎవరు చిల్లరమల్లరగా వ్యవహరిస్తారో, నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ను దూషిస్తారో వారందరికీ విపరీత ప్రాధాన్యం ఇస్తూ వారిని మహా నాయకులుగా చిత్రీకరించడానికి తంటాలు పడుతోంది. తద్వారా వైఎస్సార్సీపీపై బురద చల్లడమే ఈనాడు తన కర్తవ్యంగా పెట్టుకుంది. బుధవారం నాటి పత్రిక గమనిస్తే సహజంగానే సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రకమైన ఆరోపణలను టీడీపీ చేసిన విషయం గుర్తుకు వస్తుంది. ఒక చోటా నేతను పోలీసులు కొట్టారంటూ ఏవో కొన్ని ఫొటోలను అప్పట్లో ప్రచురించారు. అదే తరహాలో మళ్లీ ఫొటోలు వచ్చాయేమిటా అనిపించింది. ఆ తర్వాత కొద్ది గంటల్లో అసలు రహస్యం బట్టబయలు అయింది. గతసారి వేసిన ఫొటోలనే ఇప్పుడు కూడా వేసి ఆ చోటా నేతను పోలీసులు కొట్టారంటూ కథ అల్లింది. సరే, కోర్టులో కూడా అదే తరహాలో చెప్పారు. అది వేరే సంగతి. వైద్యులు ఆ చోటా నేతను పోలీసులు కొట్టలేదని ధృవీకరించారు. ఈలోగా ఈనాడు ఎందుకో భయపడింది. రెండేళ్ల క్రితం వేసిన ఫొటోలనే ప్రచురించి తప్పు చేశారన్న సంగతి సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవడంతో తప్పనిసరి స్థితిలో టీవీలలో పాత ఫొటోలను ప్రచారం చేశామని, అది సాంకేతిక తప్పిదం వల్ల జరిగిందని.. ఇందుకు విచారిస్తున్నామని తెలిపింది. దీంతో, ఈనాడు మీడియా పరువు పూర్తిగా పోయినట్లయింది. బహుశా తాను చేసిన మోసాన్ని పోలీసులు పట్టుకుని కేసులు పెడతారని ఆందోళన చెంది ఈనాడు వారు ఈ వివరణ ఇచ్చి ఉంటారనిపిస్తుంది. అందులో కూడా నిజాయితీ కనిపించలేదు. ఇదే మొదటిసారి కాదు.. మంగళవారం తీసిన ఫొటో అంటూ సన్నాయి నొక్కుడుకు పాల్పడింది. మంగళవారం నాటి ఫొటోనే అయితే.. రెండేళ్ల క్రితం ఫొటో అక్కడ ఎలా ప్రత్యక్షమవుతుందో తెలియదు. ఇదంతా అబద్దమని, చేసిన తప్పును సమర్ధించుకునే యత్నమని తెలిసిపోతుంది. ఈనాడు ఇవ్వాళ ఒక్కరోజే ఇలా చేసిందని అనుకోజాలం. కొద్ది రోజుల క్రితం ఛీప్ సెక్రటరీ వైఎస్సార్ జిల్లాలో పర్యటించినప్పుడు కడపలో వేరే కేసులో సీబీఐ విచారణకు హాజరైన ముఖ్యమంత్రి.. ఓఎస్డీని కారులో ఎక్కించుకుని వెళ్లారంటూ తప్పుడు వార్తను ప్రచారం చేసింది. దానిని ఛీప్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అప్పుడు ఏ మీడియా అయినా ఏం చేయాలి. వారు ప్రచారం చేసిన వార్త సరైనదే అయితే, తమ వార్తకు కట్టుబడి ఉన్నామని చెప్పాలి. లేదా విచారం వ్యక్తం చేయాలి. కానీ.. వారు కేవలం సీఎస్ ఇచ్చిన ప్రకటనను కొద్దిగా ఇచ్చేసి వదలివేశారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్ను, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈనాడు విశేష కృషి చేస్తోంది. 86ఏళ్ల వయసులో ఆ పత్రిక అధినేత రామోజీరావు తన పరువు, ప్రతిష్ట మంటకలిసిపోయినా ఫర్వాలేదు కానీ.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండడానికి వీల్లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో లోటుపాట్లు వార్తలుగా ఇస్తే తప్పు కాదు. కానీ, అదే పనిగా తప్పుడు ప్రచారం చేయడానికి, అభూత కల్పనలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకే తరహా వార్తలను తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలో మరో రకంగాను ఇస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు కనిపించవా? ఉదాహరణకు తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడి వచ్చినా, చాలా గొప్ప విషయంగా మొదటి పేజీలో ప్రచురిస్తుంటారు. అదే ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, అసలు ప్రాధాన్యమే ఇవ్వరు. ఈ మధ్య జమ్మలమడుగు వద్ద 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్త జిందాల్ శంకుస్థాపన చేస్తే దానిని మొక్కుబడిగా కవర్ చేశారు. పైగా బ్యానర్గా రోజువారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే ఒక చెత్త వార్తను ప్రచురించారు. విశాఖలో రిషి కొండపై ఎన్ని దారుణమైన వార్తలు రాస్తున్నారో చూస్తున్నాం. ఇదే రిషి కొండపై గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వేస్తే, కొండకే హారం చుట్టినట్లు రాసిన ఈ పత్రిక.. ఇప్పుడు అక్కడ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను మాత్రం విధ్వంసంగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు కన్నా ఆయనే తోపా? ఈ రెండు క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా ఒకటని కాదు.. అనేక కథనాలలో ఇలాగే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్న ఈనాడు బుధవారం నాటి పత్రికలో గన్నవరంలో ఆ పార్టీ చోటా నేత, మరికొందరు చేసిన అల్లరి పక్కనపెడితే, ఆ చోటా నేతను పోలీసులు కొట్టారంటూ కథనాలు ఇచ్చారు. స్క్రిప్ట్ ప్రకారమే ఆ చోటా నేత కూడా తనను పోలీసులు హింసించారంటూ కోర్టుకు తెలిపారు. ఈ వార్తలకు ఈనాడు పత్రిక ఏకంగా మూడు పేజీలను కేటాయించిందంటే వారు ఎంత కక్షకట్టారో ఇట్టే తెలిసిపోతుంది. టీడీపీలో ఆ చోటా నేతే చంద్రబాబు కన్నా ప్రముఖుడు అన్నట్లుగా వార్తలు ఇవ్వడం టీడీపీలోని వారికే మింగుడు పడటంలేదు. ఇతగాడు పార్టీ పరువును తీస్తున్నాడని వాపోతున్నారట. అసలు ఈయనకు ఇంత ధైర్యం అన్న విశ్లేషణ చేస్తే ఒక విషయం బయటపడుతోంది. గతసారి ముఖ్యమంత్రి జగన్ను దూషించిన కేసులో గౌరవ హైకోర్టు వారు అడ్వాన్స్ బెయిల్ ఇచ్చారు. దాంతో అతనికి అతి విశ్వాసం వచ్చి ఉండవచ్చు. న్యాయ వ్యవస్థను తేలికగా తీసుకోవచ్చన్న భావన ఏర్పడి ఉండవచ్చు. ఈ క్రమంలో అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయి వైఎస్సార్సీపీ వారిపై దూషణలకు పాల్పడటం, నిత్యం అబద్దాలు ప్రచారం చేయడం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ.. ఇతనికి ఇస్తున్న ప్రాధాన్యత చూసి ఇతర ముఖ్యనేతలే ఆశ్చర్యం చెందుతున్నారు. ఎప్పుడో ఓసారి ఇతను ఏకుమేకై చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారట. వల్లభనేని వంశీపై వ్యతిరేక ప్రచారం.. నిజంగా గన్నవరం ఘటనల నేపథ్యంలో పోలీసులు ఎవరినైనా కొట్టి ఉంటే ఎవరూ సమర్దించరు. కానీ, పోలీసులను గాయపరచడమే కాకుండా, వారినే బెదిరించడమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకుంటున్నారు. దానివల్ల వారికి రాజకీయ ప్రయోజనం వస్తుందనుకుంటే అది భ్రమే అవుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ఎన్నికలలో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. తదుపరి ఆయన పార్టీకి దూరం అయ్యారు. అప్పటి నుంచి ఆయనపై టీడీపీ సోషల్ మీడియాలో దారుణమైన వ్యతిరేక ప్రచారం చేస్తుంటారట. దానిని ఆయన తిప్పికొడుతూ తీవ్ర వ్యాఖ్యలే చేస్తుంటారు. గత కొంతకాలంగా ఇది జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో టీడీపీ చోటా నేత ఎంటర్ అయి వంశీపైన నోరుపారేసుకోవడం, లేని ఆరోపణలు చేయడం, వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించడం చేశారని వార్తలు వచ్చాయి. దాంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా కొంత తొందరపడి ఉండవచ్చు. పోలీసులు రెండువైపులా కేసులు పెట్టారు. ఇరుపక్షాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అనడం ఆనవాయితీగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఏదో విధంగా శాంతి భద్రతల సమస్య సృష్టించాలని తెలుగుదేశం, ఈనాడు వంటి మీడియా సంస్థలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ వారిని ఎలాగోలా రెచ్చగొట్టేలా చేయాలన్నది వారి వ్యూహం కావచ్చు. చంద్రబాబు కన్నింగ్ ప్లాన్ ఇదే.. దానికి తోడు ప్రభుత్వం లేదా వైఎస్సార్సీపీ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి చంద్రబాబు ఇలాంటి వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా భావిస్తారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో 18 స్థానాలకు గాను 11 మంది బీసీలకు పదవులు ఇవ్వడానికి వైఎస్సార్సీపీ ప్రకటన చేసిన రోజునే ఈ గొడవ సృష్టించడంలో ఆంతర్యం ఇదేనని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మొత్తం పరిణామక్రమం, టీడీపీ రాజకీయ చరిత్ర గమనిస్తే, ఇది వాస్తవమే అనిపిస్తుంది. అయినప్పటికీ టీడీపీ రెచ్చగొట్టినా వైఎస్సార్సీవారు ఆవేశపడకుండా ఉండాలని ఈ ఘటన తెలియచెబుతుంది. వారు సంయమనంగా లేకపోతే మొత్తం నెపం అంతా ప్రభుత్వంపైన, వైఎస్సార్సీపీపైన నెట్టేసి బద్నాం చేయాలని టీడీపీ యత్నిస్తుంది. ఇదే సందర్భంలో మరో మాట చెప్పాలి. పాదయాత్ర చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్.. వైఎస్సార్సీపీ వారు ఒక్క టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే, తాము వంద వైఎస్సార్సీపీ ఆఫీసులపై దాడి చేస్తామని అనడం శోఛనీయం. అంతేకాదు.. కట్ డ్రాయర్ల మీద ఉరికిచ్చి కొడతారట. ప్రభుత్వం వస్తే ఈయనే పోలీసుల పోస్టింగ్స్ ఇస్తారట. ఇన్ని రకాలుగా రెచ్చగొడుతూ పోలీసు అధికారులను బెదిరిస్తున్న తీరు అర్దం అవుతూనే ఉంది కదా!. వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టాలన్నదే వారి వ్యూహం. కనుక ఈ ఎన్నికల సంవత్సరంలో అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా, పూర్తి సంయమనంగా ఉండాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
పవన్ ట్వీట్లకు కొడాలి నాని కౌంటర్
-
పట్టాభిని కొట్టారంటూ దుష్ప్రచారం చేశారు: కొడాలి నాని
-
ఈనాడు ఫేక్ వార్తపై స్పందించిన కొమ్మినేని.. ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: టీడీపీ నేత పట్టాభి ఎపిసోడ్ విషయంలో ఈనాడు తప్పుడు కథనాలు రాసి ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, తప్పుడు కథనాలపై ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్రావు స్పందించారు. ఈ నేపథ్యంలో గురువారం కొమ్మినేని మాట్లాడుతూ.. పట్టాభిని కొట్టారంటూ ఈనాడు పత్రికలో పాత ఫొటోలను ప్రచురించి ప్రజలను మోసగించడం దురదృష్టకరం. 2021 ఫిబ్రవరి 3వ తేదీ నాటి ఫొటోలు ముద్రించడం దారుణం. ప్రభుత్వం, పోలీసులపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే లక్ష్యంతోనే కథనం రాసింది. అనంతరం, సాంకేతికలోపం అంటూ సమర్థించుకునే తీరు అభ్యంతరకరం. పట్టాభి వార్తలను బ్యానర్గానే కాకుండా పుంఖానుపుంఖాలుగా మూడు పేజీల్లో రాసిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఈనాడు పత్రికా ప్రమాణాలు, విలువలను దిగజార్చడం బాధాకరం. ఈనాడులో వివరణ ఇవ్వడంలోనూ నిజాయితీ లోపించింది. పట్టాభి పాత ఫొటోలను మొదటి పేజీలో ప్రచురించిన ఈనాడు.. వివరాలను మాత్రం లోపలి పేజీల్లో కనిపించని రీతిలో వేయడం ఆక్షేపణీయం. ఈనాడు మీడియా ఇలాంటి దుష్టపోకడలను మానుకోవాలి అని సూచించారు. -
ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్ మీడియా కాలమిది: కన్నబాబు ఫైర్
సాక్షి, కాకినాడ: టీడీపీ, ఎల్లో మీడియాపై మాజీ మంత్రి కన్నబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. విష ప్రచారమే అజెండాగా ఎల్లోమీడియా పనిచేస్తోందన్నారు. గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి డ్రామా క్రియేట్ చేశాడని ఘాటు విమర్శలు చేశారు. కాగా, కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లోమీడియా రోజురోజుకూ దిగజారుతోంది. చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా పనిచేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు బరితెగించి విష ప్రచారం చేస్తున్నారు. గన్నవరంలో పట్టాభి డ్రామా క్రియేట్ చేశాడు. ఈనాడులో తప్పుడు ఫొటోలు వేసి దుష్ప్రచారం చేశారు. పట్టాభిని కొట్టారంటూ అబద్ధపు రాతలు రాశారు. తప్పుడు వార్తలు రాసి సవరణ మాత్రం సింగిల్ కాలమ్లో వేశారు. ఇవి ఎల్లో మీడియాలో రోజులు కావు.. సోషల్ మీడియా రోజులు అని అన్నారు. జాకీలు పెట్టి లేపినా లేవలేని పరిస్థితి టీడీపీది. ఈనాడు చంద్రబాబు కరపత్రిక అని మరోసారి రుజువైంది. పట్టాభిని ఎవరూ కొట్టలేదని వైద్యులే ధృవీకరించారు. ఈనాడు విషపురాతలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక భాగం కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక విప్లవానికి తెరతీశారు. దేశంలో ఎవరూ చేయని సాహసం సీఎం జగన్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వంపై ఈనాడు కుట్ర చేస్తోంది. అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో టీడీపీ ఉంది. -
పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ దీనస్థితిపై ఆ పార్టీ వర్గాల్లో అలజడి మొదలైంది. తమ గొయ్యి తామే తవ్వుకొంటున్నామని ఆ పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. పార్టీకి హైప్ తేవాలనే కొత్త వ్యూహాలతో కష్టాలు కొని తెచ్చుకొంటున్నామని అంటున్నారు. గన్నవరం వ్యవహారంలో పట్టాభి ఓవరాక్షన్ వల్లే ఇంత నష్టం చవిచూడాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఆయనకు సంబంధంలేని గన్నవరానికి వెళ్లి అక్కడ ఎమ్మెల్యేను దుర్భాషలాడటం అంటే ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్టుందని ఎద్దేవా చేస్తున్నారు. గన్నవరం బాధ్యతలు చూస్తున్న బచ్చల అర్జునుడు అనారోగ్యంతో ఉన్నాడనే ఓ సాకు ఆధారంగా పట్టాభి చక్రం తిప్పాలని భావించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే వంశీపై మాటల యుద్ధం మొదలు పెట్టాడు. ఐదు, ఆరు రోజుల తరువాత నేరుగా గన్నవరానికి వెళ్లి తన తడాఖా చూపిద్దాం అనుకున్నాడు. గొడవ సృష్టించడం ద్వారా టీడీపీకి సానుభూతి వచ్చేలా అడుగువేద్దామనుకున్నాడు. అయితే ఆయనతోపాటు, టీడీపీ శ్రేణుల చిల్లర చేష్టలు, దిగజారుడు వ్యాఖ్యలతో వంశీ వర్గీయులు తీవ్రంగా బాధపడిపోయారు. టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దూసుకొస్తుండటంతో ప్రతిఘటించక తప్పలేదు. పోలీసులను భయపెట్టి... పోలీసులను భయపెట్టి లబ్ధిపొందాలని చూసిన పట్టాభి అండ్ గ్యాంగ్ వ్యూహం బెడిసికొట్టింది. సీఐకి గాయం అయినప్పటికీ పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత కూడా టీడీపీ నేతలు అతి చేయడం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పట్టాభి చేసింది సబబేనని సమర్థిస్తూ మాట్లాడాలని అధిష్టానం నుంచి సూచనలు అందటంపై భగ్గుమంటున్నారు. చంద్రబాబు తీరుపై... ఇంతటితో ఈ వ్యూహానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన చంద్రబాబు తగుదునమ్మా అంటూ ప్రత్యేక విమానం వేసుకొని విజయవాడకు రావటం, పట్టాభి భార్యను పరామర్శించడం ముమ్మాటికీ వ్యూహాత్మక తప్పిదమని ఆ పార్టీలోని పలువురు సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం నందిగామలో ఇలానే ఓవరాక్షన్ చేసి, అనక దొరికి పోయి తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోవాల్సి వచ్చిందన్న విషయం తమ అధిష్టానం గుర్తిస్తే బావుటుందని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని సాగదీసేకొద్దీ వంశీకి విస్తృత ప్రచారం వస్తుందనే విషయాన్ని తమ బాబు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నటన ఫెయిల్తో అభాసుపాలు.. నటన ఫెయిల్ కావడంతో పట్టాభి మరింత అభాసుపాలయ్యాడు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకపోయినా కొట్టారని నమ్మించేందుకు గన్నవరం కోర్టులో ఆయన చేసిన నటన అంతా ఇంతా కాదని అంటున్నారు. ఇది టీడీపీ పరువు మరింత తీసిందని పేర్కొంటున్నారు. దీంతో అభాసుపాలు కావాల్సి వచ్చిందని చెబుతున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించే యత్నాన్ని, అతని నటనను గుడివాడ, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులు బహిర్గతం చేశాయి. చదవండి: ‘ఎల్లో గ్యాంగ్’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ ఇరువర్గాల ఘర్షణలో చేతికి చిన్న గాయం తప్ప, ఆయనకు ఎలాంటి గాయాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం మీద గన్నవరం ఎపిసోడ్లో పట్టాభి పార్టీ పరువు తీశాడని, కొంత మంది టీడీపీ నేతలే మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకొని, ప్రజల వద్దకు వెళితే మంచిదనే భావన ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. -
టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సీఐ పి.కనకారావుపై రాళ్లతో దాడి చేసి గాయపరచడంతోపాటు హత్యాయత్నానికి అనుచరులను ప్రేరేపించిన కేసులో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు బుధవారం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసుల సమాచారం మేరకు.. ఈ కేసులో 11 మంది నిందితులను మంగళవారం గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పది మందికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జడ్జి ఎదుట పట్టాభి ఆరోపించారు. దీంతో ఆయనకు విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించి తిరిగి కోర్టులో హాజరుపరచాలని జడ్జి శిరీష పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు పట్టాభికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు బుధవారం కోర్టుకు తీసుకువచ్చారు. పట్టాభి చేతులకు సాధారణ గాయాలు మినహా శరీరంపై కొత్త గాయాలు ఏమీ లేవని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ను కోర్టులో ఆయనకు చదివి వినిపించారు. మెడికల్ సర్టిఫికెట్పై పట్టాభి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాకుండా మిగిలిన నిందితులు ఉన్న గన్నవరం సబ్జైలుకు తనను రిమాండ్కు పంపించాలని పట్టాభి కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం పోలీసులు పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. అయితే సబ్ జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉండటంతో వీరందరినీ వేరే జైలుకు పంపించాలని జైలర్ యూనస్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడంతో పట్టాభితోపాటు మరో పది మంది నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. -
‘ఎల్లో గ్యాంగ్’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ.. ఆపై చింతిస్తున్నామని సవరణ
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక ఎందుకింతలా దిగజారిపోతోంది? ఒక పార్టీపై బురద జల్లడానికి.. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి... పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి... ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి రెండేళ్ల కిందటి ఫొటోలు ఇవ్వాల్టివేనని అబద్ధాలు చెబుతూ ప్రచురించే స్థాయికి ఎందుకు పడిపోయింది? అసలిలాంటి పత్రికను ఎవరైనా నమ్మొచ్చా? చంద్రబాబును అధికార పీఠంపైకి తేవటం కోసం ఈ రాష్ట్రాన్ని ఏం చేసినా ఫర్వాలేదనుకునే రామోజీరావు మనస్తత్వాన్ని క్షమించవచ్చా? ‘పట్టాభినీ కొట్టారు’ అంటూ పతాక స్థాయిలో వేసిన శీర్షికలోనే కాదు... ఆ వార్తలో ప్రతి అక్షరం అబద్ధాలతో కూడిన కాలకూట విషమే. అసలు పట్టాభిని కొట్టనే లేదని పోలీసులు కోర్టులో చెబితే... దాన్ని వైద్యాధికారులు సైతం ధ్రువీకరిస్తే... కొట్టారంటూ ‘ఈనాడు’లో వార్తలేంటి? పైపెచ్చు... ‘తీవ్రంగా కొట్టారు. అరచేతిపైనా, కాళ్లపైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించారంట దుర్మార్గపు రాతలేంటి? ఆ రాతలన్నీ నిజమని నమ్మించటానికి వాటికి రుజువులుగా ఎప్పుడో రెండేళ్ల కిందట ‘2021 ఫిబ్రవరి 3న’ తన పత్రికలోనే వేసిన ఫొటోలను మళ్లీ ఇప్పుడు వేసేసిన దౌర్భాగ్యపు పరిస్థితేంటి? అంటే... మీ దృష్టిలో మీ పాఠకులంతా వెర్రివాళ్లా రామోజీరావు గారూ? మీరు ఏం రాసినా నమ్మేస్తారనే భ్రమల్లోనే ఇంకా బతుకుతున్నారా? అదంతా ఒక చరిత్ర అని... ‘సాక్షి’ రాకముందు కొన్నాళ్లపాటు తెలుగు పత్రికారంగం ఎదుర్కొన్న సంధికాలమని ఇప్పటికీ తెలియటం లేదా? ‘సాక్షి’ ఆవిర్భవించిన నాటి నుంచీ మీ ఏకఛత్రాధిపత్యానికి కాలం చెల్లిందని... వార్తలకు రెండోవైపున ఏమున్నదో కూడా జనం చూస్తున్నారని మరిచిపోయారా? ఇంటర్నెట్ వేదికగా వ్యక్తులే శక్తిమంతమైన మీడియాగా మారుతున్న ఈ రోజుల్లోనూ మీరు పచ్చి అబద్ధాలను పోగేస్తే నమ్మేస్తారని ఎలా అనుకుంటున్నారు? అసలు ఏనాటికైనా మారుతుందా ‘ఈనాడు’? ‘బీసీ’ల అభ్యున్నతి జనానికి చేరకుండా... సోమవారం శాసనమండలి అభ్యర్థులను ప్రకటిస్తూ... ఉన్న 18 స్థానాల్లో 14... అంటే ఏకంగా 68 శాతాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయిస్తూ కొత్త చరిత్రను లిఖించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. ఆనందంతో ర్యాలీలు చేశారు. ఇప్పటికే బీసీల్లో బలం పెంచుకున్న వై.ఎస్.జగన్కు... దీనివల్ల మరింత ఖ్యాతి వస్తుందని భావించిన తెలుగుదేశం, దాని మిత్ర మీడియా... వ్యూహం ప్రకారం అదేరోజున ‘గన్నవరం’ కుట్రకు తెరతీశాయి. తామే రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వటమే కాక... విజయవాడ నుంచి గన్నవరానికి వెళ్లి మరీ పట్టాభి సహా టీడీపీ నేతలు అక్కడి ఎమ్మెల్యే వంశీ అనుచరులతో ఘర్షణకు దిగారు. దాదాపు అన్ని ఛానెళ్లలోనూ బీసీలకు పట్టం కట్టిన వ్యవహారం రాకుండా... టీడీపీ చక్రం తిప్పింది. మంగళవారం నాడు ‘ఈనాడు’లో ... గన్నవరంలో ప్రభుత్వమే దారుణాలకు పాల్పడ్డట్టుగా... పోలీసులే దౌర్జన్యం చేసినట్లుగా దారుణమైన కథనాలు వండివార్చేశారు. ఆ ఘర్షణల సందర్భంగా అరెస్టయిన పట్టాభిని పోలీసులు దారుణంగా కొట్టారంటూ బుధవారం దాన్ని కొనసాగించారు. అందుకు రుజువులుగా ఎప్పుడో 2021 ఫిబ్రవరి 3నాటి ఫోటోలను... ఇప్పటివేనంటూ వేసేశారు. అదీ జరిగిన కథ!!. ఔరా రామోజీ?? 2021, ఫిబ్రవరి 3 ‘ఈనాడు’ ఏం రాసిందంటే... ‘కర్రలు, రాడ్లతో పట్టాభిపై దాడి’ అని ‘ఈనాడు’ బ్యానర్గా ప్రచురించిన వార్త ఇది. టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ‘ఈనాడు’ హడావుడి చేసింది. విజయవాడలోని తన ఇంటి నుంచి కారులో వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని... కారు అద్దాలు పగలగొట్టారని... పట్టాభిని కారు నుంచి బయటకులాగి... ఎడమ మోచేయి, ఎడమ మోకాలు, తొడపై ఇష్టారాజ్యంగా కొట్టారని వార్త ప్రచురించింది. తన భర్తకు ప్రాణహాని ఉందని పట్టాభి భార్య చందన ఆవేదన వ్యక్తం చేసినట్టు మరో వార్త ఇచ్చింది. పోలీసులు స్పందించి ఆ దాడిని మెడికో లీగల్ కేసుగా నమోదు చేస్తాం... ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తామంటే పట్టాభి వద్దన్నారని, దాంతో... పోలీసులు బలవంతంగా ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారని ఇంకో వార్త వేసింది. పట్టాభికి సంఘీభావంగా చంద్రబాబు హుటాహుటిన ఆయన నివాసానికి వచ్చి పరామర్శించటమే కాక... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త కూడా వేసింది. ఇక పట్టాభి శరీరంపై గాయాలు... పట్టాభిపై దాడికి ఉపయోగించిన కర్ర... ధ్వంసమైన పట్టాభి కారు అద్దాలు...పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తీసుకువెళుతుండటంతో విలపిస్తున్న పట్టాభి... పట్టాభిపై దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన తరువాత పోలీసులతో మాట్లాడుతున్న చంద్రబాబు... పట్టాభి శరీరంపై గాయాలను పరిశీలిస్తున్న చంద్రబాబు... అంటూ పెద్దపెద్ద ఫొటోలతో విపరీతమైన హడావుడి చేసి... రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందనే భావన కలిగించాలని కుట్ర పన్నింది. కానీ... ఆ కుట్ర బెడిసికొట్టింది చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టింది. ఎందుకంటే ఆ దాడి గురించి ఫిర్యాదు చేయడానికి పట్టాభి ఇష్టపడలేదు. ఎవరిపైనయినా అనుమానం ఉందా? అంటే కూడా చెప్పలేదు. పోలీసుల దర్యాప్తునకు సహకరించలేదు. పోలీసులు దర్యాప్తు జరపటానికే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? వాస్తవానికి పట్టాభికి సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు, వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, కొందర్ని ఆయన చేసిన మోసాలు అప్పట్లో కథలుకథలుగా వినిపించాయి. తన వ్యక్తిగత రహస్యాలను బయటపడకుండా బ్లాక్మెయిలింగ్ చేసేందుకు పట్టాభే ఆ దాడి డ్రామా ఆడించారని టీడీపీ వర్గాలు లోలోపల వ్యాఖ్యానించాయి కూడా. ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆయన దర్యాప్తునకు ఇష్టపడలేదు. దీంతో పట్టాభిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టింది. అయినా... మనసు మారలేదు అప్పట్లో చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టినా... ‘ఈనాడు’ మాత్రం మారలేదు. మళ్లీ బుధవారంనాడు పాత స్కీమునే పునరావృత్తం చేసింది. పట్టాభి అరికాళ్లు, తొడలపై దెబ్బలు అంటూ అలనాటి 5 ఫోటోలను మొదటి పేజీలో ప్రచురించింది. ‘దేశమంతా ఐపీసీ చట్టం.. రాష్ట్రంలో వైసీపీ చట్టం’ అంటూ మరో కథనంతో మొదటి, రెండు పేజీలను నింపేసింది. ‘నా భర్త ప్రాణాలకు ముప్పు’ అంటూ పట్టాభి భార్య చందన వాపోతున్నట్టుగా మరో వార్తను ఏకంగా అయిదు ఫొటోలతో ప్రచురించి 3వ పేజీని నింపేసింది. ‘ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తారా’అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మరో వార్త కూడా వేసింది. అంటే... రెండేళ్ల కిందటి ఘటనతో బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ ఆ స్కీమ్ను పునరావృత్తం చేశారు రామోజీరావు గారు. కాకపోతే మధ్యాహ్నానికల్లా సోషల్ మీడియాలోనే అందరూ నిజానిజాలు చెబుతూ ‘ఈనాడు’ వలువలు ఊడదీసేశారు. ఇప్పటికైనా రామోజీ మారతారా? పట్టాభిని పోలీసులు కొట్టనే లేదు – వైద్య పరీక్షల్లో నిర్ధారణ పట్టాభిని పోలీసులు కొట్టారన్న టీడీపీ ఆరోపణలు అవాస్తవమని స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో పట్టాభికి విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్దారించారు. వైద్యులు రెండు సార్లు పరీక్షించి మరీ ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దాంతో తనను కొట్టారంటూ పట్టాభి ఆడిన డ్రామా... వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన అవాస్తవ ఆరోపణలు... రాష్ట్రంలో ఐపీసీ కాదు వైసీపీ అమలు అవుతోందంటూ ఈనాడు చేసిన దుష్ప్రచారం అంతా పక్కా ముందుస్తు కుట్రేనన్నది స్పష్టమైంది. సీఐ దళితుడు కాదంటూ టీడీపీ అసత్యవాదన... – ఆయన దళితుడేనని ధ్రువీకరించిన తహశీల్దార్ పట్టాభి, మరికొందరు టీడీపీ నేతలు దళితవర్గానికి చెందిన గన్నవరం సీఐ కనకరావును కులం పేరుతో దూషిస్తూ ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఆయన తలకు తీవ్రగాయం కావడంతో వైద్యులు 8 కుట్లు వేయాల్సి వచ్చింది. దాంతో కనకారావు ఫిర్యాదుపై పట్టాభితోపాటు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా టీడీపీ తమ న్యాయవాది ద్వారా న్యాయస్థానంలో అవాస్తవ వాదనలు వినిపించడం విస్మయం కలిగిస్తోంది. అసలు సీఐ కనకరావు దళితుడే కాదని టీడీపీ న్యాయవాది వాదించడం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. కానీ సీఐ కనకరావు మాల(ఎస్సీ) సామాజిక వర్గానికి చెందినవారని గన్నవరం తహశీల్దార్ ధ్రువీకరించారు. దాంతో టీడీపీ పన్నాగం మరోసారి విఫలమైంది. -
పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు: ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత పట్టాభి విషయంలో ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్టాభి విషయంలో ఏం జరిగిందో ఎస్పీ జాషువా కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ లీడర్ పట్టాభిని పోలీసులు కొట్టారనేది అవాస్తమని స్పష్టం చేశారు. కాగా, ఎస్పీ జాషువా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నిందలు వేయడం సరికాదు. పట్టాభి అవాస్తవంతో కోర్టును తప్పుదారి పట్టించాలని చూశారు. పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు. డాక్టర్ల బృందం రెండుసార్లు పరీక్షించినా ఎలాంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైంది. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా సుమోటోగా కేసు నమోదు చేశాం. వీడియో ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి, ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. -
బూతులు తిట్టడంలో పరీక్ష పెడితే పట్టాభికి డిస్టింక్షన్ వస్తుంది: సజ్జల
-
పట్టాభిని కొట్టారంటూ ఈనాడు తప్పుడు రాతలు
-
అడ్డంగా బుక్కైన ‘ఈనాడు’.. ఫేక్ వార్తల్లో పచ్చ మీడియా స్టైలే వేరు!
అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా!. సంక్షేమ ప్రభుత్వంపై పడి ఏడుపు రాతలు రాసే ఈనాడు తీరే అంతేనేమో. రామోజీరావు స్వయంగా పర్యవేక్షించే ఈ పత్రికలో.. సీఎం జగన్ సర్కార్పై తప్పుడు రాతలు, ఫేక్ కథనాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. తాజాగా బొక్కబొర్లాపడే రీతిలో మరో అడుగేసింది ఈనాడు. అదీ మరీ సోయిలేని రీతిలో వ్యవహరించడమే ఇక్కడ గమనార్హం!. ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చ మీడియా ఎప్పుడూ అసత్య ప్రచారమే చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా పచ్చ మీడియాకు తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ ప్రజలకు నిజలేంటో చెబుతూనే ఉంది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసి ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. దీంతో చేసేదేమీ లేక తప్పు ఒప్పుకుని చింతిస్తున్నామంటూ ప్రకటనతో చేతులు కడిగేసుకుంది. కానీ, అది వదిలే మరక కాదని సంగ్రహించలేకపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తప్పులు సహజం కావొచ్చు. కానీ, ఈనాడు చేసిన తప్పిదం చిన్నదైతే కాదు. రెండేళ్ల క్రితం గన్నవరం ఘటనలో జగన్ సర్కార్పై కూడగలుపుకుని ‘ఈనాడు’, టీడీపీ దుష్ప్రచారం చేశాయి. టీడీపీ నేత పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ విష ప్రచారం చేశాయి. చంద్రబాబు డైరెక్షన్లో.. రామోజీ యాక్షన్లో ఈనాడు ఓ పె.. ద్ద కథనం రాసుకొచ్చింది. అయితే, 2021 నాటి ఘటనలోని ఫొటోలనే ఈనాడు తాజాగా ప్రచురించి అభాసుపాలైంది. రెండేళ్ల క్రితం ఫొటోలను ప్రచురించి.. ప్రస్తుతం జరిగిన ఘటనలో పట్టాభిని కొట్టారంటూ కలరింగ్ ఇచ్చింది ఈనాడు. ఇక, దొరికిందే సందు అన్నట్టుగా ఈ వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం గమనార్హం. టీడీపీ.. ఈనాడు తప్పుడు ఫొటో కథనాలను ట్వీట్ చేసి సీఎం జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే అదునుగా పట్టాభిని కొట్టారంటూ కోర్టులో ఈనాడు ఫొటోలను ఆయన న్యాయమూర్తులు కోర్టులో చూపించారు. అనంతరం, వైద్యులు.. పట్టాభికి ఎలాంటి గాయాలు లేవని పూర్తిగా ఫిట్గా ఉన్నాడని ధృవీకరించారు. అయితే, వైద్యుల ధృవీకరణతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ప్చ్.. చేసేదేమీ లేకపోవడంతో చింతిస్తున్నామంటూ ఈనాడు బహిరంగంగానే ఓ నోట్ను విడుదల చేసింది. ఈ ఫొటోలు 2021 నాటివి అని ఒప్పుకుంది. టోటల్గా చంద్రబాబు దుష్ట రాజకీయంతో పత్రికా విలువలను పక్కనపెట్టి.. పరువు పొగొట్టుకుంది. -
గన్నవరం: సీఐపై దాడి కేసులో 10 మంది టీడీపీ నేతలకు రిమాండ్
గన్నవరం/నాగాయలంక (అవనిగడ్డ)/కోనేరుసెంటర్/పటమట/లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణాజిల్లా గన్నవరంలో విధి నిర్వహణలో ఉన్న సీఐ పి.కనకారావును కులం పేరుతో దూషిస్తూ, రాళ్లతో కొట్టి గాయపరిచిన కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. వీరిలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ప్రభుత్వాస్పత్రికి, పదిమందిని గన్నవరం సబ్జైలుకు తరలించారు. గన్నవరంలో సోమవారం టీడీపీ నేతలు సృష్టించిన ఘర్షణకు సంబంధించి పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. వీటిలో మూడు టీడీపీ నేతలు, కార్యకర్తలపై.. ఒకటి ఎమ్మెల్యే అనుచరులపై నమోదైంది. పట్టాభి తనను కులం పేరుతో దూషించడమేగాక ఆయనతోపాటు దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు మరో ఎనిమిదిమంది తనను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చడంతోపాటు చంపేవిధంగా అనుచరులను ప్రేరేపించారని సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి తదితరులపై అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తమను నెట్టేసినట్లు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కుండేటి రఘుబాబు, మేకల కోటేశ్వరరావు, కొలుసు వరప్రసాద్ తదితరులపై ఎస్ఐ రమేష్బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై మరో కేసు నమోదైంది. టీడీపీ నేతలు పట్టాభి, మూల్పూరి కళ్యాణి, కోనేరు సందీప్, గూడవల్లి నరసయ్య, జాస్తి వెంకటేశ్వరరావు తనను కులం పేరుతో దూషించినట్లు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరులు యతేంద్రరామకృష్ణ, మోహన్రంగా తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించినట్లు టీడీపీ నేత దొంతు చిన్నా భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐపై దాడికేసులో.. సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. టీడీపీ నేతలు పట్టాభి, చిన్నా, వీరంకి గురుమూర్తి, లావు వంశీకృష్ణ, జాస్తి ఆదిశేషు, లావు వంశీకృష్ణ, చల్లగుళ్ల సందీప్, గురివిందగుంట దేవేందర్, ముప్పరాజు కార్తీక్, గుజ్జర్లపూడి బాబూరావు, కంచర్ల సూర్యప్రకాష్లను అరెస్ట్చేసి మంగళవారం స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. పట్టాభి తనను పోలీసులు కొట్టినట్లు ఆరోపించడంతో ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యచికిత్స చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచాలని జడ్జి బి.శిరీష పోలీసులను ఆదేశించారు. మిగిలిన పదిమందికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పట్టాభిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, మిగిలినవారిని గన్నవరం సబ్జైలుకు తరలించారు. పోలీసులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం గన్నవరం ఘటనకు సంబంధించి మచిలీపట్నం, నాగాయలంకల్లో సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగి, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. గన్నవరం నుంచి తొమ్మిదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు మచిలీపట్నంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గన్నవరం టీడీపీకి చెందిన ఒక న్యాయవాది తొమ్మిదిమంది అనుచరులతో అక్కడికి వెళ్లి భద్రత విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసి పోలీసులు నిర్భంధించిన తొమ్మిదిమంది నాయకులు, కార్యకర్తలను కారుల్లో తప్పించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్పీ జాషువ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది జీపీఎస్ ద్వారా తప్పించుకున్న వారిని వెంబడించి నిమిషాల వ్యవధిలో న్యాయవాదితో సహా అందరినీ పట్టుకుని బందరు రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వాణి ఫిర్యాదు మేరకు మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. గన్నవరం ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ను సోమవారం అర్ధరాత్రి నాగాయలంక పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో ఆయన అనుచరులు, స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్కు వచ్చి ఆందోళన చేశారు. బోడెని చూసేందుకు అనుమతించాలంటూ సీఐ శ్రీనివాస్తో వాగ్వాదానికి దిగారు. టీడీపీ మహిళా నేత తలశిల స్వర్ణలత, కొందరు తెలుగు తమ్ముళ్లు సచివాలయ మహిళా కానిస్టేబుల్తో దురుసుగా మాట్లాడారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ స్టేషన్లో బోడెను పరామర్శించారు. బోడె ప్రసాద్ను స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. పోలీసులతో పట్టాభి భార్య వాగ్వాదం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్టాభి ఇంటివద్ద మంగళవారం ఆయన భార్య చందన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె నిరపరాధి అయిన తన భర్తను విడుదల చేయకపోతే డీజీపీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించటంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీనిపై ఆమె పోలీసులతో పరుష పదజాలంతో వాగ్వాదానికి దిగారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి పలువురు టీడీపీ నేతలు పట్టాభి ఇంటిపైకెక్కి ఆందోళన చేపట్టారు. పట్టాభి కుటుంబ సభ్యులను మంగళవారం రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం టీడీపీ నాయకుడు పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలే గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయని ఎస్పీ పి.జాషువ చెప్పారు. ఆయన దాడికి ప్రేరేపించడంతోనే సీఐ కనకారావు గాయపడ్డారని తెలిపారు. మచిలీపట్నంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయంపై దాడికి సంబంధించి వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. సుమోటోగా రైటింగ్, నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ వారి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ కనకారావును మంగళవారం పోలీసుల సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు జయపాల్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మస్తాన్ఖాన్ పరామర్శించారు. -
రెచ్చగొట్టి మరీ రచ్చ రచ్చ
‘‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళతా!. ఎవడేం పీకుతాడో చూస్తా. ఆ వంశీ సంగతి తేలుస్తా. నియోజకవర్గంలోంచి బయటకు విసిరేస్తా’’ అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ముందు రెచ్చగొట్టింది... టీడీపీ నాయకుడు పట్టాభి. ‘‘దొంతు చిన్నా ఇంటికి వచ్చి వంశీ మనుషులు బెదిరించారని మీరంతా కేసు పెట్టండి. నేనూ వస్తా. వంశీ సంగతి తేలుస్తా’’ అని గన్నవరం టీడీపీ నేతలతో చెప్పింది... పట్టాభి. అన్నట్టుగానే వెళ్లాడు. తనతో పాటు కొంతమందిని అక్కడికి తీసుకువెళ్లటంతో పాటు స్థానిక తెలుగుదేశం నాయకులను కూడా వెంటేసుకుని... దండయాత్రకు బయలుదేరాడు. అక్కడ అలజడి సృష్టించబోయాడు. వంశీ అనుచరులు, అభిమానులు దీన్ని అడ్డుకోబోయారు. అప్పుడే ఇరువర్గాలకూ ఘర్షణ జరిగింది. తెలుగుదేశం నేతలు ముందే ఘర్షణకు సిద్ధమై మారణాయుధాల్లాంటి పరికరాలు తీసుకెళ్లటం వల్లే... స్థానిక సీఐ కనకారావు నుదుటిపై తీవ్ర గాయమైందనేది ప్రత్యక్ష సాక్షుల మాట. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటో తెలుసా? బాధితులను పరామర్శించటానికంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఆయన అనుకూల మీడియా రభస మొదలెట్టింది. మొత్తానికి అందరూ కలిసి... అసలిక్కడ ప్రజాస్వామ్యమే లేదంటూ ఆక్రందనలు మొదలుపెట్టారు. అదీ కథ. (సాక్షి ప్రతినిధి, విజయవాడ): అసలిక్కడ బాధితులెవరు? చంద్రబాబు నాయుడు ఓదార్చాల్సింది ఎవరిని? ఓదార్చటం కన్నా ముందు తెలుగుదేశం నేతల్ని మందలించాలి కదా? ఇలాంటి సవాళ్లు, బెదిరింపులు రాజకీయాల్లో సరికాదని చెప్పాలి కదా? గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన బచ్చుల అర్జునుడు దురదృష్టవశాత్తూ ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రిలో చేరితే... ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఇంత అత్యుత్సాహం తగదని పట్టాభికి చెప్పాలి కదా? అవేమీ లేకుండా పట్టాభికి తోడుగా మీరంతా ఎందుకు వెళ్లలేదని పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడే క్లాసు తీసుకున్నారంటే ఆయన మానసిక స్థితిని ఎలా అంచనా వేసుకోవాలి? రాజకీయ పునర్వైభవం కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నారనేగా అర్థం!!. పట్టాభి కూడా అంతే. అవును మరి! ఆవు చేలో మేసినపుడు దూడ గట్టున మేస్తుందా!!? విజయవాడే కాదు. కృష్ణా జిల్లాలో అందరికీ ఇటీవల సంకల్పసిద్ధి అనే ఫైనాన్స్ కంపెనీ చేసిన మోసం గురించి తెలిసే ఉంటుంది. నిర్వాహకులను పట్టుకోవటంతో పాటు పోలీసులు కేసులూ పెట్టారు. అయితే దాన్ని అదునుగా తీసుకున్న తెలుగుదేశం నేతలు కొన్నాళ్లుగా సంకల్పసిద్ధి నిర్వాహకులతో సంబంధం ఉందంటూ గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమకు ఆ సంస్థ వివరాలు గానీ, నిర్వాహకుల ఊరూపేరూ గానీ ఏమీ తెలియవని వారిద్దరూ పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. అయినా సరే తెలుగుదేశం నేతలు తమ విమర్శలు కొనసాగిస్తుండటంతో... దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు వల్లభనేని వంశీ. కాకపోతే దీన్ని కూడా తెలుగుదేశం నేతలు ఎగతాళి చేశారు. అసలు వంశీకి పరువంటూ ఉంటే కదా... కేసులు వెయ్యాల్సింది? అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. వంశీని విమర్శిస్తూ... ఆయన సంగతి తేలుస్తానని టీడీపీ నేత దొంతు చిన్నా ఆవేశంతో ఊగిపోయాడు. ఇదిగో... ఇదే కారణంతో వంశీ అనుచరులు చిన్నా ఇంటికి వెళ్లారు. ఆ సమయానికి ఆయన లేకపోవటంతో... ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదని, నోరు అదుపులో ఉంచుకోమని ఆయనకు చెప్పాలంటూ చిన్నా భార్యతో మాట్లాడి వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న పట్టాభి... దీన్నో అవకాశంగా మార్చుకుని అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్నారు. విజయవాడ నుంచి మనుషులను తీసుకుని వెళ్లి మరీ అక్కడ వారందరితో కలిసి ర్యాలీగా పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లారు. అయినా పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే బాధితులు వెళితే సరిపోదా? ఇన్ని వందల మంది ర్యాలీగా వెళ్లాలా? అలా వెళ్లారంటే ఏమిటర్థం? వాళ్లు వెళ్లింది దండయాత్రకనేగా? క్లుప్తంగా గన్నవరంలో ఘర్షణలకు దారితీసిన ఘటనలు ఇవే. సోమవారం టీడీపీ మూక పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తుండగా ఇరు వర్గాలూ ఎదురుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకుని పరిస్థితిని చల్లబరిచారు. తరవాత టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి ముందే పగలగొట్టిన నాపరాళ్లతో పాటు చేతికందిన కర్రలు, రాడ్లు సిద్ధం చేసుకున్నారు. అంతలో అటుగా వెళుతున్న వంశీ అనుచరులను చూసి రెచ్చగొట్టేలా అరవటంతో... అక్కడ ఇరువర్గాలూ ఘర్షణకు దిగాయి. వీరిని వారించబోయిన పోలీసులకూ టీడీపీ నేతల చేతిలో గాయాలయ్యాయి. ఎస్పీ జాషువా అప్రమత్తంగా వ్యవహరించి, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి కుదుట పడింది. అదీ జరిగిన కథ. దూషణల్లో నెంబర్–1 చంద్రబాబే... వాస్తవానికి కొన్నాళ్లుగా ముఖ్యమంత్రితో సహా ఆయన కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరందరిలోనూ చంద్రబాబే ముందుంటూ... ఎక్కడకు వెళ్లినా, ఏ సభలోనైనా పదుల సార్లు ‘సైకో’ అంటూ ముఖ్యమంత్రిపై తీవ్ర దూషణకు దిగుతున్నారు. అదే కోవలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిందిగా తన పార్టీ కార్యకర్తలకు, జీతగాళ్లకు కూడా చెబుతున్నారు. ఏ చిన్నఘటన జరిగినా వారిని ఉసిగొల్పుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేయిస్తున్నారు. తనకు వంత పాడే మీడియా సహకారంతో అధికార పార్టీనే తిరిగి వేలెత్తి చూపిస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివద్ధి పాలనలో వేలెత్తి చూపే అంశాల్లేక... ప్రజల్లోకి వెళ్లడానికి మొహం చెల్లక ఇలాంటి రచ్చకు దిగుతున్నారనేది తెలియనిదేమీ కాదు. ఈ నెలలోనే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరంలో మూడు ఘటనలు జరిగాయంటే పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది. చిన్న విషయాలను పెద్దవి చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ నేతలు ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. మచిలీపట్నం, గుడివాడలోనూ.. మచిలీపట్నంలో ఈ నెల 7న ఇదే విధంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. నిబంధనలు పాటించాలని కోరిన పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర రెచ్చిపోయారు. ప్రభుత్వ భూమిలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని, దానిని అడ్డుకొంటామంటూ రవీంద్ర కార్యకర్తలతో కలిసి వచ్చి అమలులో ఉన్న 30 పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించారు. పోలీసులు ప్రజా రవాణాకు అంతరాయం కలుగుతుందని, ధర్నాకు అనుమతి లేదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నచ్చజెప్పారు. దీంతో రవీంద్ర, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రవీంద్ర పోలీసులను నెట్టుకుంటూ, దుర్భాషలాడుతూ, నడి రోడ్డులో ఎస్సైపై చెయ్యి చేసుకున్నారు. ఆ మరునాడే గుడివాడలోనూ టీడీపీ నాయకులు బరితెగించారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ, ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు మునిసిపల్ అధికారులకు వేలు చూపిస్తూ బూతులతో రెచ్చిపోయారు. కోర్టు ఆదేశాలను అడ్డుకోవడం నేరమని చెప్పిన పోలీసులు, అధికారులపై జులుం ప్రదర్శించారు. -
గన్నవరం ఘటనలో టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్..
గన్నవరం ఘటనలో టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితో పాటు మరో 10 మందికి రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా చికిత్స నిమిత్తం పట్టాభిని విజయవాడ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన 10 మందిని రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులకు న్యాయమూర్తి సూచించారు. కాగా గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
టీడీపీ ఆఫీస్ నుండి పట్టాభి నాపై దుష్ర్పచారం చేశారు: వంశీ
-
‘చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు’
న్యూఢిల్లీ: చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, దొంగల ముఠాను ఎన్నికలకు అనుమతిస్తే దేశం పరిస్థితి అధోగతి పాలవుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు లోకేష్, బోండా ఉమ, దేవినేని ఉమ, పట్టాభి వ్యాఖలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రాజ్యంగ బద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పై అసభ్యపదజాలాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని వివరించామని తెలిపారు. అనాగరికంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోని.. ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరామన్నారు. రాజ్యంగా బద్ధంగా జరిగే ఎన్నికలలో టీడీపీ ఉగ్రవాదులకు స్థానంలేదని మండిపడ్డారు. కాగా, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై కేసులు పెడితే తప్పేంటని ఎన్నికల సంఘం ప్రశ్నించిందని అన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నంబర్లను పంపాలని ఈసీ కోరిందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి -
చూడవయ్యా నీ మంత్రే ఏమన్నాడో..
-
‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా బాబు?!’
సాక్షి, విజయవాడ: ‘‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరడం హాస్యాస్పదంగా ఉంది. అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో చంద్రబాబుకు తెలుసా. చంద్రబాబు గురించి తెలుసు కాబట్టి మోదీ, అమిత్ షా అపాయింట్ కూడా ఇవ్వలేదు’’ అని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాసివ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రపంచంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి’’ అని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా) ‘‘పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించి ఉంటే బావుండేది. గతంలో చంద్రబాబు ప్రధాని మోదీకి నిరసన స్వాగతం పలికారు. అమిత్ షా కుటుంబతో సహా తిరుమలకు వస్తే దాడులు చేయించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీని వ్యతిరేకిస్తూ దీక్షలు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడాలని చంద్రబాబు భావిస్తున్నారు’’ అని విజయ్ బాబు తెలిపారు. చదవండి: పట్టాభి తీరు సమర్థనీయం కాదు.. పార్టీలకతీతంగా ఖండించాలి -
పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని
కాకినాడ(తూర్పుగోదావరి): మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ఆ పార్టీ నేత పట్టాభికి ప్రాణహాని పొంచి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైఎస్సార్ సీపీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్రపూరిత తత్వం చంద్రబాబుదని ఆరోపించారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (చదవండి: రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్) స్థానిక డి కన్వెన్షన్లో ద్వారంపూడి సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని వ్యాఖ్యానించారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్షా అపాయిట్మెంట్ కోరడంపై స్పందిస్తూ.. ఒకప్పుడు అమిత్షా కాన్వాయ్పై రాళ్ల దాడి చేయించిన చంద్ర బాబు ఈవేళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలని అన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్పై ‘ఈనాడు’ డ్రగ్స్ విషం -
పట్టాభి తీరు సమర్థనీయం కాదు.. పార్టీలకతీతంగా ఖండించాలి
షికాగో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించి టీడీపీ నేతలు వాడిన అసభ్య పదజాలాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అమెరికాలోని షికాగోలో జనాగ్రహదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు కొండపల్లి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ... మీ కార్యకర్తలు, మీ కుటుంబ సభ్యులను బోషిడికే అనే పదంతో పిలుస్తారా అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు తప్పు చేస్తే నాయకుడిగా సరిదిద్దాల్సి పోయి చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి ఆ బూతులను సమర్థించడం దారుణమన్నారు. ఆఖరికి ఉన్నత విద్యావంతులమని చెప్పుకునే ఎన్ఆర్ఐ వింగ్ సైతం ఆ బూతులను వంతపాడటం దారుణమన్నారు. వైఎస్సార్ కుటుంబంపై జరిగినటువంటి నీచమైన దాడులు రాజకీయాల్లో ఏ ఫ్యామిలీపైనా జరగలేదని, కేవలం ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే వైఎస్ జగన్ అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నారని యత్తపు శరత్రెడ్డి అన్నారు. రాజకీయాల్లో పట్టాభి అనుసరించిన నీచ పద్దతిని పార్టీలకు, మతాలకు, దేశాలకు అతీతంగా అంతా ఖండిచాలని ఈ దీక్షలో పాల్గొన్న నాయకులు కోరారు. ఈ జనాగ్రహ దీక్షలో భీమ్రెడ్డి అల్వాల, వెంకటేశ్వరరెడ్డి, వెంకట్ ముమ్మడి, శ్రీధర్రెడ్డి అలవాల, విజయ్రెడ్డి సంకెపల్లి, రమేశ్ తుమ్మూరి, పవన్, సోహిత్, రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరో టీడీపీ నేతకు జస్టిస్ లలిత బెయిల్
సాక్షి, అమరావతి: టీడీపీకి చెందిన మరో నాయకుడికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ లలిత.. తాజాగా ఆ పార్టీ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరికి బెయిల్ ఇచ్చారు. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని బ్రహ్మంచౌదరిని ఆదేశించారు. మూడు వారాల పాటు బ్రహ్మంచౌదరి మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలోకి ప్రవేశించరాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె అడ్వాన్స్ ఆర్డర్ జారీ చేశారు. పట్టాభి బెయిల్ సందర్భంగా కూడా ఆమె అడ్వాన్స్ ఆర్డర్ రూపంలో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయంలో జరిగిన గొడవ సందర్భంగా అక్కడకు వెళ్లిన తనను పలువురు టీడీపీ నేతలు కులం పేరుతో దూషించి, హత్యాయత్నం చేశారంటూ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన బ్రహ్మంచౌదరి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లలిత సోమవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. బ్రహ్మంచౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని కొట్టారని శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సంబంధిత కోర్టు మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారని, అయితే మేజిస్ట్రేట్ మాత్రం ఎలాంటి వైద్య పరీక్షలకు ఆదేశించలేదన్నారు. అంతేకాక మంగళగిరి పోలీసులు బ్రహ్మంచౌదరిని అరెస్ట్ చేసి మేడికొండూరు పోలీసులకు అప్పగించారని, భౌతిక హాని తలపెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆయన వివరించారు. విధుల్లో ఉన్న పోలీసును కులం పేరుతో దూషించారు.. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని పిటిషనర్, ఇతర టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని తెలిపారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఈ కేసులోనే కాక మరో మూడు కేసుల్లో కూడా బ్రహ్మంచౌదరి నిందితుడుగా ఉన్నారని వివరించారు. పోలీసుల చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని, మొదట హత్యాయత్నం కేసు నమోదు చేయగా, తర్వాత దానిని తొలగించారని దుష్యంత్ కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. పోలీసులు కొట్టారంటూ బ్రహ్మంచౌదరి గాయాలు చూపినప్పుడు మేజిస్ట్రేట్ ఎందుకు వైద్య పరీక్షలకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అలా చేయకుండా కేవలం కొట్టారన్న విషయాన్ని రికార్డ్ చేసి ఊరుకోవడం ఎంత మాత్రం సబబని ప్రశ్నించారు. మేజిస్ట్రేట్ చట్ట ప్రకారమే వ్యవహరించారు... దీనికి దుష్యంత్ స్పందిస్తూ.. కొట్టారని పిటిషనర్ చెప్పగానే, దానిపై మేజిస్ట్రేట్ పోలీసుల వివరణ కోరాని, రేపు పోలీసులిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకుంటే, షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణకు సైతం మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని తెలిపారు. చట్టం నిర్దేశించిన విధి విధానాల ప్రకారమే మేజిస్ట్రేట్ వ్యవహరించారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ లలిత.. పిటిషనర్పై పోలీసులు నమోదు చేసిన కేసులో ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులన్నారు. అందువల్ల అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఆ సమయంలో దుష్యంత్ జోక్యం చేసుకుంటూ.. రెండు మూడు వారాల పాటు మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రవేశించకుండా బ్ర హ్మంచౌదరిని నియంత్రిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరగా.. అందుకు న్యాయమూర్తి సానుకూలం గా స్పందించారు. పిటిషనర్ గాయాలను చూపినప్పుడు వైద్య పరీక్షలకు ఎందుకు ఆదేశించలేదో ఓ నివేదికను తమ ముందుం చాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
మాల్దీవ్స్కు టీడీపీ నేత పట్టాభి..!?
-
మాల్దీవులకు టీడీపీ నేత పట్టాభి..!?
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లి.. బెయిల్ మీద విడుదలైన టీడీపీ నేత పట్టాభి మాల్దీవులకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. పట్టాభి విమానంలో కూర్చుని ఉన్న ఫోటోలు, ఎయిర్పోర్ట్లో ఉన్న చిత్రాలు వైరలవుతున్నాయి. చదవండి: చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల హైదరాబాద్ నుంచి పట్టాభి మాల్దీవ్స్ వెళ్లినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో పట్టాభి ఎక్కడ అనే చర్చ జోరుగా సాగుతుంది. దేశం వదిలి పారిపోతున్న పట్టాభి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి. సీఎం జగన్ను బూతులు తిట్టిన కేసులో పట్టాభి అరెస్టయిన సంగతి తెలిసిందే. పట్టాభి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జనాగ్రహ దీక్షలు చేపట్టారు. చదవండి: ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన -
ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వెళ్లారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. తనకు అధికారం దక్కలేదన్న అక్కసుతో చంద్రబాబు అబద్ధాలు, అవాస్తవాలు పోగేసుకుని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారని.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, ఇక్కడ యువత డ్రగ్స్కు బానిసలైపోయినట్టు నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై చెప్పులు వేయించిన ఘనుడని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం మెడకు చుట్టుకున్నప్పుడు కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, ఆ కేసు నుంచి బయట పడేందుకు చివరకు ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎంపీ భరత్ ఇంకా ఏమన్నారంటే.. గంజాయి రవాణాపై అప్పటి మీ మంత్రులు ఏమన్నారో మర్చిపోయారా ‘ఏపీ నుంచే దేశం మొత్తానికి గంజాయి వెళుతున్న విషయం ఓపెన్ సీక్రెట్’ అని మీరు సీఎంగా ఉన్నప్పుడు కేబినెట్లో చర్చించలేదా? స్కూల్ బస్సుల్లో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని మీ కేబినెట్ మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు చెప్పలేదా? గంజాయి అక్రమ రవాణాలో పెద్దల హస్తం ఉందని స్వయానా మీ కేబినెట్ మంత్రులే చెప్పింది నిజం కాదా. వాస్తవాలు ఇలా ఉంటే.. రాష్ట్ర యువతపై టీడీపీ డ్రగ్స్ నెపం మోపుతోంది. బూతుల్ని సమర్థించుకోవడానికే.. సాక్షాత్తు ప్రధాన మంత్రిని బూతులు తిట్టిన సీడీలను, అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్లు రువ్వించిన వీడియోలను రాష్ట్రపతికి చూపించారా? బాబు అండ్ కో మాట్లాడిన బూతులను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల్లో గెలవలేనని తెలిసిన బాబు ఆర్టికల్ 356 కోరుతున్నట్టున్నారు. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పినందుకు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే నెపాన్ని వేస్తున్న బాబు అండ్ కోను అరెస్ట్ చేసి అండమాన్ దీవుల్లాంటి చోటకు పంపిస్తే ప్రజలు హర్షిస్తారు. అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు అసాంఘిక శక్తులకు రారాజు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడితే, అందుకు ప్రజలు స్పందిస్తే, దాన్ని అల్లర్లుగా సృష్టించాలని బాబు చూస్తున్నారు. గతంలోనూ మత, కుల రాజకీయాలు చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని బాబు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇప్పుడు డ్రగ్స్ రాజకీయాలు తీసుకొస్తూ అందులో బూతు రాజకీయాలు కలుపుతున్నారు. -
కువైట్లో జనాగ్రహ దీక్ష
రాజంపేట రూరల్: సీఎం వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభి తీరును నిరసిస్తూ కువైట్లో వైఎస్సార్ సీపీ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఉమేరియా పార్కులో శనివారం వైఎస్సార్ సీపీ కువైట్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన జనాగ్రహ దీక్షలో పార్టీ కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో చౌకబారు రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో టీడీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. దీక్షలో ప్రధాన కోశాధికారి మహేష్ రెడ్డి, మీడియా ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, యూత్ విభాగం ఇన్చార్జి మర్రి కళ్యాణ్, బీసీ సెల్ ఇన్చార్జి రమణ యాదవ్, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షుడు లక్ష్మీ ప్రసాద్, మీడియా ఇన్చార్జి సురేష్ రెడ్డి, గోవిందరాజు, నాయకులు హనుమంత రెడ్డి, ఎస్.గంగాధర్, టి.సుబ్రమణ్యం, బాబు యాదవ్, జి.వెంకటేష్, మైనార్టీ నాయకులు రహంతుల్లా, సర్దార్, ఇస్మాయిల్, ముస్తఫా, అఫ్రిన్, అక్బర్, మహబూబ్ బాషా పాల్గొన్నారు. -
కేసుల నుంచి తప్పించుకోడానికే బాబు ఢిల్లీ టూర్!
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్లపై ఎన్ని కేసులున్నాయో తనకు తెలుసునని, ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, తిరిగి అధికారంలోకి రావడానికి మాత్రమే చంద్రబాబు ఢిల్లీ ప్రయాణమవుతున్నాడని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి సీఎం జగన్ను అటువంటి పదజాలంతో తిట్టడం ముమ్మాటికీ తప్పేనన్నారు. చంద్రబాబు దాన్ని సమర్థించడం సరికాదన్నారు. బాబు ఎందుకు దీక్షలు చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం తాను ప్రయత్నిస్తానని చింతా మోహన్ స్పష్టం చేశారు. -
ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన
రాజసభలో ఒక వేడుక. అతిథి రాజులంతా ఉచితాసనాలను అధిష్ఠించారు. అందులో ఒక రాజుగారి తల తెగిపడింది. ఉత్సవంలో రక్తపు మరకలు. ఈ ఘటనకు కారకులెవరు? దోషి ఎవరు?... బూతులు తిట్టిన శిశుపాలుడా? చక్రం తిప్పిన శ్రీకృష్ణుడా? తప్పు శిశుపాలుడిదేననీ, అతడు దండనార్హుడని,యుగయుగాలుగా తరతరాలుగా భారత సమాజం నమ్ముతూ వస్తున్నది. ఇప్పుడా కేసును తిరగదోడాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నది. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి అప్పీలు చేయ దలచుకున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షానంతర భాషణలో భాగంగా అభిభాషించారు. అనగనగా ఒకరాజు ఉదంతం సందర్భంగా కొద్దినెలల క్రితమే ఈ తర్క మీమాంసకు ఆ పార్టీ తెరతీసింది. ఆయన రాజంటే రాజు కాదు. దొరల యందు పిట్టల దొరలు వేరయా అన్నట్టు రాజుల్లో ఆయన తేడా రాజు. శత్రువుల తరఫున పనిచేసే కోవర్టులు రహస్యంగా ఉంటారు. ఈయన బహిరంగ కోవర్టు. అదీ తేడా. అతడు శల్యుని పరంపర. అఖండ మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని బజారు భాషలో తిట్టించడం తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల పంథాలో ఒక ముఖ్యమైన అంశం. ఈ కర్తవ్య నిర్వహణకోసం ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’గా ‘తేడా రాజు’ను ఆ పార్టీ నియో గించింది. ఒక డజన్ దుర్భాష దండకాల తర్వాత అతడి మీద పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. తిట్టిన రాజుది తప్పు కాదు, అరెస్ట్ చేసిన పోలీసులదే తప్పని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా హడావుడి చేసింది. శిశుపాలోపాఖ్యానంలో కృష్ణుడిని విలన్గా ప్రకటించే వరకు నిద్రపోరాదని అప్పుడే చంద్రబాబు వర్గం కంకణం కట్టుకున్నది. తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల్లో భాగంగా పట్టాభి అనే ఔత్సాహికుడిని అధికార ప్రతినిధిగా రంగంలోకి దించింది. ‘నా బూతే నా భవిష్యత్తు’ అన్నంత దీక్షతో ఆయన తన కెరీర్ను ప్రారంభించాడు. సంస్కృత భాషలో భవభూతి ఎంతటి పండి తుడో బజారు భాషలో ఈ ‘బండబూతి’ కూడా ఇంచుమించు అంతటివాడనే ఖ్యాతికోసం ఆయన తహతహలాడుతున్నాడు. టీడీపీ అవసరాలకు అచ్చుగుద్దినట్టు పట్టాభి కుదురుకున్నాడు. ‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డం వచ్చినది’. ఇది పాత కథ. ఆ గడ్డిపోచను పట్టుకొని కథ మూలాల్లోకి వెళితే చేప ఎందుకు ఎండలేదో కారణం తెలుస్తుంది. చీమ పుట్టలో పెట్టిన వేలు విలన్గా తేలుతుంది. ఇప్పుడు మన ఎల్లో చేపల్ని కూడా ప్రశ్నించుకుంటూ వెళితే బూతు రహస్యాలను కనిపెట్టవచ్చును. ‘చేపా చేపా బూతులెందుకు మాట్లాడుతు న్నావు?’ ‘ఫ్రస్ట్రేషన్’... ‘ఎందుకు?’... ‘కిక్కు లేదప్పా!’. ‘చేపా చేపా అబద్ధాలెందుకు చెబుతున్నావు?’... ‘డబుల్ ఫ్రస్ట్రేషన్’... ‘ఎందుకు?’ ... ‘కిక్కు లేదప్పా’. ఏమిటా కిక్కు?... అది గంజాయి వనం నుంచే వీచే ధన మారుతం జేబుల్లో ప్రవహిస్తున్నప్పుడు కలిగే పరవశాల కిక్కు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ను తవ్వుతున్నప్పుడు నట్టింట్లో ధనలక్ష్మి కాలిగజ్జెలు మోగుతున్నట్టు అనుభూతినిచ్చే కిక్కు. వాడవాడనా వెలసిన బెల్టు షాపుల్లో పారిన పేదవాడి నెత్తురు అత్తరు రూపంలో హత్తుకున్నప్పుడు వెలువడే పరిమళాల కిక్కు. వగైరా వగైరాలెన్నో ఉన్నాయి ఈ కిక్కుల్లో. కానీ మొన్న మన ఎల్లో ఫిష్ చేసిన బూతు ప్రవచనంలో గంజాయి, డ్రగ్స్ల పలవ రింతే ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్లకు సంబంధించిన వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలించడం అవసరం. ‘ఆంధ్రప్రదేశ్ ఈశాన్య ప్రాంతం దేశ గంజాయి రాజధానిగా మారుతున్నది’ అనే శీర్షికతో 2018 సెప్టెంబర్ 2న ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక పరిశోధనా కథనాన్ని ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి కథనాన్నే వేసింది. తెలుగు పత్రికల్లో, చానల్స్లో పుంఖాను పుంఖాలుగా ఈ వార్తలు వచ్చాయి. చంద్రబాబు ముఖ్య మంత్రిగా పనిచేసిన 2014 – 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవిదేశాలకు గంజాయి అక్రమ రవాణా పెద్దఎత్తున సాగిందని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. శ్రీలంకలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడిన సంఘటనపై ఆ దేశ ప్రభుత్వం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచే ఆ సరుకు రవాణా అయినట్టుగా విచారణలో వెల్లడైంది. ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం కేంద్రానికి చేరవేసింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాన్ని అప్రమత్తం చేసింది. అప్పుడే కాదు మరో రెండు మూడు సందర్భాల్లో కూడా కేంద్రం గంజాయి రవాణాపై బాబు ప్రభు త్వాన్ని హెచ్చరించింది. అయినా రాష్ట్రం పెడచెవిన పెట్టింది. అంతేకాదు, గంజాయి అక్రమ రవాణాకు కొమ్ము కాసింది. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేసిన అప్పటి నర్సీ పట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుపై మొదటి నుంచి అనేక ఆరోపణలున్నాయి. గంజాయి స్మగ్లింగ్ కింగ్ అయ్యన్నేనని ఆయన మంత్రివర్గ సహచరుడు గంటా శ్రీనివాసరావు బహి రంగంగా చెప్పిన వైనం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దా లుగా మావోయిస్టులకు గట్టిగా పట్టుంది. వారి భౌగోళిక విభ జనలో ఈ ప్రాంతానికి ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)గా నామకరణం చేసుకున్నారు. వారికి కూడా ఆదాయ వనరుగా మారడంతో పెద్దఎత్తున ఇక్కడ గంజాయి సాగుకు అండగా నిలబడ్డారు. మావోయిస్టు ప్రాంతం కావడంతో రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఈ సాగును ఏమీ చేయలేక పోయారు. మావోయిస్టుల వేటకు వెళ్లే కూంబింగ్ పార్టీలు కూడా గంజాయి వనాల జోలికి వెళ్లేవి కావు. అలా చేస్తే గిరిజనులు మావోయిస్టులకు మరింత దగ్గరవుతారని వారి భయం. ఇక్కడ విస్తారంగా పండించిన పంటను దేశవిదేశాలకు తరలించడానికి ఉన్నది ఒకటే దారి. ఏవోబీ నుంచి నర్సీపట్నం, రంపచోడవరం, జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్. అక్కడినుంచి అన్నివైపులకు పంపిణీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రవాణా కార్యక్రమం సాఫీగా సాగి పోయేది. ‘నర్సీపట్నం – ఫార్టీ పర్సెంట్’ అనే అనధికార ఒడంబ డిక ఇందుకు కారణమని స్థానికులు చెబుతారు. ఏవోబీ నుంచి మొదటి ఎగ్జిట్ పాయింట్ (నర్సీపట్నం) దగ్గర అక్కడ వుండే వీఐపీకి సరుకులో 40 శాతం విలువచేసే సొమ్ము చెల్లిస్తే హాయిగా చేరవచ్చు. ఈ ఫార్టీ పర్సెంట్లో ఏ స్థాయి వరకు ఎంత శాతం చేరుకునేదో ఆ వీఐపీలకు మాత్రమే ఎరుక. నామ్కే వాస్తే కొన్ని కేసులను మాత్రం నమోదు చేసేవారు. ఆ కేసుల్లో పురో గతి ఏమీ ఉండదు. అప్పుడప్పుడూ కొంత సరుకు సీజ్ చేసినట్టు చూపేవారు. గంజాయి స్మగ్లింగ్, మద్యం దొంగరవాణా, డ్రగ్స్ తదితర వ్యవహారాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ కర్తవ్య సాధనకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో’ (ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసింది. మెరికల్లాంటి సిబ్బం దిని ఈ బృందంలో నియమించింది. స్వయంగా సీఎం ఈ బృందం పని తీరును సమీక్షిస్తున్నారు. అనతికాలంలోనే ఎస్ఈబీ అద్భుతమైన పని తీరును కనబరిచింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంతో పాటు, రవాణా మార్గం అంతటా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఇన్ఫార్మర్ల వ్యవస్థను నిర్మించుకున్నది. దాడులు, తనిఖీలను పెంచింది. ఫలితంగా కేసుల సంఖ్యలో కూడా వృద్ధి కనిపించింది. కేసులు పెరిగినా ఫరవాలేదు, కానీ ఈ దుర్వా్యపారాన్ని మాత్రం అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదే శాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు గంజాయి కథలో దోషి చంద్రబాబు ప్రభుత్వం. ఆ పాపాన్ని కడిగేస్తున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ ఇక్కడ దొంగే అందరికంటే ముందుగా ‘దొంగా దొంగా’ అని అరుస్తున్నాడు. చంద్రబాబు నేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చూస్తున్నవారికి ఇదే మంత పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. డ్రగ్స్ వ్యవహారం లోనూ అదే తంతు. గుజరాత్లో పట్టుబడిన డ్రగ్స్ రాకెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక అడ్రస్ కనిపించిందట. అది దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఇచ్చిన ఉత్తుత్తి అడ్రస్గా అధికారులు తేల్చారు. ఈ డ్రగ్స్ రాకెట్తో ఆంధ్రప్రదేశ్కు ఏరకమైన సంబంధమూ లేదని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేసింది. కానీ మన తెలుగుదేశం పరివారానికి ఇవేమీ తలకెక్కవు. గంజాయి రవాణాపై కేంద్రం నిజంగా హెచ్చ రించినప్పుడు మౌనం పాటించిన ఈ పరివారం, ఇప్పుడు కేంద్రం అసత్యమని ఖండించిన అంశాన్ని మాత్రం నిజమే అన్నట్టుగా చాటింపు వేయిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వలన తెలుగుదేశం పరివారానికి మూసుకుపోయిన దొంగ వ్యాపారాల దారుల్లో గంజాయి అక్రమ రవాణా ఒకటి. మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు అవి అందనప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు. పిచ్చిగా మాట్లాడతారు. అటువంటి లక్షణాలు ఇప్పుడు ఎల్లో పరివార్లో కనిపిస్తున్నాయి. ఆరునూరైనా, నూరు ఆరైనా∙సరే, ఎంత ఖర్చయినా సరే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలనే సంక ల్పాన్ని తెలుగుదేశం తీసుకున్నట్టు పరిణామాలను బట్టి అర్థమ వుతున్నది. రాజు భాష, పాత్రుడు భాష, పట్టాభి భాష – ఇందుకు సాక్ష్యాలు. పాలక పక్షాన్ని కవ్వించాలి. వారు రెచ్చి పోవాలి. తెలుగుదేశం వారిపై దాడులు చేయాలి. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదంటూ గగ్గోలుపెట్టాలి. ప్రభు త్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టించాలి. తెలుగుదేశం పరివారంలోని అన్ని విభాగాల లైన్ ప్రస్తుతానికి ఇదే. పట్టాభి బూతులు, చంద్రబాబు దీక్ష, దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన సభ – ఈ వ్యూహానికి అద్దం పట్టాయి. డెబ్బయ్ రెండేళ్ల వృద్ధుడు, మధుమేహ పీడితుడైన వ్యక్తి 36 గంటలపాటు నిరాహారంగా వుండి కూడా గంటన్నర పాటు ఆవే శంతో ఊగిపోతూ ఎలా మాట్లాడగలిగారని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయనే ప్రశ్నలు వేస్తారు, ఆయన్నెవరూ ప్రశ్నించకూడదు, సందేహించ కూడదు అనే నియమం కొన్ని దశాబ్దాలుగా అమల్లో వుంది. కనుక సజ్జల ప్రశ్నకు సమాధానం దొరికే ఛాన్స్ లేదు. ఈ సభలో చినబాబు వీరంగం చూసి తరించవలసినదే. పనిలో పనిగా మంగళగిరి లోని ఒక మండలంలో తాను ఐదుగురు ఎంపీ టీసీలను గెలిపించిన విషయాన్ని చినబాబు చాటుకున్నారు. అదే ఊపులో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి సీటును గెలిచి మీకు కానుకగా అర్పిస్తానని తండ్రిగారికి హామీ ఇచ్చారు. ఈ వీరాలాపన వింటుంటే భలే ముచ్చటేసింది. ఇదే సభలో ఒక నాయకురాలు నాగమ్మ మాట్లాడుతూ ‘మీరు ఒక రెండు నిమిషాలు మాకు అనుమతివ్వండి. ఏం చేస్తామో చూపిస్తామ’ని సవాల్ విసిరారు. ‘టైమ్ మీరు చెబుతారా, నన్ను చెప్పమం టారా?, ప్లేస్ మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? కొట్టుకో వడానికి మేం రెడీ’ అని కేశినేని నాని సవాల్ విసిరారు. నాని విసిరిన సవాల్ పార్టీలోని తన వ్యతిరేకులకా, వైసీపీ వారికా అనేది అర్థంకాక సభికులు అయోమయానికి గురయ్యారు. చివరగా మాట్లాడిన చంద్రబాబు ఈ రాజ్యాంగ వ్యవస్థ మీద దాదాపు యుద్ధ ప్రకటనే చేశారు. తన నలభై మూడేళ్ల రాజకీయ అనుభవాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశారు. స్థానిక ఎన్నికలపై విషాన్ని వెళ్లగక్కారు. ‘థూ... ఇవి ఎన్నికలా’ అని ఈసడించుకున్నారు. తన జేబులోని మనిషి ఎన్నికల కమిష నర్గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాలే ఆ తర్వాత కూడా పునరావృతమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించే ఇంగితాన్ని కూడా ఆయన కోల్పోయారు. ముందుగా మాట్లాడిన తన వారసుడు తాను ఐదు ఎంపీటీసీలను గెలిపించిన విషయాన్ని చెప్పుకుంటుంటే ఆనందించిన వ్యక్తి, ఈ విధంగా మాట్లాడట మేమిటి? ఎన్నికల్లో తాను గెలవలేననే నిర్ధారణకు వచ్చారా? గెలవకపోయినా గద్దె కావాలని తహతహలాడుతున్నారా? అందుకోసమే వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నారా? చివర్లో ‘కార్యకర్తలారా! మీరు పోరాడండి’ అని పిలుపునిచ్చింది అందు కేనా? కేసులు వస్తే నేను చూసుకుంటానని చెప్పడంలోని అర్థమేమిటి? తాను న్యాయవ్యవస్థను మేనేజ్ చేయగలడని కార్యకర్తలు అనుకోవాలా? ఇది న్యాయ వ్యవస్థను అవమా నించడం కాదా? ఎన్నికలను తూర్పారబట్టి తిట్లకూ, ఘర్షణ లకూ వీరతాళ్లు వేయడం దేనికి సంకేతం? రాజ్యాంగ వ్యవస్థ లను అవహేళన చేస్తున్నారా? ఇటువంటి మనోవికారంతో బయల్దేరి రాష్ట్రపతికీ, కేంద్ర పెద్దలకు ఏమని విజ్ఞప్తి చేస్తారు? వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మీరు రద్దుచేయక పోతే వీధి పోరాటాల ద్వారా నేనే రద్దు చేయిస్తానని చెబుతారా? ఈ వైఖరి రాజ్యాంగ వ్యవస్థలపై యుద్ధ ప్రకటన కాదా? ఆ ప్రభుత్వాన్ని అత్యవసరంగా తప్పించవలసినంత భయంకరమైన ఒత్తిడి ఆయన మీద ఏమైనా ఉన్నదా? గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా రాకెట్ అంతా అంతర్జాతీయ మాఫియా ముఠాల కనుసన్నల్లో జరుగుతుంది. చంద్రబాబు హయాంలో సాఫీగా సాగిన గంజాయి కదలికలు ఇప్పుడు కష్టసాధ్యంగా పరిణ మించాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమ రవాణాపై కేంద్రం దర్యాప్తు జరిపితే చాలా సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
టీడీపీ నేత పట్టాభికి బెయిల్..
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పట్టాభి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు విజయవాడలో కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించటంతో మచిలీపట్నం జైలుకు తరలించారు. అక్కడ నుంచి ఆయన్ని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో పోలీస్ భద్రత మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకెళ్లిన సంగతి విదితమే. చదవండి: నారా వారి తాజా చిత్రం ‘36 గంటలు’.. సిగ్గు చచ్చింది -
చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలి: కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు 36 గంటల దొంగ దీక్ష చేశారు. అసలు దీక్ష ఎందుకు చేశానా అని టీడీపీ అధ్యక్షుడికే డౌట్ వచ్చింది. ఢిల్లీ వెళ్లే టీడీపీ నేతలు రాష్ట్రపతిని ఏమని సంబోధిస్తారు’’ అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మాట్లాడారు. ‘‘పార్టీ ఉందని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబు దీక్ష డ్రామాలు చేస్తున్నారు. ఆయన దీక్షలపై డిక్షనరీ రాయాలి. చంద్రబాబు దీక్షపై టీడీపీ నేతలకే క్లారిటీ లేదు. చంద్రబాబు అమిత్ షా మీద రాళ్లు వేయించారు.. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారు’’ అన్ని కన్నబాబు ప్రశ్నించారు. (చదవండి: బూతులను సమర్థిస్తూ దీక్షా?) ‘‘సీఎం జగన్ని సంభోదించిన పదంతోనే మీరు రాష్ట్రపతిని సంభోదించగలరా.. లోకేష్ కూడా చంద్రబాబును ఆ పదంతో పిలుస్తారా. అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చెబుతారు. మేం బూతులు తిడితే వైఎస్ఆర్సీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నది మీరు కాదా’’ అని కన్నబాబు ప్రశ్నించారు. చదవండి: ‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే’ -
అనంతపురం: చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్నాయుడు దౌర్జన్యం
-
టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు దౌర్జన్యం.. మహిళను పబ్లిగ్గా బూతులు తిడుతూ
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికి.. పచ్చ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదు. తాజాగా టీడీపీ నేత ఒకరు మహిళపై బెదిరింపులకు దిగారు. ఆ వివరాలు.. చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మహిళపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వీడియో ఒకటి శనివారం వెలుగులోకి వచ్చింది. (చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్) అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల సోమశేఖర్ నాయుడును కారుతో గుద్ది చంపేందుకు యత్నించారంటూ ప్రకాశ్ నాయుడి సోదరులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలో ప్రకాశ్ నాయుడు బాధితుల ఇంటికెళ్లి బెదిరించాడు. తనపైనే కేసు పెడతారా అంటూ ప్రకాశ్ నాయుడు ఓ మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెకు వార్నింగ్ ఇచ్చి పబ్లిగ్గా బూతులు తిట్టాడు ప్రకాశ్ నాయుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది. చదవండి: ‘పట్టాభి ఓ గే’.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ -
సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పట్టుకుని పచ్చి బూతులు మాట్లాడటం భావ్యం కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అధికారం అనేది ప్రజలు ఇస్తే వచ్చేదని, ప్రజల మనసు గెలుచుకోవడం ద్వారా మాత్రమే అధికారంలోకి వస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీసందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజూరాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ►‘మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని మిత్రులు అంటున్నారు. మహారాష్ట్ర సీఎంను దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా సీఎంను పట్టుకుని కొందరు 420 గాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ►రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలి. ఉద్యమ సమయంలో ఉద్వేగంతో మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కుంభకోణాల నుంచి పుట్టిన వారు మన దగ్గర నాయకులు అయ్యారు. ►ఏపీలో ఒక సంఘటన జరిగింది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ బూతులేంటి? అక్కడ టీడీపీ ఆఫీసుల మీద జరిగిన దాడులు ఎవరు చేశారు.. అనేది పక్కన పెడితే, దానికి మూలం ఎక్కడుంది? రాజకీయాల్లో ఎందుకు అసహనం? ►నువ్వు రాజకీయాల్లో ఓడిపోయావు.. సహనం పాటించు. ఐదేళ్ల తర్వాత మళ్లీ జనం వద్దకు వెళ్లు.. బతిమిలాడుకో.. నీకు ఎందుకు ఓటు వేయాలో వివరించు. అంతే తప్ప దుగ్ధ ఎందుకు? అర్జంటుగా అధికారంలోకి రావాలన్న ఆరాటం, యావ ఎందుకు? ►ప్రజలు అధికారాన్ని వేరొకరికి ఇచ్చారు. ప్రజలు మమ్మల్ని కూడా 2009లో తిరస్కరిస్తే పోరాటం చేసి 2014లో అధికారంలోకి వచ్చాం. టీడీపీకి అక్కడ అధికారం పోయింది.. ఇక్కడ అంతర్ధానమైంది. ►మా పార్టీ కేవలం తెలంగాణ మీద మాత్రమే దృష్టి పెడుతుంది. మేము ఢిల్లీకి గులాములము కాదు. గుజరాత్కు బానిసలం కాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే తలొగ్గుతాం. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసే సత్తా కేవలం టీఆర్ఎస్కు మాత్రమే ఉంది. సార్వత్రిక ఎన్నికల లోపు పార్టీని దృఢంగా తయారు చేస్తాం. ►రెండు జాతీయ పార్టీలకు రాష్ట్రంలో ఇద్దరు కోతీయ అధ్యక్షులు వచ్చారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారు. నాగార్జునసాగర్లో బీజేపీకి డిపాజిట్ దక్కనట్లే, హుజూరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాదు. టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న పన్నాగాలను ప్రజలు చిత్తు చేస్తారు. ►టీఆర్ఎస్లో తిరుగుబాటు వస్తుందని రేవంత్రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదం. ఆయన ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియదు. ‘గాంధీభవన్లో గాడ్సే దూరాడు’ అని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్సింగ్ అన్నారు. ►మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ప్రభుత్వ కార్యక్రమాల మీదే దృష్టి పెట్టాం. ఇకపై పార్టీ, ప్రభుత్వానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతాం. -
‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖలో రెండోరోజు కొనసాగుతున్న జనాగ్రహ దీక్షలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్నదని విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదన్నారు. తమ ప్రభుత్వం పార్టీలు, కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహేతుకంగా ఉండాలి: విజయసాయిరెడ్డి ఏపీలో టీడీపీ వెంటిలేటర్పై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ పాలన ఎలా ఉండేదో ప్రజలకు తెలుసని అన్నారు. 2019 నుంచి ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. లోకేష్ ట్విట్టర్లో అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షం ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ అసభ్యంగా దూషించడం సరికాదని ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. చదవండి: ఏపీలో ఉవ్వెత్తున జనాగ్రహ దీక్షలు -
Janaagraha Deeksha: టీడీపీ బూతు పురాణంపై ఉవ్వెత్తున ఎగసిన జనాగ్రహం
సాక్షి,అమరావతి/సాక్షి,నెట్వర్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభితో అసభ్య పదజాలంతో దూషింపజేయడంపై జనాగ్రహం ఉవ్వెత్తున ఎగసింది. బూతు వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్కు క్షమాపణ చెప్పాల్సిందిపోయి.. వాటిని సమర్థిస్తూ చంద్రబాబు దీక్ష చేయడమేమిటి? అంటూ ప్రజలు నిలదీశారు. వాక్ స్వాతంత్య్రం అంటే బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. ఇది అనైతికం.. అధర్మం.. దుర్మార్గం అని స్పష్టం చేశారు. తక్షణమే సీఎం వైఎస్ జగన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నుంచి పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే మేరుగ నాగార్జునకు తెనాలిలో స్వాగతం పలికిన ఎమ్మెల్యే అన్నాబత్తుని, ఇతర నేతలు లేదంటే.. ప్రజాక్షేత్రంలో మళ్లీ మళ్లీ తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్ను బూతులు తిట్టించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన జనాగ్రహ దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ దీక్షల్లో ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో ఆఖండ విజయంతో అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. ఎన్నికల మేనిఫెస్టోలోని 95 శాతానికిపైగా హామీలను తొలి ఏడాదే అమలు చేసి రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రజలు ప్రశంసించారు. కృష్ణా జిల్లా పామర్రు 4 రోడ్ల కూడలిలో శుక్రవారం జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి, మహిళా ప్రతినిధులు కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమాభివృద్ధి పథకాలను అందించడం ద్వారా ప్రజాస్వామ్యానికి సరి కొత్త నిర్వచనం చెప్పారని కొనియాడారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించడం ద్వారా సరి కొత్త సామాజిక రాజకీయ విప్లవానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సంక్షేమ పథకాల ద్వారా దన్నుగా నిలిచారని ప్రశంసించారు. ప్రజాదరణను జీర్ణించుకోలేకే కుట్రలు సీఎం వైఎస్ జగన్ తమ కష్టనష్టాల్లో వెన్నంటి ఉన్నందుకే పంచాయతీ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, తిరుపతి లోక్సభ ఎన్నికల్లో ఆయన వెంట నడిచామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలు స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్కు నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే చంద్రబాబు ఎప్పటికప్పుడు విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు మండిపడ్డాయి. తొలుత దేవాలయాలపై దాడులు చేయించి.. విగ్రహాలను ధ్వంసం చేయించి.. రథాలకు నిప్పు పెట్టించి మత కల్లోలాలను సృష్టించడానికి చంద్రబాబు కుట్రలు చేశారని ఎత్తిచూపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఆ తర్వాత వ్యవస్థలను అడ్డం పెట్టుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలను అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. గుజరాత్లో దొరికన మాదక ద్రవ్యాలకూ.. ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేసినా, డీజీపీ గౌతం సవాంగ్ తేల్చి చెప్పినా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని చేసినా ప్రజలు నమ్మడం లేదని ఇప్పుడు పట్టాభి ద్వారా సీఎంను బూతులు తిట్టించి రాష్ట్రంలో అలజడులు రేపేలా కుట్ర పన్నారని నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు మిన్నంటిన నిరసనలు ► చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగాయి. కుప్పంలో టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అడ్డుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. బాబు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు వద్ద చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి చిత్రపటాలను గాడిదకు కట్టి ఊరేగించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల వైఖరిని హిజ్రాలు తప్పుపట్టారు. ► టీడీపీ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని కర్నూలు జిల్లాలో పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు బాబు వైఖరిపై నిప్పులు చెరిగాయి. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు.. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పట్టాభి దిష్టి బొమ్మలను తగులబెట్టారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ► విశాఖ నగరంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో టీడీపీ నేతల తీరును విమర్శిస్తూ ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు హోరెత్తాయి. వెంటిలేటర్పై ఉన్న పార్టీ, కొడుకు లోకేష్ భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో చంద్రబాబు విచక్షణ కోల్పోయి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ► టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయం అని విజయనగరం, శ్రీకాళుళం జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. నల్ల రిబ్బన్లు ధరించి టీడీపీ వైఖరికి నిరసన తెలిపారు. -
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి
-
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి
రాజమహేంద్రవరం సిటీ: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభిని పోలీసులు శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు విజయవాడలో కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించటంతో మచిలీపట్నం జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన్ని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో పోలీస్ భద్రత మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. జైలు అధికారులు లాంఛనాలు పూర్తిచేసిన అనంతరం రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైలులోకి తీసుకెళ్లారు. పట్టాభి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత పట్టాభి అరెస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. పోలీసులు జారీచేసిన సీఆర్పీసీ సెక్షన్ 41 నోటీసు విషయంలో మేజిస్ట్రేట్ సంతృప్తి చెందకపోయినా, పట్టాభిని ఎలా రిమాండ్కు పంపారని న్యాయమూర్తి జస్టిస్ లలిత ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా స్పష్టతనివ్వాలన్నారు. పట్టాభి బెయిల్ పిటిషన్పై శనివారం విచారిస్తానని న్యాయమూర్తి తెలిపారు. కోర్టు కార్యకలాపాలు మొదలు కాగానే పట్టాభి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. బెయిల్ పిటిషన్పై లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. పోలీసులు నమోదు చేసిన కేసులో కొన్ని సెక్షన్లు చెల్లవన్నారు. కొన్ని సెక్షన్లు మూడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులని చెప్పారు. పట్టాభి అరెస్ట్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నడుచుకున్నామంటూ పోలీసులు ఓ ఫార్మెట్ను కింది కోర్టు ముందుంచారని తెలిపారు. ఇందులో పలు ఖాళీలు ఉండటంతో మేజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తం చేశారని, అయినా పట్టాభిని రిమాండ్కు పంపారని చెప్పారు. అలా ఎలా పంపుతారన్న న్యాయమూర్తి.. దీనిపై ఏమంటారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కె.శ్రీనివాస్రెడ్డిని ప్రశ్నించారు. రికార్డులన్నీ కింది కోర్టులో ఉన్నాయని, సమయం ఇస్తే వివరాలు కోర్టు ముందుంచుతానని పీపీ చెప్పారు. న్యాయమూర్తి సానుకూలంగా స్పందిస్తూ పట్టాభి బెయిల్ పిటిషన్పై శనివారం విచారణ జరుపుతామని తెలిపారు. -
మచిలీపట్నం జైలుకు పట్టాభి
విజయవాడ లీగల్/లబ్బీపేట(విజయవాడతూర్పు)/తోట్లవల్లూరు: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని గురువారం విజయవాడ గవర్నర్పేట పోలీసులు నగరంలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయాధికారి ఏపీపీ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో పట్టాభిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని సూర్యారావుపేట పోలీసులు బుధవారం రాత్రి విజయవాడలో అరెస్టు చేసి తోట్లవల్లూరు పోలీసు స్టేషన్లో ఉంచిన విషయం తెలిసిందే. ఆయన్ని గురువారం ఉదయం తోట్లవల్లూరు పోలీసు స్టేషన్ నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష వైద్య పరీక్షలు నిర్వహించి పట్టాభి ఆర్యోగం ఫిట్గా ఉందని నిర్ధారించారు. అనంతరం ఆయన్ని సివిల్ కోర్టుల ప్రాంగణంలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్టేషన్ బెయిలు ఇవ్వకుండా పోలీసులు కావాలని రిమాండ్ పెట్టారని చెప్పారు. ఏపీపీ తన వాదనలు వినిపిస్తూ నిందితుడు గతంలో కూడా ఇలాగే మాట్లాడారని, పలు కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయాధికారి నిందితుడికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని మచిలీపట్నం జైలుకు తరలించారు. ఈ కేసులో పట్టాభిని విచారించి సమాచారం రాబట్టేందుకు తమకు ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గవర్నర్పేట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పట్టాభికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. తోట్లవల్లూరులో రోడ్డుపై బైఠాయింపు పట్టాభిని విడుదల చేయాలంటూ టీడీపీ నాయకులు తోట్లవల్లూరులో గురువారం హైడ్రామా సృష్టించారు. పట్టాభిని బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో తోట్లవల్లూరు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర వచ్చి ఆయన్ని కలుసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. గురువారం ఉదయం గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఎన్ఆర్ఈజీఎస్ మాజీ డైరెక్టర్ వీరంకి వెంకటగురుమూర్తి, నాయకులు చింతా రాజా, కళ్లం వంశీకృష్ణారెడ్డి, నెక్కలపూడి మురళి తదితరులు పట్టాభిని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీస్స్టేషన్ రోడ్లో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్ర ఉత్కంఠ నడుమ తూర్పు ఏసీపీ కె.విజయపాల్, టాస్క్ఫోర్స్ ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో పోలీసులు ఉదయం 11.15 గంటల సమయంలో పట్టాభిని ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలించారు. ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్ బందోబస్తును పర్యవేక్షించారు. పట్టాభిపై పాతపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు పాతపట్నం: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మత్స్యకారుల జీవన విధానాన్ని కించపరుస్తూ మీడియాలో మాట్లాడారని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసుస్టేషన్లో తెంబూరు సర్పంచ్ బెనియా వెంకటరమణ, మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ బెనియా విజయలక్ష్మి గురువారం ఫిర్యాదు చేశారు. పిత్తపరిగిలు ఏరుకునే వాళ్లు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. పట్టాభిపై ఫిర్యాదు అందినట్లు ఏఎస్ఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. అత్యుత్సాహం చూపిన నేతలు, కొందరు న్యాయవాదులు కోర్టులో టీడీపీ నేతలతోపాటు కొందరు న్యాయవాదులు చంద్రబాబు మెప్పు కోసం అత్యుత్సాహం చూపించారు. ఒక న్యాయవాది ఓ అడుగు ముందుకు వేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా ఘాటుగానే స్పందించడంతో కిమ్మనకుండా వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం చాలా బాధాకరమని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఇదే మాట చంద్రబాబును అంటే ఎంత బాధగా ఉంటుందో మాట్లాడేవారు ఆలోచించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, చెన్నుపాటి ఉషారాణి, గాంధీ తదితరులు పట్టాభికి సంఘీభావంగా కోర్టుకు వచ్చారు. -
దీక్ష పేరుతో చంద్రబాబు కొంగ జపం: పేర్ని నాని
-
టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత పట్టాభిరామ్ను మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో గురువారం పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ.. పట్టాభి తరచూ నేరాలకు పాల్పడుతున్నాడని ఇప్పటికే పట్టాభిపై 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆయన ఇతర కేసుల్లో బెయిల్పై ఉన్నాడని పేర్కొన్నారు. అయితే బెయిల్పై ఉన్నప్పటికీ పట్టాభి బెయిల్ ఆంక్షలను పాటించడంలేదని కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగానే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, దీని వెనుక రాష్ట్రంలో అలజడి, అల్లర్లు సృష్టించాలన్నదే పట్టాభి లక్ష్యమని తెలుపుతూ. న్యాయ, పోలీస్ వ్యవస్థలను ఆయన ఖాతరు చేయడం లేదని, కేవలం స్వప్రయోజనం, రాజకీయ ప్రయోజనం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని పట్టాభికి బెయిల్ ఇవ్వడం కంటే.. జ్యుడీషియల్ రిమాండ్కు పంపడమే సరైన చర్యని కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది విన్నవించారు. ప్రస్తుతం పట్టాభిని పోలీసులు మచిలీపట్నం సబ్జైలుకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో చేసినందుకు విజయవాడ గవర్నర్పేట పోలీసులు బుధవారం రాత్రి ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించినట్లుగా గవర్నర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అందడంతో అతనిపై సెక్షన్ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్ విత్ 120(బి) కింద (క్రైం నంబర్.352/2021) కేసు నమోదైంది. చదవండి: TDP Leader Pattabhi Arrested: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ -
రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం: ఎమ్మెల్యే రోజా
సాక్షి, చిత్తూరు: టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. పట్టాభి వ్యాఖ్యలను రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు, పట్టాభి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాభిలాంటి వ్యక్తులతో ప్రెస్మీట్ పెట్టించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన తల్లి విజయమ్మను తిట్టించారని మండిపడ్డారు. సీఎం జగన్పై పట్టాభి చేత చంద్రబాబు చెప్పించిన అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబు, లోకేష్లపై చేయిస్తే భువనేశ్వరి సంతోషంగా ఉంటారా అని ప్రశ్నించారు. కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని మండిపడ్డారు. చదవండి: దీక్ష పేరుతో చంద్రబాబు కొంగ జపం: పేర్ని నాని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ విమర్శ చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని హితవు పలికారు. టీడీపీ కార్యాలయంలో నాలుగులు కుర్చీలు విరగ్గొడితే ప్రజస్వామ్యం ఖూనీ అయిందా అని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడైతే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్న విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. తిరుమల వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రానికి రావాలనడం సిగ్గుచేటని విమర్శించారు. -
బూతులను సమర్థిస్తూ దీక్షా?
సాక్షి, అమరావతి: చెరువును కబ్జా చేసి ప్రభుత్వ స్థలంలో అవినీతి సొమ్ముతో నిర్మిం చిన పార్టీ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకోసం దీక్ష చేస్తున్నారో చెప్పాలని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) నిలదీశారు. పట్టాభి బూతు వ్యాఖ్యలను సమర్థిస్తూ దీక్ష చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కాటికి కాళ్లు చాపిన వయసులో లోకేష్ను అధికార పీఠంపై కూర్చోబెట్టాలనే భ్రాంతితో విద్వే షాలను రెచ్చగొడతారా? అని మండిపడ్డారు. 74 ఏళ్ల వయసులో అత్యంత ఏహ్యమైన, నీతిమాలిన రాజకీయాలు చేయడం అవ సరమా? ఒక్కసారి అంతరాత్మను ప్రశ్నించు కోవాలంటూ చీవాట్లు పెట్టారు. కొంగ జపాలు చాలించి పట్టాభి దుర్భాషలపై సీఎం జగన్కు క్షమాపణ చెప్పి నిమ్మరసం తీ సుకుని దీక్ష విరమిం చాలని హితవు పలికారు. తాడేప ల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏమిటీ శునకానందం? సీఎం వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలతో జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. పట్టాభితో పక్కా ప్రణాళికతో సీఎం జగన్ను, ఆయన మాతృమూర్తిని సభ్య సమాజం తలదించుకునే రీతిలో దూషించడంతో కడుపుమండిన అభిమానులు ప్రతిస్పందించారు. పట్టాభి వ్యాఖ్యలను ఖండించాల్సిన చంద్రబాబు వాటిని సమర్థిస్తూ దీక్షకు దిగడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఓ కబ్జాకోరును పక్కన కూర్చోబెట్టుకుని పట్టాభి వ్యాఖ్యలను మరోసారి చెప్పించి శునకానందం పొందడం ఏమిటి? చంద్రబాబు రాజకీయ చరిత్రను చూస్తే కుట్రలు, కుతంత్రాలు, మనుషులను కొనుగోలు చేయడం, పచ్చి అబద్ధాలు, నయవంచన, అధికారం కోసం ఏ నీచానికైనా ఒడిగట్టడం కనిపిస్తుంది. పట్టాభి వ్యాఖ్యలను సమర్థిస్థారా? అని మీ కుటుంబంలో మహిళలనే అడగండి. వాటికి అర్థం అమాయకుడు అని పయ్యావుల కేశవ్ చెబుతున్నారు. టీడీపీలో నీకంటే అమాయకుడు ఎవరూ ఉండరని అంటే ఊరుకుంటావా?. టీడీపీ కార్యాలయంలో ఇంత నీచమైన భాష మాట్లాడతారా? టీడీపీలో మిగిలింది దయ్యాలే.. ప్రజలే దేవుళ్లు.. పార్టీయే దేవాలయం అని నాడు ఎన్టీఆర్ చెప్పారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని చంద్రబాబు లాక్కున్నప్పుడే అది దయ్యాల కొంపగా మారింది. ఆ పార్టీలో మిగిలింది దయ్యాలే. ఎన్టీఆర్ శాపాలు, లోకేశ్ ప్రవర్తనే ఆ పార్టీకి తాళం పడేలా చేస్తాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది కాబట్టే చంద్రబాబు, లోకేశ్ ఇష్టారాజ్యంగా ఆగడాలు సాగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా తిరుపతిలో అమిత్ షాపై రాళ్ల దాడి జరిగితే రాష్ట్రపతి పాలన విధించాలని ఎందుకు అడగలేదు? చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి అదే అమిత్ షాకు ఏమని ఫిర్యాదు చేస్తారు? ఆయన మీకు తగిన బుద్ధి చెప్పి పంపించడం ఖాయం. అధికారం దూరమైందనే అక్కసుతో ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుగా లేదా? గంజాయి స్మగ్లింగ్ చంద్రబాబు పుణ్యమే. 2018 సెప్టెంబర్ 2న ఎకనమిక్ టైమ్స్ పత్రిక రాసిన కథనమే అందుకు నిదర్శనం. చంద్రబాబు లాంటి డర్టీయస్ట్ పొలిటీషియన్ ప్రపంచంలోనే లేరన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అక్షర సత్యం. చదవండి: జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సీఎం జగన్ సమీక్ష -
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి: సజ్జల
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా.. చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా’’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు. ఈ సదర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఆయన దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదు. బూతులు తిట్టడం అనేది చేతగానివాళ్లు చేసే పని. సీఎం జగన్ సంయమనం పాటించాలని చెప్పారు. అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా’’ అని ప్రశ్నించారు. (చదవండి: టీడీపీ బూతు వ్యాఖ్యలపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి) ‘‘పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంను దూషించడం సరికాదు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే ఉన్నాం. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.. వీధి రాజకీయాలు చేయడానికి కాదు. ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తాం. టీడీపీ నేతలు.. వినేందుకు ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నారు. బూతులు వారే మాట్లాడతారు.. దొంగ దీక్షలు వారే చేస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు. (చదవండి: చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు: మంత్రి బాలినేని ) ‘‘టీడీపీ డీఎన్ఏలోనే లోపం ఉందేమో.. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది.. కోపం రావడం లేదు. పట్టాబి వెనక ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడించినట్లు ఉంది. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బాబు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ఇలాంటివే ఎదురవుతాయి. టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండి. సహానానికి కూడా హద్దు ఉంటుంది. టీడీపీ నేతలు హద్దు మీరి ప్రవర్తించారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని సజ్జల తెలిపారు. చదవండి: ‘పట్టాభి ఓ గే’.. 'సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ -
చంద్రబాబు ప్లాన్ ప్రకారమే పట్టాభి వ్యాఖ్యలు: పేర్నినాని
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్లాన్ ప్రకారమే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ మంత్రి పేర్నినాని అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వయసుకు తగ్గ ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలన్నాదే బాబు లక్ష్యమని అన్నారు. చంద్రబాబుకు అధికారం లేకపోతే నిద్రపట్టదని విమర్శించారు. అందుకే.. గతంలో అయ్యన్నపాత్రుడుతో దుర్భాషలాడించారు. అప్పుడు వారి ప్లాన్ ఫలించలేదని అన్నారు. అందుకే మళ్లి ఇప్పుడు పట్టాభితో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారన్నారు. కేంద్రమంత్రి అమిత్ షాతో.. చంద్రబాబు ఫోన్లో మాట్లాడితే వీడియోలు రిలీజ్ చేసి హడావిడి చేసేవారని అన్నారు. కేవలం అమిత్ షా అపాయింట్ మెంట్ కోసమే బాబు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో అమిత్షాపై టీడీపీ నేతలు రాళ్లేయించారని అన్నారు. చంద్రబాబు ప్రతిసారి దిగజారీ రాజకీయాలు చేస్తుంటారని అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష.. లేకపోతే మరో భాష మాట్లాడతారని మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చదవండి: అధికారం దక్కలేదని చిచ్చుపెడుతున్నారు: సీఎం జగన్ -
‘పట్టాభి ఓ గే’.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎంని దూషించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. (చదవండి: AP: దుర్భాషలపై జనాగ్రహం) ఈ క్రమంలో విజయవాడ జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఓ మహిళ పట్టాభిపై సంచనల వ్యాఖ్యలు చేశారు. పట్టాభి ఓ గే అన్నారు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికల్లో ఓడిపోయారు.. భవిష్యత్తులో కూడా ఓడిపోతామనే భయంతోనే టీడీపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తుంది. ఫోకస్ అవ్వడం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు. సీఎం జగన్ని దూషించిన పట్టాభి ఇప్పుడు నిజంగానే ఫోకస్ అవుతున్నాడు. ఇంతకు ముందు వరకు తను ఎవరో తెలియదు. తను హైలెట్ అవ్వడం కోసం ఈ పని చేశాడు. ఈ పట్టాభి ఎవరు అని ఆరా తీయగా మాకు సంచలన విషయాలు తెలిశాయి’’ అని తెలిపారు. (చదవండి: పట్టాభి చేసింది తప్పే; టీడీపీలో సీనియర్ల అసహనం) ‘పట్టాభి ఓ గే. అతడు 1997లో ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయిని లైంగికంగా వేధించాడు. దాంతో కాలేజీ వాళ్లు పట్టాభిని సస్పెండ్ చేశారు. అతడు సస్పెండ్ అయినప్పుడు అతని తండ్రి చలసాని ఆజాద్ కాలేజీకి వచ్చాడు. ఇప్పుడేమో కొమ్మారెడ్డి పట్టాభి అని ఉంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ -
అధికారం దక్కలేదని చిచ్చుపెడుతున్నారు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ‘‘ముఖ్యమంత్రిని దారుణంగా బూతులు తిడుతూ.. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడి.. తద్వారా గొడవలు సృష్టించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని’’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇది అనైతికం.. అధర్మం.. పచ్చి అబద్ధం’’ అన్నారు. (చదవండి: సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది: సీఎం జగన్) పథకం ప్రకారం రాష్ట్రం పరువు తీస్తున్నారు.. ‘‘పథకం ప్రకారం.. అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా. అధికార పార్టీ పాలన మెచ్చుకుంటూ ప్రజలు అన్ని ఎన్నికల్లో గెలిపించారు. తనవాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ రాష్ట్రంలో నేరాలు చేసేందుకు యత్నిస్తున్నారు. డ్రగ్స్తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ, డీఆర్ఐ చెప్పినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ ఏపీ అంటూ పచ్చి అబద్ధాలను గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కొందరు రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలని చూస్తున్నారు’’ అని తెలిపారు. చదవండి: దుర్మార్గం.. దిగజారుడుతనం -
వైరల్ వీడియో: ‘పట్టాభి ఓ గే’
-
ఏపీ వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ను టీడీపీ నేత పట్టాభితో తీవ్ర పదజాలంతో దూషింపజేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అనంతపురం: టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష కొనసాగుతోంది. కృష్ణాజిల్లా: సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిరువూరు వైఎస్సార్ కార్యాలయంలో "జనాగ్రహ దీక్ష దీక్షలో పాల్గొన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పిఏసియస్ ఛైర్మన్లు, పార్టీ నాయకులు,కార్యకర్తలు నిరసన తెలుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు రాష్ట్రపతి రోడ్ లో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనాగ్రహదీక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంగా నేతలు.. సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై.. వైఎస్సార్సీపీ ఆర్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాభి వెంటనే సీఎం జగన్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జనాగ్రహ దీక్షలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో జెడ్పీ చైర్మన్ కావురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలో కొనసాగుతుంది. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ,ఎంపిపి లు చిట్టూరి కనక లక్ష్మి,రావూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష కొనసాగుతుంది.ఈ జనాగ్రహ దీక్షలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవ్వరు చూస్తువూరుకోరని అన్నారు. టీడీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారి పోయారో ఈ వ్యాఖ్యలతో అర్థమవుతుందని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పవన్ కల్యాణ్ కు పట్టిన గతే చంద్రబాబుకి పడుతుందని అన్నారు.భవిష్యత్ లో ఒక్క సీటుకే..బాబు పరిమితం అవుతారని అన్నారు. వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పులివెందులలో నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానిక బిఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ సర్కిల్స్ లో జనాగ్రహ దీక్షల పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు దీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా: టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనాగ్రహ దీక్షను చేపట్టారు. అదే విధంగా, మండపేట కలువ పువ్వు సెంటర్ లో వైఎస్సార్సీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు,మున్సిపల్ చైర్మన్ నూక దుర్గా రాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
టీడీపీ టెర్రరిస్ట్ పార్టీలా మారింది: మంత్రి బొత్స
-
టీడీపీ టెర్రరిస్ట్ పార్టీలా మారింది: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ టెర్రరిస్ట్ పార్టీలా మారిందన్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితులకు చంద్రబాబు కారణం కాదా? విమర్శించారు. రాజకీయాల్లో ఇలా తిట్టడం గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. చంద్రబాబు చరిత్ర మొత్తం కుట్రలమయమేనని అన్నారు. ఎన్టీఆర్ను గద్దెదింపటానికి బాబు ఏంచేశారో అందరికీ తెలుసని మంత్రి బొత్స అన్నారు. టీడీపీని ఏపీలో నిషేధించాలని డిమాండ్ చేస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. చదవండి: చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు: మంత్రి బాలినేని -
చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు జీవితమంతా కుట్రల మయమని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు మాట్లాడారని అన్నారు. చంద్రబాబు దీక్ష అంటేనే ఒక దొంగ దీక్ష... అని మంత్రి బాలినేని విమర్శించారు. ఏపీలో కుట్రలో కుతంత్రాలు చేస్తామంటే ఊరుకోబోమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకోస్తారా? అని ప్రశ్నించారు. గతంలో.. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రథాలు తగలబెట్టించారని బాలినేని ఎద్దేవా చేశారు. చదవండి: TDP Leader Pattabhi Arrested: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ -
తెలుగుదేశం పార్టీ పతనానికి పరాకాష్ట
అధికారానికి దూరంగా ఉన్నంత మాత్రాన... ఒక రాజకీయ పార్టీ ఇంతలా పతనమైపోవటమన్నది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధిని కూర్చోబెట్టి... గజ్జి సోకిన గ్రామ సింహంలా మొరిగించిన వైనంపై రాష్ట్రంలో తీవ్ర స్థాయి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అఖండ ప్రజాదరణతో సీఎం పీఠంపై కూర్చున్న నాయకుడిని ఉద్దేశించి ‘లం****’ (బోసిడీకే) అని పదేపదే బూతులు తిట్టించడంతో సీఎంను అభిమానించేవారు... వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గట్టిగా ప్రతిస్పందించారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. ఇంత జరిగినా... పశ్చాత్తాప పడని టీడీపీ అధ్యక్షుడు... దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటానికి మరో ఎత్తుగడకు దిగారు. బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే... రీతిన ఆయనిచ్చిన పిలుపు ఒక బడ్డీ కొట్టును.. ఆఖరికి ఆయన హెరిటేజ్ దుకాణాల్ని కూడా మూయించలేకపోయింది. ఇప్పుడాయన 36 గంటల దీక్ష.. వరస లేఖలు.. కేంద్ర హోం మంత్రితో సమావేశమంటూ రకరకాల ఎత్తుగడలకు దిగుతున్నారు. పవిత్రమైన నిరాహారదీక్ష ఆయుధాన్ని పచ్చి బూతులకు మద్దతుగా ప్రయోగిస్తున్నారు. పరిధి దాటిన పట్టాభి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్రిక్తతలు, అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అన్ని పరిధులు అతిక్రమించారని, ఆయన దుర్భాషల తరువాతే కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ‘రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పట్టాభి దారుణమైన భాషలో మాట్లాడారు. టీడీపీ కార్యాలయం నుంచే ఆయన ముఖ్యమంత్రిని దుర్భాషలాడారు. అదేదో ఆవేశంలో నోరుజారి మాట్లాడింది కూడా కాదు. ఉద్దేశపూర్వకంగానే పదేపదే దారుణంగా దూషించారు’ అని డీజీపీ స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ కుట్ర చంద్రబాబుదే నెల రోజులుగా పథకం ప్రకారం.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వారిని ఉద్దేశించి దుర్భాషలాడటం తీవ్రమైన నేరమని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఇంతటి దారుణమైన భాష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు నైతిక విలువలకు కట్టుబడి హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు నెల రోజులుగా ఓ పథకం ప్రకారం మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న అసత్య ఆరోపణలు, దూషణలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. పట్టాభి దుర్భాషలు, తదనంతర పరిణామాలపైనా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దుర్భాషలపై జనాగ్రహం దశాబ్దాల సమస్య రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా దశాబ్దాలుగా ఉన్న సమస్య అని చెప్పారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండటంతో దశాబ్దాలుగా గంజాయి సాగు సాగుతోందన్నారు. గత రెండేళ్లుగా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గతంలో కంటే పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు గంజాయి స్మగ్లింగ్పై కఠిన చర్యలు ఉండేవి కావన్నారు. గంజాయి అక్రమ రవాణాపై 2018లో రాష్ట్రంలో 579 కేసులు నమోదు చేసి 2,174 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా 2021లో ఇప్పటికే 1,456 కేసులు నమోదు చేసి 4,059 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. టీడీపీ బంద్ను పట్టించుకోని ప్రజలు స్పందించలేదనడం సరికాదు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ చేస్తే తాను స్పందించలేదన్న ఆరోపణలను డీజీపీ ఖండించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాను పోలీస్ పరేడ్ పర్యవేక్షిస్తుండగా ఓ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందన్నారు. పరేడ్ జరుగుతుండటంతో ఎవరు మాట్లాడుతున్నారో సరిగా వినిపించలేదన్నారు. ఘర్షణ విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడాలని సూచించినట్లు చెప్పారు. టీడీపీ నేతలు ఫోన్ చేస్తే గుంటూరు ఎస్పీ, మంగళగిరి రూరల్ పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. పట్టాభి చేసింది తప్పే.. -
పట్టాభి చేసింది తప్పే; టీడీపీలో సీనియర్ల అసహనం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్పై తమ పార్టీ నేత పట్టాభి చేసిన దూషణలపై తెలుగుదేశం పార్టీలోనే అసహనం వ్యక్తమవుతోంది. అసభ్య పదజాలంతో సీఎంను తిట్టడం సరికాదని పలువురు సీనియర్ నాయకులు అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా పార్టీ ఆఫీసులో కూర్చుని రాజకీయాలు మాట్లాడే వారిని ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల గతంలో నష్టం జరిగిందని పలువురు నేతలు చెబుతున్నారు. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు అలాంటి వారిని పట్టుకుని వేళ్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు వ్యూహాలతో చంద్రబాబు కోటరీలోని కొందరు వ్యక్తులు ఇలాంటి వ్యవహారాలు చేయిస్తున్నారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు సైతం వారి ట్రాప్లో పడి వాస్తవాలు గ్రహించడంలేదంటున్నారు. రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూసిన వ్యూహాలేవీ ఇప్పటివరకు పనిచేయలేదని చెబుతున్నారు. ఇప్పుడు జరిగింది కూడా అదేనని వాపోతున్నారు. పట్టాభి వ్యాఖ్యలను సమర్థించేలా చంద్రబాబు మాట్లాడడంపై పలువురు సీనియర్లు అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలిసింది. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత రాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని స్పష్టం చేస్తున్నారు. అప్పటికప్పుడు మీడియాలో కొద్దిరోజులు నానడం తప్ప అంతిమంగా దీనివల్ల పార్టీకి ప్రయోజనం రాకపోగా ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇచ్చిన బంద్ పిలుపునకు పార్టీ నుంచే పూర్తిస్థాయి మద్దతు రాలేదని చెబుతున్నారు. బంద్ ద్వారా పార్టీ శ్రేణులను ఉత్తేజపరచాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ వారినుంచి ఆశించిన స్పందన రాలేదు. బంద్తో రాష్ట్రం మొత్తం అలజడి సృష్టించాలని చూసినా అదేమీ జరగలేదు. చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా పార్టీ నాయకులు, శ్రేణుల ఆలోచనలు ఉన్నాయనడానికి ఈ బంద్ ఉదాహరణని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఎక్కువమంది బంద్కు దూరంగా ఉన్నారు. సాధారణంగా ఎప్పుడూ కనిపించే నాయకులు సైతం బంద్లో కనిపించలేదు. పార్టీలోనే చంద్రబాబు పిలుపునకు స్పందన లేనప్పుడు ప్రజల నుంచి ఎలా ఉంటుందని టీడీపీలోనే కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాల ద్వారా లబ్ధిపొందడానికి బంద్కు పిలుపిచ్చినా ప్రజలు అసలు పట్టించుకోకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. -
సీఎంను దూషించిన పట్టాభి అరెస్ట్
భవానీపురం (విజయవాడ పశ్చిమ)/పటమట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను విజయవాడ గవర్నర్పేట పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిని దూషించినట్లుగా గవర్నర్పేట పోలీస్స్టేషన్లో అందిన పిర్యాదు మేరకు పట్టాభిపై సెక్షన్ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్ విత్ 120(బి) కింద (క్రైం నంబర్.352/2021) కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం రాత్రి గురునానక్నగర్లోని కనకదుర్గ ఆఫీసర్స్ కాలనీలో రోడ్ నంబర్ 7లోని ప్లాట్ నంబర్ 22లో పట్టాభి ఇంటికి చేరుకున్నారు. కాలింగ్బెల్ కొట్టినా స్పందించకపోవటంతో కొంతసేపు సంయమనంగా వ్యవహరించిన పోలీసులు తరువాత సీఆర్పీసీ సెక్షన్ 50(3) మేరకు నోటీసు ఇచ్చారు. అనంతరం గవర్నర్పేట సీఐ ఎం.వి.ఎస్.నాగరాజ ఆయన్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పట్టాభి భార్య చందన పోలీసుల తీరును తప్పుపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తన భర్త ఇంట్లో కూడా అసభ్యంగా మాట్లాడరని చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు. గతంలో ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వారున్నారని, కానీ అప్పుడు స్పందించని ప్రభుత్వం ఇప్పుడు కావాలనే అరెస్టు చేయించిందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. పోలీసులపై నమ్మకం లేదని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. అరెస్ట్కు ముందు పట్టాభి ఒక వీడియోను విడుదల చేశారు. తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, తనకేమైనా జరిగితే ప్రభుత్వానిది, పోలీసులదే బాధ్యత అని ఆ వీడియోలో పేర్కొన్నారు. పోలీసులు పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్స్టేషన్కు తరలించారు. ఆయన్ని గురువారం కోర్టులో హాజరుపరచే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి: అంబటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు పట్టాభితో పాటు, ఇందుకు కర్త, కర్మ, క్రియ అయిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని కూడా అరెస్టు చేయాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిగితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రకు సంబంధించిన అనేక అంశాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబుపై జీవీఎల్ ఫైర్.. చేసిన తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్) -
పట్టాభి మాదకద్రవ్యాలు తీసుకోని మాట్లాడాడు : మంత్రి వేణుగోపాల కృష్ణ
-
ఏపీలో టీడీపీ చేపట్టిన బంద్ అట్టర్ ప్లాప్
-
నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం:మంత్రి బాలినేని
-
సీఎం జగన్ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ప్లాన్ ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామని హెచ్చరించారు. పట్టాభి కూడా డబ్బులు తీసుకొని తిడుతున్నాడన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొట్టారని మండిపడ్డారు. చంద్రబాబువి మొదటి నుంచి మోసపూరిత రాజకీయాలే అని దుయ్యబట్టారు. చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎం వైఎస్ జగన్ను ఇంచు కూడా చంద్రబాబు కదపలేరని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీ పూర్తిగా హద్దు దాటింది: సజ్జల చంద్రబాబులా పెయిడ్ ఆర్టిస్ట్లను పెట్టి తిట్టించడం తమకు రాదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. వ్యూహం ప్రకారమే డ్రగ్స్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమిత్షాపై తిరుపతిలో చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని, చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అమిత్షా, మోదీలకు ఎప్పుడో తెలుసన్నారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అమిత్షాను కలుస్తావని ప్రశ్నించారు. చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనని, ఆయన చేసే కొంగ జపాలను ఎవరూ నమ్మరని అన్నారు. చదవండి: పట్టాభి మాట్లాడింది తప్పని చంద్రబాబు చెప్పాలి: అంబటి ‘ఏపీలో ఏదో జరిగిపోతోంది. శాంతిభద్రతలు లేవు అంటూ టీడీపీ నాయకులు గత 10 రోజుల నుంచి పిచ్చి వాగుడు వాగుతున్నారు. రాజశేఖర్ రెడ్డిని ముఠా నాయకుడని, అవినీతిపరుడని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ నూనూగు మీసాల వయసు నుంచి ఆయనపై కుట్రలు చేయడం ప్రారంభించారు. ఈ రోజు అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్నీ చేసినా ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు. చదవండి: పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: ఏపీలో వైఎస్సార్సీపీ నిరసనలు పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్లో రెండు కుర్చీలు ఇరగ్గానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటాడు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వాళ్ళు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. యుద్ధంలో మగాళ్లతో ఫైట్ చేస్తాం. లోకేష్ లాంటి అటూ ఇటూ కానీ వాళ్ళతో ఏమి యుద్ధం చేస్తాం. లోకేష్ విసిరిన ఛాలెంజ్కు మేము స్పందించలేము. వైఎస్ పెట్టిన అభ్యర్థిపై చిత్తుగా ఓడిపోయిన వాడితో మాకేంటి పోటీ. జీవితంలో ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత లోకేష్ ఛాలెంజ్ చేయాలి’ అని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. -
టీడీపీ పూర్తిగా హద్దు దాటింది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: టీడీపీ పార్టీ అన్ని హద్దులనూ దాటేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల భాష రోజురోజుకీ దిగజారిపోతుందన్నారు. ఒక అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి రాష్ట్రంలో కోట్లాదిమంది అభిమానించే సీఎం జగన్ను దుర్భాషలాడారని, మాట్లాడింది పట్టాభి అయితే.. మాట్లాడించింది చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రబాబుతో చర్చించి, కేంద్ర కార్యాలయంలో కూర్చుని పట్టాభి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారన్నారు. ఇలాంటి మాట పలుమార్లు అనడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. చదవండి: సీఎం జగన్ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని ఇంత ఘోరమైన మాట్లాడిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావాలని, పట్టాభి అనుచిత వ్యాఖ్యలపైనే.. నిన్నటి రియాక్షన్ వచ్చిందన్నారు. పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయకపోతే రియాక్షన్ ఉండేది కాదని అన్నారు. ఇక ముందు కూడా అర్థం పర్థం లేకుండా ఇలానే తిడితే తప్పకుండా రియాక్షన్ ఉంటుందని అన్నారు. గత రెండున్నరేళ్లుగా వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల్లో మంచిపేరు వచ్చిందని, అది తట్టుకోలేక ప్రజల్లోకి అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: పట్టాభి మాట్లాడింది తప్పని చంద్రబాబు చెప్పాలి: అంబటి చంద్రబాబు దగ్గరుండే ఇదంతా చేయించారని మండిపడ్డారు. ప్రజల ఆగ్రహానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. పట్టాభి వాడిన భాష తాము కూడా మాట్లాడితే ఎలా ఉంటుందని, ప్రజాస్వామ్య స్పూర్తి అంటే బండ బూతులు తిట్టడమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. చదవండి: టీడీపీ బూతు వ్యాఖ్యలపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి -
పట్టాభి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసనలు
-
మాట్లాడింది పట్టాభి.. మాట్లాడించింది బాబు : కోరుముట్ల
-
పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ
-
పట్టాభి మాట్లాడింది తప్పని చంద్రబాబు చెప్పాలి: అంబటి
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను, మాట్లాడిన భాషను చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీని పాలేరు అంటూ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలోనూ డీజీపీ పనిచేశారని, ఒక ఐపీఎస్ అధికారిని ఇలా మాట్లాడటం హేయమన్నారు. ప్రజల సింపతి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ టీడీపీ పార్టీ పని అయిపోయిందని, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కొంగ జపాలు చేసిన ప్రజలు నమ్మరని అన్నారు. గతంలో ఎన్ని కుట్రలు, హత్యలు చేయించారో ప్రజలకు తెలుసన్నారు. పట్టాభి మాట్లాడింది తప్పు అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడితే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ, ముఖ్యమంత్రిని తిట్టడం తప్పని చెప్పి నిరాహార దీక్షకు కూర్చోవాలన్నారు. పట్టాభి వ్యాఖ్యలపై చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: ఏపీలో వైఎస్సార్సీపీ నిరసనలు -
పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: నిన్న టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.. చాలా దారుణ భాష అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదన్నారు. ‘‘పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలని డీజీపీ హితవు పలికారు. (చదవండి: నారా లోకేష్పై కేసు నమోదు) పట్టాభి వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి.. నిన్న పట్టాభి చేసిన వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాం. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతాం. నిన్న సాయంత్రం 5.03 నిమిషాలకు వాట్సాప్లో ఒక కాల్ వచ్చింది. కాల్ చేయగానే ఎస్పీ తక్షణమే స్పందించారు. నిరాధార ఆరోపణలు కరెక్టు కాదు నిరాధార ఆరోపణలు కరెక్టు కాదని డీజీపీ అన్నారు. విజయవాడకు డ్రగ్స్తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. ఆరోపణలు చేయవద్దని చెబుతున్నాం. గుజరాత్లో దొరికిన డ్రగ్స్తో ఏపీకి సంబంధం లేదు. ఒక గ్రామ్ కూడా విజయవాడకు రాలేదన్నారు. పోలీసుల త్యాగాన్ని మరువలేం.. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాన్ని మరువలేమని డీజీపీ అన్నారు. ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రేపు పోలీసు ఫ్లాగ్ డే నిర్వహిస్తామన్నారు. కోవిడ్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామని డీజీపీ అన్నారు. -
టీడీపీ నేతలపై తిరగబడ్డ వ్యాపారులు
-
‘మా సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఛాలెంజ్ హాస్యాస్పదమని.. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టాభి వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన మంచి మనసు సీఎం జగన్ది. చంద్రబాబును సొంత పార్టీ నేతలే నమ్మడంలేదు. టీడీపీ బంద్ను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నేతల భాషను పవన్ ఎందుకు ఖండించలేదు.. విజయనగరం: సీఎంపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు అభ్యంతరకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీని నిషేధించాలని ఈసీని కోరతామన్నారు. చంద్రబాబుది ఎప్పుడూ క్రిమినల్ ఆలోచనలే. టీడీపీ నేతల భాషను పవన్ ఎందుకు ఖండించలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మట్లాడాలని బొత్స హితవు పలికారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. గుంటూరు: టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎల్లో మీడియా ఉంది కదా అని అడ్డదిట్టంగా మాట్లాడొద్దన్నారు. సంక్షేమ పాలన ఓర్వలేకే టీడీపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. టీడీపీ పథకం ప్రకారమే అలజడి సృష్టించాలని చూస్తోందన్నారు. పట్టాభి ఒక పెయిడ్ ఆర్టిస్ట్. పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరన్నారు. పట్టాభిని చట్టపరంగా శిక్షించాల్సిందేని మోపిదేవి డిమాండ్ చేశారు. సంక్షోభం సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్ అనంతపురం: రాష్ట్రంలో సంక్షోభం సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. పట్టాభిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. -
టీడీపీ లీడర్లకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వార్నింగ్
-
పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: ఏపీలో వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనలు జరుపుతున్నారు. చంద్రబాబు, పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. విజయవాడ సితార సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ కూడలిలో వైఎస్సార్సీపీ ఆందోళన జరిపింది. పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను వైఎస్సార్సీపీ దగ్ధం చేసింది. అనంతపురం: బుక్కరాయ సముద్రంలో టీడీపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టాభి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. -
పట్టాభి వాడిన పదాలకు అర్ధమేమిటో తెలుసా?
-
చంద్రబాబు ఇచ్చిన నెల జీతం తీసుకుని పట్టాభి మాట్లాడుతున్నారు: ధర్మశ్రీ
-
టీడీపీ కార్యలయ ముట్టడికి యత్నించిన వైఎస్ఆర్సీపీ విద్యార్ది యువజన
-
నోరు అదుపులో పెట్టుకోవాలని పట్టాభికి హెచ్చరిక
-
విషక్రీడ
-
దుర్మార్గం.. దిగజారుడుతనం
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సర్వత్రా నిరసన వ్యక్తమైంది. అన్ని వర్గాల ప్రజలు ఆ వ్యాఖ్యలను తప్పు పట్టారు. సభ్య సమాజం తలదించుకునేలా, విచక్షణ మరచి అలా మాట్లాడటం దారుణం అని, ఇదంతా పక్కా స్కెచ్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ఇలా మాట్లాడించారని అన్నారు. నెల్లూరు నగరంలో యువజన, విద్యార్థి సంఘాల నాయకులు హరనాథపురం సెంటరు నుంచి మినీబైపాస్ రోడ్డులోని తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయం సమీపం వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయానికి సమీపంలో పోలీసులు ర్యాలీ చేస్తున్న వారిని అడ్డగించారు. దీంతో రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు మాట్లాడే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి తెరదీస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న చోటా టీడీపీ నేతలు.. ధర్నా చేస్తున్న వారిని, ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని పోలీసులు వారిస్తున్నా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వైఎస్సార్సీపీ అభిమానులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. గుంటూరులో చంద్రబాబు చిత్రపటాలను చెప్పులతో కొడుతున్న మహిళలు పట్టాభీ.. నోరు అదుపులో పెట్టుకో టీడీపీ నేత పట్టాభిరాం నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎంపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని వారు ఈ సందర్భంగా ముట్టడించారు. అంతకు ముందు ప్రెస్క్లబ్ నుంచి ర్యాలీగా బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకుని బైఠాయించారు. టీడీపీ నాయకులది నీచ సంస్కృతి అని దుయ్యబట్టారు. సీఎం జగన్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు తన పార్టీ నాయకులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కడప, ప్రొద్దుటూరులో టీడీపీ నేతల ఇంటి ముందు వైఎస్సార్సీపీ అభిమానులు ధర్నా నిర్వహించారు. గుంటూరులోని హిందూ కాలేజీ కూడలి వద్ద పలువురు మహిళలు, యువకులు టీడీపీ వైఖరిపై నిరసన తెలిపారు. టీడీపీ జెండాలను తగలబెట్టారు. టీడీపీ నాయకులే గంజాయి సాగు చేస్తూ, అధికార పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని యువకులు మండిపడ్డారు. విశాఖలో టీడీపీ నేతల దాడి విశాఖలో పలువురు యువకులు, మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టాభి.. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో టీడీపీ కార్యాలయంలో ఉన్న కొంత మంది కార్యకర్తలు మహిళలపై దాడికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేశారు. అంతలోనే టీడీపీ విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మహిళలను దుర్భాషలాడారు. దీంతో ఆయన్ను అరెస్టు చేయాలని మహిళలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. -
పట్టాభి వాడుతున్న పదజాలం సరికాదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకు టీడీపీ నాయకుడు పట్టాభి వాడుతున్న పదజాలం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇదే సందర్భంలో దాడులు చేయడం కూడా సరైన విధానం కాదన్నారు. కార్యకర్తలను, నాయకులను నియంత్రించాల్సిన బాధ్యత సీఎం జగన్కు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉందన్నారు. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయడం సహజమని, వాటిని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు.