pressmeet
-
ఎప్పుడైనా... ఎవరితోనైనా... కొట్లాటకు సిద్ధం
-
గుంటూరు మిర్చి యార్డ్ లో వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
ఏపీ ప్రయోజనాలు వదిలేశారు: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: పోలవరం ఏపీకి జీవనాడి అని,పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎంపీలు మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్, గురుమూర్తి, గొల్ల బాబూరావు, మేడ రఘునాథ్రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) మీడియాతో మాట్లాడారు.‘150 టీఎంసీల సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపైన దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.ఉద్యోగస్తులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. స్టీల్ ప్లాంట్కు ప్లాంటుకు అవసరమైన గనులు కేటాయించాలి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు మాట్లాడాలి. వ్యక్తిగతంగా మా పైన, మా పార్టీ అధ్యక్షుడిపైన మాట్లాడడం మానుకోవాలి. మిర్చి రైతులకు మద్దతు ధర లేకుండా పోయింది. మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో మేము మార్కెట్ జోక్యం ద్వారా రైతులను ఆదుకున్నాం’అని వైవీసుబ్బారెడ్డి తెలిపారు.ఎత్తు తగ్గిస్తే బనకచర్లకు నీళ్లు సాధ్యం కాదు: మిథున్రెడ్డిపోలవరం ప్రాజెక్టుకు రూ. 60 వేల కోట్ల ఖర్చు అవుతుందికానీ కేవలం రూ. 30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారుపోలవరం ఎత్తు తగ్గించడం వల్ల బనకచర్లకు నీళ్లు తరలించడం సాధ్యం కాదుఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం 45 మీటర్ల ఎత్తు ఉండాలిరాష్ట్రం నష్టపోతుంటే, టీడీపీ ఎంపీలు చూస్తూ కూర్చుంటున్నారురాష్ట్రంలో మెడికల్ సీట్లను సరెండర్ చేసేలా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందివ్యక్తిగత ఆరోపణలకు పార్లమెంటును వేదికగా మార్చుకోవద్దు సీఎం రమేష్పై మిథున్రెడ్డి ఫైర్ మద్యం విషయంలో తనపై సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) లోక్సభలో అన్నారు. సీఎం రమేష్కు కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలని చురకంటించారు. మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమపై సీఎం రమేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి కుంభకోణం అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్పై విచారణ జరగాల్సిందేనని మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.ఏపీపై కేంద్రం చిన్నచూపు: పిల్లి సుభాష్చంద్రబోస్బీహార్కు ఇచ్చిన ప్రాధాన్యత ఏపీక ఇవ్వడం లేదుటీడీపీ ఎంపీలు రాజకీయ ద్వేషంతో చేసే వ్యక్తిగత విమర్శల వల్ల ఉపయోగం లేదుపార్లమెంటును రాష్ట్ర ప్రయోజనాల కాపాడేందుకు సద్వినియోగం చేసుకోవాలిటీడీపీ ఎంపీలు పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నారుమేము మాట్లాడుతుంటే అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదుపోలవరం ఎత్తు తగ్గింపు రైల్వే జోను ఇతర అంశాలపై ఐక్యంగా పోరాడుదాంఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడిందిరైతులను ఆదుకోవాలని మేము అడుగుతుంటే టీడీపీ వారు సభలో అడ్డుకుంటున్నారురైతులను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ పడ్డారు: వైఎస్ అవినాష్రెడ్డివిభజన సమయంలో ఏపీకి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయించడం చంద్రబాబు రాజీ పడ్డారు25 వేలకోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాను వదిలేశారుపోలవరం ఎత్తును కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించిందిరూ. 57 వేలకోట్లకుగాను 30 వేలకోట్ల రూపాయలకు పోలవరాన్ని పరిమితం చేశారు 27 వేల కోట్ల గ్రాంట్ వదిలేశారు ఫలితంగా అమరావతికి 15000 కోట్ల అప్పు సాధించారు పోలవరం ఎత్తును, కెపాసిటీ తగ్గించి రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారు16 మంది ఎంపీల మద్దతు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడడం లేదు చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారుమేము ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్ను తీసుకొస్తే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారుదాని ఫలితంగా ఆయన మహారాష్ట్రకు వెళ్లిపోయి మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారుచంద్రబాబు చర్యల వల్ల యువత రైతులు నష్టపోయారు 9 నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు ఏ వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు రాజీపడుతున్నారుకూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలను మానుకోవాలి:గురుమూర్తితిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నాపై దాడికి పాల్పడ్డారుప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేశారూఒక్కరే సభ్యులు ఉన్న టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది పార్లమెంట్లో రాష్ట్రం పరువు తీయొద్దుశిఖండి తరహా రాజకీయాలకు పాల్పడవద్దుమాపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడుతున్నారుసంపద సృష్టిస్తానని హామీ ఇచ్చి అప్పులు చేస్తున్నారు:గొల్లబాబూరావుసూపర్ సిక్స్ పేరుతో జనం చెవులలో ఊదరగొట్టారుఒక్క హామీ కూడా అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్నారుచంద్రబాబు వల్ల మోసపోయామని జనం అంటున్నారువైఎస్ జగన్ మాటిస్తే వెనక్కి పోరురాష్ట్ర ప్రయోజనాలపై మేము టీడీపీతో కలిసి వస్తాంతమిళనాడు కర్ణాటక ఎంపీల తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలిఏపీకి న్యాయం జరగాలనే మా పోరాటం: మేడ రఘునాథ్రెడ్డితిరుపతి ఐఐటీకి అదనపు నిధులు కావాలితిరుపతిని నూతన రైల్వే డివిజన్ చేయాలని సభలో కోరాపార్లమెంటులో ఏపీ పరువు తీయొద్దుసాధ్యమైనంత ఎక్కువగా ఏపీకి నిధులు వెళ్లేలా మేమే చొరవ తీసుకుంటున్నాంవ్యక్తిగత విమర్శలుమాని, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ ఎంపీలు పనిచేయాలి -
జనసేన కిరణ్ రాయల్ బాధితురాలు సంచలన ప్రెస్ మీట్
-
రాష్ట్ర పరిస్థితులు, ప్రజా సంబంధ అంశాలపై మాట్లాడనున్న వైఎస్ జగన్
-
నేడు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
స్టీల్ ప్లాంట్ను ఏం చేస్తారో చెప్పండి: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:స్టీల్ప్లాంట్కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్షా, సీఎం చంద్రబాబు ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్ జగన్కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు. -
భట్టి విక్రమార్కకు హరీశ్రావు ఛాలెంజ్
సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్రావు అన్నారు. భట్టి గోబెల్స్ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు -
వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బలవంతంగా పెట్టించిన కేసులో విషయం ఏమీ లేకపోవడంతో ఏసీబీ అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ‘పాడిందే పాడరా’ అన్నట్లు 82 ప్రశ్నలను తిప్పి తిప్పి అడిగారు. తెలంగాణ ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లుగా నిబద్ధతతో, పైసా అవినీతికి తావు లేకుండా పనిచేశా అని చెప్పా. ఏసీబీ మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా.ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటా. ఏడాది కాలంగా లగచర్ల, హైడ్రా, విద్యుత్ చార్జీల పెంపు వంటి అనేక అంశాలపై కొట్లాడుతున్నాం. కేసులు పెట్టి మా కేడర్, ప్రజల దృష్టిని రేవంత్ మళ్లించలేరు. అవసరమైతే తెలంగాణ కోసం చస్తాను తప్ప ఇలాంటి కేసులకు తలవంచేది లేదు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులతో విచారణకు హాజరైన కేటీఆర్.. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఉదయం విచారణకు వెళ్లే ముందు నందినగర్ నివాసం వద్ద కూడా ఆయన మాట్లాడారు.అణా పైసా అవినీతి లేదని చెప్పా‘తెలంగాణకు పెట్టుబడులు తేవడం, ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రాన్ని హబ్గా మార్చాలనే దూరదృష్టితో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే కష్టపడి ఫార్ములా ఈ రేస్ను తెచ్చానని చెప్పా. ఇందులో అణాపైసా అవినీతి లేదని స్పష్టం చేశా. అలాంటి గలీజు పనులు చేయడం రేవంత్కు అలవాటు అని కుండబద్ధలు కొట్టి చెప్పా. ఇక్కడ నుంచి డబ్బులు పంపాం.. డబ్బులు అందినట్లు ఎఫ్ఈఓ (ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్) వాళ్లు ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని చెపితే ఏసీబీ అధికారులు నీళ్లు మింగుతున్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ ఇతరులను కూడా పంపి పైశాచిక, శునకానందం పొందాలని చూస్తున్నాడు. రేవంత్ తరహాలో నేను లుచ్చా పనులు చేయలేదు. కేబినెట్లో ఉంటూ లాండ్ క్రూజర్లు కొనుగోలు చేయలేదు. బావ మరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టు ఇవ్వలేదు. రేవంత్ తరహాలో డబ్బు సంచులతో దొరకలేదు. పెట్టుబడులు తెచ్చేందుకు విదేశాలు తిరిగా. రేవంత్ పెట్టే కేసులకు భయపడేవారెవరూ తెలంగాణలో కానీ బీఆర్ఎస్లో కానీ లేరు..’ అని కేటీఆర్ అన్నారు.రేవంత్ను ఎవరూ సీఎంగా గుర్తించడం లేదు‘ఇదొక లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం. రాష్ట్రంలో రేవంత్ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. తనను గుర్తించని వారిపై కేసులు పెట్టి లోపలేస్తున్నడు. ఏడాది తర్వాత కూడా ఆయనను ఎవరూ సీఎంగా గుర్తు పట్టకపోతే నేనేం చేయాలి. కేసులకు భయపడేది లేదు, బాధపడేది లేదు. లేని అవినీతిని పట్టుకుందామని ప్రయత్నిస్తే ఎక్కడ దొరుకుతుంది? ఏసీబీకి రేవంత్ మళ్లీ ప్రశ్నలు పంపితే తిరిగి పిలుస్తారేమో. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉంది. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతా. కేసీఆర్ సైనికులుగా ఈ ఏడాదంతా రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలుపై నిలదీస్తూనే ఉంటాం. ఎంత కొట్టినా రైతు భరోసా, రూ.4 వేల ఆసరా పెన్షన్, మహిళలకు ప్రతి నెలా రూ.2,500, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టం వస్తే మేమున్నామంటూ వచ్చిన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎల్లోమీడియాకు అంబటి రాంబాబు వార్నింగ్
సాక్షి,గుంటూరు: ఎల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం(జనవరి6) అంబటి మీడియాతో మాట్లాడారు. ‘పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం.మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేం మీలా కక్ష సాధింపులకు పాల్పడం. గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్కు వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు. చనిపోయిన వారికి రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి.పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు. సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు ఎవరివల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు.రోడ్డుబాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని అంబటి రాంబాబు అన్నారు. -
నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా
-
2023 కంటే 2024 చాలా బెటర్..
-
ఆరు నెలలు అయ్యింది.. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది
-
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం
-
హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
-
రేవంత్ కుంభకోణాలు బయటపెడుతున్నందుకే..
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి కుంభోణా లను బయట పెడుతున్నందునే రాష్ట్ర ప్రభుత్వం మాపై రాజకీయ వేధింపులకు దిగుతోంది. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసింది. ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగి నట్లు ఆధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని సవాలు చేస్తున్నా. కానీ అసెంబ్లీలో మాట్లాడలేని సీఎం, దద్దమ్మ మంత్రులు లీకులతో దుష్ప్రచారం చేస్తు న్నారు. సీఎం, మంత్రులకు ఈ అంశంపై అవగా హన ఉంటే అసెంబ్లీ సాక్షిగా అవినీతిని బయట పెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంలో అణా పైసా వృథా కాలేదు అనేందుకు నా వద్ద ఆధారాలు ఉన్నా యి..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రేసులు రద్దయ్యాయి. దీంతో ఈవీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పేరు రాకపోవడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, మోసా లను ప్రజాస్వామ్య యుతంగా ప్రజల ముందు పెడతాం. నాపై నమోదైన కేసులపై చట్ట ప్రకారం ముందుకు వెళతాం. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఉద్యమకారులం, అణిచివేతలు, చిల్లర కుట్రలకు భయపడకుండా కొట్లాడతాం..’ అని అన్నారు. ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు.‘ఈవీ’కి తెలంగాణను హబ్గా చేయాలనుకున్నాం..‘కేసీఆర్ నాయకత్వంలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఎలక్ట్రిక్ వాహన వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ఫార్ములా–ఈ రేస్’ను నిర్వహించాలని భావించాం. నాలుగు సీజన్ల పాటు నిర్వహించేలా 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదిరింది.2023 ఫిబ్రవరి 10న తొలి సీజన్ రేసింగ్ నిర్వహించాం. రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ రూ.35 కోట్లు, ప్రమోటర్ సంస్థ గ్రీన్ కో రూ.110 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల అదనంగా రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని నీల్సేన్ సర్వే సంస్థ తెలిపింది. అయితే నష్టాలను కారణంగా చూపుతూ రెండో సీజన్లో ప్రమోటర్ గ్రీన్ కో తప్పుకోవడంతో హెచ్ఎండీఏ నుంచి రెండు విడతల్లో రూ.55 కోట్లు చెల్లించాలని నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ను ఆదేశించా. ఎలాన్ మస్క్ను రప్పించి ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈవీ రంగానికి తెలంగాణను హబ్గా ప్రమోట్ చేయాలని అనుకున్నాం..’ అని కేటీఆర్ తెలిపారు.అవినీతే జరగనప్పుడు కేసు ఎలా?‘ఈ నేపథ్యంలో తదుపరి చెల్లింపులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ఫార్ములా–ఈ సంస్థ కోరింది. దీని సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లొంగోతో అదే నెల 13న సీఎం రేవంత్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సమావేశయ్యారు. తర్వాత రేస్ నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ, కాంట్రాక్టు నిబంధనలు ప్రస్తావిస్తూ డిసెంబర్ 21 లోగా నిర్ణయం తెలపాలని సంస్థ లేఖ రాసింది. డిసెంబర్ 26 వరకు వేచి చూసి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రేస్ నిర్వహణ సాధ్యం కాదని చెప్తూ నిర్వాహక సంస్థ రూ.73 లక్షల రేస్ ఫీజును కూడా వెనక్కి పంపింది. ఎఫ్ఈఓ ఎన్నిమార్లు కోరినా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫీజును వెనక్కి తీసుకోవడం లేదు. రూ.55 కోట్లు రెండు వాయిదాలలో తమకు ముట్టిన విషయాన్ని నిర్ధారిస్తూ మూడో వాయిదా చెల్లించడంపై ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో సంస్థ సంప్రదింపులు కొనసాగించింది. అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగా హెచ్ఎండీఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. అవినీతే జరగనప్పుడు కేసు నమోదు చేసే అంశం ఏసీబీ పరిధిలో లేదు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హరీశ్ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా–ఈపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టింది..’ అని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఫార్ములా వన్ యోచన‘చంద్రబాబు హయాంలో 2001లో ‘ఫార్ములా వన్’ నిర్వహించాలనుకున్నారు. ట్రాక్ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో సీఎం రేవంత్రెడ్డికి సంబంధించిన 15 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ విషయాన్ని 2013 ఎన్నికల అఫిడవిట్లోనూ రేవంత్ ప్రస్తావించారు. ట్రాక్ ఏర్పాటు కోసం గోపన్పల్లిలో మొత్తం 580 ఎకరాల భూ సేకరణకు గతంలో రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ట్రాక్ ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి పోగా రైతులు తమ భూమి కోసం నేటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు..’ అని కేటీఆర్ వివరించారు.రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు ఫార్ములా–ఈ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని కేటీఆర్ అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమని చెప్పారు. ‘రేవంత్.. ఏం చేసుకుంటావో చేసుకో.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదానీతో అనుబంధంపై మీ సీఎంను ప్రశ్నిస్తారా?రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖఅదానీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉన్న అనుబంధంపై ప్రశ్నిస్తారా? లేక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడేందుకు మౌనంగా ఉంటారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీకి వ్యతిరేకంగా నిరసనల పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాహుల్గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.జాతీయ స్థాయిలో అదానీపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం రేవంత్ నాయకత్వంలో అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే, తెలంగాణలో అదానీ గ్రూప్నకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడం విడ్డూరంగా ఉందన్నారు. గౌతమ్ అదానీ సీఎం రేవంత్కు ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం పరస్పర ప్రయోజనాలకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు‘ఫార్ములా–ఈ రేసు ఆరోపణల్లో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వెంటనే కేసు కొట్టేస్తారనే నమ్మకం ఉంది. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్లాగా తయారైంది’ అని అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు: గడికోట
సాక్షి,తాడేపల్లి:ప్రపంచంలో ఏ నియంత చేయని దుర్మార్గాలను చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు.గురువారం(డిసెంబర్19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబు తనపై ఉన్న కేసులన్నిటిలో తనకుతానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం హాస్యాస్పదంగా ఉంది.జడ్జిల మీద నిఘా పెట్టటం ఎంతవరకు సమంజసం? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నలుగురు ఐపీఎస్లను కూడా సస్పెండ్ చేశారంటే ఇది నియంత పోకడ కాదా? ఈ తప్పులను ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.అరెస్టు చేయడానికి వచ్చే పోలీసులు కనీసం ఐడీ కార్డులు కూడా చూపడం లేదు.రాష్ట్ర అప్పుల విషయంలో చంద్రబాబు విష ప్రచారం చేశారు.పార్లమెంటు చెప్పిన మాటలను కూడా తప్పుదారి పట్టించారు.అప్పులేకాదు ప్రతి విషయంలోనూ దుష్ప్రచారం చేశారు.వైఎస్ జగన్ తన హయాంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు.చేసిన మంచిని కూడా వైఎస్ జగన్ చెప్పుకోలేకపోయారు.ఇప్పుడు ఈ విషయాన్ని జనం గుర్తించి సొంతంగా ప్లెక్సీలు పెడుతున్నారు.చంద్రబాబు చేసిందంతా విధ్వంస పాలన.రూ.50 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేస్తున్న చంద్రబాబు మిగతా ప్రాంతాల సంగతేంటో చెప్పాలి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు భాగం కాదా? వైఎస్ జగన్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తే చంద్రబాబు ఆ రికార్డులు చూపించాలి.చంద్రబాబు ష్యూరిటీ,వీరబాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది’అని శ్రీకాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. -
మరోసారి మీడియాతో అల్లు అర్జున్
-
అరెస్ట్ పై అల్లు అర్జున్ ప్రెస్ మీట్
-
అది ‘విద్యా మీట్’ కాదు..దగా మీట్: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హాయంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర్నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తుచేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం(డిసెంబర్7) మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.‘45 వేలకు పైగా స్కూళ్లను నాడునేడు కింద వైఎస్ జగన్ బాగు చేశారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీషు మీడియం,ట్యాబులు,మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటినీ దూరం చేశారు.ఇవన్నీ బాగుచేయడం వదిలేసి ఇప్పుడు విద్యా మీట్ పెడతారంట.అది విద్యా మీట్ కాదు.దగా మీట్. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలను నిలిపేసి ఏం చేయదలచుకున్నారు? రూ.3,900 కోట్ల బకాయిల గురించి మాట్లాడకుండా ఈ విద్యామీట్లు ఎందుకు పెడుతున్నారు?జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వపు కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనం అయింది.ఉన్నత విద్యామండలిలో కూడా దారుణాలు జరుగుతున్నాయి.ఇరవై మంది వైస్ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారు.ఇప్పటికీ కొత్తగా ఎవరినీ నియమించలేదు.దీన్నిబట్టే విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది.రూ.72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో వైఎస్ జగన్ పెద్దఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు.అంతకుమించి చేయాలనుకుంటే చంద్రబాబు కూడా అభివృద్ధి చేయాలి. అంతేకానీ విద్యా రంగాన్ని నాశనం చేయొద్దు’అని మేరుగ నాగార్జున అన్నారు.ఇదీ చదవండి: బాబూ ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం ఏమైంది..? -
రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశారు ?: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్నాథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు.యూనిట్కు 1రూపాయి20పైసలు పెంచారు.ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసంఅన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలిప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాంరూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వంఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాంఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాంప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదుపేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారురూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారుప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాంపథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారుమా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారుమీ సోకులకు వాడుకుంటున్నారా..?గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాంప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందిగతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేదిజీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..వ్యాపారాలు ఏమి జరగడం లేదువాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారుదానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటిప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయిబెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారుమా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారుఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నానుపవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించిందిపీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండిఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారుపక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?ఆయన చేతకాని వాడా..?పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండిరెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలిబియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారునిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి.. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించింది
-
కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లే: కారుమూరి
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలును గాలికి వదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధానకార్యాలయంలో శుక్రవారం(నవంబర్29) కారుమూరి మీడియాతో మాట్లాడారు.‘రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధాన్యం రైతుల అవస్థలపై ఎల్లోమీడియాలో కూడా వార్తలు వచ్చాయి. రైతులకు ప్రభుత్వం గోతాలు కూడా ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం.నేరుగా రైతుల ఖాతాలోనే నగదు వేశాం. మధ్యలో దళారుల ప్రమేయమే లేదు. ఇప్పుడు మళ్ళీ దళారులు,మిల్లర్లు సిండికేట్ అయి దోచుకుంటున్నారు.అసలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు.ఈక్రాప్,ఇన్సూరెన్స్ అనేవి లేనే లేవు.ఎక్కడ చూసినా రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా ధాన్యం కనపడుతోంది.మా హయాంలో జియోట్యాగ్ చేసి ధాన్యం లారీ ఎటు వెళ్తుందో గమనించేవాళ్లం.ఇప్పుడు ఆ జియోట్యాగ్ తీసేయటం వెనుక ఉద్దేశం ఏంటి?టీవీల్లో షోలు చేయటం తప్ప రైతులకు ఎలాంటి మేలు చేయడం లేదు.ప్రభుత్వం కనీసం ఒక్క మీటింగ్ కూడా రైతుల కోసం పెట్టలేదు.ఇదేనా రైతుల మీద ఉన్న ప్రేమ? జగన్ హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 అందేవి.ఇన్పుట్ సబ్సిడీ అందేది.ఇప్పుడు ఏ ఒక్క పథకమూ అందడం లేదు.రేషన్ బియ్యం ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.రేషన్ మాఫియా మళ్ళీ రెచ్చిపోతోంది.షిప్పులలో పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?చౌకడిపోల ద్వారా మా హయాంలో చాలా రకాల సరుకులు అందించాం.ఇప్పుడు బియ్యం,పంచదార తప్ప మరేమీ ఇవ్వడం లేదు.ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి’అని కారుమూరి డిమాండ్ చేశారు. -
సంక్షేమ పాలన అనగానే గుర్తొచ్చేది YSRCP ప్రభుత్వం
-
Watch Live: YS జగన్ సంచలన ప్రెస్ మీట్..
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
-
పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే తప్పులేదా ?
-
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం నాశనం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అసలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(నవంబర్20) నిర్వహించిన మీడియా సమావేశంలో పోలవరం జాప్యం వెనుక అసలు విషయాలను వైఎస్ జగన్ వివరించారు. ‘ఇది నేను చెబుతోంది కాదు. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు తప్పిదం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయన్నది స్పష్టంగా చెప్పింది. పోలవరం వద్ద గోదావరి నది దాదాపు 2.5 కిలోమీటర్ల వెడెల్పు ఉంటుంది. ఆ నీరు మళ్లిస్తేనే కద ప్రాజెక్టు కట్టగలిగేది. అందుకోసం ఏం చేయాలి? స్పిల్వే పనులు పూర్తి చేయాలి.కానీ అవి పూర్తి చేయలేదు. అవి పూర్తి కాకుండానే కాఫర్డ్యామ్ పనులు మొదలుపెట్టావు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటంటే.. దాని ద్వారా నీరు ఆపుతారు. ఆ తర్వాత మెయిన్ డ్యామ్ పనులు చేయాలి. నదికి అటు,ఇటు రెండు కాఫర్డ్యామ్ల పనులు మొదలుపెట్టాడు. అంటే ఒకవైపు స్పిల్వే పూర్తి చేయలేదు.మరోవైపు మెయిన్డ్యామ్కు ఫౌండేషన్ వేశారు. ఎందుకంటే అవన్నీ ఎర్త్వర్క్లు..కమీషన్లు వస్తాయి. సిమెంటు పనులైతే కమిషన్లు రావు. ఈలోగా సీజన్ వచ్చింది. కాఫర్డ్యామ్లు పూర్తి చేయలేదు. దాంతో నీరు పోవడానికి కాఫర్డ్యామ్పై రెండు గ్యాప్లు వదిలారు. అప్పుడేం జరిగింది. రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న నది, ఇక్కడికి రాగానే 400 మీటర్ల మేర తగ్గింది.ఆ ఉధృతికి ప్రాజెక్టు ఫౌండేషన్ అయిన డయాఫ్రమ్వాల్ పూర్తిగా దెబ్బతిన్నది. చంద్రబాబు హయాంలోనే 2018–19లోనే భారీ వరదలకు అన్నీ దెబ్బతిన్నాయి. అందుకే మేం రాగానే స్పిల్వే పూర్తి చేశాం. దాంతో నీరు క్లియర్గా వెళుతున్నాయి. కాఫర్డ్యామ్ మరమ్మతులు మేమే చేశాం. ఇక డయాఫ్రమ్వాల్ను ఏం చేయాలి? మళ్లీ కట్టాలా? వద్దా అనేది నిపుణులు తేల్చాలి.చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం పనులు నాశనమయ్యాయి. అయినా అదే పనిగా దుష్ప్రచారం. ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోంది’అని పోలవరంపై చంద్రబాబు మోసాలను వైఎస్జగన్ ఏకరువు పెట్టారు. -
కొడంగల్లో మణిపూర్ తరహా ఘోరాలు: కేటీఆర్
సాక్షి,న్యూఢిల్లీ: వికారాబాద్ జిల్లా లగచర్లలో అర్థరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో సోమవారం(నవంబర్18) లగచర్ల ఫార్మాసిటీ బాధితులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. మణిపూర్ తరహాలో కొడంగల్లో అత్యాచారాలు: కేటీఆర్సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్లో గిరిజనులను బెదిరిస్తున్నాడులగచర్లలో గిరిజనులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారుఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటే దాడులు చేస్తారా ?పీఎం మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదుమణిపూర్ తరహాలోనే కొడంగల్ లో అత్యాచారాలు జరుగుతున్నాయిరాజ్యాంగ రక్షకుడిగా చెప్పుకుంటున్న రాహుల్ ఈ అంశంపై నోరు విప్పాలిగిరిజనుల గోడు వినాలని సీఎం రేవంత్ ను రాహుల్ ఆదేశించాలిగిరిజనుల భూమి లాక్కుంటున్నా రాహుల్, మల్లికార్జున ఖర్గే నోరు మెదపడంలేదుఉపన్యాసాలతో కాకుండా చేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలిప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది:లగచర్ల ఫార్మా బాధితులురేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే, మమ్మల్ని రోడ్డు మీదకు తెచ్చారుతొమ్మిది నెలలు నుంచి ధర్నాలు చేస్తున్నాంకలెక్టరు కాళ్ళు మొక్కినం అయినా మా గోడు వినడం లేదుమా భూముల జోలికి రావొద్దుమా వాళ్ళని జైలు నుంచి విడిచిపెట్టాలిరాత్రి పూట పోలీసులు వచ్చి పిల్లల్ని పట్టుకుపోయారుమా ప్రాణం పోయినా ఫర్వాలేదు, భూమి ఇచ్చే ప్రసక్తి లేదుమా గ్రామాల్లోనే ఎందుకు ఫార్మ కంపెనీ పెడుతున్నారుభూమి పై ఆధారపడి బతుకుతున్నాంమమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టిస్తున్నారుఫార్మా కంపెనీలు వల్ల కాలుష్యం పెరిగి మా బతుకులు మసి చేస్తున్నారురైతులను రోడ్డుపైకి ఈడుస్తున్నారునాపై దాడి జరగలేదని కలెక్టరే అన్నారుమహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారుపోలీసులను శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి -
వైఎస్ జగన్ హయాంలోనే మాదిగలకు మేలు జరిగింది: ఆదిమూలపు సురేష్
సాక్షి,తాడేపల్లి:వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో మాదిగలకు చాలా మేలు జరిగిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం(నవంబర్ 18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావుతో కలిసి సురేష్ మీడియాతో మాట్లాడారు.‘మంద కృష్ణ మాదిగ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?అంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంద కృష్ణ కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. మాదిగలకు న్యాయం జరిగేదానికంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు,మంద కృష్ణ చూస్తున్నారు.మాల,మాదిగలను రెండు కళ్లుగా వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబులాగ రాజకీయాలకు వాడుకోలేదు.సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అమలు చేసేలా మంద కృష్ణ చూడాలి. అంతేగానీ వైఎస్ జగన్ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు.అన్ని ఉద్యోగాలలో దామాషా ప్రకారం మాదిగలకు దక్కేలా చూడాలి. కమిటీల పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించం.కొమ్మూరి కనకారావు కామెంట్స్...మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడువర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నారుముప్పై ఏళ్లుగా మంద కృష్ణ చేస్తున్నది అదేమాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారురెండు వర్గాల మధ్య మంటలు రాజేసి చలి కాసుకుంటున్నాడుపెద్ద మాదిగలాగ ఉంటానన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదుమరి చంద్రబాబుకు మళ్ళీ ఎందుకు మద్దతు చెప్తున్నావ్?ఇద్దరి మధ్య ఉన్న లాలూచీ ఏంటి?చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ప్రకారం జగన్ను దూషించడంంకరెక్టు కాదువైఎస్ జగన్ మాత్రమే మాదిగని ఎంపీ చేశారుఇద్దరు మాదిగలకు కీలకమైన మంత్రి పదవులు వైఎస్ జగన్ ఇచ్చారుచంద్రబాబు ముగ్గురికే నామినేట్ పదవులు ఇస్తే, వైఎస్ జగన్ ఏకంగా ఏడుగురికి పదవులు ఇచ్చారుచర్మకారులు, డప్పు కళాకారులకు వైఎస్ జగన్ పెన్షన్లు ఇచ్చారుచంద్రబాబు ఆ పెన్షన్లు చంద్రబాబు తొలగిస్తుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ లేదు -
బడ్జెట్లో పథకాలకు నిధులు సున్నా: బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
సాక్షి,తాడేపల్లి: పథకాలకు కేటాయింపులు లేకుండా కూటమి ప్రభుత్వం ఏపీ బడ్జెట్ను రూ.41వేల కోట్లు పెంచిందని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు.కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్పై సోమవారం(నవంబర్ 11)తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘అమరావతికి రూ.15వేల కోట్లు చూపించారు. అది గ్రాంటో అప్పో చెప్పలేదు. మైనస్లో ఉన్న మీరు ఆరు నెలల్లో రూ.24 వేల కోట్ల ఆదాయం ఎలా పెంచుతారు. అన్నదాత సుఖీభవ పథకం ఎంతమందికి ఇస్తారో చెప్పలేదు. దీనికి బడ్జెట్లో పెట్టింది. కేవలం రూ.1000కోట్లు. ఈ పథకం అమలు చేయాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఊసే లేదు. పథకాలకు నిధుల కేటాయింపు పూర్తిగా తగ్గించారు’అని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ప్రెస్మీట్లో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐదు నెలలపాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు బడ్జెట్ పెట్టలేదు?ఐదు నెలలపాటు బడ్జెట్ పెట్టకపోవడం గండికోట రహస్యంగా మారింది.గత ప్రభుత్వం" అనే మాటని 21 సార్లు ఉపయోగించారు.మేనిఫెస్టో అమలు చేస్తారని భావించిన వారికి నిరాశ కలిగేలా బడ్జెట్ ఉంది.గత ప్రభుత్వం కంటే రూ.41 వేల కోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ఎలాంటి పథకాలు అమలు చేయకుండానే ఇంత ఖర్చు ఎందుకో అర్థం కావడం లేదు.అమరావతి కోసం పెట్టే రూ.15 వేల కోట్ల ఖర్చు అప్పా? గ్రాంటా? ఆ లెక్కలకు క్లారిటీ ఇవ్వలేదు.మా హయాంలో ఆదాయం పెరిగితే చంద్రబాబు హయాంలో మైనస్ వచ్చింది.తల్లికివందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు.ఎవరికీ ఈ పథకాన్ని అమలు చేయకుండానే చేసినట్టు మాట్లాడారు.ఇంతకంటే అన్యాయం ఉంటుందా?రూ.10,706 వేల కోట్లకుపైగా అన్నదాత సుఖీభవకు ఇవ్వాల్సి ఉండగా వెయ్యి కోట్లు మాత్రమే ఇవ్వడమేంటి?మహిళలకు ఉచితబస్సు గురించి ప్రస్తావనే లేదు.కరెంటు సంస్థలకు అప్పులు చెల్లించకుండా ఎగ్గొడితే మా ప్రభుత్వం చెల్లించింది.కానీ మా ప్రభుత్వం వల్ల కరెంటు సంస్థలకు నష్టాలు వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు.గతంలో కూడా రూ. 87వేల కోట్లు రైతురుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.15 వేల కోట్లు చేశారు.డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీలు 21వేల కోట్లు చెల్లించకుండా మోసం చేశారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎగ్గొట్టారు.మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి గెలిచారు.2009,2014,2019,2024 లో వరుసగా అవే హామీలు ఇస్తూ జనాన్ని మోసం చేస్తూ వచ్చారు.అమరావతి ఏ రకంగా గొప్ప నగరమో తెలియదు.ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తీసుకుని కడతామంటున్నారు.మా హయాంలో ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తామో వివరంగా జనానికి తెలిపాం.ఎన్నికల సమయంలో ఆసరా డబ్బు ఇవ్వనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఎల్లోమీడియాలో తెగ వార్తలు రాశారు.మరి ఇప్పటి అప్పులు కనపడటం లేదా?రూ.14లక్షల కోట్ల అప్పులు చేసినట్టు గతంలో మాపైఆరోపణలు చేశారు.కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే రూ. 4 లక్షల కోట్లుగా అప్పు చేసినట్టు లెక్కలు చూపెట్టారు.మాపై తప్పుడు సమాచారం ప్రచురించిన మీడియా సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.2014-19 మధ్య చంద్రబాబు చేసిన అప్పులకంటే మా హయాంలో చాలా తక్కువగా అప్పులు చేశాం.ప్రజలంతా పరిస్థితులను గమనించాలి.మోసపూరిత మాటలు ఎవరు చెప్తున్నారో? ప్రజలకోసం ఎవరు చేస్తున్నారో చూడాలిఇదీ చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు -
పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు: కాకాణి
సాక్షి,నెల్లూరు:సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు.శనివారం(నవంబర్ 9) నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి కాకాణి మీడియాతో మాట్లాడారు.‘జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఎస్పీకి వివరించబోతున్నాం. కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్య్రం కూడా కూడా లేకుండా పోయింది.నాపైనే పోలీసులు అక్రమంగా నాలుగు కేసులు నమోదు చేశారు.వైఎస్సార్సీపీ నేతలు నోరు తెరిచినా కూడా కేసులు పెడుతున్నారు.పోలీసులు మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.థర్డ్ డిగ్రీ ప్రయోగించి చివరికి కుటుంబ సభ్యులను కూడా దుషిస్తున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతుంటే మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. జగన్ కుటుంబ సభ్యుల మీద కూడా నీచాతి నీచంగా పోస్టులు పెడుతుంటే అవి పోలీసులకు కనపడవా..? పోలీసులు ఖాకీ చొక్కాలు వదిలేసి..పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలు ఆవేదనతో ఉన్నారు..వారిని రెచ్చగొట్టొద్దు.శాంతిభద్రతలు అదుపుతప్పితే పోలీసులదే బాధ్యత.వైఎస్జగన్పై పోస్టింగ్లు పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి. మేం అధికారంలోకి వస్తే ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదు.ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం’అని కాకాణి హెచ్చరించారు.కాకాణికి రెండు కేసుల్లో నోటీసులు..కాకాని గోవర్ధన్రెడ్డికి వెంకటాచలం పోలీసులు రెండు కేసుల్లో నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నేత చేసిన ఆరోపణల వీడియోను ఫార్వర్డ్ చేసిన కేసులో ఒక నోటీసు, చంద్రబాబు 100 రోజుల పాలనపై విమర్శించినందుకు మరో నోటీసు అందజేశారు.ఈ కేసుల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక మహిళను ఉగ్రవాదిలా హింసించారు: అంబటి -
ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్ఆర్సీపీ
-
హోం మంత్రి కాదు మైకుల మంత్రి: సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం: వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం(అక్టోబర్ 28)శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి సీదిరి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పలాసలో మైనర్ బాలికలపై టీడీపీ నేతలు అత్యాచారం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు వెనకేసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీస్స్టేషన్లోనే దాడి చేశారు. టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు. లాఅండ్ఆర్డర్ కంట్రోల్లో పెట్టడంలో హోం మంత్రి విఫలమయ్యారు. హోం మంత్రి అనిత మైక్ల మంత్రిగా మారారు.చంద్రబాబు అసమర్థత వల్ల పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కాశీబుగ్గలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్స్టేషన్కు పసుపు రంగు వేస్తాం’అని సీదిరి హెచ్చరించారు.ఇదీ చదవండి: విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు -
విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు శివప్రసాద్రెడ్డి
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. సోమవారం(అక్టోబర్ 28) ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారు. ఎన్నికల ముందు ఒక మాట,ఇప్పుడు ఇంకో మాట సరైన పద్ధతి కాదు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి..లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుంది.విద్యుత్ చార్జీలు పెరిగితే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబుకు ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారు. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు పేరు చెప్పి,విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచి చేనేత,అమ్మ ఒడి,ఇతర సంక్షేమాలు రద్దు చేసి బాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారమైనా సరే రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచకూడదు అని డిమాండ్ చేస్తున్నా. 2014 నుంచి 2019 వరకు బాబు పాలనలో దాదాపు 57 వేల కోట్లు విద్యుత్ కోసం అప్పు చేశారు. కోవిడ్ కాలంలో కూడా వైఎస్ జగన్ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితి లేని ఈ సమయంలో బాబు ఎందుకు విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు?వైఎస్ జగన్ హయాంలో దళితులకు ఉచిత విద్యుత్ అందించి దాదాపు రూ. 650 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ చెల్లించారు. మద్యం బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పి మద్యం ఏరులై పారేలా చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు ఇలాగే పాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు అప్పుల్లో కూరుకుపోతారు. ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించేలా పోరాడతాం. కరెంట్ ఆఫీసులను చుట్టుముడతాం,ఉద్యమం తీవ్రతరం చేస్తాం,దీక్షలకు పూనుకుంటాం’అని రాచమల్లు హెచ్చరించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఇది మీరిచ్చిన వాగ్దానామే: వైఎస్ జగన్ -
‘స్కిల్’ దొంగలు మరోసారి దొరికిపోయారు: కన్నబాబు
సాక్షి,కాకినాడజిల్లా: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొంగలు మరోసారి దొరికిపోయారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు అన్నారు. ఈ వ్యవహారంలో అవినీతి ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైకోర్టుకు స్పష్టంగా తెలిపిందని చెప్పారు. కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో కన్నబాబు ఆదివారం(అక్టోబర్ 27) మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా ఆయనను కాపాడే వ్యవస్ధ ఉంటుంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు సమ్మతితో డొల్ల కంపెనీలు సృష్టించి వందల కోట్లు కొల్లగొట్టారని అందరికీ తెలుసు. ఈ కేసు కోల్డ్ స్టోరేజీలో పెట్టేసిన సందర్భంలో ఈడీ ముందుకు వచ్చింది. ఈ స్కామ్లో అవినీతి నిజం అని ఈడీ హైకోర్టుకు స్పష్టంగా తెలిపింది. ఈడీ కోర్టులో ఫైల్ చేసిన కౌంటర్ చంద్రబాబుకు ఆయన మద్దత్తుదారులకు చెంపపెట్టు లాంటిది. ఈడీ కౌంటర్ పై చంద్రబాబు ఏం చెబుతారు అని ప్రశ్నిస్తున్నాం. అన్స్టాపబుల్ పేరుతో చంద్రబాబు,బాలకృష్ణ పెద్ద షో చేశారు. ఈడీ ఎవరి ప్రభుత్వంలో పని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? బీజేపీ,జనసేన నాయకులు ఈడీ కౌంటర్పై ఏం చెబుతారు. చంద్రబాబు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు. స్కిల్ స్కామ్లో ఎన్ని సూట్కేసు కంపెనీలు రిజిస్టర్ చేశారో ఈడీ చెప్పింది. బోగస్ కంపెనీలు, షెల్ కంపెనీలతో డబ్బులు కాజేశారని ఈడీ వివరించింది.చంద్రబాబు కోసం జరిగిన స్కామ్ ఇది. స్కిల్ స్కామ్ సొమ్ములు ఎక్కడికి వెళ్ళాయి? హైకోర్టులో ఈడీ కౌంటర్ వేయడం ఒక కీలమైన అంశం. స్కిల్ స్కామ్ లో రూ.330 కోట్లు అవినితి జరిగిందని కాగ్ తేల్చింది’అని కన్నబాబు గుర్తుచేశారు. ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా.. -
షర్మిల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: గుడివాడ అమర్నాథ్
సాక్షి,విశాఖపట్నం: షర్మిల చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో శనివారం(అక్టోబర్ 26) అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై ఫైరయ్యారు. ‘మీరు చేసిన ఆరోపణలు ఖండించిన వాళ్లంతా మోచేతి నీళ్లు తాగినట్లు కనిపిస్తే అది మీ అమాయకత్వం. వైఎస్సార్సీపీ నాయకులకు అలాంటి లక్షణాలు లేవు. మేం నిజాలను ప్రజల ముందు పెడుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పండి. సొంత అన్నను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ చూస్తు ఊరుకోరు. వైవీ సుబ్బారెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దుకు కుట్రలు చేస్తున్నారు.ఎవరి పతనాన్ని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు ఈ స్థాయికి దిగజారారు. కాంగ్రెస్ పెట్టిన కేసులను తట్టుకుని నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన దమ్ము, ధైర్యం, హీరోయిజాన్ని ఇష్టపడే చాలా మంది ఆయనతో నడుస్తున్నారు’అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరదు కళ్యాణి -
షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్బాబు
సాక్షి,తాడేపల్లి: షర్మిలకు మానవత్వం ఉందా అని, వైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలుపుతారా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబు ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్ 26) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు.‘రేవంత్రెడ్డి,చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారు.షర్మిల పాదయాత్రను వైఎస్సార్, వైఎస్జగన్ అభిమానులు కలిసి సక్సెస్ చేశారు. షర్మిల కోసం వైవీసుబ్బారెడ్డి ఎన్నోత్యాగాలు చేశారు’అని సుధాకర్బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు: పెద్దిరెడ్డి -
టీడీపీ కుట్రలో షర్మిల పావు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,తాడేపల్లి: టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.‘జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్,టీడీపీ కలిసి వైఎస్జగన్పై కేసు పెట్టాయి. హైకోర్టు స్టేటస్కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదలాయించారు. షేర్లను బదలాయించినందువల్లే జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారుఆస్తుల్లో వాటా ఉంటే షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు. చెల్లిపై ప్రేమ ఉన్నందునే వైఎస్జగన్ షర్మిలకు ఎంవోయూ చేసుకున్నారు. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నారా’అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైవీసుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. సరస్వతి సిమెంట్స్ ప్రాపర్టీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి.అయినాసరే షేర్లు బదలాయించుకోవటం వెనుక కుట్ర ఉంది.2019 ఆగస్టులో వైఎస్జగన్, షర్మిల ఎంవోయూ రాసుకున్నారుప్రాపర్టీ చూసుకున్నాకనే షర్మిల సంతకాలు పెట్టారుజగన్ ప్రేమ అభిమానంతోనే షర్మిలకు ఆస్తులు రాసిచ్చారు.కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.ఇప్పుడు షర్మిల చేస్తున్న రాద్దాంతమంతా ఆస్తుల కోసమే అని అర్థం అవుతోంది.షర్మిలకు లీగల్ గా ఆస్తుల మీద హక్కు ఉంటే ఆమె కూడా కేసులు ఎదుర్కొనేవారు.జగన్ ఒక్కరే జైలుకు ఎందుకు వెళ్తారు?జగన్ కు వచ్చిన డివిడెండ్ నుంచి షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చారు.జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ జగన్ పెట్టుకున్న పరిశ్రమలు.వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఈ కంపెనీలు పెట్టుకున్నారు.అందులో షర్మిలకు వాటాలు ఉంటే అప్పుడే రాసిచ్చేవారు.షర్మిల అబద్దాలాడుతున్నారువైఎస్ జగన్ ఇంట్లో చిచ్చుపెట్టి చంద్రబాబు చలిమంట కాచుకుంటున్నారు: పేర్నినానివైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారుతండ్రి ఆశయం కోసమైతే చంద్రబాబు కోసం పనిచేస్తారావైఎస్సార్ను అభిమానించేవారు ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు.గత మూడు నాలుగు రోజులుగా వైఎస్జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు.షర్మిల తాపత్రయం అంతా ఆస్తుల కోసమే..తండ్రి ఆశయాల కోసం కానేకాదువ్యక్తిగతంగా రాసుకున్న ఉత్తరం టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఎలా వచ్చింది? చంద్రబాబు అక్రమ రాజకీయాలకు ఇది నిదర్శనంకేంద్రంలో బీజేపీతో ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్తో అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నారుకాంగ్రెస్కు తాము వ్యతిరేకమని చెప్పి చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నారు?రాజకీయ వింత బంధాలను ఏపీలోనే చూస్తున్నాంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడంవెనుక జగన్ కష్టం,కార్యకర్తలే కారణంషర్మిలతో మాలాంటోళ్లు చాలామంది పని చేశాంమాలాంటి 30,40 మంది పదవులు వదులుకుని వచ్చారుటీడీపీ నుండి చాలామంది వైఎస్సార్సీపీలోకి వచ్చారుకానీ ప్రధానమైన కష్టం,నష్టం అంతా జగన్,కార్యకర్తలదేషర్మిలతో పాదయాత్ర వద్దని నేనే స్వయంగా జగన్తో చెప్పానుభవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా జగన్కి చెప్పానుకానీ నా కుటుంబంలో అలాంటివేమీ రావని జగన్ చెప్పారుకంపెనీల్లో షర్మిలకు వాటాలు ఉంటే ఆమెని కూడా డైరెక్టర్గా వైఎస్సార్ పెట్టేవారుఅలా జరగ లేదంటే షర్మిలకు సంబంధం లేదనే అర్థం కదాచంద్రబాబు అనవసరంగా జగన్ కుటుంబ సభ్యుల గొడవల్లో జోక్యం చేసుకుంటున్నారుజూనియర్ ఎన్టీఆర్ను ఎన్నికలకు వాడుకుని ఎందుకు వదిలేశారు?చంద్రబాబు నైజంపై ఆయన తోడళ్లుడే పుస్తకం వేశారుఅసలు చంద్రబాబు తన తోడబుట్టినవారికి ఏం ఆస్తులు రాసిచ్చారు?చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారింది ఇదీ చదవండి: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు షర్మిలా..? -
డయేరియా బాధితులకు వైఎస్ జగన్ భరోసా
-
బాధితులకు నేను 10 లక్షలు ఇస్తున్న.. నువ్వేం ఇస్తావ్ బాబు
-
రేవంత్,బండి సంజయ్ రహస్య మిత్రులు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్,బండి సంజయ్లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.‘రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్ఎస్కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.గ్రూప్ వన్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..‘గ్రూప్ వన్పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్ ఇంటివద్ద భారీగా పోలీసులు -
ప్రజల మనసుల్లో విషం నింపేందుకు బాబు కుట్ర: మార్గాని భరత్
సాక్షి,తాడేపల్లి:తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను వైఎస్జగన్ బట్టబయలు చేశారని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు.శనివారం(సెప్టెంబర్28) తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు.‘వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు.ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు చేశారు.జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసింది.జులై నెలలో వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారు.ఎన్డీడీబీకి పంపించిన శాంపుల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది.నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారు.జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారు.చంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారు.చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.నాలుగు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారు.2014-19 మధ్య 14సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు.2019-24 మధ్య 18సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు.చంద్రబాబుకు హిందుత్వం పట్ల హిందువుల పట్ల అసలు గౌరవం ఉందా.బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు.అదేనా హిందుత్వమంటే.వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారు.చంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలి.సీఎం హోదాలో వైఎస్జగన్ ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారు.పాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనంచేసుకున్నారు.డిక్లరేషన్పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు.నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా..తెలియక మాట్లాడుతున్నారా.ఎన్డీబీబీ నుంచి వచ్చిన నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారు.ఎన్డీబీబీనుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు.వైఎస్జగన్మోహన్రెడ్డి పర్యటనకు పర్మిషన్ లేదని మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే సిట్ అధికారులు అమలు చేస్తారు.ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారు.ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్ కు తెలుసా.చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా.బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలి’అని భరత్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: నెయ్యి కల్తీపై థర్డ్పార్టీ విచారణ చేయించండి: బొత్స -
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అట్టర్ ప్లాప్
-
బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ అరెస్ట్ లు
-
కోతల రుణమాఫీతో కుటుంబాల్లో చిచ్చు: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: అన్నదాత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది పచ్చి మోసమని, తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆదివారం(సెప్టెంబర్8) తెలంగాణభవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.‘మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి మరీ సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్రెడ్డికి ఏపీజీవీబీలో అప్పు ఉంది. సురేందర్ రెడ్డి తల్లికి లక్షా 15 వేలు ,సురేందర్ రెడ్డికి లక్షా 92 వేలు అప్పు ఉంది. బ్యాంకు మేనేజర్ను అడిగితే కుటుంబ సభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని చెప్పడంతో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్రెడ్డి ఆత్మహత్య లేఖలోని ప్రతి అక్షరం రేవంత్రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టింది. రేవంత్రెడ్డిది పూటకో మాట. ఆయన వైఖరి పొద్దు తిరుగుడు కంటే వేగంగా మారుతోంది. రుణమాఫీకి రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పావ్. సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో రుణమాఫీకి రేషన్ కార్డుకు లింక్ ఉన్నదని నిరూపితం అయ్యింది. రేవంత్ పాలనకు సురేందర్రెడ్డి లేఖ ఓ పంచనామా లాంటిది.రైతు రుణమాఫీ ఆంక్షలతో రేవంత్ కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టారు. కేసీఆర్ కుటుంబ బంధాలు బలోపేతం చేస్తే వాటిని విచ్ఛిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. సిద్దిపేటలో నియోజకవర్గంలో జక్కాపూర్ గ్రామంలో గురజాల బాల్రెడ్డి కుటుంబంలో ముగ్గురికి రుణం ఉంది. వారికి ఆరు లక్షల అప్పు ఉంటె కేవలం రెండు లక్షలే మాఫీ అవుతోంది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం ,దగా కాదా ?రైతు రుణ మాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోంది. నారాయణ్పేట గ్రామంలో నల్ల మణెమ్మ అనే రైతుకు లక్ష రూపాయల అప్పు ఉంది. ఆమె భర్త 2010 లో మరణించారు. ఆయన ఆధార్ కార్డు తెస్తేనే రుణ మాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 2010లో ఆధార్ కార్డు ఇవ్వనప్పుడు ఆధార్ కార్డు ఎలా తెస్తారు ? కుంభాల సిద్ధారెడ్డి ,చాట్ల హరీష్ అనే రైతులకు భార్యల ఆధార్ కార్డులు తెమ్మంటున్నారు. వారికి పెళ్లిళ్లే కాలేదు. భార్యల ఆధార్ కార్డులు ఎక్కడ్నుంచి తెస్తారు ? ఇలాంటి వాళ్ళు ఎంత మందో ఉన్నారు. రుణ మాఫీ కోసం వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవాలా ? 20 లక్షల మందికే ఇప్పటిదాకా రుణ మాఫి అయ్యింది. 21 లక్షల రైతుల మందికి ఇంకా కావాలి. రుణ మాఫీ అయ్యింది నన్ను బావిలో దూకమని రేవంత్ అంటున్నారు. ఇప్పుడు ఎవరు బావిలో దూకాలి. కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్. ఇది కటింగ్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే కోతలు అన్నట్టుగా తయారైంది ..ఎన్నికలపుడు కట్టు కథలు చెప్పారు. చేతి గుర్తుకు ఓటేస్తే కోతలే మిగిలాయి. సురేందర్రెడ్డిని చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఆత్మహత్య కాదు. ప్రభుత్వం చేసిన ఆత్మహత్య. 2 లక్షల రుణం పైన ఉన్న వారు మిగతా డబ్బు బ్యాంకులకు కట్టాలి అంటున్నారు. ఎందుకు కట్టాలి. మోకాలికి బోడి గుండుకు ఎందుకు లింక్ పెడుతున్నారు ?కేసీఆర్ హయాంలో ఇలాంటి నిబంధనలు ఏవైనా ఉన్నాయా ?వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పదవులు ఏర్పాటు చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేయని వారికి ఇన్ని పదవులు ఎందుకు? రైతుల ఆత్మహత్యలు పెంచడానికా ఈ పదవులు ? ఇప్పటిదాకా 470మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు భరోసా అనేది బ్రహ్మ పదార్థం అయ్యింది. పెట్టుబడి సాయం అర్థం తెలుసా ? కేసీఆర్ పదకొండు విడతలుగా రైతు బంధు ఇచ్చారు. యాసంగి పంట వేసే టైం వస్తోంది.. వానా కాలం రైతు బంధు ఇవ్వరా ? వడ్లకు బోనస్ బోగస్గా మారింది. సన్న వడ్లకే బోనస్ అని సన్నాసులే అంటారు. ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తానని చెప్పి చేయనందుకు రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి మాట్లాడాను .ఇది వాస్తవం కాదా ? రేవంత్ పాలనలో మత కలహాలు పెరిగి పోయింది నిజం కాదా? తొమ్మిది నెలల రేవంత్ పాలన లో 247 ఇల్లీగల్ వెపన్ కేసులు నమోదవలేదా’అని హరీశ్రావు ప్రశ్నించారు. -
గుడ్లవల్లేరు ఘటన గురించి పట్టించుకోరా: భరత్
-
అచ్యుతాపురం ఘటనపై YS జగన్ ప్రెస్ మీట్
-
ఏపీలో శాడిస్టు పాలన: వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్రెడ్డి
సాక్షి,తాడేపల్లి: ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోందని, చంద్రబాబు తన మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే గడికోటశ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం(ఆగస్టు21) శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు మేలు చేశాం. కరోనా సమయంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు అన్నీ చేశాం. చంద్రబాబు ఉద్యోగులతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా లేరు. బాబు హయాంలో ఉద్యోగులకు ఎప్పుడూ మంచి జరగలేదుఇష్టంలేని వారిని వేధిస్తూ నవ్వుకునే తీరులో చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోంది. నెల్లూరులో ఐఅండ్పీఆర్ అధికారిని చంద్రబాబు దారుణంగా దూషించారు. చంద్రబాబు ఉద్యోగవర్గాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారు. ఉద్యోగులను తిడుతూ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైఎస్జగన్ హయాంలో ఉద్యోగులకు చేయగలిగినంత చేశాం. కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో మేళ్లు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారుఉద్యోగు, అధికారులు అందరినీ వేధిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను కూడా వదలకుండా వేధిస్తున్నారు. ప్రద్యుమ్న, సాయిప్రసాద్, ఠాగూర్ లాంటి వారంతా చంద్రబాబుకు అనుకూలమైనప్పటికీ వైఎస్జగన్ వారికి కీలకమైన పోస్టులు ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు కొందరు అధికారులపై ఎందుకు కక్షసాధింపులకు దిగుతున్నారు?డీఎస్పీ పోస్టుల్లో ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇసుకరెడ్డి, మైనింగ్ రెడ్డి అంటూ మాట్లాడటం కరెక్టేనా? ఎక్కడ ఏ కాగితం తగులపడినా ఉద్యోగులను టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం సబబు కాదు. చంద్రబాబు తప్పులు బయట పడతాయని టీడీపీ వారే తగులపెడుతున్నారనే అనుమానం కలుగుతోంది. అధికారులను వేధించటం, వారిని కించపరిచటం మానుకోవాలి. ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన రెడ్డి కడప జిల్లా వ్యక్తి కావటమే ఆయన చేసిన తప్పా? ఆయనపై కూడా ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నారు?అభివృద్ధి, సంక్షేమం అనేది చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఉండదు. వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ముందుకు తీసుకెళ్లారు. శ్రీ సిటీని వైఎస్ఆర్ తెచ్చినా, తానే తెచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ హయాంలో ప్రారంభించిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు’ అని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. -
విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసుతో పాటు దస్పల్లా భూములు గురించి విచారించాలి
-
విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసుతో పాటు దస్పల్లా భూములు గురించి విచారించాలి
-
బడ్జెట్లో ఏపీకి నిధులు.. కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు
సాక్షి,మెదక్: దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. శనివారం(జులై 27) మెదక్లో పర్యటించిన అథవాలే మీడియాతో మాట్లాడారు.‘ఎన్డీఏ ప్రభుత్వానికి దేశమంతా సమానమే. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా బడ్జెట్లో నిధులు ఇచ్చాం. ఏపీకి రాజధాని లేకపోవడం వల్లే ఎక్కువ నిధులు కేటాయించాం. సౌత్ ఇండియాలో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించింది. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం అని అథవాలే తెలిపారు. -
Watch Live: చంద్రబాబు ఆటవిక పాలనపై వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్
-
కాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు
-
రియాల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును చేధించిన పోలీసులు
-
రోజుకో శ్వేత పత్రం
-
ఎమ్మెల్యేలను ఎంతకు కొంటున్నారు: కేటీఆర్ ఫైర్
సాక్షి,ఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్రావు, ఎంపీ సురేష్రెడ్డితో కలిసి మంగళవారం(జులై 9) ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ‘ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే. సీఎం రేవంత్ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు. రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒక పక్క కాంగ్రెస్ గొప్పలు చెపుతోంది. ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు అది పోచారం దాకా వచ్చింది. ఆటోమేటిక్గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోంది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామని హామీని కాంగ్రెస్ అమలు చేయలేదు. రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు కూడా గాలికి వదిలేశారు. ఆరు గ్యారెంటీలు వదిలేసి, మా పార్టీకి చెందిన ఆరుగురు ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలను కాంగ్రెస్ చేర్చుకుంది. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం. లోక్సభ స్పీకర్ను కలుస్తాం. సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారు. ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బీఆర్ఎస్ ఎంఎల్ఏను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు’అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ఓటమిపై కేటీఆర్ కీలక కామెంట్స్పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా ఏపీలో వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందిఅయినా వైఎస్ఆర్సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదుపవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవివైఎస్జగన్ను ఓడించేందుకు షర్మిల ను పావులా ఉపయోగించారుఅంతకు మించి షర్మిల ఏమీ లేదుప్రతి రోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందిమా వైఖరి మార్చుకోవాలిప్రజలది తప్పు అనడమంటే.. మాదే తప్పుహైదారాబాద్లో అన్ని సీట్లు గెలిచాంఅభివృద్ధిని మేము చెప్పుకోలేదుతెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదుమాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారుఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదుహరీశ్రావు చిట్చాట్..ఫిరాయింపుల వల్ల మాకు లాభం జరగలేదుమా పార్టీలో చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన వారిపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలితెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేప్రజలు ప్రస్తు ప్రభుత్వానికి గత మా ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారురేవంత్ రెడ్డికి పాలన పై పట్టు రాలేదు..పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారు.అధికారులు మా చేతుల్లో లేదు అన్నారంటే అది వారి చేతగానితనం అన్నట్టేగ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదు..ప్రజలు డెంగ్యూ ,మలేరియాా బారిన పడుతున్నారు. -
రైతు బంధుపై కమిటీ అంటే మోసమే: జగదీష్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం(జూన్23)తెలంగాణ భవన్లో మరో నేత రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.‘రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటి? రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతులకు ఇవ్వాలి. కమిటీ అంటే రైతులను మోసం చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. పింఛన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. విద్యుత్ బిల్లుల మాఫీ స్కీమ్ రాష్ట్రంలో అమలు కావడం లేదు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండి. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు వచ్చేది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. పురుషులు,మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయి. విద్యుత్ కమిషన్ నుంచి నాకు లెటర్ వచ్చింది. వారం రోజుల్లో కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారు. పవర్ కమిషన్ ముందుకు వెళ్లి నాకు ఉన్న సమాచారాన్ని ఇస్తాను. కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతాను. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్,విద్యుత్ అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలి. లేదంటే కమిషన్ చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నుంచి తప్పుకోవాలి’అని జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. -
కేసీఆర్ లెటర్ పై జగదీష్ రెడ్డి రియాక్షన్
-
విభజన హామీలను వెంటనే అమలు చేయాలి
-
రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పనిచేస్తారని ఆశిస్తున్నా: ఉండవల్లి
-
రిపేర్ల తర్వాతే మేడిగడ్డలో నీటి నిల్వ: మంత్రి ఉత్తమ్
సాక్షి, పెద్దపల్లి: సుందిళ్ల, అన్నారం, మేడిగ బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారం(జూన్7) మేడిగడ్డ బ్యారేజీని ఉత్తమ్కుమార్రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి పరిశీలించారు. అనంతరం అక్కడి ఎల్అండ్టీ గెస్ట్హౌజ్లో మీడియాతో మాట్లాడారు. ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నిర్మాణం మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు రిపేర్ చేస్తున్నాం. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీలు లేదని ఎన్డీఎస్ఏ సూచించింది. వర్షాకాలం వచ్చినందున మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం. తుమ్మిడి హట్టి దగ్గర కొత్త బ్యారేజి నిర్మిస్తాంబీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కుంగింది. రూ.94 వేల కోట్లప్రాజెక్టు కుంగిపోయింది. దాని కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం. ఎన్నికల కోడ్ వల్ల మరమ్మతుల రివ్యూకు రాలేకపోయాం. అందుకే ఇప్పుడు వచ్చి పరిశీలించా’ అని ఉత్తమ్ తెలిపారు. -
Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్
-
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
సీఎం జగన్పై దాడి కేసులో విచారణ వేగవంతం: సీపీ
ఎన్టీఆర్,సాక్షి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్(సీపీ) కాంతిరాణా చెప్పారు. కమిషనర్ ఆఫీసులో సోమవారం(ఏప్రిల్15) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు. ‘ఎన్టీఆర్ జిల్లాలో 22 కిలోమీటర్ల మేర సీఎం బస్సుయాత్ర కొనసాగింది. యాత్ర సందర్భంగా మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారు. బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట్ల ప్రొటోకాల్ ప్రకారం కరెంట్ నిలిపివేశాం. సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట ముందుగానే కరెంట్ నిలిపివేస్తారు. బస్సుయాత్ర డాబా కొట్ల సెంటర్ దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి సీఎంపైకి బలంగా రాయి విసిరాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించాం. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశాం. దాడి జరిగినపుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించాం. 50మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం’ అని సీపీ తెలిపారు. ఇదీ చదవండి.. సీఎం జగన్పై దాడి.. నిందితులను పట్టుకుంటే బహుమతి -
ఇది ఆకతాయిలు చేసిన పనికాదు..పక్కా ప్లాన్ తో చేసారు
-
వంద రోజుల్లో తెలంగాణ అస్తవ్యస్తమైంది: కేసీఆర్
సాక్షి,సూర్యాపేట: కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ అస్తవ్యస్తంగా తయారైందని, ఈ వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన పొలం బాటలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిపెట్టి నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారన్నారు. తమకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు. మూడు నెలల్లోనే ఈ పరిస్థితంటే రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే భయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ‘చీఫ్ మినిస్టర్ వేర్ ఆర్ యూ స్లీపింగ్’ అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న చేస్తానన్న రైతు రుణమాఫీ ఏమైందో చెప్పాలన్నారు. డిసెంబర్ 9 వెళ్లి ఎన్నిరోజులైందని నిలదీశారు. ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ‘రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అసమర్థత, తెలివితక్కువతనమే ఈ పరిస్థితికి కారణం. రైతులు నష్టపోతే ప్రస్తుత ప్రభుత్వంలో పట్టించుకునేవాడు దిక్కులేడు. ఎండిపోయిన పంటలపై నివేదిక తెప్పించుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఇచ్చే వరకు బీఆర్ఎస్ ఊరుకోదు. వెంట పడతాం. మెడలు వంచుతాం. ఒకరిద్దరని గుంజుకుని చిల్లర రాజకీయాలు చేయడం కాదు. ఎండిన పంటలకుగాను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మూడు నెలలు ఓపిక పట్టి నాలుగో నెలలో మాట్లాడుతున్నాం. వాగ్దానాలు నెరవేర్చేదాకా వదిలిపెట్టేది లేదు. రైతులకు రూ.500 బోనస్, రుణమాఫీ ఇతర హామీలపై దీక్షలు, ధర్నాలు చేస్తాం. నీళ్లిస్తామంటే నమ్మి పంటలు వేశామని రైతులు పొలంబాటలో నాతో చెప్పారు.రైతు బాగుండాలన్న ఉద్దేశంతో మా హయాంలో నీరు,24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పెట్టుబడి సాయం చేశాం. కొనుగోలు కేంద్రాలు, రైతు బీమా అమలు చేశాం. 2014లో 30-40 లక్షల టన్నుల ధాన్యం కూడా పండకపోయేది. కానీ ఆ తర్వాత మూడు కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించాం. త తక్కువ కాలంలో రైతులు బాధపడతారు అనుకోలేదు.జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించాం. కన్నీరు మున్నీరుగా రైతులు విలపించారు.నీళ్ళు ఇస్తామని ముందు చెప్పారు, కానీ ఇప్పుడు ఓట్లు వేయించుకొని నీళ్ళు ఇవ్వలేదు.ముందే తెలిస్తే ఓట్లు వెయ్యకపోయే వాళ్లమంటున్నారు. రైతులకు కావాల్సింది నీళ్ళు,పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్, పంట కొనుగోలు చేయటం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిన తెలంగాణలో మళ్లీ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రాజకీయనాయకులు రాష్ట్రం మేలు కాంక్షించాలి. రాజకీయాలన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. స్వల్ప కాలంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. హైదరాబాద్లో నీటి కటకట ప్రారంభం అయ్యింది. నీటి ట్యాంకర్లు కొనుక్కునే దుస్థితి హైదరాబాద్ ప్రజలకు వచ్చింది. మా హయాంలో తెలంగాణలో బిందె పట్టుకున్న ఆడబిడ్డ కనిపించలేదు. ఇప్పుడు నీళ్ల ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి. మళ్లీ స్టెబిలైజర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. న్యూయార్క్, లండన్ లో కరెంట్ పోతుంది కానీ తెలంగాణ లో పోదు అనే స్థాయికి తెచ్చా’ అని కేసీఆర్ చెప్పారు. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయింది. దీనికి స్పందించిన కేసీఆర్ కరెంటు ఇట్లా వస్తూ పోతుందన్నారు. ఇదీ చదవండి.. జనగామలో పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్ -
చంద్రబాబు, మహాసేన రాజేష్కు ధన్యవాదాలతో.. ఇట్లు నర్రెడ్డి సునీత
సాక్షి, అమరావతి: ‘నాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచిన చంద్రబాబు, పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రాజేష్ మహాసేనలకు కృతజ్ఞతలు’.. అంటూ మూడేళ్లుగా తన వెనుక ఉండి, తనను ఎవరు ఆడిస్తున్నారో, తన నోటి నుంచి వస్తున్న మాటల వెనుక స్క్రిప్ట్ ఎవరిదో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత విస్పష్టంగా వెల్లడించారు. ఇన్నాళ్లూ తాను కప్పుకున్న ముసుగును తొలగించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకు చంద్రబాబు ఆమెను తెరమీదకు తెచ్చారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుతో ప్రారంభించి, చివరకు ఏపీ ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటేయొద్దని కోరుతూ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై మరోసారి అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అందుకోసం 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల ఉదంతాన్ని వక్రీకరించారు. ఆమె తండ్రిని కుట్రతో ఓడించిన చంద్రబాబు ముఠాను వెనకేసుకొచ్చారు. ఆ ముఠా సభ్యులు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సునీత, ఆమె భర్త సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని దాటవేశారు. ఆమె తండ్రి రెండో వివాహంతో కుటుంబంలో తలెత్తిన విభేదాలను మరుగున పరచడానికి చూశారు. వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరితో మాటామంతీ కొనసాగిస్తున్న విషయం బయటి ప్రపంచం గుర్తించడంలేదనే భ్రమలో ఉన్నారు. వెరసి తాను చంద్రబాబు గూటిలో చిలకనని స్పష్టం చేశారు. చంద్రబాబు నేర్పిన నాలుగు పలుకులనే పలికారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా ఆడారు. వివేకాను కుట్రతో ఓడించినందుకా చంద్రబాబు, ఆయన ముఠాకు కృతజ్ఞతలు? సునీత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ సభ్యులు బీటెక్ రవి, మహాసేన రాజేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడమే విడ్డూరం. వృత్తి రీత్యా డాక్టరైన సునీత ఉద్దేశపూర్వకంగా మతిమరుపు నటిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డిని 2017లో కుట్రతో రాజకీయంగా అంతమొందించింది చంద్రబాబే. తర్వాత 2019లో ఆయన్ని భౌతికంగా అంతం చేసిందీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్రెడ్డి ఓడించారని ఆమె అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరం. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే కావడంతో ఆయన సునాయాసంగా గెలుస్తారని అంతా భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వారి వైపు లాక్కున్నారు. కుట్రపూరితంగా వివేకాను ఓడించారు. ఈ వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. హత్య వెనుకా ఎల్లో గ్యాంగే..! ఇక 2019 సాధారణ ఎన్నికల్లో కడప లోక్సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని వైఎస్ జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. వివేకానందరెడ్డి పార్టీ విజయం కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ అందర్నీ కలుపుకొంటూ దూసుకుపోతున్నారు. దాంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. వివేకా జీవించి ఉంటే వారితో పాటు బీటెక్ రవికీ రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. అంటే వివేకా భౌతికంగా లేకపోవడం రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ పెద్దలు భావించారన్నది సుస్పష్టం. వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలు కొందరితో రహస్య సమావేశాలు, హత్య తరువాత ఆ నేతలు వ్యవహరించిన తీరే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తిన కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో బీటెక్ రవి సాన్నిహిత్యం పెంచుకున్నారు. హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. అంటే వివేకా హత్య వెనుక ఎల్లో గ్యాంగ్ ఉందన్నది స్పష్టమవుతోంది. కానీ ఆ పచ్చ ముఠాలోని చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలను సునీత వెనకేసుకు వస్తుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కుటుంబ వివాదాల మాటేమిటి? వివేకానందరెడ్డి రెండో వివాహంతో కుటుంబంలో రేగిన విభేదాలు, ఆస్తుల కోసం ఘర్షణలు సునీత మరుగున పెడుతున్న మరో ప్రధాన అంశం. వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం, ఆయనతో వ్యక్తిగతంగా ఆస్తిపరంగా, రాజకీయంగా ఎవరికి విభేదాలు ఉన్నాయన్నది ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం. షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. ఆ మహిళకు పుట్టిన కుమారునికి ఆస్తిలో భాగం ఇవ్వాలని భావించారు. తన రాజకీయ వారసునిగా చేస్తానని కూడా ప్రకటించారు. దాంతో ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్లో ఉంటున్నారు. కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకాకు ఉన్న చెక్ పవర్ను రద్దు చేశారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, సునీత దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్కు ఓ ఇల్లు ఇవ్వాలని, ఆమె కుమారుడిని హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా అవడంలేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. షమీమ్ కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ ప్రయోజనమన్నది స్పష్టమవుతోంది. వివేకాను హత్య చేసిన తరువాత ఆయన నివాసంలో కొన్ని ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం హంతకులు వెదికారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంటే వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది స్పష్టం. వివేకా లేకపోతే ఆస్తి మొత్తం దక్కడంతోపాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్న ఉద్దేశం ఆయన బావమరిది, అల్లుడికి ఉందన్నది స్పష్టమైంది. లేఖను గోప్యంగా ఉంచి.. గుండెపోటు ప్రచారం వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకు ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి పక్కా పన్నాగంతోనే వ్యవహరించారు. శివప్రకాశ్రెడ్డి మొదటగా ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ ప్రచారాన్ని కొనసాగించేందుకు వివేకా రాసిన లేఖను కుమార్తె, అల్లుడు రహస్యంగా ఉంచారు. ఆ లేఖను మొదటగా ఆ రోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని సునీత భర్త రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖ, వివేకా సెల్ఫోన్ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను సెల్ఫోన్ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్ఫోన్ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. వివేకా హంతకులతో సఖ్యత.. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సాన్నిహిత్యం వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన హంతకుడు దస్తగిరితో సునీత సఖ్యతతో ఉండటం వెనుక గూడుపుఠాణి ఏమిటన్నది మరో కీలకాంశం. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన సిట్, తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, సీబీఐ కూడా వివేకానందరెడ్డిని దస్తగిరితో సహా నలుగురు హత్య చేశారని నిర్ధారించాయి. వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. సునీత, ఆమె భర్త దస్తగిరితో పలుసార్లు భేటీ అవుతున్నారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితోనూ సన్నిహితంగా ఉంటున్నారు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్గా మారారన్నది సుస్పష్టం. వివేకా హంతకుడితో, రాజకీయ ప్రత్యర్థులతోనూ ఆ కుటుంబం సన్నిహితంగా ఉండటం ఈ హత్య కుట్రలో వారి సామూహిక భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తోంది. వారంరోజుల్లో తేలిపోయేదే అయితే చంద్రబాబునే ప్రశ్నించాలి వివేకా హత్య కేసు వారం రోజుల్లోనే తేలిపోవాలి కానీ, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని సునీత ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమే. ఎందుకంటే వివేకా హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబే. అప్పుడు వారం రోజుల్లోనే ఆ హత్య కేసును ఎందుకు ఛేదించలేదని సునీత ప్రశ్నించాల్సింది చంద్రబాబునే. ఇలా ప్రశ్నించకపోగా, వెనకేసుకు వస్తుండటం వెనుక ఉద్దేశం ఏమిటన్నది నిగ్గు తేలాలి. అంతేకాదు వివేకా హత్య జరిగిన వెంటనే ఆ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతో, మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. అయినా సునీత చంద్రబాబును ప్రశ్నించడంలేదు. ఇప్పుడు కేసు సీబీఐ చేతుల్లో ఉంది...ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని కదా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ ఆ దర్యాప్తును అడ్డుకుంది సునీతే. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు వద్దని, సీబీఐ దర్యాప్తు కావాలని ఆమె న్యాయస్థానంలో కేసు వేశారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న న్యాయస్థానం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కేసును బదిలీ చేసింది. మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇప్పుడు సునీత నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్నే. ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టిన ఆమె అక్కడే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించాల్సింది. ఆమె అలా చేయలేదు. ఎందుకంటే ఎన్నికల్లో బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు అది ఇష్టం లేదు. బాబుకు ఇష్టంలేని పని సునీత చేయరు. అది ఆమె తండ్రి హత్య కేసు దర్యాప్తు అయినా సరే.. మాటలు మార్చిన సునీత సునీత వైఖరి ఊసరవెల్లిని తలపిస్తోంది. తన తండ్రి వైఎస్ వివేకా హత్య వెనుక టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపి ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఉన్నారని ఆమె 2019 మార్చిలో చెప్పారు. అంతే కాదు.. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. ఈ మేరకు 2019 మార్చి 21న హైదరాబద్లో విలేకరుల సమావేశం నిర్వహించి మరీ తన తండ్రి వివేకా, ఎంపీ అవినాష్రెడ్డి మధ్య ఉన్న అన్యోన్యతను వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర పూరితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ఆమె ప్రజలను కోరారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా కొంతకాలం అదే వైఖరి అవలంబించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, బావ శివప్రకాశ్రెడ్డి పూర్తిగా చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్ళి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడం మొదలెట్టారు. క్రమంగా మాటలు మారుస్తూ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ను విచారించాలంటున్నారు. చివరగా వైఎస్సార్సీపీకి ఓటేయొద్దంటూ ముసుగు తొలగించేశారు. తన ఎల్లో విధానాన్ని బహిర్గతం చేశారు. సునీత టీడీపీ గూటి చిలుకే ఇన్నాళ్లూ తన తండ్రి వివేకా హంతకులెవరో నిగ్గు తేలాలంటూ వాదించిన సునీత.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో అసలు స్వరూపం బయటపెట్టారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే తనకు ప్రధానమని తేల్చిచెప్పారు. అందుకోసమే ఢిల్లీ ప్రెస్ మీట్లో రాజకీయ ప్రసంగమే చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, రఘురామరాజు, మహాసేన రాజేష్, పట్టాభి... ఇలా ఈ ఎల్లో గ్యాంగ్ కొన్నేళ్లుగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ఆరోపణలనే తాజాగా సునీతా చెప్పారు. అచ్చమైన టీడీపీ నేతగా మారారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటేయవద్దని చెప్పారు. ఇది నైతికంగా సునీత దిగజారుడుతనమే. ఇన్నాళ్లూ తండ్రి హత్యకు గురైన బాధితురాలిగా చెప్పుకున్న సునీత.. ప్రస్తుతం చంద్రబాబు కుట్ర రాజకీయంలో పావునని అంగీకరించారు. ఇన్నాళ్లూ తాను కార్చింది మొసలి కన్నీరేనని, చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనమే తన కంట్లో పన్నీరని చెప్పకనే చెప్పారు. వైఎస్సార్సీపీకి ఓటేయకూడదని అంటున్నారు. ఎందుకో మాత్రం ఆమె చెప్పనే లేదు. కులం, మతం, రాజకీయం చూడకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేసినందుకా? విద్య, వైద్య సంస్కరణలను ప్రవేశపెట్టినందుకా? గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చినందుకా? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నందుకా.. ఎందుకు ఓటేయకూడదని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం తన తండ్రి రెండో భార్యకు ఆస్తి లేకుండా అన్యాయం చేసినందుకు, తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి హత్యను ఉపయోగించుకోవాలని చూస్తున్నందుకే ఆమెకు ప్రజలు సహకరించాలా అని ప్రశ్నిస్తున్నారు. -
ప్రజలకు కావాల్సిన పథకాలు అందించిన నాయకుడు సీఎం జగన్
-
సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగానే కలిశాం
-
నేనే వికెట్ కీపర్.. ఇక సంజూ: రాహుల్
-
అమెరికాలోనూ ఏపీ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు
-
నోరు జారిన రాహుల్ గాంధీ
-
మంచి సినిమాలను ప్రోత్సహించాలి
‘‘తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మరోసారి నిరూపించారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూప్రోత్సహించాలి. ‘జవాన్’ విడుదలైన రోజే వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నిలబడి, బలమైన వసూళ్లతో ముందుకెళ్తోంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా పి. మహేశ్బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పి. మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని చిరంజీవి, మహేశ్బాబు, రవితేజ, రాజమౌళి, వంశీ పైడిపల్లి సమంత అభినందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో సక్సెస్ సెలబ్రేషన్స్, సక్సెస్ టూర్ ΄్లాన్ చేస్తున్నాం’’ అన్నారు ప్రమోద్. -
ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి
-
మీడియాతో ఏపీ సీఐడీ
-
నవ్వించే ప్రేమ్కుమార్
సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నమ్మడంవల్లే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. నా సినిమాల్లో నటించిన అభిషేక్ దర్శ కుడు అవుతాడని ఊహించలేదు. భవిష్యత్లో హ్యూమర్కి తనో బ్రాండ్ అవుతాడనిపిస్తోంది. ‘ప్రేమ్కుమార్’ రెండు గంటలు నవ్వించే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. బయట మనం ఎలా ఉంటామో అవే ΄ాత్రలను ఈ సినిమాలో చూస్తాం’’ అన్నారు అభిషేక్ మహర్షి. ‘‘ప్రేక్షకు లను నవ్వించాలని చేసిన సినిమా ఇది’’ అన్నారు శివ ప్రసాద్. -
సురేష్ కొండేటికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ధోని వైఫ్ సాక్షి