princess
-
డైరెక్టర్ ఏమీ చెప్పొద్దన్నారు
‘‘నటిగా నాకు అన్ని రకాలపాత్రలు చేయాలని ఉంది. అవకాశం వస్తే యాక్షన్ ఫిల్మ్ కూడా చేయాలని ఉంది. అయితే ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమా చూశాక ప్రిన్సెస్ రోల్ చేసే అవకాశం వస్తే బాగుంటుందనిపించింది’’ అని అన్నారు హీరోయిన్ అమృతా అయ్యర్. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘ఓ మనిషికి కోపం వస్తే, ఆ కో΄ాన్ని అతను కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? అతని జీవితం ఎలా ప్రభావితమవుతుంది? అన్నదే ‘బచ్చల మల్లి’ కథ. మంచి ఎమోషనల్ డ్రామా. ‘హను–మాన్’ సినిమా చిత్రీకరణ సమయంలోనే ‘బచ్చల మల్లి’ సినిమా కథ విని, ఓకే చేశాను. 1980 బ్యాక్డ్రాప్లో సాగే సినిమా ఇది. ఇందులో సిటీ కల్చర్ని ఇష్టపడే టౌన్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను. సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అమ్మాయి. నరేష్గారు ఎలాంటి ఎమోషన్ అయినా పండించగలరు. ఈ సినిమాలో స్క్రీన్పై ఆయన క్యారెక్టర్ అగ్రెసివ్గా కనిపిస్తుంది. కానీ ఆఫ్ స్క్రీన్లో ఆయన సాఫ్ట్. సుబ్బుగారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఎమోషనల్ సీన్స్ను బాగా తీశారు. రాజేష్గారితో గతంలోనే ఓ సినిమా చేయాల్సింది. కానీ కుదర్లేదు. ‘బచ్చల మల్లి’తో కుదిరింది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నాను. ‘హను–మాన్’ సీక్వెల్లో నా రోల్ గురించి దర్శకుడు ఏమీ చెప్పొపద్దని చెప్పారు. నాపాత్ర ఉంటుందా? లేదా అనే విషయమూ చెప్పొపద్దన్నారు’’ అని తెలిపారు. -
అట్టహాసంగా యువరాణి పెళ్లి
నార్వే యువరాణి మార్తా లూయిస్ (52), అమెరికాకు చెందిన డురెక్ వెర్రెట్ (49) వివాహం అట్టహాసంగా జరిగింది. నార్వేలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, కైరుంగి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు మార్తా తండ్రి, కింగ్ హెరాల్డ్ (87), ఇతర రాజకుటుంబీకులు హాజరయ్యారు. మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, రియాలిటీ స్టార్లు, టీవీ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మార్తాకిది రెండో వివాహం. మొదటి భర్తతో ఆమెకు 21, 19, 15 ఏళ్ల వయస్సున్న కూతుళ్లున్నారు. వాళ్లు కూడా వేడుకలో పాల్గొన్నారు. తనకు దేవదూతలతో మాట్లాడే శక్తి ఉందని మార్తా; ఆత్మలతో సంభాíÙంచగలనని, వ్యాధులను నయం చేయగలనని వెర్రెట్ చెప్పుకుంటారు. తమ కుటుంబానికి ఆరు తరాలుగా అతీత శక్తులు సక్రమిస్తూ వస్తున్నాయని వెర్రెట్ ప్రకటించుకున్నారు. – ఓస్లో -
అందం ప్లస్ తెలివి ప్లస్ ధైర్యం.. ఇన్స్టా విడాకుల దుబాయ్ యువరాణి షైకా మహ్రా (ఫోటోలు)
-
ఇన్స్టాలో దుబాయ్ యువరాణి ఇన్స్టంట్ విడాకులు
దుబాయ్: దుబాయ్ యువరాణి షైఖా మహ్రా మహమ్మద్ రషీద్ అలీ మక్తూమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. తన భర్త షేక్ మనాబిన్ మహ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్కు విడాకులిచ్చారు. ‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యంలో ఉన్నందున మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఐ డివోర్స్ యూ.. ఐ డివోర్స్ యూ.. ఐ డివోర్స్ యూ. జాగ్రత్తగా ఉండండి. ... మీ మాజీ భార్య’’ అంటూ జూలై 16న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. యువరాణి పోస్ట్ చేసిన వెంటనే ఆమె శ్రేయోభిలాషుల నుంచి సందేశాలు వెల్లువలా వచ్చాయి. మరోవైపు ఇన్స్టాగ్రామ్లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను కూడా తొలగించారు. షైఖా మహర్రా ప్రస్తుత దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. 2023 మేలో పారిశ్రామికవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ను వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత వారికి కుమార్తె జన్మించింది. ఆ భర్త, కూతురుతో ఉన్న ఫొటోను ఇన్స్టాలో ‘మేం ముగ్గురం’ అని జత చేసి పోస్ట్ చేశారు. జూన్ 4న ‘మేమిద్దమే’ కూతురుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడు విడాకుల ప్రకటన సంచలనమైంది. -
ఇన్స్టాగ్రామ్లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు. తన భర్తకు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతేకాదు విడాకులకు కారణాలేంటో కూడా ఆమె ఆ సందేశంలో ఉంచారు.షేఖా మహ్రాకు దుబాయ్లో ప్రముఖవ్యాపారవేత్త అయిన షేక్ మనా బిన్ మహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్(30)తో కిందటి ఏడాది మేలో వివాహం జరిగింది. రెండు నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. అయితే.. వీళ్లు విడిపోతున్నారనే ప్రచారం ముందు నుంచే కొనసాగుతోంది. రెండు వారాల కిందట కన్నకూతురితో ఓ ఫొటోను ఉంచిన దుబాయ్ యువరాణి.. ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్ ఉంచింది. ఆ టైంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం చాలామంది గమనించారు. అలాగే.. ఫొటోలను సైతం డిలీట్ చేసుకోవడంతో విడిపోతున్నారనే చర్చా మొదలైంది.అయితే.. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ విడాకుల ప్రకటన చేశారామె. తాజా ఇన్స్టా పోస్టులో.. ‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున నేను మన విడాకుల్ని ప్రకటిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య.. అంటూ మూడుసార్లు విడాకులంటూ(తలాఖ్) రాసుకొచ్చారామె. View this post on Instagram A post shared by Shaikha Mahra Mohammed Rashed Al Maktoum (@hhshmahra) దుబాయ్ పాలకుడు, యూఏఈ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తనయ షేఖా మహ్రా. యూఏఈలో మహిళా హక్కుల సాధన కోసం న్యాయవాదిగా ఆమె తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా విడాకుల ప్రకటన, అదీ భార్యగా సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాఖ్ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు. -
నీలం బంగారు గౌనులో మెరిసిపోతున్న శ్లోకా మెహతా..! (ఫొటోలు)
-
Sreeleela HD Photos: యువరాణిలా శ్రీలీల.. క్యూట్నెస్తో చంపేస్తోందిగా! (ఫొటోలు)
-
Kate Middleton: నేను కేన్సర్తో పోరాడుతున్నా..
బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్/కేథరిన్ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు. పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales) ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజు ఛార్లెస్(75) సైతం కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్ యువరాణి కేట్ సైతం కేన్సర్ బారిన పడిందన్న విషయం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్తో కేట్ మిడిల్టన్ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం. అప్పటి నుంచి.. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది. దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది. కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా ఇదిలా ఉంటే.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్ను వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. -
సర్జరీ తర్వాత కెమెరా కంటపడిన బ్రిటన్ యువరాణి?
బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన కోడలు కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటి మధ్య కేట్ మిడిల్టన్ మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కేట్ మిడిల్టన్ ఇటీవల తన భర్త ప్రిన్స్ విలియమ్తో కలిసి లండన్ సమీపంలోని విండ్సర్ ఫార్మ్స్ లో కనిపించారు. బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం కేట్ మిడిల్టన్ ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె బహిరంగంగా కనిపించడంపై బ్రిటిష్ మీడియా హర్షం వ్యక్తం చేసింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ షాపింగ్ చేస్తూ కనిపించారు. దీనిపై బ్రిటన్ మీడియా సంతోషం వ్యక్తం చేస్తూ ‘కేట్.. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’ అని రాసింది. కొన్ని మీడియా సంస్థలు ఈ జంటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఒక క్రీడా కార్యక్రమానికి కేట్ మిడిల్టన్ తన భర్త, ముగ్గురు పిల్లలతో పాటు హాజరయ్యారని ఓ బ్రిటిష్ వార్తాపత్రిక పేర్కొంది. కేట్ మిడిల్టన్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కారణంగా ఆమె గత ఏడాది చివరి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మదర్స్ డే సందర్భంగా కేట్ మిడిల్టన్ ఫోటో రివీల్ అయ్యింది. అయితే అది వివాదాస్పదంగా మారింది. అప్పటి నుండి మిడిల్టన్ ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. దీనికితోడు బ్రిటిష్ రాజభవనమైన కెన్సింగ్టన్ ప్యాలెస్లోని పలువురు ఉద్యోగులు తాము కేట్ను చాలా రోజులుగా చూడలేదని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. I edited the video to enhance the image quality, and it's definitely #PrincessCatherine in the footage.#RoyalFamily #PrincessofWales pic.twitter.com/4yOdGwQ0Vm — Royal Gossip 🇬🇧 (@UKRoyalGossip) March 19, 2024 -
'డైనోసార్ ప్రిన్సెస్': ఎవరీ ఆలియా సుల్తాన్ బాబీ?
డైనోసార్ల వంటి రాక్షస జాతి బల్లుల గురించి జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ సినిమాల ద్వారే విన్నాం. పురావస్తు శాస్త్రవేత్తల కారణంగా కథకథలుగా తెలుసుకున్నాం. కానీ మన దేశంలోనే జురాసిక్ పార్క్ని తలపించేలా డైనోసార్ల శిలాజ స్థలం ఉందన్న విషయం గురించి విన్నారా?. దాని కోసం రాజవంశానికి చెందని యువరాణి కృషి చేసి ప్రపంచ పటంపై ఆ గ్రామాన్ని నిలపడమే గాక అందరికీ తెలిసేలా చేసింది. ఎవరామె? ఎక్కడ ఉంది ఆ ప్రాంతం అంటే..? గుజరాత్లోని బాలాసినోర్కు చెందిన ఆలియా సుల్తానా బాబీ అనే మహిళ భారత గడ్డపై ఉన్న జురాసిక్ పార్క్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. దాన్ని ఒక ఉద్యానవన పార్క్గా చేసి టూరిస్టులకు ఆమెనే గైడ్గా ఉండి వాటన్నింటి గురించి వివరిస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఆమె ఎలా గుర్తించందంటే..1980లో బాలోసోర్కి సమీపంలో ఉన్న రహియోలీ అనే గ్రామంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు గుడ్లు, కుళ్లిన డైనోసార్ ఎముకలను గుర్తించారు. అక్కడ తవ్విన కొద్ది పెద్ద సైజులో ఉండే ఫిరంగి బంతుల్లా రాయి మాదిరిగా ఉన్న డైనోసార్ గుడ్లను చూశారు. ప్రఖ్యాత జియాలజిస్ట్ అశోక్ సాహ్ని వాటిని గుర్తించి అహ్మదాబాద్కు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని డైనోసార్ శిలాజ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడకు వచ్చి వీటిని సంరక్షించడం అనేది కష్టమైపోయింది. అలాగే దీన్ని అభివృద్ధిపరచడం కూడా సమస్యాత్మకంగా ఉండేది. సరిగ్గా అప్పుడే ఆలియా కాలేజీ చదువు పూర్తై బయటకు వచ్చింది. ఈ ప్రాంతంలో పరిశోధన చేసే శాస్త్రవేత్తలకు, జియాలజిస్ట్ శాస్త్రవేత్తలకు ఆమె తండ్రి, నవాబ్ మొహమ్మద్ సలాబత్ఖాన్ బాబీకి చెందిన పెద్ద ప్యాలెస్ బస చేసే హెరిటేజ్ హోటల్గా మారింది. శాస్త్రవేత్తలంతా ఆ గ్రామం వద్ద, సమీపంలో నర్మదా నది ప్రాంతంలో వందల కొద్ది ఎముకలను సేకరించడం వంటివి చేశారు. అలా ఆమెకు డైనోసార్ల శిలాజాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా రాళ్లలో నిక్షిప్తమై ఉన్న శిలాజ భాగాలను గుర్తించడం నేర్చుకుంది. అలా ఈ అరుదైన చారిత్రక ప్రదేశం పట్ల ఆసక్తి ఏర్పడి ఆ ప్రాంతాన్ని డైనోసార్ల పార్క్గా తీర్చిదిద్దేందుకు దారితీసింది. ఇలా చేసే సమయంలో గ్రామస్తుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి సుల్తానా బాబీకి. ఆమె చేసిన ప్రయత్నాల కారణంగానే గుజరాత్ ప్రభుత్వం ఈ స్థలాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలం చుట్టూ కొత్త డబుల్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రదేశంలో పశువులు మేయకుండా ఉండేలా గార్డులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటి గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని దాన్నో టూరిస్ట్ ప్రదేశంగా మార్చేలా కృషి చేసింది. ఆమె కృషి ఫలితంగా భారతదేశంలో ఉన్న డైనోసార్ల జాతి గురించి ప్రపంచమే తెలుసుకునేలా చేసింది. అంతేగాదు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే టూరిస్టులందరికీ తమ రాజప్యాలెస్లోనే బస చేసే ఏర్పాట్లు అందించింది. అలాగే వారికి ఆ డైనోసర్ల గురించి సవివరంగా తెలిపేలా స్వయంగా ఆమె ఓ గైడ్గా మారి వివరించేది. అ ఆమె డైనోసార్ల గురించి సవివరంగా పలు ఆసక్తికర విషయాలు తెలియజేయడంతో డైనోసార్ యవరాణి(డైనోసార్ ప్రిన్సెస్ అని ముద్దుగా పిలవడం ప్రారంభించారు స్థానికులు. ఈ విషయంలో తన తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇవ్వడంతోనే ఇదంత సాధ్యమయ్యిందని చెబుతోందామె. అయితే ఈ శిలాజ పార్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వారు తమ శక్తిమేర రక్షిస్తామని హామీ ఇస్తేనని అప్పగిస్తానని అంటోంది ఆలియా. అంతేగాదు ఇక్కడే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పాలియోంటాలజీ విద్యార్థుల పరిశోధనల్లో సహాయ సహకారాలు అందించాలని యోచిస్తోంది. ఇక ఈ గ్రామం తన తాతగారికి చెందిందని చెప్పుకొచ్చింది. ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద చారిత్రక శిలాజ ప్రదేశం. ఈ శిలాజాలను భావితరాలకు తెలియజేసేలా జాగ్రత్తగా భద్రపరచడానికి కృషి చేస్తానని ఆలియా అన్నారు. ఇకి ఆమె అత్త ప్రముఖ బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ. ఆలియా నిర్వహిస్తున్న ఈ పార్క్లో డైనోసార్ అవశేషాలు తాకొచ్చు, పట్టుకోవచ్చు అదే డైనోసార్ శిలాజ పార్క్ ప్రత్యేకత. View this post on Instagram A post shared by Dinosaur Musuem (@dinosaur__balasinor) (చదవండి: 24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ! షాక్లో నెటిజన్లు) -
మెగా లిటిల్ ప్రిన్సెస్కు ఐదేళ్లు.. శ్రీజ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్ దేవ్ వద్ద ఉంటోంది. (ఇది చదవండి: గుడ్న్యూస్ చెప్పిన బిగ్బాస్ బ్యూటీ..) తాజాగా నవిష్క బర్త్ డే సందర్భంగా శ్రీజ తన ఇన్స్టాలో కూతురి ఫోటోను షేర్ చేసింది. నా కూతురు అప్పుడే ఐదేళ్లు పూర్తి చేసుకుందని తెలిపింది. నవిష్క వైట్ డ్రెస్లో ఉన్న ఫోటోను పంచుకుంది. ఇది చూసిన మెగా అభిమానులు హ్యాపీ బర్త్ డే మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీజ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. క్రిస్మస్ సందర్భంగా సోమవారం నిర్వహించిన వేడుకల్లో శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
ఆమె భారత యువరాణి.. బ్రిటన్లో మహిళల ఓటుహక్కు కోసం ఎందుకు పోరాడారు?
భారతదేశానికి చెందిన ఒక యువరాణి మహిళల ఓటు హక్కు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆమె కారణంగానే బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు లభించింది. ఈ ఉద్యమం కోసం ఆమె తన రాజ కీయ హోదాను కూడా పక్కన పెట్టారు. అయితే కాలక్రమేణా ఆమె చరిత్ర మరుగున పడింది. ఇంతకీ ఆ భారతీయ యువరాణి ఎవరు? ఆమె బ్రిటన్లో మహిళల ఓటుహక్కు గురించి ఎందుకు పోరాడవలసి వచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యువరాణి మరెవరో కాదు.. పంజాబ్ చివరి సిక్కు పాలకుడు మహారాజా దులీప్ సింగ్ కుమార్తె సోఫియా దులీప్ సింగ్. ఈమె బ్రిటన్లోని నార్ఫోక్-సఫోల్క్ సరిహద్దులోని ఎల్వెడీన్లో పెరిగారు. భారతదేశంలోకి ప్రవేశించిన బ్రిటీష్ పాలకులు 1840లో మహారాజా దులీప్ సింగ్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతనిని బ్రిటన్కు తరలించారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి దులీప్ సింగ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత తనకు అందిన పరిహారపు సొమ్ముతో ఆయన ఎల్వెడీన్ హాల్ను కొనుగోలు చేశారు. అతను తన పిల్లలతో సహా అక్కడే ఉండేవారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం, యువరాణి సోఫియా 1900లలో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడారు. మహారాజా దులీప్ సింగ్ కుటుంబం బ్రిటన్ రాణి విక్టోరియాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఈ నేపధ్యంలోనే విక్టోరియా రాణి ఈ రాజకుటుంబానికి హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్లో అపార్ట్మెంట్ అప్పగించారు. సోఫియా దులీప్ సింగ్ను ‘విక్టోరియా రాణి గాడ్ డాటర్’ అని పిలుస్తారు. ఈ కారణంతోనే ప్రిన్సెస్ సోఫియా బ్రిటీష్ మహిళల మాదిరిగానే జీవితాన్ని గడిపారు. కాలక్రమేణా ఆమె బ్రిటన్లో మహిళల హక్కుల కోసం ఏదైనా చేయాలని భావించారు. ప్రిన్సెస్ సోఫియా ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ అండ్ ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్లో సభ్యురాలు. ఈ లీగ్ మహిళల ఓటు హక్కు కోసం ‘నోట్ నో టాక్స్’ నినాదం అందుకున్నారు. యువరాణి సోఫియా 400 మంది మహిళలతో కలిసి 1910లో బ్రిటీష్ పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో మహిళా ఓటు హక్కు కార్యకర్త ఎమ్మెలిన్ పాన్ఖర్స్ట్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన జరిగిన రోజున ‘బ్లాక్ ఫ్రైడే’గా పిలిచారు. యువరాణి సోఫియా నినాదాలు చేయడం లేదా నిరసనలలో పాల్గొనడం మాత్రమే కాకుండా, హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్లోని తన ఇంటి వెలుపల మహిళల ఓటు హక్కుకు సంబంధించిన వార్తాపత్రికలను విక్రయించారు. ఈ కారణంగా ఆమె చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ మనవరాలు ప్రిన్సెస్ సోఫియా పోరాటాల కారణంగా బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును పొందారు. 1876లో జన్మించిన ఆమె 1903లో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఇది ఆమె జీవితంలో కీలక మలుపుగా మారింది. రాజద్రోహం ఆరోపణలతో జైలుకెళ్లిన స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ సాగించిన పోరాట పటిమకు ఆమె ప్రభావితురాలయ్యారు. ఇదే ఆమెను బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు ప్రేరేపణ కల్పించింది. ఆమె బ్రిటన్లో మహిళల ఓటుహక్కు పోరాటం కొనసాగించేందుకు ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లారు. అక్కడ ఆమె మహిళా ఓటుహక్కు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె నిరసనలలో పాల్గొంటున్న కారణంగా ఇంగ్లండ్లో ఆమెను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఆమె దానిని పట్టించుకోలేదు. ప్రిన్సెస్ సోఫియా బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా భారత స్వాతంత్ర్య సంగ్రామంలోనూ పాలుపంచుకున్నారు. అలాగే 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికులకు వైద్య సహాయం అందించారు. ఆమె బ్లూ ఫ్లాక్ అవార్డును అందుకున్నారు. యువరాణి సోఫియా 1948లో తన 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ‘కౌన్ బనేగా కరోడ్పతి’ విజేతలు ఏం చేస్తున్నారు? -
ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పిన రొమాంటిక్ కపుల్
రాచరికపు విలాసాలను కాదని సాధారణ జీవితాన్ని ఎంచుకున్న నార్వే యువరాణి మార్థా లూయిస్ గుర్తుందా. ప్రేమికుడు, హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరో తరం షమన్ డ్యూరెక్ వెరేట్ను త్వరలోనే పెళ్లాడనుంది. ఈ రొమాంటిక్ కపుల్ అధికారికంగా తమ పెళ్లి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 31న (2024 ఆగస్టు 31) పెళ్లాడ బోతున్నట్టు బుధవారం ప్రకటించారు. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) నైరుతి నార్వేలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ,ఫ్జోర్డ్ ఒడ్డున గీరాంజర్లో వివాహ వేడుక జరగనుంది. గీరాంజర్ అందమైన పరిసరాలలో ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ఈ లవ్బర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి విహహ ప్రకటనపై రాజు హరాల్డ్ , రాణి సోంజా , ప్రిన్స్ హాకోన్ దంపతులను అభినందించారు "డ్యూరెక్ వెరెట్ను కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు ) View this post on Instagram A post shared by Durek Verrett (@shamandurek) 2022 జూన్లో మార్తా లూయిస్, డ్యూరెక్ వెరెట్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి, కింగ్ హెరాల్డ్ ఆశీర్వాదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నవంబరులో వెర్రెట్తో తన ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి ఆమె తన రాజ బాధ్యతలను వదులుకుంది. నార్వే యువరాణి టైటిల్ని మాత్రం వదులు కోలేదు. కానీ దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించనని అంగీకరించింది. తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదంటూప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ చికిత్సల అభిమాని అయిన లూయిస్ తాను దేవదూతలతో మాట్లాడగలగడం తనకు లభించిన గిఫ్ట్అని పేర్కొంది. అయితే లూయిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త, రచయిత అరిబెన్తో విడాకులు తీసుకుంది. విడిపోయిన మూడేళ్లకు 2019లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) . -
ఆమె ముస్లిం రాకుమారి.. దేశంలో తొలి మహిళా పైలెట్.. తరువాత పాక్ వెళ్లిపోయి..
అబిదా సుల్తాన్.. నాటిరోజుల్లో భోపాల్ రాచరిక సంస్థానానికి యువరాణి. మన దేశంలో విమానాన్ని నడిపేందుకు పైలట్ లైసెన్స్ పొందిన మొదటి మహిళ. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించకముందే ఆమె మహిళా పైలట్గా మారారు. భోపాల్ సంస్థానానికి చెందిన ఈ యువరాణి 1913, ఆగస్టు 28న జన్మించారు. 2002 మే 11న మరణించారు. ఆమె 1942, జనవరి 25న ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. ఆమె తండ్రి హమీదుల్లా ఖాన్ భోపాల్ రాచరిక సంస్థానానికి చివరి నవాబు. హమీదుల్లా ఖాన్కు అబిదా పెద్ద కుమార్తె. ఆమె చిన్న వయస్సులో డ్రైవింగ్, గుర్రపుస్వారీ మొదలైన వాటిని నేర్చుకోవడంతో పాటు షూటింగ్లో నైపుణ్యం సాధించారు. ఆ రోజుల్లో ఆమె ముసుగు వేసుకోకుండానే కారు నడిపారు. భోపాల్ సంస్థానం తండ్రి చేతుల్లో ఉన్నంత కాలం ఆమె తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. అయితే ఆమె ముస్లిం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. కానీ తన తండ్రి మంత్రివర్గంలో చైర్పర్సన్, ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. అబిదా ఎంతో ఇష్టంగా పోలో, స్క్వాష్ వంటి క్రీడలను ఆడేవారు. 1949లో ఆమె ఆల్ ఇండియా ఉమెన్స్ స్క్వాష్లో ఛాంపియన్గా నిలిచారు. ఆమె బాంబే ఫ్లయింగ్ క్లబ్, కోల్కతా ఫ్లయింగ్ క్లబ్లలో విమానం నడపడం నేర్చుకున్నారు. దేశ విభజన తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టారు. అబిదాకు 1926 జూన్ 18న కుర్వాయికి చెందిన నవాబ్ సర్వర్ అలీ ఖాన్తో వివాహం జరిగింది. 1949లో దేశ విభజన కోసం జరిగిన తిరుగుబాటు తర్వాత నవాబ్ సర్వర్ అలీ ఖాన్ భారతదేశాన్ని విడిచిపెట్టారు. అబిదాకు నాటి రోజుల్లో జిన్నాతో పరిచయం ఉంది. ఆమె తండ్రి భారతదేశ విలీనానికి తన సమ్మతిని తెలియజేస్తూ, విలీన లేఖపై సంతకం చేసినప్పుడు, ఆమె దానిని వ్యతిరేకించారు. అబిదా పాకిస్తాన్కు వస్తే అక్కడి రాజకీయాలో ఆమెకు అవకాశం కల్పించడమే కాకుండా ఆ దేశంలో ఆమెకు పూర్తి గౌరవం లభిస్తుందని జిన్నా ఆమెకు హామీ ఇచ్చారు. పాకిస్తాన్కు చేరుకున్న ఆమె కరాచీలోని ఒక విలాసవంతమైన రాజభవనంలో నివసించారు. అక్కడ ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి, పాకిస్తాన్ ప్రభుత్వంలో హోదాను కూడా పొందారు. ఆమె ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆమె చైనాలో అధికారిక పర్యటన కూడా చేశారు. 1960లో పాకిస్తాన్లో మార్షల్ లా అమలులోకి వచ్చినప్పుడు జిన్నా సోదరి ఫాతిమాతో కలిసి దానిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అబిదా తండ్రి మొదట్లో తమ రాచరిక సంస్థానాన్ని భారతదేశంలో కలపడంపై తిరుగుబాటు వైఖరి ప్రదర్శించినప్పటికీ, తరువాత ఆయన తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయవలసి వచ్చింది. అప్పడు అతను మాత్రమే భారతదేశంలో ఉన్నారు. కుమార్తెను ఇండియాకు తిరిగి రమ్మని కోరారు. అయితే దీనికి ఆమె అంగీకరించలేదు. అయితే తండ్రి చనిపోయిన సమయంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె కుమారుడు షహర్యార్ ఖాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. 2001 అక్టోబర్ నాటికి అబిదాను అనేక వ్యాధులు చుట్టుముట్టాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. అబిదా పాకిస్తాన్లో స్థిరపడినందున, ఆమె తండ్రి తన మధ్య కుమార్తె సాజిదా సుల్తాన్ను భోపాల్ పాలకురాలిగా నియమించారు. పటౌడీ రాజకుటుంబానికి చెందిన నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్.. సాజిదా బేగంను వివాహం చేసుకున్నారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ వారి కుమారుడు. అనంతర కాలంలో భోపాల్ రాచరిక సంస్థానంలో ఆస్తి వివాదానికి సంబంధించి పలు వివాదాలు చెలరేగాయి. అవి నేటికీ కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి -
Klin Kaara Konidela First Photos: మెగా ప్రిన్సెస్ మొదటి వీడియో షేర్ చేసిన రామ్చరణ్ (ఫొటోలు)
-
14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా..
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి.. అంతేగాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. తాజాగా టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ముంబై ధారవి స్లమ్ వాడల్లో నివసించే మలీషా ఖర్వా.. ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ది యువతి కలెక్షన్’కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. స్లమ్ ఏరియాలో ఉండే మలీషా ఇప్పుడు ‘యువతి కలెక్షన్’ను ముందుండి నడిపించనుంది. ఇది యువ శక్తిని పెంపొందించే లక్ష్యంతో మొదలు పెడుతున్న ఓ సామాజిక కార్యక్రమం. ఈ మేరకు ఏప్రిల్లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియో షేర్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. #BecauseYourDreamsMatter అనే హ్యాష్ట్యాగ్తో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ‘అందాన్ని చూసే ధృక్పథంలో మార్పు అవసరం. ఇది సామాన్యుడికి దక్కిన విజయం. ఇంత గొప్ప ఘనత అందుకున్న మలీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మలీషా మాట్లాడుతూ.. ఫారెస్ట్ ఎసెన్షియల్స్తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రధాన్యమని తెలిపింది. View this post on Instagram A post shared by @forestessentials కాగా మూడేళ్ల కిత్రం 2020లో మలీషా ప్రతిభను హాలీవుడ్ డైరెక్టర్ రాబర్ట్ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం గో ఫండ్ మీ పేజ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 2, 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్ ప్రదర్శనలు ఇచ్చింది. ర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే షార్ట్ ఫిల్మ్లో కూడా నటించింది. -
ట్రావన్ కోర్ యువరాణికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారం
సాక్షి, తిరుపతి: సనాతన ధర్మానికి నిరంతర సేవ చేస్తున్న ట్రావన్ కోర్ ప్రిన్సెస్ అశ్వతి గౌరి లక్ష్మీబాయికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అందజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామండపంలో సేవ్ టెంపుల్స్ భారత్, వేద విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మీబాయిని ఘనంగా సత్కరించారు. పద్మనాభ స్వామి దేవాలయం సంపదల పరిరక్షణలో ఆమె చేసిన పోరాటం ప్రశంసనీయమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, శ్రీ కాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్, టెంపుల్స్ భారత్ చైర్మన్ డా.గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
ఆయన కోసం రాజభోగాలు వదులుకుంది!
ఓస్లో: అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? కానీ, కొద్ది నెలల క్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. రాజరికాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసింది. అదే దారిలో నార్వే యువరాణి మార్థా లూయీస్ నడిచారు. తన రాచరికాన్ని వదులుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్-అమెరికన్ ఆరవ తరం షమన్ అయిన డ్యూరెక్ వెరెట్తో 51 ఏళ్ల యువరాణి మార్థా లూయీస్ ప్రేమలో ఉన్నారు. అయితే, షమన్తో యువరాణి అనుబంధం కారణంగా 17 శాతం మంది నార్వేయన్లు రాయల్ కుటుంబంపై వ్యతిరేకతతో ఉన్నట్లు గత సెప్టెంబర్లో జరిగిన ఓ పోల్ వెల్లడించింది. మరోవైపు.. ‘రాయల్ కుటుంబంలో ప్రశాంతతను తీసుకొచ్చేందుకు నేను తప్పుకుంటున్నాను’ అంటూ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేశారు యువరాణి మార్థా లూయిస్. నార్వే రాజు ప్రకటన.. మరోవైపు.. రాయల్ ప్యాలెస్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యువరాణి తన రాజరికాన్ని వదులుకుంటున్నారని, ఇకపై ఆమెకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, రాజు కోరిక మేరకు ఆమె యువరాణిగా పిలవబడతారని తెలిపింది. యువరాణి మార్థా ప్రకటన తర్వాత రాణి సంజాతో కలిసి మీడియాతో మాట్లాడారు నార్వే రాజు హరాల్డ్. యువరాణి రాయల్ కుటుంబానికి ఇకపై ప్రాతినిధ్యం వహించదని చెప్పేందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన నిర్ణయంపై ఆమె ఎంతో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే వివాహం.. ముగ్గురు పిల్లలు.. దేవదూతలతో మాట్లాడగలనని చెప్పుకునే మార్థా లూయిస్కు ఇప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నాయి. అయితే, ఆమె తన భర్త అరిబెన్తో విడిపోయారు. 2002లో క్లైర్ వాయెంట్గా పని చేసేందుకు సిద్ధమైన క్రమంలో ‘హర్ రాయల్ హైనెస్’ అనే టైటిల్ను కోల్పోయారు. మరోవైపు.. 2019లో తన వ్యాపారాల విషయంలో ప్రిన్సెస్ టైటిల్ను ఉపయోగించబోనని అంగీకరించారు. గత జూన్లో షమన్ వెరెట్తో అనుబంధం ఏర్పడిన క్రమంలో వారు ప్రత్యామ్నాయ థెరపీలపై దృష్టిసారించారు. సోషల్ మీడియా వేదికగా వాటిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పించాయి పలు హెల్త్కేర్ గ్రూప్లు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) ఇదీ చదవండి: హ్యారీకి అవమానం -
ఆ బాలీవుడ్ హీరో సరసన యువరాణిలా సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, వెబ్సిరీస్లు కూడా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్-2, పుష్ప చిత్రాల్లో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వరుణ్ దావన్తో నటిస్తున్న సమంత తాజాగా మరో ప్రాజెక్ట్కి ఓకే చేసినట్లు తెలుస్తుంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. దినేష్ విజన్ మ్యాడాక్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న నాలుగో హారర్ చిత్రంలో సమంత యువరాణి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుందట. -
షిఫాన్ రాణి
ధరించే దుస్తుల నుంచి అలంకరించుకునే ఆభరణాల వరకు అన్నీ భారీగానే ఉంటాయి మహారాణులకు. మహారాణులంటే ఇలాగే ఉండితీరాలి అన్నట్టుగా ఉంటారు వారు. ఈ సంప్రదాయ ఆహార్యం ఓ మహారాణికి బాగా విసుగు పుట్టించింది. దీంతో ఆమె సాదాసీదా, బరువులేని వస్త్రాలు ధరించాలను కుంది. భారీగా కాకుండా సిల్క్తో తయారయ్యే షిఫాన్ చీరను కట్టుకుని పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యి, షిఫాన్ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు ఆ రాణీగారు. అప్పటినుంచి ఇప్పటికీ షిఫాన్ చీరలు మగువల మనసులు దోస్తూనే ఉన్నాయి. స్టైల్గానేగాక, ఎంతో సౌకర్యంగా ఉండే షిఫాన్ చీరలను ప్రపంచానికి పరిచయం చేసింది రాణి ఇందిరాదేవి. అప్పటి బరోడా రాష్ట్ర యువరాణి. కూచ్బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్ను వివాహం చేసుకున్న ఇందిరా దేవి ధరించే దుస్తులు చూపరులను అమితంగా ఆకర్షించేవి. ఎప్పుడూ భారీగా ఉండే చీరలు, నగలు ధరించే ఇందిరకు వాటిమీద మొహం మెత్తేసింది. తేలికగా ఉండే చీరలను ధరించాలనుకుంది. ఎక్కువగా యూరప్లో పర్యటించే ఆమె ఎంతో ఖరీదైన షిఫాన్ వస్త్రాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుని ఆరుగజాల చీరను రాజవంశానికి తగ్గట్టుగా కళాకారులతో డిజైన్ చేయించి మరీ ధరించింది. అది ఆమెకు బాగా నప్పడంతోపాటు కట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉండడంతో.. అప్పటి నుంచి షిఫాన్ చీరలనే ధరించేది. ఇలా షిఫాన్ చీరలను ఇందిర ఇండియాకు పరిచయం చేసింది. తల్లికి తగ్గ వారసురాలిగా.. ఇందిర కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా అమ్మ షిఫాన్ చీరకట్టును అనుసరించింది. తల్లి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల నెక్లెస్, బాబ్డ్హెయిర్తో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. షిఫాన్ చీరకట్టుతో అందంగా ఉండడంతో ప్రపంచంలోని పదిమంది అందమైన మహిళల్లో గాయత్రి దేవి ఒకరుగా నిలిచినట్లు 1960లో ఓ మ్యాగజీన్ పేర్కొంది. ఇందిరా, గాయత్రి షిఫాన్ చీరలు మహిళలను అమితంగా ఆకట్టుకోవడంతో.. అన్ని తరగతుల వారు వీటిని ధరించడం మొదలు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా షిఫాన్ పాపులర్ అయ్యింది. బ్రిటన్ మహారాణి తల్లి నుంచి ప్రిన్సెస్ డయానా వరకు అందరూ షిఫాన్ను వాడినవారే. వారి గౌనులు షిఫాన్తో తయారు చేయించుకుని అనేక కార్యక్రమాల్లో మెరిసిపోయేవారు. మహారాణుల నుంచి సామాన్యులు మెచ్చిన షిఫాన్ను సిల్క్ నుంచి రూపొందించేవారు. అప్పట్లో దీనిని సంపద, ప్రతిష్టకు గౌరవసూచికగా భావించేవారు. తర్వాత నైలాన్, సింథటిక్ ఫైబర్ అందుబాటులోకి రావడంతో పాలిస్టర్ షిఫాన్ అందుబాటులోకి వచ్చి ధరకూడా తగ్గింది. ఇప్పటికీ ఫ్రెంచ్లో తయారయ్యే షిఫాన్ ధర లక్షల్లోనే ఉంటుంది. ఒకరి విభిన్న ఆలోచనకు ప్రతిరూపమే నేటి షిఫాన్ చీరలు. ట్రెండ్ సెట్టర్లు కావాలంటే గుంపులో గోవిందా అనకుండా..వందమందిలో ఉన్నా ఒక్కరిలా నిలిచేలా సరికొత్తగా ఆలోచించాలి. -
మూడేళ్ల తర్వాత సౌదీ యువరాణి విడుదల
దుబాయ్: అనుమానాస్పద పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం జైలు పాలైన యువరాణిని సౌదీ అధికారులు విడుదల చేసినట్లు ఆమె అనునూయులు తెలిపారు. సౌదీ రెండో రాజు కూతురు బస్మా బిన్ సౌద్ 2019 మార్చిలో అదృశ్యమయ్యారు. అనంతరం ఆమె ఎలాంటి నేరారోపణలు లేకుండా కఠోరమైన సౌదీ జైల్లో కనిపించారు. ఆమెతో పాటు ఆమె కూతురుని కూడా అప్పట్లో నిర్భంధించారు. ఇందుకు సరైన కారణాలు తెలియరాలేదు. అయితే సింహాసనంపై పట్టు సాధించే క్రమంలో యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కఠినంగా వ్యవహరిస్తూవస్తున్న సందర్భంలో పలువురు రాజకుటుంబీకులు ఇబ్బందుల పాలయ్యారు. ఈ క్రమంలోనే బస్మా కూడా బందీగా మారి ఉండొచ్చని కొందరి అంచనా. ఆమె అక్రమంగా రాజ్యం విడిచి పారిపోవడానికి యత్నించినట్లు 2020లో సౌదీ మిషన్ టు యూఎన్ తెలిపింది. అయితే తాజాగా 58 ఏళ్ల బస్మాతో పాటు ఆమె 30ఏళ్ల కుమార్తె సుహౌద్ అల్ షరీఫ్ను రియాద్లోని అల్హైర్ జైలు నుంచి గతవారం విడుదల చేశారని, ఆమె జిద్దాలోని స్వగృహానికి చేరారాని బస్మా న్యాయ ప్రతినిధి హెన్రి ఎస్ట్రామెంట్ తెలిపారు. చదవండి: నాడు కలిచివేసిన ఫొటో.. నేడు ‘కన్నీటి’ సుఖాంతం బస్మా ఆస్టియోపోరోసిస్ సహా పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని, ఇకపై తగు చికిత్సలకు హాజరవుతారని వెల్లడించారు. చికిత్స కోసం స్విట్జర్లాండ్కు వెళ్లే యత్నాల్లో ఉన్న బస్మాను సెక్యూరిటీ ఏజెంట్లు అన్యాయంగా నిర్భంధించారన్నారు. జైల్లో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్నారు. ఆమె విడుదల కోసం ఐరాసకు దరఖాస్తు చేశామన్నారు. నెలలపాటు ఆమె ఆచూకీ తెలియరాలేదని, చివరకు ఆమె విడుదల కావడం సంతోషమని చెప్పారు. చదవండి: చంద్రుడిపై నీటి జాడలు.. ఇదే తొలిసారి! -
మనకు తెలియని యోధురాలు.. ఆమె ఎవరు?
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది. ఆమె ఎవరు? జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్దే కావడం విశేషం. శివగంగ రాణి నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్వారు ఊడిపడ్డారు. బ్రిటిష్ దాడి అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు. అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది. 8 ఏళ్ల అజ్ఞాత వాసం వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు. ప్రతిదాడి అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది. అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు. -
అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి
ఆమ్స్టర్డామ్: ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. ఇక డబ్బు కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి పరిణామాలు జరుగుతున్న ఈ రోజులల్లో ఓ యువతి కోట్ల రుపాయలను ఖర్చులకోసం ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించింది. ఇది నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజమండి. వివరాలల్లోకి వెళితే.. డచ్ సింహాసనం వారసురాలు నెదర్లాండ్స్ యువరాణి కాథరినా అమాలియా తనకు రానున్న భారీ వార్షిక అలవెన్స్ హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాగ్జిమా పెద్ద కుమార్తె శుక్రవారం డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేకు ఓ లేఖను రాసి పంపింది. అందులో.. ఆమె రాజ విధులు చేపట్టే వరకు దాదాపు 2 మిలియన్ డాలర్ల భత్యాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. రాచరికపు నిబంధనల ప్రకారం ఆమెకు 18 ఏట నుంచి.. ప్రతి సంవత్సరం అలవెన్స్ల కింద సుమారు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 7న అమ్మడుకు 18 ఏళ్లు రానుండగా.. ఆమె దీనిని వద్దంటూ వివరణగా.. కష్టపడకుండా వచ్చే డబ్బులు తనకొద్దని తెలిపింది. View this post on Instagram A post shared by Koninklijk Huis (@koninklijkhuis) చదవండి: టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!? -
కలలో రాజకుమారి
తానొక రాజ కుమారిగా మారినట్టు కల కనే హక్కు ప్రతి అమ్మాయికీ ఉంటుంది. అయితే ఆ కల అందరికీ నిజం కాదు. నిజం కాదని అందరికీ తెలుసు. కాని కొందరు కలను నిజం చేసుకుంటారు. ముంబై వర్లీ సమీపంలో మురికివాడలో నివసించే 13 ఏళ్ల మలీషా ఖర్వా యూ ట్యూబ్లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్ను చూసి తానొక మోడల్ని, డాన్సర్ని కావాలనుకుంది. అయితే ఆమె చాలా గట్టిగా అనుకుంది. విశ్వమంతా కుట్ర చేసి మరీ ఆమె కలను నిజం చేశాయి. ఇటీవల ఆమెపై నిర్మించిన డాక్యుమెంటరీ ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ విడుదలైన సందర్భంగా మలీషా పరిచయం. మలీషా ఖ్వారా వాళ్ల నాన్న చిన్న పిల్లల బర్త్డే పార్టీల్లో ‘జోకర్’ వేషం వేసుకుని వినోదం అందించి ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో బతుకుతుంటాడు. ముంబైలో మురికివాడలో బతకడమే ఒక పెద్ద యుద్ధం అతనికి. అతని కుమార్తె 13 ఏళ్ల మలీషా మాత్రం ఆ జీవితంతో రాజీ పడదల్చుకోలేదు. ఒకసారి ఫోన్లో ఎవరో యూ ట్యూబ్లో ఆ అమ్మాయికి ప్రియాంకా చోప్రా ర్యాంప్వాక్ చూపించారు. ‘ఇలా నడవాలంటే ఏం చేయాలి’ అని అడిగింది మలీషా. ‘మోడల్ అవ్వాలి’ అని చెప్పారు ఎవరో. అప్పుడే నిశ్చయించుకుంది మోడల్ అవ్వాలని. ఆ తర్వాత డాన్సర్ కూడా అవ్వాలని. ఆ కలకు తోడు హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్మేన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం ఇండియా వచ్చి అందులో నటించడానికి కావలిసిన అమ్మాయి కోసం ముంబై మురికివాడల్లో తిరగసాగాడు. అప్పుడే మలీషా మరో కజిన్తో అతణ్ణి కలిసింది. హాఫ్మేన్ మలీషాను గమనించాడు కాని ఇంకా చిన్నపిల్ల... వీడియోకు పనికి రాదని అనుకున్నాడు. కాని మాటల్లో ‘నువ్వేం అవుదామనుకుంటున్నావు’ అని అడిగితే ‘నేను మోడల్ అవుదామనుకుంటున్నాను’ అని చాలా ఆత్మవిశ్వాసంతో మలీషా చెప్పిన తీరు హాఫ్మేన్కు నచ్చింది. ‘అయితే నీకు సాయం చేస్తాను. నీ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తాను’ అని ఆమె పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేశాడు. మలీషా ఫొటోలు అందులో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలలో మలీషా ముగ్ధత్వాన్ని, రూపాన్ని, నవ్వును ఇష్టపడిన నెటిజన్లు అతి త్వరలోనే దాదాపు లక్షన్నర ఫాలోయెర్స్గా మారారు. డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్స్ జస్గురు, అర్సలా ఖురేషి కలిసి మలీషా మరో నలుగురు స్లమ్ పిల్లల మీద ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ తీశారు. అనుకున్నది సాధించడానికి స్లమ్స్, పేదరికం, పరిమితులు అడ్డం కావని ఈ డాక్యుమెంటరీ చెబుతుంది. దీనిని మొన్న (ఏప్రిల్ 16) మలీషా అఫీషియల్ యూట్యూబ్ చానెల్లో విడుదల చేశారు. మలీషా గ్లామర్ రంగంలో భవిష్యత్తులో ఎన్నో వండర్స్ చేయనుంది. మనం వాటిని చూడనున్నాం. ఆల్ది బెస్ట్ మలీషా. కవర్ గర్ల్ అంతర్జాతీయ పత్రిక ‘పీకాక్ మేగజీన్’ మలీషాను అక్టోబర్ 2020న కవర్ పేజీ మీద వేసి ‘ద ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ పేరుతో లోకానికి పరిచయం చేశాక మలీషాకు ఫొటోషూట్ల గిరాకీ అమాంతం పెరిగింది. పీకాక్ మేగజీన్ కోసం ఆ ఫొటోషూట్ నిర్వహించిన జంట షేన్–ఫాల్గుణి పీకాక్లు మలీషాతో ఫొటోషూట్ అనుభవాలను చెప్తూ ‘ఫొటోషూట్ వరకూ మలీషా ఎంత ఆంబీషియసో వింటూ వచ్చాం. కాని ఫొటోషూట్లో ఆ అమ్మాయి అంకితభావం చూశాక పెద్ద పెద్ద కలలు కనే యోగ్యత ఉందని అనుకున్నాం. ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా పని చేసింది’ అన్నారు. – సాక్షి ఫ్యామిలీ -
ఏడేడు లోకాల ఎచటనుంటివో రాకుమారీ..!
మూడేళ్లుగా రాజుగారి కుమార్తె కనిపించడం లేదు. ఎక్కడుందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ఏ శత్రుదేశ సైనికులు ఆమెను అపహరించుకుని వెళ్లి ఉంటారు? శత్రుదేశ సైనికులు కాదు. ఏడు రాజ్యాల మహా సామ్రాజ్యాధీశుడే ఆమెను ఏడు లోకాల్లో ఎక్కడో నిర్బంధించాడు. ఆ రాకుమారి షేఖా లతీఫా. ఆ మహా సామ్రాజ్యాధీశుడు మొహమ్మద్ రషీద్. లతీఫా అతడి కుమార్తే. నిర్బంధించించి ఆ తండ్రే! ఇంతకీ ఆమె సజీవంగానే ఉందా? ఆ సంగతిని మొహమ్మద్ రషీదే చెప్పాలని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషల్’ అంటోంది! ‘పనోరమా’ అని.. బి.బి.సి. ఒక పరిశోధనాత్మక నిజ ఘటనల టీవీ సీరీస్ను ప్రసారం చేస్తుంటుంది. మొన్న మంగళవారం ఆ సీరీస్లో షేఖా లతీఫా తనే విడుదల చేసిన ఒక చిన్న వీడియో క్లిప్లో మాట్లాడుతూ కనిపించారు! ‘ఓ మై గాడ్’ అనుకుంది ప్రపంచం ఒక్కసారిగా ఆమె తెరపై కనిపించగానే. వెంటనే ‘థ్యాంక్ గాడ్’ అని కూడా. ‘ఓ మై గాడ్’ అనుకోవడం ఎందుకంటే.. మూడేళ్ల క్రితం దుబాయ్లోని తన అంతఃపురం నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై, తండ్రి చేతికి చిక్కాక తిరిగి మళ్లీ ఆమె లోకానికి కనిపించలేదు. మనిషీ లేదు. మాటా లేదు. ఆ మనిషి గురించిన మాట కూడా రాజసౌధం నుంచి చిన్న శబ్దంగానైనా లేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా బి.బి.సి.లో కనిపించినందుకే ఆ ఆశ్చర్యం. అయితే ఆ క్లిప్లో లతీఫా హాయిగా లేదు. నవ్వుతూ లేదు. ప్రశాంతంగా లేదు. బిక్కుబిక్కుమంటూ.. ఎవరూ వినకుండా మాట్లాడినట్లుగా ఉంది. అలసిపోయినట్లుగా ఉంది. అచేతనత్వానికి ప్రారంభ దశలో ఉన్నట్లుగా ఉంది. మొత్తానికి ప్రాణాలతోనైతే ఉందన్న భావనే ప్రేక్షకులు ‘థ్యాంక్ గాడ్’ అనుకోడానికి కారణం. అయితే ఆ క్లిప్ 2019 నాటిదని బి.బి.సి. ప్రకటించగనే అనుమానాలు. లతీఫా బతికే ఉందా?! క్లిప్లో ఆమె బాత్రూమ్లోంచి మాట్లాడినట్లుగా ఉంది. ఆ బాత్రూమ్ ఒక ఆకాÔ¶ హర్మ్యంలో ఉన్నట్లుగా ఉంది. ఆ ఆకాశహర్మ్యం ఏ రాజ్యంలో ఉన్నదో తెలియడం లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యు.ఎ.ఇ.) ఏడు రాజ్యాల మహాసామ్రాజ్యం. వాటిల్లో ఒకటి దుబాయ్. ఆ దుబాయ్ పాలకుడే లతీఫా తండ్రి మొహమ్మద్ రషీద్. యు.ఎ.ఇ.కి ప్రధాని, ఉపాధ్యక్షుడు కూడా కనుక కూతుర్ని ఆయన ఈ ఏడు లోకాలలో ఎక్కడైనా నిర్బంధించి ఉంచవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషల్ సంస్థ అనుమానిస్తోంది. ‘ఒక జైలు లాంటి విల్లాలో ఆమె రెక్కలు తెగిన పక్షిలా పడివున్నారన్నది మాత్రం నిజం’ అని మేరీ రాబిన్సన్ అంటున్నారు. లతీఫా నుంచి తను సంపాదించిన ఆ బాత్రూమ్ క్లిప్తో పాటు, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు, యు.ఎన్.హ్యూమన్ రైట్స్ మాజీ హై కమిషనర్ అయిన రాబిన్సన్ ఇంటర్వ్యూని కూడా తన షోలో ప్రసారం చేసింది బి.బి.సి. ‘‘ఈ స్థితిలో ఆమె ఎంతకాలం జీవించి ఉండగలరో తెలియడం లేదు’’ అని ఆ ఇంటర్వ్యూలో రాబిన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ∙∙ ‘‘బయటికి వెళ్లి ఇంత స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి కూడా లేకుండా పోయింది’’ అని బి.బి.సి.కి అందిన క్లిప్లో ఆవేదన చెందుతూ కనిపించారు లతీఫా. ఆ ఎపిసోడ్ ప్రసారం అవగానే.. ‘రాకుమారి ఎలా ఉందో చెప్పండి’ అని ప్రపంచ మీడియా నుంచి దుబాయ్ ప్రభుత్వ మీడియాకు వెళ్లిన ఏ విజ్ఞప్తికీ జవాబు లేదు! ‘‘ఈ నిర్బంధం నుంచి నేను ఎప్పటికి బయటపడతానో, ఏ నిబంధనలను అంగీకరిస్తే నన్ను విడుదల చేస్తారో నాకు తెలియడం లేదు. నా భద్రత గురించి, నా జీవితం గురించీ రోజు రోజుకూ నాలో భయం పెరిగిపోతోంది’’ అని కూడా ఆ వీడియో ద్వారా తెలియజెప్పడంతో లతీఫా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారన్న దానిపై సందేహాలు మొదలయ్యాయి. మొహమ్మద్ రషీద్కు ఆరుగురు భార్యలు, ముప్పైమంది పిల్లలు. వారందరి సమాచారం ఎంతోకొంత బయటి ప్రపంచం వరకూ వస్తున్నా, గత మూడేళ్లుగా ఏ ఒక్కరి నోటి నుంచీ లతీఫా మాటే రాలేదు! 2018 ముందువరకు ఆమె గురించి తెలిసింది ఒక్కటే.. స్కై డైవింగ్ అంటే ఆమెకు ప్రాణమని! ∙∙ లతీఫా అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కారణం, కుటుంబ ఆంక్షల నుంచి స్వేచ్ఛను పొందేందుకు బయట పడాలని 2018లో ఆమె చేసిన ప్రయత్నమే. తన ఫిన్లాండ్ స్నేహితురాలు టీనా జౌహానియస్, దుబాయ్ పాలకుడి తరఫున పని చేస్తుండే అరవై ఏళ్ల ఫ్రెంచి నిఘా అధికారి హెర్వ్ జాబెర్ట్, మరో ముగ్గురి సహాయంతో రాజప్రాసాదం నుంచి తప్పించుకుని లండన్ పారిపోయే ప్రయత్నంలో వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి 20న గోవాలో భారత తీరప్రాంత గస్తీ దళాలకు చిక్కింది. ఆశ్రయం పొందాలని వచ్చామని ఎంత చెప్పినా వినకుండా మన కమాండోలు భారత ప్రభుత్వ ఆదేశాలపై లతీఫాను తిరిగి దుబాయ్కి అప్పగించారు. ఇలా తప్పించుకునిపోడానికి ముందు కూడా మూడేళ్లపాటు వెలుతురే లేని గదిలో ఆమె బందీగా ఉన్నారు. అందుకే స్వేచ్ఛ కోసం అంతగా అలమటించిపోయారు. ఇక లతీఫాను తిరిగి దుబాయ్కి అప్పగించడం వెనుక భారత్ ఆశించిన ప్రయోజనమూ ఉంది. ఆగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన క్రిస్టియన్ మిషెల్ను యు.ఎ.ఇ. ప్రభుత్వం భారత్కు అప్పగిస్తుందన్నదే ఆ ప్రయోజనం. అప్పటికి పందొమ్మిది నెలలుగా మిషెల్ను అప్పగించాలని భారత్ కోరుతున్నా స్పందించని దుబాయ్ ప్రభుత్వం, లతీఫాను వెనక్కి పంపించడంతో ప్రతిఫలంగా అతడిని భారత్ చేతుల్లో పెట్టింది! ఇలా ఏదో ఒక ‘దౌత్య’ కారణంతో ఈనాటికీ లతీఫా నిర్బంధాన్ని ఓ ఇంటి వ్యవహారంలా మాత్రమే దేశాలన్నీ చూస్తున్నాయి. కొన్ని దేశాలు అసలే పట్టనట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. ఘటనల కాలక్రమం రాకుమారి ‘ఎస్కేప్’కి ముందు, తర్వాత ► జూన్–2002 : లతీఫా 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయేందుకు తొలి ప్రయత్నం చేశారు. మధ్యలోనే పట్టుకుని మూడేళ్ల, నాలుగు నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ► 2010: లతీఫా 24 ఏళ్ల వయసులో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ టీనాతో సన్నిహితంగా ఉండటం చూసి ఆమె ద్వారా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుందేమోనన్న అనుమానంతో లతీఫాకు పాస్పోర్ట్ రాకుండా, డ్రైవింగ్ నేర్చుకోకుండా ఆ కుటుంబం జాగ్రత్తపడింది. ► 2018 ఫిబ్రవరి ప్రారంభం : లతీఫా తన 32 ఏళ్ల వయసులో ‘జస్ట్ ఇన్ కేస్’ అని తనపై ఒక వీడియో తీయించుకుని తన నమ్మకస్తులకు మెయిల్ చేశారు. ‘నేను అమెరికా పారిపోతున్నాను. మధ్యలో పట్టుపడితే కనుక ఈ వీడియోను మీడియాకు అందించండి..’ అని అందులో విజ్ఞప్తి చేశారు. ► 24 ఫిబ్రవరి 2018: రాజప్రాసాదం నుంచి తప్పించుకుని, ఇన్ఫ్లేటబుల్ బోట్ (గాలి నింపిన తేలికపాటి పడవ)లో, తర్వాత జెట్ స్కీ లో 24 మైళ్లు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించి, ఫ్రెంచి అధికారి జాబెర్ట్ సిద్ధంగా ఉంచిన అమెరికన్ యాట్లో ఇండియా చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో అమెరికా వెళ్లి ఆశ్రయం పొందాలని పథకం. అయితే గోవాలో భారత తీర ప్రాంత కమాండోలకు చిక్కడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది. ► 5 డిసెంబర్ 2018: లతీఫా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు బి.బి.సి. ప్రత్యేక కథనాన్ని ఇవ్వబోతున్నట్లు తెలియగానే లతీఫా తన ఇంట్లోనే సురక్షితంగా ఉందని దుబాయ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ► 24 డిసెంబర్ 2018 : యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్ మేరీ రాబిన్సన్ కలిసి డిసెంబర్ 15న లంచ్ చేస్తున్న లతీఫా ఫొటోను యూఏఈ విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా విడుదల చేసింది. నాటి నుంచి నేటి వరకు లతీఫా ఆచూకీకి సంబంధించిన ఒక్క వివరమూ లేదు! ► 16 ఫిబ్రవరి 2021: బి.బి.సి. ప్రసారం చేసిన ‘పనోరమా’ షో ఇంటర్వ్యూలో మాట్లాడిన మేరీ రాబిన్సన్.. ‘లతీఫా నాతో కలిసి లంచ్ చేస్తున్న ఫొటోను ప్రపంచానికి చూపి దుబాయ్ పాలకులు తమ గోప్యతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు’ అని వ్యాఖ్యానించారు. స్కై డైవింగ్ ప్రాణం, చిన్న పిల్ల మనసు బి.బి.సి. మంగళవారం ప్రసారం చేసిన వీడియో క్లిప్లో లతీఫా మేరీ రాబిన్సన్తో లతీఫా లంచ్ -
నా పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది: రాకుమార్తె
దుబాయ్: ‘‘ఈ విల్లా ఓ జైలులా మారిపోయింది. నేను బందీగా పడి ఉన్నాను’’ అన్న దుబాయ్ యువరాణి షికా లతీఫా మాటలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. బాతూరూంలో ఓ మూలన నక్కి ఆమె రోదిస్తున్న తీరు ఎడారి దేశంలో మహిళలకు ఉన్న కట్టుబాట్ల గురించి మరోసారి చర్చకు దారి తీసింది. యువరాణిగా పుట్టినందుకు తనకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడేందుకు రెండేళ్ల క్రితం లతీఫా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. దుబాయ్ ప్రధాని, రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మకతూమ్ కుమార్తె అయిన ఆమె... అమెరికాలో ఆశ్రయం పొందాలనే యోచనతో అధికారుల కళ్లు గప్పి పడవలో పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఫిన్ల్యాండ్కు చెందిన తన స్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్ , మరో ముగ్గురు సిబ్బందితో కలిసి మరపడవలో బయల్దేరారు. ఈ క్రమంలో ఆమెను భారత్లోని గోవా తీర ప్రాంతానికి చేరుకున్న యూఏఈ అధికారులు అక్కడి నుంచి తిరిగి దుబాయ్ తీసుకువెళ్లారు. ఈ క్రమంలో తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని లతీఫా గతంలో రికార్డు చేసిన వీడియోను బ్రిటన్కు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ న్యూస్ ప్రోగ్రాం పనోరమలో భాగంగా బీబీసీ మంగళవారం మరో క్లిప్ను మంగళవారం విడుదల చేసింది. ‘‘ఇక్కడ నేనొక ఖైదీని. జైలులాంటి విల్లాలో నేను ఉండలేను. ఇంటి ముందు ఓ ఐదుగురు పోలీసులు, ఇంట్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. నా భద్రత, నా జీవితం గురించి ప్రతిరోజూ ఆందోళన చెందుతూనే ఉన్నాను. రోజురోజుకీ నా పరిస్థితి దిగజారిపోతోంది. ఈ జైలులో బతకలేను. నాకు స్వేచ్ఛ కావాలి’’ అని లతీఫా బాధతో అంటున్న మాటలు ఈ క్లిప్లో వినిపించాయి. అయితే దీనిని ఎప్పుడు రికార్డు చేశారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కాగా గోవా తీరం నుంచి లతీఫాను వెనక్కి తీసుకువచ్చిన తర్వాత, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ హైకమిషనర్, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్సన్ దుబాయ్ రాజు ఇంట్లో ఆమెను కలిశారు. వీరిద్దరు కలిసి భోజనం చేస్తున్న ఫొటోలను యూఏఈ అధికారులు విడుదల చేయడం ద్వారా లతీఫా క్షేమంగానే ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ తనను బందీగానే ఉంచారంటూ లతీఫా ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చదవండి: బాడీగార్డ్తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్ -
బెల్జియం రాకుమారి సైనిక శిక్షణ
కొత్త స్టూడెంట్ వస్తే క్లాస్ రూమ్కి కళ వస్తుంది. ఇక్కడ కొత్తగా వచ్చింది రాకుమారి ఎలిజబెత్! ఆమె అడుగు పెట్టగానే రాయల్ మిలటరీ అకాడెమీ మొత్తానికే కళాకాంతులు వచ్చాయి. కాంతి ఎక్స్ట్రా. ఆరేళ్లు రాగానే పిల్లల్ని మన భాషలో స్కూల్లో పడేసినట్లు.. పద్దెనిమిదేళ్లు రాగానే రాజవంశాల్లో మిలటరీ అకాడెమీకి పంపించేస్తారు. రెండుమూడేళ్ల వరకు ఇంటి మీద బెంగ పడేందుకు లేదు. ఎలిజబెత్ బెల్జియం రాకుమారి. క్రౌన్ ప్రిన్సెస్. అంటే సింహాసనాన్ని అధిష్టించడానికి నెక్స్ట్ లైన్లో ఉన్న వారసురాలు. తండ్రి కింగ్ ఫిలిప్. బెల్జియం రాజు. ఆయన కూడా ఈ అకాడెమీలోనే 1978–81 మధ్య సైనిక శిక్షణ తీసుకున్నారు. రథ గజ తురగ పదాతి సైన్యాలు ఎన్ని ఉన్నా రైతు బిడ్డ వ్యవసాయం చేసినట్లు రాజు బిడ్డ కత్తి తిప్పాల్సిందే. ఇప్పుడు కత్తుల్లేవు కనుక ఆడపిల్లయినా కసరత్తులు చేసి రాటు తేలాలి. డిఫెన్స్ వాల్యూస్ నేర్చుకోవాలి. డిసిప్లెయిన్, రెస్పెక్ట్, కమిట్మెంట్.. ఇవీ ఆ వాల్యూస్. ధైర్యం ఒకరు నేర్పేది కాకపోయినా ధైర్యంగా ఉండటం కూడా ఒక సబ్జెక్టుగా నేర్పిస్తారు. షూటింగ్, మార్చింగ్, మారువేషంలో తప్పించుకునే మెళకువలు చెప్తారు. ఇప్పుడైతే రాకుమారి ఎలిజబెత్ కు నాలుగు వారాల శిక్షణే. అయితే చేరి నెల కావస్తున్నా.. ఈ వాట్సాప్ యుగంలోనూ.. మిలటరీ డ్రెస్ వేసుకుని యుద్ధ విద్యలు అభ్యసిస్తున్న ఆమె ఫొటోలు ఇన్నాళ్లకు గానీ బయటికి రిలీజ్ కాలేదు. ఇక రాజుగారు, రాణిగారు కూతుర్ని కళ్లారా సోల్జర్ గా చూసుకుని మురిసిపోయే వేడుక కోసం సెప్టెంబర్ 25 వరకు ఆగక తప్పదు. ఆరోజు అందరు జననీజనకులను రప్పించి, వారి పుత్రుడికో, పుత్రికకో వారి ఎదురుగా ‘బ్లూ బెరెట్’ (క్యాప్) తొడగబోతున్నారు. రత్నాల కిరీటాలు ఎన్ని ఉన్నా, రాజపుత్రికకు బ్లూ బెరెట్ తెచ్చే ఠీవే వేరు. అదొక స్టెయిల్లో ఉంటుంది.. కాన్ఫిడెన్సు, కదనోత్సాహమూ మిక్స్ అయి! బెల్జియం రాచకుటుంబంలో రాకుమారి ఎలిజబెత్ పెద్దమ్మాయి. తర్వాత ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. వాళ్లతో ఈ పెద్దమ్మాయికి సమీప భవిష్యత్తులో ఆటలు లేనట్లే. బ్లూ బెరెట్ సెరమనీ తర్వాత రెండో దశ శిక్షణ ప్రారంభం అవుతుంది పాపం. -
నిరాడంబరంగా బ్రిటన్ ప్రిన్సెస్ వివాహం
లండన్ : ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్ బీట్రెస్(31) వివాహం శుక్రవారం ఓ వ్యాపారవేత్తతో జరిగింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మనవరాలు అయిన బ్రీట్రెస్ ఇటలీకి చెందిన మాపెల్లి మొజ్జిని(37) పెళ్లి చేసుకున్నారు. కరోనా వైరస్ కరాణంగా వీరి వివాహం నిరాడంబరంగా జరిగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధృవీకరించాయి. ('క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై దిగులుగా ఉంది') అయితే ప్రిన్సెస్ బ్రీట్రెస్, మాపెల్లిల పెళ్లి మొదటగా మే 29న లండన్లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీరి వివాహం వాయిదా పడింది. అనంతరం జూలై 17న శుక్రవారం ఉదయం 11 గంటలకు విండ్సర్లోని రాయల్ లాడ్జ్లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద వీరి వివాహం జరిగినట్లు రాజ కుటుంబం ఓ ప్రకటలో తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.(ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే) -
ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతి
టెక్సాస్ : భారత సంతతికి చెందిన చెఫ్ను పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువరాణి మరియా గాలిట్జీన్ (31) మృతి చెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హ్యూస్టన్లో కన్నుమూశారు. అయితే మరియా మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 4న మరియా మృతి చెందగా స్థానిక మీడియాలో వచ్చిన సంతాప వార్త ఆధారంగా ప్రపంచానికి ఆమె మరణ వార్త తెలిసింది. 2017లో హ్యూస్టన్లో నగరంలో చెఫ్ రిషి రూప్ సింగ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. రిషి రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్గా పనిచేస్తున్న హ్యూస్టన్లోనే మరియా ఇంటిరీయర్ డిజైనర్గా పనిచేస్తున్నారు. (ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే! కాలేజీలకు మాత్రం.. ) మరియా.. ప్రిన్సెస్ మరియా- అన్నా,ప్రిన్స్ పియోటర్ గాలిట్జీన్ కుమార్తె. 1988లో లగ్జంబర్గ్లో జన్మించారు. మరియాకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. ఆమెకు అయిదు సంవత్సరాల వయస్సులోనే రష్యాకు మకాం మార్చారు. అక్కడే గ్యాడ్యూయేషన్ పూర్తిచేసుకున్న మరియా ఆర్ట్ ఆండ్ డిజైన్ కాలేజీలో చేరేందుకు బెల్జియంకు వెళ్లారు. బ్రస్సెల్స్తోపాటు చికాగో, ఇల్లినాయిస్, హ్యూస్టన్ వంటి నగరాలలో ఆమె పనిచేశారు. చిన్న వయస్సులోనే మరియా మరణించడంతో రాజ కుటంబీకులంతా సంతాపం ప్రకటించారు. (ప్రముఖ హస్యనటుడి మృతి ) -
సేవకురాలిగా మారిన యువరాణి సోఫియా
-
సౌదీ రాజుకు వ్యతిరేకంగా కుట్ర
రియాద్: సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. శుక్రవారం ఉదయం యువరాజులు ముగ్గురిని వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేసినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు సల్మాన్తోపాటు ఆయన కొడుకు మహ్మద్ బిన్ సల్మాన్లను గద్దె దింపేందుకు కుట్ర పన్నినట్లు వీరిపై న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే నిందితులకు జీవితకాల ఖైదు లేదంటే మరణ శిక్ష పడే అవకాశం ఉంది. నయేఫ్తోపాటు ఆయన తమ్ముడు నవాఫ్ బిన్ నయేఫ్ కూడా అరెస్ట్ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. -
దుబాయ్ ప్రిన్సెస్ కిడ్నాప్ : కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఇద్దరు కుమార్తెలను అపహరించాలని ఆదేశించాడని బ్రిటన్ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. తమ ఇద్దరు పిల్లల నిర్బంధంపై పోరాటంలో మహ్మద్ మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్ హుస్సేన్ (45), జోర్డాన్ రాజు అబ్దుల్లా సోదరి చేసిన ఆరోపణలను లండన్ హైకోర్టులో వారు నిరూపించారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా దుబాయ్ పాలకుడి కుమార్తె ప్రిన్సెస్ లతీఫా కిడ్నాప్నకు సంబంధించి భారత్లో జరిగిన వ్యవహారాలపై బాధితుల ఆరోపణలతో బ్రిటన్ కోర్టు ఏకీభవించింది. రాయ్టర్స్ కథనం ప్రకారం ..దుబాయ్ పాలకుడి కుమార్తెలలో ఒకరైన ప్రిన్సెస్ లతీఫా దుబాయ్ నుండి తప్పించుకోవడానికి భారీ ప్రణాళిక రచించింది. చివరికి ఆ ప్రణాళిక ఒక సినిమా సన్నివేశాన్ని తలపించింది. (నా భార్యను తిరిగి దుబాయ్ పంపించండి) ప్రిన్సెస్ లతీఫా తన ఫిట్నెస్ ట్రైనర్, ఫ్రాన్స్కు చెందిన టినా జౌహియెనె సూచనతో ఎస్కేప్ ఫ్రం దుబాయ్ పుస్తక రయిత హార్వ్ జుబర్ట్ను సంప్రదించి ఈ ప్లాన్ను అమలుపరిచింది. 2018 ఫిబ్రవరి 24న లతీఫాను ఆమె డ్రైవర్ దుబాయ్ లోని ఒక కేఫ్ వద్ద వదిలివేసారు, అక్కడ ఆమె మరియు జౌహియెన్ అల్పాహారం కోసం క్రమం తప్పకుండా కలుస్తుంటారు. అక్కడి నుంచి ఈ జంట దుబాయ్ నుండి ఒమన్ మీదుగా మస్కట్కు చేరుకునన్నారు. అక్కడి నుంచి వారు భారత్లోని గోవాకు బయలుదేరారు. కానీ మార్చి 4 న గోవాలో భారత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కమాండో యూనిట్లు వారిని అడ్డగించాయని జౌహియెన్ చెప్పారు. (బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి) చదవండి : దుబాయ్లో భారతీయ విద్యార్థికి కరోనా "మమ్మల్ని భారత కోస్ట్గోర్డు దళాలు, హెలికాప్టర్లు, విమానాలు చుట్టుముట్టాయి... పడవ మొత్తం పొగతో నిండిపోయింద’ని అని ఆమె చెప్పుకొచ్చారు. "వారు పడవను దోచుకుని సిబ్బందిని కొట్టారు. లతీఫాను తీవ్రంగా గాయపరిచి ఆమెతో సహా పడవలో అందరినీ కిడ్నాప్ చేసి యుఎఇకి తీసుకువెళ్లార’ని ఆమె చెప్పారు. తాను ఓడకు కెప్టెన్గా ఉన్నానని, ఈ దాడికి సాక్ష్యమిచ్చానని జాబర్ట్ చెప్పడం విశేషం. కాగా ఈ విషయాలన్నీ యువరాణి హయా ఈ బ్రిటిష్ న్యాయమూర్తికి వివరించారు. ఇక 35 ఏళ్ళ లతీఫాను దుబాయ్ పాలకులు అపహరించేందుకు సాయుధ భారత కమాండో బృందం సముద్రంలో సహకరించిందనే తన ఆరోపణలను కోర్టు సమర్థించినట్టు హయా పేర్కొందని బ్లూమ్బర్గ్ నివేదించింది. కాగా ఈ అంశాలపై వివరణ కోరేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతనిధి రవీష్ కుమార్ను సంప్రదించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారని రాయ్టర్స్ తెలిపింది. (ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!) -
నా భార్యను తిరిగి దుబాయ్ పంపించండి
‘నీ అబద్ధపు రోజులు ముగిశాయి. గతంలో మనం ఏమిటి, ఇప్పుడు నువ్వేమిటి అన్నది ప్రశ్నే కాదు. నా దగ్గర నీకిక స్థానం లేదు. నువ్వెరితోనైతే తీరికలేనంతగా ఉంటావో వారితోనే ఉండిపో. నువ్వు చచ్చావో బతికావో నాకు అక్కర్లేదు’ అని భర్త ఎంతగా తూలనాడినా.. ఆమె ఇప్పటి వరకు ఒక్క మాటా అనలేదు. గుర్రప్పందాలను వీక్షించడం కోసం ఇంగ్లండ్లోని ఆస్కాట్ రేస్ కోర్సుకు క్రమం తప్పకుండా – అది కూడా చేతిలో చెయ్యి వేసుకుని – వస్తుండే ఓ రాచకుటుంబపు జంట ఈ ఏడాది జూన్లో ఆ దరిదాపుల్లోనే కనిపించలేదు! ఆ జంటలోని ఒక వ్యక్తి మాత్రమే ఒంటరిగా డీలాపడిన ముఖంతో అక్కడికి వచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.) ప్రధాని, ఉపాధ్యక్షుడు అయిన మొహమ్మద్ బిన్ రిషీద్ అల మాక్తౌమ్ ఆయన! రషీద్ దుబాయ్ పాలకుడు కూడా. యు.ఎ.ఇ.లోని ఏడు ఎమిరేట్స్లో దుబాయ్ ఒకటి. ఆయన ఉన్నప్పుడు ఆయన పక్కన అవిభాజ్యంగా ఎవరు ఉంటారో తెలిసిన ఇతర పాలకులు, ప్రసిద్ధులు రషీద్ రాకలో నిండుదనం లేకపోవడాన్ని వెను వెంటనే గ్రహించారు. అవును. దుబాయ్ రాకుమారి హయా బింత్ అల్ హుస్సేన్ ఆయన పక్కన లేరు! రషీద్ ఆరో భార్య ఆమె. అసలు వాళ్లిద్దరూ భార్యాభర్తలు అవడానికి కారణమైన ప్రేమను అంకురింపజేసింది గుర్రప్పందాలు, గుర్రాల విన్యాసాలపై ఉమ్మడిగా వారికి ఉన్న ఆసక్తే. జోర్డాన్ రాజు అబ్దుల్లాకు మారు సోదరి అయిన హయా తన ముప్పై ఏళ్ల వయసులో 2004లో రషీద్ను వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు యాభై మూడేళ్లు. భర్తతో కలిసి ఆస్కాట్ రేస్కోర్సుకు రాకుండా రాకుమారి హయా ఏమైనట్లు అని మొదట ఎవరికీ సందేహం రాలేదు. ఆమె ఎప్పుడూ అనేక సామాజిక కార్యక్రమాలలో మునిగి ఉంటారు. అయితే ఆస్కాట్ రేస్ తర్వాత కూడా రషీద్తో కలిసి ఆమె కనిపించకపోవడంతో తొలిసారిగా మీడియా అనుమానించింది. పైకి వెలుగు జిలుగులతో కనిపించే రాజప్రాసాదం లోపల హింసాత్మక చర్యలు, వ్యక్తుల్తి బంధించి వేధించడం వంటి అకృత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు అప్పటికే ఉన్నాయి. జూన్ నుంచి ఒక నెల వెనక్కు వెళ్లి రాకుమారి ఏ కార్యక్రమంలోనైనా పాల్గొన్నారా అని చూశారు. లేదు! ఆమె సోషల్ మీడియా అకౌంట్లలోకి వెళ్లారు. మే 20 నాటికే అవన్నీ మూతబడి ఉన్నాయి. ఏమై ఉంటుంది? ఆత్మహత్య చేసుకుని ఉంటుందా? అవకాశమే లేదు. హయా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం గల మహిళ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారు. ఐక్యరాజ్యసమితి గుడ్విల్ రాయబారిగా పని చేశారు. ఒకప్పటి ఒలింపిక్ క్రీడాకారిణి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. మహిళల హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారు. కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూనే సామాజిక బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లలు. 11 ఏళ్ల కూతురు జలీలా, ఏడేళ్ల కొడుకు జాయేద్. మొదట హయా ఒక్కరే కనిపించడం లేదు అనుకున్నారు. తర్వాత ఈ ఇద్దరు పిల్లలూ కనిపించని విషయం లోకం గమనింపునకు వచ్చింది! పిల్లలతో పాటు దేశం వదలి వెళ్లిపోయిన (తప్పించుకుపోయిన?) దుబాయ్ రాకుమారి హయా బింత్ అల్ హుస్సేన్ రాకుమారి హయాను, ఆమె పిల్లల్ని రషీద్ గానీ ఏమైనా చేసి ఉంటాడా అనే ఒక పెనుభూతపు అనుమానం మేఘమై దుబాయ్ ఆకాశాన్ని కమ్మేసింది. అయితే ప్రజలందరితోపాటు రషీద్ కూడా తన భార్యపిల్లలకు కోసం ఎదురుచూస్తున్నారన్న సంగతి బయటపడే లోపే, హయా తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని దేశం నుంచి పారిపోయారనే వార్త గుప్పుమంది. ఒక జర్మన్ దౌత్యవేత్త సహకారంతో ఆమె దుబాయ్ నుంచి జర్మనీకి తప్పించుకున్నారని అరబ్ మీడియా వెల్లడించింది. ‘నా భార్యను తిరిగి దుబాయ్ పంపించండి’ అని రషీద్ చేసిన విజ్ఞప్తిని జర్మనీ మన్నించకపోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని మరో వార్తా కథనం! రాజప్రాసాదాన్ని వదిలివెళ్లేటప్పుడు హయా 3 కోట్ల 20 లక్షల పౌండ్ల విలువైన నగదును కూడా (సుమారు 300 కోట్ల రూపాయలు) పిల్లల సంరక్షణార్థం తీసుకెళ్లిన విషయం మెల్లగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హయా లండన్లో ఉన్నట్లు తెలుస్తున్నా, లండన్లో ఎక్కడున్నారో తెలిసేలా ఉండడం లేదు. ‘‘నీ అబద్ధపు రోజులు ముగిశాయి. గతంలో మనం ఏమిటి, ఇప్పుడు నువ్వేమిటి అన్నది ప్రశ్నే కాదు. నా దగ్గర నీకిక స్థానం లేదు. నువ్వెరితోనైతే తీరికలేనంతగా ఉంటావో వారితోనే ఉండిపో. నువ్వు చచ్చావో బతికావో నాకు అక్కర్లేదు’అని రషీద్ జూన్ 30న ఒక ట్వీట్ మాత్రం ఇచ్చి ఊరుకున్నారు తప్ప వెతికే పని, వెతికించే పని పెట్టుకోలేదు. అయితే ఇవాళ్టి వరకు ఆయన్ని నిందిస్తూ హయా ఏ తీరం నుంచీ ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. తను వెళ్లిపోడానికి గల కారణం కూడా ఆమెలా అజ్ఞతంగానే ఉండిపోయింది. -
‘మమ్మీ’ రాకుమారి తన దేశానికి వెళ్లిపోయింది
సూకర్ : 500 ఏళ్లనాటి బొలీవియన్ ‘మమ్మీ’ రాకుమారి సొంత దేశానికి తిరిగి వెళ్లిపోయింది. 129 సంవత్సరాల క్రితం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ మ్యూజియానికి ఇచ్చిన మమ్మీని బొలీవియా వెనక్కు తెప్పించుకుంది. ఇతర దేశాలకు ఇచ్చిన పురాతన వస్తువులను తిరిగి తెచ్చే చర్యల్లో భాగంగా బొలీవియా ఈ నిర్ణయం తీసుకుంది. లా పజ్లోని యూఎస్ ఎంబసీ అధికారుల సహకారంతో మమ్మీ సొంత దేశానికి తరలివెళ్లింది. నవంబర్నుంచి బొలీవియన్ విద్యావేత్తలు, ఇతర పరిశోధకుల నేతృత్వంలో రాకుమారిపై పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. ఈ మమ్మీ 15వ శతాబ్దానికి చెందినదని రేడియో కార్బన్ పరిశోధనల్లో తేలింది. రాకుమారి ఆండియన్ హైలాండ్స్కు దగ్గరలోని లా పజ్ ‘‘ఇంకా నాగరిత’’కు చెందినదిగా పురావస్తు పరిశోధకులు గుర్తించారు. ఈమె ఏనిమిదేళ్ల వయస్సులో సమాధి చేయబడినట్లు భావిస్తున్నారు. సమాధి నుంచి వెలికి తీసినపుడు రాకుమారి చెప్పులు ధరించి ఉంది. మట్టి పాత్రలతో పాటు ఇతర వస్తువులు, ఈకలు, మొక్కలు సమాధిలో ఉన్నాయి. ఇప్పటికీ మమ్మీ రాకుమారి చేతి వేళ్ల మధ్య ఈకలు ఉండటం మనం గమనించవచ్చు. -
బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి
లండన్: దుబాయ్ రాజుతో తనకు జరిగిన బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయనకు దూరంగా ఉంటున్న భార్య, రాకుమారి హయా (45) లండన్ కోర్టును ఆశ్రయించారు. తన పిల్లల సంరక్షణ బాధ్యతలు తనకే అప్పగించాలని, అదేవిధంగా తనపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూడాలని ఆమె ఇంగ్లండ్, వేల్స్ హైకోర్టు ఫ్యామిలీ డివిజన్ను అభ్యర్థించారు. దుబాయ్ రాజు, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ప్రధాని అయిన 70 ఏళ్ల షేక్ మహమ్మద్ బిన్ రషిద్ ఆల్ మక్తూమ్ను వదిలేసి పిల్లలతో సహా పారిపోయి వచ్చిన హయా ప్రస్తుతం లండన్లో ఆశ్రయం పొందుతున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలనే విషయమై ఇద్దరి మధ్య ప్రస్తుతం న్యాయపోరాటం కొనసాగుతోంది. దివంగత జోర్డాన్ రాజు హుస్సేన్ కూతురు, జోర్డాన్ ప్రస్తుత రాజు అబ్దుల్లా-2 సవతి సోదరి అయిన హయా తన బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించే ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం బలవంతపు పెళ్లిని ఆపవచ్చు. ఒకవేళ బలవంతపు పెళ్లి ఇప్పటికే జరిగి ఉంటే.. ఆ వైవాహిక బంధంలో కొనసాగకుండా ఉత్తర్వులు ఇవ్వవచ్చు. ఆమె అభ్యర్థనను స్వీకరించిన కోర్టు మంగళవారం ప్రాథమిక వాదనలను విన్నది. హయా వద్ద ఉన్న తన పిల్లలను తిరిగి దుబాయ్కు పంపించాలని దుబాయ్ రాజు కూడా పిటిషన్ వేసిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. -
271 కోట్లతో పారిపోయిన ప్రధాని భార్య!
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఈఏ) ప్రధానమంత్రి, అపర కుబేరుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ ఆల్ మత్కవుమ్ ఆరో భార్య హయా బింట్ ఆల్ హుస్సేన్ తన పిల్లలతో కలిసి పారిపోయారు. 31 మిలియన్ల ఫౌండ్ల నగదు(సుమారు రూ. 271 కోట్లు), తన పిల్లలు జలీల(11), జయేద్(7)తో కలిసి ఆమె వెళ్లిపోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వివాహ బంధం విచ్ఛిన్నం కావడంతో భర్తతో కలిసివుండటం ఇష్టంలేక ఆమె వెళ్లిపోయినట్టు తెలిపింది. లండన్లో ఆమె ఆశ్రయం పొంది ఉండొచ్చని భావిస్తున్నారు. ముందుగా జర్మనీ ఆశ్రయం కోరినప్పటికీ ఆమోదం లభించకపోవడంతో లండన్లో రహస్య ప్రాంతంలో ఆమె తలదాచుకున్నట్టు తెలుస్తోంది. మహ్మద్ బిన్ రషీద్ కుమార్తె షేక్ లతిఫా కూడా గతేడాది దుబాయ్ నుంచి పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. మితిమీరిన బంధనాల మధ్య బతకలేనంటూ తన తండ్రిని విమర్శిస్తూ పారిపోయేముందు యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. లతిఫాకు సాయం చేసినందుకు అప్పట్లో హయా విమర్శలు ఎదుర్కొన్నారు. జోర్డాన్ రాజు సోదరి అయిన హయా ఆక్స్ఫర్డ్లో చదువుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె మే 20 తర్వాత బహిరంగంగా కనబడలేదు. తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను తరచుగా పోస్ట్ చేసేవారు. ఫిబ్రవరి తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టలేదు. తనను వదిలిపెట్టి భార్య వెళ్లిపోవడంపై మహ్మద్ బిన్ రషీద్ తీవ్రంగా స్పందించారు. ఆమె వైఖరిని తప్పుబడుతూ అరబిక్లో కవిత రాసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తన నమ్మకాన్ని వమ్ము చేసి మోసం చేసిందని.. ఆమె బతికున్నా చనిపోయినా తనకు అనవసరమని పేర్కొన్నారు. హయా వ్యవహారంపై స్పందించేందుకు బ్రిటీషు, యూఏఈ ప్రభుత్వాలు నిరాకరించాయి. -
అందాల రాణికి నూరేళ్లు
ఈ ఏడాది మే 23 కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వస్తాయి. అదే రోజు జైపూర్ మహారాణి గాయత్రీదేవి 100వ జయంతి. మరి ఎన్నికలకు, గాయత్రీదేవికి సంబంధం ఏమిటి? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటుకు పోటీ చేసిన తొలి రాకుమారి గాయత్రీ దేవి. అదొకటే కాదు, ఈ అందాల రాణి ఘనతలు, విశేషాలు ఇంకా అనేకం ఉన్నాయి.గాయత్రీదేవి 1919 మే 23న లండన్లో పుట్టారు. కూచ్ బెహార్ సంస్థానపు ముద్దుల పట్టి గాయత్రి. బాల్యంలో ఆమెపై ప్రధానంగా ఇద్దరు మహిళల ప్రభావం ఉంది. ఒకరు : ఆమె తల్లి, రాజమాత.1922లో గాయత్రి తండ్రి చనిపోగా, ఆ తర్వాత దశాబ్దకాలం పాటు రాజమాతే పరిపాలించారు. ఇంకొకరు : గాయత్రి అమ్మమ్మ, బరోడా మహారాణి. ఆమె భర్త తన హయాంలో బరోడాను దేశంలోనే అత్యాధునిక సంస్థానంగా అభివృద్ధి పరిచారు. ఈ ఇద్దరు రాణులూ కలిసి గాయత్రీదేవిని చక్కటి ఇంగ్లీషు సంస్కారంతో కూడిన భారతీయ యువరాణిగా మలిచారు. అందుకే గాయత్రి జైపూర్ మహారాజు మాన్సింగ్ను చేసుకుంటానని అనగానే అక్కడి రాజపుత్రుల కఠిన ఆచారాలను ఈ పిల్ల తట్టుకోగలదా అని కలత చెందారు. అయితే తట్టుకోవడం మాత్రమే కాదు, ఆధునిక యువతిగా తన ప్రత్యేకతను, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు గాయత్రీదేవి. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సంస్థాన వ్యూహాలు, వ్యవహారాలలో భర్తకు చేదోడుగా, కీలక సలహాదారుగా నిలిచారు. 1943లో ‘గాయత్రీదేవి బాలికల పాఠశాల’ను నెలకొల్పి, తొలి యేడాదే 40 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ టీచర్ని నియమించారు. చాలా త్వరగా ఆ పాఠశాలకు మంచి పేరు వచ్చింది. దేశంలోనే అత్యుత్యమ బాలికల పాఠశాలగా గుర్తింపు పొందింది.1947లో స్వాతంత్య్రం వచ్చాక జైపూర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. జైపూర్ రాజధాని అయింది. ఆమె భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. అయితే అధికారాలన్నిటినీ కాంగ్రెస్ తన చేతుల్లోనే ఉంచుకుంది. ఆ పరిస్థితుల్లోనే గాయత్రీదేవి స్వతంత్రపార్టీలో చేరారు.1970లో ప్రభుత్వం సంస్థానాలను పూర్తిగా రద్దు చేసింది. గాయత్రీదేవి, అమె భర్త కొన్నాళ్లు ఇంగ్లండ్లో గడిపారు. అక్కడ ఉన్నప్పుడే మాన్ సింగ్ పోలో ఆటకు అంపైరింగ్ చేస్తూ కుప్పకూలి, మరణించారు. అనంతరం ఆయన మొదటి భార్య పెద్ద కొడుకు భవానీసింగ్ మహారాజుగా తండ్రి బాధ్యతలను స్వీకరించారు. గాయత్రీదేవి రాజమాత అయ్యారు. ఆవిడ ఆ శోకంలో ఉండగానే ప్రజల అభీష్టం మేరకు మూడోసారి పార్లమెంటుకు పోటీ చేయవలసి వచ్చింది.1975 ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు గాయత్రీదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. మొదట ఆసుపత్రికి తరలించి, తర్వాత పెరోల్పై (సత్పవర్తన కలిగి ఉంటాననే హామీపై!) ఆమెను విడుదల చేశారు.ఆ తర్వాతి రెండున్నర దశాబ్దాలు గాయత్రీదేవి జీవితం ఒక రాజపుత్ర వితంతువు జీవితంలా నిస్సారంగా, నిరర్థకంగా గడవలేదు. ప్రపంచమంతటా పర్యటించారు. వేసవి కాలాలను ఇంగ్లండ్లో తాను చదువుకున్న మంకీ క్లబ్ పాఠశాల ఉన్న ప్రాంతమైన నైట్స్బ్రిడ్స్లో; శీతాకాలాలను జైపూర్లో తమ ఇద్దరి కోసమే తన భర్త కట్టించిన లిలీపూల్ సౌధంలో ప్రశాంతంగా, నిరాడంబరంగా గడిపారు. 1980లలో ‘ప్రిన్సెస్ రిమెంబర్స్’ అనే పేరుతో ఆమె ఆత్మకథ ఇంగ్లండ్లో వెలువడింది. తొంభై ఏళ్ల వయసులో 2009లో ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. 1943లో ఈ అసమాన సౌందర్యవతి ఫొటోలను సెసిల్ బీటన్ అనే ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ప్రత్యేకంగా షూట్ చేశారు. ఇప్పటికీ ఆ ఫొటోలు దేశ విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో ఎక్కడో ఒకచోట నిరంతరం దర్శనం ఇస్తూనే ఉంటాయి. ప్రేమ.. పెళ్లి.. జైలు గాయత్రికి పదమూడేళ్ల వయసులోనే మాన్సింగ్ ఆమె మనసులో పడిపోయాడు! అప్పుడతడికి 21 ఏళ్లు. అందగాడు, సంపన్నుడు. మంచి ‘పోలో’ ఆటగాడు. జైపూర్ జట్టులో మాన్సింగ్ ఉన్నాడంటే గెలుపు అన్న మాటనే ప్రత్యర్థులు మర్చిపోవాలి. ఆటతో పాటు అతడినీ ఇష్టపడింది గాయత్రి. ఎనిమిదేళ పాటు వీళ్ల మధ్య ప్రేమ నడిచింది. అమె 21వ ఏట పెళ్లి జరిగింది. అప్పటికే మాన్సింగ్కి రెండు పెళ్లిళ్లు! అయినా సరే, మూడో భార్యగా అతడి చెయ్యి అందుకుంది. అదీ రహస్యంగా, ఆ తర్వాత అధికారికంగా. ఇటు కూచ్ బెహర్ సంస్థానంలో, అటు జైపూర్ సంస్థానాల్లో పెద్ద సంచలనం! అయితే ఈ సంచలనం మహారాణీ గాయత్రీదేవి జీవితంలో చాలా చిన్నది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటుకు పోటీ చేసిన తొలి రాకుమారిగా గాయత్రీ దేవి కలకలం రేపారు. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ‘స్వతంత్ర పార్టీ’ తరఫున జైపూర్ నుంచి నిలబడి 1,92,909 ఓట్లు గెలుచుకుని (పోలైన 2,46,516 ఓట్లలో) గిన్నిస్ బుక్లోకి ఎక్కారు! తిరిగి 67 ఎన్నికల్లోనూ, 71 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఎమర్జెన్సీ సమయంలో ఐదు నెలలపాటు తీహార్ జైల్లో ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వమే ఆమెపై కక్ష కట్టి జైపూర్ పన్ను చెల్లింపులు సరిగా లేవన్న అబద్ధపు నేరారోపణలతో ఆమెను జైలుపాలు చేసింది. గాయత్రి ఘన విజయం ఏడు విడతల పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు విడతలు పూర్తయ్యాయి. గత సోమవారం జరిగిన నాలుగో విడత ఎన్నికల్లో రాజస్థాన్లోని పదమూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఆ రాష్ట్రంలోని మిగిలిన పన్నెండు స్థానాలకు ఐదవ విడత ఎన్నికల్లో భాగంగా నేడు సోమవారం (మే 6) పోలింగ్ జరుగుతోంది. ఆ పన్నెండు స్థానాల్లో ఒకటైన జైపూర్.. సార్వత్రిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ.. మహారాణి గాయత్రీదేవిని, ఆమె సాధించిన ఘనతను గుర్తు చేస్తూనే ఉంటుంది. రాజస్థాన్ నుంచి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళ గాయత్రీదేవి. ‘స్వతంత్రపార్టీ’ తరఫున వరుసగా మూడుసార్లు (1962, 1967, 1971) ఆమె గెలిచారు. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే మొత్తం పోలైన ఓట్లలో 78 శాతం ఓట్లు సాధించి ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కారు! -
థాయ్ యువరాణి ప్రధాని అభ్యర్థిత్వం రద్దు
బ్యాంకాక్: థాయ్లాండ్ ప్రధాని పదవిపై కన్నేసిన యువరాణి ఉబోల్ రతనకు చుక్కెదురైంది. తమ ప్రధాని అభ్యర్థిగా ఉబోల్ పేరును ఉపసంహరించుకుంటున్నట్లు థాయ్ రక్ష చార్త్ పార్టీ ప్రకటించింది. రాజకుటుంబీకులు రాజకీయాల్లోకి వెళ్లడం సంప్రదాయానికి వ్యతిరేకమని థాయ్లాండ్ రాజు మహావజ్రాలంగ్కోర్న్ శనివారం వ్యాఖ్యానించారు. వెంటనే స్పందించిన థాయ్ రక్ష చార్త్ పార్టీ రాజాజ్ఞను పాటిస్తామని స్పష్టం చేసింది. ఉబోల్ రతన శనివారం నిర్వహించే ప్రచార కార్యక్రమాన్ని రద్దుచేసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా, రాజు నిర్ణయంతో 2019, మార్చి 24న జరగనున్న జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో జుంటా సైనిక పాలకుల విజయం నల్లేరుపై నడక కానుంది. సైన్యం తిరుగుబాటు చేయడంతో 2006లో థక్సిన్ షీనవ్రత, 2014 లో ఆయన సోదరి ఇంగ్లక్ షీనవ్రత ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. వీరిద్దరూ ప్రస్తుతం ప్రవాసంలో గడుపుతున్న నేపథ్యంలో షీనవ్రత కుటుంబానికి చెందిన థాయ్ రక్ష చార్త్ పార్టీ యువరాణి ఉబోల్ను తెరపైకి తెచ్చింది. -
రాజవంశీకురాలు పోటీ చేయడమేమిటి?
బ్యాంకాక్ : తన సోదరి ఉబోల్ రతన(67) ప్రధాని పదవికి పోటీ చేస్తాననడం పట్ల థాయ్లాండ్ రాజు మహా వజ్రలాంగ్కోర్న్ విముఖత వ్యక్తం చేశారు. రాచరిక సంప్రదాయాలకు విరుద్ధంగా ఓ రాజవంశీకురాలు ఎన్నికల్లో పోటీ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘ రాజు, రాజవంశీకులు రాజకీయాలకు అతీతం. రాజవంశీకులను రాజకీయ వ్యవస్థలో భాగస్వాములు చేయాలనుకోవడం రాచ, థాయ్ సంప్రదాయాలకు విరుద్ధం. ఇలా చేయడం సరైంది కాదు. రాచరికాన్ని, ప్రతిష్టను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక యువరాణిగా ప్రజలకు ఆమె అందించిన సేవలు ఆదర్శనీయం’ అంటూ ఉబోల్ రతనను ప్రశంసిస్తూ, ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన పార్టీని విమర్శిస్తూ రాయల్ గెజిట్ను విడుదల చేశారు. కాగా థాయ్లాండ్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఉబోల్ రతన శుక్రవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. థాయ్ మాజీ ప్రధాని థక్షిన్ షినవ్రతకు చెందిన ‘థాయ్ రక్ష చార్త్ పార్టీ’ తరఫున పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్లుగా విజయం తమదే అన్న విశ్వాసంతో ఉన్న సైనిక పాలకుల్లో ఆందోళన మొదలైంది. అయితే రతన తన నిర్ణయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాయల్గెజిట్ వెలువడటం గమనార్హం. ఇక 1972లో అమెరికా దేశస్తుడు పీటర్ జెన్సెన్ను వివాహం చేసుకున్న రతన, రాచరిక గౌరవాలను వదులుకున్నారు. ఏకైక కొడుకు మరణం, భర్తతో విడాకులు తర్వాత రాచ కుటుంబ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు. -
‘వాళ్ల అమ్మ రమ్మంటేనే వెళ్లాను.. తను చాలా మంచిది’
గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన దుబాయ్ యువరాణి షికా లతీఫా ఇంటికి చేరుకున్నారన్న విషయం స్పష్టమైంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ హైకమిషనర్, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్సన్తో కలిసి లతీఫా భోజనం చేస్తున్న ఫొటోలను యూఏఈ అధికారులు ఇటీవల విడుదల చేశారు. ఈ నేపథ్యంలో లతీఫా మానసిక స్థితి గురించి రాబిన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బీబీసీ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ...‘ తమ కూతురు లతీఫా గురించి మాట్లాడాలని చెప్పి... దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మకతూమ్ భార్య హయా నన్ను వాళ్లింటికి ఆహ్వానించారు. కుటుంబ సమస్య గురించి చర్చించాలని చెప్పారు. నేను గమనించినంత వరకు లతీఫా దుర్భల మనస్తతత్వం కలది. అందుకే చాలా ఇబ్బందులు పడుతోంది. మొదట కుటుంబాన్ని విడిచి పారిపోవాలనుకుంది. కానీ ఇప్పుడు అందుకు తను పశ్చాత్తాపపడుతోంది. నేను తనతో కలిసి లంచ్ చేశాను. తను స్నేహ స్వభావం గల వ్యక్తి. అయితే ఆమెకు మానసిక చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా ప్రపంచంతో పంచుకోవడానికి లతీఫా కుటుంబం సిద్ధంగా లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా యువరాణిగా పుట్టినందుకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడి, అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న లతీఫా ప్రయత్నాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో జీవించాలనుకున్న లతీఫా.. ఫిన్ల్యాండ్కు చెందిన తన స్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్ , మరో ముగ్గురు సిబ్బందితో కలిసి ఒక మరపడవలో గత ఫిబ్రవరిలో దుబాయ్ అధికారుల కళ్లుగప్పి పారిపోయారు. వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి14న భారత్లోని గోవా జలాల్లో ప్రవేశించింది. ఆ సమయంలో గోవాలోని భారత్ తీర ప్రాంత రక్షక దళం బలవంతంగా ఆ పడవలోకి ఎక్కి తుపాకులు చూపించి అందరినీ బెదిరించారని, యువరాణి షికా లతీఫాను బంధించి అప్పుడే హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న యూఏఈ అధికారులకు అప్పగించారని వార్తలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని లతీఫా గతంలో రికార్డు చేసిన వీడియోను బ్రిటన్కు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. సోషల్ మీడియాలో హల్చల్ ‘నాకు స్వేచ్ఛ లేదు. సంకెళ్ల మధ్య జీవితాన్ని గడుపుతున్నాను. ఎక్కడికి వెళ్లినా నా వెంట ఒకరు ఉంటారు. నా కదలికల్ని అనుక్షణం గమనిస్తుంటారు. 2002లో కూడా ఒకసారి పారిపోవడానికి ప్రయత్నించా. కానీ సరిహద్దుల్లోనే నన్ను పట్టుకున్నారు. మూడేళ్ల పాటు గాలి, వెలుతురు కూడా రాని జైలులో పడేశారు. నా తండ్రికి కీర్తి ప్రతిష్టలంటే ఎనలేని మోజు. దాని కోసం ఎంతకైనా తెగిస్తాడు. మీరు ఈ వీడియో చూసే సమయానికి అయితే నేను చనిపోయి ఉంటాను. లేదంటే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాను. బహుశా ఇదే నా ఆఖరి వీడియో‘ అంటూ లతీఫా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆశ్రయం కోరి వచ్చిన లతీఫాను తిరిగి యూఏఈ పంపించడం ద్వారా భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరడంతో పాటుగా.. షికా లతీఫా ఎక్కడుందో బయట పెట్టి, ఆమె స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకోవాలంటూ యూఏఈని డిమాండ్ చేసింది. -
రాచరికం.. తృణప్రాయం
టోక్యో: సామాన్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జపాన్ యువరాణి అయాకో తన రాచరిక హోదాను వదులుకుంది. 28 ఏళ్ల అయాకో ఒక షిప్పింగ్ సంస్థలో పనిచేసే 32 ఏళ్ల మొరియాను సోమవారం పెళ్లాడింది. ప్రేమ కోసం రాచరిక హోదా, ఇతర భోగభాగ్యాలను తృణప్రాయంగా వదిలిపెట్టిన అయాకోకు జపాన్ ప్రభుత్వం జీవన భృతి కింద సుమారు రూ.7 కోట్లు చెల్లించనుంది. జపాన్ రాజు అకిహిటో కజిన్ అయిన దివంగత టాకాముడో కూతురే అయాకో. జపాన్ రాచరిక సంప్రదాయాల ప్రకారం..బయటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే రాకుమారి అన్ని హోదాలు, గౌరవాల్ని కోల్పోతుంది. రాకుమారుడికి ఈ నిబంధనలు వర్తించవు. జపాన్ రాజకుటుంబంలో అయాకో లాంటి వివాహం మరొకటి జరగనుంది. అకిహిటో పెద్ద మనవరాలు మాకో(26) ఓ సామాన్యుడిని ప్రేమించింది. జపాన్లో ఇలా.. బ్రిటన్లో అలా.. బ్రిటన్ రాజవంశీయులు పురుషులైనా, మహిళలైనా పరాయివారిని వివాహమాడితే రాచరిక హోదాను కోల్పోరు. ఇటీవల జరిగిన ప్రిన్స్ హ్యారీ–మేఘన్, ప్రిన్సెస్ యూజినీ–జాక్ బ్రూక్బ్యాంక్ల వివాహాలే ఇందుకు నిదర్శనం. జపాన్ సింహాసనం అధిష్టించడానికి మహిళలు అనర్హులు. బ్రిటన్లో ఈ విషయంలో లింగబేధం లేదు. అందుకే ఇప్పటి వరకు ఎలిజబెత్–2తో సహా ఆరుగురు రాణులు పాలనా పగ్గాలు చేపట్టారు. -
దుబాయ్ యువరాణి ఏమైంది ?
పేరుకే రాజు కుమార్తె. కానీ అడుగడుగునా ఆంక్షలు, బయట ప్రపంచం ఏమిటో తెలీదు. స్వేచ్ఛ అన్న మాటకి అర్థం తెలీదు. అండగా ఉండాల్సిన కన్నతండ్రే వేధిస్తూ ఉంటే, తనకున్న అధికార దర్పంతో గాలి వెలుతురు లేని చీకటి గదిలో మూడేళ్ల పాటు బం«ధించి చిత్రహింసలు పెడితే ఏం చేయాలి ? ఎవరికి చెప్పుకోవాలి ? ఆ ఆంక్షల చట్రాలను ఛేదించుకొని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని, అమెరికాలో ఆశ్రయం పొందాలని అనుకున్న ఆ యువరాణి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆమె ఇప్పుడేమైందో, ఎక్కడుందో ఎవరికీ తెలీడం లేదు. ఇది దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మకతూమ్ కుమార్తె షికా లతీఫా దీనగాథ. షికా లతీఫా కనిపించకుండా పోవడం వెనుక భారత్ ప్రమేయం ఉందని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ తీరప్రాంత రక్షణ దళం మానవ హక్కుల్ని తీవ్రంగా ఉల్లంఘించి ఆశ్రయం కోరి వచ్చిన లతీఫాను తిరిగి దుబాయ్కి పంపించారంటూ అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత్ ప్రమేయం ఎంత ? ఆమ్నెస్టీ హక్కుల సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం తండ్రి నుంచి గత కొన్నేళ్లుగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్న షికా లతీఫా ఎలాగైనా దేశం విడిచి పారిపోవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు.. ఫిన్ల్యాండ్కు చెందిన తన ప్రాణస్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్ , మరోముగ్గురు సిబ్బందితో కలిసి ఒక మరపడవలో గత ఫిబ్రవరిలో దుబాయ్ అధికారుల కళ్లుగప్పి పారిపోయారు. వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి 14న భారత్లోని గోవా జలాల్లో ప్రవేశించింది. అప్పడు గోవాలోని భారత్ తీర ప్రాంత రక్షక దళం బలవంతంగా ఆ పడవలోకి ఎక్కి తుపాకులు చూపించి అందరినీ బెదిరించారు. కెప్టెన్ జౌబెర్ట్ని రక్తం కారేలా కొట్టడంతో అతను స్పృహ తప్పిపోయాడు. ఇతర సిబ్బందిని కూడా బాగా కొట్టారు. పడవని ధ్వంసం చేశారు. యువరాణి షికా లతీఫా తాను ఆశ్రయం కోరి వచ్చానని అరుస్తున్నా వినిపించుకోకుండా ఆమెని బంధించి, అప్పుడే హెలికాప్టర్లో వచ్చిన యూఏఈ అధికారులకు వాళ్లందరినీ అప్పగించారట. మార్చి 20న జౌబెర్ట్, మిగిలినవారిని దుబాయ్ అధికారులు విడిచిపెట్టారు. ఆ తర్వాత రెండు రోజులకే యువరాణి స్నేహితురాల్ని కూడా విడిచిపెట్టడంతో ఆమె ఫిన్లాండ్కు వెళ్లిపోయింది. భారత్ తీర ప్రాంత రక్షణ దళం దయా దాక్షిణ్యాలు లేకుండా తాము ప్రతిఘటించకపోయినా తీవ్రంగా కొట్టి దుబాయ్ అధికారులకు అప్పగించారని వాళ్లంతా ఆరోపించారు. దుబాయ్లో ఎలాంటి న్యాయవిచారణ లేకుండానే గుర్తు తెలియని ప్రదేశంలో ఒక జైలులో తమను బంధించి ఉంచారని వారు వెల్లడించారు. అప్పట్నుంచి యువరాణి షికా లతీఫా ఆచూకీ కనిపించడం లేదు. ఆమె క్షేమ సమాచారాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమ్నెస్టీ ఈ మొత్తం వ్యవహారంలో భారత్ తీర ప్రాంత రక్షక దళం వ్యవహార శైలిని తప్పు పడుతోంది. ఆశ్రయంకోరి వచ్చిన వారిని ఏకపక్షంగా బంధించి, శారీరకంగా హింసించడం ఏమిటని ప్రశ్నిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు షికా లతీఫా ఎక్కడుందో బయట పెట్టి, ఆమె స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకోవాలంటూ యూఏఈని డిమాండ్ చేసింది. లతీఫా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ షికా లతీఫా దేశం విడిచి పారిపోవడానికి ముందు ఇదంతా ఊహించిందో ఏమో ఒక వీడియోని రికార్డు చేసి పెట్టారు. తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని ఆమె ఆ వీడియోలో చెప్పారు. ‘నాకు స్వేచ్ఛ లేదు. సంకెళ్ల మధ్య జీవితాన్ని గడుపుతున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా నా వెంట ఒకరు ఉంటారు. నా కదలికల్ని అనుక్షణం గమనిస్తూ ఉంటారు. 2002లో కూడా ఒకసారి పారిపోవడానికి ప్రయత్నించా. సరిహద్దుల్లోనే నన్ను పట్టుకున్నారు. మూడేళ్ల పాటు నన్ను గాలి వెలుతురు కూడా రాని జైలులో పడేశారు. నా తండ్రికి కీర్తి ప్రతిష్టలంటే ఎనలేని మోజు. దాని కోసం దేనికైనా తెగిస్తాడు. మీరు ఈ వీడియో చూసే సమయానికి అయితే నేను చనిపోయి ఉంటాను. లేదంటే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాను. బహుశా ఇదే నా ఆఖరి వీడియో‘ అంటూ ఒక వీడియో రికార్డు చేశారు. ఆరు నెలల క్రితం లతీఫా కిడ్నాప్ అయిందన్న వార్తల నేపథ్యంలో ఈ వీడియోని బ్రిటన్లో ఒక మీడియా సంస్థ బయటపెట్టింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఆరుగురు భార్యలున్న దుబాయ్ రాజుకి 30 మంది సంతానంలో లతీఫా ఒకరు. -
కోటను వీడి సామాన్యుడి చెంతకు..
టోక్యో : సామాన్య ఉద్యోగిని పెళ్లాడేందుకు సిద్ధపడ్డ జపాన్ రాణి అయెకో రాజ కుటుంబాన్ని, రాచరిక హోదాను వీడనున్నారు. దివంగత రాజు తకమొడో మూడవ కుమార్తె అయెకో కియో మోరియా అనే 32 ఏళ్ల షిప్పింగ్ కంపెనీ ఉద్యోగిని వివాహం చేసుకుంటారని జపాన్ రాజప్రాసాద ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. ఏడాది కిందట వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆగస్ట్ 12న వీరి నిశ్చితార్థం జరగనుండగా, అక్టోబర్ 29న టోక్యోలోని మిజి జింగు మసీదులో వివాహ బంధంతో వీరు ఒక్కటవనున్నారు. సోషల్ వెల్ఫేర్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ప్రిన్స్ అయెకోకు గత ఏడాది డిసెంబర్లో మొరియాను ఆమె తల్లి రాణి తకమొడో పరిచయం చేశారని ఏజెన్సీ తెలిపింది. స్ధానిక ఎన్జీఓ ద్వారా రాణి తకమొడోకు కియో మోరియా తల్లితండ్రులు ఎప్పటినుంచో పరిచయం. మరోవైపు రాణి అయెకో, కియో మోరియాలకు స్వచ్ఛంద సేవా కార్యకలాపాలతో పాటు పలు ఉమ్మడి అభిరుచులు ఇద్దరినీ దగ్గర చేశాయని చెబుతున్నారు. వీరికి ప్రయాణాలు చేయడంతో పాటు పుస్తక పఠనం వంటి అభిరుచులున్నాయి. జపాన్ చట్టాల ప్రకారం రాణి అయెకో కియో మోరియాను వివాహం చేసుకుంటే రాజ కుటుంబాన్ని విడిచివెళ్లాల్సి ఉంటుంది. అయితే బోనస్ చెల్లింపుల కింద ఆమెకు లక్షలాది డాలర్ల సొమ్ము అందనుంది. సామాన్యుడిని పెళ్లాడి రాచ కుటుంబాన్ని వీడనుండటం అయెకోనే కాదు, గత ఏడాది మేలో ఆమె సోదరి, మహారాజు పెద్ద మనవరాలు రాణి మాకో కూడా పారామెడికల్ ఉద్యోగి కెల్ కొమొరాను పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి వివాహం తరువాత వాయిదా పడింది. జపాన్ రాణులు మాకో, అయెకో ఇద్దరూ సామాన్యులను పెళ్లాడితే రాజ కుటుంబ సభ్యుల సంఖ్య 17కు పడిపోయి మిగిలిన సభ్యులపై రాచరిక బాధ్యతల భారం పడనుంది. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పురాతన రాజకుటుంబంలో వారసత్వ అంశాలపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. సామాన్యుడిని పెళ్లాడిన రాణులు కుటుంబ శాఖలను ఏర్పరచేందుకు అనుమతించండం, రాజకుటుంబ బాధ్యతలను నూతన సభ్యులకు అప్పగించడం వంటి ప్రతిపాదనలను వారసత్వ ప్రక్రియలో భాగంగా పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
రాకుమారి వేసిన ప్రశ్నలు
ఇరాన్ చక్రవర్తి తన ఏకైక కుమార్తె సనాకు తగ్గ వరుణ్ని ఎంపిక చేసేందుకు స్వయంవరం ఏర్పాటు చేశారు. స్వయంవరంలో రాజకుమారి అడిగే మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. అదే ప్రాంతానికి చెందిన గొప్ప పండితుడి కుమారుడు ఆజిమ్కు రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనే తలంపు కలిగి, స్వయంవరానికి హాజరయ్యాడు. రాజకుమారి మొదటి ప్రశ్న.. రాజ దర్బారు నుంచి లేచి కుడిచేయి పైకెత్తి చూపుడువేలును ఆకాశానికెత్తి సైగలద్వారా ప్రశ్నించింది. దానికి ఆజిమ్ తన చేతిని పైకెత్తి చూపుడు వేలితోపాటు మరోవేలిని జతచేసి గాలిలో ఊపాడు. రాజకుమారి ‘సరైన సమాధానం’ అంటూ అభినందించింది. ఇక రెండో ప్రశ్న.. తన చేతిలో ఉన్న ఖడ్గంతో విన్యాసాలు చేసి దీనికి సమాధానమేమిటని సైగచేసింది. దానికి ఆజిమ్ తన జేబులో ఉన్న కలాన్ని తీసి ఊపాడు. ‘శభాష్’ అని మెచ్చుకుంది సనా. చివరి ప్రశ్నగా రాజదర్బారు మెట్లనుంచి కిందకు దిగి పరుగు పరుగున వెళ్లి తన ఆసనంలో కూర్చుండిపోయింది. సమాధానంగా ఆజిమ్ లేచి నిల్చొని తన గుండెపై చేయి వేసి రాజకుమారి వైపు చూడసాగాడు. అంతే! రాజకుమారి సిగ్గుబిడియాలతో రాజమహలులోకి వెళ్లిపోయింది. చక్రవర్తి ఆజిమ్ను పిలిచి ‘‘నువ్వు నా కుమార్తె సనాను నీ సమాధానాలతో ఎలా మెప్పించావు రహస్యమేమిటి’’ అని ఎంతో కుతూహలంగా అడిగాడు. దానికి ఆజిమ్ ‘మొదటి ప్రశ్నగా రాజకుమారి తన చూపుడువేలిని పైకెత్తి నువ్వు దేవుడు ఒక్కడేనని నమ్ముతావా? అని అడిగింది. దానికి నేను నా రెండు వేళ్లను పైకెత్తి చూపుతూ అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సఅసం) పై నా విశ్వాసముందని చెప్పాను. రెండో ప్రశ్నగా రాకుమారి తన చేతిలో ఖడ్గాన్ని తిప్పుతూ దీనికంటే గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో ఉందా అని ప్రశ్నించింది. దానికి నేను నా చేతిలో ఉన్న కలాన్ని తీసి దీనికి మించిన గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో లేదు అని సమాధాన పర్చాను. మూడో ప్రశ్నగా రాకుమారి దర్బారు మెట్లు దిగి మళ్లీ తిరిగి వెళ్లి తన కుర్చీలో ఆసీనురాలైంది. అంటే, నేను ఎంతో అలసిపోయాను, కానీ నా దేహంలోని ఏ భాగం అలసిపోలేదు అని అడిగింది. దానికి జవాబుగా నా చేతిని నా గుండెపై వేసి ‘హృదయం’ అని జవాబు చెప్పాను’’ అని సమాధానమిచ్చాడు. ధన సంపద కంటే జ్ఞానసంపద ఎంతో మేలైనది. జ్ఞానం ఎంత వినియోగిస్తే అంతగా పెరుగుతుంది అని చెప్పడమే ఇందులోని అంతరార్థం. – ఉమైమా -
మిస్ తెలుగు ప్రిన్సెస్ అపర్ణ
కాకినాడ కల్చరల్: స్థానిక జీ కన్వెన్షన్ హాలులో శనివారం జరిగిన మిస్ తెలుగు ప్రిన్సెస్ అందాల పోటీలలో విన్నర్గా కాకినాడకు చెందిన టీఎన్ఎస్ అపర్ణ ఎంపికయ్యారు. ఫస్ట్ రన్నర్గా వి.సంజన,(కాకినాడ) సెకండ్ రన్నర్గా ఎం.శ్రేష్ట (కాకినాడ) ఎంపికయ్యారు. అందమైన భామలు సంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ చేసి అలరించారు. వయ్యారాలు ఒలకపోస్తూ హంసనడకలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను అలరిం చింది. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా మిస్ వరల్డ్ అస్ట్రేలియా–2017 ఎస్మా వలోడర్ పాల్గొన్నారు. మహిళలు ఆత్మ«స్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. అందం ఒక్కటే ప్రధానం కాదని సేవాభా వం కూడా పెంపొందించుకోవాలని పోటీలలో పాల్గొన్న యువతులకు సూ చించారు. న్యాయ నిర్ణేతలుగా సుధాజైన్, వైఏ జయలక్ష్మి, ఎం.సరిత, మరియాలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్ సతీష్ శిఖా, సంస్థ సీఈఓ శిరిష, కోఆర్డినేటర్ నీరజ్, యాంకర్ రాఖీ, అర్జున్, శివ పాల్గొన్నారు. సేవే నిజమైన అందం ఈ పోటీలలో విన్నర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం అదిత్య కళాశాలలో బీబీఏ కోర్సు చేస్తున్నాను. మా తల్లిదండ్రులు (టీఎస్ఎస్ ప్రసాద్, గీత) ప్రోత్సాహంతో ఈ పోటీలలో పాల్గొన్నాను. మహిళలు ఆత్మస్థైర్యంతో ఉండాలి. మఖ్యంగా సేవాభావం కలిగిఉండాలి. ఉండాలి. అదే నిజమైన అందంగా భావిస్తాను. –టీఎన్ఎస్ అపర్ణ, తెలుగు ప్రిన్సెస్ విన్నర్ -
అరెస్టయిన యువరాజులంతా ఎక్కడున్నారు?
రియాద్ : అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సుల్తాన్ ఆదేశాల మేరకు 11 మంది యువరాజులను, మంత్రులను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ తర్వాత వారందరిని ఎక్కడికి తరలించారు? అన్న ప్రశ్నలను పలువురు లెవనెత్తున్నారు. ఈ మేరకు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు జరిపిన అన్వేషణలో ఆశ్చర్యకర విషయం వెలుగు చూసింది. రియాద్ లోని రిట్జ్ కార్లటన్ విలాసవంతమైన హోటల్లో వారంతా సేదతీరుతున్నారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు వారాల క్రితం వాణిజ్య ఒప్పందాల కోసం 3 వేల మంది అధికారులు, వ్యాపార వేత్తలతో ఇక్కడ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే లగ్జరీ హోటల్లోని బాల్రూమ్ బీ లో వారంతా నేలపై పడుకున్న దృశ్యాలు విడుదల అయ్యాయి. వారి చుట్టూ గార్డులు కాపలా ఖాయటం చూడొచ్చు. మరికొందరు వీఐపీలను కూడా ఇదే హోటల్లోని మరికొన్ని రూమ్లలో ఉంచినట్లు ది టైమ్స్ సోమవారం ఓ కథనం ప్రచురించింది. గదులేవీ ఖాళీ లేవని తమ ప్రతినిధితో చెప్పినట్లు ఆ కథనంలో టైమ్స్ పేర్కొంది. ఖరీదైన ఈ కారాగారంలో 11 మంది యువరాజులను, నలుగురు ప్రస్తుత మంత్రులను, డజనుకుపైగా మాజీ మంత్రులు, మల్టీ మిలీనియర్లు ఉన్నారు. ఇక అరెస్టయిన వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. దశాబ్దాలుగా సౌదీ వ్యాపార వ్యవస్థను శాసిస్తున్న ససీర్ బిన్ అఖీల్ అల్ తయ్యార్ తోపాటు ఇప్పుడు బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న ప్రిన్స్ అల్వాలీద్ బిన్ తలాల్ కూడా ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అదంతా ఓ డ్రామాగా అభివర్ణించాయి. అయితే బిన్ సుల్తాన్ చేసిన పని సమీప భవిష్యత్తులో దుబాయ్ ఆర్థిక వ్యవస్థను(చమురు రంగంలో కాకుండా) దారుణంగా కుదేలు చేసే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. A look inside the Ritz Carlton where Saudi officials are being detainedhttps://t.co/DoD5Z2NXEg (Video from Reuters) pic.twitter.com/yepuArlAG9 — Haaretz.com (@haaretzcom) November 7, 2017 -
సౌదీలో యువరాజుల అరెస్ట్
రియాద్: సౌదీ అరేబియాలో యువరాజులు, మంత్రులతో పాటు పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఇందులో ఒక బిలియనీర్ కూడా ఉన్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు జరిగినట్టుగా తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి అరెస్ట్ అయిన 11 మంది యువరాజుల్లో ప్రముఖ బిలియనీర్ అల్–వలీద్ బిన్ తలాల్ ఉన్నారు. రాయల్ డిక్రీ ద్వారా క్రౌన్ ప్రిన్స్ మహమూద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో అవినీతి వ్యతిరేక కమిషన్ ఏర్పాటైన కొద్దిసేపటికే ఈ అరెస్టులు జరిగాయి. సౌదీ నేషనల్ గార్డ్ అధిపతి, నేవీ చీఫ్, ఆర్థిక మంత్రిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించడం సంచలనం సృష్టించింది. సౌదీలో చమురు శకం తర్వాత ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రిన్స్ సల్మాన్ తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా 11 మంది యువరాజులను, నలుగురు ప్రస్తుత మంత్రులను, డజనుకుపైగా మాజీ మంత్రులను అరెస్టు చేసినట్లు సౌదీ అధికారిక మీడియా వెల్లడించింది. 2009 నాటి పాత కేసులకు సంబంధించి ఈ అరెస్టులు జరిగినట్టు తెలిపింది. అవినీతి వ్యతిరేక కమిషన్ లక్ష్యం ప్రజా ధనాన్ని కాపాడటం.. అవినీతికి పాల్పడే వారిని.. అధికారాన్ని దుర్వినియోగం చేసే వారిని శిక్షించడం.. అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. -
కూతురు యువరాణి... తండ్రి మహారాజు
సామ్రాజ్యం కూతుర్ని యువరాణిలా చూసుకునే తండ్రుల్ని చాలామందిని చూసుంటాం. కానీ ఆ తండ్రి తన కూతుర్ని నిజంగానే యువరాణిని చేయాలనుకున్నాడు. ఇందుకోసం ప్రపంచ యాత్ర సాగించాడు. చివరికి ఆమెకోసం ఓ సామ్రాజ్యాన్ని కనుక్కొన్నాడు. అక్కడ తమ జెండా పాతాడు. కూతురి నెత్తిన కిరీటం అలంకరించాడు. ఆమెను ఆ సామ్రాజ్యానికి యువరాణిని చేశాడు. హద్దులు దాటిన ఆ కన్నతండ్రి ప్రేమ గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి. పిల్లలు పెరిగే వయసులో పక్కన పడుకోబెట్టి రాజులు, రాజ్యాల గురించి కథలు చెప్పడం చాలామంది తండ్రులు చేసే పనే. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన జెరీమియా హీటన్ కూడా ఇదే పనిచేశాడు. తన కూతురు ఎమిలీకి చిన్ననాటి నుంచి పురాణ గాథలు చెబుతూ వచ్చాడు. వాటిని విపరీతమైన ఆసక్తితో మిన్న ఎమిలీని... ఆ కథల్లోని యువరాణి పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాత్రల్లో తనను తాను ఊహించుకుని, గాల్లో తేలియాడిపోయేది ఎమిలీ. ఐతే యువరాణి పాత్ర ఆమెపై బలమైన ముద్ర వేసి, కొన్నాళ్లకు తాను యువరాణినవుతానంటూ పట్టుబట్టింది. ఐతే మొదట్లో ఈ విషయాన్ని హీటన్ తేలిగ్గానే తీసుకున్నాడు. కానీ కొన్నాళ్లకు కూతురి మనసు అర్థం చేసుకున్నాడు. ఆమెను నిజంగానే యువరాణిని చేయాలని సంకల్పించాడు. మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసే హీటన్... తన కూతురికి ఓ రాజ్యాన్ని కట్టబెట్టాలని, కృతనిశ్చయానికి వచ్చాక, కొన్ని నెలల పాటు పనిమానుకున్నాడు. ప్రపంచంలో ఎవరి అధీనంలోనూ లేని ఖాళీ స్థలం కోసం అన్వేషణ సాగించాడు. అతని ప్రయాణం ఈజిప్ట్, సుడాన్ దేశాల మధ్య ఆగింది. ఆన్లైన్ సెర్చ్ ద్వారా ఈశాన్య ఆఫ్రికా ప్రాంతంలోని బిర్ టావిల్ అనే పేరుతో పిలిచే 800 చదరపు మైళ్ల ఎడారి ప్రాంతం ఎవరి అధీనంలోనూ లేదని తెలుసుకున్న హీటన్... అక్కడికెళ్లి జెండా పాతాడు. అప్పటికే తన యువరాణి సామ్రాజ్యం కోసం తయారుచేసి పెట్టుకున్న జెండా అది. ఆ సామ్రాజ్యానికి తన కూతురే యువరాణి అనేందుకు సూచికగా ఓ కిరీటం ఉంటుంది. జెండా పాతి వచ్చాక, హీటన్ చేసిన పని, తన కూతురి పట్టాభిషేకం. ఓ అందమైన వజ్రాల కిరీటం తయారు చేయించి, దాన్ని ఆమె తలకు అలంకరించాడు. ఈ రోజు నుంచి ఆమె ఉత్త ఎమిలీ కాదని, ‘ప్రిన్సెస్ ఎమిలీ’ అని ప్రకటించాడు. ‘‘మా సామ్రాజ్యం స్వతంత్రమైనదిగా ప్రకటిస్తున్నా. ఈ రాజ్యానికి నేనే అధినేతను. ఎమిలీ నిజమైన యువరాణి అయింది. ఇకపై ఎమిలీని చూసినప్పుడు ఆమె అధికారిక నామం ‘ప్రిన్సెస్ ఎమిలీ’తో పలకరించండి. ఆ పదం విన్నప్పుడల్లా తనపై నా ప్రేమ, తనకోసం నేను ఎంత దూరం వెళ్లానో తెలుస్తుంది’’ అంటూ ఫేస్బుక్ సాక్షిగా ప్రకటన తన మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ప్రకటించాడు హీటన్. ప్రస్తుతం ఎమిలీ వయసు ఏడేళ్లు. పూర్తిగా ఊహ తెలిసేవరకు ఆమెను యువరాణిగానే భావించనివ్వమంటున్నాడు హీటన్. తాను చేస్తున్నది చూసి నవ్వుకున్నా పర్వాలేదంటున్నాడతను. ఐతే ఫేస్బుక్లో హీటన్ పోస్టులు చూసి, అతణ్ని ప్రశంసిస్తున్నవాళ్లే ఎక్కువ మంది. తండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండబోదంటూ హీటన్పై ప్రశంసల జల్లు కురిపిస్తూ, మద్దతుగా నిలుస్తున్నారు మిత్రులు. హీటన్ చేస్తోంది కొందరికి పిచ్చిలా అనిపించొచ్చు. ఇంకొందరికి ప్రేమలా అనిపించొచ్చు. వాస్తవమేంటంటే, తన కూతురిపై హీటన్కున్నది పిచ్చి ప్రేమ! -
28 ఏళ్ల తరువాత తెరపైకి అతిలోకసుందరి
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అనేదొక కాలం. బహుశా నటి శ్రీదేవి లాంటి అందాల రాశిని చూసే ఆ కవి హృదయం అలా స్పందించి ఉంటుంది. ఇప్పటికీ శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రకాశిస్తున్నారు. బాలనటిగా తమిళ, తెలుగు సినిమాల్లో అడుగులు వేసిన ఈ బ్యూటీ తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. అయినా తన కీర్తి దాహం తీరక ఉత్తరాది చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. అక్కడా హీరోయిన్గా తన హవా కొనసాగించారు. అప్పటికీ నటిగా కాస్త సంతృప్తి చెందిన శ్రీదేవి 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకుని సంసార జీవితంలోకి ప్రవేశించారు. 1997లో నటనను దూరంగా పెట్టి మాతృమూర్తి దశకు చేరారు. కుమార్లె జాహ్నవి, ఖుషి సంరక్షణ బాధ్యతలతో తల్లిగా పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన శ్రీదేవి మళ్లీ నటనపై దృష్టి సారించారు. 2012లో హిందీలో ఇంగ్లీషు వింగ్లీష్ చిత్రం కోసం ముఖానికి రంగేసుకున్నారు. ఈ చిత్రం మంచి ప్రజాదరణ పొందింది. శ్రీదేవిలోని చెక్కు చెదరని అందాలకు ఆమె అభిమానులు ముగ్ధులయ్యారు. దీంతో శ్రీదేవి ఎవర్గ్రీన్ హీరోయిన్ అనేది మరోసారి రుజువయ్యింది. ఆ చిత్రం తెరపైకి వచ్చి రెండేళ్లయింది. ఈ లోపు ఆమెను నటింప చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అలాంటి వారందరికీ చిరునవ్వే జవాబుగా చెప్పుకుంటూ వచ్చిన శ్రీదేవి తాజాగా తమిళ తెరపై మరోసారి మెరవడానికి సిద్ధం అవుతున్నారు. అంటే 28 ఏళ్ల తరువాత ఈ అందాల రాశి తమిళ చిత్రంలో నటించనున్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో శ్రీదేవి యువరాణిగా ముఖ్య భూమికను పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ ధృవపరచారు. విజయ్ హీరోగా నటించనున్న చిత్రంలో శ్రీదేవి నటిస్తున్నారు. ఇంతకంటే ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను అని బోనీకపూర్ పేర్కొన్నారు. శ్రీదేవి తమిళంలో చివరిగా రజనీకాంత్ సరసన నాన్ అడిమై ఇల్లై చిత్రంలో నటించారన్నది గమనార్హం. మలయాళంలో ఈ సుందరి నటించిన చివరి చిత్రం దేవరాగం. శ్రీదేవి ఆ మధ్య నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ తమిళం, తెలుగు భాషల్లోనూ అనువాదం అయ్యింది.