Rana Kapoor
-
యస్ బ్యాంక్ రాణా కపూర్కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి
న్యూఢిల్లీ: ఏటీ–1 బాండ్ల తప్పుడు విక్రయాల కేసుకు సంబంధించి రూ. 2.22 కోట్లు కట్టాలంటూ యస్ బ్యాంక్ మాజీ ఎండీ రాణా కపూర్కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించని పక్షంలో అరెస్ట్ ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే అసెట్స్, బ్యాంక్ ఖాతాలను కూడా అటాచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ల గురించి చెప్పకుండా వాటిని అమాయక ఇన్వెస్టర్లకు యస్ బ్యాంక్ సిబ్బంది అంటగట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2022 సెపె్టంబర్లో రాణా కపూర్కు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. -
రాణా కపూర్కు సెబీ జరిమానా
న్యూఢిల్లీ: అదనపు టైర్(ఏటీ)–1 బాండ్ల విక్రయంలో అక్రమాలపై యస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో రాణా కపూర్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. యస్ బ్యాంకు అధికారులు రిటైల్ ఇన్వెస్టర్లకు తప్పుడు పద్ధతిలో అదనపు టైర్–1 బాండ్లను విక్రయించడంపై సెబీ తాజా జరిమానాకు తెరతీసింది. సెకండరీ మార్కెట్లో ఏటీ–1 బాండ్లను విక్రయించేటప్పుడు బ్యాంకు, కొంతమంది అధికారులు రిస్కులను ఇన్వెస్టర్లకు వెల్లడించకపోవడాన్ని సెబీ తప్పుపట్టింది. 2016లో ప్రారంభమైన ఏటీ–1 బాండ్ల అమ్మకం 2019వరకూ కొనసాగింది. వీటి విక్రయ వ్యవహారాన్ని మొత్తంగా కపూర్ పర్యవేక్షించినట్లు సెబీ పేర్కొంది. బాండ్ల విక్రయంపై సభ్యుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందడంతోపాటు అమ్మకాలను పెంచేందుకు అధికారులపై ఒత్తిడిని సైతం తీసుకువచ్చినట్లు తెలియజేసింది. -
Sakshi Cartoon: పద్మభూషణ్ ఇప్పిస్తామని రూ.2 కోట్ల పెయింటింగ్...
పద్మభూషణ్ ఇప్పిస్తామని రూ.2 కోట్ల పెయింటింగ్ కొనిపించిన కాంగ్రెస్-యస్ బ్యాంక్ కపూర్ -
ఓవైపు కేసులు.. మరోవైపు మనవడికి 40 కోట్ల కానుక
బిందు రాణా కపూర్.. యస్ బ్యాంక్ ఫౌండర్, మాజీ ఎండీ రానా కపూర్ భార్య. అక్రమ ధనార్జన కేసు విచారణలో భర్తతోపాటు బిందూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని పలు సంస్థలకు యస్బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేయగా, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆమె తన తొమ్మిదేళ్ల మనవడికి పుట్టినరోజు కానుకగా 40 కోట్ల విలువైన ఆస్తుల్ని అందించడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని పోష్ ఏరియా జోర్బాగ్లో తన పేరిట ఉన్న ఆస్తిని.. మనవడు ఆశివ్ ఖన్నా పేరిట రాసింది బిందు రాణా కపూర్. ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ విలువ 40 నుంచి 44 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆస్తి.. ఆమె తన తండ్రి నుంచి 2004 లో పొందినట్లు డాక్యుమెంట్లలో ఉంది. జప్కీ డాట్కామ్ ద్వారా డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. జులై 31న ఆస్తి ట్రాన్స్ఫర్కు సంబంధించిన 36 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు జరిగిందని.. ఆ ఆస్తికి బిందూ కూతురు, ఆశివ్ ఖన్నా తల్లి రాధా కపూర్ గార్డియన్గా నియమించినట్లు ఆ చెల్లింపుల్లో ఉంది. ఇది చదవండి: యస్ బ్యాంక్ నష్టం, ఎన్ని కోట్లంటే.. గతేడాది జులైలో యస్ బ్యాంక్ మోసాలు.. మనీలాండరింగ్ కేసులో రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ ఎటాచ్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో లండన్లోని రాణా కపూర్కు చెందిన 127 కోట్ల విలువైన ఫ్లాట్ను కూడా ఈ మధ్యే ఎటాచ్ చేసింది. ఇక పోయినవారం రానా కపూర్ను వారం కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టును కోరిన విషయం తెలిసిందే. కపూర్, ఆయన భార్య బిందు, అవంత రియాలిటీ లిమిటెడ్ గౌతమ్ థారప్లు.. 685 కోట్ల ఆస్తుల్ని కేవలం 375 కోట్ల ఆస్తుల ట్రాన్జాక్షన్ చూపించడాన్ని ఇల్లీగల్గా పేర్కొంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. రాణా కపూర్తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై ప్రస్తుతం మనీలాండరింగ్ కేసు నడుస్తోంది. -
రాణా కపూర్ రూ.127 కోట్ల ఫ్లాట్... ఈడీ జప్తు
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసు విచారణలో భాగంగా యస్బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్కు శుక్రవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. లండన్లో ఉన్న రూ.127 కోట్లు (13.5 మిలియన్ పౌండ్లు) విలువచేసే ఫ్లాట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మరోవైపు పలు కీలక లావాదేవీల విషయాన్ని వెల్లడించనందుకుగాను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రాణా కపూర్కు రూ.కోటి జరిమానా విధించింది. ఈడీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లండన్, 77 సౌత్ ఆడ్లీలో అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ ఉంది. డీఓఐటీ క్రియేషన్స్ జర్సీ లిమిటెడ్ పేరుతో 2017లో రూ.93 కోట్లకు (9.9 మిలియన్ పౌండ్లు) రాణా కపూర్ ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశారు. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని పలు సంస్థలకు యస్బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. దీని ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. రాణా కపూర్తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై మనీలాండరింగ్ కేసు నమోదయ్యింది. ఈ కేసులో జప్తు చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.2,011 కోట్లు. సెబీ జరిమానా ఎందుకంటే..: రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ (ఇప్పుడు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్) నుంచి యస్బ్యాంక్ అన్లిస్టెడ్ ప్రమోటర్ సంస్థ అయిన మోర్గాన్ క్రెడిట్స్ రూ.950 కోట్లను సమీకరించింది. 2018లో అన్లిస్టెడ్ జీరో కూపన్ నాన్–కన్వెర్టబుల్ డిబెంచర్ల ద్వారా ఈ నిధుల సమీకరణ జరిగింది. యస్బ్యాంక్ ప్రమోటర్ కూడా అయిన కపూర్, గ్యారంటార్గా ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. అయితే ఈ లావాదేవీకి సంబంధించి పూర్తి వివరాలు బ్యాంక్ డైరెక్టర్లకు తెలియజేయలేదు. ఈ వ్యవహారం మార్కెట్ క్యాపిటలైజేషన్కు సంబంధించి యస్బ్యాంక్పై ప్రతికూల ప్రభావం చూపింది. నంజున్దయా ఆయన కుటుంబ సభ్యుల రూ.255.17 కోట్ల ఆస్తులపైనా కొరడా... కాగా, ఇన్వెస్టర్లను భారీగా మోసం చేసిన కేసులో కన్వా గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడు ఎన్ నంజున్దయా ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.255.17 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం విడుదల చేసిన మరో ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలోని స్థిరాస్తులతో పాటు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. బెంగళూరులోని కార్పొరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ తాజా చర్యలు తీసుకుంది. శ్రీ కన్వా సౌహార్థ సహకార క్రెడిట్ లిమిటెడ్ ద్వారా అధిక వడ్డీ ఆశజూపి ప్రజల నుంచి రూ.650 కోట్లు వసూళ్లు జరిపారని, ఈ విషయంలో నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఆగస్టు 25న నంజున్దయా అరెస్టయ్యారు. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిందితుడు రూ.120 కోట్ల రుణాలను పొందినట్లు కూడా కేసు నమోదయ్యింది. -
యస్ బ్యాంక్: 900 కోట్లను అటాచ్ చేసిన ఈడీ..
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ స్కామ్లో దర్యాప్తు అధికారులు పురోగతి సాధించారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఆస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అటాచ్ చేసింది. ముంబైలోని రూ.127కోట్ల విలువైన ఇల్లును ఈడీ అటాచ్ చేసింది. మొత్తం రూ.900 కోట్ల విలువైన ఆస్తులును ఈడీ అధికారులు అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దర్యాప్తు అధికారులు ఇటీవల రాణా కపూర్తో సహా డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధవన్ లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఈడీ రూ.2,203 కోట్ల రూపాయలని అటాచ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో రాణి కపూర్కు విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని పేర్కొంది. (చదవండి: ఓ మై గాడ్... వెంకన్న రక్షించాడు) -
రాణా కపూర్కు ఈడీ భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: యస్ బ్యాంకు కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్, డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్ , ధీరజ్ వాధవన్ లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. వీటి విలువ 2,203 కోట్ల రూపాయలని గురువారం అధికారులు ప్రకటించారు. ఇందులో రాణా కపూర్ విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలిపారు. (యస్ బ్యాంక్ కేసు : వాధవాన్ సోదరుల అరెస్ట్) మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్ఏ)చట్టం ప్రకారం ముంబైలోని పెద్దార్ రోడ్లో ఉన్న ఒక బంగ్లా, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్ వద్ద ఉన్న 48 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటితోపాటు న్యూయార్క్లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్లో రెండు కమర్షియల్ ప్రాపర్టీస్తోపాటు ఐదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. కాగా యస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి రాణా కపూర్పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసులను నమోదు చేశాయి. కపూర్, అతని కుటుంబ సభ్యులు, ఇతరులు 4,300 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపించింది. రాణా కపూర్ క్విడ్ప్రోకో కింద డీహెచ్ఎఫ్ఎల్ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. మార్చిలో అరెస్టు అయిన కపూర్, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
యస్ బ్యాంక్ కేసు : వాధవాన్ సోదరుల అరెస్ట్
ముంబై : యస్ బ్యాంక్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవాన్, ధీరజ్ వాధవాన్లను ఈడీ గురువారం అరెస్ట్ చేసింది. వీరిని మనీల్యాండరింగ్ నిరోధక (పీఎంఎల్ఏ) న్యాయస్ధానం ఎదుట హాజరుపరచగా కోర్టు పదిరోజుల కస్టడీకి తరలించింది. యస్ బ్యాంక్ కేసులో ఏప్రిల్ 26న మహాబలేశ్వర్లో వాధవాన్ సోదరులను సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు మరో 12 మందితో కలిసి ఖండాలా నుంచి మహాబలేశ్వర్కు ప్రయాణించడం కలకలం రేపింది. లాక్డౌన్ ఉల్లంఘనల కింద వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్లో ఉంచిన అనంతరం సీబీఐ వారిని కస్టడీలోకి తీసుకుంది. ఇక వాధవాన్ సోదరులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ క్విడ్ప్రోకో కింద డీహెచ్ఎఫ్ఎల్ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు యస్ బ్యాంక్ కేసులో ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. చదవండి : యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం -
రాణా కపూర్పై కొత్తగా మరో కేసు..
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్యపై ఈడీ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. అవంతా రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు గాను .. వారు రూ. 307 కోట్ల మేర ముడుపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక బంగ్లాను మార్కెట్ రేటులో సగం ధరకే దక్కించుకోవడం ద్వారా వారు లబ్ధి పొందినట్లు ఈసీఐఆర్లో ఈడీ పేర్కొంది. మొండిబాకీల వసూలు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించినందుకు గాను కొన్ని బడా కార్పొరేట్ల నుంచి కపూర్కు ముడుపులు ముట్టాయంటూ ఈడీ ఇప్పటికే ఒక కేసు నమోదు చేసింది. ఈడీ విచారణకు హాజరు కాని వాధ్వాన్ సోదరులు.. యస్ బ్యాంక్ ప్రమోటరు రాణా కపూర్పై మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినప్పటికీ.. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లయిన వాధ్వాన్ సోదరులు (కపిల్, ధీరజ్) మాత్రం హాజరు కాలేదు. దీంతో కొత్తగా సమన్లు జారీ చేయడంతో పాటు, మరో కేసులో కపిల్ వాధ్వాన్కి ఇచ్చిన బెయిల్ను కూడా రద్దు చేయాలంటూ కోర్టును ఈడీ కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యస్ బ్యాంక్ నుంచి డీహెచ్ఎఫ్ఎల్ తీసుకున్న రూ. 3,700 కోట్లు ప్రస్తుతం మొండిబాకీలుగా మారాయి. కార్పొరేట్లకు యస్ బ్యాంకు నుంచి రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్ రూ. 4,300 కోట్ల మేర ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
‘యస్’ షేర్ల ట్రేడింగ్పై ఆంక్షలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. షేరు ఏకంగా 50 శాతం పైగా ఎగిసినప్పటికీ తమ దగ్గరున్న వాటిని విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లో తమ పొజిషన్లను వదిలించుకోలేకపోవడంపై పలువురు సీనియర్ ఫండ్ మేనేజర్లు, ఎఫ్పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిబంధనను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీగా పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్లయిందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత నియంత్రణ సంస్థను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఆంక్షల గురించి సోమవారం ఉదయానికి మాత్రమే ఇన్వెస్టర్లకు తెలిసింది. అంతే కాకుండా యస్ బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ను మొబైల్ యాప్స్ ద్వారా కుదరదని, డెస్క్టాప్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకింగ్ సంస్థలు .. ఇన్వెస్టర్లకు సమాచారమిచ్చాయి. ఒకవేళ యస్ బ్యాంక్ షేర్లలో ఈ–మార్జిన్ పొజిషన్లు గానీ ఉంటే సోమవారం వాటిని డెలివరీ కింద మారుస్తామని, అందుకు తగినంత స్థాయిలో నిధులు తమ అకౌంట్లలో ఉంచుకోవాలని సూచించాయి. 19నే సూచీల నుంచి నిష్క్రమణ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్ బ్యాంక్ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్ఎస్ఈ ఇండిసెస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్–కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్ బ్యాంక్ నిష్క్రమించనుంది. 18 నుంచి పూర్తి సేవలు: ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్ బ్యాంక్పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో ఖాతా దారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్డ్రాయల్స్ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్లకు ఈడీ సమన్లు.. యస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చందద్ర, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఇండియాబుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అటు అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ నెల 19న హాజరు కానున్నారు. యస్ బ్యాంక్ అప్గ్రేడ్ .. తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్ బ్యాంక్ రేటింగ్ను సానుకూల అంచనాలతో అప్గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. బోర్డు పునర్వ్యవస్థీకరణకు ఓకే .. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్.. కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. -
‘యస్’ ప్రణాళికకు కేంద్రం ఓకే..
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ‘ఆర్బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, యస్ బ్యాంక్ను స్థిరపర్చేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసేందుకు ఈ స్కీమ్ తోడ్పడుతుంది‘ అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)..49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్బీఐ డైరెక్టర్లు ఇద్దరు ఉంటారని ఆమె చెప్పారు. కొత్త బోర్డు ఏర్పాటైన 7 రోజుల్లోగా అడ్మినిస్ట్రేటర్ తప్పుకుంటారన్నారు. ఎస్బీఐ వాటాలకు సంబంధించి 26%కి మాత్రమే మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుం దని, మిగతా ఇన్వెస్టర్లకు 75% వాటాలకు ఇది వర్తిస్తుందని మంత్రి చెప్పారు. ఇక, పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ పెట్టుబడులు.. యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ఇది 5 శాతం పైగా వాటాలకు సమానమవుతుంది. అయితే, పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం తుది వాటాల సంగతి వెల్లడవుతుందని పేర్కొంది. అటు రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ కూడా రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్ సైతం రూ. 600 కోట్లతో 60 కోట్ల దాకా షేర్లు కొనుగోలు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా రూ. 500 కోట్లతో 50 కోట్ల షేర్లు తీసుకోనున్నట్లు క్సే ్చంజీలకు తెలిపింది. రాణా కపూర్పై మరో సీబీఐ కేసు.. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్య బిందుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. అవంత రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించి, రాణా కపూర్ ప్రతిఫలంగా ఢిల్లీలోని ఓ భవంతిని అత్యంత చౌకగా తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వివరాల్లోకి వెడితే.. అవంత సంస్థలకు రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు ప్రతిగా బ్లిస్ అబోడ్ అనే సంస్థ ద్వారా ఢిల్లీలోని బంగళాను రూ. 378 కోట్లకు కపూర్ కొనుగోలు చేశారు. ఈ బ్లిస్ అబోడ్ అనే సంస్థ ఇద్దరు డైరెక్టర్లలో బిందు కూడా ఒకరు. బంగళాను కొన్న వెంటనే రాణా కపూర్ .. దాన్ని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో తనఖా పెట్టి రూ. 685 కోట్లు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బ్లిస్ అబోడ్, అవంత రియల్టీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తమ కార్యాలయాల్లో సోదాల వార్తలను ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తోసిపుచ్చింది. అస్థిరతల కట్టడికి చర్యలు: సెబీ న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు సెబీ, కేంద్రం చొరవ తీసుకున్నాయి. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సెబీ ప్రకటించింది. తీవ్ర అమ్మకాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 10 శాతం కుప్పకూలడంతో ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో సెబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక మందగమనం, చమురు ధరల పతనంపై ఆందోళనలతో గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా చలిస్తోంది. అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు సెబీ, స్టాక్ ఎక్సేంజ్లు సన్నద్ధంగా ఉన్నాయి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమలకు ఉపశమనం కల్పిస్తాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను ప్రభుత్వం, ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పరిశ్రమలకు ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వంలోని భిన్న శాఖలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ఎదురైన సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రంగాలతో నేను సమావేశం నిర్వహించిన విషయం మీకు తెలుసు. ఆయా పరిశ్రమలు సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తాము ఎంత మేరకు మెరుగ్గా సాయం అందించొచ్చన్న దానిపై ప్రతి శాఖా ఎంతో సమయం వెచ్చిస్తోంది’’ అని మంత్రి వివరించారు. -
రాణా, ఆయన భార్యకు సీబీఐ మరో షాక్
సాక్షి, ముంబై : యస్ బ్యాంకు ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం శరవేగంగా పథకాన్ని అమలు చేయనుండగా, యస్ బ్యాంకు కో ఫౌండర్ రాణా కపూర్కు సీబీఐ మరో షాక్ ఇచ్చింది. రాణా కపూర్, అతని భార్య బిందు, అవంతా రియాల్టీ ప్రమోటర్ గౌతమ్ థాపర్ లపై తాజాగా మరో కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్లిస్ అబోడ్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన ఉన్న బిందుతో పాటు, మిగిలిన వారిపై మనీ లాండరింగ్ చట్టం ప్రకారం నేరపూరిత కుట్ర, మోసం కేసు నమోదు చేసినట్టు సీబీఐ తెలిపింది. ఈ కేసు ఢిల్లీలోని అమృత షెర్గిల్ బంగ్లా ఒప్పందానికి సంబంధించిందనీ, థాపర్ కంపెనీలకు రూ .2,000 కోట్లకు పైగా రుణాలకు సంబంధించి రూ.307 కోట్ల లంచం తీసుకున్నట్టుగా అనుమానాలున్నాయని అధికారులు తెలిపారు. అమృతా షెర్గిల్ మార్గ్లోని 1.2 ఎకరాల బంగ్లాకొనుగోలకు కపూర్కు బ్లిస్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లంచం ముట్టినట్టు చెప్పారు. దీంతో బ్లిస్ అబోడ్ కార్యాలయంతోపాటు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన ఢిల్లీ,ముంబైలో అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ వెల్లడించింది. చదవండి : యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ -
ఆస్తుల అమ్మకానికి రాణా స్కెచ్..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో తమకున్న రూ 1000 కోట్ల విలువైన ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలన్న యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. యస్ బ్యాంక్ కేసులో దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న రాణా కపూర్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న క్రమంలో దేశ రాజధానిలో తన భార్య బిందూ కపూర్ పేరిట ఉన్న మూడు విలాసవంతమైన భవనాలను విక్రయించేందుకు రాణా కపూర్ ప్రయత్నాలు చేశారని తెలిసింది. రూ 4300 కోట్ల అనుమానిత లావాదేవీలు జరిగిన యస్ బ్యాంక్ వ్యవహారంలో బిందూ కపూర్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ప్రైమ్ లొకాలిటీలో 40, అమృత షెర్గిల్ మార్గ్లోని భవంతిని బిందు బ్లిస్ అడోబ్ సంస్థ పేరిట కొనుగోలు చేశారు. బ్లిస్ విల్లా ప్రైవేట్ లిమిడెట్ పేరుతో ఢిల్లీలోనే మరో రెండు ఆస్తులను కొనుగోలు చేశారు. రూ 1000 కోట్ల విలువైన ఈ భవంతులను విక్రయించేందుకు తగిన పార్టీలను అన్వేషించాలని ఢిల్లీలోని కొందరు ప్రాపర్టీ డీలర్లను రాణా కపూర్ సంప్రదించినట్టు సమాచారం. తనపై ఈడీ దర్యాప్తు సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ, ముంబైలోని ఆస్తులను అమ్మి అమెరికా కాకుంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్కు మకాం మార్చాలని రాణా కపూర్ యోచించారని తెలిసింది. దేశాన్ని విడిచేలోగా భారత్లో తనకున్న ఆస్తులను అన్నింటినీ విక్రయించాలన్నది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. మరోవైపు అవంత రియల్టీ యస్ బ్యాంక్కు చెల్లించాల్సిన రుణం బకాయి పడటంతో అదే సంస్థకు చెందిన అమృత షెర్గిల్ మార్గ్లోని విలాసవంతమైన భవనాన్ని బిందు కపూర్ బ్లిస్ అడోబ్ కంపెనీ పేరిట కొనుగోలు చేయడం గమనార్హం. అవంత రియల్టీకి యస్ బ్యాంక్ రూ 500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇక రుణ మొత్తాన్ని రికవర్ చేసేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించని యస్ బ్యాంక్ బ్లిస్ అడోబ్కు కేవలం రూ 380 కోట్లకే కట్టబెట్టింది. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన అమృత షెర్గిల్ మార్గ్లోని ఈ భవంతి విలువ రూ 450 కోట్లు పలుకుతుందని భావిస్తున్నారు.. ఢిల్లీలో రాణా కపూర్కు చెందిన మూడు ఆస్తుల విలువ దాదాపు రూ 1000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆస్తుల విక్రయానికి కపూర్ చేసిన ప్రయత్నాలకు ఈడీ చెక్ పెట్టింది. చదవండి : కో–ఆపరేటివ్లకూ యస్ బ్యాంక్ కష్టాలు -
కస్టమర్లకు యస్ బ్యాంక్ ఊరట
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మంగళవారం కస్టమర్లకు ఊరట కల్పించింది. ఖాతాదారులు నెఫ్ట్తో పాటు ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా చెల్లింపులు చేపట్టవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు బకాయిలను, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొంది. యస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ ఇటీవల రద్దు చేసి, బ్యాంకు నుంచి విత్డ్రాయల్స్కు పరిమితులు విధించిన సంగీతి తెలిసిందే. ఆర్బీఐ నియంత్రణతో ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా ఎస్బీఐ యస్ బ్యాంక్ వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం, క్రమంగా బ్యాంకు లావాదేవీలపై నియంత్రణలను సడలిస్తుండటంతో ఖాతాదారుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.మరోవైపు బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్ ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగించాయి. చదవండి :యస్ బ్యాంక్ స్కామ్పై సీబీ‘ఐ’ -
యస్ బ్యాంక్ స్కామ్పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ కుంభకోణం కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ నుంచి యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబానికి రూ. 600 కోట్లు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలకు సంబంధించి సోమవారం 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ వ్యవహారంలో అయిదు కంపెనీలు, రాణా కపూర్తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు (రోష్ని, రాఖీ, రాధ) సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటరు కపిల్ వాధ్వాన్, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ డైరెక్టర్ ధీరజ్ రాజేష్ కుమార్ వాధ్వాన్లు వీరిలో ఉన్నారు. ఇక, కంపెనీల విషయానికొస్తే.. డీహెచ్ఎఫ్ఎల్, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్, కపూర్ కుటుంబ సారథ్యంలోని డూఇట్ అర్బన్ వెంచర్స్, బిందు కపూర్ డైరెక్టరుగా ఉన్న ఆర్ఏబీ ఎంటర్ప్రైజెస్, రాణా కపూర్ కుమార్తెలు డైరెక్టర్లుగా ఉన్న మోర్గాన్ క్రెడిట్స్ సంస్థలు ఉన్నాయి. ముంబైలోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశం విడిచి వెళ్లిపోకుండా.. వారిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయినట్లు పేర్కొన్నాయి. అటు యస్ బ్యాంక్ జారీ చేసిన భారీ రుణాలు మొండిబాకీలుగా మారడంపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి పెట్టింది. డీహెచ్ఎఫ్ఎల్కి మాత్రమే పరిమితం కాకుండా రుణాలు తీసుకున్న ఇతర కంపెనీల నుంచి కూడా కపూర్ కుటుంబానికి ముడుపులేమైనా వచ్చాయేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. అటు యస్ బ్యాంక్ సీఈవో రవ్నీత్ గిల్ను కూడా ఈడీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిధులు మళ్లించారిలా .. డీహెచ్ఎఫ్ఎల్కు యస్ బ్యాంక్ ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని కపిల్ వాధ్వాన్తో కలిసి రాణా కపూర్ దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 ఏప్రిల్ – జూన్ మధ్యకాలంలో డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన షార్ట్ టర్మ్ డిబెంచర్లలో యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దీంతో పాటు డీహెచ్ఎఫ్ఎల్ గ్రూప్ సంస్థ అయిన ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్కు రూ. 750 కోట్లు రుణం ఇచ్చింది. అయితే, నిర్దేశిత ప్రాజెక్టులో పైసా కూడా పెట్టకుండా ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ మొత్తం రుణం నిధులను డీహెచ్ఎఫ్ఎల్కు బదలాయించింది. యస్ బ్యాంక్ నుంచి రుణం లభించినందుకు ప్రతిగా కపూర్ కుమార్తెలకు చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్లో వాధ్వాన్ దాదాపు రూ. 600 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది ఓ రకంగా కపూర్కు ముడుపులివ్వడమేనన్నది సీబీఐ ఆరోపణ. సుమారు రూ. 97,000 కోట్లు బ్యాంకు రుణాలు తీసుకున్న డీహెచ్ఎఫ్ఎల్ సుమారు రూ.31,000 కోట్ల నిధులు దారి మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల బాండ్లలో రూ. 93,000 కోట్ల పెట్టుబడులు.. దేశీ బ్యాంకులు జారీ చేసిన అదనపు టియర్ 1 బాండ్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 93,669 కోట్లు ఇన్వెస్ట్ చేశారని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. యస్ బ్యాంక్ గానీ దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు బాండ్లను పూర్తిగా రైటాఫ్ చేసిన పక్షంలో ఇన్వెస్టర్లు ఇకపై రిస్కులు తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చని పేర్కొంది. మరోవైపు, యస్ బ్యాంక్ సమస్యకు సత్వర పరిష్కారం అమలు చేయడంతో.. సంక్షోభం బ్యాంకింగ్ రంగం అంతటా విస్తరించకుండా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. ముందే పసిగట్టారా!! యస్ బ్యాంక్ పరిస్థితి నానాటికీ దిగజారుతుండటాన్ని ముందుగానే పసిగట్టినట్లుగా పలువురు ఖాతాదారులు గతేడాది మార్చి–సెప్టెంబర్ మధ్య కాలంలో భారీగా విత్డ్రా చేసుకున్నారు. ఈ వ్యవధిలో ఏకంగా రూ. 18,100 కోట్ల మేర విత్డ్రాయల్ లావాదేవీలు నమోదయ్యాయి. మరోవైపు, డిపాజిట్లపై బీమా పరిమాణాన్ని పెంచిన నేపథ్యంలో తమ సొమ్ముకేమీ కాదని భావిస్తున్నట్లు కొందరు డిపాజిటర్లు తెలిపారు. అటు, మరో రెండు మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. తమ స్కీమ్ల నుంచి యస్ బ్యాంక్ పెట్టుబడులను పక్కకు పెట్టాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్, బరోడా ఎంఎఫ్ వీటిలో ఉన్నాయి. యస్ బ్యాంక్ డెట్ సాధనాలను రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ‘డి’ స్థాయికి కుదించడం ఇందుకు కారణం. ఈ వారంలోనే మారటోరియం ఎత్తేయొచ్చు: అడ్మినిస్ట్రేటర్ కుమార్ పరిస్థితులు చక్కబడితే ఈ వారంలోనే మారటోరియం ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ నియమించిన యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఎస్బీఐ పెట్టుబడుల ప్రణాళికకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర వేస్తే.. యస్ బ్యాంక్ మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటికి రాగలదన్నారు. డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు నిధుల సమీకరణ కూడా తమ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని కుమార్ చెప్పారు. బ్యాంకింగ్ సేవలన్నీ సాధ్యమైనంత త్వరగా పునరుధ్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమ ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కూడా విత్డ్రాయల్ సదుపాయం అందుబాటులోకి తేగలిగినట్లు చెప్పారు. డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను మార్చి 14న ప్రకటిస్తామని కుమార్ తెలిపారు. -
రాణాకపూర్ అక్రమాలు, బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ సంక్షోహంలో ఫౌండర్ రాణా కపూర్ చుట్టూ ఆర్థిక అవకతవకల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనను ఈడీ అదుపులోకి తీసుకోగా మనీలాండరింగ్ కేసులో రాణా కపూర్తో పాటు మరికొందరిపై నమోదైన కేసులపై ఈడీ చర్యలు చేపట్టింది. తాజాగా సీబీఐ కూడాసీరియస్గా స్పందిస్తోంది. ఆయన నిసావాసాల్లో పలుమార్లు సోదాలు నిర్వహిచిన సీబీఐ రాణాకపూర్ కుటుంబంతోపాటు, డీహెచ్ఎఫ్ఎల్ పై కూడా కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ రుణాల విషయంలో రాణాకపూర్ క్విడ్ ప్రోకు పాల్పడినట్టు ఆరోపించింది. రాణా కపూర్ కు రూ. 600కోట్ల లాభం చేకూరిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. తన స్థానాన్ని ఉపయోగించుకుని యస్ బ్యాంకులో భారీ స్కాం పాల్పడ్డాడని పేర్కొంది. ఈ కుంభకోణంలో రాణా కపూర్ కుమార్తెలు రాఖీ, రోషిణి, రాధాలు లబ్ది పొందినట్లు తెలిపింది. అలాగే ఇలాంటివి మరిన్ని ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. రాణా కపూర్ కుటుబం (భార్య బిందు, ముగ్గురు కుమార్తెలు రోషిణి, రాఖీ, రాధా) మొత్తాన్ని సీబీఐ బుక్ చేసింది. అలాగే డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాద్వాన్, ఆర్హెచ్డబ్ల్యు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ధీరజ్ రాజేష్ కుమార్ వాద్వాన్తో పాటు అయిదు కంపెనీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈ రెండు సంస్థలతో పాటు కపూర్ కుటుంబం నియంత్రణలో ఉన్న డాల్ట్ అర్బన్ వెంచర్స్, ఆర్ఏబీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, డిహెచ్ఎఫ్ఎల్తో అనుసంధానమైన సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఏడుగురు నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. కాగా ఈ కంపెనీల్లో బిందు రానా కపూర్ డైరెక్టర్గా ఉన్నారు. మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రాణా కపూర్ కుమార్తెలు డైరెక్టర్లుగా ఉన్నారని సమాచారం. సోమవారం కూడా అధికారిక నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న ఏడు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా ముడుపులు అందాయన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. -
‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన లేఖలను జాతీయ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. తన తండ్రి దివంగత మాజీప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్ను రూ. 2 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ధృవీకరిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా జూన్ 4, 2010 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్కు రాసిన లేఖ తాజాగా వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించి చెక్కు ద్వారా ప్రియాంక గాంధీకి చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కును స్వీకరించినట్లు ఆమె రాణాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన తన తండ్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్ను కొనుగోలుకు రాణా కపూర్ చెల్లింపులు, ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖ రాశారన్న ఆరోపణలు తాజగా సంచలనం రేపుతున్నాయి. ఇండియా టుడే అందించిన వివరాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్రాన్నిరాణాకపూర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.2 కోట్లకు 2010 జూన్ 3వ తేదీన తన పేరిట 134343 నెంబరు చెక్కు స్వీకరించినట్టుగా ప్రియాంక గాంధీ వాద్రా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లావాదేవీకి సంబంధించి కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా, రాణా కపూర్ మధ్య కూడా మధ్య ఉత్తరాలు నడిచినట్టు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ విమర్శలకు కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ, తాజా నివేదికలపై అధికారికంగా స్పందించాల్సి వుంది. (చదవండి : యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట) మరోవైపు రాణా కపూర్, ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేసిన పెయింటింగ్కు సంబంధించిన అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద 40 ప్రఖ్యాత పెయింటింగ్లు ఉన్నాయని తెలిపారు. అలాగే పోర్ట్రెయిట్లను కొనుగోలు చేసేటప్పుడు, వాల్యుయేషన్ కోసం నిపుణుల నుండి ధృవీకరణ పత్రాలను పొందుతాడు. కానీ రాజీవ్గాంధీ పెయింటింగ్కు సంబంధించి అలాంటి సర్టిఫికేట్ ఏదీ పొందలేని వ్యాఖ్యానించారు. అలాగే పెయింటింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తి, ప్రియాంక గాంధీ వాద్రాది కాదని ఈడీ వర్గాలు పేర్కొడం గమనార్హం. -
కోవిడ్ పరిణామాలే నడిపిస్తాయ్..
న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడమా లేదంటే.. మరింత పతనం కావడమా అనే కీలక అంశం ఆధారపడి ఉందని దలాల్ స్ట్రీట్ పండితులు విశ్లేషిస్తున్నారు. వైరస్ భయాలతో.. మార్కెట్లో చురుగ్గా పాల్గొనే ఇన్వెస్టర్లు గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాల్యూమ్స్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచ ఎకాన మీపై ఈ మహమ్మారి ప్రభావం ఎంత మేర ఉండనుందనే అంశం ఆధారంగానే ఈ వారంలో సూచీలు కోలుకుంటాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకనుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. యస్ బ్యాంక్ పరిణామాలు కీలకం గతవారంలో యస్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత దెబ్బతింది. కరోనా వైరస్ వ్యాప్తికి తోడు బ్యాంక్పై ఆంక్షలతో సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బ్యాంక్ నిఫ్టీ ఐదు నెలల కనిష్టస్థాయికి పడిపోయింది. ఇక ఈ వారంలో కూడా యస్ బ్యాంక్ పరిణామాలు కీలకంకానున్నాయని జిమీత్ మోడీ అన్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం అరెస్ట్ చేయగా.. ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్పై కనిపించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యస్ బ్యాంక్లో కేవలం వాటాను మాత్రమే కొనుగోలు చేశామని, విలీనం ప్రసక్తి ఇప్పటికి లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ తాజా పరిణామాలు, వైరస్ వ్యాప్తి ఆధారంగా ఈ వారం మార్కెట్ గమనం ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం క్లిష్టతరమేనని షేర్ఖాన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ దువా అన్నారు. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. హోలీ సందర్భంగా మంగళవారం (10న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఆర్థికాంశాల ప్రభావం.. జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం డేటా గురువారం వెల్లడికానున్నాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ నెల్లో రూ. 13,157 కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఈ నెల్లో రూ. 13,157 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–6 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 8,997 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ. 4,160 కోట్లను వెనక్కు తీసుకున్నారు. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని గ్రోవ్ సహ వ్యవస్థాపకులు హర్‡్ష జైన్ విశ్లేషించారు. -
యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్!!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై వ్యవస్థాపకుడు రాణా కపూర్ను (62) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. మార్చి 11 దాకా ఆయన్ను ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెడితే .. యస్ బ్యాంక్లో ఆర్థిక అవకతవకలు, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్)కు రుణాలిచ్చినందుకు ప్రతిగా దాదాపు రూ. 600 కోట్ల ముడుపులు అందుకున్నారని కూడా రాణా కపూర్పై ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన్ను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదనే కారణంతో ఆదివారం ఉదయం సుమారు 3 గం.ల ప్రాంతంలో కపూర్ను అదుపులోకి తీసుకుంది. న్యాయస్థానంలో హాజరుపర్చగా ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవహారాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా లాంఛనంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్కామ్ సంబంధ పత్రాలను అధికారులు సేకరిస్తున్నట్లు వివరించాయి. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి కోణాల్లో దర్యాప్తుపై సీబీఐ దృష్టి పెట్టినట్లు సమాచారం. మొండి బాకీలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలతో కుదేలైన యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే 30 రోజుల పాటు రూ. 50,000కు మించి విత్డ్రాయల్స్ జరపడానికి లేకుండా మారటోరియం కూడా విధించింది. దీనితో ఆ బ్యాంకు జారీ చేసిన ఫారెక్స్ కార్డులు పనిచేయక, వాటిని తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్బీఐ తప్పుడు విశ్లేషణలు చూసి కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ మరోసారి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని బ్యాంకులను సునిశితంగా పరిశీలిస్తూనే ఉన్నామని, డిపాజిట్ల భద్రతకు ఢోకా ఉండదని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆర్బీఐ ట్వీట్ చేసింది. మార్కెట్ క్యాప్ ఆధారంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఉండదని తెలిపింది. అటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కూడా డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. బ్యాంకుల్లో సొమ్ము భద్రతను అంచనా వేసేందుకు వాటి మార్కెట్ క్యాప్ సరైన కొలమానం కాదని స్పష్టం చేశారు. మాకు రూ. 662 కోట్లు రావాలి: ఇండియాబుల్స్ హౌసింగ్ యస్ బ్యాంక్ నుంచి తమకు రూ. 662 కోట్లు రావాల్సి ఉందని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. బ్యాంక్ బాండ్లలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశామని, టర్మ్ లోన్ల రూపంలో బకాయిలేమీ లేవని పేర్కొంది. బ్యాంకు విలువ 10 బిలియన్ డాలర్ల పైగా ఉన్నప్పుడు.. 2017లో అదనపు టియర్ 1 (ఏటీ–1) బాండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. డొల్ల కంపెనీలతో ముడుపుల మళ్లింపు... రుణాల మంజూరుకు ప్రతిగా లభించిన ముడుపులను డజను పైగా డొల్ల కంపెనీల ద్వారా రాణా కపూర్ కుటుంబం దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు, అత్యంత ఖరీదైన 44 పెయింటింగ్స్.. వాటి వెనుక ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూపీ లాగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ వర్గాల కథనం ప్రకారం .. డీహెచ్ఎఫ్ఎల్ డిబెంచర్లలో యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ క్రమంలో కపూర్ కుటుంబానికి చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్ అనే సంస్థలోకి డీహెచ్ఎఫ్ఎల్ నుంచి దాదాపు రూ. 600 కోట్లు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్కు రుణాలిచ్చినందుకు గాను కపూర్ కుటుంబానికి ఇవి ముడుపుల రూపంలో లభించి ఉంటాయని అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటినీ ధృవీకరించుకోవడానికి కపూర్ కుటుంబ సభ్యులను కూడా విచారణ చేయాల్సి ఉందంటూ న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్ అయినప్పటికీ.. రుణాలను రాబట్టుకోవడానికి యస్ బ్యాంక్ చర్యలూ తీసుకోకపోవడం అనుమానాలకు ఊతమిస్తోందని పేర్కొంది. అయితే, తాము విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని.. కావాలనే కపూర్ను టార్గెట్ చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. డూఇట్ కంపెనీ తన ఇద్దరు కుమార్తెల పేరు మీద ఉందని కపూర్ తెలిపారు. డీహెచ్ఎఫ్ఎల్కు ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నప్పుడు యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు రుణమిచ్చిందని, ఆ తర్వాత దాన్నుంచి డూఇట్ కంపెనీ రూ. 600 కోట్లు రుణం రూపంలో తీసుకుందని వివరించారు. ఇప్పటికీ డూఇట్ సంస్థ రుణాలను చెల్లిస్తూనే ఉందని, డిఫాల్ట్ కాలేదని చెప్పారు. -
రాణా కపూర్ కుమార్తెకు షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటున్న బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ కుమార్తె రోష్ని కపూర్ లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబై విమానాశ్రయంలో అధికారులు అడ్డగించారు. ఈ కేసులో రోష్ని కపూర్ సహా రాణా కపూర్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా లుక్అవుట్ నోటీస్ జారీ అయిన నేపథ్యంలో ఆమెను విమానాశ్రయంలో అధికారులు దేశం విడిచివెళ్లకుండా నిలువరించారు. ఈ కేసులో ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ అయిన రాణా కపూర్ను మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి ముంబై కోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబైలోని కపూర్, ఆయన కుమార్తెల నివాసాలపై ఈడీ దాడుల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. దివాలా తీసిన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం డీహెచ్ఎఫ్ఎల్ సహా పలు కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా రాణా కపూర్ ప్రోద్బలంతో పెద్దమొత్తంలో రుణాలు జారీ అయ్యాయని, అందుకు ప్రతిగా ఆయా కంపెనీల నుంచి రూ కోట్లు ముడుపులు కపూర్కు ముట్టాయని వెల్లడైంది. ఈ ముడుపులు స్వీకరించేందుకు కపూర్, ఆయన కుటుంబ సభ్యులు 20కిపైగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని ఈడీ గుర్తించింది. చదవండి : ఈడీ కస్టడీకి రాణా కపూర్ -
ముడుపుల కోసం షెల్ కంపెనీలు..
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ వ్యవహారంలో బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందిన కంపెనీల నుంచి ముడుపులు పొందేందుకు రాణా కపూర్తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు 20 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఈడీ గుర్తించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఆదివారం రాణా కపూర్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. కపూర్ అరెస్ట్తో ఆయన అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. దివాలా తీసిన హౌసింగ్ ఫైనాన్స్కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్కు యస్ బ్యాంక్ రూ 3700 కోట్లు రుణం ఇవ్వగా ఈ మొత్తం అంతా నిరర్ధక ఆస్తులుగా మారింది. ఇంత మొత్తం రుణం పొందిన డీహెచ్ఎఫ్ఎల్ కపూర్ కుటుంబానికి రూ 600 కోట్లు ముట్టచెప్పింది. డీహెచ్ఎఫ్ఎల్ తరహాలో యస్ బ్యాంక్ నుంచి అక్రమంగా రుణాలు పొందిన కార్పొరేట్ సంస్థలు కపూర్ కుటుంబానికి చెందిన షెల్ కంపెనీల్లోకి ముడుపులను తరలించాయి. అక్రమ మార్గాల్లో నిధులు స్వీకరించిన కపూర్ కుటుంబం రూ 2000 కోట్ల వరకూ వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ఈ ఆస్తుల విలువ రూ 5000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బ్రిటన్లోనూ కపూర్ కుటుంబం రెండు ఆస్తులను కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. మరోవైపు యస్ బ్యాంక్ వ్యవహారంపై సీబీఐ సైతం దర్యాప్తును చేపట్టింది. ఈడీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐతో సీబీఐ ఈ దిశగా సంప్రదింపులు చేపట్టింది. చదవండి : ఈడీ కస్టడీకి రాణా కపూర్ -
ఈడీ కస్టడీకి రాణా కపూర్
ముంబై : యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ను మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి ముంబై కోర్టు అప్పగించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్ మాజీ చీఫ్ రాణా కపూర్ను దాదాపు 30 గంటల ఇంటరాగేషన్ అనంతరం ఆదివారం తెల్లవారుజామున ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అధికారులు శనివారం రాణా కపూర్ను మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆదివారం కపూర్ భార్యను సైతం ఈడీ కార్యాలయానికి రప్పించిన అధికారులు ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించారు. ముంబైలోని వొర్లి ప్రాంతంలో కపూర్ నివాసం సముద్ర మహల్లోనూ ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. కపూర్ నేతృత్వంలో యస్ బ్యాంక్ పెద్ద మొత్తంలో డీహెచ్ఎఫ్ఎల్కు జారీ చేసిన రుణాలు నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మారాయని ఈడీ ఆరోపిస్తోంది. కాగా యస్ బ్యాంక్ ఖాతాదారులకు ఊరటగా కస్టమర్లు తమ డెబిట్ కార్డును ఉపయోగించి ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చని యస్ బ్యాంక్ ట్వీట్ చేసింది. మరోవైపు సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్లో ఎస్బీఐ 49 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. యస్ బ్యాంక్ ఉద్దీపన ప్రణాళిక కింద ఎస్బీఐ తన నివేదికను సోమవారం ఆర్బీఐకి సమర్పించనుంది చదవండి : ఎస్బీఐలో యస్బ్యాంక్ విలీనం కాదు: రజనీష్. -
యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రానాకపూర్ అరెస్ట్
-
‘యస్’ సంక్షోభం: రాణా కపూర్ ఇంట్లో సోదాలు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మాజీ సీఎండీ రాణా కపూర్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా ముంబై వర్లిలోని ఆయన ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. రాణాకపూర్ దేశం విడిచిపోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. కాగా 2015లో 80 నకిలీ సంస్థలకు రూ. 12,733 కోట్లు నిధులను మళ్లించినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. అలాగే దివాలా కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ (దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) కు భారీ ఎత్తున నిధులను మళ్లించబడినట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. దీనికి బదులుగా భారీ ఎత్తున నగదు రాణా కపూర్ భార్య ఖాతాలో జమ అయ్యాయి. ఈ రుణాల స్వభావాన్ని, వాటి మంజూరులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారిస్తున్నట్టు చెప్పారు. యస్ బ్యాంకు సంక్షోభంపై ఆర్బీఐ రంగంలోకి దిగిన అనంతరం ఈడీ విచారణను వేగంతం చేసింది. మరోవైపు యస్బ్యాంకును స్వాధీనంలోకి చేసుకున్న ఆర్బీఐ 30 రోజులపాటు మారటోరియం విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసింది. అలాగే పునర్మిర్మాణ ప్రణాళికలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రాణా కపూర్ నివాసంలో ఈడీ సోదాలు
ముంబై: మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ నివాసంలో (ముంబై) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలం తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని అవకతవకలపైనా ఈడీ విచారణ జరుపుతోంది. -
యస్ పరిణామాలపై మాజీ ఎండీ స్పందన
ప్రస్తుతం యస్ బ్యాంక్లో జరుగుతున్న పరిణామాలు తనకు తెలియదని యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రానా కపూర్ తెలిపారు. రానా కపూర్ మాట్లాడుతూ..యస్ బ్యాంక్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిషేదం విధించడానికి గల కారణాలు తనకు తెలియదని అన్నారు. గత 13 నెలలుగా తాను బ్యాంక్ వ్యవహారాలతో దూరంగా ఉన్నానని అన్నారు. గతంలో యస్ బ్యాంక్కు ఎండీగా సేవలు అందించానని.. 2019లో తన వాటాను ప్రయివేటు రుణదాతలకు విక్రయించానని కపూర్ తెలిపారు. యెస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్ కూడా అదే సమయంలో తమ వాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. గతంలో ఎస్ బ్యాంక్కు రూ.3.4 లక్షల కోట్ల లాభాలను అర్జించడానికి కపూర్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. చదవండి: యస్లో పరిస్థితులు బాలేవు -
యస్ బ్యాంక్లో కపూర్
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్లో ప్రమోటర్ సంస్థ, మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎమ్సీపీఎల్) 2.3 శాతం వాటాకు సమానమైన 5.8 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.58.1 ధరకు విక్రయించింది. వీటి విలువ రూ.334 కోట్లు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్(ఆర్నామ్) ఎన్సీడీలకు ముందుగానే చెల్లింపులు జరపడానికి, మరోవైపు ఆర్బీఐ నిబంధనల ప్రకారం యస్బ్యాంక్లో ప్రమోటర్ల వాటా తగ్గించుకునే క్రమంలో భాగంగా మోర్గాన్ క్రెడిట్స్ ఈ షేర్లను విక్రయించింది. యస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్కు చెందిన ముగ్గురు కూతుళ్లు ఈ ఎమ్సీపీఎల్ను నిర్వహిస్తున్నారు. ఈ వాటా విక్రయంతో రాణా కపూర్ కుటుంబం వాటా యస్ బ్యాంక్లో 7.4 శాతానికి తగ్గుతుంది. యస్ బ్యాంక్ 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెట్టిందని, గత 15 ఏళ్లలో మంచి వృద్ధిని సాధించామని రాణా తెలిపారు. మోర్గాన్ క్రెడిట్స్ కంపెనీ 2018 ఏప్రిల్లో ఆర్నామ్)కి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ)జారీ చేసి రూ.1,160 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లు 2021, ఏప్రిల్లో మెచ్యూర్ అవుతాయి. ఈ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను స్టార్టప్ బిజినెస్ల కోసం మోర్గాన్ క్రెడిట్స్ వినియోగించింది. ఈ బాండ్లకు సంబంధించి ముందస్తుగా చెల్లించాల్సిన(వడ్డీతో కలుపుకొని) మొత్తం ఇప్పటిదాకా రూ.722 కోట్లుగా ఉంది. యస్బ్యాంక్లో విక్రయించిన వాటా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్నామ్ ఎన్సీడీలకు చెల్లింపులు జరపడానికి మోర్గాన్ క్రెడిట్స్ ఉపయోగించనున్నది. -
పేటీఎమ్ ‘యస్’ డీల్!
న్యూఢిల్లీ/ముంబై: యస్ బ్యాంక్లో కొంత వాటాను డిజిటల్ చెల్లింపుల దిగ్గజ సంస్థ, పేటీఎమ్ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్, ఆయనకు సంబంధించిన సంస్థలకు యస్బ్యాంక్లో 9.6 శాతం మేర వాటా ఉంది. ఈ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి పేటీఎమ్ యాజమాన్య సంస్థ, వన్97 కమ్యూనికేషన్స్ చర్చలు జరుపుతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆర్బీఐ ఆమోదాన్ని బట్టి ఒప్పందం స్వరూపం ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేటీఎమ్ వ్యవస్థాపకులు విజయ్ శేఖర శర్మకు ఇప్పటికే పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్లో వాటా ఉండటంతో ఆర్బీఐ ఆమోదాన్ని బట్టి డీల్ స్వరూపం ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. ప్రస్తుతానికైతే, సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక బ్యాంక్లో 5 శాతం మేర ఇన్వెస్ట్ చేయవచ్చు. కాగా ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి పేటీఎమ్, యస్బ్యాంక్లు నిరాకరించగా, రాణా కపూర్ అందుబాటులో లేరు. యస్ బ్యాంక్ ఇటీవలనే క్యూఐపీ(క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్) ద్వారా రూ.1,930 కోట్ల నిధులు సమీకరించింది. మరిన్ని పెట్టుబడులు సమీకరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో యస్ బ్యాంక్కు రూ.1,507 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బ్యాంక్ చరిత్రలో ఇవే అత్యధిక నష్టాలు. మొండిబకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.114 కోట్ల నికర లాభం సాధించింది. టెక్ కంపెనీకి వాటా యస్ బ్యాంక్లో మైనారిటీ వాటా విక్రయాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థకు విక్రయించే ఒప్పందం దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ డీల్లో భాగంగా 10 శాతం కంటే తక్కువ వాటాను ప్రపంచంలోనే టాప్ త్రీ టెక్నాలజీ కంపెనీల్లో ఒకదానికి విక్రయించనున్నామని యస్ బ్యాంక్ సీఈఓ, ఎమ్డీ రవ్నీత్ గిల్ పేర్కొన్నారు. ఆ సంస్థ ఇంతవరకూ భారత్లోని ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయలేదని కూడా ఆయన తెలిపారు. సంస్థ పేరును ఆయన వెల్లడించలేదు. ఈ టెక్నాలజీ కంపెనీ పెట్టుబడుల వల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ సంస్థతో పాటు మరో రెండు మూడు సంస్థలు 20 కోట్ల డాలర్ల నుంచి 25 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు. యస్ బ్యాంక్ షేర్ సోమవారం బీఎస్ఈలో 4.5 శాతం లాభపడి రూ.63.10 వద్ద ముగిసింది. పేటీఎమ్ నష్టాలు రూ.4,217 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్ నష్టాలు భారీగా పెరిగాయి. 2019, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పేటీఎమ్ నష్టాలు 193 శాతం ఎగసి రూ.4,217 కోట్లకు పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.1.604 కోట్లుగా ఉన్నాయి. ఇక ఆదాయం రూ.3,052 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,232 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.4,864 కోట్ల నుంచి 60 శాతం ఎగసి రూ.7,730 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు పంపిన వార్షిక నివేదికలో ఈ వివరాలను పేటీఎమ్ వెల్లడించింది. కాగా ఈ వివరాలకు సంబంధించిన కాపీని పేటీఎమ్ ఇంకా కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించలేదు. వ్యాపార విస్తరణ కోసం గత రెండేళ్లలో రూ.14,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, రానున్న రెండేళ్లలో రూ.21,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని ఇటీవలే పేటీఎమ్ వెల్లడించింది. -
యస్ బ్యాంక్ మాజీ బాస్ బోనస్ వెనక్కి
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు మాజీ ఎండీ రాణా కపూర్కు చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. బోనస్ కింద 2014–15లో రూ. 62.17 లక్షలు, 2015–16లో చెల్లించిన రూ. 82.45 లక్షల మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు వెనక్కి తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు గాను కపూర్కు బోనస్లేమీ చెల్లించలేదని పేర్కొంది. 2004లో ప్రారంభమైన యస్ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో కపూర్ కూడా ఒకరు. ఆయనకు ఇప్పటికీ బ్యాంకులో 4.32 శాతం వాటా కూడా ఉంది. నిబంధనల అమలుపరమైన వివాదాల కారణంగా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు ఆర్బీఐ నిరాకరించడంతో ఆయన వైదొలగాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రూ. 6 కోట్ల వార్షిక ప్యాకేజీతో రవ్నీత్ గిల్ నియమితులయ్యారు. ముందు జాగ్రత్త చర్య.. మరోవైపు, బ్యాంకు బోర్డులో రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీని అదనపు డైరెక్టరుగా ఆర్బీఐ నియమించడం ముందుజాగ్రత్త చర్యగా అనలిస్టులు అభిప్రాయపడ్డారు. గతంలో ధన్లక్ష్మి బ్యాŠంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ల్లో కూడా ఆర్బీఐ అదనపు డైరెక్టర్లను నియమించిన సంగతి గుర్తు చేశారు. ఈ రెండింటి పరిస్థితి దారుణంగా ఉండేదని, వీటితో పోలిస్తే చాలా పెద్ద సంస్థ అయిన యస్ బ్యాంక్ విఫలమైన పక్షంలో మరిన్ని ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగానే ఆర్బీఐ వ్యవహరించి ఉంటుందని మెక్వారీ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. అటు గాంధీ నియామకం సానుకూల, నిర్మాణాత్మక చర్య గా యస్ బ్యాంక్ అభివర్ణించింది. పటిష్టమైన యస్ బ్యాంక్కు ఆర్బీఐ పూర్తి స్థాయిలో తోడ్పాడు అందిస్తోందని పేర్కొంది. గాంధీ నియామకం వల్ల కార్యకలాపాలకేమీ ఆటంకాలు ఉండబోవని తెలిపింది. -
యస్ బ్యాంక్ ఎండీగా రవ్నీత్ గిల్ బాధ్యతలు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రవ్నీత్ గిల్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బ్యాంక్ సహ–వ్యవస్థాపకుడు రాణా కపూర్ స్థానంలో ఆయన నియమితులైన సంగతి తెలిసిందే. గిల్ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ఇప్పటిదాకా జర్మనీ బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భారత విభాగానికి గిల్ సారథ్యం వహించారు. నిర్దిష్ట కారణాలు బహిరంగంగా వెల్లడించనప్పటికీ .. రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించడానికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోవడంతో కొత్త ఎండీ నియామకం తప్పనిసరైన సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్ దాకా కపూర్ పదవీకాలాన్ని పొడిగించాలంటూ యస్ బ్యాంక్ కోరినప్పటికీ ఆర్బీఐ నిరాకరించింది. యస్ బ్యాంక్లో గవర్నెన్స్, నిబంధనల అమలుపరమైన లోపాల ఆరోపణలే రాణా కపూర్ ఉద్వాసనకు కారణమై ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక, తాత్కాలిక ఎండీగా ఇప్పటిదాకా విధులు నిర్వర్తించిన నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్.. ఇకపై అదే హోదాలో కొనసాగుతారు. పార్ట్ టైమ్ చైర్మన్ బ్రహ్మదత్, స్వతంత్ర డైరెక్టరు ముకేష్ సబర్వాల్, నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సుభాష్ చందర్ కాలియా, స్వతంత్ర డైరెక్టర్ ప్రతిమా షోరే.. బోర్డు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు అదనంగా నలుగురు స్వతంత్ర డైరెక్టర్లు బోర్డులో ఉంటారు. ఎండీ, సీఈవోగా గిల్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 2.68 శాతం పెరిగి రూ. 237.40 వద్ద క్లోజయ్యింది. -
‘యస్’ బాస్.. రవ్నీత్ సింగ్ గిల్!
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా రవ్నీత్ సింగ్ గిల్ నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ నెల 31తో పదవీ కాలం పూర్తవుతున్న రాణా కపూర్ స్థానంలో రవ్నీత్ సింగ్ గిల్ రానున్నారు. ప్రస్తుతం ఆయన డాయిష్ బ్యాంక్ ఇండియా అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవ్నీత్ సింగ్ గిల్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపిందని, మార్చి 1వ తేదీకి ముందే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని యస్ బ్యాంక్ తెలిపింది. 29న బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం జరుగుతుందని పేర్కొంది. 28 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం... 2012, ఆగస్టు నుంచి రవ్నీత్ సింగ్ గిల్ డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు దాదాపు 28 ఏళ్ల అపారమైన అనుభం ఉంది. యస్ బ్యాంక్ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్ను సీఈఓ, ఎమ్డీ పదవి నుంచి వైదొలగాలని గత ఏడాది సెప్టెంబర్లోనే ఆర్బీఐ ఆదేశించింది. కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించాలన్న బోర్డ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనికి గల కారణాలను ఆర్బీఐ వెల్లడించకపోయినప్పటికీ, కపూర్ హయాంలో మొండి బకాయిల విషయంలో అవకతవకలు జరిగాయని అందుకే ఆర్బీఐ ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర మూడింట రెండొంతులకు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో యస్బ్యాంక్ సీఈఓ విషయమై అనిశ్చితి తొలగిపోవడంతో యస్ బ్యాంక్ షేర్ జోరుగా పెరిగింది. బీఎస్ఈలో 8% లాభంతో రూ.214 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 19% ఎగసి రూ.235ను తాకింది. షేర్ జోరు కారణంగా యస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒకేరోజు రూ.3,839 కోట్లు పెరిగి రూ.49,460 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్... యస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 7 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,077 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,002 కోట్లకు తగ్గిందని యస్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం 7 శాతం ఎగసి రూ.3,557 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ప్రస్తుత సీఈఓ రాణా కపూర్ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 41 శాతం పెరిగి రూ.2,666 కోట్లకు చేరింది. 42 శాతం వృద్ధితో రుణాలు రూ.2,43,885 కోట్లకు, డిపాజిట్లు 30 శాతం వృద్ధి చెంది రూ.2.22,758 కోట్లకు చేరాయి. గత క్యూ3లో 3.5 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 3.3 శాతానికి తగ్గిందని వెల్లడించారు. తగ్గిన రుణ నాణ్యత.. యస్ బ్యాంక్ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ3లో 1.72%గా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ3లో 2.1 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 0.93% నుంచి 1.18%కి చేరాయి. తప్పని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సెగ ! ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఒక మౌలిక రంగ దిగ్గజ గ్రూప్ కంపెనీలకు(ఐఎల్అండ్ఎఫ్ఎస్గా అంచనా) రూ.571 కోట్ల మేర రుణాలిచ్చామని, అందుకని నికర కేటాయింపులు రూ.550 కోట్లకు పెరిగాయని రాణా కపూర్ పేర్కొన్నారు. -
యస్ బ్యాంక్ చీఫ్ పదవికి షార్ట్లిస్ట్ సిద్ధం
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ ఈ నెలాఖరులో తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో నియమించే అవకాశం ఉన్న అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో అభ్యర్థుల పేర్లను ఖ రారు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది. కొత్త సీఈవో, ఎండీ నియామకానికి గురువారం ఆర్బీఐ ఆమోదం కోరనున్నట్లు వివరించింది. అయితే, షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. రాణా సారథ్యంలో యస్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఆయన్ను మరో దఫా ఎండీ, సీఈవోగా కొనసాగించడానికి రిజర్వ్ బ్యాంక్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 31తో ఆయన తప్పుకోవాల్సి వస్తోంది. -
రాణాకు నో చెప్పిన ఆర్బీఐ
సాక్షి,ముంబై: సీఎండీ నియామకం అంశంలో ప్రయివేటురంగ బ్యాంకు ఎస్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి తన నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. తాను ముందు ఆదేశించినట్టుగానే సీఈవో, ఎండీగా రాణా కపూర్ పదవి నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1నాటికి బ్యాంకు కొత్త సీఎండీ నియామాకం చేపట్టాలని పేర్కొంది. ఆర్బీఐ మరోసారి తన నిర్ణయాన్ని దృఢంగా ప్రకటించడంతో బ్యాంకు సీఎండీ మరింత కాలం కొనసాగాలని భావించిన రాణా కపూర్కు ఎదురుదెబ్బ తప్పలేదు. బ్యాంకు ఉన్నతాధికారిగా కపూర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల పాటు పొడిగించాలని గతంలోనే వాటాదారులు కోరినప్పటికి ఆర్బీఐ ఆర్బీఐ నిరాకరించింది. 2019, జనవరి 31నాటికి కొత్త సీఎండీని ఎంపిక చేయాలని సెప్టెంబరు24న ఆదేశించింది. అయితే రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని , ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి మరింత సమయం కావాలని ఆర్బీఐని ఎస్బ్యాంకు కోరింది. అలాగే కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. తాజాగా ఈ అభ్యర్థనను కూడా ఆర్బిఐ తిరస్కరించింది. -
ఈ షేర్లు వజ్రాల్లాంటివి
ముంబై: యస్ బ్యాంక్ షేర్లు వజ్రాల్లాంటివని ఆ బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. యస్ బ్యాంక్లో తనకున్న వాటాను విక్రయించబోనని స్పష్టంచేశారు. ఎండీ, సీఈఓగా ఈ బ్యాంక్ నుంచి వైదొలిగినప్పటికీ, ఎప్పటికీ, ఈ షేర్లను అమ్మే ప్రశ్నే లేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ షేర్లు అమూల్యం... రాణా కపూర్ పదవీ కాలాన్ని ఆర్బీఐ కుదించిన నేపథ్యంలో గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో యస్బ్యాంక్ షేర్ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ‘‘యస్ బ్యాంకులో ప్రమోటర్గా నాకున్న షేర్లు అమూల్యమైనవి. నా వాటాను నా ముగ్గురు కుమార్తెలకూ అందజేస్తా.ఈ షేర్లలో ఏ ఒక్క షేర్నూ విక్రయించకూడదని వీలునామాలో నా కుమార్తెలను కోరుతా’’ అని వివరించారు. కాగా ప్రమోటర్లలో ఒకరైన దివంగత అశోక్ కపూర్ భార్య మధు కపూర్ 0.04 శాతం వాటాకు సమానమైన ఏడు లక్షల షేర్లను విక్రయించారు. ఈ నెల 21న ఓపెన్ మార్కెట్ వ్యవహారాల ద్వారా ఈ షేర్లను అమె అమ్మే శారు. ఈ వాటా విక్రయం కారణంగా మధు కపూర్ వాటా 9.28 శాతానికి తగ్గింది. మరోవైపు రాణా కపూర్ వాటా 10.66 శాతంగా ఉంది. -
కపూర్ పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించండి
ముంబై: యస్ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని ఆర్బీఐని కోరాలని యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. మంగళవారం జరిగిన కంపెనీ కీలకమైన బోర్డ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు వెల్లడించింది. మరోవైపు కపూర్ వారసుడి ఎంపిక కోసం సెర్చ్, సెలక్షన్ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్ నియమించింది. దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికలో భాగంగా సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్స్, రజత్ మోంగా, ప్రలయ్ మండల్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించాలని కూడా బోర్డ్ నిర్ణయం తీసుకుంది. రాణా కపూర్ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకూ కుదిస్తూ ఆర్బీఐ ఇటీవలే ఆదేశాలిచ్చింది. షెడ్యూల్ ప్రకారమైతే, ఆయన పదవీ కాలం 2021, సెప్టెంబర్ వరకూ ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని కుదించడానికి గల కారణాలను ఆర్బీఐ వెల్లడించింది. కాగా యస్ బ్యాంక్ను 2004లో స్థాపించినప్పటి నుంచి రాణా కపూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నారని, ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయడానికి చాలా సమయం పడుతుందని యస్ బ్యాంక్ పేర్కొంది. -
ఘోరంగా పడిపోయిన యస్ బ్యాంక్ షేరు
ముంబై : ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ నేటి ట్రేడింగ్లో భారీగా పడిపోయింది. దలాల్ స్ట్రీట్లో ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే యస్ బ్యాంక్ షేరు 30 శాతానికి పైగా కుప్పకూలింది. 2008 జనవరి తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. బ్యాంక్ సీఈవో, ఎండీ రానా కపూర్ పదవీ కాలాన్ని కుదించి, ఆయన్ని 2019 జనవరి వరకు తన పదవి నుంచి దిగిపోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించడం షేరును అతలాకుతలం చేసింది. 2004లో బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా కపూరే ఉన్నారు. మూడేళ్ల పాటు అంటే 2021 ఆగస్టు 31 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని బ్యాంక్ షేర్ హోల్డర్స్ కోరారు. అయితే ఆ అభ్యర్థనను రెగ్యులేటర్ కొట్టివేసింది. 2019 జనవరి వరకు కపూర్ స్థానంలో బ్యాంక్కు కొత్త సీఈవో, ఎండీ రావాల్సిందేనని తెలిపింది. ఈ ఏడాది జూన్లోనే కపూర్ను మరో మూడేళ్ల పాటు రీ-అపాయింట్మెంట్ చేస్తూ యస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ అంగీకరించారు. అది తుది ఆమోదం కోసం ఆర్బీఐ వద్దకు వెళ్లింది. కానీ ఆర్బీఐ మాత్రం మరో మూడేళ్ల పొడిగింపుపై ససేమీరా అనేసింది. ప్రస్తుతం పదవి కాలం ఆగస్టు 31తో ముగిసింది. తుదుపరి నోటీసులు పంపే వరకు ఆ పదవిలో కపూర్ కొనసాగనున్నారు. కపూర్, 2008లో చనిపోయిన అశోక్ కపూర్లు ఇద్దరూ యస్ బ్యాంక్ వ్యవస్థాపక టీమ్లో సభ్యులు. ప్రమోటర్గా, కపూర్, ఆయన కుటుంబానికి బ్యాంక్లో 10.66 శాతం వాటా ఉంది. కాగా ట్రేడింగ్ ప్రారంభంలోనే 10 శాతం మేర నష్టపోయిన యస్ బ్యాంక్షేరు రూ.287.30గా నమోదైంది. ఆ అనంతరం అర్థగంటకి మరింత కుదేలై రూ.218.10కి చేరింది. నష్టాలను కొంతమేర తగ్గించుకున్న యస్ బ్యాంక్, ప్రస్తుతం 17.48 శాతం నష్టంలో రూ.263.40 వద్ద ట్రేడవుతోంది. -
ఎస్ బ్యాంకు సీఎండీ రాణా కపూర్కు షాక్
సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఎస్బ్యాంకు సీఎండీ రాణా కపూర్కు ఆర్బీఐ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ఆదుశాలు జారీ చేసింది. ఎస్బ్యాంకు మేనేజ్మెంట్ డైరెక్టర్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాణా కపూర్ పదవీకాలం 2019 జనవరితో ముగుస్తుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అంతేకాదు ఈ లోపు కొత్త సీఎండీని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఎస్బ్యాంకుకు సూచించింది. ఈ విషయంలో మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు యస్ బ్యాంక్ బోర్డు వచ్చే వారం సమావేశమవుతుంది. ఆగస్టు 31తో రాణా కపూర్ పదవీకాలం ముగిసింది. అయితే ఎస్ బ్యాంకు ప్రకటించినట్టుగా మూడేళ్లపాటుకాకుండా ఆర్బీఐ ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి చివరి వరకు మాత్రమే బ్యాంకు సీఎండీగా కొనసాగుతారు. సెప్టెంబరు 17న ఆర్బీఐ రాసిన లేఖ ఈ రోజు తమకు చేరిందని ఎస్ బ్యాంకు ధృవీకరించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 25న బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశా నిర్వహించనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా రాణా కపూర్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్బీఐ అనుమతి లభించినట్టు ఎస్ బ్యాంకు ఇటీవల(ఆగస్టు 30, 2018) ప్రకటించింది. తదుపరి నోటీస్ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్ను సీఈవో, ఎండీగా కొనసాగుతారని స్టాక్ఎక్చ్సేంజ్లకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు ఈ ఏడాది జూన్లో ఎస్ బ్యాంక్ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రేపటి (గురువారం)మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎలాంటి స్పందిస్తారో చూడాలి. -
బ్యాంకు సీఈవోకు ఎక్స్టెన్షన్ : షేరు ఢమాల్
సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఎస్ బ్యాంకు షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. శుక్రవారం 7శాతం వరకూ నష్టపోయి 8వారాల కనిష్టానికి చేరుకుంది. సీఈవో రాణా కపూర్ పదవిలో కొనసాగేందుకు ఆర్బీఐ ప్రస్తుతానికి అనుమతించినట్లు వార్తలు వెలువడినప్పటికీ ఎస్బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోవడం గమనార్హం. ఆరంభంలోనే 5శాతం నష్టంతో టాప్ విన్నర్గా నిలిచింది. అమ్మకాలు మరింత పెరగడంతో ఎస్బ్యాంకు షేరు 7శాతం వరకూ రూ.338.00ల స్థాయికి పతనమైంది. అనంతరం కొద్దిగా కోలుకుని 6శాతం నష్టాలకు పరిమితమైంది. ముఖ్యంగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా రాణా కపూర్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్బీఐ అనుమతి లభించినట్టు ఎస్ బ్యాంకు తెలిపింది. తదుపరి నోటీస్ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్ను సీఈవో, ఎండీగా కొనసాగనున్నారని గురువారం మార్కెట్ ముగింపు అనంతరం స్టాక్ఎక్చ్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. అయితే విశ్లేషకులు మాత్రం సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్నట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎస్ బ్యాంకు వ్యవస్థాపక సీఈవోగా రాణా కపూర్ 2004 నుంచీ కొనసాగుతున్నారు. సీఈవోగా ఆయన పదవీ కాలం నేటితో(ఆగస్టు 31) ముగియనుంది. ఈ ఏడాది జూన్లో యస్ బ్యాంక్ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. -
బ్రెగ్జిట్ తో ఇండియాకు లాభమేనట..!
ఒక వైపు బ్రెగ్జిట్ వల్ల ప్రపంచ మార్కెట్ల కోటానుకోట్ల సంపద తుడిచిపెట్టుకుపోవడంతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోఉంటుందని విశ్లేషకులు నొక్కి వక్కాణిస్తున్నారు. మరోవైపు ఈ విపత్కర పరిణామం వల్ల భారత దేశానికి వచ్చి ముప్పు ఏమీ లేదని, పైగా ముఖ్యమైన లబ్దిదారుగా అవతరించనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బ్రెగ్జిట్ పరిణామం మూలంగా రాబోయే కాలంలో భారత్ కు అంతా మంచి జరగనుందని ఎస్ బ్యాంక్ సీఈవో రానా కపూర్ వ్యాఖ్యానించారు. చాలా తక్కువ సమయంలోనే మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత ఆర్థిక సంబంధాల్లో ప్రతికూల వెల్లువ ఉంటుందని తెలిపారు తదుపరి ఆరు నెలల్లో అమెరికాలో వడ్డీ రేటు పెంపులో ఆలస్యం కూడా దీనికి మరింత తోడ్పడుతుందన్నారు. ఈ అసమంజసమైన అస్థిరతను ఎదుర్కొనే సత్తామన పాలకులకు ఉందంటూ, ప్రభుత్వం సంస్థాగత ఆర్థిక సంస్కరణలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమ పెట్టుబడులకు ఇండియాను కేంద్రంగా ఎంచుకుంటారని, వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులు భారత్ వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. కనుక ఈ పరిణామం బ్యాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ లాంటిదని సీఈవో కపూర్ శుక్రవారం రాత్రి మీడియాకు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా, ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, భారతదేశం మాత్రం స్థిరంగా నిలబడిందన్నారు. సంస్థాగత, నిర్మాణ చర్యల ద్వారా తన ఆర్థిక సత్తాను చాటుకుందని కపూర్ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో సరళీకరణ, జీఎస్టీ బిల్లు లాంటి కీలక సంస్కరణల్లో ప్రభుత్వం పట్టుదల భారతదేశ అభివృద్ధికి సహాయపడుతుందన్నారు. . అలాగే బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగే అంశం పూర్తిగా ఊహించనిది కాదనీ, ఈ ఆందోళన మొత్తం తదుపరి వారాంతానికి మాయమవుతుందని కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
బీజేపీ విజయంతో సంస్కరణలకు బూస్ట్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించడాన్ని కార్పొరేట్ ఇండియా స్వాగతించింది. రానున్నరోజుల్లో కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో తాజా ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయని పారిశ్రామిక మండళ్లు వ్యాఖ్యానించాయి. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ పైచేయితో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరింత బలపడనుందని... దీనివల్ల వస్తు-సేవల పన్ను(జీఎస్టీ), సబ్సిడీ యంత్రాంగాన్ని మెరుగుపరచడం, కార్మిక చట్టాల్లో సరళీకరణ వంటి కీలక సంస్కరణలకు మోక్షం లభించవచ్చని అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రాజ్యసభలో కూడా బీజేపీ పట్టు పెరిగేందుకు తాజా ఎన్నికల ఫలితాలు తోడ్పడనున్నట్లు తెలిపింది. ఆర్థికపరమైన చట్టాలకు ఆమోదం పొందడానికి ఈ పరి ణామం కీలకంగా మారనుందని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. ఉపాధి కల్పన, వృద్ధి పెంపునకు వీలుగా పారిశ్రామిక రంగంపై కొత్త సర్కారులు దృష్టిపెట్టాల్సి ఉందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శరద్ జైపూరియా వ్యాఖ్యానించారు. -
యస్ బ్యాంక్పై ఎల్అండ్టీ ఫైనాన్స్ కన్ను!
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ను కొనుగోలు చేసేందుకు ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. యస్ బ్యాంకులో ప్రమోటర్లకుగల 25.55% వాటాను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు వీలుగా బ్యాంకు ప్రమోటర్లు రాణా కపూర్, మధు కపూర్లతో ఎల్అండ్టీ ఫైనాన్స్ యాజమాన్యం చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. ఇందుకు అనుమతుల విషయమై రిజర్వ్ బ్యాంక్ను సైతం ఎల్అండ్టీ ఫైనాన్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. యస్ బ్యాంకులో రాణా కపూర్కు 5.5%, మధు కపూర్కు 9.7% చొప్పున వాటా ఉంది. కాగా, బ్యాంకింగ్ లెసైన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎల్అండ్టీ ఫైనాన్స్కు అవకాశం లభించని సంగతి తెలిసిందే.