rangoli
-
రంగుల సైన్స్
-
నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు
అమెరికా(USA)లో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నార్త్ కరోలినా రాష్ట్రం(North Carolina ) లోని కారీలో సాయి మందిరంతో పాటు షార్లెట్లోని శ్రీ సాయి గురుదేవ్ దత్త మందిరంలో రంగోలీ పోటీలు జనవరి 19 ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నాట్స్ కాన్సస్ విభాగం ఈ రంగోలి పోటీలను నిర్వహించింది. నార్త్ కరోలినా లోని తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. తమ సృజనాత్మకతను ప్రదర్శించి.. తెలుగు సంప్రదాయలను ప్రతిబింబించే ఎన్నో ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో అత్యుత్తమంగా ఉన్న నాలుగింటిని ఎంపిక చేసి.. వాటిని వేసిన మహిళలకు నాట్స్ బహుమతులు పంపిణి చేసింది. నాట్స్ కాన్సస్ మహిళా నాయకత్వం ఈ రంగోలి పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాట్స్ అభినందించింది. రంగోలి పోటీలను చక్కగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: డల్లాస్లో "శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్" తరుపున రక్తదానం విజయవంతం) -
మూసాపేటలో ‘సాక్షి’ సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
ముగ్గుల పండుగ : ఏ ముగ్గు వేయాలా అని ఆలోచిస్తున్నారా? (ఫొటోలు)
-
ముగ్గు ఇలా కూడా పెట్టొచ్చా..! జస్ట్ కలర్స్తో..
సంక్రాంతి వచ్చిదంటే గుమ్మాలన్నీ రంగవల్లుల(Rangoli)తో కళకళలాడిపోతుంటాయి. వివిధ రకాల డిజైన్లతో కలర్ఫుల్గా తీర్చిదిద్దుతారు. ఈ పండుగలో ముగ్గులతో హడవిడి, సంబరమే కనిపిస్తుంది. పడుచులంతా చేరి అద్భుతమైన తన కళా నైపుణ్యాన్ని రంగరించిం మరీ తీర్చిదిద్దే పనిలో పడతారు. ఇంత కష్టపడి పెట్టిన ముగ్గు తొక్కకూడదని మగువలు పడే ప్రయాస అంతా ఇంతా కాదు.అయితే కొందరూ బియ్యపిండి, రాతిపిండితోనూ పెడతారు. చక్కగా ముగ్గుని తీర్చిదిద్దాక కలర్స్ వేసి మళ్లీ పై కోటింగ్లా ముగ్గు వేస్తారు. కానీ ఇక్కడొకామె పెట్టిన ముగ్గు చేస్తే నోటి మాట రాదు. అబ్బా చూస్తుండగానే ఎంత ఈజీగా పెట్టేసింది అనుకుంటారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె పెట్టిన ముగ్గు విధానం శతాబ్దల కాలం నాటిది. ఇది వరకు అంతా మట్టి ఇళ్లే ఉండేవి. వాటిని చక్కగా పెడతో అలికి ముగ్గులు పెట్టేవారు. అప్పుడు సున్నంతో ఇంటి చుట్టు గోడలకి అందమైన ముగ్గులను చేతితో భలే జిమ్మే వారు. అవి ఓ మోస్తారు ఆకారంలో సెట్ అయ్యి చూడటానికి భలే అందంగా కనిపించేవి. ఆ విధానంలోనే ఈ మహిళ ముగ్గుపెట్టింది.కాకపోతే దానికి కాస్త ఆధునిక విదానాన్ని జోడించింది. ఆ వీడియోలో మొదట మహిళ ఇంటి గుమ్మ ముందు పెట్టదలచుకున్న కలర్లన్నీ తీసుకుంది. ముందుగా ఓ పెద్ద రౌండ్లో ముగ్గు పొడి పెట్టింది. ఆ తర్వాత లయబద్ధంగా రకరకలా రంగులను ముగ్గు పొడి ఉన్న గుండ్ర భాగానికి నలువైపులా చక్కగా వీటిని సెట్ చేసింది.అంతే నాలుగు భాగాలుగా చేసి ఒక్కోదాన్ని ఒక్కోలా.. ఆకృతిలోకి వాటన్నిటిని నేలపై విరజిమ్మింది అది నెమలీ రెక్కలను విచ్చినట్లుగా చక్కగా రంగులు పరుచుకున్నాయి. అంతే ఆతర్వాత వాటి మధ్యలో ముగ్గుతో కొద్దిపాటి డిజైన్ వేసింది. చూస్తే వాటే ముగ్గు..ఏం పెట్టారబ్బా..అని అనకుండా ఉండలేరు.இந்த பெண்ணின் திறமையை பாருங்க .👌🏻 pic.twitter.com/jCB8vzr1By— Narasimman🇮🇳🕉️🚩 (@Narasim18037507) January 3, 2025 (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!) -
మురిపించే ముగ్గులు..రత్నాల రంగవల్లులు (ఫొటోలు)
-
ముచ్చట గొలిపే ముత్యాల ముగ్గులు.. మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
-
ముగ్గు ఎలా వేయాలి? అందులోని రకాలు..!
ముగ్గు ఎప్పుడు ఎలా పుట్టింది అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ వేదాలలో సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలు చిత్రీకరించినట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతుంటారు చరిత్రకారులు. ముఖ్యంగా శీతాకాలంలో పూజకి, ఆధ్యాత్మికతకు ఈ కాలం నెలవుగా ఉండటం వలన ఈ సమయంలో ముగ్గులు వేయడం ఒక సాంప్రదాయంగా స్థిరపడింది. అందునా ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నెలగంటి ముగ్గులతో కళకళలాడుతూ దర్శనమిస్తాయి. అలాంటి ముత్యాల ముగ్గులను ఎలా పెట్టాలి? పాటించాల్సిన నియమాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గడప, గేటు ముందే(వాకిలి) ముగ్గు వేయాలి. అలాగే ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగువైపు అడ్డగీతలు వేయాలి. ఇలా అడ్డగీతలు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని శాస్త్రం చెబుతుంది. పైగా అలా వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయనే సంకేతాన్ని సూచిస్తుంది కూడా. ముగ్గుల్లో రకాలు..ముగ్గుల్లో రకరకాల డిజైన్లు ఉంటాయి. ముఖ్యంగా పువ్వులు, కొమ్మలు, చతురస్రాకారం, త్రిభుజం, ప్రకృతి, కొండలు, దీపాలు వంటి వివిధ ఆకృతులు ముగ్గుల డిజైన్లలో కనిపిస్తుంటాయి. ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల ముగ్గుల డిజైన్లలో ఎక్కువగా ప్రకృతిలో ఉండే వృక్షాలు, జంతువులూ, పక్షులు, కొండలు ప్రతిబింబిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చుక్కలు, గీతలు, పువ్వులు, మెలికలు... ఇలా ముగ్గుల్లో బోలెడు రకాలు. ద్రవిడులు చుక్కల ముగ్గులేస్తే, ఆర్యులు గీతల ముగ్గులు వేసేవారట. ఈ రెండింటి సమాహారం మన తెలుగు ముగ్గులు. చుక్కల చుట్టూ ముత్యాల్లా వచ్చేవి ముత్యాల ముగ్గులు. రేఖాగణితంలోని కోణాలను తలపించేవి రత్నాల ముగ్గులు. ఇక, ముగ్గులోని డిజైన్లకు ప్రకృతే స్ఫూర్తి... హంసలు, చిలుకలు, నెమళ్లు, శంఖువులు, పువ్వులు, లతలు... ఎన్నో. సంక్రాంతి ముగ్గుల్లో సూర్యచంద్రులు, ధాన్యం, గోవుమాలక్ష్మి, చెరకు గడలు, పాలు పొంగే కుండలు గీస్తారు. ధనుర్మాసంలో వేసే మెలికల పాములు హేమంతంలో కొంకర్లు తిరిగే చలికి సంకేతం. చివరగా సంక్రాంతి ఆఖరి రోజు సూర్యుణ్ణి ఆహ్వానిస్తూ రథం ముగ్గు వేస్తారు. దాన్ని తాడుతో పక్కింటి రథానికి కలపడం అన్నది అందరూ కలిసి ఉండాలన్న సమైక్యతను చాటుతుంది. ముగ్గుల్లో వేసే లతలూ పువ్వులూ జంతువులూ పక్షులూ...ప్రకృతితో కలిసిమెలిసి జీవించాలని బోధిస్తాయి.సందర్భానుసారం వేసే ముగ్గులు..నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు దరిచేరకుండా చూస్తుంది.పద్మం ముగ్గు వేయడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరకుండా అరికడతాయి. కాబట్టి ముగ్గులు తొక్కరాదు.అమ్మవారి పూజ చేసేటప్పుడు.. విగ్రహం పెట్టే పీట మీద ఖచ్చితంగా చిన్న ముగ్గు వేసి.. చుట్టూ రెండు రెండు గీతలు వేయాలి.తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి.. పూజ చేయాలిఆలయాల్లో, అమ్మవారి ముందు, మహావిష్ణువు ముందు ముగ్గులు వేసే స్త్రీలు 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు వేయరాదు. ఎందుకంటే వీటిని తొక్కరాదు కాబట్టి.పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ముగ్గు లేని ఇంట్లో బిక్ష అడిగేవాళ్లు కాదట. ముగ్గు లేదంటే అశుభం జరిగిందని భావించేవాళ్లట(చదవండి: ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!) -
ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!
ఈ ముగ్గుల సంస్కృతి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. కాకపోతే ఒక్కోభాషలో ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో ముగ్గులు అంటాం. కన్నడలో రంగోలి అంటారు. తమిళం-మళయాళంలో కోలం, బెంగాల్లో అల్పన, రాజస్థాన్లో మండన, సంస్కృతంలో మండల వంటి పేర్లుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా.. అందరూ అందంగా తీర్చిదిద్దేది రంగవల్లులే. పండుగలతో సంబంధం లేకుండా ప్రతి తెలుగింటి లోగిళ్లలో తప్పనిసరిగా ముగ్గు వేయడం పరిపాటి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం లేదా సంస్కతిగా చెబుతారు పెద్దలు. అయితే ఇలా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడంలో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో చూద్దామా ఏంటో చూద్దామా..!ముత్యాల ముగ్గులోని శాస్త్రీయ కోణం..ముగ్గులని ప్రాచీన ఖగోళశాస్త్రంగా చెబుతుంటారు. పూర్వం ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేలమీద చిత్రించాడట. అప్పటినుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని నానుడి. జ్యోతిషంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాశుల చిహ్నాలూ ముగ్గుల్లో కనిపిస్తాయి. గృహవాస్తు, ఆలయవాస్తు, నగర నిర్మాణాల్ని తెలిపే రంగవల్లులూ ఉన్నాయంటున్నారు నిపుణులు. వైద్యశాస్త్రం కూడా ఉందట..రంగవల్లిలో కిందికి చూపించే త్రిభుజాలు స్త్రీలనీ, పైకి చూపించే త్రిభుజాలు పురుషులనీ, ఈ రెంటినీ కలపడం ద్వారా గీసిన ఆరు కోణాల నక్షత్రం స్త్రీ, పురుషుల కలయికకు సంకేతమనీ నమ్ముతారు. ముగ్గులోని కలుగపువ్వు గర్భాన్ని సూచిస్తుందట. నేటి కంప్యూటేషనల్ ఆంత్రోపాలజీ పరిశోధనలకీ ముగ్గు ఉపయోగపడుతుంది. ముగ్గుల్లోని గణిత సూత్రాలను అధ్యయనం చేసేందుకు ఆల్గారిథమ్స్ను రూపొందించి, వాటిని బొమ్మలు గీసే కంప్యూటర్ సాఫ్ట్వేర్లోనూ వాడుతున్నారట. అంతేగాదు సంక్లిష్టమైన ప్రొటీన్ నిర్మాణాల్ని అర్థం చేసుకునేందుకూ ఈ ముగ్గులు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.ముగ్గులో గమ్మతైన గణితం..ఈ ముగ్గులో తీరుగా పెట్టే చుక్కలు లెక్కలపట్ల ఆసక్తిని పెంచితే కలపడం వల్ల గణితం తేలికగా అర్థమవుతుందట. ఉదాహరణకు చుక్కలు పెడుతూ సరి, బేసి సంఖ్యలు నేర్చుకోవచ్చు. చుక్కలు...అంక గణితమైతే, వాటిని కలపడం సమితులు. నిజం చెప్పాలంటే ముగ్గులు మేధస్సుకి సవాలుగా నిలుస్తాయి. అంతేగాదు పిల్లల మెదడు వృద్ధి చెందడానికి మొదటి ఏడు సంవత్సరాలూ కీలకం. ఆ సమయంలో వారికి తేలికపాటి ముగ్గులు నేర్పిస్తే వాళ్లలో నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారుఆరోగ్య ప్రయోజనం..ముగ్గు వేయడం అనేది మహిళలకు మంచి వ్యాయామం లాంటిది. వంగి లేవడం కారణంగా.. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని.. అందుకే పెద్దలు రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారని అంటారు.చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్లా ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది. ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుందట. మహిళలకు ఇది శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అంతేగాదు ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారట.శరీరాన్నీ మనస్సునూ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ వేసే ముగ్గు ఏకాగ్రతను పెంచే దివ్యమైన మెడిటేషన్గా చెబుతున్నారు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందట. ఎక్కడో చూసి.. ఎప్పుడో నేర్చిన ముగ్గుల్ని గుర్తుతెచ్చుకుంటూ వేయడంవల్ల ధారణశక్తి మెరుగవుతుందట. దీనివల్లే మహిళలకు ఏకాగ్రత, ఓర్పు అలవడుతాయట.అదీగాక ఉదయాన్నే ముగ్గు వేస్తారు కాబట్టి..స్వచ్ఛమైన గాలిని పీల్చడం జరుగుతుంది. అందువల్ల మహిళలు ఇలా వాకిట ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. అలాగే చాలామంది ముగ్గుగా బియ్య పిండిని ఉపయోగిస్తారు. ఇది పక్షులు పావురాలు, చీమలు, పిచ్చుక, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలందించే రంగవల్లికలను శోభాయమానంగా తీర్చిదిద్దుదాం..ఆరోగ్యంగా ఉందాం. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
‘ఓ సారి చెన్నై వెళ్లినప్పుడు నా స్నేహితుడి ద్వారా నిర్మాత సతీష్ పరిచయం అయ్యాడు. ఆయన తన కుమారుడు హమరేష్ని హీరోగా పెట్టి నిర్మించిన రంగోలి సినిమాను నాకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. సినిమా మొత్తం చూశాక క్లైమాక్స్ బాలేదని చెప్పేశాను. నేను చూసింది రఫ్ వెర్షన్ మాత్రమే. రెండు నెలల తర్వాత మళ్లీ తమిళ్ సినీ పెద్దలతో పాటు నాకు సినిమా చూపించాడు. ఆ తర్వాత స్టేజ్పై మాట్లాడుతూ.. తెలుగులో శివ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడని ఆయనే చెప్పాడు. అప్పటి వరకు నేను ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ సతీష్ నమ్మకంగా చెప్పడంతో.. నేను కూడా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నానని ప్రకటించాను. అలా నేను అనుకోకుండా సత్య సినిమాకు నిర్మాతను అయ్యాను’ అన్నారు జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘రంగోలి’. ఈ చిత్రాన్ని సత్య పేరుతో శివ మల్లాల మే 10న తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగోలి టైటిల్ ఇక్కడ వేరే వాళ్లు బుక్ చేసుకోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘సత్య’పేరుతో రిలీజ్ చేస్తున్నాను. ఆర్జీవీ తెరకెక్కించిన సత్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే సినిమా ప్రమోషన్స్కి కూడా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ చిత్రానికి సత్య అనే టైటిల్ని పెట్టాం. డబ్బింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అచ్చమైన తెలుగు సినిమాలాగే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. క్లైమాక్స్లో మార్పులు చేశాం. తెలుగు ఆడియన్స్కి నచ్చేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమాలో ఫాదర్స్ అండ్ సన్ రిలేషన్షిప్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు కథను విన్నాను. అన్ని కుదిరితే త్వరలోనే మరో సినిమాను నిర్మిస్తాను’ అని శివ మల్లాల అన్నారు. -
సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ? వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం. ముగ్గు ప్రాముఖ్యత.. హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది. ఇది శరీరానికి మంచి ఫిట్నెస్ లాంటిది కూడా.. ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం! పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు. శాస్త్రీయ కారణాలు.. చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు! అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్ఫుల్గా జోయ్ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని. (చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?) . -
Sankranti Muggulu: సంక్రాంతి అందమైన ముగ్గులు (ఫొటోలు)
-
ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?
సీనియర్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కుటుంబం నుంచి ఇప్పుడు మరో హీరో తెరపైకి వస్తున్నారు. ఏఎల్ అళగప్పన్ కుమారులిద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే! విజయ్ దర్శకుడిగా, ఉదయ్ నటుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన మనవడు(కూతురి కుమారుడు) అమరేష్ 'రంగోలి' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'మా నగరం'లో బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ చదువును కొనసాగిస్తున్న అమరేష్ ఇప్పుడు రంగోలి చిత్రం ద్వారా హీరో అవతారం ఎత్తారు. ప్రార్థన కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి సతీష్కుమార్ నిర్మించారు. వాలి మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరుద నాయకం ఛాయాగ్రహణం, కేఎస్ సుందరమూర్తి సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్కుమార్ పాల్గొని ఆడియో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ అలగప్పన్ కుటుంబసభ్యులందరూ పాల్గొనడం విశేషం. పాఠశాల విద్యార్థుల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు వాలి మోహన్దాస్ చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారని దర్శకుడు కే.భాగ్యరాజ్, ఆర్వీ ఉదయకుమార్, ఏఎల్ విజయ్ ప్రశంసించారు. చిత్రం మంచి విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. చదవండి: Trisha : 40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష.. -
రెండ్రోజుల్లో ఫంక్షన్.. మూడు రోజుల్లో పెళ్లి.. సుధా రవికి చెప్పారా? ఆమె ఎవరు?
స్కూల్లో ఇంకో రెండు రోజుల్లో ఫంక్షన్ జరగబోతోంది... ‘సుధా రవికి చెప్పారా?’ అనే ప్రశ్న చెవులకు వినిపిస్తుంది. మూడురోజుల్లో పెళ్లి జరగబోతుంది... ‘సుధా రవికి తెలియజేశారా’ అనే ప్రశ్న ఎదురు వస్తుంది. ఇంతకీ ఎవరీ సుధా రవి? ఒక్కమాటలో చెప్పాలంటే ‘రంగోలి స్పెషలిస్ట్’ ఎవరి రంగోలి ద్వారా శుభకార్యాల వేదికలకు కొత్తకళ వస్తుందో...ఆమె పేరే సుధా రవి. తాజాగా కూతురు రక్షితతో కలిసి రూపొందించిన రంగోలితో ‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయిందామె... సుధా రవి తన కూతురు రక్షితతో కలిసి 26,000 ఐస్క్రీమ్ పుల్లలను ఉపయోగించి రూపొందించిన రంగోలి ఆర్ట్ వర్క్ ‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. సింగపూర్లోని లిటిల్ ఇండియా షాప్కీపర్స్ అండ్ హెరిటేజ్ అసోసియేషన్(లిషా) ఆధ్వర్యంలో జరిగిన పొంగల్ వేడుకల్లో భాగంగా ఈ సిక్స్ బై సిక్స్ మీటర్ ఆర్ట్వర్క్కు శ్రీకారం చుట్టింది సుధా రవి. మూమూలుగానైతే బియ్యంగింజలు, సుద్దముక్కలు... మొదలైనవి ఉపయోగించి రంగోలి వేసే సుధా ఈసారి మాత్రం ఐస్క్రీమ్ స్టిక్స్ను మాత్రమే ఉపయోగించింది. ఈ రంగోలిలో తమిళ కవులు తిరువళ్లువర్, అవ్వైయార్, భారతీయార్ చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆశ్చర్యంగొలిపే అందమైన ఆర్ట్వర్క్లను రూపొందించడం రవికి కొత్తేమీ కాదు. 2016లో 3,200 చదరపు అడుగుల రంగోలీని రూపొందించి రికార్డ్ సృష్టించింది. ‘సింగపూర్లో తమిళ సంప్రదాయాలు, కళలను ముందుకు తీసుకువెళ్లడానికి, ఈతరానికి చేరువ చేయడానికి సుధా రవి పనిచేస్తున్నారు’ అంటున్నారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న సుధా రవి ‘రంగోలి స్పెషలిస్ట్’గా పేరు తెచ్చుకుంది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రంగోలి కళకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించడానికి తనవంతుగా ప్రయత్నిస్తోంది. ‘అందరు పిల్లల్లాగే నాకు చిన్నప్పటి నుంచి రంగులు అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తే చాలు ఎంతో సంతోషం కలిగేది. ఆ సంతోషమే నన్ను రంగోలి కళ వైపు నడిపించింది. రకరకాల ప్రయోగాలు చేసేలా చేసింది. ఎమోషన్స్ విత్ కలర్స్ కాన్సెప్ట్తో కూడా రంగోలి రూపొందించాను. సింగపూర్లో దశాబ్ద కాలంగా ఉంటున్నాము. మా జీవితంలో రంగోలి భాగం అయింది. నాలాగే నా కూతురు రక్షితకు రంగోలిపై ఆసక్తి ఉండడం సంతోషకరమైన విషయం’ అంటుంది సుధా రవి. భూమిని ప్రేమగా ముద్దాడే రంగోలిని కాన్వాస్పైకి కూడా తీసుకువచ్చి కనువిందు చేయడంలో ఆమె విజయం సాధించింది. చదవండి: భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి? హ్యాపీ జర్నీ -
Home Creations: పండగ వేళ.. ఈ ముగ్గులతో మీ ఇంటికి ప్రత్యేక శోభ!
అందమైన రంగవల్లికలతో పండగల రోజుల్లో ప్రత్యేకంగా ఇంటిని సింగారించుకుంటున్నాం. ఆ రంగవల్లికలే అలంకరణ వస్తువుల మీదా కొత్తగా ముస్తాబు అయితే.. ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ‘సావీస్ హోమ్’ పేజీతో ఈ క్రియేషన్స్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందిస్తున్నారు స్రవంతి. ఇంటి అందాన్ని పెంచడం ఎలాగో ‘ముగ్గు’ను ముచ్చటగా పెయింట్ చేసి మరీ చూపుతున్నారు. మెలికలుగా తీర్చిన ముగ్గును ఏయే రూపాల్లో వేసుకోవచ్చో.. ముఖ్యంగా పండగలు, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో ముగ్గు కళతో ఇంటి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఆసనంపైన అందం పూజల్లో ఆసనంగా వాడే పీట, చుట్టూ అలంకరణకు వాడే పొడవాటి చెక్క ముక్కలు, బల్ల వంటివి పసుపు, ఎరుపు, పచ్చ రంగు పెయింట్ మీద వేసిన తెల్లని పెయింట్ ‘ముగ్గు’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వాకిట్లో గుమ్మం ముందు వేసిన ముగ్గు డిజైన్ను ఇలా పీట మీద పెయింట్గా వేసి, ఆత్మీయులకు కానుకగానూ ఇవ్వచ్చు. మీ అభిరుచిని సరికొత్తగా తెలియజేయవచ్చు. షోకేస్కి ముగ్గు వాల్ ఫ్రేమ్స్, కీ హోల్డర్స్, చిన్న సైజు అర లున్న షోకేస్ వంటివి గోడపైన అలంకరణగా ఉంచాలనుకుంటే.. వాటిని ఇలా ముగ్గు ముచ్చటతో మురిసిపోయేలా మెరిపించవచ్చు. కొన్నాళ్లుగా వాడి, ఇక పడేద్దాం అనుకున్న చెక్క స్పూన్లు , గరిటెలను కూడా రంగవల్లిక పెయింట్తో వాల్ హ్యాంగర్స్గా మార్చుకోవచ్చు. ట్రే.. గ్లాస్ హోల్డ్ర్లు కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టుగా ముగ్గుతో ఇంటిని కళాత్మకంగా ముస్తాబు చేసుకోవచ్చు. చెక్కతో చేసిన ట్రే, గ్లాస్ హోల్డర్స్ని ముగ్గుతో ‘కళ’గా అలంకరించవచ్చు. కలపకే ప్రాధాన్యం చెక్కతో తయారైన వస్తువులకు, పూల కుండీలకు రంగవల్లిక ఓ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది. అయితే, వీటిలో మెలికల ముగ్గుకే ప్రాధాన్యం. కళగా ఉంటుంది కదా అని ప్రతీ వస్తువుపై ‘ముగ్గు’వేస్తే అలంకరణ ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అభిరుచితో పాటు ఏ వస్తువును ‘కళ’గా అలంకరించాలో కూడా తెలుసుకొని, ఆచరణలో పెట్టడం సముచితం. చదవండి: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! -
యోగా మా అక్కను మనిషిని చేసింది...
మా అక్క 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యాసిడ్ అటాక్ జరిగింది. ఒక కన్ను, వక్షం, చెవి దగ్ధమయ్యాయి. ఆమె బండరాయిగా మారిపోయింది. ఆమెను మళ్లీ మనిషిని చేయడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు యోగా ఆమెను కాపాడింది. నేను రోజూ ఆమెను యోగాకు తీసుకెళ్లడంతో ఆమె తిరిగి పూర్తి మామూలు మనిషయ్యింది... అని కంగనా రనౌత్ తన కుటుంబం యోగా వల్ల ఎంత లబ్ధి పొందిందో చెప్పుకొచ్చింది. ‘‘2006లో మా అక్క రంగోలికి 21 ఏళ్లు. అవినాష్ శర్మ అనే అతను ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. మా అక్క తిరస్కరించింది. ఒకరోజు అతను, మరో స్నేహితుడితో కలిసి మా అక్క మీద యాసిడ్ కుమ్మరించాడు. మా అక్క చెవి, చెంప, ఒక వక్షం పూర్తిగా దెబ్బ తిన్నాయి. కంటి చూపు పోయింది. ఆమెకు డాక్టర్లు 54 సార్లు కాస్మటిక్ సర్జరీ లు చేసి పూర్వపు ముఖం తేవడానికి ప్రయత్నించారు. ఆమెకు రెటినా రీప్లేస్మెంట్ అయ్యింది. వక్షాన్ని పూర్వరూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఒక సంబంధం మాట్లాడితే వచ్చిన కుర్రాడు మా అక్క ముఖం చూసి మళ్లీ రాలేదు. ఇవన్నీ జరిగాయి. అప్పుడు నాకు 18 ఏళ్లు. మా అక్క భౌతిక ఆరోగ్యం కంటే కూడా ఆ సమయంలో నేను ఎక్కువగా ఆలోచించింది మానసిక ఆరోగ్యం గురించే. ఆ ఆరోగ్యాన్ని ఆమె యోగా నుంచి పొందింది’ అని తన ఇన్స్టాగ్రామ్లో తెలియచేసింది కంగనా రనౌత్. ‘మా అక్క ఆ సమయంలో ఒక బండరాయిలా మారిపోయింది. ఏం మాట్లాడినా ఊరికే అలా చూసేది తప్ప స్పందించేది కాదు. మా జోక్స్కు నవ్వేది కాదు. అసలు తన మీద తాను విశ్వాసం ఉంచుకుందా లేదా అర్థమయ్యేది కాదు. ఆమెను నేను కాపాడుకోవాలనుకున్నాను. నేను ఎక్కడికి వెళితే అక్కడకు తీసుకువెళ్లేదాన్ని. అలాగే నా యోగా క్లాసులకు కూడా తీసుకెళ్లేదాన్ని. అక్కడకు వస్తూ ఉండటం వల్ల క్రమంగా ఆమెకు యోగా మీద ఆసక్తి ఏర్పడింది. ఆమె యోగా చేయసాగింది. ఆమెకు మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. జీవం వచ్చింది. చూపు మెరుగు అయ్యింది. ఆమె పూర్తిగా మామూలు మనిషి కావడంలో యోగా అద్భుతంగా పని చేసింది’ అని రాసింది కంగనా. ‘మా అమ్మకు ఒక దశలో కొలెస్ట్రాల్ పెరిగిందని, డయాబెటిస్ ఉందని ఓపెన్ హార్ట్ సర్జరీ వరకూ వెళ్లారు డాక్టర్లు. కాని నేను ఆమెను రెండు నెలలు ఆగు అని యోగాసనాలలోకి తెచ్చాను. ఆమె యోగా చేసింది. ఏ సర్జరీ అవసరం ఏర్పడలేదు. ఇవాళ మా ఇంట్లో అందరి కంటే ఆమే ఆరోగ్యంగా ఉంది’ అని రాసింది కంగనా. యోగా అంరత్గత శక్తులను వెలికి తీస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి అనుభవాలు విన్నప్పుడు యోగాను స్వీకరించాల్సిన, సాధన చేయాల్సిన ఉత్సాహం కలిగితే అది చాలు కదా. -
నాపై ఉన్న కేసులన్నింటిని సిమ్లాకు మార్చండి
న్యూఢిల్లీ : ముంబైలో తనపై ఉన్న కేసులన్నింటిని సిమ్లాలోని కోర్టుకు తరలించాలంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో తనకు, తన సోదరి రంగోలి చందేల్కు ప్రాణహాని ఉందని, తన ఆస్తులకు సైతం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కేసులన్నింటిని సిమ్లా కోర్టుకు మార్చాల్సిందిగా తన లాయర్ నీరజ్ శేఖర్ ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. శివసేన ప్రభుత్వానికి తనపై ఉన్న వ్యక్తిగత కోపం కారణంగా ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆమె అందులో వివరించారు. ఆమెపై నమోదైన పలు కేసుల వివరాలను పిటిషన్లో పేర్కొంటూ, ఆ కేసులన్నింటిని సిమ్లా కోర్టుకు మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు చెందిన ఇంటిని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేసిన ఘటనను సైతం ఆమె ప్రస్తావించారు. దాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిందని అందులో పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం తనపై వ్యక్తిగత కక్షను పెంచుకుందని ఆమె పేర్కొన్నారు. -
కంగనాను అరెస్టు చేయకండి: హైకోర్టు
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ను అరెస్టు చేయోద్దని బాంబే హైకోర్టు మహరాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి చందెల్పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా పోస్టులు, ఇంటర్యూలు ఉన్నాయని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా సిస్టర్స్ విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే కంగన మాత్రం సినిమా షూటింగ్లో పాల్గొంటూ విచారణకు హాజరుకాకుండా వాయిదా వేస్తున్నారు. దీంతో పోలీసులు షూటింగ్లకు వెళ్లే సమయం ఉంటుంది కానీ విచారణకు హజరయ్యే సమయం ఉండదా అని వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంగన, రంగోలిలను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. (చదవండి: న్యాయవ్యవస్థను కించిపర్చిందంటూ ఫిర్యాదు) ఈ నేపథ్యంలో తమపై ఉన్న కేసును కొట్టేసేలా ఆదేశాలను ఇవ్వాలని కంగన, రంగొలీలు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తాము సోషల్ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, కేవలం తమ ఉద్దేశాలను మాత్రమే వెల్లడించామంటూ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అంతేగాక పోలీసుల సమన్లను తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే పోలీసులు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. కంగన వాదనను విన్న హైకోర్టు ముంబై పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని ఇప్పుడే అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అదే విధంగా జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరుకావాల్సిందిగా కంగన, రంగోలీలను న్యాయస్థానం ఆదేశించింది. (చదవండి: పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదు: హీరోయిన్) -
నా ట్యాక్స్లోంచి కంగనకు భద్రతా కల్పించారా?
ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కు వై-ప్లస్ కేటగిరి భద్రత కలిపించడంపై నటి కుబ్రాసైథ్ అసహనం వ్యక్తం చేశారు. తన ట్యాక్స్లోంచి వీటికి డబ్బులు వెళ్లడం లేదు కదా అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కంగనా సోదరి రంగోలి సైతం ధీటుగా సమాధానమిచ్చారు. క్యురియాసిటీ (ఉత్సుకత)తో అడుగుతున్నా..ఇంతకీ ఎంత ట్యాక్స్ కడుతున్నారేంటి అంటూ చురకలంటించారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ వర్గం కంగనాకు మద్దుతుగా ఉంటే, మరో వర్గం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓ సాధారణ నటికి వై- ప్లస్ క్యాటగిరీ కల్పించడంపై రాజకీయ కోణమేదైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లోని 25 ప్రముఖ వ్యక్తులకు డ్రగ్స్తో సంబంధాలున్నాయని రియా పేర్కొన్న సంగతి తెలిసిందే. (మహరాష్ట్ర సీఎం ఠాక్రేను హెచ్చరించిన కంగనా) తదనంతర కస్టడీ కోరుతూ ఎన్సీబీ రియాను అదుపులోకి తీసుకోవడంతో పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు జస్టిస్ ఫర్ రియా అంటూ క్యాంపెయిన్ నడుపుతుండటం గమనార్హం.ఇక కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్ కారణంగా సెప్టెంబర్ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్ ఇప్పుడు గమనిస్తోందని కంగనా బీఎంసీ చర్యపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంగనాకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇండియా విత్ కంగనా అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండింగ్ చేస్తూ అభిమానులు కంగనాకు బాసటగా నిలిచారు. (ఎయిర్పోర్ట్లో తీవ్ర ఉద్రిక్తత) Just checking, is it going out my taxes? https://t.co/z6xYxXPqEv — Kubbra Sait (@KubbraSait) September 7, 2020 -
అక్కకి ప్రేమతో...
తన అక్క రంగోలి కోసం ఇంటీరియర్ డిజైనర్ అవతారం ఎత్తారు కంగనా రనౌత్. కంగనా డిజైన్ చేసిన వాటిని షేర్ చేశారు రంగోలి. ‘‘నీ ఇంట్లో నీకు ఎలాంటి ఇంటీరియర్ డిజైన్స్ కావాలని నన్ను కంగనా అడిగింది. నిజానికి నాకేం కావాలో నాకే తెలియదు. పాతకాలానికి చెందినవి, రొటీన్గా ఉండేవి మాత్రం వద్దని చెప్పాను. తను నా ఇంటిని బాగా అలంకరించింది. అది చూసి షాక్ అయ్యాను. నిజానికి ఇంటీరియర్ డిజైనింగ్ కంగనాకు కొత్త. కానీ తను నా కోసం ఇంటీరియర్ డిజైనింగ్ గురించి తెలుసుకుని నా ఇంటిని అందంగా తయారు చేసింది. అందుకే ఇప్పుడు నా ఇల్లు నాకో స్వర్గంలా అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు రంగోలి. ఈ లాక్డౌన్ సమయంలో కంగనా వంటలు నేర్చుకున్నారు, కవితలు రాశారు. పెయింటింగ్స్ వేశారు. తాజాగా ఇంటీరియర్ డిజైనర్గా మారారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా తాజా చిత్రం ‘తలైవి’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్) షూటింగ్ లాక్డౌన్ వల్ల ఆగి పోయింది. ఇంకా ఆమె అంగీకరించిన హిందీ చిత్రాల్లో ‘తేజస్, థాకడ్’ కూడా ఉన్నాయి. -
రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్పై కేసు
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్పై కేసు నమోదైంది. ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్ముఖ్ కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులక్రితం ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో కరోనాతో మృతి చెందిన ఓ జమాతీ కుటుంబానికి వైద్య పరీక్షలు చేయటానికి వెళ్లిన డాక్టర్లు, పోలీసులపై వారు దాడి చేశారు. ఈ సంఘటనపై స్పందించిన రంగోలి చందేల్ ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చిపడేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో కంగనా స్పందిస్తూ కొద్దిరోజులక్రితం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. తన సోదరి రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను తొలిగించటాన్ని ఆమె తప్పుబట్టారు. గతంలో రంగోలి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. అంతేకాకుండా సదరు వర్గానికి చెందిన వారిని టెర్రరిస్టులని కంగనా పేర్కొన్నారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అలీ పోలీసులను ఆశ్రయించారు. ( రంగోలి ట్విటర్ బ్లాక్; ఖండించిన సింగర్ ) -
రంగోలి ట్విటర్ బ్లాక్; ఖండించిన సింగర్
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విటర్ ఖాతా తొలగింపుపై బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. గాయని సోనా మోహపత్రా మాత్రం దానిని ఖండించారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కంగనా ఆమె సోదరి రంగోలిలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే హక్కు ఉందంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా వెంటనే ఒకసారి ఆలోచండి #వోక్సభ’ అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. అదే విధంగా ‘‘ఏ విషయాన్ని అయినా లోతుగా చూసే ప్రపంచంలో మనమంతా జీవిస్తున్నాము. ఇక్కడ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఏకిభవించరు. దేశ పురోగతికి ఇది చెత్త ఫార్ములా. ఇక రంగోలీ ట్విటర్ ఖాతాను బలవంతంగా తొలగించి మరింత ద్వేషాన్ని స్వాగతించారు’’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. (రంగోలి ట్విటర్ అకౌంట్ను తొలగించిన అధికారులు) Just read on my timeline that the ‘Rangoli Chandel-Kangana Ranaut’ handle has been suspended by @twitter ? While I might not subscribe to all their views,I also stand by their right to express them.Let’s not be so ‘politically correct’ & quick to be offended dear #WokeSabha 🧚🏿♀️🔴 — ShutUpSona (@sonamohapatra) April 16, 2020 ఇక సోనా మోహపత్రా ట్వీట్కు దర్శకురాలు రీమా కగ్టి, రంగోలీ ట్వీట్ను షేర్ చేస్తూ.. ‘‘సోనా మీరు దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ఈ ట్వీట్ను మీరు చుశారో లేదో నాకు తెలియదు. అయితే ఈ ట్వీట్ను ఓసారి చూడండి. ఇందులో ఒక నిర్థిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను, నిర్థిష్టమైన పత్రికలను మారణ హెమానికి పిలుపునిచ్చింది. ఇది నేరం. ఆమోద యోగ్యం కానిది’’ అంటూ సోనా ట్వీట్కు సమాధానం ఇచ్చారు. ఇక దీనికి సోనమ్ మరో ట్వీట్ చేస్తూ ‘‘అవును ఇప్పుడే ఆ వివాదస్పద ట్వీట్ను చుశాను. అయితే దీనికి రద్దు చేయడమే పరిష్కారం కాదు. ఇలాంటి పద్దతిని సమర్థించను. ఎలాంటి వారినైనా క్షమించి వారి ఉదారవాదాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా’’ అని వివరణ ఇచ్చారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) కాగా ఫైర్ బ్రాండ్ రంగోలి తన అభిప్రాయాలను సోషల్ మీడయాలో తెలుపుతూ ఏప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి తన ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. దీంతో ఆమె ట్విటర్ ఖాతాను అధికారులు గురువారం రద్దు చేశారు. -
వివాదాస్పద ట్వీట్.. రంగోలి ఖాతా తొలగింపు
కంగనా రనౌత్ సోదరి, ఫైర్బ్రాండ్ రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తొలగించారు. ఓ వర్గాన్ని ఉద్ధేశించి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విటర్ అధికారులు ఆమె అకౌంట్ను సస్పెండ్ చేశారు. కాగా బుధవారం ఉత్తర ప్రదేశ్లోని మొరదాబాద్లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్ చేశారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) ఈ ట్వీట్ కాస్తా వైరలవ్వడంతో రంగోలి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు రీమా కగ్టి, నటి కుబ్రా సైత్తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సహా ట్విటర్లో ఫిర్యాదు చేశారు. ఒక వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రంగోలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ట్యాగ్ చేశారు. వీటిపై స్పందించిన ట్విటర్ అధికారులు వెంటనే రంగోలి అకౌంట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. చివరికి రంగోలి అకౌంట్ను అధికారులు తొలగించడంతో ఫరాఖాన్తోపాటు తదితర నటులు ట్విటర్కు కృతజ్ఞతలు తెలిపారు. (‘అలా అయితే.. కంగనా నటన వదిలేస్తుంది’) Thank you @Twitter @TwitterIndia @jack for suspending this account. I reported this because she targeted a specific community and called for them to be shot along with liberal media and compared herself to the Nazis. 🙏🙏🙏 . pic.twitter.com/lJ3u6btyOm — Farah Khan (@FarahKhanAli) April 16, 2020 -
రంగోలి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ్ మహల్పై రంగోలి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమేనని.. అది ఎప్పటికీ ‘ప్రేమ చిహ్నం’ కాదంటూ రంగోలి బుధవారం ట్వీట్ చేశారు. ‘తాజ్ మహల్ను చాలా మంది సమాధిగానే పరిగణిస్తారు. అయితే దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేగాక ముంతాజ్ బేగం గురించి కూడా ట్వీట్లో ప్రస్తావించారు. ముంతాజ్పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయని, ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఫోర్బ్స్పై కంగన సోదరి ఫైర్) Mr @rajcheerfull ji not every Indian is proud of Taj Mahal, a grave can never be a symbol of love, we are forced to accept it as a wonder but it’s creepy as hell especially when we know how she suffered in her lifetime how the artists who made it were tortured it’s creepy ... https://t.co/1V2waXDkbL — Rangoli Chandel (@Rangoli_A) April 7, 2020 ఇక రంగోలీ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘తాజ్ మహల్ను ప్రేమకు చిహ్నంగా అంగీకరించాలని మిమల్ని ఎవరూ కోరడం లేదు’ ‘మీ అభిప్రాయం మాకు అవసరం లేదు, ‘ఇది ప్రపంచలోని వింత అని చరిత్రే చెబుతుంది ఇక మీ అభిప్రాయం ఎవరికి కావాలి’ అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజ్ మహల్ ప్రపంచంలోనే 7వ వింతగ పరిగణించబడుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రేమకు చిహ్నంగా భావిస్తు ప్రేమికులు సైతం తాజ్ మహాల్ బొమ్మలను బహుమతులుగా ఇచ్చుకుంటుంటారు. అంతేగాక దేశ ప్రజలంతా దీనిని చూసి గర్వపడుతుంటారు కూడా. కాగా రంగోలి ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవడం ఇది మొదటిసారి కాదు. తరచూ ఎన్నో విషయాల పట్ల తనకున్న అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ విమర్శలను ఎదుర్కొంటారు. -
‘అలా అయితే.. కంగనా నటన వదిలేస్తుంది’
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ తరచూ సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. కాగా రంగోలి తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సోషల్ మీడియా వేదికగా బుధవారం సవాలు విసిరారు. ప్రస్తుత హీరోయిన్లలో ఎవరైనా రూ. 60 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జేట్తో లేడి ఓరియంటెడ్ సినిమాలు తీస్తే.. కంగనా తన నటనను పూర్తిగా వదులుకుంటుందని ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం రంగోలి ట్వీట్ బీ-టౌన్లో చర్చనీయాంశంగా మారింది. ‘నేను పరిశ్రమకు బహిరంగంగా సవాలు చేస్తున్నాను. కంగనా కాకుండా ప్రస్తుత హీరోయిన్లలో ఎవరైనా లేడి ఓరియంటేడ్ సినిమాలను రూ. 60 నుంచి రూ. 100 కోట్ల బడ్జేట్తో తీస్తే... ఇక కంగనా తన ఆక్టింగ్ కెరీర్ను పూర్తిగా వదిలేస్తుంది. లేదంటే నా పేరు మార్చుకుంటాను’ అంటూ ట్వీట్ చేశారు. ఎయిర్ఫోర్స్ పైలట్గా కంగనా.. ఫస్ట్ లుక్ ఇక కంగనా ట్వీట్ చూసిన కొంతమంది... ప్రస్తుత హీరోయిన్లలో కూడా కంగనాకు ఏమాత్రం తీసిపోని వారు ఇండస్ట్రీలో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు రంగోలీ.. ‘మీరు ఓకవేళ అలానే భావిస్తే.. ఓ విషయం గుర్తు పెట్టుకోండి. ప్రస్తుతం మంచి నటులు ఇండస్ట్రీలో ఉన్నారన్నది నిజమే. అది నేను కూడా అంగీకరిస్తాను. అయితే వారు కూడా లీడ్ రోల్ పాత్రలు చేశారు కానీ.. వారి సరసన కచ్చితంగా హీరో పాత్రలు ఉన్నాయి. ఇక కంగనా లీడ్ రోల్లో నటించిన మణికర్ణిక, క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్(టీడబ్ల్యూఎమ్ఆర్) సినిమాలు తనని ప్రముఖ హీరోలా సరసన నిలబెట్టాయని విశ్లేషకులే వెల్లడించిన విషయం అందరికీ తెలుసు. మీరు, నేను మాత్రమే అనుకున్నది కాదు’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంతేగాక కంగనా టీడబ్ల్యూఎమ్ఆర్, మణికర్ణిక సినిమాలు లేకపోతే తనకు ‘తలైవి’, ‘ధాకడ్’ సినిమాల ఆఫర్లు వచ్చేవి కాదని పేర్కొన్నారు. కాగా చాలా మంది ప్రతిభావంతులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికి పెట్టుబడులు పెట్టాలంటే నిర్మాతలకు నమ్మకం కలిగించాలని అన్నారు. My open challenge to the industry can any girl in today’s time solo carry a film above 60-70-80-100cr budget other than Kangana....??? If you give me a legit name Kangana will stop acting forever .... 🙏 — Rangoli Chandel (@Rangoli_A) March 11, 2020 ‘కంగనా ముందు పెద్ద సవాల్’ -
‘కంగనా ముందు పెద్ద సవాల్’
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నటీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిజ జీవితంగా ఆధారం రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివర దశకు చేరుకుంది. కాగా ‘తలైవి’ కోసం కంగనా 20 కిలోల బరువు పెరిగారు. ఇక ‘తలైవి’లో తన షూటింగ్ను పూర్తి చేసుకున్న కంగనా.. తన తదుపరి చిత్రాల కోసం బరువు తగ్గె పనిలో పడ్డారని ఆమె సోదరి రంగోలి చందేల్ తెలిపారు. ఈ విషయాన్ని రంగోలి తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ఇక తలైవి షూటింగ్ను దాదాపుగా పూర్తి చేసుకుంది. ఇది చిత్ర బృందానికి సంతోషంచే విషయం. కానీ.. ఆ తర్వాత కంగనాకు పెద్ద సవాలు ముందుంది. కంగనా తన తదుపరి చిత్రాలు ‘తేజాస్’, ‘ధాకడ్’ కోసం రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గాల్సి ఉంది’ అని ట్విట్ చేశారు. అంతేగాక సినిమా షూటింగ్లోని కంగనా నీలి రంగు చీరలో మెరిసిన ఫొటోతో పాటు అదే నీలి రంగు చీరలో ఉన్న అప్పటీ జయలలితా ఫొటోలు గతంలోని కంగనా గ్లామరస్ ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. (చదవండి: ఎందరికో స్ఫూర్తి) ఎయిర్ఫోర్స్ పైలట్గా కంగనా.. ఫస్ట్ లుక్ Only last schedule to go for #Thalaivi Kangana has gained 20 kgs weight, After 2 months she starts #Tejas & #Dhaakad.... will she be able to shed that weight, let’s see 😛 pic.twitter.com/CC410XdPuj — Rangoli Chandel (@Rangoli_A) March 4, 2020 కాగా ‘తలైవి’లో బొద్దుగా కనిపించడం కోసం కంగనాను బరువు పెరగాలని దర్శకుడు సూచించడంతో ఆమె జిమ్ మానేసి కోవ్వు పదార్థాలను ఎక్కువగ లాగించేశారు. దీంతో జీమ్కు, వర్కఔట్లకు బ్రేక్ ఇచ్చిన కంగనా తన షూటింగ్ పూర్తికావడంతో మళ్లీ కసరత్తులు మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా కంగనా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కాగా 52 కిలోల బరువు ఉండే ఈ భామ ‘తలైవి’ కోసం 20 కిలోల బరువు పెరిగారు. కాగా ‘మణికర్ణిక’, ‘బాహుబలి’ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్, ‘డర్టీ పిక్చర్’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ చిత్రాల రచయిత రజత్ అరోరాలు సంయుక్తంగా ‘తలైవీ’ కథను రచించారు. కాగా షూటింగ్లో చివరి దశకు చేరుకున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం -
ఫిల్మ్ఫేర్ అవార్డులపై స్పందించిన రంగోలీ
అత్యంత ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ అవార్డులపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ స్పందించారు. ఈ అవార్డుల్లో ప్రతిభ కలిగిన ఎంతోమందికి అన్యాయం జరిగిందంటూ ట్విటర్ వేదికగా ఆమె ఘాటు విమర్శలు చేశారు. 65వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం అస్సాంలోని గువాహటిలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవార్డుల్లో బాలీవుడ్ మూవీ ‘గల్లీబాయ్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. అత్యధిక విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఈ సందర్భంగా రంగోలీ అలియాభట్పై విమర్శలు గుప్పించారు. అలియా కంటే బాగా నటించే హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని దుయ్యబట్టారు. ఇక గల్లీబాయ్లో ఆమె నటన సాధారణంగా ఉందని.. అలియా ప్రధాన పాత్రలో నటించినప్పటికీ ఆమె సహాయక నటి లాగా కనిపించారని ఆరోపించారు. అలాంటి ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఎలా ఇచ్చారని మండిపడ్డారు. చదవండి: ఘనంగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్.. 'గల్లీ బాయ్'కి అవార్డుల పంట బాలీవుడ్లోని మూవీ మాఫియా గురించి కంగన చాలా సందర్భాల్లో స్పందించిందని.. అందుకే తనకు, తాను నటించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదని రంగోలీ ఆరోపించారు. అలాగే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 చిత్రానికి గానూ ఉత్తమ డెబ్యూ నటి అవార్డు అనన్యపాండేకు లభించడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘పటాఖా’ సినిమాలో నటించిన రాధిక మదన్కు ఇస్తే బాగుండేదని అన్నారు. రాధికకు అవార్డు ఇస్తే కొత్త వారిని ప్రొత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. రాధిక.. అనన్యపాండే కంటే అద్భుతంగా నటించిందని రంగోలీ ట్వీట్ చేశారు. ఇక రంగోలీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కంగనాకు పూలగుచ్ఛం పంపిన అలియా భట్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ సినిమాకు గాను ఈ ఏడాది పద్మశ్రీ ఆవార్డుకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో కంగనాకు సన్నిహితులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా కంగనకు పూల గుచ్ఛాన్ని పంపించి అభినందనలు తెలపడం విశేషం. ఈ విషయాన్ని కంగన సోదరి రంగోలి చందేల్ ట్విటర్లో తెలిపారు. అలియా పంపిన పూల బొకె ఫొటోలను ట్విటర్లో షేర్ చేస్తూ ‘చూడండి! అలియా కూడా పువ్వులు పంపించారు. కంగనా గురించి నాకు తెలియదు కానీ.. నేను నిజంగా ఆనందిస్తున్నాను’ అంటూ రంగోలి ట్వీట్ చేశారు. కాగా గతంలో కంగనా, అలియా భట్ను పలు సందర్భాల్లో విమర్శించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్యూలో ‘అలియా, కరణ్ జోహార్ తోలు బొమ్మగా కాకుండా తన సోంత స్వరాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ తనదైన శైలిలో విమర్శించారు. అదేవిధంగా ‘గల్లిభాయ్లో అలీయా నటన సాధారణంగా ఉంది. ఇక అలియాను నాకు పోటీ అని భావించినందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యాను’ అంటూ అలియాను ఏకిపారేశారు. అయితే కంగనా వ్యాఖ్యాలకు అలియా తిరిగి స్పందించలేదు. రంగోలి ‘ప్రజలు తెలివి తక్కువ వాళ్లు కాదు. ఈ పరిశ్రమలో ఎవరూ ఒంటరిగా పోరాడుతున్నారో, తెర వెనుక జరిగే రాజకీయ కుట్రలు వారికి తెలుసు. ఈ సమయంలో నిజాయితీ, పారదర్శకత చాలా విలువైనవి కాబట్టి నేను నిశబ్దంగా ఉంటున్నా. మీ పరిధిలో మీరుండండి’ అంటూ రంగోలి, అలియా నిశ్భబ్థంపై చురకలు అంటించారు. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. హిందీ చిత్రసీమకు నాలుగు పద్మా ఆవార్డులు వరించాయి. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్, టీవీ టైకూన్ ఏక్తా కపూర్, ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సామీలను ‘పద్మశ్రీ’ వరించింది. అయితే అవార్డుల జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారెవరూ లేకపోవడం గమనార్హం. People arnt stupid, they see who stands alone and where is gang of movie mafia, in this time and age honesty and transparency is most valued so keep your medieval age ‘ Main chup rahoongi’ sob story to yourself, no need to make this viral everyday... 🤚🏼 — Rangoli Chandel (@Rangoli_A) April 23, 2019 -
ముచ్చటైన ముగ్గులు (2)
-
ముచ్చటైన ముగ్గులు
-
పాకిస్తాన్తో సంబంధాలా? కోర్టుకీడుస్తా..!
సాక్షి, చెన్నై: పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించిన పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్పై కోర్టులో కేసు వేస్తానని కోలం గాయత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై బీసెంట్నగర్ ప్రాంతంలో సీఏఏ వద్దంటూ కోలం (ముగ్గు) వేసిన సామాజికవేత్త, న్యాయవాది గాయత్రిపై పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నగర పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ వద్ద విలేకరులు మాట్లాడగా గాయత్రి ఫేస్బుక్ తనిఖీ చేయగా ఆమెకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. దీనిపై గాయత్రి ప్రతిస్పందిస్తూ సీఏఏకు వ్యతిరేకంగా తాను ముగ్గు వేసినందున కేసు నమోదు కాలేదని, ముగ్గు వేస్తున్న సమయంలో 92 ఏళ్ల వృద్ధునితో తగాదాకు దిగినందుకు కేసు నమోదు చేసినట్లు కమిషనర్ ఏకే విశ్వనాథన్ తెలిపినట్లు వెల్లడించారు. (ముగ్గుల వెనుక పాక్ హస్తం!) అటువంటి వివాదం ఏదీ జరగలేదని, దీనిపై ఒక వీడియో విడుదల చేశారని, అందులో తగాదాకు దిగినట్లు ఆడియో మాత్రమే ఉందన్నారు. వృద్ధుని వద్ద ఫిర్యాదు తీసుకుని తమపై కేసు నమోదు చేయలేదన్నారు. శాంత భద్రతలకు భంగం వాటిల్లుతున్నట్లు, ట్రాఫిక్కు ఇబ్బందికరంగా నడుచుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమపై వ్యక్తిగత కక్షతో కేసు నమోదు చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. (ముగ్గులతో నిరసనలు.. పోలీసుల అదుపులో ఐదుగురు) చట్టపరమైన చర్యలు తనకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ పేర్కొన్నారని, పాకిస్తాన్ సహా తొమ్మిది దేశాలలో జరిపిన పరిశీలన గురించిన రిపోర్ట్ను ఫేస్బుక్లో విడుదల చేసినట్లు తెలిపారు. పోలీసు కమిషనర్ ఆరోపణలు వాస్తవ విరుద్ధమన్నారు. తనపై దుష్ప్రచారం సాగించేందుకు పోలీసు కమిషనర్ విశ్వనాథన్ అలా తెలిపారని, ఆయన తన అభిప్రాయాన్ని ఉపసంహరించుకుని క్షమాపణ కోరాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. -
ముచ్చటైన ముగ్గులకు ఇదే మా ఆహ్వానం
సాక్షి : సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ధాన్యం ఇల్లు నిండగా.. కొత్త అల్లుళ్ల సందడి నెలకొనగా తెలుగువారి లోగిళ్లు ఆనందంతో మురిసే వేడుక. ఎంతో ఆనందంగా జరుపుకొనే ఈ పర్వదినానికి అసలైన శోభను తెచ్చేది మాత్రం రంగవల్లులు. అందులో పెట్టే గొబ్బెమ్మలే. తెలుగింటి ఆడపడుచులు తమ ప్రతిభను వాకిళ్లలో ముగ్గుగా తీర్చిదిద్ది.. రంగులు అద్ది ఈ పెద్ద పండుగను మరింత వైభవోపేతం చేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే భోగి మంటలతో మొదలై.. భోగిపళ్లు, పిండివంటలు, డూడూ బసవన్నలు, హరిదాసులతో తెలుగింటి సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ పండుగను పురస్కరించుకుని.. సాక్షి డాట్కామ్ మహిళల కోసం సంక్రాంతి సందడిని ముందుగానే తీసుకువచ్చింది. మీ చేతుల్లో రూపుదిద్దుకునే రంగవల్లులను ప్రదర్శించే అవకాశం కల్పిస్తోంది. మీరు మీ వేసే, వేయబోయే వినూత్నమైన ముగ్గుల చిత్రాలను మాకు పంపిస్తే వాటిని ప్రచురిస్తాం. మీ ముగ్గుల ఫోటోలను info@sakshi.com మెయిల్కు పంపించండి. లేదా 9010077759 నంబర్కు వాట్సప్ ద్వారా మీ ముగ్గుల చిత్రాలను పంపొచ్చు. మీరు పంపించే ముగ్గులకు సంబంధించి ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు.. వంటి వివరాలు సమగ్రంగా ఉండాలి. మీ పేరు, ఊరు రాయడం మరిచిపోవద్దు. క్లియర్గా లేని ముగ్గుల చిత్రాలకు ప్రచురించడం సాధ్యం కాదు. అందుకని మీరు పంపించే ముగ్గులు చాలా స్పష్టంగా ఉండేలా చూడాలి. మీరు పంపిన ముగ్గుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ముగ్గుల వెనుక పాకిస్తాన్ హస్తం!
సాక్షి , చెన్నై: పౌరసత్వ చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో ఒక యువతి వేసిన ముగ్గు వెనుక మర్మం దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు యువతికి పాకిస్థాన్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఫేస్బుక్ పరిశీలనలో తేలిందని గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ తెలిపారు. చెన్నై నగరంలో గత నెల 29వ తేదీన పలువురు యువతులు ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఇందుకు సంబంధించి ఎనిమిది మంది యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో బిసెంట్ నగర్లోని 92 ఏళ్ల వృద్ధుడి ఇంటి ముందు ముగ్గువేసి గొడవలు సృష్టించిన నేరంపై తిరువాన్మియూర్కు చెందిన గాయత్రి కందదై (32)ని కూడా అరెస్ట్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. దీనిపై బుధవారం సాయంత్రం గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ మీడియాతో మాట్లాడారు. ముగ్గు వేసినందుకు యువతులను అరెస్ట్ చేయలేదని, ఇతరులు వేసుకున్న సాధారణ ముగ్గు పక్కనే పౌర చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో కూడిన ముగ్గువేయడం వల్లనే అరెస్ట్ చేసి కొద్దిసేపటికే విడిచిపెట్టామని కమిషనర్ వెల్లడించారు. (ముగ్గులతో నిరసనలు.. పోలీసుల అదుపులో ఐదుగురు) అయితే గాయత్రి కందదై పాకిస్థాన్లోని ‘ఫైట్స్ పార్ ఆల్’ అనే సంస్థతో సంబంధాలున్నట్లు ఆమె ఫేస్బుక్ తనిఖీలో తేలిందన్నారు. ఈ సంస్థకు అసోసియేషన్ ఆఫ్ అల్ పాకిస్థాన్ సిటిజన్ జెనలిస్ట్ అనే సంస్థకు సొంతమైందని, అంతేగాక ఆమె నేప«థ్యాన్ని కూడా అనుమానిస్తున్నామన్నారు. తీవ్రవాద సంస్థలతో గాయత్రికి, ఆమె తండ్రికి ఏమైనా సంబంధాలున్నాయా..? అనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఇళ్ల ముందు ‘రంగోలి’ తో నిరసన తెలిపిన యువతులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను నిరసిస్తూ డీఎంకే అధినేత స్టాలిన్, తుత్తుకుడి ఎంపీ కనిమొళి ఇళ్ల ముందు కూడా ‘వేండం (వుయ్ డోంట్ వాంట్) సీఏఏ-ఎన్ఆర్సీ’ అంటూ ముగ్గులు వేశారు. పౌర సవరణ చట్టానికి తాము వ్యతిరేకం అంటూ రంగోలి ద్వారా తమ నిరసన తెలిపారు. కాగా ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు సోమవారం కూడా అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఫోర్బ్స్పై కంగన సోదరి ఫైర్
బాలీవుడ్ ‘క్వీన్’ కంగన రనౌత్ సోదరి రంగోలీ చందేల్ ఫోర్బ్స్ ఇండియా పత్రికపై విరుచుకుపడ్డారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన సెలబ్రిటీల గణాంకాలన్ని తప్పుడు గణాంకాలంటూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. ఈ జాబితాలో పేర్కొన్న సెలబ్రిటీల ఆదాయానికి రుజువులు కావాలని డిమాండ్ చేశారు. కాగా ఫోర్బ్స్ ఇండియా 2019 సంవత్సరంలో అత్యధిక ఆదాయాన్ని గడించిన ప్రముఖ 100 మంది సెలబ్రిటీల వార్షిక ఆదాయ గణాంకాలను విడుదల చేసింది. కంగన ఈ ఏడాది రూ.17.5 కోట్లు సంపాందించి 70వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఈ విషయంపై రంగోలీ చందేల్ స్పందిస్తూ.. ‘అవును.. ఫోర్బ్స్ ఇండియా గణాంకాలు అన్ని మోసపూరితమైనవి. వారి మాగజైన్లో పేర్కొన్న ప్రతి ఒక్క సెలబ్రిటీల ఆదాయాన్ని నిరూపించాలి. మీకు తెలుసా.. కంగన ఈ జాబితాలో పేర్కొన్న ఆదాయం కంటే ఎక్కువగానే ట్యాక్స్ కడుతుంది. ఆదాయాన్ని ఏ ప్రాతిపదికన అంచనా వేశారో మాకు చూపించండి’ అంటూ ఫోర్బ్స్ ఇండియాకు ఆమె సవాలు విసిరిరారు. అదేవిధంగా ఈ విషయంలో సరైన రుజువులు చూపిస్తే తాను బహిరంగ క్షమాణలు అడగడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కోన్నారు. దీనిపై ఫోర్బ్స్ ఇండియా వేంటనే సమాధానం ఇవ్వాలంటూ రంగోలీ తన ట్విటర్లో రాసుకొచ్చారు. ‘ఈ ఏడాది కంగనా ఎంత ఆదాయాన్ని గడిచిందో తనకే తెలియదు. తన ఆదాయానికి సంబంధించిన ప్రతి విషయం నాకు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కు మాత్రమే తెలుసు. ఈ విషయం చాలా గోప్యంగా ఉంటుంది. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియక ముందే వారికి ఆదాయ వివరాలు ఎలా వచ్చాయ’ని ప్రశ్నించారు రంగోలీ. కాగా ఈ జాబితా ప్రకారం, బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్ ఈ సంవత్సరంలో రూ. 293.25 కోట్ల ఆదాయంతో 2వ స్థానంలో నిలిచి... గత మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్ను అధిగమించారు. అలాగే అలియా భట్ 8, దీపికా పదుకొనే 10వ స్థానంలో నిలిచి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. ఇక టాప్ 10లో ఉన్న మరో బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్ 6, రణవీర్ సింగ్ 7వ స్థానంలో ఉన్నారు. (సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్ కోహ్లి) -
కాపీ సినిమాకు ఆస్కార్ ఎందుకివ్వాలి?
బాలీవుడ్లో హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత ఫేమసో.. ఆమె సోదరి రంగోలీ చందేల్ అంతకన్నా పాపులర్. గతంలో హృతిక్రోషన్, దర్శకుడు క్రిష్, మహేశ్భట్, తాప్సీ, కరణ్ జోహార్, అలియా భట్ ఇలా ఎందరిపైనో మాటల దాడికి దిగింది రంగోలీ. తాజాగా ఆమె సినీ నటులను కాకుండా ఓ బాలీవుడ్ సినిమాను టార్గెట్ చేసింది. భారత్ తరపున ఆస్కార్ నామినేషన్కు ఎంపికైన గల్లీబాయ్ ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గల్లీబాయ్ చిత్రంపై రంగోలీ తీవ్ర విమర్శలు చేసింది. ‘8 మైల్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా ‘గల్లీబాయ్’ తెరకెక్కించారు. సినిమా బాగుందని ప్రచారం చేయడానికి సినీ విమర్శకులకు ఎంతిచ్చారో ఎవరికి తెలుసు? యురి, మణికర్ణిక వంటి సినిమాల్లాగా ఇది ఒరిజినల్ కథ కాదు. హాలీవుడ్ నుంచి కాపీ కొట్టిన చిత్రమే గల్లీబాయ్. అలాంటి సినిమాకు వాళ్లెందుకు అవార్డు ఇస్తారు’ అని రంగోలీ ప్రశ్నించింది. కాగా రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ‘గల్లీబాయ్’ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.238 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. భారత్ తరపున ఆస్కార్ నామినేషన్కు ఎంపికైంది. కానీ సోమవారం ప్రకటించిన టాప్ టెన్ చిత్రాల్లో చోటు దక్కకపోవడంతో ఆస్కార్ చేజారినట్టైంది. ఇక మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్ చిత్రాల తర్వాత మరే భారత సినిమా ఆస్కార్ను అందుకోలేకపోయాయి. -
లీటర్ యాసిడ్తో నాపై దాడి చేశాడు
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘చపాక్’. యాసిడ్ దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఈ ట్రైలర్పై సోషల్ మీడియాలో స్పందించారు. యాసిడ్ దాడికి గురైన రంగోలి చందేల్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ చిత్ర నిర్మాతలపై, దర్శకురాలిపై ప్రశంసలజల్లు కురిపించారు. ‘చపాక్ ట్రైలర్ను చుశాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రాణించాలని కోరుకుంటున్నాను’ అనే క్యాప్షన్ జత చేసి తన ఇన్స్టాలో పోస్టు చేశారు. ఈ క్రమంలో రంగోలి తనపై జరిగిన యాసిడ్ దాడి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఓ వ్యక్తి ప్రేమను నిరాకరించినందుకు అతను ఒక లీటర్ యాసిడ్తో నాపై దాడి చేశాడని.. దీంతో తన ముఖానికి 54 సర్జరీలు జరిగాయని చెప్పుకొచ్చారు. ‘దాడి తర్వాత నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. యాసిడ్ దాడి వల్ల నా అందాన్ని కోల్పోయావంటూ చాలా మంది నాపై సానుభూతి చూపించారు. మీరు ఊహించగలరా.. ఈ సర్జరీల కోసం నా శరీరంలోని వివిధ భాగాల నుంచి వైద్యులు నా చర్మాన్ని ప్యాచ్లుగా తీసుకున్నారు. యాసిడ్ ధాటికి నా అవయవాలు అన్నీ కరిగిపోవడంతో వాటి కోసం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే 54 సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పటికీ డాక్టర్లు నా చెవి భాగాన్ని మాత్రం పునర్నిర్మించలేకపోయారు. ఈ ఘటనలో నా రొమ్ము భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. నేను బిడ్డలకు పాలు పట్టేటపుడు తీవ్రమైన నొప్పిని భరించాను. ఇప్పటికీ నా మెడను కొన్ని సమయాలల్లో తిప్పలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. అలాగే ఈ దాడిలో నా కన్నును కోల్పోయాను. దానికి ప్రస్తుతం రెటీనా మార్పిడి చేయాల్సి ఉంది’ అని రంగోలి తన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం భారదేశంలో యాసిడ్ ఘటనలు పెరిగిపోయాయని, యాసిడ్ దాడి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని ఆమె అందోళన వ్యక్తం చేశారు. Meghna and Deepika will earn a lot of tears from this film, what my family and I went through along with the prejudice we faced was worse than death... story of an acid attack survivor need to reach this nation, praying that it works🙏 — Rangoli Chandel (@Rangoli_A) December 10, 2019 ఇక చపాక్ విషయానికి వస్తే.. దీపికా పదుకోనే, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. చపాక్లో యాసిడ్ దాడి ఘటన అనంతరం కేసు దర్యాప్తు, కోర్టు విచారణ, వైద్య చికిత్సలు ఇలా ఆ యువతి ఎదుర్కొన్న పరిస్థితులను దర్శకురాలు తెరపై మనకు చూపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదలు చేయనున్నట్లు సమాచారం. -
‘వీళ్లిద్దరినీ ఆశీర్వదించండి’
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ సోదరుడు అక్షిత్ రనౌత్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. రీతూ అనే యువతితో శుక్రవారం అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరి రంగోలితో పాటు కంగనా సందడి చేశారు. సంప్రదాయ బనారస్ పట్టుచీర ధరించి.. ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతూ బంధువులను పలకరించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను రంగోలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ కొత్త జీవితం ప్రారంభించబోతున్న ఈ ఇద్దరినీ ఆశీర్వదించండి’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో అక్షిత్ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెబుతూనే... కంగనా పెళ్లి కూడా త్వరగా జరగాలంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా క్వీన్ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న కంగనా.. ఈ ఏడాది జడ్జిమెంటల్ హై క్యా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్లో నటిస్తున్నారు. -
నేనే అడిగా.. అది చెప్పేందుకు సిగ్గుపడటం లేదు!
ముంబై: బాలీవుడ్లో కంగనా రనౌత్కి, తాప్సీ పన్నుకి మధ్య ఏదో గొడవ ఉండనే ఉంటుంది. తాప్సీ గురించి కంగనా నేరుగా విమర్శించింది లేదు. కానీ, కంగనా సోదరి రంగోళీ చందేల్ పలు సందర్భాల్లో తాప్సీని టార్గెట్ చేసింది. ఇటీవల తాప్సీకి కంగనా సిస్టర్స్కి మధ్య మళ్లీ తగువు స్టార్ట్ అయింది. తాప్సీ.. భూమీ పడ్నేకర్తో కలిసి ‘సాండ్కి ఆంఖ్’ అనే సినిమాలో నటిస్తోంది. 60 ఏళ్లకు పైబడిన బామ్మలు షూటింగ్లో రాణించిన నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తాప్సీ పోషించిన పాత్ర మొదట కంగనాకు వచ్చిందట. అయితే, వృద్ధురాలైన ఆ పాత్రకు తగిన వయస్సు గల నటిని ఎంచుకుంటే బాగుంటుందని మేకర్స్కి కంగనా సూచించిందట. ఈ విషయాన్ని రంగోళీ వెల్లడించారు. కంగనా తిరస్కరించిన పాత్రను చేస్తూ.. తాప్సీ తెగ పోజులు కొడుతోందని రంగోళీ ఎద్దేవా చేసింది. రంగోళీ వ్యాఖ్యలపై ఎట్టకేలకు తాప్సీ స్పందించింది. పింక్విల్లా వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘చిత్ర దర్శకనిర్మాతలు కంగనా వద్దకు వెళ్లి ఉంటారు. నిజానికి ఈ పాత్ర కోసం వారు సగం ఇండస్ట్రీని గాలించారు. వింతవింత కారణాలతో చాలామంది ఈ పాత్రను తిరస్కరించారు. ఈ పాత్ర గురించి వారు నన్ను ఎప్పుడూ సంప్రదించలేదు. ఇలా సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసి.. నేనే స్వయంగా వారిని సంప్రదించాను. దీనిని అంగీకరించేందుకు నేనేమాత్రం సిగ్గుపడటం లేదు. నేను ఆ పాత్ర చేస్తానని చెప్పాను. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రను వెతికేందుకు వారికి ఇంకోరెండేళ్లు పట్టింది’ అని వివరించింది. ఇక, 60 ఏళ్ల వయస్సు పాత్రలను వయస్సు పైబడిన వారు మాత్రమే చేయాలంటే తాను నటనను మానేస్తానని, విభిన్నమైన పాత్రలను చేయకుంటే తనను యాక్టర్ అని అనడంలో అర్థమేముంటుందని రంగోళీ విమర్శలపై తాప్సీ ఘాటుగా బదులిచ్చింది. -
నా చెల్లెలినీ చావబాదారు: నటి సోదరి
ముంబై: కంగనా సోదరీమణుల కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా పేరొందిన నటి కంగనా రనౌత్. ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె చుట్టూ నిత్యం ఏదో వివాదం ఉండనే ఉంటుంది. ఇక, ఆమె సోదరి రంగోళి చందేల్.. నిత్యం ట్విటర్లో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఈ వివాదాలు, గొడవలను కాస్తా పక్కనపెడితే.. యాసిడ్ దాడి బాధితురాలైన రంగోళీ తాను ఎదుర్కొన్న భయానక గతం తాలూకు అనుభవాలను తాజాగా ట్విటర్లో పంచుకున్నారు. జీవితంలో ఎంత స్ట్రగుల్ పడి తాము పైకొచ్చామో ఆమె వివరించారు. డెహ్రాడూన్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ యవకుడు తనపై యాసిడ్ దాడి చేశాడని, దీంతో గత ఐదేళ్లలో తాను 54 సర్జరీలు చేయించుకున్నట్టు రంగోలీ పేర్కొన్నారు. ఆ యాసిడ్ దాడి తాలూకు గాయాల చారలతో తాను ఇప్పటికీ ఎలా జీవిస్తున్నది వివరిస్తూ ప్రస్తుత ఫొటోను ఆమె పోస్టు చేశారు. యాసిడ్ దాడి సమయంలో తన చెల్లెలు కంగనాను కూడా తీవ్రంగా కొట్టారని, ఆమె దాదాపు చనిపోయేవరకు కొట్టారని రంగోలీ పేర్కొన్నారు. యాసిడ్ దాడికి పూర్వం ఫొటోను కూడా పోస్టు చేసిన రంగోలీ ‘ఈ ఫొటో తీసిన కాసేపటికే.. ఓ యువకుడు అతని ప్రేమను నేను తిరస్కరించాననే కారణంతో నాపై లీటరు యాసిడ్ పోశాడు. దీంతో 54 విచిత్రమైన సర్జరీలు నేను చేయించుకున్నాను. అదే సమయంలో నా చిన్నారి చెల్లెలు కంగనాపై కూడా భౌతికంగా దాడి చేశాడు. ఆమె దాదాపుగా చచ్చేవరకు కొట్టాడు. ఎందుకంటే మా తల్లిదండ్రులు అందమైన, తెలివైన, ఆత్మవిశ్వాసం గల కూతుళ్లకు జన్మనిచ్చారని.. ప్రపంచం ఆడపిల్లల పట్ల ఉదారమైన ప్రేమను చూపదు. అన్ని రకాల సామాజిక దురాచారాలపై పోరాడి.. మన పిల్లలకు సురక్షిత సమాజాన్ని ఇవ్వాల్సిన సమయం ఇది’ అని ఆమె పేర్కొన్నారు. యాసిడ్ దాడి ఎదుర్కొని అనేక కష్టనష్టాలకోర్చి సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కంగనా సిస్టర్స్ పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగారా? మీ కథ ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి రంగోలీ బదులిస్తూ.. తన భర్త ఓ స్నేహితుడిలా ఉండి నిరంతరం అందించిన ప్రోత్సాహం, సోదరి కంగనా మద్దతు, తల్లిదండ్రులు అందించిన నైతిక స్థైర్యంతో తాను యాసిడ్ దాడి తాలూకు గాయాలను కడిగేసుకొని.. సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని పేర్కొన్నారు. యాసిడ్ దాడి తర్వాత ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఇప్పటికీ డాక్టర్లు తన చెవిని సరిచేయలేకపోయారని ఆమె పేర్కొన్నారు. రంగోలీ భర్తతో కలిసి ప్రస్తుతం మనాలీలో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు పృథ్వీరాజ్ ఉన్నారు. -
గ్రెటాకు థ్యాంక్స్.. ప్రియాంకపై విమర్శలు!
భారతదేశంలో కూడా పర్యావరణ ప్రేమికులు ఉన్నారని.. వారు ప్రకృతి పరిరక్షణకై ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ అన్నారు. అలాంటి వాళ్లపై కాస్త ప్రేమ కురిపిస్తే బాగుంటుందని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు హితవు పలికారు. అసలు విషయమేమిటంటే... వాతావరణ మార్పులపై స్వీడన్ చెందిన 16 ఏళ్ల గ్రెటా థంబర్గ్... ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాధినేతలను నిలదీసిన విషయం తెలిసిందే. ‘పర్యావరణం నాశనమైపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. కానీ మీకు ఇవేమీ పట్టవు. డబ్బు, వృద్ధి అంటూ కట్టుకథలు చెప్తారు. మా తరాన్ని మోసం చేయడానికి మీకెంత ధైర్యం(హౌ డేర్ యూ). మేం మిమ్మల్ని క్షమించబోం’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేసిన గ్రెటాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా కూడా సోషల్ మీడియా వేదికగా గ్రెటాను ప్రశంసించారు. ఈ మేరకు.. ‘మీ తరాన్ని ఒక వేదిక మీదకు తెచ్చి పర్యావరణ రక్షణ విషయంలో మా తరం చేస్తున్న నిర్లక్ష్యం గురించి ముఖంపై గుద్దినట్లు చెప్పినందుకు థ్యాంక్స్ గ్రెటా థంబర్గ్. అలాగే పర్యావరణ మార్పులపై మేం ఇంకా బాగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పినందుకు అభినందనలు. అవును మిమ్మల్ని ఓడించడానికి మాకెంత ధైర్యం? మనం బతకడానికి చివరకు మనకు ఈ ఒక్క గ్రహం మాత్రమే ఉంది’ అంటూ గ్రెటాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇక వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో ఉండే రంగోలి తాజాగా ప్రియాంక ట్వీట్పై స్పందించారు. ‘డియర్ ప్రియాంక చోప్రా.. అవును పర్యావరణ పరిరక్షణకై ఆ యువతి చాలా గొప్ప ప్రసంగాలు చేస్తున్న మాట నిజమే. అయితే మన దేశంలో కూడా ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. పర్యావరణం కోసం మనసా వాచా కర్మణా పనిచేస్తూ డబ్బు కూడా దానం చేస్తున్నారు. వాళ్లు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా ఫలితాలు సాధించి చూపిస్తున్నారు. అలాంటి వాళ్లపై కూడా కాస్త ప్రేమ కురిపించండి ప్రియాంక బాగుంటుంది’అంటూ ప్రియాంకపై రంగోలి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా కావేరీ కాలింగ్ అనే పర్యావరణ కార్యక్రమం కోసం రంగోలి సోదరి కంగనా రూ. 42 లక్షలు దానం చేసిన సంగతి తెలిసిందే. కావేరీ బెల్ట్లో చెట్లు నాటే ఈ ఉద్యమానికి లియోనార్డో డికాప్రియో వంటి పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటించారు. Dear PC nice to have u back, Yes this young woman is doing great work, magar hamare desh mein bhi bahut log tan man dhan se environment keliye kaam kar rahe hain,sirf lecture nahin de rahe results laa rahe hain... unkeliye bhi kabhi kuch payaar ke shabd bol dijiye...acha lagega🙏 https://t.co/50CJ9cDWYy — Rangoli Chandel (@Rangoli_A) September 25, 2019 -
‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’
బాలీవుడ్లో హీరోయిన్ తాప్సీ, కంగన సోదరి రంగోలి మధ్య రాజుకున్న మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా తాప్సీ కంగనను ఉద్దేశిస్తూ.. ‘ఓ మహిళ మరో మహిళకు మద్దతుగా ఉండాలని కంగన ఎప్పుడూ చెబుతుంటుంది. మరి ఆమె నా ‘మిషన్ మంగళ్’ సినిమాను అభినందించినట్లు నాకు తెలియలేదు. ఈ సినిమాలో ఐదుగురం ఆడవాళ్లం ఉన్నాము. మరి ఆమె మమ్మల్ని మెచ్చుకుందా’ అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాప్సీ వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలి తీవ్రంగా మండి పడ్డారు. ఈ మేరకు రంగోలి ట్విటర్లో.. ‘ప్రతి రోజు కంగనను విమర్శిస్తున్నావ్.. అసలు నిన్ను ఎందుకు మెచ్చుకోవాలి. ఇంత వరకూ నువ్వు ఏం సాధించావ్. అక్షయ్, విద్యాబాలన్లు ఉన్న సినిమాలో ఓ రెండు నిమిషాల పాత్ర, అమితాబ్ బచ్చన్ సినిమాలో ఓ పాత్ర చేసినందుకు నిన్ను మెచ్చుకోవాలా. సినిమా అంతా ఒకే రకమైన హావభావాలు వ్యక్తం చేసే నిన్ను ఏ విషయంలో పొగడాలి. విలేకరులు నిన్ను పిలిచింది కంగన గురించి ప్రశ్నించడానికి కానీ.. నీ పనిని, గొప్పతనాన్ని పొగడటానికి కాదు. నా ప్రశ్నలకు సిల్లీగా కాకుండా హుందగా స్పందిచగల్గితే.. స్పందించు.. లేదా వదిలేయ్’ అంటూ తాప్పీని విమర్శిస్తూ రంగోలి ట్వీట్ చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై తాప్సీ ఎలా స్పందిస్తారో చూడాలి. yeh Madam is attacking Kangana everyday,arrey bhai tune kya kiya hai for what we should praise you? 2 mins role in a film lead by Akshay Kumar and Vidya Balan. Or playing character roles in Big B films or carrying same confused expression through all your film...(contd) @taapsee https://t.co/wcDfjvYllH — Rangoli Chandel (@Rangoli_A) August 15, 2019 -
‘పబ్లిసిటీ కోసమే డిప్రెషన్ అని ప్రచారం’
కంగనా సోదరి రంగోలి బాలీవుడ్ పద్మావత్ దీపికా పదుకొనేపై ట్విటర్ వేదికగా విమర్శలు కురిపించారు. డిప్రెషన్ని దీపిక పబ్లిసిటీ కోసం వాడుకుంటుందని రంగోలి ఆరోపించారు. ఇంతకు విషయం ఏంటంటే.. 2015 సంవత్సరంలో తాను విపరీతమైన డిప్రెషన్కు గురయ్యానని దీపిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఓదార్పు, వైద్యం తనను మామూలు మనిషిని చేశాయని చెప్పింది. తనలాగే డిప్రెషన్తో బాధపడేవారి కోసం లీవ్ లవ్ లాఫ్ అనే సంస్థను స్థాపించి.. డిప్రెషన్ పట్ల అవగాహన కలిగిస్తున్నారు దీపిక. అయితే ఈ విషయాల గురించి దీపిక తొలిసారి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన వీడియోను ఇప్పటి వరకూ యూట్యూబ్లో పది లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా దీపిక, లీవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ చైర్పర్సన్తో కలిసి డ్యాన్స్ చేస్తోన్న వీడియోను ఆ సంస్థ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోపై కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా.. డిప్రెషన్ పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రంగోలి. Yeh kya ho raha hai? Yeh depression hota hai, yeh woh log hain jinko word Mental se problem thi, magar depression vidoes pe baration ki tarah nach rahe hain, kya ghatiya wahiyat tarika hai depression ke naam pe publicity lene ka .. @TLLLFoundation 🤦🏻♀️ https://t.co/b5BDazQkTk — Rangoli Chandel (@Rangoli_A) July 5, 2019 -
తాప్సీ.. కాపీ కొట్టడం మానేయ్
హీరోయిన్ తాప్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంగనా రనౌత్ సోదరి రంగోలీ. కంగన నటించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో తాప్సీ కూడా ట్రైలర్ బాగుందంటూ ట్వీట్ చేశారు. అయితే తాప్సీ ట్వీట్పై కంగనా సోదరి రంగోలీ స్పందిస్తూ.. ‘కొంతమంది కంగనను కాపీ కొడుతూ బతికేస్తుంటారు. వారంతా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి.. ట్రైలర్ను బాగుందని ప్రశంసించేటప్పుడు కనీసం కంగన పేరు కూడా ప్రస్తావించరు. ఓసారి తాప్సి కంగనను ఉద్దేశిస్తూ ఆమె ఓ అతివాది అని వ్యాఖ్యనించారు. తాప్సీ.. ముందు మీరు ఇలా చీప్గా ఇతరుల వర్క్ను కాపీ కొట్టడం ఆపండి’ అంటూ రంగోలీ ట్వీట్ చేశారు. Kuch log Kangana ko copy kar ke he apni dukaan chalate hain, magar pls note, they never acknowledge her not even a mention of her name in praising the trailer, last I heard Taapsee ji said Kangana needs a double filter and Tapsee ji you need to stop being a sasti copy 🙏 https://t.co/5eRioUxPic — Rangoli Chandel (@Rangoli_A) July 3, 2019 దాంతో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలగజేసుకుని రంగోలీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘రంగోలీ.. ఇది చాలా దూరం వెళుతోంది. నేను నీ సోదరి కంగనతో, తాప్సితో కలిసి పనిచేశాను. ట్రైలర్ను మెచ్చుకున్నారంటే.. అందులోని నటీనటులను కూడా మెచ్చుకున్నట్లే కదా?’ అని ప్రశ్నించారు. ఇందుకు రంగోలి స్పందిస్తూ.. ‘సర్.. మీరు ఉదయం నుంచి కంగనకు ఫోన్లు చేస్తూ.. ‘తాప్సీ నీకు పెద్ద ఫ్యాన్’ అని చెబుతున్నారు. తాప్సీ ఆ మాట ఏ సందర్భంలో అన్నారో నిరూపిస్తారా? ఆవిడ ఎప్పుడూ కంగనను విమర్శిస్తూనే ఉంటారు’ అని మండిపడ్డారు రంగోలీ. ప్రకాశ్ కోవేలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. Come on Rangoli.. this is going too far.. this is really really desperate.. I really don’t know what to say to this . Having worked with both your sister and Taapsee .. I just don’t get this ..praising the trailer means praising all aspect of it. Which includes Kangana https://t.co/tkG5KwyFHi — Anurag Kashyap (@anuragkashyap72) July 3, 2019 -
ఫోన్ స్విచ్చాఫ్.. దేవుడా ఆమెను ఏమైనా చేశారా?
ముంబై: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సోదరి సునయన వ్యవహారంలో నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించినందుకు తనను తండ్రి రాకేశ్ రోషన్, సోదరుడు హృతిక్ రోషన్ హింసిస్తూ కొడుతున్నారని సునయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా రంగోలీ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం సునయన ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, ఆమెను సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని రంగోలీ తన ట్వీట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవుడా.. ఆమెకు వాళ్లు (రాకేశ్, హృతిక్) ఏదైనా కీడు తలపెట్టారా? ఏమైనా చేశారా? ఆమె గురించి తలుచుకుంటే చాలా భయంగా ఉంది’ అని రంగోలీ పేర్కొన్నారు. (చదవండి: మా తమ్ముడు కూడా వేధిస్తున్నాడు : హృతిక్ సోదరి) తన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే.. సునయన పోలీసులను ఆశ్రయించాలి? కానీ, ఇలా సొంత కుటుంబసభ్యులపై ఆరోపణలు చేయవద్దంటూ సినీ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కదేల్ వ్యాఖ్యానించగా.. దీనికి స్పందనగా ఆమె ఈమేరకు ట్వీట్లు చేశారు. సునయన కుటుంబసభ్యుల మీద ఆధారపడుతూ.. వారి ఇంట్లో ఉందని, వారికి వ్యతిరేకంగా పోలీసులను ఆశ్రయించడం అంత సులభం కాదని, పైగా పోలీసులతో రాకేశ్ రోషన్కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కంగనా వారిని సమర్థంగా ఎదుర్కోగలిగింది కానీ, 16 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకొని.. పెద్దగా చదువుకోకుండా కుటుంబసభ్యుల మీద ఆధారపడిన సునయన వారిని ఎదుర్కోలేదని రంగోలి పేర్కొన్నారు. సునయన రోషన్ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ రంగోలి ఇంతకుముందు కూడా వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వెబ్సైట్తో మాట్లాడిన సునయన.. ‘ ఎప్పటిలాగానే నరకంలో జీవిస్తున్నా. రంగోలి ట్వీట్లు చదివాను. ఆమె చెప్పినవన్నీ నిజాలే. తన ద్వారానైనా నాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. నేను ఈరోజు కంగనా, రంగోలీలను కలుస్తున్నాను. వారు మాత్రమే నాకు న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు. తన ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్ అమీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్షిప్ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. తను ఒక జర్నలిస్టు అని చెప్పినా వినలేదు. ఈ విషయంలో హృతిక్ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్తో ప్రేమ అతడికి ఇష్టం లేదు. మా నాన్న గైడెన్స్లో తను కూడా ఆయన లాగే ప్రవర్తిస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్లంతా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు అని కుటుంబ సభ్యులపై సునయన సంచలన ఆరోపణలు చేశారు. కాగా గతంలో హృతిక్- కంగనాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో సునయన కంగనాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. -
‘ఆమె నరకంలో ఉంది.. సాయం చేయలేకపోతున్నాం’
బాలీవుడ్లో కంగనా రనౌత్, హృతిక్ రోషన్ల మధ్య వచ్చిన విభేదాల గురించి అందరికి తెలుసు. ఒకప్పుడు హృతిక్ తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు వీరిద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈక్రమంలో కంగన సోదరి రంగోలి సంచలన విషయాలు వెల్లడించారు. హృతిక్ సోదరి సునైనాను ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసిస్తున్నారని.. సాయం కోసం ఆమె కంగనకు ఫోన్ చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు రోషన్ కుటుంబం మీద సంచలన ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్లు చేశారు రంగోలి. ‘హృతిక్ సోదరి సునైనా ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమిస్తున్నారు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దాంతో అతన్ని మర్చిపోవాలంటూ సునైనాను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ పోలీసు అధికారిని ఇంటికి పిలిపించి మరి సునైనాకు వార్నింగ్ ఇప్పించారు. ప్రస్తుతం సునైనా పరిస్థితి తల్చుకుంటే చాలా బాధగా ఉంది. తన ఇంట్లోనే ఆమె నరకం అనుభవిస్తున్నారు. సాయం కోసం కంగనకు ఫోన్ చేసింది. అయితే సునైనాకు ఎలా సాయం చేయాలో కంగనకు తెలీడంలేదు. అందుకే ఈ విషయాలన్నీ ట్విటర్ వేదికగా బయటపెడుతున్నాను’ అన్నారు రంగోలి. Sunaina Roshan is asking Kangana for help, her family is physically assaulting her because she is in love with a Muslim man from Delhi, last week they got a lady cop who slapped her, her father also hit her, her brother is trying to put her behind bars..(contd) — Rangoli Chandel (@Rangoli_A) June 19, 2019 అంతేకాక ‘సునైనా భద్రత కూడా మాకు ముఖ్యమే. ఎవరినైనా ప్రేమించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కనీసం ఈ ట్వీట్లు చూసైనా రోషన్ కుటుంబం వెనక్కు తగ్గి సునైనా ప్రేమను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ రంగోలి వరుస ట్వీట్స్ చేశారు. గతంలో సునైనాకు, తనకు మంచి స్నేహం ఉందని కంగన వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ మధ్యకాలంలో సునైనాకు తన కుటుంబంతో ఓ విషయంలో గొడవ జరిగింది. దాంతో కంగన హృతిక్ వివాదంలో సునైనా తన సోదరుడు హృతిక్దే తప్పంటూ ట్విటర్ వేదికగా కంగనాకు మద్దతు తెలిపారు. I support Kangana all through — Sunaina Roshan (@sunainaRoshan22) June 18, 2019 -
‘ఈ మాఫియాను చూసి భయపడుతున్నారు’
బాలీవుడ్లో ఉన్న నెపోటిజం (బంధుప్రీతి) మాఫియా కారణంగా దక్షిణాది యువ దర్శకులు కూడా భయపడుతున్నారని అంటున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్. ప్రస్తుతం కంగన ‘మెంటల్ హై క్యా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలతో కంగన సంతృప్తి చెందలేదని, అందుకే దర్శకత్వ బాధ్యతలను తాను కూడా చూసుకోవాలనుకుంటున్నారని ప్రకాశ్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ ‘మరోసారి కంగన దర్శకత్వ బాధ్యతలను చేజిక్కించుకుంది’ అనే వార్తను ప్రచురించింది. ఈ వార్తపై కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాలీవుడ్లో ఉన్న నెపోటిజం మాఫియా కంగన కెరీర్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఇలాంటి వార్తల ప్రచురణకు పాల్పడుతోంది. అసలు విషయం ఏంటంటే.. కొందరు దర్శకులు ఏమీ తెలియని స్టార్ కిడ్స్కి అన్నీ దగ్గరుండి నేర్పించాలని అనుకోరు. తమ వెంటే ఉండి అన్ని విషయాల్లో సాయం చేసే నటులు కూడా ఉంటే బాగుంటుందని అనుకునే దర్శకులు కూడా ఉంటారు. కంగన కొత్తగా వస్తున్న దర్శకులకు అవకాశాల తలుపులు తెరిచింది. ఆనంద్ ఎల్ రాయ్(తను వెడ్స్ మను), వికాస్ బెహల్(క్వీన్) లాంటి దర్శకులకు ఆమె అవకాశం ఇచ్చింద’ని రంగోలి తెలిపారు. అంతేకాక ‘యువ దర్శకులు బాలీవుడ్లోకి అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. అలా భయపడే దర్శకులకు ఇలాంటి వార్తలు పనికొస్తాయి’ అంటూ రంగోలి వరుస ట్వీట్లు చేశారు. అంతేకాక కంగనాను ఆలియా, దీపికా పదుకోనే వంటి హీరోయిన్లతో పోల్చవద్దని కోరారు. కంగనా ఏ స్టార్ హీరో, దర్శకుడి సాయం లేకుండా స్వయం కృషితో ఎదిగిందని రంగోలి స్పష్టం చేశారు. -
మోదీ మాసివ్ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..
బీజేపీ బిగ్ విక్టరీపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి తిరిగి వచ్చిన బాలీవుడ్ క్వీన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారట. బీజేపీ సాధించిన అద్భుతమైన విజయంపై ఫుల్ హ్యాపీగా ఉన్న కంగనా చెఫ్ అవతార మెత్తారట. ఈ విషాయాన్ని కంగనా సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కంగనా వంటలు చాలా అరుదుగా చేస్తుంది..ఎంతో సంతోషంగా ఉంటే తప్ప..కానీ రుచిరకరమైన పకోడీలు, కాఫీ వడ్డించి 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ చారిత్రాత్మక విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసిందని రంగోలి పేర్కొన్నారు. జై హింద్.. జైభారత్ అంటూ ట్విటర్లో కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు. అలాగే తమ జనరేషన్లో నరేంద్రమోదీలాంటి నాయకుడిని పొందడం అదృష్టమంటూ రంగోలి చందేల్ కూడా మోదీకి అభినందలు తెలిపారు. Kangana cooks rarely, when she is absolutely exhilarated, today she treated us with chai pakodas for @narendramodi Ji’s win #JaiHind #JaiBharat 😁🥳 🙏 pic.twitter.com/6hJIuxby9W — Rangoli Chandel (@Rangoli_A) May 23, 2019 -
‘కరణ్ వాళ్ల గురించే మాట్లాడతారు’
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి ఈసారి దర్శక, నిర్మాత కరణ్ జోహార్ను టార్గెట్ చేశారు. కాఫీ విత్ కరణ్ షోలో ఆయన ఉత్తమ హీరోయిన్ల లిస్ట్లో కంగన పేరును ప్రస్తావించకపోవడంపై రంగోలి మండిపడ్డారు. గతంలో జరిగిన ఓ ఎపిసోడ్లో కరణ్ బెస్ట్ హీరోయిన్ ఎవరంటూ కొందరి పేర్లు చెప్పారు. అయితే వారిలో కంగనా పేరు లేదు. దాంతో ఓ నెటిజన్ కరణ్ను ఉద్దేశిస్తూ ‘ఆలియా భట్, దీపికా పదుకొణె, అనుష్క శర్మ.. ‘కాఫీ విత్ కరణ్’ షో రాపిడ్ ఫైర్లో ఉత్తమ నటీమణుల జాబితాలో కంగన లేరు. ఎందుకంటే కంగన వీళ్లందరి కన్నా ఉత్తమ నట అని కరణ్కు ముందే తెలుసు. అంతేగా కరణ్?’ అని సోషల్మీడియాలో ట్వీట్ చేశారు. దీన్ని చూసిన రంగోలి కరణ్ బంధుప్రీతి చూపిస్తారని విమర్శించారు. ‘మూవీ మాఫియా అంటే ఇదే. కరణ్ జోహార్ పలు జాతీయ అవార్డులు అందుకున్న నటి గురించి మాట్లాడరు. ఆయన పరిచయం చేసిన బంధువుల పిల్లల గురించి మాత్రమే మాట్లాతారు’ అని రంగోలి ఎద్దేవా చేశారు. కంగన కూడా ఇటీవల నటి ఆలియా భట్ను విమర్శించారు. ఆమె కరణ్ చేతిలో కీలుబొమ్మలా మారారని, ఆయన చెప్పిందే చేస్తుంటారని ఆరోపించారు. దీనికి ఆలియా స్పందిస్తూ.. కంగన ఆ రీతిలో వ్యాఖ్యలు చేసేలా తను ఎప్పుడూ ప్రవర్తించలేదని అన్నారు. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చర్చించుకుంటామని, అంతేకానీ దీని గురించి మీడియా ముందు మాట్లాడటం ఇష్టం లేదని చెప్పారు. This is movie mafia, he #Karanjohar talks about acting without mentioning multiple national award winner only to create perception about his own preffered Nepo kids... 😆 https://t.co/iYfePs2Nk6 — Rangoli Chandel (@Rangoli_A) February 25, 2019 -
క్రిష్పై కంగనా సోదరి ఫైర్
వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాపై ఇంత హైప్ క్రియెట్ కావడానికి వివాదాలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం మణికర్ణిక వివాదంపై క్రిష్ స్పందించారు. హీరోయిన్ కంగనా రనౌత్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించిందని కూడా తెలిపారు క్రిష్. (‘మణికర్ణిక’ వివాదంపై స్పందించిన క్రిష్) అయితే క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలి స్పందించారు. క్రిష్ను ఉద్దేశిస్తూ.. ‘డైరెక్టర్గారు.. సినిమా మొత్తం మీరే తీశారు. మేం ఒప్పుకుంటా. కానీ తెర మీద మొత్తం కంగనానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విజయాన్ని, ప్రశంసల్ని ఆమె ఆస్వాదిస్తుంది. తనను ఒంటరిగా వదిలేయండి. దయచేసి మీరు ప్రశాంతంగా ఆసీనులుకండం’టూ రంగోలి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పత్రికలుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా 70 శాతం సినిమాను తానే డైరెక్ట్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ విషయాన్ని క్రిష్ ఖండించారు. కంగనా కేవలం 30 శాతం సినిమాను మాత్రమే తెరకెక్కించిందని తెలిపారు. ఒకరు చేసిన పనిని తనదిగా చెప్పుకుంటున్న ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని క్రిష్ వ్యాఖ్యానించారు. తాను తీసిన సన్నివేశాలనే మళ్లీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందన్నారు. @DirKrish chalo man liya you directed the whole film now please calm down, still Kangana is the leading face of the film let her enjoy this moment of her success and great appreciation, please leave her alone, we all believe you now please take a seat 🙏 https://t.co/rInLkrHreO — Rangoli Chandel (@Rangoli_A) January 28, 2019 -
హల్వా కావాలా బాబూ!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ఎక్కవమంది బాలీవుడ్ స్టార్స్ విదేశాలకు వెళ్లి మస్త్ మజా చేస్తే కంగనా రనౌత్ మాత్రం సొంతింట్లోనే వేడుక చేసుకున్నారు. గతేడాది కంగనా హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. న్యూ ఇయర్కు ముందు రోజు కిచెన్లోకి వెళ్లి ఆమె గరిటె తిప్పి హల్వా ప్రిపేర్ చేశారు. కంగనా వంట చేస్తున్న ఫొటోను ఆమె సోదరి రంగోలి షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. హల్వా కావాలా బాబు? అని అడిగేలా ఉంది కదా కంగనా స్మైల్. మరి.. టేస్ట్ ఎలా ఉందనే విషయం మైకుల ముందుకు వచ్చినప్పుడు కంగనానే అడిగి తెలుసుకుందాం. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేసిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో ‘పంగా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వీయదర్శకత్వంలో ఓ లవ్స్టోరీని తెరకెక్కించాలని కంగనా అనుకుంటున్నారట. -
కేరాఫ్ కాంట్రవర్సీ
ఒక్కసారి మనం కాంట్రవర్సీలో కాలు పెడితే చాలు తర్వాత అక్కర్లేని కాంట్రవర్సీలన్నీ వచ్చి చుట్టుకుంటాయి అని చెప్పటానికి కంగనా రనౌత్ ఓ ఉదాహరణ. విషయం ఏంటంటే.. సీడీఆర్ (కాల్ డీటైల్ రికార్డ్) వివాదం. ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్. బాలీవుడ్ సెలబ్రిటీ లాయర్ రిజ్వాన్ సిద్ధికీ చట్ట వ్యతిరేకంగా తన క్లైయింట్స్కు సీడీఆర్లు అందిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. నటుడు నవాజుద్దిన్ సిద్ధికీ భార్య కాల్ డేటాను అక్రమ మార్గాల్లో సంపాదించారని లాయర్ రిజ్వాన్ను అదుపులోకి తీసుకున్నారు థానే పోలీసులు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడీ కేసు కంగనా కాలుకి కూడా చుట్టుకుంది. ఈ సీడీఆర్ వివాదంలో కంగనా కూడా ఉన్నారంటూ ఆరోపించారు థానే పోలీసులు. ‘‘కంగనా–హృతిక్ రోషన్ ప్రేమ వ్యవహారం కేసు విషయం ఇంకా నడుస్తున్న విషయం తెలిసిందే. 2016లో లాయర్ రిజ్వాన్కు కంగనా హృతిక్ రోషన్ నంబర్ను ఇచ్చినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దాని వెనకాల అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు థానే పోలీసులు. దానికి కంగనా సిస్టర్ రంగోలీ స్పందిస్తూ – ‘‘ఏదైనా కోర్ట్ నోటీసుకి రెస్పాండ్ అయినప్పుడు మా డీటైల్స్ అన్నీ లాయర్కు సమర్పిస్తాం. వాటిని ఆధారం చేసుకొని మేము చట్టాన్ని అతిక్రమిస్తున్నాం అని ఊహించేసుకొని వాటి ద్వారా స్టేట్మెంట్స్ పాస్ చేయడం ఒక ఆర్టిస్ట్ని తక్కువ చేయడమే అవుతుంది. అది తప్పు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిపాక ఆరోపణలు చేస్తే బావుంటుంది’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
10 వేల చుక్కల ముగ్గు..!
సాక్షి, చిత్తూరు అర్బన్: ముగ్గులు మన సంప్రదాయ చిహ్నాలకు గుర్తులు. చిన్న పిల్లల నుంచి ప్రతీ ఒక్క మహిళ ముగ్గులు వేస్తుంటారు. చిత్తూరు నగరం దుర్గానగర్ కాలనీకు చెందిన సవిత అనే గృహిణి మాత్రం ముగ్గులు వేయడంలో రికార్డులు సృష్టిస్తుంటారు. గత 20 ఏళ్లుగా ముగ్గుల్లో ఉన్న అన్ని కోణాలను విశ్లేషించిన ఈవిడ కొత్తగా ఏదైనా రికార్డు సృష్టించాలనుకున్నారు. శనివారం చిత్తూరు నగరంలోని కట్టమంచిలో ఉన్న కళ్యాణ మండపం ఆవరణలో ఏకంగా 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 వేల చుక్కలతో ముగ్గువేసి సరికొత్త రికార్డు సృష్టించారు. సవిత ఒక్కటే ఏడు గంటల పాటు శ్రమించి ముగ్గు వేయడం అక్కడున్న ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ముగ్గు మధ్యలో ప్రకృతిని కాపాడాలంటూ ఓ సందేశాన్ని సైతం ఇచ్చారు. ఆమె ముగ్గు వేస్తున్నంతసేపు అక్కడే ఉన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి శ్రీనివాసులు సవితను మెచ్చుకుంటూ తమ పుస్తకంలో ఆమెకు స్థానం లభించినట్లు పేర్కొన్నారు. ముగ్గు పూర్తయిన తరువాత సవితకు ధృవీకరణ పత్రం అందచేశారు. -
‘నేనిప్పుడు గర్భవతిని.. అవన్నీ రూమర్లే..’
ముంబయి: తన సోదరికి తనకు ఎలాంటి వివాదం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి స్పష్టం చేసింది. కంగనాకు తన సొంత అక్కాచెల్లెళ్లతోనే పడటం లేదని, వారి మధ్య విభేదాలున్నాయంటూ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆమె స్పష్టత నిచ్చింది. తనను తన సోదరి కంగనా ఎప్పుడూ పక్కనే ఉంచుకుంటుందని, ప్రస్తుతం తాను గర్భవతిని అవడం వల్లే కనిపించడం లేదని తెలిపింది. తమ మధ్య ప్రేమకు అసలు అంతమే లేదని చెప్పింది. ‘నటిగా నా సోదరి కంగన కెరీర్ను ప్రారంభించినప్పటి నుంచి నేను ఆమె పక్కనే ఉంటున్నాను. ఆమె మాకు అండగా ఉండటం మాత్రమే కాదు.. జీవితాన్నిచ్చింది. ప్రస్తుతం నేను గర్భవతిని కావడం వల్లే పని నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను. అంతేగానీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అని రంగోళి తెలిపింది. కంగనా వర్క్ షెడ్యూల్ మొత్తం కూడా రంగోళి దగ్గరుండి చూసుకునేది. ఇటీవల ఆమె కనిపించకపోవడంతో వారి మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు గుప్పుమన్నాయి. -
ముగ్గులతో నిరసన
గోస్పాడు(నంద్యాల): రాయలసీమ సాగునీటి సమితి పిలుపు మేరకు..సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ముగ్గులతో నిరసన తెలిపారు. గోస్పాడు మండలంలోని జిల్లెల్ల, పసురపాడు గ్రామంలో మహిళలు ముగ్గులు వేసి..జీవో 69ని రద్దు చేయాలని, శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండేలా చట్టబద్ధత చేయాలనే డిమాండ్ను రాశారు. సిద్ధేశ్వరం అలుగు చేపట్టాలని, రాయలసీమకు నరు.. భిక్ష కాదని, ప్రజల హక్కు అని పాలకులు గుర్తించాలనే వాక్యాలు ముగ్గుల్లో కనిపించాయి. జై రాయలసీమ అంటూ మహిళలు తమ ఆకాంక్షను తెలుపుతూ ముగ్గులు వేశారు. -
ఆకట్టుకున్న రంగవల్లులు
ఎల్లారెడ్డిపేట: వెంకటాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. రంగవల్లి ముగ్గుల పోటీలను హైద్రాబాద్ భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానంలో రవళి, ద్వితీయ స్థానంలో నమ్రత, తృతీయ స్థానంలో రమ్య, యామని, శ్వేత, లావణ్య, నిఖితలు రాణించారు. ముగ్గుల పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆడెపు సుదర్శన్, ఫౌండేషన్ ప్రతినిధి సతీశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీలో ముగ్గుల పోటీలు సిరిసిల్ల ఎడ్యుకేషన్: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అనురాగ్ డిగ్రీ కళాశాలలో సోమవారం సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. నిగమ ఇంజినీరింగ్ కళాశాల అధినేత బీవీఆర్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మనసంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతీ యేటా విద్యార్థినులకు, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి, బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. -
వెల్లివిరిసిన సృజనాత్మకత
సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు... వివిధ సంస్కృతులను చాటేలా విచిత్ర వేషధారణలు... రంగు రంగుల రంగవల్లులు... ఆలోచింపజేసిన గీసిన చిత్రాలు... ఇలా పలు అంశాల్లో విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంగళవారం ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దిన రంగవల్లులు ఆకుట్టకున్నాయి. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లోనూ చిన్నారులు సత్తాచాటారు. స్కూల్ ప్రిన్సిపాల్ రాంబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో దిగిన సృజనాత్మకతన వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నాట్యాచార్యుడు రమేష్, వైఎస్ ప్రిన్సిపాల్ లతాకుమారి, కో ఆర్డినేటర్ పార్ధసారథి, క్రాఫ్ట్ ఉపాధ్యాయిని నషీరున్నీసా తదితరులు పాల్గొన్నారు. – విజయవాడ (భవానీపురం) -
57 సర్జరీలు... భరించలేని బాధ!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధాకరమైన సంఘటనలు ఉంటాయి. కొన్ని బాధలు తాత్కాలికం. కొన్ని మాత్రం జీవితాంతం వెంటాడతాయి. ఆ బాధ తాలూకు ఆనవాళ్లు మిగిలిపోతాయి. కంగనా రనౌత్ అక్క రంగోలి జీవితంలో అలా ఆనవాళ్లు మిగిల్చిన సంఘటన ఒకటి ఉంది. పెళ్లి కుదిరాక ఆమె మీద ఎవరో యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడి కారణంగా ఒక కంటికి 90 శాతం చూపు పోయింది. ఒక చెవి పని చేయడం మానేసింది. ఇక... చక్కని ముఖారవిందం కాలిపోయింది. మరోవైపు ఆహారం వెళ్ళే నాళం, శ్వాసకోశం కూడా దెబ్బ తిన్నాయి. దాంతో రంగోలి నరకం అనుభవించారు. పాడైపోయిన మొహాన్ని కొంతలో కొంత బాగు చేయడానికి 57 సర్జరీలు చేశారు. ఆ చర్మాన్ని తొడల దగ్గర్నుంచి తీసేవారు. మొత్తం మీద ప్రత్యక్ష నరకం చూశారామె. దేవుడు ఆ విధంగా కొంత పెయిన్ ఇచ్చినా.. ఎవరితో అయితే పెళ్లి కుదిరిందో ఆ యువకుడే రంగోలీని పెళ్లి చేసుకోవడంతో ఆమె జీవితం ఆనందంగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్లో జీవిత చరిత్రల నేపథ్యంలో సినిమాలు రావడం ఎక్కువైంది. క్రీడాకారులు, స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. కానీ, కంగన మాత్రం ‘మా అక్క జీవితానికి మించిన ఇన్స్పిరేషన్ లేదు’ అంటున్నారు. అందుకే, రంగోలీ జీవితం ఆధారంగా సినిమా చేయాలనుకుంటున్నారామె. ఈ విషయం గురించి కంగన మాట్లాడుతూ - ‘‘నా జీవితం కన్నా మా అక్క జీవితం చాలా బాగుంది. మా బావ తనను ఎంతగానో ప్రేమిస్తాడు. నాకు అలాంటి ప్రేమికుడు లేడు. మా అక్క జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టే, తన జీవితంతో సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ, తన జీవితంతో సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుందని మా అక్క అంటోంది. నేను జయాపజయాల గురించి ఆలోచించడం లేదు. స్ఫూర్తిదాయకమైన ఒక సినిమా చేయాలన్నదే నా ఆశయం’’ అని చెప్పారు. -
కరీంనగర్లో సాక్షి ముగ్గుల పోటీలు
-
ముగ్గులతో మహిళల నిరసన
నిరసన తెలపడానికి అనేక మార్గాలుంటాయి. కొంత మంది ఉద్యమబాట పడతారు..మరికొంత మంది మౌనప్రదర్శన చేస్తారు.. ఇంకొంతమంది హింసను ఎన్నుకుంటారు. కానీ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు ప్రాంత మహిళలు మాత్రం.. సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో తమ నిరసన తెలిపారు. ముగ్గుల ద్వారా తమ మనసులోని భావాలు చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చేది లేదని పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు తెలిపారు. భూములు ఇవ్వం అంటూ రంగురంగుల ముగ్గులతో రాశారు. స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా, ఏపీ సర్కారు మాత్రం మొండిగా భూసేకరణతోనే ముందుకెళ్తోంది. -
బతుకమ్మకు పోటీగా.. సంక్రాంతి ముగ్గులు!!
-
గ్రామీణ జీవన పునర్వికాసానికి అద్భుత అవకాశం...
సంక్రాంతి! ఏడాదిలోని 365 రోజులకూ 365 పండుగలున్న దేశం మనది. ఎప్పుడూ పండుగ వాతావరణంతో నిండి ఉండే సంస్కృతి మనది. ఈరోజు దుక్కిదున్నే రోజైతే, అదో రకమైన పండుగ. దుక్కిదున్నే కార్యక్రమానికి ఓ పాట... అందుకు తగ్గ ఆటా ఉండేవి. మరునాడు నాట్లువేసే రోజైతే, అది మరొక పండుగ. దానికీ ఓ పాటా, అందుకు తగ్గ ఆటా ఉండేవి. ఆ మరునాడు కలుపు తీసే రోజైతే, అదీ పెద్దపండగే. ఇక పంటకోత కోస్తే, అది కూడా ఓ గొప్ప పండుగే. అదే సంక్రాంతి పండుగ. ముందటి తరం వరకు కూడా మన దేశంలోని పల్లెల్లో ఆ సంబరమే వేరు. ఆటలు, పాటలు, గెంతులు, నాట్యాలతో మన జీవితాలు నిండి ఉండేవి. ఉదాహరణకు సంక్రాంతి పండుగ రోజుల్లో తమ ఎడ్ల కొమ్ములకు, కాలి గిట్టలకు రంగులు వేసి, ముఖానికి నామాలు పెట్టి, మెడలో గంటలు కట్టి వీధుల్లో చాలా ఆనందంగా ఊరేగేవారు. బక్కచిక్కిన రెండే ఎడ్లున్న పేదరైతు కూడా తనకు చేతనైనంతగా వాటిని అలంకరించి సగర్వంగా వెంట నడుస్తూ, అందరికీ చూపిస్తూ పొంగిపోయేవాడు. ఓ పది పదిహేనేళ్ల కిందటి వరకు కూడా నాట్లువేసే రోజులు వచ్చాయంటే అందరూ కలసిమెలసి నాట్లు వేసేవారు. మొత్తం పంట పండేవరకు కలసిమెలసే అన్నీ చేసుకొనేవారు. గ్రామం మొత్తం మీ పొలం దగ్గరకు వచ్చి అంతా పూర్తయ్యే వరకు సాయపడేవారు. రేపు మరొకరి పొలానికి, ఇలాగే అందరితో పాటు నువ్వూ పోయి సాయపడేవాడివి. అందరితో కలిసి ఆడిపాడేవాడివి. ఇప్పుడా ఆటపాటలే కనుమరుగైపోయాయి. వ్యవసాయం పండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం దండగ అనే దుస్థితి దాపురించింది. అందువల్ల గ్రామీణ పునర్వికాసం ఇప్పటి తక్షణావశ్యకత. ప్రభుత్వం చేయగలిగే పనికాదు ఇది. ప్రభుత్వం విధానాలు మార్చగలదు. ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవకాశం ఇవ్వగలదు. కానీ ప్రతీ వ్యక్తి జీవితాన్నీ ఏ ప్రభుత్వమూ మార్చలేదు. ఈ దిశగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని జాగరూకం చేసే పనిని స్వచ్ఛంద సంస్థలు, బాధ్యతగల పౌరులు, కంపెనీలు కూడా చేపట్టాలి. అక్కడి జీవనంలోని వెనకటి ధైర్యోత్సాహాలను తీసుకురావడానికీ, వారి సరళమైన సామాజిక జీవనాన్ని పరిపుష్టం చేయడానికి నడుం బిగించాలి. దిక్కులేక నువ్వొక్కడివే ఈ ఊర్లో మిగిలావు అని కాకుండా బతకడానికి పల్లెపట్టును మించిందిలేదు అనే విధంగా మార్పు తేవడానికి ప్రయత్నించాలి. ఇందుకు ఈ సంక్రాంతి పండుగ ఓ సువర్ణావకాశం. దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. గ్రామీణులకు కొత్త ఊపిరిని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించాలి. -
నివృత్తం: ముగ్గును ఎడమ చేతితో ఎందుకు వేయకూడదు?
ముగ్గును లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతున్నాయి శాస్త్రాలు. కాబట్టి ముగ్గును పవిత్రంగా చూడాలి. కాళ్లతో తొక్కకూడదు. అది మాత్రమే కాదు... ముగ్గును కుడిచేతితోనే వేయాలి. ఎడమ చేతితో పొరపాటున కూడా వేయకూడదని పండితులు చెబుతున్నారు. దీనికో కారణం ఉంది. క్షుద్ర పూజలకు కూడా ముగ్గును వేస్తుంటారు. అలాంటప్పుడు తాంత్రికులు ఎడమచేతిని ఉపయోగిస్తారు. అందువల్ల వాకిట్లో ముగ్గు వేసేటప్పుడు ఎడమ చేతితో అస్సలు వేయకూడదు. దానికి తోడు కుడిని మనం ఎప్పుడూ శుభ సూచకంగా భావిస్తాం. కాబట్టి కుడి చేతితో ముగ్గు వేస్తే, లక్ష్మీదేవి వచ్చి మన వాకిట్లో కొలువవుతుంది. కాబట్టి ఎడమచేతితో ముగ్గు వేసే అలవాటు ఉంటే మానుకోవాల్సిందే! ఇల్లు ఇరకాటం... ఆలి మర్కటం... పూర్వం ఒక ఊరిలో ఓ యువకుడు ఉండేవాడు. అతడు బాగా సంపాదించేవాడు. కానీ ఎప్పుడూ ఏమీ లేనట్టుగా కనిపించేవాడు. ఓ చిన్న ఇంటిలో నివాసముండేవాడు. కాస్త సదుపాయంగా ఉండే ఇంటిలో ఉండొచ్చు కదా అంటే... ఇల్లు పెద్దగా ఉంటే బంధువులొచ్చి తిష్ట వేస్తారు, ఇరుగ్గా ఉంటే ఎవరూ రారు అనేవాడు. ఓ రోజు అతడు పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ పీనాసివాడు ఎలాంటి పిల్లను చేసుకున్నాడో చూద్దామని అందరూ ఎగబడ్డారు. చూస్తే... ఆ పిల్ల అంద వికారంగా ఉంది. కాస్త అందమైన పిల్లను చేసుకోవచ్చు కదయ్యా అంటే... అందంగా ఉంటే అందరూ చూస్తారు, ఇలా ఉంటే ఏ టెన్షనూ ఉండదంటూ పళ్లికిలించాడు. ఊరి జనాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. -
సహనటి ఇంటిలో చోరీ చేసిన బుల్లితెర నటి
బెంగళూరు : సహనటి ఇంటిలో చోరీ చేసిన బుల్లితెర నటిని రాజరాజేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. మాంగల్య, రంగోలి తదితర కన్నడ సీరియల్స్లో నటించిన సుజాత బసవరాజ్ అనే బుల్లితెర నటిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే సుజాత, కవన ...కన్నడ బుల్లితెర నటులే కాకుండా ఇద్దరూ మంచి స్నేహితులు. గత ఏడాది ఏప్రిల్లో కవనకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ సమయంలో కవన ఇంటిలో రూ.1.75 లక్షల విలువైన బంగారు నగలు చోరీ అయ్యాయి. దీంతో కవనకు సుజాతపై అనుమానం వచ్చింది. రాజరాజేశ్వరీ నగర పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో సుజాతను పోలీసులు విచారించినా ఫలితం లేకపోయింది. దాంతో ఆమెపై నిఘా వేశారు. తమకు లభించిన ఆధారాల మేరకు చివరకు సుజాతను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయటంతో బంగారు నగలు చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. కాగా గతంలో కూడా సుజాతపై రెండు కేసులు నమోదు అయ్యాయని నిందితురాలిని బుధవారం కోర్టు ఎదుట హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. -
వదంతులతో మధ్యాహ్నం ముగ్గులు
-
రంగు రంగుల ముగ్గులు
-
సంక్రాంతికి సాక్షి పాఠకుల ముగ్గులు